breaking news
Narayanpet
-
కాంక్రీట్ లైనింగ్ నిర్మించాలి..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన కాల్వలకు ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్ చేయలేదు. దీంతో నీటి ప్రవాహం ధాటికి మట్టి కొట్టుకుపోయి కాల్వలు తెగుతున్నాయి. డీ–29 పరిధిలో తరచుగా కాల్వలు తెగి రైతుల పొలాలు మునుగుతున్నాయి. తిమ్మరాసిపల్లి, కురిమిద్ద, వెంకటాపూర్ గ్రామాల వద్ద కాల్వ తెగి తీవ్రంగా నష్టపోతున్నాం. – పసుల గోవర్ధన్రెడ్డి, రైతు, కల్వకుర్తి కాల్వల పటిష్టానికి చర్యలు.. కేఎల్ఐ కింద కాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. కాల్వలకు గండి పడితే వెంటనే స్పందించి కట్టడి చేస్తున్నాం. అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తున్నాం. విడతల వారీగా కాల్వల పటిష్టానికి చర్యలు చేపడతాం. – విజయ్భాస్కర్రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ ● -
ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం అండర్–14 విభాగం బాల, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. విద్యార్థులకు 100 మీ., 200 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్త్రోలో ఎంపికలు జరిగా యి. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ పంపడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అండర్–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు జరగనున్నాయి. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, జగన్మోహన్గౌడ్, ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు పోటెత్తిన ధాన్యం
దేవరకద్ర: వానాకాలం పంటల దిగుబడి ప్రారంభం కావడంతో గురువారం దేవరకద్ర మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు కోతలు కోసిన వరి ధాన్యాన్ని అమ్మకానికి తేవడంతో మార్కెట్ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది. కోయిల్సాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది పూర్తిస్థాయిలో వరి పంట సాగు చేశారు. అలాగే బోరు బావులు, చెరువుల కింద వేసిన పంటలు కూడా ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, మరికల్, అడ్డాకుల, మూసాపేట మండలాల నుంచి దేవరకద్ర మార్కెట్కు రైతులు ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. మార్కెట్కు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. మధ్యాహ్నం జరిగిన టెండర్లలో సోనామసూరి క్వింటాల్కు గరిష్టంగా రూ.2,109, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. అలాగే ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,169, కనిష్టంగా రూ.1,900, హంస గరిష్టంగా రూ.1,759, కనిష్టంగా రూ.1,720 చొప్పున వచ్చాయి. -
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
నారాయణపేట: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్, ఫంక్షన్హల్స్, సౌండ్ సిస్టం యజమానులు, వంట మాస్టర్లతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఐసీడీఎస్ అధికారులు శ్రీలత, నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ అధికారి కరిష్మ, అనిత, తిరుపతయ్య పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల్లో వేగం పెంచాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి.. వాటిలో ఎన్ని బేస్మెంట్, రూఫ్, స్లాబ్ దశల్లో ఉన్నాయి.. ఇంతవరకు ఎన్ని పూర్తయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనకబడిన నర్వ, మరికల్, మక్తల్ మండలాల ఎంపీడీఓలను కలెక్టర్ వివరణ కోరారు. అయితే ఇసుక, మొర్రం కొరత, వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం కలిగిందని వారు తెలియజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. అత్యధికంగా వర్షాలు కురిసిన ఇతర జిల్లాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, మన జిల్లాలో ఇలాంటి కారణాలతో నిర్మాణాలు నిలిచిపోయాయని చెప్పడం సరికాదన్నారు. వారం రోజుల్లో నిర్మాణాలను వేగిరం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు అసలు నిర్మాణాలను మొదలుపెట్టని వారి ఇళ్లను 45 రోజుల కాలపరిమితి నిబంధన ప్రకారం రద్దు చేయాలని కలెక్టర్ చెప్పారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. కాగా, ఇందిరా డెయిరీ షిప్ ఫామింగ్ పథకానికి మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాలతో పాటు మద్దూరు, కోస్గి మున్సిపాలిటీల నుంచి 631 దరఖాస్తులు అందాయని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్ వివరించారు. వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీఓలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అదే విధంగా బాల్యవివాహాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప ఉన్నారు. చదువుల పండుగతోవిద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం చదువుల పండుగతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి పెంపొందుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చదువుల పండుగలో భాగంగా రూపొందించిన ‘కలలు కనేద్దాం.. నేర్చుకుందాం.. సాధిద్దాం’ అనే ప్రత్యేక విద్యా కార్యక్రమాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంభాషణ నైపుణ్యాలు పెంపొందించడానికి చదువుల పండుగ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు. -
ఆశలకు ‘గండి’..
తరచుగా కోతకు గురవుతున్న కేఎల్ఐ కాల్వలు సాక్షి, నాగర్కర్నూల్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన సాగునీటి కాల్వల నిర్వహణ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం కాల్వల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్కు నోచుకోలేదు. ఫలితంగా నీటి ప్రవాహానికి తరచుగా కాల్వలు తెగుతున్నాయి. దీంతో సమీపంలోని రైతుల పంటపొలాలను వరద ముంచెత్తి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాల్వలు చెంతనే ఉన్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. పంటలు చేతికొచ్చే సమయంలో కాల్వలకు గండ్లు పడి పంటంతా నీటిపాలవుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, కల్వకుర్తి, వెల్దండ, పాన్గల్ మండలాల్లో తరచుగా కాల్వలు తెగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడుగడుగునా గండ్లతో నష్టం.. కేఎల్ఐ కాల్వకు ఒకే చోట ఆరుసార్లు గండి పడినా అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయితే నానాటికీ బలహీనమైన కాల్వ కట్టలకు తరచుగా గండ్లు పడి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం తోటపల్లి, వెంకటాపూర్, తిమ్మరాసిపల్లి, నెల్లికట్ట, వెల్దండ సమీపంలోని కేఎల్ఐ కాల్వ అధ్వానంగా తయారైంది. వనపర్తి జిల్లాలోని పాన్గల్, రేవల్లి మండలాల్లోని కేఎల్ఐ కాల్వలతో పాటు బీమా కాల్వకు పలు చోట్ల గండి పడటంతో రైతులు పెద్దసంఖ్యలో నష్టపోతున్నారు. పాన్గల్ మండలంలోని దావాజీపల్లి, బండపల్లి, శాగాపూర్, జమ్మాపూర్, మందాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల సమీపంలో కాల్వ తెగి రైతుల పొలాలు తరచుగా నీటమునుగుతున్నాయి. నిధులు లేక నిర్వహణ గాలికి.. కేఎల్ఐ కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం మరమ్మతులు, నిర్వహణకు నోచుకోవడం లేదు. సుమారు పదేళ్లుగా కాల్వలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రతిసారి వేసవిలో కాల్వలకు మరమ్మతు చేపట్టి.. కాల్వ కట్టలను పటిష్టం చేయాల్సి ఉండగా, గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా మరమ్మతులు చేపట్టలేదు. కేఎల్ఐ కింద కేవలం చెరువులు, కుంటలు నింపడం.. ఉన్న కొద్దిపాటి కాల్వలకు సాగునీరందించేందుకే అధికారులు పరిమితమవుతున్నారు. పంపుహౌస్ల్లో మోటార్లకు సైతం మరమ్మతు చేయకపోవడంతో.. సరైన స్థాయిలో పంపింగ్ చేపట్టక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. లైనింగ్ లేకపోవడమే కారణం.. కేఎల్ఐ కాల్వలకు తరచుగా గండ్లు పడటానికి, కాల్వ కట్టలు కోతకు గురవడానికి ప్రధాన కారణం లైనింగ్ నిర్మాణం చేపట్టకపోవడమేనని కారణమని రైతులు వాపోతున్నారు. కాల్వలకు ఇరువైపులా సిమెంట్ లైనింగ్ చేపట్టకపోవడంతో తరచుగా కోతలకు గురవుతున్నాయి. కేఎల్ఐ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కాల్వలకు లైనింగ్ చేయలేదు. కేవలం ఎల్లూరు నుంచి సింగోటం వరకు మాత్రమే కేఎల్ఐ ప్రధాన కాల్వకు లైనింగ్ పనులు చేసి.. ఆ తర్వాత కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారు. ప్రభుత్వం దృష్టిసారించి కేఎల్ఐ కాల్వలకు మరమ్మతు చేపట్టడంతో పాటు లైనింగ్ ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలకు ఉధృతంగా నీటి ప్రవాహం ఏటా ఏదో ఒక చోట తెగుతున్న కాల్వలు సమీపంలోని పంటలు దెబ్బతిని రైతులకు భారీ నష్టం పదేళ్లుగా ఇదే తీరు.. నిర్వహణ పట్టనిఅధికారులు -
పేదోడి ఇంటికి ని‘బంధనాలు’
మద్దూరు: ఇందిరమ్మ ఇళ్లకు నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో అప్పులు చేసి మరీ నిర్మాణాలు ప్రారంభించారు. కానీ బిల్లుల చెల్లింపులో అధికారులు సవాలక్ష సాకులు చూపుతున్నారు. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయి. అటు ఇంటి నిర్మాణం పూర్తిగాక.. ఇటు పెట్టుబడి పెట్టిన డబ్బులు రాక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా పూర్తయ్యేలా కనిపించడం లేదు. జిల్లాకు 6,182 ఇళ్లు మంజూరు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు.. సర్వే నిర్వహించి మరీ అర్హులను ఎంపిక చేశారు. మొదట ఇంటి స్థలం ఉన్న వారికే అవకాశం కల్పించారు. జిల్లాలోని 13 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో మొత్తం 6,182 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటి వరకు 4,594 ఇళ్లకు మార్కింగ్ వేసి పనులను ప్రారంభించారు. అయితే కేవలం 5 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అధికారులు బిల్లులను నిలిపివేశారు. దీంతో ఆయా ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. నిబంధల ప్రకారంనిర్మించుకోవాలి.. జిల్లాలో నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు వెంటనే వస్తున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి ప్రస్తుతం బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 600 అడుగుల చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించడం కుదరడం లేదు. ఇవి కొడంగల్ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. – శంకర్నాయక్, హౌసింగ్ పీడీ బిల్లులు రాక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల అవస్థలు గతంలోనే ఇల్లు మంజూరైందని.. సరైన పత్రాలు లేవంటూ సాకులు ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారుల బేజారు అసంపూర్తిగా నిలిచిపోతున్న పనులు జిల్లాలో కేవలం ఐదు నిర్మాణాలు మాత్రమే పూర్తి -
ప్రేమ పేరుతో విద్యార్థినిపై అధ్యాపకుడి వేధింపులు
నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థినిపై గెస్ట్ లెక్చరర్ వేధింపుల ఉదంతం వెలుగుచూసింది. ఈ కళాశాలలో రెండేళ్లుగా మండల కేంద్రమైన గొలుగొండకు చెందిన కోనా నారాయణరావు గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తూ జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. పార్టీ పదవి కోసం ఈయన పేరును ఇటీవల స్థానిక నాయకత్వం సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది. అయితే, ఇటీవలే డిగ్రీ ఫస్టియర్లో చేరిన ఓ విద్యార్థినిని నారాయణరావు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. నిజానికి.. వివాహితుడైన నారాయణరావుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తాను గతంలో ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని, ఆమె అచ్చు నీలాగే ఉంటుందని అతను ఆ విద్యార్థినికి చెప్పుకొచ్చాడు. నువ్వు అంగీకరిస్తే నిన్ను చదివించి అన్ని విధాలా చూసుకుంటానంటూ లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ విషయాన్ని సహచర విద్యార్థులకు చెప్పింది. ఈ విషయం విద్యార్థి సంఘాల నాయకుల వరకు వెళ్లడంతో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగి కళాశాల ముందు బైఠాయించారు. ఆ అధ్యాపకుడిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అంతవరకు తరగతులకు హాజరుకాబోమని భీష్మించారు.భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు, ఇతర అధ్యాపకులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పును సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వాలని విద్యార్థినులను కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. దీంతో చేసేదిలేక ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నారాయణరావుతో రాజీనామా చేయించారు. నారాయణరావు గతంలో యలమంచిలి, అరకులలో కూడా పనిచేశాడు. అక్కడ కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు తెలిసింది. -
వేతన కష్టాలు
కోస్గి: గ్రామాలను ప్రతిరోజు శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్నారు. నెలనెలా అందాల్సిన వేతనాలు మూడు నాలుగు నెలలకోసారి అందుతుండటం, అవి కూడా సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలు పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చెల్లించాల్సిన వేతన బకాయిలను పరిశీలిస్తే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబందించిన వేతనాలు జులైలో చెల్లించారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలను సెప్టెంబర్లో రెండు నెలల వేతనాలు మాత్రమే చెల్లించారు. అప్పటి నుంచి మళ్లీ వేతనాలు అందకపోవడంతో కార్మికులకు వేతన కష్టాలు తప్పడం లేదు. వేతనాలు అందకున్నా.. నిత్యం పనుల్లోనే ప్రభుత్వం వేతనాలు సక్రమంగా ఇవ్వకపోయిన పారిశ్ధ్యు కార్మికులు మాత్రం పంచాయతీల్లో అందుబాటులో ఉంటూ నిత్యం తమకు కేటాయించిన పనులు చేస్తున్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం గతంలో ప్రతి గ్రామానికి పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. జనాభాను బట్టి చిన్న పంచాయతీల్లో 8 నుంచి 10 మందిని, పెద్ద పంచాయతీల్లో 10 నుంచి 20 మంది వరకు కార్మికులను నియమించింది. కార్మికులు రోజు మురికి కాలువలను శుభ్రం చేయడంతోపాటు గ్రామాల్లో శుభ్రతకు సంబందించిన పనులు చేస్తున్నారు. గతంలో పంచాయతీలకు వచ్చే పన్నులు, ఇతర నిధుల నుంచి కార్మికుల వేతనాలు అందించే వారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, మిషన్ భగీరథతో నీటి పన్ను నిలిపి వేయడంతో పంచాయతీలు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పంచాయతీలకు నిధులు రాకపోవడంతో కార్మికులకు నెలనెల వేతనాలు ఇవ్వలేక, కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం అందించే నిధులపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్రీకృత విధానంతో.. పారిశుద్ధ్య కార్మికులకు సంబందించి ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ప్రతిసారి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీలకు బిల్లులు పంపి కార్మికులకు వేతన చెల్లింపులు జరిపేవారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం కేంద్రీకృత విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు, వేతనేతర ఖర్చుల పేరుతో నిధులను డ్రా చేయడం నిరోధించి ప్రతినెల నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు అందిచాలనేది కేంద్రీకృత విధానం ప్రధాన లక్ష్యం. టీజీబీపాస్లో నమోదైన కార్మికుల ఖాతాల్లోకి ప్రతినెల వేతనాలు జమ చేయాల్సి ఉండగా నిధులు లేని కారణంగా నూతన విధానం సైతం కార్మికులను ఆదుకోలేకపోతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సక్రమంగా అందని జీతాలు ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు కేంద్రీకృత విధానంతో తప్పని తిప్పలు జిల్లాలో 276 పంచాయతీల్లో 840 మంది కార్మికులు -
కార్తీక శోభ
● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు ● కనులపండువగా శివపార్వతులకల్యాణోత్సవం నారాయణపేట: శివనామస్మరణ ఓ వైపు.. దీపోత్సవ కార్యక్రమాలు మరోవైపు.. కార్తీక పౌర్ణమి నాడు ఆధ్యాత్మిక వెలుగులతో ఆలయాలు కిటకిటలాడాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని లింగయ్య గుడి, బారంబావి శివాలయం, అనంతసేన ఆలయం, శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయం, శక్తిపీఠం, మద్దూరులోని కాచువాగు శివాలయం, కల్లపు శివాలయం, కన్యకాపరమేశ్వరీ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. నదుల వద్ద స్నానాలు ఆచరించిన అనంతరం అక్కడే వివిధ ఆకృతులలో దీపాలను వెలిగించారు. ఉసిరికాయలపై ఆవునెయ్యితో తడిపి వత్తులు వెలిగించారు. అరటిపండు, వడపప్పు, పిండిప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. శివపార్వతుల కల్యాణం శక్తిపీఠం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రముఖ కృష్ణయాజుర్వేద స్మార్త పండితులైన బ్రహ్మశ్రీ ఊట్కూర్ విభావాసు అగ్నిహోత్రి పురోహిత్ చేతులమీదుగా వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్ భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సామూహిక కార్తీకదీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ శివపార్వతుల దివ్య కృపతో ప్రతి భక్తుడు శాంతి సౌభాగ్యం సంతోషం పొందాలన్నారు. -
ఎదురు చూడాల్సిందే..
గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్మికులు ప్రతిరోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే. జీతాలు మాత్రం ఎప్పుడు వస్తాయేనని నెలలపాటు ఎదురు చూడాలి. కుటుంబం నడవడానికి ప్రతినెల అప్పులు చేసి మూడునాలుగు నెలలకు ఒకసారి వచ్చే జీతాలతో చేసిన అప్పులకు మిత్తి కడుతున్నాం. దయచేసి పంచాయతీ కార్మికుల వేతన బాధలను అర్థం చేసుకొని ఇకనైన ప్రతినెల జీతాలు అందించి పంచాయతీ కార్మికులను ఆదుకోవాలి. – నర్సమ్మ, కార్మికురాలు, కోటకొండ ప్రతి నెలా ఖాతాల్లో జమ చేయాలి ప్రభుత్వాలు మారుతున్నా పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మారడం లేదు. ఎన్ని పోరాటాలు చేస్తున్న కనీసం ప్రతి నెల వేతనాలు అందుకోలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై న కార్మికుల శ్రమను గుర్తించి పంచాయతీల ద్వారా కాకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల వేతనాలు జమ చేయాలి. గ్రామాల పరిశుభ్రతలో కీలకంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు మూడు నెలలకొకసారి వేతనాలు అందుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నర్సిములు, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ జట్ల ఎంపిక
కోస్గి రూరల్: ఉమ్మడి జిల్లా అండర్ – 17 హ్యాండ్బాల్ బాల,బాలికల జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ జీయావుధ్దిన్, ఎజ్జీఎప్ సెక్రెటరీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈమేరకు ఎంపికలు చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిది నుంచి 180 మంది బాల బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ కనబరచిన 16 మంది బాలురు, 16 బాలికలను ఉమ్మడి జిల్లా జట్టుగా ఎంపిక చేశామని తెలిపారు. అంతకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు సాయినాథ్ , రామకృష్ణారెడ్డి , రవికుమార్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుకు చేరినా.. చేప ఎదిగేనా..?!
లక్ష్యం.. ‘నీళ్ల’పాలు గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8.81 కోట్ల చేప పిల్లలను చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకోగా.. మిగతా నాలుగు జిల్లాల్లో సగం కూడా చేరుకోలేకపోయారు. మొత్తంగా 4,56,68,000 చేపపిల్లలను మాత్రమే నీటిలో వదలగా.. అది కూడా అదును దాటిన తర్వాత అక్టోబర్ చివరలో మొదలుపెట్టి నవంబర్ చివరలో పూర్తి చేశారు. పలు జిల్లాల్లో అదును దాటిన నేపథ్యంలో 35–40 ఎంఎం సైజు చేపలు వేయలేదు. 80–100 ఎంఎం సైజు గల చేప పిల్లలనే వదిలినా సరిగా ఎదగలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఇందుకు అదును దాటిన తర్వాత చేప పిల్లలు వదలడమే కారణమని చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మత్స్యకారుల ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో చేపపిల్లలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి సుమారు మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ రకాల కారణాలతో జాప్యం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గత నెల 17న పంపిణీకి శ్రీకారం చుట్టినప్పటికీ.. నిర్దేశిత లక్ష్యం చేరుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు అదునుదాటిన తర్వాత చేప విత్తనాలు సరఫరా చేయడం.. నిర్దేశిత లక్ష్యంలో కోత పెట్టి తూతూమంత్రంగా ముగించడం ప్రతిఏటా ఆనవాయితీగా వస్తోంది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్లు మేలు రకాలకు తిలోదకాలు ఇస్తుండడంతో సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. ● అదును దాటిన తర్వాతే చేప పిల్లల పంపిణీ చివరికి నిర్దేశిత టార్గెట్లోనూ సగం మేర కుదింపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిఏటా ఇదే తంతు కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్ ‘అధికార’ యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారిస్తేనే ఫలితం -
వైభవంగా పడమటి అంజన్న తులాభారం
మక్తల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారికి తులాభారాన్ని వైభవంగా నిర్వహించారు.ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచారి ఆధ్వర్యంలో ఉడిపి పెజావర మఠం ధర్మప్రచారక్ విద్వాన్ రాఘవేంద్ర చార్య పర్యవేక్షణలో స్వామివారికి ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి విగ్రహాలను ఒక వైపు ఉంచి మరోవైపు కండ చక్కెర, పండ్లు, ఫలాలు, నాణెములను వేసి స్వామివారికి తులాభారం నిర్వహించారు. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఓ వైపు భక్తుల గోవింద నామస్మరణల మధ్య తులాబారం నిర్వహించగా పలువురు పండ్లు ఫలాలు, కండ చక్కెర ధనమును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
క్రాసింగ్ రైల్వేస్టేషన్గా ఊట్కూర్
నారాయణపేట: మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ను క్రాసింగ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయడం ద్వారా స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయి ఊట్కూర్ వద్ద రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేయడంపై చర్చించారు. మక్తల్–నారాయణపేట–వికారాబాద్ జిల్లాలతో పాటు అనేక గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వికారాబాద్–కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే రూ.438 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 122 కి.మీ రైల్వేలైన్ కృష్ణా–మక్తల్–నారాయణపేట–దామరగిద్ద–బలంపేట–దౌల్తాబాద్–కొడంగల్–పరిగి–వికారాబాద్ అలైన్మెంట్లో భాగంగా ఊట్కూర్ స్టేషన్గా గుర్తించబడిందని, దీనిని క్రాసింగ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయడం వల్ల స్థానికంగా 30 గ్రామాల ప్రజలు దాదాపుగా 60 వేలకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. మంత్రితో పాటు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జీఎం కోట్ల ఉదయ్నాథ్, రైల్వే సెక్రటరీ శ్రీనివాస్, ఉట్కూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యజ్ఞేశ్వర్రెడ్డి, శివ తదితరులు ఉన్నారు. -
ప్రతి జిన్నింగ్ మిల్లులో సీసీఐ కేంద్రాల ఏర్పాటు
నారాయణపేట: జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈ నెల 6న మార్కెట్ యార్డులో మిల్లులు, ప్రైవేట్ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 5 మిల్లుల్లోనే సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని, పత్తి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిగతా రెండింటిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలని సీసీఐ సంస్థ ప్రతినిధులను కోరారు. దీనిపై స్పందించిన సీసీఐ జిల్లా ప్రతినిధులు తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని, తప్పనిసరిగా మిగతా రెండు మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎకరాకు 12 క్వింటాళ్లు.. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి వస్తుందని, కపాస్ కిసాన్ యాప్లో మొన్నటి వరకు 12 క్వింటాళ్ల లెక్కనే చూపించిందని, కానీ తాజాగా కేవలం 7 క్వింటాళ్లే చూపిస్తుండడంతో రైతులకు సమస్యగా మారిందని మిల్లర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్ పద్ధతిని ఎత్తివేయాలని మిల్లర్లు కోరారు. స్పందించిన రెవెన్యూ కలెక్టర్ అది కేంద్రం పరిధిలోని వ్యవహారమని ఏమీ చేయలేమని, కానీ ఈ సీజన్లో కపాస్ కిసాన్ మొబైల్ యాప్, స్లాట్పై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తే, వచ్చే సీజన్లో రైతులకు స్లాట్ బుకింగ్ ఇంకా సులువు అవుతుందన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీఏఓ సుధాకర్, సీపీఓ యోగానంద్, డీఎంఓ బాలమణి, అగ్నిమాపక శాఖ అధికారి సురేష్రెడ్డి, ఎస్ఐ గాయత్రి, సీసీఐ ప్రతినిధులు అనూప్మిశ్రా, శ్రీనివాస్రావు, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్వైజర్ లక్ష్మణ్, మిల్లర్లు శ్రీనివాస్, పవన్ లాహోటీ, తమన్నా, రాహుల్ జై, ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములుపర్యవేక్షించాలి
కోస్గి రూరల్: ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని తోగాపూర్లో సర్వే నంబరు 150లో గుట్ట, రాయి ప్రాంతం కలిపి 385 ఎకరాల భూమి ఉండేదన్నారు. దానిని చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వం పలువురు రైతులకు అసైన్మెంట్ కింద ఇచ్చిందని తెలిపారు. ఈ సర్వే నంబర్లో ప్రస్తుతం 35 ఎకరాల్లో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్లెస్ సెంటర్, రికార్డుల గదులు, పలు సెక్షన్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీటీ కరుణాకర్, ఆర్ఐ సుభాష్రెడ్డి, సర్వేయర్ అరుణ తదితరులు ఉన్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు: ఆర్డీఓ మాగనూర్: మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు వద్ద ఉన్న ఇసుక రీచ్ను నారాయణపేట ఆర్డీఓ రాంచందర్ మంగళవారం ఉదయం సందర్శించారు. మాగనూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు నూతనంగా టీజీఎండీసీ రీచ్ కోసం దరఖాస్తు పెట్టుకోగా.. వారి పట్టా భూములతో పాటు ఇసుకను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పట్టా భూములో ఇసుక ఉన్నట్లైతే టీజీఎండీసీ అనుమతుల ద్వారా ఇసుకను తరలించడానికి అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న గృహ, వ్యాపార నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ రీచ్ను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలించుకోవాలని ఆదేశించారు. మండలంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. అక్రమంగా ఇసుక తరలించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ సురేష్కుమార్, ఆర్ఐ శ్రీశైలం, రైతులు తదితరులు ఉన్నారు. నూతన బస్సు సర్వీసులు ప్రారంభం కోస్గి రూరల్: ప్రజల సౌకర్యార్థం నూతనంగా మూడు రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభించామని, ఈ బస్సులను సద్వినియోగం కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి బస్స్టేషన్లో డిపో మేనేజర్ లావణ్య పూజలు చేసి బస్సులను ప్రారంభించారు. కోస్గి నుంచి భూనీడ్ మీదుగా నారాయణపేట్, కోస్గి నుంచి వత్తుగుండ్ల మీదుగా నారాయణపేట్, కోస్గి నుంచి పోలెపల్లి మీదుగా మెహిదిపట్నం వరకు సర్వీసులను నడుపనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం నూతన మార్గాలలో బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, మండల పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ బీంరెడ్డి, కృష్ణమూర్తి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
కోస్గి రూరల్: సాంకేతిక ఆధారిత సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితాన్ ఈకో హ్యకతాన్పై జిల్లా స్థాయి పోటీలను ఘనంగా చేపట్టామని ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ–వేస్ట్ సేకరణ, పునర్వినియోగం, పర్యావరణ హితంగా నిర్వహణపై కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఇంజినీరింగ్, వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన 66 మంది విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. వీరు మొబైల్ యాప్ ఆధారిత వ్యర్థ నిర్వహణ, కృత్రిమ మేధస్సు, సర్క్యూలర్ ఆఫ్ ఎకానమీ పాత్ర, ఏఐ ఆధారంగా ఈ–వేస్ట్ వర్గీకరణ అంశాలపై ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో మొదటి బహుమతి క్రాంతి బృందం, ద్వితీయ స్థానంలో మేఘన బృందం, తృతీయ స్థానంలో భవానీ బృందం దక్కించుకోగా.. వారికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో హెచ్ఓడీలు వెంకట్రెడ్డి, ఆనంద్కుమార్, సంపత్, విట్టల్ప్రసాద్, వెంకటాద్రి, రజనికుమారి తదితరులు ఉన్నారు. -
జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి
మాగనూర్: జంక్ఫుడ్ అధికంగా తీసుకోవడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతారని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిప్స్, నామ్కీన్స్, కుకీలను తీసుకునే బదులు వాల్నట్స్ వంటివి తీసుకోవాలన్నారు. చాలా మంది సన్నగా.. ఫీట్గా ఉండటానికి డైట్ పాటిస్తారని, కానీ జంక్ఫుడ్ చూడగానే డైట్ విషయం పక్కనబెట్టి పుష్టిగా లాగించేస్తారన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్లాస్టిక్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతుందని, అది ఆరోగ్యానికి ముప్పనే విషయం గుర్తించుకోవాలని సూచించారు. ఆనంతరం ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. వారి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు. వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి అఫ్రోజ్, రాణితేజశ్విణి, వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు తదితరులు ఉన్నారు. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా స్థాయి క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్స్టేషన్ల పరిధిలో పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిషేధిత గంజాయి అక్రమరవాణా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు ఏర్పాటు, వాటిని మానిటర్ చేయాలన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రామ్లాల్, రాజేందర్రెడ్డి, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, నవీద్, భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్బాబు, రాజు, విజయ్కుమార్, బాలరాజు, రమేష్, రాము, రాజశేఖర్, రమే ష్, పురుషోత్తం, నరేష్, సునీత, సురేష్, విజయ్ భాస్కర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పోలీసులకు రివార్డ్ అందజేత జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అడ్డుకుంటూ.. గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపిన మక్తల్ సర్కిల్, టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించి రివార్డు అందజేశారు. రివార్డు అందుకున్న వారిలో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐలు పురుషోత్తం, నవీద్, హెడ్ కానిస్టేబుల్ గోప్యనాయక్, పీసీలు రాఘవేందర్, రామస్వామి, అశోక్కుమార్, శ్రీకాంత్, భాను ఉన్నారు. -
84 కేంద్రాలు ప్రారంభించాం
జిల్లా వ్యాప్తంగా 117 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 84 కేంద్రాలను ప్రారంభించాం. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేమద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ సైతం వస్తుంది. – సైదులు, సివిల్సప్లయ్ డీఎం, నారాయణపేట వరి నేలవాలింది నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వరి, నాలుగు ఎకరాలలో సన్నాలు సాగుచేశా. సోమవారం రాత్రి కురిసిన వానకు వరి పంట మొత్తం నేలవారింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – శ్రీనివాస్రెడ్డి, రైతు, నందిగామ, కొత్తపల్లి మండలం ● -
7 నుంచి యువజనోత్సవాలు
● యవతకు జిల్లా స్థాయి పోటీలు ● 15 నుంచి 29 ఏళ్ల వయసు వారు అర్హులు ● 7 అంశాల్లో పోటీల నిర్వహణ నర్వ: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు ప్రభుత్వం యువజన సంబరాలకు శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు కళలను వెలితీకేందుకు యువతకు చక్కని వేదికగా మారబోతుంది. ఈ నెల 7 నుంచి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్, ఓల్డ్ ఆస్పత్రి ఆవరణలో యువజనోత్సవాల్లో భాగంగా క్రీడా, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారు. నిర్వహించే అంశాలు.. జానపద నృత్యం (లైవ్ మ్యూజిక్), జానపద పాటలు, కవిత్వం (హిందీ, ఆంగ్లం, తెలుగు), వ్యాసరచన పోటీ (తెలుగు, హిందీ, ఆంగ్లం), పెయింటింగ్, ఉపన్యాసం (తెలుగు, ఆంగ్లం, హిందీ), ఇన్నోవేషన్ ట్రాక్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) అంశాల్లో పోటీలు ఉంటాయి. విజేతలను హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచిన వారు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అర్హతలు: ● జిల్లాకు చెందిన యువత 15 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు. మూడేళ్లుగా జాతీయస్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్న వారు అనర్హులు పరిగణించబడతారు. ● పోటీల్లో పాల్గొనే యువత ఎవరి సామగ్రి వారే తెచ్చుకోవాలి. జానపద గీతాలు ఆలపించే బృందంలో 10 మంది మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. ● కవిత్వం 9 నిమిషాల్లో వెయ్యి పదాలతో గంట సమయంలో పూర్తి చేయాలి. పెయింటింగ్స్ ఏ2 సైజు పేపరులో 90 నిమిషాల్లో, చిత్రలేఖనానికి సంబంధించి శీర్షిక 20 నుంచి 30 పదాలు మించకూడదు. పెయింటింగ్ సామగ్రి అభ్యర్థులే తెచ్చుకోవాలి. ● ఆసక్తి గల వారు జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండు కలర్ ఫొటోలు, ఆధార్కార్డు లేదా పుట్టిన తేదీ తెలిపే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు జిల్లాకేంద్రంలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలి. -
ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం తీసుకురావాలి
ధన్వాడ: ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్యసేవల గురించి వాకబు చేశారు. ఓపీ మందుల నిల్వ తదితర వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజన్కు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నిత్యం అందుబాటులో ఉండి వైద్య సేవలందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ అనూషా, ఎంపీహెచ్ఓ కథలప్ప తదితరులు ఉన్నారు. -
ఉపాధ్యాయ సమస్యల సాధనకు కార్యాచరణ
నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ సమస్యల సాధనకు మరోసారి ఉద్యమ బాట పట్టనున్నట్లు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హనుమంతరావు అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందించాల్సిన పీఆర్సీ కాలపరిమితి ముగిసి 27 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. 317 జీఓ బాధితులందరికీ న్యాయం చేయాలని.. 190 జీఓ ద్వారా ఖాళీ అయిన చోట్ల వలంటీర్లను నియమించాలని డిమాండ్ చేశారు. జీఓ 25 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు కోత విధించే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం పోస్టుల సర్దుబాటు చేయాలి తప్ప.. తొలగిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 2010కి ముందు విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు అత్యధికంగా ఉన్నాయని.. ఈ జిల్లాకు ప్రత్యేకంగా బోధనా సహాయకులను వెంటనే నియమించి బోధనకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో నాయకులు గుంపు బాలరాజ్, శ్రీనివాస్గౌడ్, నరసింహ, సురేశ్, కథలప్ప, కుర్మయ్య, భాస్కర్రెడ్డి, చందు జామన్, అంబరీష్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం
నారాయణపేటమంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట రూరల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అందరూ ఏకమవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిలో రాష్ట్ర వాటాను తేల్చకపోవడంతోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని, ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్చానల్ ద్వారా త్వరితగతిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్ లెట్ టన్నెల్ వద్ద హెలీబోర్న్ ఎలక్ట్రో మాగ్నటిక్సర్వేను ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్తో కలసి హెలీకాప్టర్లో సర్వే పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రకాశ్కుమార్, సత్యనారాయణ హెలీబోర్న్ ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే విధానంపై సీఎంకు వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగకుండా అత్యంత జాగ్రత్తలతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను చేపడతామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఇదే మంచి అవకాశం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని అన్నారు. ఈ జిల్లా నుంచి సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఇక్కడ పుట్టినవారు కాకుండా ఇంకెవరూ ఈ మట్టి గురించి ఆలోచించరని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునేందుకు ఇక్కడి ప్రజలంతా ఏకమై ఉండాలని కోరారు. కృష్ణానదిలో రాష్ట్ర వాటా కోసం సుప్రీంకోర్టు, ట్రిబ్యూనళ్లలో పోరాటం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తిచేసుకోకపోతే ప్రజలు తమకిచ్చిన అధికారానికి అర్థం లేదన్నారు. నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టుకు గతంలోనే ప్రతిపాదనలు పంపినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టామని చెప్పారు. నక్కలగండి పునరావాస బాధితులకు న్యాయం చేస్తాం.. నక్కలగండి రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రిజర్వాయర్ బ్యాక్వాటర్తో పంట నష్టానికి గురైన మార్లతండా, కేశతండా గ్రామస్తులకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మరోసారి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ సురభి, డీఐజీ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సీఈలు విజయ్కుమార్రెడ్డి, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పెల్బీకి విశేష స్పందన ఉమ్మడి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది. –10లో uఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది మరణించడం దురదృష్టకరమైన సంఘటన అని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందజేశామన్నారు. ముఖ్యమంత్రితో పాటు తాను ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 30 సార్లు సమీక్షించామని చెప్పారు. ఇలాంటి సీఎం ఉండటం మన అదృష్టం మంత్రి కోమటిరెడ్డి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు స్వయంగా పర్యవేక్షించి, సమీక్షిస్తున్న సీఎం ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ భూతం నుంచి 30 లక్షల మంది ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే ఈ ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. భూనిర్వాసితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే వంశీకృష్ణ నక్కలగండి ప్రాజెక్ట్లో ముంపునకు గురైన మర్లపాడుతండా, కేశ్యాతండా నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సీఎంను కోరారు. 2017 నుంచి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారం పెండింగ్లో ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తుఫాన్, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. అచ్చంపేట మండలంలోని శివారు గ్రామాల నుంచి దేవరకొండ వైపు వెళ్లేందుకు హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇక్కడ పుట్టిన వారు కాకపోతే ఇంకెవరూ చేయరు నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం కృష్ణానీటిలో వాటా కోసం గట్టిగా పోరాడతాం తక్కువ ఖర్చుతో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం గ్రీన్చానల్ ద్వారా ప్రాజెక్టులకు నిధులు డిసెంబర్ 31లోగా నక్కలగండి నిర్వాసితులకు పరిహారం ఎస్ఎల్బీసీ అవుట్ లెట్ వద్ద హెలీబోర్న్ ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వేను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి -
నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
నారాయణపేట: విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఆర్టిజన్ నుంచి సీఎండీ స్థాయి అధికారి వరకు కృషి చేస్తున్నట్లు ఎస్ఈ వెంకటరమణ అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఈ మాట్లాడుతూ.. ఐఎస్ఐ మార్కు కలిగిన సర్వీస్ వైర్లను మాత్రమే వ్యవసాయ మోటార్లకు వినియోగించాలని రైతులకు సూచించారు. తడి చేతులతో పంపుసెట్ల వద్ద విద్యుత్ తీగలను తాకరాదన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏదేని సమస్య ఏర్పడితే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ రైతు కూడా తొందరపడి మరమ్మతు చేసేందుకు పూనుకోవద్దన్నారు. కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏఈలు ప్రదీప్ కుమార్, మహేశ్గౌడ్, అనిల్కుమార్, టి.వెంకట్రాంరెడ్డి, సతీశ్, అకౌంట్ జేఏఓ గోపినాయక్, ఈఆర్ఓ జేఏఓ రమేశ్, హర్షద్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం
పీఎం కిసాన్ డబ్బుల కోసం ఆరేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. అన్నదమ్ముల భాగ పరిష్కారమైన తర్వాత భూ పట్టాదారు పాస్పుస్తకాలతో వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. కానీ కొత్తగా భూ పట్టా చేసుకున్న వారి పేర్ల నమోదుకు కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్త వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – సంజీవరెడ్డి, రైతు, మరికల్ దరఖాస్తులు తీసుకోవాలి.. కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యేలా కేంద్ర ప్రభ్తుత్వం అనుమతులు ఇవ్వాలి. ఆరేళ్ల నుంచి పీఎం కిసాన్ దరఖాస్తును చేతిలో పట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నా. కానీ ఫలితం లేకపోవడంతో వదిలేసుకున్నా. – యాదయ్య, రైతు, తీలేర్ అనుమతులు రావాల్సి ఉంది.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఎంపికకు 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్గా నిర్ణయించింది. ఆ తేదీలోపు భూములు ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోనే సమ్మాన్ నిధి జమ అవుతోంది.ఆ తర్వాత భూములు పొందిన వారికి అందడం లేదు. కటాఫ్ తేదీ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. – జాన్ సుధాకార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘డయల్ యువర్ ఎస్పీ’కి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 17మంది ఫోన్ ద్వారా ఎస్పీ డా.వినీత్ను సంప్రదించి వివిధ సమస్యలను తెలియజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందించారు. భూ తగాదాలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని.. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని.. పెట్రోలింగ్ పెంచాలని.. ఆరుబయట మద్యం తాగడం, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీని కోరారు. ఆయా సమస్యల పరిష్కారంపై ఆయన సానుకూలంగా స్పందించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువ కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. పారదర్శకంగా పనిచేయడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన పత్తి రైతులు
నారాయణపేట రూరల్/ఊట్కూరు: పత్తి కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ నిబంధనలను సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. నారాయణపేట మండలం లింగంపల్లి శివారులోని హైదరాబాద్–యాద్గీర్ రహదారిపై, ఊట్కూరు మండలం మల్లేపల్లి సమీపంలోని పత్తి మిల్లు వద్ద నారాయణపేట–మక్తల్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామనే నిబంధన మేరకు ఆన్లైన్లో స్లాట్ బుక్కింగ్ చేసుకొని పత్తిని మిల్లులకు తీసుకొచ్చామని తెలిపారు. తీరా సీసీఐ అధికారులు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీసీఐ నిబంధనలను సవరించి రైతులు పండించిన పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రధాన రహదారులపై రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్డీఓ రామచందర్ లింగంపల్లి సమీపంలో ఆందోళనకు దిగిన రైతుల వద్దకు చేరుకొని నచ్చజెప్పారు. తిరిగి పాత విధానం ప్రకారమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. ఇదిలా ఉంటే, మల్లేపల్లి సమీపంలో రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి గణేశ్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి భారతి ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. సీసీఐ నిబంధనలు సవరించాలని డిమాండ్ -
బాల్యవివాహాలు చేస్తే చర్యలు తప్పవు
కోస్గి రూరల్: 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సీపీడీఓ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం కోస్గి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, ఫంక్షన్హాల్స్ యజమానులు, పూజారులు, పాస్టర్స్, హజీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టప్రకారం బాలికలకు 18, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని.. ఆయా ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలు, బాలల హక్కులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్యవివాహలు జరిగేందుకు ఆస్కా రం ఉన్న కుటుంబాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలన్నారు. అదే విధంగా బాలల సంరక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే పోలీసులు లేదా భరోసా హెల్ప్లైన్కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బాలికలను రక్షిద్దాం.. బాలికలను చదివిద్దాం అనే బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీఓ వేణుగోపాల్రెడ్డి, ఏఎస్ఐ ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా ఎదురుచూపులే!
మరికల్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతులు అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్గా నిర్ణయించింది. ఈ పథకం ప్రారంభమై ఆరేళ్లు పూర్తవుతున్నా.. ఇంతవరకు కటాఫ్ తేదీని పెంచలేదు. ఫలితంగా ఆ తర్వాత భూములు పొందిన రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. విరాసత్ ద్వారా భూములు పొందిన వారు మాత్రమే సమ్మాన్ నిధి కింద దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఆరేళ్లుగా నిరీక్షణ.. కొత్తగా భూ పట్టా చేసుకున్న వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 4.59 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. 1.80 లక్షల మంది రైతులు ఉన్నారు. 2019 నాటికి 1.10 లక్షల మంది రైతులు మాత్రమే సాగులో ఉన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి 76,664 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఈ ఆరేళ్లలో దాదాపు 5వేల మందికి పైగా రైతులు మృతిచెందినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అర్హులైన 49,826 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ.9.96 కోట్లను జమ చేస్తోంది. జిల్లాలో 851 మంది రైతులకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్లో ఉండటం కారణంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య.. రైతులకు వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల కోసం సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకున్న రైతుల్లో అర్హులకు ఏడాదికి మూడు విడతల్లో రూ. 6వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. దంపతులకు వేర్వేరు గ్రామాల్లో భూములు ఉన్నప్పటికీ ఒకరికే లబ్ధి చేకూరుతోంది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, విదేశాల్లో నివాసం ఉండే వారికి ఈ పథకం వర్తించదు. ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించారు. కటాఫ్ నిబంధన కారణంగా జిల్లాలో అర్హులైన రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరడం లేదు. మరోవైపు పథకంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గుతోంది. గుర్తింపుకార్డులపై ఆశలు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహా ఇతర కేంద్ర పథకాలు వర్తింపజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తోంది. అందుకు 11 అంకెలతో విశిష్ట సంఖ్య కేటాయిస్తోంది. ఈ గుర్తింపు కార్డులతోనైనా తమకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి నోచుకోని కొత్త రైతులు 2019 ఫిబ్రవరి 1 నాటికే కటాఫ్ తేదీ అడ్డంకులు తొలగిస్తే అర్హుల సంఖ్యపెరిగే అవకాశం జిల్లాలో 49,826 మంది రైతుల ఖాతాల్లో డబ్బుల జమ -
ఊట్కూర్లో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు కృషి
ఊట్కూర్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్లో భాగంగా ఊట్కూర్లో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర మత్స్య, క్రీడల, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. సోమవారం ఊట్కూర్ రైల్వే సాధన సమితి సభ్యులు హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోనే ఊట్కూర్ మండలం పెద్దదని, గ్రామ శివారులోనే రైల్వే లైన్ వెళ్తుందన్నారు. మండలవాసులు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లి స్థిరపడ్డారని వివరించారు. రైల్వేస్టేషన్ ఏర్పాటుతో మండలంతో పాటు కర్ణాటకలోని 10 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. త్వరలోనే రైల్వే అఽధికారులను కలిసి డీపీఆర్ పరిశీలిస్తానని, ఊ ట్కూర్లో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషిచేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు అరవింద్ కుమార్, సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్, లక్ష్మారెడ్డి, యఘ్నేశ్వర్రెడ్డి, లింగం, టప్ప దత్తు, రవికుమార్, హన్మంతు పాల్గొన్నారు. -
కోస్గికి రూ.15 కోట్లు నిధులు
కోస్గి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.15.00 కోట్లకు పరిపాలనా అనుమతులనిస్తూ జీఓ ఆర్టీ నంబర్ నెం.557 ఉత్తర్వులు జారీ చేశారు. కోస్గి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.5 కోట్లు, బీసీ కాలనీ, సాంపల్లి, కొడంగల్ రోడ్, నారాయణపేట రోడ్లోని పార్కుల అభివృద్ధికి రూ.3.50 కోట్లు, కోస్గి మున్సిపాలిటీలో ఎబీసీ సెంటర్ నిర్మాణనికి రూ.60 లక్షలు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, 8 స్వచ్ఛ ఆటోలు, 4 ట్రాక్టర్లు, 2 ట్రాక్టర్ ట్రాలీలు, 25,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసేందుకు రూ.కోటి, కోస్గి మున్సిపాలిటీలో మొబైల్ టాయిలెట్ వాహన కొనుగోలుకు రూ.50 లక్షలు, బహుళార్ధసాధక గోడౌన్ షెడ్ నిర్మాణానికి రూ.30 లక్షలు, వీధి దీపాల నిర్వహణకు ఆధునిక హైడ్రాలిక్ స్కై లిఫ్ట్ నిచ్చెన సేకరణకు రూ.25 లక్షలు, టీషెప్ ఆకారపు ప్రకటన హోర్డింగ్లు 5 నిర్మించేందుకు రూ.25 లక్షలు, స్క్రీన్ ప్రకటన హోర్డింగ్ల నిర్మాణాలకు రూ.45 లక్షలు, అంతర్గత సీసీ రోడ్లు, లింక్ రోడ్లకు రూ. 2.65 కోట్లు, మహిళ స్వశక్తి భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. -
చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్లు ఇవ్వాలి
నారాయణపేట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధతతో అమలు చేయాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు బీసీలకు చట్టబద్ధతతో కూడుకున్న రిజర్వేషన్లను అందించాలన్నారు. అదే విధంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో కూడా ఈ రిజర్వేషన్ లు అమలు చేసేలా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన అన్ని కులాల జనాభా లెక్కలను, గ్రామ, మండల, జిల్లాల వారిగా ప్రకటించాలని కోరారు. చట్టబద్ధతతో కూడుకున్న 42శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని అంశాలను అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. బీసీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జాగృతి సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్, జిల్ల అధ్యక్షులు ఎడ్ల కుర్మయ్య, నియోజకవర్గ అధ్యక్షులు గణేష్, నర్సిములు, గోపాల్, రాంచందర్, రాజు, రమణ పాల్గొన్నారు. -
నేడు ఎస్ఎల్ బీసీకి సీఎం రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్ లెట్కు చేరుకొని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి హెలీకాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను పరిశీలిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాల్లో భాగంగా గత ఫిబ్రవరి 22న దోమలపెంట ఇన్లెట్ వద్ద సొరంగం కుంగి ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకాలకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే చేపట్టి టన్నెల్ మార్గంలో సుమారు వెయ్యి మీటర్ల వరకు లోతు వరకు ఉన్న షీర్జోన్, జియోఫిజికల్ పరిస్థితులను అంచనా వేయనున్నారు. ఆ తర్వాత టన్నెల్ తవ్వకాలపై నిర్ణ యం తీసుకుంటారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణుల ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. కళాశాలల బంద్కు సంపూర్ణ మద్దతు నారాయణపేట రూరల్: ప్రైవేట్ కళాశాలలు సోమవారం నిర్వహించ తలపెట్టిన విద్యాసంస్థల బంద్కు పీడీఎస్యూ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక భగత్ సింగ్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో రాష్ట్రంలో రూ.8150 కోట్ల దాకా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వెంకటేష్, మహేష్, సురేష్, మహిపాల్, మణికంఠ, గురు రాజ్ పాల్గొన్నారు. 5న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని 5వ తేదీన బుధవారం ఉదయం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ముందుగా రూ.1516 చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని, ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న భక్తులకు పూజా సామగ్రిని అందిచనున్నట్లు తెలిపారు. వ్రతానికి వచ్చే భక్తులు తమ వెంట దీపాలు, గంట, హారతి తీసుకురావాలని ఆయన సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడి లింగాల: రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుందని పాలమూరు యూనివర్సిటీ విద్యార్ధులు అన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటను ఆహారంగా తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని అవగాహన కల్పించారు. పాలమూరు యూనివర్సిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థులు మండలంలోని అప్పాయపల్లిలో ఆదివారం రూరల్ క్యాంప్ నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజల జీవన విధానంపై సర్వే చేశారు. మొక్కజొన్న, వరి, వేరుశనగ, మినుములు, ఆయిల్ఫాం, డ్రాగన్ ఫ్రూట్లలో ఉపయోగించే మందుల గురించి ఆరా తీశారు. గ్రామంలో పంటకు రసాయనిక మందుల వాడకం ఎక్కువగా ఉందని గమనించి, వర్మీ కంపోస్టు ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. పలు అంశాలపై కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు డాక్టర్ బి.పర్వతాలు, డాక్టర్ గాలెన్న, విద్యార్థులు మశ్చేందర్, రాజేష్, శంకర్, ప్రశాంత్, గోపాల్, రాజేష్, బుగ్గప్ప, స్వప్న, విజయ, ఆశమ్మ, స్వాతి, మహేశ్వరి, అనూష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషిచేద్దాం
ఊట్కూరు: ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కలిసికట్టుగా కృషిచేద్దామని రైల్వే స్టేషన్ సాధన సమితి అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ఆదివారం ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అఖిలపక్ష నాయకులు, స్వచ్ఛద సంస్థ సభ్యులచే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వికరాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ ఊట్కూరు మీదుగా వెళ్తుందన్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చెయ్యకుండా ప్రతిపాదనలు పంపారని తెలిపారు. ఊట్కూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటైతే మండలంలో 20 గ్రామాలు, కర్ణాటక ప్రాంతంలో 10 గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. రైల్వే శాఖ గతంలో విడుదల చేసిన డీపీఆర్లో ఊట్కూరు స్టేషన్ ఉందని, కొత్తగా చేసిన డీపీఆర్లో రైల్వే స్టేషన్కు హార్డ్ అని ఉందని ఆయన అన్నారు. రైల్వే స్టేషన్ ఏర్పాటైతే మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పటికై న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డికే అరుణమ్మ చొరవ తీసుకొని రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చెయ్యాలని కోరారు. అనంతరం రైల్వే స్టేషన్ సాధన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, యజ్ఞేశ్వర్రెడ్డి, కోశాధికారిగా లక్ష్మారెడ్డి తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వెంకటరామారెడ్డి, ఇబాదూర్ రహమాన్, కాలిక్, కృష్ణయ్యగౌడ్, పాషా, ఆనంద్, దత్తు, వడ్ల మోనప్ప, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్సాగర్లో ఒక గేటు ఎత్తివేత
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం ఒక గేటును తెరిచి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దవాగు నుంచి భారీగా వరద రావడంతో గత బుధవారం ఏకంగా అయిదు గేట్లను తెరిచి నీటిని విడుదల చేసిన తరువాత నాలుగు రోజులుగా ఒక గేటు తెరిచి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగుల వద్ద పూర్తిస్థాయి నీటి నిల్వ 2.27 టీఎంసీలు ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. -
కృత్రిమ పాదాల ఉచిత శిబిరం అభినందనీయం
స్టేషన్ మహబూబ్నగర్: దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ కోసం శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఇండోర్ హాల్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ విజయపాల్రెడ్డి, గుడిగోపురం మట్టారెడ్డి కుటుంబాల ఆర్థిక సహాయంతో ఆదివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ చేయడానికి నిర్వహించిన ఎంపిక శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవ భావన పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్నారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు పంపిణీ చేయడానికి నిర్వాహకులు కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, నాయకులు సుధాకర్రెడ్డి, ప్రశాంత్, సంపత్, ప్రమోద్కుమార్, సాంబశివరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
రహదారులపై దృష్టి..
ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు ఆటంకం ● ప్రధాన అడ్డంకిగా మారిన భూ సేకరణ ప్రక్రియ ● వేగవంతం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం ● హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు ప్రతిపాదనలు ● మహబూబ్నగర్– మరికల్ ఎన్హెచ్–167 పనులకు నిధులు మంజూరు సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పటి వరకు జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణ పనులకు ప్రధానంగా భూ సేకరణే అడ్డంకిగా మారడంతో.. ఈ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పెండింగ్లో ఉన్న భూ సేకరణను వేగవంతం చేయడం, నిర్వాసితులకు చట్టపరంగా పరిహారం చెల్లింపు పూర్తి చేయడంపై ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు అవుతుండటంతో భూ సేకరణ ప్రక్రియ కొలిక్కి రాగానే విస్తరణ పనుల్లో వేగం పెరగనుంది. శ్రీశైలం దారిలో.. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మండలం కొట్ర మీదుగా శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రెండు వరుసలుగా ఉన్న ఈ దారిని ప్రయాణానికి సౌలభ్యంగా విస్తరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ దారిలో అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఈగలపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.7,700 కోట్ల అంచనాతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. పూర్తికావొచ్చిన కల్వకుర్తి– నంద్యాల కల్వకుర్తి నుంచి నాగర్కర్నూల్, కొల్లాపూర్ మీదుగా ఏపీలోని నంద్యాల వరకు చేపట్టిన జాతీయ రహదారి–167కే పనులు చివరి దశకు చేరుకున్నాయి. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రహదారి పనులు చాలా వరకు పూర్తి కాగా.. బైపాస్, సర్కిళ్లు, బ్రిడ్జిల నిర్మాణాలు పెండింగ్లో ఉన్నాయి. కల్వకుర్తి నుంచి తాడూరు మండల కేంద్రం వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు పూర్తవగా.. తాడూరు నుంచి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. నాగర్కర్నూల్లోని కొల్లాపూర్ చౌరస్తా నుంచి పెద్దకొత్తపల్లి మీదుగా కొల్లాపూర్ వరకు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామాల వద్ద పేవ్మెంట్, సైడ్వేల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తా నుంచి కృష్ణా తీరంలోని సోమశిల వరకు కొనసాగుతున్న పనుల్లో వేగం పెరిగింది. సోమశిల వద్ద కృష్ణానదిపై చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో రాకపోకలకు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి– మల్లేపల్లి– హాలియా– అలీనగర్– మిర్యాలగూడ మీదుగా వెళ్లే ఎన్హెచ్–167 జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిలో ట్రాఫిక్ పెరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డును 219 కి.మీ., మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. అలాగే జాతీయ రహదారి–167ఎన్ పరిధిలో మహబూబ్నగర్ బైపాస్ నిర్మాణానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. మహబూబ్నగర్ శివారులోని అప్పన్నపల్లి గ్రామం వద్దనున్న రైల్వే ఓవర్బ్రిడ్జి(ఆర్వోబీ) నుంచి హన్వాడ మండలం చిన్నదర్పల్లి మీదుగా చించోలి రహదారి వరకు అనుసంధానం చేసేలా బైపాస్ నిర్మించనున్నారు. సుమారు 11 కి.మీ., మేర ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. కల్వకుర్తి– నంద్యాల జాతీయ రహదారి పనులు పూర్తికావొస్తున్నా.. కీలకమైన సోమశిల బ్రిడ్జి నిర్మాణం మాత్రం టెండర్ల దశలోనే ఉంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితేనే ఈ రహదారి ఏపీలోని నంద్యాల వరకు అనుసంధానం కానుంది. మరో రెండేళ్లలోపు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా.. టెండర్ల ప్రక్రియలోనే జాప్యం కొనసాగుతోంది. కాగా.. ఈ నెల 5న బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ జిల్లాకేంద్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారి–167కే విస్తరణకు కేంద్రం ఇటీవల నిధులు మంజూరుచేసింది. మహబూబ్నగర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని గుడేబల్లూరు వరకు రెండు వరుసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.2,278.38 కోట్లను వెచ్చించి 80.01 కి.మీ., మేర రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ మీదుగా ఏపీలోని మంత్రాలయం, రాయచూరు, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ మార్గం మరింత సౌలభ్యంగా మారనుంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్– దేవరకద్ర– మరికల్– జక్లేర్– మక్తల్ మీదుగా ప్రయాణించే వారికి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లావాసులకు ప్రయోజనం కలగనుంది. -
యూడైస్ నమోదు తప్పనిసరి
మద్దూరు: పాఠశాలల సమగ్ర సమాచారాన్ని కేంద్ర విద్య పోర్టల్ యూడైస్లో విధిగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన యూడైస్ శిక్షణను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూడైస్తో పాఠశాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు యూడైస్లో పూర్తి వివరాలు నమోదు చేసి మండల విద్యాధికారితో ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఉన్నత పాఠశాలలో ఎక్సెల్, ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ క్లబ్, రీడ్ కార్యక్రమాల నిర్వహణపై ఆరా తీశారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని సూచించారు. సీఎంఓ రాజేంద్ర, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, యాదయ్య శెట్టి, ఎంఈఓ బాలకిష్టప్ప, ఆర్పీ రాజునాయక్ ఉన్నారు. -
ఐక్యతకే రన్ ఫర్ యూనిటీ
నారాయణపేట: భారతదేశమంతా ఏకీకృతంగా ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమారు 560కి పైగా సంస్థానాలను విలీనం చేశారని కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. శనివారం జాతీయ ఐక్యత దినోత్సవం, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జాతీయ సమైఖ్యత ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ డా. వినీత్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్ మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు యువత, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, భద్రత, ఐక్యమత్యాన్ని చాటడంలో యువత ముందుండాలని, చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల ముగింపు, జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించామన్నారు. పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువత, పౌరులు సన్మార్గంలో నడవాలని, దృఢమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఆర్ఐ నర్సింహ, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, నరేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. -
బెల్ట్ తీస్తున్నారు!
● ఎస్పీ ఆదేశాలతో బెల్టు దుకాణాలపైవిస్తృత దాడులు ● నెల రోజుల్లో 272 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. 286 ఈ–పెట్టి కేసులు నారాయణపేట: ఊరూరా పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండడం.. ఎంతో మంది మద్యానికి బానిసవడం.. పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతుండగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బెల్టు షాపుల్లో రాత్రనక.. పగలనక మద్యం విక్రయిస్తుండడంతో అటు చుట్టుపక్కల జనం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు నూతన ఎస్పీ వినీత్కు ఫిర్యాదులు అందాయి. దీంతో అనధికారికంగా మద్యం విక్రయించే బెల్ట్ షాపుల నిర్వాహకులపై పోలీసులు దాడులు షురూ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే మద్యం తాగినట్లు కనిపిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నెలరోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు విస్తృతంగా చేపట్టి 272 కేసులు.. బహిరంగ ప్రదేశాల్లో, బెల్టు షాపుల్లో మద్యం విక్రయించే వారిపై, తాగే వారిపై 286 కేసులను నమోదుచేశారు. బెల్టు దుకాణాలపై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేస్తుండడంతో విక్రయదారుల్లో గుబులు పట్టుకుంది. ఏపీలో జరిగిన ఘటనతో... ఏపీలోని కర్నూలు జిల్లా టేకూరి వద్ద జరిగిన బస్సు ప్రమాదం విషయంలో సంచలన నిజాలు బయటికి రావడంతో యావత్ దేశం నివ్వెరపోయింది. హైవేపై ఉన్న ఓ బెల్టు దుకాణంలో ఇద్దరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం తాగి జాతీయ రహదారిపైకి రావడం, అదుపు తప్పి కిందపడడం, ఆ బైక్ను బస్సు ఢీకొనడంతో 19 మంది బస్సులోని ప్రయాణికులు సజీవ దాహన సంఘటనకు కారణమయ్యారంటూ పోలీసుల విచారణ తేలింది. దీంతో ఎస్పీ బెల్టు దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఎవరూ మద్యం తాగినా కేసులు నమోదు చేయాల్సిందేనంటూ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలీ డబ్బులతో మద్యం తాగుతూ ఎంతో మంది సంసారాలను పాడు చేసుకుంటున్నారు. మద్యం తాగాలి అనుకుంటే ఇంటికి తీసుకెళ్లి తాగాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే వారితో పాటు విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాగనూర్ మండలం నేరడుగాంలో ఉన్న ఓ దాబాలో పట్టుబడిన మద్యం (ఫైల్) మాగనూర్లో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న మందుబాబులు (ఫైల్) బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులే.. అనుమతుల్లేవు గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. తమకు సమాచారం అందిస్తే సదరు బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. – అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా గ్రా మాల్లో బెల్టు దుకాణాలు ఏర్పా టు చేసి మద్యం విక్రయించినట్లతే వారిపై కేసులు నమోదు చేస్తాం. తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తాం. బెల్టు దుకాణా లపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. – వినీత్, ఎస్పీ -
ముగిసిన జిల్లాస్థాయి పరుగు పందెం పోటీలు
నారాయణపేట టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్సై వెంకటేశ్వర్లు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించగా.. అండర్–14 విభాగాల్లో రవితేజ, తేజశ్విని, అండర్–16లో శివ, పల్లవి, అండర్–18లో నరేష్, అలేఖ్య, అండర్–20లో గణేష్, మహేష్ విజేతలకు రూ.వెయ్యి నగదుతో పాటు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యుడు తిప్పన్న, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ హారికాదేవి, క్రికెట్ కోచ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు ఫిర్యాదు చేశాం..
బీఏఎస్ స్కీంలో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలకు రానివ్వకపోతే కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి సమస్యను కలెక్టర్ వివరించాం. ఆమె ఆదేశాల మేరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదని కారణంతో తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, షూ, హాస్టల్ తదితర అవసరాల కోసం డబ్బులు వసూలు చేశారు. వాటిపై జిల్లా అధికారులు కమిటీ వేసి వాటిని పేద విద్యార్థులకు తిరిగి ఇప్పించాలి. – కమలాకర్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ పుస్తకాలు ఇవ్వలేదు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో బీఏఎస్ స్కీంలో మా పాప చదువుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కచ్చితంగా పుస్తకాలకు డబ్బులు కడితేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సొంతంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి డబ్బులు వెనక్కి ఇప్పించాలి. – రమేష్, విద్యార్థి తండ్రి మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం.. రెండు వారాల క్రితం బీఏఎస్ స్కీంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. తప్పిస్తే మా దృస్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. తల్లిదండ్రులు సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. – సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
బెస్ట్ ‘అన్’ అవైలబుల్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది. అవగాహన లేకపోవడంతో.. బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వవహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు, హాస్టళ్లకు డబ్బులు వసూలు అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు -
మధ్యాహ్న భోజనంలో అవకతవకలు సహించం
మద్దూరు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందజేస్తుందని, ఇందులో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మద్దూరు బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్.. డీఈఓ గోవిందరాజులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు మధ్యాహ్న భోజన రికార్డులను పరిశీలించారు. ప్రతి రోజూ వచ్చే విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నజేషన్ సిస్థం) అటెండెన్స్, జనరల్ రిజిస్టర్కు తేడా ఉండడంతో హెచ్ఎం సవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన అందించే విద్యార్థుల సంఖ్యలో తేడాలపై సమగ్రమైన నివేదిక అందజేయాలని ఎంపీడీఓ శ్రీధర్ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలతో కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, సీఎంఓ రాజేందర్కుమార్, మధ్యాహ్నా భోజన ఇంచార్జీ యాదయ్య, ఎంఈఓ బాలకిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మద్దూరు సీహెచ్సీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు, స్టాక్ రిజస్టర్, మందుల స్టాక్ను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు, వైద్య సిబ్బంది సకాలంలో హాజరై వైద్య సేవలు అందించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారందరికి స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ఓపీ రిజిస్టర్లో 95 మంది రోగులకు 75 మందికి మాత్రమే మందులు ఇచ్చారని అమె ప్రశ్నించగా వారికి మాత్రమే మందులు అవసరమని వైద్యులు తెలిపారు. అనంతరం రోగులతో కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య సేవలపై ఆరా తీశారు. -
పోలీస్ అమరవీరుల త్యాగాలే స్ఫూర్తి
నారాయణపేట: పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా ఈ సైకిల్ ర్యాలీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినివ్వాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి, చివరగా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ, యువత, విద్యార్థులు, చిన్నారులు, పోలీసులు, ప్రజలతో కలిసి సైక్లింగ్ చేస్తూ పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రతి రోజు సైక్లింగ్ చేయడం వల్ల శరీర దృఢత్వం పెరగడమే కాకుండా మనసుకు ఉత్తేజం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటే విధుల్లో మరింత సమర్థతతో రాణించవచ్చు అని అన్నారు. ఈ ర్యాలీలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐ శివశంకర్, ఆర్ఐ నరసింహ, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్, శివశంకర్, శ్వేత, శిరీష, కృష్ణ చైతన్య, పీఈటీ రమణ, యోగ సభ్యులు పాల్గొన్నారు. నేడు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఒకప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి రెండున్నర కిలోమీటర్లు రన్నింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు, ప్రజలు, యువకులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. -
అనర్హులకే పెద్దపీట!
కోస్గి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి నిజమైన లబ్ధిదారులకే ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ఇళ్ల మంజూరులో గాని, లబ్ధిదారుల ఎంపికలో గాని, బిల్లుల చెల్లింపులోగాని ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నప్పటికి కొందరు అధికారులు, నాయకులతో కుమ్మక్కవడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు చోటిస్తూ ప్రభుత్వ పారదర్శకతకు పాతర వేస్తున్నారనే వాదనలు బలంగా ఉన్నాయి. ప్రజాపాలనలో స్థానిక అధికార యంత్రాంగం ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిపొందిన వారిని ఎల్–3లో నమోదు చేసి అర్హులైన వారిని ఎల్–1, ఎల్–2 లుగా విభజించి జిల్లా ఉన్నత అధికారులు జాబితాను స్థానిక అధికారులకు అందజేశారు. మరోమారు హౌజింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజమైన లబ్ధిదారుల జాబితాను మరోమారు క్రోడికరించి తుది జాబితాను తయారు చేశారు. అధికారులు ఇందిరమ్మ కమిటీలకు ఎంపిక బాధ్యత ఇవ్వడంతో కొందరు నాయకులు ఇష్టరీతిగా వ్యవహారించడంతోపాటు అధికారులతో కుమ్మకై ్క అక్రమాలకు తెర తీశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకతకు పాతర పర్సంటేజీ ఇచ్చే వారికి ఇళ్ల మంజూరు అర్హులకు తప్పని నిరాశ మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
విచారించిచర్యలు తీసుకుంటాం
మున్సిపల్ పరిధిలో వెలుగు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మరోమారు వార్డుల వారీగా మంజూరు జాబితాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పోతిరెడ్డిపల్లి విషయంలో జరిగిన సంఘటనపై కలెక్టర్కు సమగ్ర వివరాలు అందజేశాం. బదిలీపై వెళ్లిన వార్డు అధికారికి ఇంకా రిలీవ్ ఆర్డర్ ఇవ్వలేదు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, మున్సిపల్ కమిషనర్ ● -
రైతన్నకు కన్నీరే దిక్కు..!
మిడ్జిల్కు చెందిన బీర్ల ఆంజనేయులు తనకు ఉన్న నాలుగు ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. మంగళవారం, బుధవారం కురిసిన భారీ వర్షానికి పంట చేతికి వచ్చే దశలో నాలుగు ఎకరాలు పూర్తిగా నేలమట్టమైంది. దీంతో దాదాపు రూ.లక్షన్నర నష్టం వాటిల్లింది. ‘పంట నేలకు వాలడంతో వడ్లు మొలకెత్తుతున్నాయని, నష్టం ఇంకా పెరుగుతుంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.’అని సదరు రైతు వేడుకుంటున్నాడు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మోంథా తుపాను రైతులను నట్టేట ముంచింది. సుమారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పంటలు నీటిపాలయ్యాయి. ప్రధానంగా కోత దశలో ఉన్న వరి.. ఏరే దశలో ఉన్న పత్తికి భారీ నష్టం వాటిల్లింది. వీటితో పాటు వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, ఉల్లిగడ్డ పంటలు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెత్తగా పంట చేలల్లో ఇసుక మేటలు వేయడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అధికం.. ఉమ్మడి పాలమూరులోని నాగర్కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,388 మంది రైతులకు సంబంధించి 33,559 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో 1,336 మంది రైతులకు చెందిన 2,270 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్ జిల్లాలో 1,013 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,141 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంటకు చెందిన ఇతడి పేరు భాస్కర్రెడ్డి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా.. దొరికిన చోటల్లా అప్పు చేసి ఐదు ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. నాలుగు నెలలుగా ఇతని కుటుంబం మొత్తం కష్టపడింది. వారంలో రోజుల్లో పంట కోతలు ప్రారంభించాలనుకున్నాడు. అంతలోనే రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి మూడు ఎకరాల పంట పూర్తిగా నీటి మునిగింది. మొక్కపైనే ధాన్యం మొలక వచ్చింది. కూలీ ఖర్చులు, ఎరువులు, ట్రాక్టర్ కిరాయి డబ్బులు కూడా వచ్చేలా లేవు. కన్నీళ్లు తప్పా.. ఏమీ మిగలలేదు. పరిహారం ఇవ్వాలని వేడుకోలు.. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా రైతులకు నష్టం వాటిల్లుతూ వస్తోంది. గతేడాది వానాకాలం సీజన్తో దోబూచులాడిన వరుణుడు.. ఆ తర్వాత కాత, పూత దశలో దంచికొట్టిన వానలతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి సైతం అధిక వర్షాలు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా వరి, పత్తి రైతులకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 36,970ఎకరాల్లో పంట నష్టం కోత దశలో వరద నీటిలో నేలవాలిన వరి ఏరే దశలో చేన్లలోనే తడిసి ముద్దయిన పత్తి నాగర్కర్నూల్ జిల్లాలో అధిక ప్రభావం ఆ తర్వాత వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలో.. నష్ట పరిహారం ఇవ్వాలని అన్నదాతల వేడుకోలు -
కాళ్ల పారాణి ఆరక ముందే కాటికి..
కోస్గి: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో పాటు.. పోలీసులు, గ్రామ పెద్దల వద్ద పంచాయతీలోనూ న్యాయం జరగలేదు. దీనికితోడు తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ నవ వధువు పెళ్లి జరిగిన మూడు రోజులకే బలవన్మరణానికి పాల్పడింది.స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల మల్లప్ప, మైబమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, శ్రీలత (21) అనే కుమార్తె ఉన్నారు. శ్రీలత అదే గ్రామానికి చెందిన శ్రీశైలం అలియాస్ సూరి అనే యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం మూడు నెలల క్రితం అమ్మాయి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వేరే పెళ్లి సంబంధం చూశారు. దీంతో శ్రీలత అప్పట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబాల పంతం..తన కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రేమించిన యువకుడు చెప్పిన విధంగా శ్రీలత డయల్ 100కు ఫోన్ చేసి బలవంతంగా తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇరు కుటుంబాల వారు గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని చెప్పగా అమ్మాయి సైతం ఒప్పుకోవడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇరు కుటుంబాల వారు పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లికి ఒప్పుకునేది లేదని పంతం పట్టడంతోపాటు యువకుడు సైతం పెళ్లికి నిరాకరించాడు. ఈ క్రమంలో శ్రీలతకు ఈ నెల 26న షాద్నగర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు. మంగళవారం యువతి మేనమామ ఉండే మోత్కూర్కు వధూవరులు వచ్చారు. వారి ఇంట్లో శ్రీలత పురుగు మందు తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను వికారాబాద్ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందింది. ఈ ఘటనపై యువతి సోదరులు.. శ్రీలత ప్రేమించిన యువకుడిపై కోస్గి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, అక్కడే ఫిర్యాదు చేయాలని వారు సూచించారు. రాజకీయ రగడ..మరో పక్క శ్రీలత ప్రేమించిన యువకుడు సూరి అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తుండటంతో రాజకీయ రగడ మొదలైంది. ఆ నాయకుడి అండతోనే యువకుడు పెళ్లికి నిరాకరించాడని, పోలీసులు సైతం వారికే మద్దతు ఇస్తున్నారని బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యువతి మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
ఉదండాపూర్ లీక్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు.12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తాగు నీరు అందించాలనే లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పరిధిలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కట్ట కోతకు గురై పగుళ్లు ఏర్పడి.. పలు చోట్ల నీరు లీకవుతోంది. ఈ మేరకు ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు ఇటీవల మరమ్మతులు చేయించారు. తాజాగా కురిసిన వర్షంతో మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. పొలాల్లోకి నీటి ఊటలు రావడం.. కట్ట మట్టి కొట్టుకువచ్చి మేటలు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు వట్టెం పంప్హౌస్ నీట మునగడం.. తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కాకముందే డొల్లతనం బయటపడడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 20 ఫీట్ల మేర గోతులు.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద 15.91 టీఎంసీల సామర్థ్యంతో 9.36 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే లక్ష్యంతో ఈ రిజర్వాయర్కు శ్రీకారం చుట్టారు. ఇంతటి భారీ కట్ట నిర్మాణం నాసిరకంగా కొనసాగినట్లు ఇటీవల వర్షాలు నిరూపిస్తున్నాయి. కట్టపై ఒక్కో చోట దాదాపు 20 ఫీట్ల మేర గోతులు ఏర్పడ్డాయి. నిర్మాణంలో నాణ్యత పాటించకుండా నాసిరకం మట్టిని వాడడం.. అందులో ఉన్న రాళ్లను తీయకుండా రోలింగ్ చేయడంతో వానలకు కట్ట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రివిట్మెంట్ పనుల్లో సైతం నాణ్యత కొరవడింది. అందుకే రివిట్మెంట్లలో రాళ్లు చిందరవందరగా పడి ఉన్నాయని.. నీళ్లు లీకవుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకు గురైన రిజర్వాయర్ కట్ట మరమ్మతులు చేసినా అదే పరిస్థితి పలు చోట్ల పొలాల్లోకి చేరుతున్న మట్టి, బురద నీరు రివిట్మెంట్ పనులు, నిర్మాణంలో నాణ్యత లేమి ? నాసిరకం మట్టి వాడకం, సరిగ్గా రోలింగ్ చేయకపోవడమే కారణం పనులు పూర్తికాకముందే బయటపడిన డొల్లతనం పొలాల్లోకి నీటి ఊటలు.. ఆందోళనలో రైతులు -
వందలాది ఎకరాల్లో నష్టం..
ప్రస్తుతం కట్ట వెలుపలి భాగంలో రిజర్వాయర్ చుట్టూ రైతులు వేలాది ఎకరాల్లో మక్కలు, పత్తి, వరి, కూరగాయలు సాగు చేస్తున్నారు. వర్షాలకు కట్ట కోతకు గురై మట్టి మొత్తం పొలాల్లోకి చేరడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పత్తి వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం పత్తి ఏరేదశలో ఉండగా.. నీళ్లు, మట్టి చేరడంతో దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని.. ఈ మేరకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చే స్తున్నారు. దీంతోపాటు రిజర్వాయర్ కట్ట పనుల్లో నాణ్యత పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో ఇప్పటికే సర్వం కోల్పోయామని.. ఇంకా పరిహా రం అందనే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నీటి లీకేజీ, మట్టి, ఇసుక మేటలతో నష్టం వాటిల్లుతున్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. కాగా రిజర్వాయర్ కట్టకు కోత, నీటి లీకేజీపై పీఆర్ఎల్ఐ అధికారులను ఫోన్లో సంప్రదించేందుందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఎవరూ అందుబాటులోకి రాలేదు. -
మాతృ మరణాలు తగ్గించేందుకు చర్యలు
నారాయణపేట: జిల్లాలో మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్య సిబ్బంది అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గుండుమాల్, దామరగిద్ద, కోటకొండ, ధన్వాడ, నారాయణపేట అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో సంభవించిన 8 మాతృ మరణాలు గురించి ఆయా కేంద్రాల వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా మరణాలపై కలెక్టర్ వారిని వివరణ అడిగారు. మాతృ మరణాల సంఖ్యను తగ్గించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వైద్య అధికారులతో చర్చించి, తగు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు సమావేశం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. నివేదికను విశ్లేషించాలి ప్రసూతి మరణ నివేదిక అనేది ప్రసూతి మరణ సమీక్ష నుంచి వచ్చే గోప్య పత్రం అని, మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్ తెలిపారు. మరణానికి గల కారణాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటే భవిష్యత్లో ప్రసూతి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అందరం సమష్టిగా పనిచేసి జిల్లాలో మాతృ మరణాలను పూర్తిగా తగ్గించేందుకు కృషి చేద్దామని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, ఐఎంఏ జిల్లా చైర్మన్ డా.మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజ, పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ సుధేష్ణ, డీజీఓహెచ్ ఓడీ డాక్టర్ అమితకుమారి, అనస్థటిస్ట్ డాక్టర్ తేజస్విని, ఎంపీహెచ్ ఈఓ గోవిందరాజు, 108 కోఆర్డినేటర్ రాఘవేందర్, సూపర్వైజర్ నర్మద, నర్సింగ్ అధికారిణి, పీహెచ్సీల వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
నష్టపరిహారం అందించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ కట్ట ఎక్కడికక్కడ కోతకు గురైంది. పలు చోట్ల కట్ట లీకవుతుండడంతోపాటు కట్ట కోతకు గురై వరద మా పంట పొలాలను ముంచెత్తింది. మట్టి మేటలు వేయడంతో నేను నాలుగు ఎకరాల్లో వేసిన వరి దెబ్బతింది. రిజర్వాయర్ కాంట్రాక్టర్లతో మాకు నష్టపరిహారం ఇప్పించాలి. – వెంకటేష్, కిష్టారం, జడ్చర్ల, మహబూబ్నగర్ వరి చేనును మట్టి కమ్మేసింది ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో వరద నీరు మా పొలంలోకి వచ్చింది. ఎకర పొలంలో సాగు చేసిన వరి చేనుపై మట్టి దిబ్బలు పేరుకుపోయి మాకు తీవ్ర నష్టం జరిగింది. సంబంధిత అధికారులను ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కట్ట తెగిన ప్రతిసారి మా పొలాల్లోకి మట్టి కొట్టుకు వస్తుంది. పంటలు నష్టపోతున్నాం. మాకు జరిగిన పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – గడ్డల రమేష్, రైతు, కిష్టారం -
జాతరకు తుపాను ఎఫెక్ట్
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంటు కింద నైవేద్యం వండుతున్న మహిళలు జాతర ప్రాంగణంలో వర్షంలో తడుస్తున్న భక్తులు చిన్నచింతకుంట: మొంథా తుఫాన్ ప్రభావం కురుమూర్తి జాతరపై పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తుండడంతో జాతర ప్రాంగణంలో వీధులన్ని బురదమయంగా మారాయి. దుకాణ సముదాయాల వద్ద, పలు చోట్ల నీరు నిలిచి గుంటలను తలపించాయి. దీంతో భక్తులు బస చేసేందుకు, నైవేద్యాలు సిద్ధం చేసేందుకు, చివరికి నడిచేందుకు సైతం ఇబ్బందులు పడ్డారు. కొందరు టెంట్లు ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు వ్యాపారస్తులు ఏర్పాటుచేసుకున్న దుకాణాల కింద ఉండిపోయారు. చాలామటుకు భక్తులు స్వామివారిని దర్శించుకొని వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు. దీంతో భక్తులు లేక జాతరలోని వీధులు, దుకాణాలు వెలవెలబోయాయి. రోడ్లు బురదమయం వర్షం కారణంగా జాతర మైదానంలో పలు చోట్ల నీరు నిలిచి రోడ్లని బురదమయంగా మారాయి. జాతర మైదానంలోని చౌరస్తా సమీపంలో దుకాణాల సముదాయం ఎదుట, కోనేరుకు వెళ్లేదారిలో పాత సత్రం, తలనీలాలు సమర్పించే ప్రదేశంలో వర్షం నీరు నిలిచింది. విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న కమాన్ నుంచి రాజగోపురం వరకు, గాజుల దుకాణాలు, స్వీట్ల దుకాణాలు, రంగుల రాట్నం వెళ్లే రహదారులతోపాటు జాతర మైదానంలోని బైపాస్రోడ్లు మొత్తం బుదమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. పారిశుద్ధ్య లోపం.. జాతరలో పారిశుద్ధ్య పనులపై అధికారులు చేతులెత్తేశారు. భారీ వర్షం కురవడంతో పరిసరాలన్నీ బురద, భక్తులు వాడిపడేసిన చెత్తా చెదారంతో నిండాయి. అన్నదాన సత్రం, మంచినీటి వాటర్ ట్యాంక్ సమీపంలో, దాసంగాల షెడ్లు, విడిది గదులు, కోనేరు సమీపాన ఉన్న పాతసత్రం, కళ్యాణ పండపంలో పారిశుద్ధ్యం లోపించి ఎక్కడి చెత్త అక్కడే ఉండి పోయింది. వాటి పరిసరాలలో పందులు సంచరిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురవడంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించేందుకు, గండదీపాలు మోసేందుకు, తలనీలాలు సమర్పించేందుకు భక్తులు నానా తంటాలు పడ్డారు. ఆలయం వద్ద సరిపోను దాసంగాల షెడ్లు లేకపోవడంతో భక్తులు టెంట్లు, చెట్ల కింద వర్షంలోనే నైవేద్యం తయారు చేశారు. పలువురు వర్షంలోనే తడుస్తూ గండదీపాలు మోశారు. మరోవైపు భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకొని వెనుతిరిగిపోతుండడంతో దుకాణాలన్ని వెలవెలబోయాయి. ఎలాంటి వ్యాపారాలు కొనసాగకపోవడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందారు. కంట్రోల్ రూం.. ఒక్కరోజుకే పరిమితం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం ఒక్కోజుకే పరిమితమైంది. జాతరలో నెలకొన్న సమస్యలు, భక్తుల ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, వైద్యారోగ్య శాఖలకు చెందిన అధికారుల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మంగళవారం ఉద్దాల ఉత్సవం నేపథ్యంలో దీనిని ప్రారంభించగా.. ఆ మరుసటి రోజు బుధవారం మూసివేశారు. భారీ వర్షం నేపథ్యంలో ఇబ్బందులు పడిన భక్తులకు ఈ కంట్రోల్ రూం విడిదిగా మారింది. కురుమూర్తి స్వామికి పుష్కరిణిలో చక్రస్నానం చేయిస్తున్న పూజారులు కురుమూర్తి జాతర మైదానం, పరిసరాలు బురదమయం భక్తులకు తప్పని ఇబ్బందులు వెలవెలబోయిన దుకాణాలు -
అప్పు చెల్లించాలని వేధింపులు.. మహిళా ఉద్యోగి బలవన్మరణం
● బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జూపల్లి వనపర్తి: ఇచ్చిన అప్పు చెల్లించాలని వేధించడంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో చోటు చేసుకుంది. పట్టణ రెండో ఎస్ఐ శశిధర్ కథనం మేరకు.. పాన్గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లునాయుడు, అతడి భార్య ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ (37) తమ ఇద్దరు కుమారులతో కలిసి ఎన్టీఆర్కాలనీలో ఉన్న పెద్దముక్కల వసంతమ్మ, రామచంద్రయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఎండీ నసీమాబేగం అలియాస్ నీలిమ గోపాల్పేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిటెంట్గా విధులు నిర్వర్తించేది. వెంకటేశ్వర్లునాయుడు కుటుంబం తమ అవసరాల నిమితం ఇంటి యజమాని వద్ద రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కొంతకాలంగా అసలు, వడ్డీ చెల్లించాలంటూ వేధిస్తుండటంతో భరించలేక మనస్తాపానికి గురై నీలిమ మంగళవారం రాత్రి ఇంట్లోని బెడ్రూంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తన భార్య మృతికి కారణమైన ఇంటి యజమానులపై భర్త వెంకటేశ్వర్లునాయుడు బుధవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన ప్రధాన అనుచరుడు వెంకటేశ్వర్లునాయుడును పరామర్శించారు. అధిక వడ్డీకి డబ్బులిస్తూ కుటుంబ విచ్ఛినానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. -
జూరాలకు 27 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/ఆత్మకూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవా రం రాత్రి 7.30 గంటల వరకు ప్రాజెక్టుకు 25 వేల ఇన్ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రం 5 గంట ల వరకు 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. విద్యుదుత్పత్తి నిమిత్తం 21,098 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 23 క్యూసెక్కులు, కుడి కాల్వకు 450 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 21, 571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.111 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఏడు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 7 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, దిగువలో 3 యూనిట్ల ద్వారా 120 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. శ్రీశైలంలో 883.9 అడుగుల నీటిమట్టం దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో బుధవారం 883.9 అడుగుల వద్ద 209.6 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుంకేసుల నుంచి 17,518 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,991 క్యూసెక్కులు కలిపి మొత్తం 39,634 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,617 క్యూసెక్కులు కలిపి మొత్తం 61,532 క్యూసెక్కుల నీటిని దిగువన సాగర్కు వి డుదల చేస్తున్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధి లో హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1,009 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.196మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 2.620మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కోయిల్సాగర్ పరవళ్లు.. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కోయిల్సాగర్ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుంది. మోంథా తుపాను కారణంగా జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో కోయిల్సాగర్ ఎగువ ప్రాంతం నుంచి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు బుధవారం సాయంత్రం 5 గేట్లను తెరిచి 7 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి నీటి ఉధృతి పెరిగితే మరిన్ని గేట్లను తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. -
జోగుళాంబ రైల్వేహాల్ట్ త్వరలో పునఃప్రారంభం
● దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం రామారావు ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వేహాల్ట్ను నవంబర్ మొదటి, రెండో వారంలో పునఃప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం రామారావు తెలిపారు. జోగుళాంబ రైల్వేహాల్ట్లో ప్రయాణికులకు ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ద్వారా న్ని, పెయింటింగ్ చిత్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లైటింగ్, టయిల్స్, బుకింగ్, విశ్రాంతి గదులు, హైలెవవల్ ఫ్లాట్ఫాం, విద్యుదీకరణ పనులపై ఆరా తీశారు. ప్రయాణికులు కూర్చోవడానికి టేబుళ్లు, నీడకోసం షెల్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వేస్టేషన్లో కొన్ని రైళ్లను కూడా నిలిపేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా కురుమూర్తిస్వామి చక్రస్నానం
కురుమూర్తిస్వామికి ఆలయ పుష్కరిణిలో బుధవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా పూజారులు చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి నిర్వహించే సేవా కార్యక్రమాలు మంగళవారంతో ముగిశా యి. ఈక్రమంలో చివరిరోజైన మంగళవారం అర్ధరాత్రి స్వామివారికి గరుడ వాహనసేవ నిర్వ హించారు. ఈ సేవ అర్ధరాత్రి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమై పుష్కరిణి వరకు కొనసాగింది. బుధవారం తెల్లవారుజామున అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రోచ్ఛరణల నడుమ పూజారులు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. పలువురు విద్యార్థినులు కూచిపూడి నృత్యం.. వేంకటేశ్వరస్వామి వేషధారణలో భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయ సిబ్బంది ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు దాసంగాలు సమర్పించి.. చల్లంగా చూడాలని వేడుకున్నారు. కొండపైన అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వా మి, ఉద్దాల మండపం, చెన్నకేశవ స్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, కమలాకర్, భాస్కరాచారి పాల్గొన్నారు. -
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం
వనపర్తి విద్యావిభాగం: అందరికీ సమానంగా ఉచిత విద్యకోసం ఉద్యమించాల్సిన అవసరముందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ ఫెసర్ కె.లక్ష్మీనారాయణ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న పీడీఎస్యూ 4వ రాష్ట్ర మహాసభలు బుధవారం రెండో రోజు కొనసాగగా.. రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్రెడ్డి పీడీఎస్యూ జెండాను ఆవిష్కరించి విద్యార్థి ప్రతినిధుల మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత ప్రారంభమైన విద్యా గోష్టిలో మొదటి అంశమైన శ్రీనూతన జాతీయ విద్యావిధానం – శాసీ్త్రయ విద్య మధ్య వైరుద్యాలుశ్రీ అనే అంశంపై ప్రొ.లక్ష్మీనారాయణ మాట్లాడారు. విద్య ప్రైవేటీకరణ, వ్యాపారీకరణతో సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం నెలకొందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా, అందరికీ సమాన ఉచిత విద్య కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ పరివార్ శక్తులు కలిసి నూతన జాతీయ విద్యా విధానాన్ని మూడు భాగాలుగా విభజించారని.. అందులో భాగంగా విద్యను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేయడం, విద్యలో మతపరమైన అంశాలను చేర్చడం వంటి వాటికి కుట్రలు చేస్తున్నారన్నారు. 1964లో ప్రొ.కొఠారి కమిషన్ సూచించిన కామన్ విద్యా విధానం కోసం, శాసీ్త్రయ విద్యా విధానం కోసం పీడీఎస్యూ విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పీడీఎస్యూ చరిత్ర, 50ఏళ్లలో నిర్వహించిన పోరాటాలు, విద్యార్థుల త్యాగాలను రాష్ట్ర మాజీ కార్యదర్శి, కవి జనజ్వాల వివరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ నేత విజయ్ కన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ రఫీ, ఎస్.కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సాంబ, కార్యదర్శి బి.భాస్కర్, ఉపాధ్యక్షుడు కె.పవన్ కుమార్, రాచకొండ రంజిత్, సతీశ్, జె.గణేశ్, సైదులు, అర్జున్, వంశీ రాజు, ప్రశాంత్ పాల్గొన్నారు. -
డ్రమ్ములో పడి బాలుడి మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు నీళ్ల డ్రమ్ములో పడి మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు.. గద్వాల మండలంలోని కుర్వపల్లికి చెందిన కుర్వ నారాయణ, పావని దంపతుల కుమారుడు వీరేష్ (3) బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ.. సమీపంలోని డ్రమ్ములో నీళ్లు తీసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు బయటకు తీశారు. బాలుడు అపస్మారక స్థితిలో ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. బావిలో పడి వ్యక్తి మృతి ● ఆలస్యంగా వెలుగులోకి ఉప్పునుంతల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పాడుబడిన మాదిగ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలం లింగోటం తండాకు చెందిన కాట్రావత్ శంకర్ (38) చెత్త ఏరుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో పది రోజుల క్రితం బావి అంచున చెత్త ఏరుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. శంకర్ అదృశ్యంపై కు టుంబ సభ్యులు అచ్చంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం బావిలో తేలిన శవాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా శంకర్గా గుర్తించారు. పో స్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనుమానాస్పదంగా వివాహిత.. ఊట్కూర్: మండలంలోని పులిమామిడి గ్రా మంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథ నం మేరకు.. మండలంలోని మోగ్దుంపూర్ గ్రామానికి చెందిన రాఘవ కూతురు అన్నపూర్ణ (28)ను పులిమామిడి గ్రామానికి చెందిన బుడ్డోళ్ళ రాముతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 10 నెలల కుమారుడు ఉన్నాడు. అన్నపూర్ణ బుధవారం తెల్లవారు జామున అనుమానాస్పదంగా ఇంట్లో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందినట్లు ఆరోపించారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై ఎస్ఐ రమేష్ను వివరణ కోరగా తనకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. యువకుడి బలవన్మరణం కొత్తకోట రూరల్: ఫ్యాన్ కు ఉరేసుకుని యువకుడి బ లవన్మరణానికి పాల్ప డిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న జనంపల్లి అశోక్(35) పె యింటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల కుటుంబంలో గొడవలు, ఆర్థి క ఇబ్బందుల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడికి భార్య శాంతమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారు డు ఉన్నారు. ఆత్మహత్యపై ఎస్ఐ ఆనంద్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి మరికల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు బుధవారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన ముష్టి తిర్మలయ్య (56) ఈ నెల 14న పస్పుల స్టేజీ సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో తన బైక్కు పెట్రోల్ పోయించుకొని రోడ్డు ఎక్కుతుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో తిర్మలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కల్లు సీసాలో ఎలుక కోస్గి: ఓ మహిళా తాగేందు కు తీసుకున్న కల్లు సీసాలో చనిపోయిన ఎలుక వచ్చింది. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాగుసాన్పల్లి గ్రా మానికి చెందిన బాలమణి బుధవారం రాత్రి కల్లు దుకాణానికి వెళ్లింది. కల్లు సీసాను కొను గోలు చేసి అక్కడే తాగుతుండగా.. సీసాలో నుంచి కల్లు బయటకు రావడం ఆ గిపోయింది. విద్యుత్ వెలుతురు వద్దకు తీసుకొచ్చి సీసాను గమనించగా చనిపోయిన ఎలుక కనబడింది.దీంతో అక్కడే కల్లు తాగు తున్న మ రికొందరు వెంటనే అప్రమత్తమై కల్లు పారబోశారు. ఈ విషయమై సంబంధిత కల్లు దుకాణాదారుడు వెంకటయ్యను అడిగేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
మద్దతు ధరలు పెంచరు..
రైతులు ఆరుగాలం శ్ర మించి మట్టిలో పోరాడి పండించిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక వ్యాపారు లు చెప్పిన ధరకే అమ్ముకొని వస్తున్నాం. ఎరువుల ధరలు పెంచుతున్న కంపెనీలు, ప్రభుత్వాలు పంటల మద్దతు ధరలు మాత్రం పెంచడం లేదు. ఏటా ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పంటల ధరలు పెంచే వరకు రైతుల కష్టాలు తీరవు. – తిరుపతయ్య, మరికల్ ధరలు నియంత్రణలో ఉండాలి.. వానాకాలంలో బస్తా ఎరువుపై రూ.50 పెంచారు. మళ్లీ యాసంగిలో కూడా రూ.50 పెంచుతామని కంపెనీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎరువుల కంపెనీలకు రైతుల కష్టాలు కనిపించడం లేదు. ఎరువుల ధరల పెంపు కేంద్రం నియంత్రణలో ఉంటేనే రైతులకు తక్కువ ధరకు లభిస్తాయి. – వెంకటేష్, జిన్నారం ● -
నయనానందం ఉద్దాలోత్సవం
వడ్డెమాన్ నుంచి ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొస్తున్న ఉద్దాలు చిన్నచింతకుంట: పాలమూరు మట్టిబిడ్డల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న అమ్మాపురం శ్రీకురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలను తీసుకురాగా వేలాది మంది భక్తులు వాటిని తాకి పునీతులయ్యారు. చిన్నచింతకుంట మండలం చిన్నవడ్డెమాన్లోని ఉద్దాల మండపం నుంచి కురుమూర్తిస్వామి ఆలయం వరకు దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు ఉద్దాలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ఘట్టమైన ఉద్దాల ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వడ్డెమాన్లోని ఉద్దాల మండపంతోపాటు జాతర మైదానం జనం హోరెత్తింది. భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో కురుమూర్తి సప్తగిరులు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి నామస్మరణతో మార్మోగాయి. దారులన్నీ కురుమూర్తి వైపే.. కురుమూర్తి జాతరకు మధ్యాహ్నం నుంచి భక్తులు భారీస్థాయిలో తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, జీపులు, బైకులు, ఎద్దుల బండ్లపై భక్తులు జాతరకు చేరుకున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, అచ్చంపేట, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దేవరకద్ర, మక్తల్, అమరచింత, కొత్తకోట, చిన్నచింతకుంట దారుల గుండా వేలాది వాహనాలు వచ్చాయి. బ్రహ్మాండనాయకుడి ప్రధాన వేడుకకు తరలివచ్చిన భక్తజనం గ్రామగ్రామాన మంగళ హారతులతో స్వాగతం జనసంద్రంగా మారిన ఊకచెట్టువాగు, జాతర మైదానం గోవింద నామస్మరణతో మార్మోగిన కురుమూర్తి గిరులు -
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి
నారాయణపేట టౌన్: స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నెలవారీ పొదుపు, రుణాల ఆడిట్పై చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అందించే రుణాలతో వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలపడాలని సూచించారు. అదే విధంగా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. సమావేశంలో పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సాయికుమారి, కార్యదర్శి ఉమా, కోశాధికారి జరీనా తదితరులు ఉన్నారు. రోడ్డు విస్తరణతో నష్టం లేకుండా చూడాలి మద్దూరు: పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి గురుకుల పాఠశాల వరకు 70 ఫీట్ల మేర రోడ్డు విస్తరణ కోసం మార్కింగ్ వేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేశారు. రోడ్డు విస్తరణతో ఎవరికీ నష్టం వాటిల్లకుండా 30 ఫీట్ల మేరకు మాత్రమే విస్తరించాలని మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్కు విన్నవించారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. గతంలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉత్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిని అంత తక్కువగా కాకుండా.. ఓ నిర్ధిష్టంగా అందరికీ ఆమోదయోగ్యంగా, రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. బాధితులు కూడా దీనిపై ఓ అంగీకారానికి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా, రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాలని బాధితులు కోరారు. కార్యక్రమంలో రోడ్డు విస్తరణ బాధితులు అంబర్నాథ్, శ్రీనివాస్, ముస్తాక్, నర్సింహ, నర్సింహులు, షబ్బీర్, మైనొద్దీన్, సిద్దిలింగం, సిద్దు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువు.. మరింత బరువు
మరికల్: యాసంగి పంటల సాగుకు ఎరువుల ధరల పెంపు మరింత భారం కానుంది. కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తాకు రూ.50 పెరుగుదల ఉండగా, మరికొన్నింటి ధర పెంపు ఉంటుందని ప్రముఖ కంపెనీల డీలర్లకు సమాచారం అందింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు పాత ధరలకే విక్రయిస్తున్నారు. యాసంగి సీజన్లో రైతులు వినియోగించే ఎరువుల ధరలు పెరుగుతాయని కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతోనే ఎరువుల ధరలు పెరుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నా.. ఆ భారం రైతులే మోయాల్సి వస్తోంది. ● వానాకాలం సీజన్ పూర్తయింది. ఇక యాసంగి పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురవడంతో చెరువులు జలకళను సంతరించుకున్నా యి. భూగర్భ జలమట్టం పెరగడంతో సాగు మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. వానాకాలం సీజన్ కంటే ముందు ఓసారి ఎరువుల ధరలు పెరగగా.. తాజాగా మరోమారు పెరగనుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యూరియా, డీఏపీ మినహా మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు మాత్రమే పెంచారు. యాసంగిలో 1.35 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు ఉంటుందని.. ఇందుకుగాను 21,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. తాజా వినియోగంలో ఎక్కువగా ఉండే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచడం రైతులకు మరింత భారంగా మారింది. పెరిగిన భూగర్భ జలాలు.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండకుండను తలపిస్తోంది. అదేస్థాయిలో చెరువులు, కుంటలు, వ్యవసాయ బోర్లలో భూగర్భ జలలు పెరిగాయి. నీటి వనరులున్న ప్రతి రైతు యాసంగిలో వరితో పాటు వేరుశనగ సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వేరుశనగ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సీజన్లో వివిధ రకాల పంటల సాగు కూడా పెరగడం, ఎరువుల ధరలు అదేస్థాయిలో పెరగడం రైతులకు మరింత భారంపడనుంది. సేంద్రియ సాగుకు మొగ్గు చూపాలి.. ఏటా ఎరువుల ధరలు పెరుగుతున్నందున రైతులు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలి. అప్పుడే భూమి సారవంతంగా ఉండటమే కాకుండా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎరువుల ధర పెంపుతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ యాసంగిలో 21,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు సిద్ధం చేశాం. – జాన్సుధాకార్, జిల్లా వ్యవసాయ అఽధికారి యాసంగి నుంచి మళ్లీ పెరగనున్న ధరలు బస్తాపై రూ.50 పెంపునకు నిర్ణయం రైతులపై అదనపు భారం జిల్లాలో 21,500 మెట్రిక్ టన్నుల అంచనా -
పీఎం ధన్–ధాన్య కృషి యోజనకు ప్రణాళికలు
● జిల్లాలో ప్రస్తుత స్థితిని నిర్ధారించేందుకు బేస్లైన్ సర్వే చేపట్టాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలో పీఎం ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో పీఎం ధన్–ధాన్య కృషి యోజన కమిటీ సభ్యుల మొదటి సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించడం.. రైతుల ఆదాయం పెంచడం.. గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇస్తూ స్థిరమైన వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం స్వీకరించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. జిల్లాలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు వార్షిక ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. మొదటగా జిల్లాలో ప్రస్తుత స్థితిని నిర్ధారించడానికి ఒక బేస్లైన్ సర్వే చేపట్టాలన్నారు. ఇందులో 9 అంశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సర్వే అనంతరం జిల్లా వ్యవసాయ వనరులకు అనుగుణంగా సమగ్రమైన, స్థిరమైన వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. పంట తీవ్రత, ఉత్పాదకత, పంటకోత అనంతరం మౌలిక సదుపాయాలు, ఉద్యానవన, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, రుణ ప్రవాహానికి వైవిధ్యంతో ముడిపడి ఉన్న ఐదేళ్ల ఫలిత ఆధారిత లక్ష్యాలు ఉంటాయని తెలిపారు. వాటిని సాధించడమే వివిధ పథకాల లక్ష్యమని కలెక్టర్ స్పష్టంచేశారు. అనంతరం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఏర్పాటు ధన్–ధాన్య కృషి యోజన పథకం అమలుకు దోహద పడుతుందన్నారు. రెండు రోజుల్లో బేస్లైన్ సర్వేతో కూడిన ప్రణాళికను సిద్ధం చేయాలని.. అదే విధంగా డాక్యుమెంటరీని రూపొందించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో పథకం నోడల్ ఆఫీసర్ సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్, నాబార్డు జిల్లా మేనేజర్ షణ్ముఖాచారి, ఎల్డీఎం విజయ్ కుమార్, నీటిపారుదలశాఖ ఈఈ బ్రహ్మానందారెడ్డి, సుధాకర్రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రమణారావు, పశుసంవర్ధక శాఖ అధికారి అనిరుధ్, కేవీకే శాస్త్రవేత్తలు రాజేంద్ర కుమార్రెడ్డి, సురేశ్ కుమార్ ఉన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి కోస్గి రూరల్: కోస్గి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆమె స్వయంగా పరిశీలించి.. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ, కడా నిధులు రూ. 350కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రధాన లింకు రోడ్లు, అంతర్గత సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఈఈ విజయభాస్కర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఇంజినీర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ చొరవతోనే రైల్వేలైన్కు మోక్షం
● కృష్ణా–వికారాబాద్పై తప్పుడు కథనాలు సరికాదు ● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట రూరల్: కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్కు మోదీ ప్రధాని అయిన తర్వాతే మోక్షం లభించిందని, ఇందుకుగాను గతంలో రూ.20,016 కోట్లు మంజూరైనట్లు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని కొల్లంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తాను రైల్వే లైన్ నిర్మాణానికి నిధుల మంజూరు ప్రతిపాదనను రైల్వేశాఖ మంత్రితో చర్చించానని.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం సర్వే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా కేంద్రం రైల్వేస్టేషన్లను ఎయిర్పోర్టుల తరహాలో ఆధునికీకరిస్తుందని.. అందులో ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల, అలంపూర్, షాద్నగర్ రైల్వేస్టేషన్లు ఉన్నాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో రైల్వేలైన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చానని.. వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తానని తెలిపారు. తప్పుడు సమాచారం సరికాదు.. కొన్ని పత్రికలు (సాక్షి కాదు) కొత్తగా కొడంగల్–వికారాబాద్ రైల్వే లైన్ అంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని.. రెండోలైన్ ముఖ్యమంత్రి వికారాబాద్ నుంచి కొడంగల్కు వేస్తున్నారా అనేది తనకు తెలియదన్నారు. కొందరు విలేకరులు పూర్తి వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ ఏర్పాటునకు పలుమార్లు రైల్వేశాఖ మంత్రిని కలిసి ఒత్తిడి తెవడంతో సర్వే పూర్తయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ పూర్తిచేస్తే వెంటనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొత్తకాపు రతంగ్పాండురెడ్డి, కొండ సత్యయాదవ్, సాయిబన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తొలి జీఓ ప్రకారమే నిర్మించాలి..
కొత్తపల్లి–జూరాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిమల్లకు వెళ్లాలంటే మేము 30 కి.మీలు చుట్టి రావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ మాదిరిగా గేట్లు వేసి రాకపోకలు నిలిపివేస్తే.. మా వ్యాపారాలు జరగవు. రేవులపల్లి–నందిమల్ల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే మా పొలాలకు కాస్త రేట్లు వస్తాయి. చిన్నాచితక వ్యాపారాలతో జీవనోపాధి పొందొచ్చనేది మా ఆశ. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలి. అంతవరకూ పోరాటం తప్పదు. – రాజు, రేవులపల్లి, ధరూర్, జోగులాంబ గద్వాల ఎవరూ అడ్డుకోవద్దు.. ఆత్మకూరు మండలంలోని జూరాల పుష్కర ఘాట్ వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రయోజనకరం. ఆత్మకూరు నుంచి గద్వాలకి వెళ్లాలంటే ప్రస్తుతం 33 కి.మీలు ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 12 కి.మీ.లకే గద్వాల వెళ్లొచ్చు. 1979లోనే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. మంత్రి వాకిటి శ్రీహరి కృషితో కొత్తపల్లి – జూరాల మధ్య నిర్మాణం కానుంది. ఎవరూ అడ్డుకోవద్దని.. అటుఇటు అయితే మేమూ పోరాటానికి సిద్ధం. – రహమతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్, వనపర్తి ● -
హనుమద్వాహనంపై కురుమతిరాయుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా కురుమూర్తి స్వామి, పద్మావతి అమ్మవార్లు సోమవారం రాత్రి హనుమద్వాహనంపై విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి కల్యాణకట్ట వరకు సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తిగిరులు మార్మోగాయి. ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట -
ఉత్కంఠకు తెర
● లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసిన కలెక్టర్ విజయేందిర ● 14 మంది మహిళలను వరించిన అదృష్టం ● ఇద్దరు వ్యక్తులకు రెండేసి దుకాణాలు మహబూబ్నగర్ క్రైం: దాదాపు నెల రోజుల నుంచి సాగిన మద్యం టెండర్ల ఉత్కంఠకు తెరపడింది. సిండికేట్లో టెండర్లు వేసిన వేల మందితో కలెక్టరేట్ ఆవరణంతో పాటు సమీప ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఖద్దరు చొక్కలు.. విలువైన కార్లతో మహబూబ్నగర్–భూత్పూర్ రోడ్డు రద్దీగా కన్పించింది. ఒక్కో దుకాణానికి ఐదు నుంచి పది మంది వరకు సిండికేట్ సభ్యులు ఉన్నారు. వారందరూ అక్కడికి చేరుకోగా కేవలం ఒక్కరిని (దరఖాస్తుదారుడు) మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలోని 54 దుకాణాలకు 1,634 దరఖాస్తులు, నారాయణపేట జిల్లాలో 36 దుకాణాలకు 853 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,487 దరఖాస్తులు రాగా వీరితో పాటు మరో మూడింతల వ్యాపారులు అక్కడికి చేరుకున్నారు. లక్కీడిప్లో దుకాణాలు దక్కించుకున్న వారు ఆనందంతో కేరింతలు కొడితే రాని వాళ్లు నిరాశతో అక్కడి నుంచి వెనుదిరిగారు. ఒకే దగ్గర.. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో ఉన్న 90 మద్యం దుకాణాలకు జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి కలెక్టరేట్ విజయేందిర బోయి లక్కీడిప్ తీసి దుకాణాలు కేటాయింపు చేశారు. ఒక్కో దుకాణానికి వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన కాయిన్స్ ఒక స్టీలు బాక్స్లో వేసి అసిస్టెంట్ ఈఎస్ నర్సింహారెడ్డి ఊపి కలెక్టర్ ముందు పెట్టాగా బాక్స్లో నుంచి ఒక కాయిన్ తీసి దుకాణాదారుడిని ఎంపిక చేశారు. ● మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 52 దరఖాస్తులు వచ్చిన కోయిలకొండ 25వ దుకాణాన్ని నారాయణరెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా 9వ దుకాణాన్ని కూడా ఇతనే సొంతం చేసుకోవడం విశేషం. నారాయణపేట జిల్లాలో మక్తల్లో ఉన్న 62, 66 దుకాణాలను కతలప్ప అనే వ్యక్తి దక్కించుకున్నారు. మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో ఐదుగురు మహిళ వ్యాపారులు దుకాణాలు సొంతం చేసుకున్నారు. వీరిలో 5వ దుకాణం ఎం.స్వప్న, 15వ దుకాణం రాజేశ్వరి, 16వ దుకాణం పుష్ప, 23వ దుకాణం లక్ష్మమ్మ, 24వ దుకాణం మంజుల ఉన్నారు. ఇక జడ్చర్ల పరిధిలో 4వ దుకాణం శ్రీలక్ష్మీ, 41వ దుకాణం మేఘన, 43వ దుకాణం విజయలక్ష్మీ, 45వ దుకాణం రాణిమ్మ సొంతం చేసుకున్నారు. నారాయణపేట సర్కిల్ పరిధిలో ఇద్దరు మహిళలు, కోస్టి సర్కిల్ పరిదిలో ముగ్గురు మహిళలు లక్కీడిప్లో దుకాణాలు దక్కించుకున్నారు. ● రెండు జిల్లాలో ఉన్న 90 దుకాణాల్లో మహబూబ్నగర్లో ఉన్న దుకాణాలు రూ.65 లక్షల స్లాబ్లో ఉండటం వల్ల దుకాణం సొంతం చేసుకున్న వారు ఆ ఫీజులో 6వ వంతు రూ.10,83.500 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.55 లక్షల స్లాబ్ కింద ఉన్న దుకాణాలు వచ్చిన వారు రూ.9,16,700, ఇక రూ.50 లక్షల స్లాబ్ కింద ఉన్న దుకాణాలు సొంతం చేసుకున్న వారు రూ.8,33,500 ఫీజు చెల్లించాలి. మొదటి రోజు రూ.కోటి నగదు వ్యాపారులు అక్కడే ఏర్పాటు చేసిన బ్యాంకులో చెల్లించారు. మిగిలిన వ్యాపారులు మంగళవారం సాయంత్రం వరకు చెల్లించాల్సి ఉంటుంది. 90 మద్యం దుకాణాలకు నూతన లైసెన్స్దారుల ఎంపిక -
వైద్య వృత్తి పవిత్రమైంది
● పేదలకు నిస్వార్థ సేవలు అందించాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని.. ఆ వృత్తిలో ఉన్నవారు పేదలకు బాధ్యతాయుతంగా సేవలందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మండలంలోని అప్పక్పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వం వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సంపత్కుమార్సింగ్ ఆధ్వర్యంలో సోమవారం 2025–2026 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్ డే అండ్ వైట్కోట్ సెరమనీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ డా. వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత గ్రామాల్లో వైద్యసేవలు అందించి పేదలకు అండగా ఉండి భరోసా కల్పించాలన్నారు. మీరంతా ఉన్నతస్థాయికి రావడానికి ముఖ్యమైన వ్యక్తులు తల్లిదండ్రులని.. వారి గౌరవం ఏ మాత్రం తగ్గకుండా ఉన్నతస్థాయిలో ఉండేలా చూసుకుంటూ చదువు పూర్తి చేయాలని చెప్పారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. తెల్లని కోటు కేవలం దుస్తువు కాదని, సేవ, బాధ్యత, కర్తవ్య నిబద్ధతకు ప్రతీకని తెలిపారు. విజ్ఞానంతో పాటు మానవత్వం కలిగిన వైద్యులుగా ఎదగాలని, క్రమశిక్షణ, నిజాయితీ, దయ అనే విలువలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని, ప్రజలకు మంచి సేవలు అందించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలని.. డ్రగ్స్, ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చెడుకు బానిస కాకుండా విద్యపైనే దృష్టిసారించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు చదువుతున్నారా? లేదా? ఇతరాత్ర కార్యక్రమాలపై ఏమైనా శ్రద్ధ పెడుతున్నారా? వయసు ప్రభావం వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వైద్య కళాశాల, ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన, సహకరిస్తున్న కలెక్టర్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, వైస్ ప్రిన్సిపాల్ డా.కిరణ్ప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. ఆదిత్య, ఆర్ఎంఓ డా. రాఘవేందర్, అన్ని శాఖల హెచ్ఓడీలు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నిర్మాణ ప్రదేశం మార్పుతో ఆందోళన బాట..
ఈ క్రమంలో ప్రభుత్వం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ అలైన్మెంట్ను మారుస్తూ గత నెల నాలుగో తేదీన సవరించిన జీఓ విడుదల చేసింది. దీని ప్రకారం గద్వాల మండలం కొత్తపల్లి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామం వరకు బ్రిడ్జి నిర్మించాలని సూచించారు. మొత్తం 10.5 కిలోమీటర్ల పొడవు నిర్మించే రహదారిలో 1,500 మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం కానుంది. గత జీఓ మేరకు రేవులపల్లి–నందిమల్ల మధ్య అధికారులు సర్వే చేయగా.. తాజా ఆదేశాలతో కొత్తపల్లి–జూరాల మధ్య రోడ్డు, వంతెన నిర్మాణం కోసం సర్వే నిర్వహిస్తున్నారు. అయితే బ్రిడ్జి నిర్మాణ ప్రదేశం మారడంతో రేవులపల్లి, నందిమల్ల గ్రామస్తులు ఆందోళనబాట పట్టారు. తొలి జీఓ ప్రకారమే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు సైతం సమర్పించారు. దీంతో పాటు ఆందోళనలను ఉధృతం చేసే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఎవరికి వారు.. భిన్నవాదనలు ● కొత్తపల్లి వద్ద బ్రిడ్జి నిర్మిస్తే తాము వ్యవసాయ పొలాలకు కూడా పోలేని దుస్థితి వస్తుందని రేవులపల్లి, నందిమల్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తే.. నేడు చేస్తున్న మేలు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. రియల్ వ్యాపారస్తుల కోసమే జీఓను మార్పుచేసి కొత్త స్థలాన్ని ప్రతిపాదించారని మండిపడుతున్నారు. ● గతంలో జూరాల ప్రాజెక్ట్ నిర్మాణం దిగువన జరగాల్సి ఉన్నా.. రాజకీయ పలుకుబడితో నడిగడ్డ నాయకులు పైన నిర్మాణం చేశారని జూరాల, కొత్తపల్లి, ఆత్మకూరు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. ఆత్మకూరు ప్రాంతానికి మేలు జరిగేలా ఇప్పుడైనా కొత్తపల్లి – జారాల మధ్య బ్రిడ్జికి అడుగులు పడడం శుభపరిణామమని.. గద్వాల నుంచి మహబూబ్నగర్, హైదరాబాద్కు సైతం చాలా దూరం తగ్గుతుందని చెబుతున్నారు. -
పత్తిసాగులో జిల్లా మూడో స్థానం
● కపాస్ యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలి ● రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట/మక్తల్/ఊట్కూరు: రాష్ట్రంలోనే పత్తి సాగులో జిల్లా మూడో స్థానంలో నిలిచిందని వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నారాయణపేట మండలం లింగంపల్లిలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రైతుల నుంచి మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి పండించిన రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా మద్దతు ధరకు విక్రయించే విధంగా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులపై ఉందన్నారు. ము ఖ్యంగా కపాస్ యాప్పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో పత్తిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని సూచించారు. నారాయణపేట చీరలు, బంగారానికి ఎంత పేరుందో అందరికీ తెలుసని.. పంటల సాగులోనూ మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏకకాలంలో 25లక్షల మంది రైతుల రుణాలు రూ. 22వేల కోట్లను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్చైర్మన్ కొనంగేరి హన్మంతు, డీఎంఓ బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్వైజర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలో వివిధ గ్రామాలకు చెందిన 230 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం చిన్న గోప్లాపూర్కు చెందిన 40మంది రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు అందజేశా రు. మక్తల్ మండలం కాచ్వార్ నుంచి ఎడివెల్లి వరకు రూ. 3.8 కి.మీ. మేర బీటీరోడ్డు నిర్మాణానికి రూ.2.4కోట్లతో శంకుస్థాపన చేశారు. ఊట్కూరులో పీఏసీఎస్ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, సింగిల్విండో చైర్మన్ బాల్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గణేశ్కుమార్, తహసీల్దార్ చింత రవి, ప్రత్యేకాధికారి యోగానంద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, నాయకులు వెంకటేశ్, విష్ణువర్ధన్రెడ్డి, తాయప్ప, రవికుమార్, లక్ష్మారెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, యఘ్నేశ్వర్రెడ్డి, మహేశ్రెడ్డి, బస్వరాజుగౌడ్ పాల్గొన్నారు. -
బాధితులకు నష్టపరిహారం అందించాలి
నారాయణపేట: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డా.వినీత్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్గా తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి పోలీసుశాఖ పరంగా పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. 2023లో 31, 2024లో 34, 2025లో ఇప్పటివరకు 13 ఎస్సీ, ఎస్టీ కేసులు జిల్లాలో నమోదయ్యాయని తెలిపారు. వాటిలో 13 కేసులకు గాను 3 కేసులు చార్జీషీట్కు సిద్ధంగా ఉన్నాయని.. మిగతావి విచారణ దశలో ఉన్నాయన్నారు. మరికొన్ని కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ రావాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రతినెలా పౌరహక్కుల దినం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, మూడేళ్ల కాలంలో 54 కేసులకు సంబంధించిన నష్టపరిహారం బడ్జెట్ మంజూరు లేకపోవడంతో అందించలేకపోయామని సీ–సెక్షన్ అధికారి రాణిదేవి చెప్పారు. బడ్జెట్ వచ్చిన వెంటనే రెండు వారాలకోసారి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు కిష్ట్యా నాయక్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, షెడ్యూల్డ్ కులాలు తెగల అభివృద్ధిశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, డీపీఓ సుధాకర్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్దన్ ఉన్నారు. భూ సేకరణ పనుల్లో వేగం పెంచండి ఊట్కూరు: మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఊట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మక్తల్–పేట ఎత్తిపోతల పథకం భూ సేకరణకు సంబంధించి రైతుల జాబితాను త్వరగా సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని.. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు. భూభారతి దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహపీల్దార్ చింత రవి, ఎంపీడీఓ లక్ష్మీనర్సింహ రాజు, ఆర్ఐ కృష్ణారెడ్డి, వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
‘పవర్’ ఫుల్
జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో లక్ష్యానికి మించి ఉత్పత్తి ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది 610 మి.యూ. లక్ష్యానికిగాను అక్టోబర్ 22వ తేదీ నాటికి 882 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా చేపట్టి రికార్డు సృష్టించారు. 2022–23లో నవంబర్ చివరి నాటికి 640 మిలియన్ యూనిట్ల లక్ష్యానికిగాను 876 మి.యూ.గా నమోదైంది. ఈ ఏడాది విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకే విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి జూరాలకు వరద చేరుతుండటంతో అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. వరదపైనే ఆధారం.. ఎగువన ఉన్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత వచ్చే వరద జూరాల జలాశయానికి చేరుతుంది. వరద చేరితేనే ఇక్కడ విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. ఈ ఏడాది ముందస్తుగా జలాశయానికి వరద చేరడంతో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది. మొరాయించిన మూడో యూనిట్.. జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తగా చైనాకు చెందిన సాంకేతిక నిపుణులు రెండేళ్లుగా మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో బాగు కావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ● జూరాల దిగువ జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ నుంచి రోజుకు 40 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 40 మెగావాట్ల ఉత్పత్తి 9,600 యూనిట్లకు సమానం. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికిగాను 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. ● ఈ ఏడాది దిగువ జల విద్యుత్ కేంద్రంలో 290 మి.యూ. లక్ష్యానికిగాను ఈ ఏడాది 447 మి.యూ.. ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల నుంచి 320 మి.యూ. లక్ష్యానికిగాను 435 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 2014–15 నుంచి 2024–25 వరకు ఎగువన 3,039 మి.యూ., దిగువన 2,531 మి.యూ., మొత్తం 5,570 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఎగువ జూరాల పవర్ హౌజ్ దిగువ జూరాలజల విద్యుత్ కేంద్రంఏడాది వారీగా విద్యుదుత్పత్తి ఇలా.. 2020–21లో జులై 14న ఉత్పత్తి ప్రారంభించి 648 మి.యూ. లక్ష్యానికిగాను 775 మి.యూ. విజయవంతంగా పూర్తి చేశారు. 2021–22లో జులై 12న విద్యుదుత్పత్తి ప్రారంభించి 724 మి.యూ. లక్ష్యానికిగాను 704 మి.యూ. ఉత్పత్తి మాత్రమే సాధించారు. 2022–23లో వరద భారీగా రావడంతో జులై 11న ఉత్పత్తి ప్రారంభించి 640 మి.యూ. లక్ష్యానికిగాను 876 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించారు. 2023–24లో జలాశయానికి స్వల్పంగా వరద చేరడంతో జులై 23న ఉత్పత్తి ప్రారంభించారు. 600 మి.యూ. లక్ష్యానికిగాను కేవలం 212 మి.యూ. ఉత్పత్తి మాత్రమే చేపట్టగలిగారు. 2024–25లో జలాశయానికి భారీగా వరద చేరడంతో జులై 18న విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 600 మి.యూ. లక్ష్యానికిగాను 678 మి.యూ. ఉత్పత్తి చేపట్టారు. 610 మి.యూ.గాను.. 882 మి.యూనిట్లకు మించి.. ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి 2022–23లో 876 మిలియన్ యూనిట్లు -
.. సాహసయాత్ర
మహబూబ్నగర్లోని బోయపల్లికి చెందిన మల్లేశ్గౌడ్ 18వేల కి.మీ. సైకిల్యాత్ర పూర్తిచేసుకొని తిరిగివచ్చారు. నిఘా అవసరం చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
నారాయణపేట: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువులో 1.83లక్షల చేపపిల్లలను వదిలారు. అదే విధంగా ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో జిల్లాలోని 60 నీటివనరుల్లో 80–100 ఎం.ఎం.సైజ్ 80లక్షల చేపపిల్లలను వదులుతున్నట్లు తెలిపారు. గతంలో చేపపిల్లలు దూరం ప్రాంతాల నుంచి వచ్చేవని.. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి వచ్చాయన్నారు. నియోజకవర్గంలో రూ. 150కోట్లతో బీటీరోడ్లు నిర్మించనున్నట్లు వివరించారు. మరికల్ నుంచి మినస్పూర్ వరకు బీటీరోడ్డు మంజూరైనట్లు తెలిపారు. ముదిరాజ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. 69 జీఓ ద్వారా జిల్లాలో రెండు పెద్ద రిజర్వాయర్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 15కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రహిమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వైస్చైర్మన్ కోనంగేరి హన్మంతు, మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీఏ మెంబర్ పోశల్ రాజేశ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
నారాయణపేట: విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వీరమరణం పొందిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకునేందుకు గాను గురువారం నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ డా.వినీత్ బుధవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 23న పోలీస్స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి.. విద్యార్థులకు పోలీసుల పనితీరు, విధులు తదితర విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 24న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పౌరులకు షార్ట్ ఫిలీమ్స్, ఫొటోగ్రఫీ కాంపిటీషన్ (పోలీస్ సేవలపై) నిర్వహించి.. 25న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలన్నారు. 26న పబ్లిక్ ప్రదేశాల్లో మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శనలు, పోలీసు కళాబృందం ద్వారా సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 27, 28 తేదీల్లో పోలీసు అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రత్యేక ప్రజల ఫెల్ట్ నీడ్స్ సేకరణ, దేశభక్తిని పెంపొందించడం వంటివి నిర్వహించాలన్నారు. 29న జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించడం, 30న సైకిల్ ర్యాలీ, 31న రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు జిల్లా మహాసభలు నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ ఫంక్షన్హాల్లో గురువారం ఆశావర్కర్ల యూనియన్ మహాసభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాలరాం, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి తెలిపారు. బుధవారం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన మేరకు ఆశావర్కర్లకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వడంతో పాటు పనిభారం తగ్గించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా మహాసభల్లో ఆశావర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. మార్కెట్ కళకళ..ధాన్యం సీజన్ ప్రారంభం దేవరకద్ర/జడ్చర్ల: ధాన్యం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు కళకళలాడుతున్నాయి. వానాకాలం పంట కింద సాగు చేసిన వరి కోత దశకు రావడంతో చాలామంది రైతులు కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట రికార్డు స్థాయిలో సాగైంది. ఒక్క కోయిల్సాగర్ ఆయకట్టు కింద దాదాపు 40 వేల ఎకరాల వరి సాగుచేశారు. అలాగే చెరువులు, బావుల కింద అదనంగా వరి పంట వేశారు. దిగుబడులు కూడా బాగా వస్తుండడంతో మార్కెట్లో సీజన్ జోరుగా సాగే అవకాశం ఉంది. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,079గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,757గా ధరలు నమోదయ్యాయి. ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,804, కనిష్టంగా రూ.5,779గా ధరలు పలికాయి. మార్కెట్కు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,521 ధరలు లభించాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,041, కనిష్టంగా రూ.1,600, వేరుశనగ రూ.4,331 ధరలు పలికాయి. -
బోధన.. పరిశీలన
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాడమిక్ పర్యవేక్షణ కోసం జిల్లాస్థాయిలో సీనియర్ ఉపాధ్యాయులతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా స్కూళ్లకు సంఖ్య ఆధారంగా ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నెలాఖరు నుంచి తనిఖీలు ప్రారంభించనున్నాయి. తనిఖీల్లో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారనేది ప్రధానంగా పరిశీలించనున్నారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను అదేరోజు ఉపాధ్యాయులకు వివరించి సరిదిద్దుకునేలా సూచనలు చేయనున్నారు. ఆయా బృందాలు మూడు నెలల్లో 100 స్కూళ్లను తనిఖీ చేసి ప్రతి నెల 5వ తేదీలోపు నివేదికను జిల్లా విద్యాధికారికి అందజేయాల్సి ఉంటుంది. అలాగే తనిఖీ నివేదికను రోజువారీగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. ప్రతినెల నివేదికలు.. ప్రత్యేక బృందాలు వారికి కేటాయించిన పాఠశాలలను సందర్శించి ప్రగతిని అంచనా వేస్తారు. గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ వినియోగం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పనితీరు తెలుసుకుంటారు. మధ్యాహ్న భోజనం అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు ఇతర మౌలిక వసతులను పరిశీలిస్తారు. ప్రతినెల 5న డీఈఓకు అప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాలతో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. స్వరూపం మార్చి.. వాస్తవానికి కమిటీలను గత మే నెలలోనే నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా. ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. అప్పట్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు కలిపి ఒకటే కమిటీని నియమించారు. స్కూల్ అసిస్టెంట్ను నోడల్ అధికారిగా నియమించడంతో విమర్శలు వచ్చాయి. జూనియర్ టీచర్లు సీనియర్లను, గెజిటెడ్ హెచ్ఎంలను ఎలా ప్రశ్నిస్తారని.. ఉత్తర్వులను విరమించుకోవాలని డిమాండ్ చేయడంతో విద్యాశాఖ వెనక్కి తగ్గింది. ఈసారి వేర్వేరుగా కమిటీలను నియమించింది.ఉపాధ్యాయులతోపాఠశాల పర్యవేక్షణ కమిటీలు కలెక్టర్ నేతృత్వంలో బృందాల ఏర్పాటు నెలాఖరు నుంచి తనిఖీలు వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు -
సమస్యలుపరిష్కరించుకుండా..
సర్కారు బడుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి, ఖాళీలు భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుంది. ఆ తర్వాత తనిఖీలు చేపడితే ప్రయోజనం ఉంటుంది. మరోవైపు తోటి ఉపాధ్యాయులు తనిఖీ అధికారులుగా రావడం ఇబ్బందిగా ఉంటుంది. తనిఖీలకు వెళ్లిన టీచర్ల స్కూళ్లలో బోధన కుంటుపడుతుంది. – శేర్ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, తపస్ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రస్తుతం జిల్లా, మండలస్థాయి విద్యాశాఖ అధికారులతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకంగా బడుల తనిఖీకి బృందాలను ఏర్పాటు చేయడం మరింత ప్రయోజనం చేకూరాలని ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లాలో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు కృషి చేస్తాం. – గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ● -
అమరుల త్యాగం స్ఫూర్తిదాయకం
● శాంతియుత సమాజం,శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యం ● కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట: సంఘ విద్రోహశక్తులతో పోరాడి మృతిచెందిన పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి కలెక్టర్తో పాటు ఎస్పీ డా. వినీత్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకంగా పని చేస్తోందన్నారు. మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమేనని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ఎలాంటి అవసరాలున్నా కలెక్టర్ కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. పోలీసు యోధులను స్మరించుకుందాం.. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు యోధుల త్యాగాలను స్మరించుకుందామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకొనే పండగల్ని సైతం త్యజిస్తారని.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి వీర మరణం పొందిన పోలీసుల త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యతన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం పాటిస్తోందని చెప్పారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుందనే దానికి మన రాష్ట్రమే నిదర్శనమన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో 191 మంది పోలీసులు అమరులయ్యారని చెప్పారు. అనంతరం జిల్లా పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీర సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా మీదుగా తిరిగి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పరేడ్ కమాండర్ ఆర్ఐ నర్సింహ, సీఐలు శివశంకర్, రాంలాల్, రాజేందర్రెడ్డి, సైదులు, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నరేష్, నవీద్, బాలరాజు, భాగ్యలక్ష్మిరెడ్డి, రమేష్, సునీత, అశోక్బాబు, ఆర్ఎస్ఐలు శివశంకర్, శిరీష, మద్దయ్య, శ్వేత, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వా«దీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వా«దీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
వందనం
వీరులారా.. ● ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్తూపం శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ●ఉమ్మడి పాలమూరులో మావోయిస్టుల తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 1990లో కోడేరు మండలం తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ బలయ్యాడు. 1991లో వంగూరు పోలీస్స్టేషన్పై దాడి చేయగా ఖాజాపాషా అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. అదే ఏడాది కొల్లాపూర్లోని ఓ హోటల్లో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. 1993లో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్నగర్ ఎస్పీ పరదేశినాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్ఐలు కిషోర్కుమార్, శివప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాణ్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. 1994లో తలకొండపల్లి పోలీస్స్టేషన్పై మావోయిస్టులు జరిపిన దాడులో ఫయోద్దీన్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. 1996లో కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీధర్రెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. 1997లో బల్మూర్లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ నక్సల్స్ తూటాలకు బలయ్యాడు. అదే ఏడాదిలో అమ్రాబాద్ పరిధి లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్లో వెళ్తున్న ఎస్ఐ మాల్సూర్, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్ అలీఖాన్ అనే కానిస్టేబుల్ మరణించాడు. 1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు. 2000 ఏడాదిలో కానిస్టేబుల్ హన్మనాయక్ను హతమార్చారు. 2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు. అదే ఏడాదిలో ఆమనగల్ సమీపంలోని కాటన్మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు. 2002లో మన్ననూర్ పండరీ అనే కానిస్టేబుల్ చంపేశారు. 2004లో కొల్లాపూర్ ఎమ్మెల్యే గన్మెన్గా ఉన్న హుమ్లానాయక్, వెంకట్రెడ్డిలను తుపాకీతో కాల్చిచంపారు. అదే ఏడాది అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్మేన్ సుగుణాకర్ను కాల్చిచంపారు. 2005లో బాలానగర్ ఎస్ఐని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరకు ప్రకాష్ అనే కానిస్టేబుల్ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్స్టేషన్ ఎదుట నిల్చొని ఉన్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖర్నాయక్లను మావోయిస్టులు కాల్చిచంపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్ఐ అహ్మద్ మోహియుద్దీన్ను పోలీస్స్టేషన్ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు. 2006లో కొండనాగులలో జహంగీర్ అనే హెడ్కానిస్టేబుల్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిస్తున్న జోష్బాబు అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమార్చారు. అదే ఏడాది కొల్లాపూర్ పరిధిలోని సింగోటం వద్ద రమేష్ అనే కానిస్టేబుల్ మావోల తూటాలకు బలయ్యాడు. -
మార్వాడీలకు ప్రత్యేకం..
రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా దీపావళి పండుగను నిర్వహించుకుంటాం. మా ముతాత్తలు 300 ఏళ్ల క్రితం నారాయణపేటకు వచ్చారు. ఇంటిల్లిపాది అందరం దీపావళి పండుగను ఆనందంగా జరుపుకొంటాం. లక్ష్మీనారాయణ భగవానుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటాం. – మురళీ భట్టడ్, నారాయణపేట రాజస్థాన్ మార్వాడీలకు దీపావళి పండుగ ఎంతో ప్రత్యేకం. దాదాపు 300 ఏళ్ల క్రితమే రాజస్థాన్ నుంచి మార్వాడీల కుటుంబాలు నారాయణపేటకు వ్యాపార నిమిత్తం వచ్చి స్థిరపడ్డారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం కొంత మంది హైదరాబాద్లో సైతం ఉంటున్నారు. ప్రస్తుతం పట్టణంలో 100కి పైగా రాజస్థాన్ కుటుంబాలు ఉన్నాయి. వారు రాజస్థాన్ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడేలా పండుగను ఇంటిల్లిపాది జరుపుకొంటారు. దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధందేరాసు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజు రూప్ చౌదాస్ వేడుకలు, సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదో రోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు. ప్రజల భద్రతే పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమని.. దీపావళి పర్వదినాన్ని బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఎస్పీ డా.వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో ప్రమాదరహితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా లైసెన్స్ పొందిన దుకాణదారుల వద్దే బాణాసంచా కొనుగోలు చేయాలని సూచించారు. పిల్లలు పెద్దల సమక్షంలో మండే వస్తువులకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పటాకులు కాల్చాలన్నారు. వెలగని క్రాకర్లను తిరిగి వెలిగించరాదన్నారు. జంతువులు లేదా మనుషుల వైపు పటాకులు విసరవద్దన్నారు. కర్టెన్లు, కాగితపు అలంకరణలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉంచాలన్నారు. వెలిగించిన దీపాలను గమనించకుండా వదిలి పెట్టరాదన్నారు. నాణ్యత కలిగిన విద్యుత్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని.. సాకెట్లను ఓవర్లోడ్ చేయరాదని తెలిపారు. అత్యవసర సమయంలో డయల్ 100, 101, 112 లేదా పోలీస్ కంట్రోల్రూమ్ 87126 70399 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని 108 రాష్ట్ర అధికారి బి.సుధాకర్ సూచించారు. ధ్వని అధికంగా వచ్చే టపాసులు కల్చకపోవడం మంచిదని.. శరీరానికి వదులుగా ఉండే నూలు దుస్తులు, కాళ్లకు చెప్పులు, కంటి అద్దాలు మాస్కు ధరించాలని తెలిపారు. ఈ దీపావళికి అత్యవసర పరిస్థితులు 5శాతం నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం అగ్ని ప్రమాదాలే కాకుండా యాక్సిడెంట్లు, విద్యుత్ షాక్, గర్భిణులకు పురిటినొప్పులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 బృందం రాష్ట్రవ్యాప్తంగా హాట్స్ స్పాట్ ప్రాంతాల్లో అంబులెన్స్లు సిద్ధంగా ఉంచి ఘటనా స్థలానికి వీలైనంత త్వరగా చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అత్యవసర సమయంలో 108 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివా రం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గు ర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల వద్ద ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించా రు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టు లో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లో పం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారు లు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ తెలిపారు. ఒక్కో లారీకి ప్రత్యేక రేటు కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బువసూలు తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
ధన్వాడ: రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ధన్వాడ మండలం కిష్టాపూర్లో దళిత రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 23 బోరుమోటార్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రూ. 418కోట్లతో చేపట్టనున్న కృష్ణా–వికారాబాద్ రైల్వేలైన్ నిర్మాణంతో నారాయణపేట ప్రజలకు రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందన్నారు. ఈ పనులను త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొడంగల్–పేట ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీటి వసతి కల్పించేందుకు భారీ ప్రాజెక్టును మంజూరుచేసిన సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో ఏ ఒక్కరికీ కూడా డబుల్బెడ్రూం ఇల్లు, రేషన్ కార్డులు మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే సొంతిల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ముందుగానే బేస్మెంట్ నిర్మించుకున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. కాగా, కిష్టాపూర్లో దళిత రైతులకు రూ. 24,51,800 వ్యయంతో 23 బోర్లను డ్రిల్లింగ్ చేయించి.. విద్యుత్ బోరుమోటార్లను బిగించినట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ ఖలీల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ సిందూజ, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి, మాజీ సర్పంచ్ దామోదర్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకట్రాములు, రాఘవేందర్రెడ్డి, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
మద్దూరులో ఆసక్తికర ఘటన
మద్దూరు: బీసీ బంద్ నేపథ్యంలో మద్దూరులో శనివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొదట కాంగ్రెస్, వామపక్ష నాయకులు కలిసి పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కొద్ది సేపటికి బీఆర్ఎస్ నాయకులు నివాదాలు చేస్తూ ఇదే పాతబస్టాండ్ చేరుకొని మరోవైపు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో బీజేపీ నాయకులు ధర్నాకు కూర్చున్నారు. ఈ మూడు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దిలేద ని బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపించగా, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రిజర్వేషన్ల అమలను అడ్డుకుంటుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒకానొక సయ మంలో మూడు పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేయడంలో పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను త్వరగా విరమించాలని సూచించారు. మొదట కాంగ్రెస్, వామపక్ష నాయకులు మాట్లాడి ధర్నా విరమించగా, తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నాయకులు దర్నాలను విరమించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాలో.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేసినా ధర్నాలో తమ పార్టీల స్వలాభం కోసం మాత్రమే వచ్చాయని అక్కడి వచ్చిన వారు మాట్లాడుకోవడం విశేషం. కార్యక్రమంలో 4 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బీసీ బంద్ ప్రశాంతం
నారాయణపేట: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్ నారాయపేట జిల్లాలో సంపూర్ణమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులు వేర్వేరుగా బంద్ చేయించారు. నారాయణపేట ఆర్టీసీ డిపో దగ్గరకు తెల్లవారుజామున అఖిలపక్షం నాయకులు చేరుకొని బస్సులు బయటికి రాకుండా గేట్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. పట్టణంలో విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. మక్తల్, కోస్గి, నర్వ, మరికల్, ధన్వాడ, ఊట్కూర్తోపాటు ఇతర మండలాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల జేఏసీ నాయకులు బంద్లో భాగస్వాములు అయ్యారు. ● జిల్లా కేంద్రంలో మార్కెట్ చైర్మన్ రాంపురం శివారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బంద్ను సంపూర్ణంగా చేపట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట బద్దంగా చేసిన సవరణలను చూసి తెలంగాణకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేయాలని ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు. ● బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేంచె శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ కులగలన సరిగా చేయకుండా బీసీలలో ముస్లింలను కలిపి పూర్తి తప్పులతో ఎలాంటి చిత్త శుద్ధి లేకుండా అడ్డగోలుగా బిల్లును తయారు చేసి గవర్నర్ కి పంపిందని విమర్శించారు. దాంతో న్యాయ స్థానాలతో చివాట్లు తింటూ.బీసీలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ డిపో వద్ద అఖిలపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆందోళన ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిన వైనం.. ప్రయాణికుల ఇబ్బందులు విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద బంద్ -
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి స్టేషన్ మహబూబ్నగర్: నారాయణపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం స్వయంగా సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా తీసుకున్నామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి శనివారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ అర్బన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందని, ఎవరూ ఎలాంటి అపోహలు లేకుండా అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ చేపట్టిందన్నారు. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ముందున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎవరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో, ఎవరు డీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందో గ్రహించి వారి పేరును ఏఐసీసీ పరిశీలకులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఏఐసీసీ పరిశీలకులు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధులు హర్షవర్ధన్రెడ్డి, జహీర్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో గొంతునొక్కే కుట్ర
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వంవేధింపులు మానుకోవాలి ● జిల్లాలో జర్నలిస్టుసంఘాల డిమాండ్ నారాయణపేట: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి గొంతునొక్కే కుట్ర చేస్తుందని.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాత్రికేయలోకం డిమాండ్ చేసింది. ఇటీవల కాలంలో ఏపీ కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్తోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులతోపాటు వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో పలువురు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సంస్థ కార్యాలయాల్లోకి చొరబడి నిర్బంధ విచారణ సాగించడం, తరచూ నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడొచ్చు
నారాయణపేట: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలతో ప్రత్యక్షంగా పనిచేస్తారు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి సిపిఆర్ పద్ధతులు తెలుసుకోవడం ఎంతో అవసరమని, సీపీఆర్ శిక్షణను సద్వినియం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసులకు సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్న్స్ హాల్లో లైఫ్ సేవర్ అసోసియేషన్ ఢిల్లీ వైద్య నిపుణుడు డాక్టర్ రాకేష్ సీపీఆర్ చేసే విధానంపై ప్రాక్టికల్గా జిల్లా పోలీసులకు అవగాహన కల్పించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లేలోపు గుండె సమస్య ఉన్న, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే వెళ్లేది పోలీసులు ఆ తర్వాత 108 సిబ్బంది అని, ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకుంటే తప్పకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్లం అవుతామని సూచించారు. అత్యవసర ప్రక్రియ.. డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది చాతీ కుదింపులతో కూడిన అత్యవసర ప్రక్రియ అన్నారు. ఇది తరచుగా కృత్రిమ వెంటిలేషన్న్తో ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి చర్యలు తీ సుకోబడుతుందని అన్నారు. డీఎంహెచ్ఓ జయ చంద్ర మోహన్, విజయ్ కుమార్,ఆర్ఐ నరసింహ, ఎస్సైలు నరేష్, పురుషోత్తం పాల్గొన్నారు. -
స్వేచ్ఛను హరిండచం తగదు
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికలపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్భందించడం, జర్నలిస్టుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తూ భయాభ్రాంతులకు గురిచేయడం తగదు. అనుకూలమైన వార్తలు రాయాలంటూ బెదిరించడం, మీడియాను తొక్కిపెట్టాలని ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. – అవుటి రాజశేఖర్, టెంజు, జిల్లా అధ్యక్షుడు కక్ష పూరిత విధానాలు సరికాదు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోంది. కక్షపూరితమైన విధానాలు కొనసాగిస్తోంది. తన తప్పులను వెలికితీసేందుకు ప్రయత్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తోంది. పత్రికా విలేకర్లపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడం.. దాడి చేయడం అమానూషం. భావప్రకటన స్వేచ్ఛకు సంకేళ్లు వేయడం సమాంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చను అడ్డుకోరాదు. – లొట్టి శ్రీను, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ● -
‘రెవెన్యూ’ దరఖాస్తులపరిశీలన వేగవంతం
మాగనూర్: రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన త్వరగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీను ఆదేశించారు.మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తహసీల్దార్ సురేష్కుమార్కు సూచించారు. అనంతరం కార్యాలయ రికార్డులను, కంప్యూటర్, రికార్డుల గది, రిజిస్ట్రేషన్ల గదిని పరిశీలించారు. కార్యాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. నేడు వాలీబాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఒరిజినల్ మెమో, బోనోఫైడ్తో ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరుకావాలని ఆమె కోరారు. 19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్ను సంప్రదించాలని సూచించారు. యోగాసన క్రీడాజట్ల ఎంపికలు ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్కు సంప్రదించాలని వారు సూచించారు. ఖాళీ సీట్ల భర్తీకిదరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని బాలానగర్, దేవరకద్ర, రాంరెడ్డి గూడెం, జడ్చర్ల, నంచర్ల గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోఆర్డినేటర్ వాణిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 18 లోగా ఆయా గురుకులల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. మొక్కజొన్న @ రూ.2,075 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 2,812 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.2,075, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,709, కనిష్టంగా రూ.5,629గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,789గా ఒకే ధర పలికింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిల్లో రూ.9 లక్షలు వెంటనే తన అకౌంట్లో జమ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పదవీ విరమణ చేసిన అనేకమంది రిటైర్మెంట్ లాభాలు, గ్రాట్యుటీ, పింఛన్, లీవ్ ఎన్క్యాష్మెంట్, జీపీఎఫ్ బెన్ఫిట్లను అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. -
ఎట్టకేలకు..!
● నేడు చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్న మంత్రులు ● జిల్లాలో 1.82 కోట్ల చేపలు వదలాలని లక్ష్యం ● వానాకాలం ముగియనుండడంతో సగమే విడుదల చేయనున్న వైనం ● జిల్లాలో 146 మత్స్య పారిశ్రామిక సంఘాలు..11,039 మంది సభ్యులు నారాయణపేట: మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. వర్షాకాలం ముగుస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మత్స్యకారులకు మత్స్యశాఖ తీపి కబురు అందించింది. శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరి తన నియోజకవర్గంలోని సంగంబండ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో చేపపిల్లల పంపిణీ చేపట్టాలనుకున్నా ఎన్నికల కోడ్ అమలులోకి రావడం.. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్పై హైకోర్టులో స్టే ఇవ్వడంతో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ను రద్దు చేయడంతో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు అవకాశం కలిగినట్లయింది. జిల్లాలో 13 మండలాల పరిధిలో 146 మత్స్య పారిశ్రామిక సంఘాలు.. 11,039 మంది సభ్యులు ఉన్నారు. సొసైటీల అధ్వర్యంలో చేపపిల్లలను పెంచి సభ్యులందరూ జీవనోపాధి పొందుతున్నారు. మూడు రిజర్వాయర్లు.. 642 చెరువులు జిల్లాలో 3 రిజర్వాయర్లు, 642 చెరువులు, కుంటలు ఉన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 1.82 కోట్ల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం ముందు లక్ష్యం నిర్దేశించగా సమయం మించిపోవడంతో గతేడాది మాదిరిగానే ఈ సారి సగమే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. 35–40 ఎంఎం చేప పిల్లలను సరఫరా చేస్తే లాభం లేదని భావించిన మత్స్యశాఖ 80–100 ఎంఎం చేప పిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో మంత్రులు వాకిటి శ్రీహరి, దమోదర రాజనర్సింహ పాల్గొననున్నారు. ఈమేరకు ఉదయం 9 గంటలకు సంగబండ రిజర్వాయర్లో, 10 గంటలకు మక్తల్ పెద్ద చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఉత్సాహంగా చదరంగం పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలో గురువా రం నిర్వహించిన చెస్ పోటీలు విజయవంతం అయ్యాయి. 69వ ఎస్జీఎఫ్ క్రీడల్లో భాగంగా జిల్లా స్థాయి అండర్ –14, అండర్ –17 బాలబాలికల చదరంగ పోటీలు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల కు చెందిన 120మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోటాపోటీగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పలువు రు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చరు. అండర్ –14 బాలికల విభాగం నుంచి ఐదుగురు, బాలుర విభాగం నుంచి ఐదుగురు, అండర్– 17 లో బాలికలు, బాలుర నుంచి ఐదుగురు చొప్పున ఎంపికయ్యారు. వీరు ఈనెల 18న వనపర్తిలో జరిగే ఉమ్మ డి మహబూబ్నగర్ స్థాయి పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ మాజీ సెక్రెటరీ నర్సిములు, పిడిలు రత్నయ్య, కథలప్ప, బాలరాజ్, వెంకటేష్, రామకృష్ణరెడ్డి, అక్త ర్, పర్వీన్, అనంత సేన, కృష్ణవేణి పిఈటిలు బసంత్ రెడ్డి, రాజేష్, చక్రి, మోహన్ పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు
మాగనూర్: ఇసుక రీచ్ యాజమానులు వాల్టా చట్టాన్ని అనుసరిస్తూ కూలీల సహాయంతో ఇసుక తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగులో ఇటాచీ, జేసీబీలను వినియోగించవద్దని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలతో పాటు రీచ్ అనుమతులు రద్దు చేయబడతాయని మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వర్కూర్, మాగనూర్ శివారులో ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న ఆన్లైన్ ఇసుక రీచ్లను ఆయన తనిఖీ చేశారు. కొందరు ప్రభుత్వ అనుమతులను బేఖాతారు చేస్తూ యంత్రాల సహాయంతో ఇసుక తరలిస్తున్నట్లు సీఎంఓకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈమేరకు రీచ్లను పరిశీలించడం జరిగిందన్నారు. అయితే ఇక్కడ కొన్ని రీచ్లకు దుబ్బ ఇసుక అనుమతులు ఉండటంతో పాటు ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహంతో రోడ్డు ధ్వంసం అవడంతో యంత్రాలను పనుల నిమిత్తం వినియోగించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాల్టా చట్టాన్ని అనుసరించాలని ఆదేశించారు. ఆయన వెంట టీజీఎండీసీ ఎస్ఆర్వో శివారెడ్డి, మాగనూర్ ఎస్ఆర్ఏలు నర్సింహ, మనోజ్ ఉన్నారు. -
సీపీఆర్తో ప్రాణాలు కాపాడొచ్చు
నారాయణపేట: గుండెపోటుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని, సీపీఆర్ విధానంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులకు ఎంఎల్హెచ్పీలకు సీపీఆర్పై వేర్వేరుగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సీపీఆర్ చేయడం, నేర్చుకోవడం వల్ల గుండెపోటుతో కారణంగా ఆగిపోయిన గుండెల్లో రక్తప్రసరణను మళ్లీ పెంపొందించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను ఉపయోగించుకోవాలని సూచించారు. సీపీఆర్ చేయడం నేర్చుకొని సగటు వ్యక్తి ప్రాణాన్ని కాపాడడానికి కృషి చేయాలని ఆరోగ్య శాఖలోని సిబ్బంది మాత్రమే కాకుండా సగటు మనిషి ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చని చెప్పారు. మహబూబ్నగర్ నుంచి వచ్చిన ఎంఐసీయూ డాక్టర్ రఘురెడ్డి సిపిఆర్పై శిక్షణ ఇచ్చారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులు పర్యవేక్షకులకు, ఎమ్ఎల్హెచ్పిలకు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, ప్రోగ్రామ్ అధికారి సత్య ప్రకాష్, ఎన్సీడి కోఆర్డినేటర్ విజయ్ కుమార్, అరవింద్ కుమార్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి
ధన్వాడ: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు వేతనాలు చెల్లించడం లేదని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు నీరటి రాఘవేందర్నాయుడు వాపోయారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీ ఆవరణలో సమగ్రశిక్ష ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తమకు కూడా వేతనాలు చెల్లించి సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా నాయకులు వెంకట్రాములు, నారాయణచారి, గంగమ్మ, ఎస్ఓ జయేంద్ర, లావణ్య, రఫియా, శివమ్మ, శ్రావణి, అంజమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లానే లక్ష్యం
● సివిల్ తగదాల్లో పొలీసుల జోక్యం ఉండొద్దు ● మీడియా చిట్చాట్లో ఎస్పీ డాక్టర్ వినీత్ నారాయణపేట: ‘డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ – డ్రగ్స్ ఫ్రీ నారాయణపేట’ లక్ష్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్శాఖ కట్టుబడి ఉందన్నారు. కమ్యూనల్ గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సివిల్ తగాదాల్లో పోలీసు జోక్యం లేకుండా న్యాయపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి జిల్లాలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా సిబ్బంది నియామకం చేయడంతో పాటు నూతన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాత్రి పూట పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో శాశ్వత బోర్డర్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా చట్టవిరుద్ధ రవాణాను నియంత్రిస్తామని పేర్కొన్నారు. డయల్ యువర్ ఎస్పీ జిల్లాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం చేపడుతామని, జిల్లా పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి త్వరలో క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు పోలీసు విభాగానికి సహకరించాలని, ఏవైనా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే 100 నంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలు, యువతులు పడుతున్న ఇబ్బందులు, ప్రధాన చౌరస్తాలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలను విలేకరులు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దుకాణాల ఎదుట ఉన్న ఫుట్పాత్ల యజమానులు సామగ్రి పెడుతుండడంతో వాహనదారులు, పాదాచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. పలు చాయ్ సెంటర్లలో పొగ తాగడం, గంజాయి గుంజుతున్నట్లు తెలుస్తోందని ఎస్పీ దృష్టికి తెచ్చారు. అయితే ఏదైనా సమాచారం ఇస్తే పోలీసు అధికారులు, సిబ్బంది తమ పేర్లు బయటపెడుతున్నరని, అందుకే ఎవరై నా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని ఎస్పీకి తెలియజేశారు. ఇందుకు స్పందించిన ఎస్పీ వాటన్నింటిని నోట్ చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగిన తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని భరోసానిచ్చారు. -
‘కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ’
కోస్గి రూరల్: కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసి, దిగువ స్థాయి నుంచి కష్టపడిన కార్యకర్తలకే పదవులు వరిస్తాయని ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలకు చెందిన అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్ అధ్యక్షులు, మహిళాధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడుతూ సంఘటన సృజన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని వారి అభీష్టం మేరకు డీసీసీ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసి నివేదికను ఏఐసీసీకి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఉజ్మాజాకీర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, టౌన్ అధ్యక్షుడు తుడుం, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, బాలేష్, మాస్టర్ శ్రీనివాస్, భానునాయక్, బాల్రాజ్ తదితరులు ఉన్నారు. -
టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి
నారాయణపేట: పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాహర్పేటలో బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకం కింద రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు జనగామ, నాగర్కర్నూల్, గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాను ఎంపిక చేసిందని గుర్తు చేశారు. అయితే పథకంలో పశుసంవర్ధక, డైరీ, ఫిషరీస్తో పాటు 11 వ్యవసాయ అనుబంధ శాఖల్లోని పారామీటర్ల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అందులో భాగంగానే పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు లక్ష డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని, అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా పశువైద్యాధికారి బి.ఈశ్వర్రెడ్డి, వైద్యాధికారులు అనిరుధ్చారి, రాఘవేంద్రగౌడ్, శ్రీనివాస్, బీకేఎస్ జోనల్ కార్యదర్శి వెంకోభ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టు ఆవరణలోని జడ్జి కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లా జడ్జి ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపి, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, న్యాయ–పోలీసు వ్యవస్థల మధ్య సమన్వయం, కేసులు త్వరితగతిన పరిష్కారంపై తదితర విషయాలపై చర్చించారు. దరఖాస్తుల ఆహ్వానం ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో అవర్ బేస్డ్ టీచర్స్ (గెస్ట్ ఫ్యాకల్టీ) కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జీ ప్రిన్సిపాల్ వైశ్యాలి సూచించారు. పీజీటీ కామర్స్ 1, టీజీటీ ఇంగ్లిష్ 1 పోస్టుకు దరఖాస్తు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎంకామ్ కామర్స్, బీఈడీ, ఎంఏ ఇంగ్లిష్ అర్హత కలిగిన వారు ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు తెలంగాణ మోడల్ పాఠశాలలో దరఖాస్తు సమర్పించాలని, ఇంటర్ూయ్వలకు హాజరు కావాలన్నారు. రష్యా ఎకనామిక్ సమ్మిట్లో మరికల్ అడ్వకేట్ మరికల్: భారత్, రష్యా, ఉబ్జెకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమానికి మరికల్కు చెందిన అడ్వకేట్ అయ్యప్ప హాజరయ్యారు. రష్యాలోని మాస్కో నగరంలో జరిగిన కార్యక్రమంలో భారత్ నుంచి 20 మంది బృందం పాల్గొనగా.. వారు విద్య, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమం గురించి ప్రసగించారు. బంగారు ఆభరణాల తయారీ కార్మికులు రష్యాలో అవసరం ఉన్నందున ఇక్కడికి వచ్చే భారతదేశ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రష్యా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సూచించినట్లు తెలిపారు. నవంబర్ 16న భగవద్గీత పోటీలు నర్వ: నవంబర్ 16న జిల్లా స్థాయి భగవద్గీత శ్లోక, కంఠస్థ, పఠన, భావ విశ్లేషణ పోటీలు నర్వ గీతభారతి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు మండల కన్వీనర్ నరేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు. మొదటి గ్రూప్ 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము. రెండో గ్రూప్లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము. మూడో గ్రూప్లో 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల వారికి నిత్య జీవితంలో భగవద్గీత భావ విశ్లేషణ పోటీలు ఉంటాయన్నారు. విజేతలైన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామన్నారు. విద్యార్థులు, వయోజనులు, అర్హత కలిగిన ధార్కివేత్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్ఠు రహిత సమాజం నిర్మిద్దాం ధన్వాడ: కుష్ఠు రహిత సమాజం కోసం వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర బృంద సభ్యుడు జీఎంఓ డాక్టర్ సంపత్ అన్నారు. బుధవారం కుష్ఠు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసిబ్బందికి అవగాహన కల్పించారు. కుష్ఠు వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, ఎండీటీ మాత్రలు అందజేసి చికిత్స అందించాలన్నారు. కుష్ఠువాద్యి కోసం నిర్వహిస్తున్న ఎల్సీడీసీ సర్వే గురించి వివరించారు. అనంతరం ఆస్పత్రిలోని రికార్డులను పరిశిలించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారులు డిప్యూటీ పీఎంఓ వెంకటేశ్వరచారి, సకలరెడ్డి, సురేందర్, శ్రీనివాస్, డాక్టర్ అనుష, సాయిసింధురాజ, కథలప్ప, ఆశమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అల్పాహారం అందించాలి
అదనపు తరగతులు నిర్వహిస్తుండడంతో సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వెళ్తున్నాం. ఆకలిగా ఉండడంతో ప్రభుత్వం, దాతలు సహకరించి అల్పాహారం, స్నాక్స్ అందిస్తే బాగుంటుంది. – కృష్ణవేణి, విద్యార్థిని, షేర్నపల్లి ప్రత్యేక తరగతులు ఉపయోగకరం రెగ్యులర్ తరగతుల్లో బోధించిన విషయాలను నివృత్తి చేయడానికి సాయంత్రం వేళలో నిర్వహించే అదనపు తరగతులు ఎంతో ఉపకరిస్తున్నాయి. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించడానికి ఆస్కారం ఉంది. అభ్యాస దీపికలు విద్యార్థులకు మరింత తోడ్పాటుగా ఉన్నాయి. – శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, నిడ్జింత జెడ్పీ స్కూల్ మెరుగైన ఫలితాల సాధనకు కృషి టెన్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. అభ్యాస దీపికలు వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. 100 శాతం ఫలితాలే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా సర్దుబాటు చేశాం. పిల్లల్లో భయాన్ని పోగొట్టి పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. – గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట ● -
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. బాలికలు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువు మధ్యలో మానకూడదన్నారు. బాల్య వివాహాలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాజంలో సీ్త్ర పాత్ర చాలా కీలకమని, యువకుల చేతిలో ప్రేమ పేరుతో మోసపోరాదని, పెళ్లి విషయంలో అన్ని ఆలోచించి ముందడుగు వేయాలన్నారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ 1098 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీపతి, నందు నామాజీ, తిరుపతయ్య, పోలీస్ అధికారులు బాలస్వామి, రూపిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నారాయణపేట: జిల్లా నూతన ఎస్పీ డాక్టర్ వినీత్ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆకుల బాలప్ప, మేనుశ్రీ, ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థ మధ్య సత్సంబంధాలు కొనసాగి కేసులు త్వరితగతిన పరిష్కారం కావడంలో సమన్వయం కీలకమన్నారు. న్యాయ వ్యవస్థలో పీపీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, వారితో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. మిమిక్రీ పోటీలో విద్యార్థి ప్రతిభ మరికల్: మండలంలోని లాలోకోట చౌరస్తాలో ఉన్న గ్లోబల్ స్కూల్ విద్యార్థి సాయి త్రినయన్ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి టాలెంట్ ఫెస్ట్ మిమిక్రీ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి అందుకున్నాడు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఈ పోటీలో విద్యార్థి అసమాన ప్రతిభ చాటడంతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి వచ్చినట్లు కరస్పాడెంట్ పల్లె జైపాల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అదుకున్నాడు. చౌడేశ్వరిదేవి అఖండ జ్యోతి ఉత్సవాలు కోస్గి: తోగుట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరీ దేవి అఖండ జ్యోతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇసుకబావి సమీపంలో వెలసిన అమ్మవారి ఆలయం నుంచి చౌడేశ్వరీ దేవి అఖండ జ్యోతులను పట్టణంలోని పుర వీధుల గుండా ఊరేగింపు ప్రత్యేక వస్త్రాలంకారణ చేపట్టి ఆటపాటలు, నృత్యాలతో ఆలయానికి చేర్చుతారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం, మహామంగళహరతి, భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో వెంకటేష్, శశిధర్, అజయ్కుమార్, శ్రీనివాస్, బాల్రాజ్, నర్సిములు, లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, శాంతికుమార్ తదితరులు ఉన్నారు. -
31 వరకునమోదు చేసుకోండి
జాతీయ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలు ఈ నెల 31 లోపు ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కు వగా ఉంది. ఆయా మండలాల్లో ఏపీఓలపై నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాం. ఉపాధి కూలీలకు గ్రామాల్లో గడువులోపు ఈకైవెసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. ఉపాఽధి కూలీల హాజరులో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకత కోసం ఈ కేవైసీ చేయించడం ఎంతో ప్రయోజనకరం. – మొగులయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ● -
కొనసాగుతున్న మద్యం టెండర్ల దాఖలు
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణ కొనసాగుతుంది. మొత్తం 227 ఏ4 దుకాణాలకు గాను గత నెల 26 నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించగా.. ఇప్పటి వరకు 508 టెండర్లు వచ్చాయి. ఇందులో మంగళవారం 53 దరఖాస్తులు వచ్చాయి. కాగా.. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.15.24 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి భారీ మొత్తంలో టెండర్లు వేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్వల్పంగా వేసిన వ్యాపారులు రాబోయే మూడు రోజుల్లో భారీగా వేయడానికి సిద్ధపడుతున్నారు. -
కష్టపడిన కార్యకర్తలకే పదవులు
● ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి మక్తల్/నర్వ: కాంగ్రెస్లో కష్టపడిన కార్యకర్తలకే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి అన్నారు. మంగళవారం పట్టణంలోని మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. సంఘటన సృజన్ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాల తెలుసుకొని, వారి అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసి నివేదికను 22న ఏఐసీసీకి అందజేస్తామన్నారు. జిల్లాలోని మూడు రోజుల పాటు పర్యటించి కార్యకర్తలను అభిప్రాయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీసీసీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాహుల్గాంధీ పాదయాత్రలో ప్రజల సమస్యలను లోతు గా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, సిదార్థరెడ్డి, పోలీస్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణే ష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నా యి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తు న్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పో టీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ● -
సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలి
నారాయణపేట: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని మంగళవారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ డాక్టర్ రవీందర్నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్తో కలిసి జాతీయ కార్యక్రమాల ప్రగతిని తెలుసుకొని, కార్యాలయంలో కలిసి ప్రోగాం అధికారుల నివేదికలను సమీక్షించారు. జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐహెచ్ఐపీ పోర్టల్లో ఎనరల్ చేసి డైలీ రిపోర్ట్ ఎంట్రీ అయ్యేలా చూడాలని ఆయన సూచించారు. అంతకుముందు మరికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, కాన్పు గదులు, స్టోర్ రూం, ల్యాబ్, పేషెంట్ అడ్మిషన్ వార్డులను పరిశీలించారు. అదే విధంగా వైద్యాధికారి రాఘవేందర్రెడ్డి, డాక్టర్ శ్రావణ్, సిబ్బందితో అన్ని జాతీయ కార్యక్రమాలు నివేదికలను పరిశీలించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ డేటా ఒకే విధంగా ఉండాలని సూచించారు. వార్డులో ఉన్న రోగులతో మాట్లాడి సిబ్బంది ద్వారా అందే సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆస్పత్రి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సత్యప్రకాష్ రెడ్డి, సుధీష్ణ, డీపీఓ బిక్షపతి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆటలకు అందలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2 వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టీపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు సింథటిక్ ట్రాక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోర్టు నిర్మాణంతో ప్రయోజనం ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు -
భవిష్యత్కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ● స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ● ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. -
యువతకు జీవితం..
నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు. పీయూ 4వ స్నాత కోత్సవం జరపుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంది యువతకు జీవితాన్ని ఇచ్చింది. – పరమేశ్వర్గౌడ్, ఎకై ్సజ్ సీఐ, పటాన్చెరు స్థిరపడేందుకు ప్రోత్సాహం.. పీయూలో చదువుకునేందు కు, పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేందుకు చక్కటి వాతావ రణం ఉంది. అక్కడ లైబ్రరీ, స్టడీహాల్, కంప్యూటర్ ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధ్యాపకు లు స్నేహపూర్వకంగా ఉంటూ అన్ని సందేహాలను నివృత్తి చేసి, ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. – అనిల్కుమార్, పీజీటీ, బీసీ గురుకులం, జూబ్లీహిల్స్ అధికారుల సహకారంతో.. పీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీజీ వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగా లు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. అందుకోసం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాం. అందుకోసం యూనివర్సిటీ అధికారులు సైతం ఎంతో సహకరించారు. – భూమయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్, పీయూ సదుపాయాలు బాగున్నాయి.. పీయూలో 2013– 15 బ్యాచ్ లో నేను ఎంఎస్డబ్ల్యూ చదివాను. ఈ క్రమంలో అప్పటికే లైబ్రరీలు, స్టడీ హాల్ వంటి సదుపాయాలు బాగానే ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యాపకులు, అధికారులు ఎంతో ప్రోత్సహించడంతో పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకున్నాం. దీంతో పీజీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డాను. – మల్లేష్, జూనియర్ లెక్చరర్, వనపర్తి కళాశాల ● -
భూ భారతి అర్జీలు పెండింగ్లో ఉండొద్దు
నారాయణపేట: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి.. భూ భారతి దరఖాస్తులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ, సాదాబైనామాలు, భారత్మాల ఆక్విటెన్స్, నిషేధిత భూముల జాబితా తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రామచందర్ నాయక్ ఉన్నారు. ● బాల్యవివాహాలు లేని జిల్లాగా నారాయణపేటను మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్లో భాగంగా యాక్సెస్ టు జస్టిస్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ భాగస్వామ్యంతో.. మహిళా, శిశు సంక్షేమశాఖ సమన్వయంతో విజన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ రూపొందించిన ప్రచార బోర్డులను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రజావాణికి 21 ఫిర్యాదులు.. అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ నేరుగా మా ట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 21 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్ శ్రీరాం ప్రణీత్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, విజన్ ఎన్జీఓ సమన్వయకర్త రవికుమార్, జిల్లా ప్రాజెక్టు అసోసియేట్ నరేశ్, రమేశ్, స్వప్న పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● ఎస్పీ డా.వినీత్ నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. పాత నేరస్తులు, రౌడీ షీటర్స్, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలని ఎస్పీ డా.వినీత్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్స్టేషన్ల వారీగా 5 ఏళ్ల కాలంలో జరిగిన నేరాలు, చోరీలు, ఇతర ఘటనలతో పాటు రోజు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి.. ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారనే వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా కేసులు నమోదు చేయాలన్నారు. తదుపరి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా జిల్లాలో చోరీలు, ప్రాపర్టీ రికవరీ కేసులను త్వరగా ఛేదించాలన్నారు. కేసుల పెండింగ్ పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో రాత్రివేళ పెట్రోలింగ్ పెంచాలని.. పగటి వేళ పబ్లిక్ సంచరించే ప్రదేశాల్లో విసబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ గ్రామాల్లో పర్యటిస్తూ తగిన సమాచారం సేకరించాలన్నారు. ఎస్ఐలు ప్రజలతో మమేకమవుతూ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించాలని ఎస్పీ వినీత్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై నాలుగు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేశ్, ఆర్ఐ నర్సింహ, సీఐలు శివశంకర్, రాంలాల్, సైదులు, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, విజయ్కుమార్, బాలరాజు, రాము, సురేశ్, నవీద్, అశోక్బాబు, సునీత, రమేశ్, గాయత్రి, మహేశ్వరి తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలసిన ఎస్పీ నారాయణపేట: జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డా.వినీత్ సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదే విధంగా శాఖాపరమైన అంశాలపై వారు చర్చించారు. -
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో ఐదు రోజుల వ్యవధిలో టెండర్లు ఏ స్థాయిలో పెరుగుతాయి అనే టెన్షన్లో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ కూడా చివరి ఐదు రోజుల్లో దరఖాస్తులు అమాంతం పెరిగిన సందర్భాలు ఉండగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న దుకాణాలకు మొత్తం 1,308 టెండర్లు రాగా.. ఇందులో చివరి మూడు రోజుల్లోనే 1,123 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన రోజుల్లో వచ్చినవి కేవలం 200లోపే.. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 14 సర్కిళ్ల పరిధిలో ఉన్న సీఐలు టెండర్లు పెంచుకోవడానికి కావాల్సిన కసరత్తు సైతం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు 455 టెండర్లు దాఖలు అత్యధికంగా పాలమూరులో, అత్యల్పంగా వనపర్తిలో.. చివరి మూడు రోజుల్లోజోరందుకుంటాయని ఆశాభావం -
కార్యకర్తల అభిప్రాయం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణ్ స్వామి అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికపై సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షకీర్తో కలిసి ఆయన జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో బ్లాక్–1, మరికల్లో బ్లాక్–2 సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ పదవికి పోటీచేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరికల్ మండలం తీలేర్కు చెందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, నారాయణపేట మండలంలో యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షుడు యూసుఫ్ తాజ్ దరఖాస్తు చేసుకోగా.. ఏఐసీసీ పరిశీలకుడు నారాయణ్ స్వామి ముఖ్య నాయకులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా దామరగిద్ద, నారాయణపేట పట్టణం, మండలం, ధన్వాడ, మరికల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, నాయకులు అభ్యర్థి కోట్ల రవీందర్రెడ్డిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అయితే మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో మంగళవారం, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మద్దూర్ మండలాల్లో బుధవారం జరిగే కార్యకర్తల సమావేశాల్లో ఇంకా ఎవరెవరు దరఖాస్తు చేసుకుంటారో, ఎవరి పేర్లను ప్రతిపాదిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
పరిశోధనలకు పట్టం
పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ ● స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు ● పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ ● గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన పాలమూరు యూనివర్సిటీ (పీయూ) సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటోంది. అన్ని డిపార్ట్మెంట్లలో నాణ్యమైన విద్య అందిస్తూ.. మరోవైపు పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చి ఎంతోమంది యువత భవితకు బంగారు బాటలు వేస్తుంది. ఈ యూనివర్సిటీలో అంచెలంచెలుగా వివిధ కోర్సులు అందుబాటులోకి తీసుకురాగా.. పీహెచ్డీలకు కేంద్రంగా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 16న నిర్వహించనున్న పీయూ నాలుగో స్నాతకోత్సవంలో ఏకంగా 12 మంది పీహెచ్డీ పట్టా పొందనుండడం గమనార్హం. పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌవర డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌవర డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. -
నవసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
నారాయణపేట టౌన్: నవసమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్న 3వ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా డా.నగేశ్ను ఆదివారం స్థానిక భగత్సింగ్ భవన్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో అసమానతలతో కూడిన విద్యా విధానానికి వ్యతిరేకంగా కామ్రేడ్ జార్జిరెడ్డి స్థాపించిన పీడీఎస్యూ 50 ఏళ్లుగా అనేక సమస్యలపై పోరాడుతుందన్నారు. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు అందరికీ కామన్ విద్యా విధానం, శాసీ్త్రయ విద్యా విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో నిర్వహించే జిల్లా మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాలేశ్వర్, బోయిన్పల్లి రాము, రామకృష్ణ, శారద, అజయ్, గౌస్, వెంకటేశ్, మహేష్ ఉన్నారు. దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలి నారాయణపేట: దేశ సంరక్షణకు యువత నడుం బిగించాలని హిందూవాహిని తెలంగాణ రాష్ట్ర మంత్రి యాదిరెడ్డి బిజ్వర్ గురూజీ శక్తి పరాశ్రీ పిలుపునిచ్చారు. నారాయణపేట మండలం జాజాపూర్లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సేవకులు పద సంచలన్ చేపట్టగా.. ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో యాదిరెడ్డి బిజ్వర్ గురూజీ శక్తి పరాశ్రీ మాట్లాడారు. దేశం, ధర్మం కోసం పాటుపడే వారందరినీ ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తుందన్నారు. స్వయం సేవకుల కృషితో హిందువుల్లో సంఘటిత శక్తి నెలకొంటుందని.. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ఊట్కూర్ మండలశాఖ స్వయం సేవకులు పాల్గొన్నారు. రామన్పాడులో 1,020 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో ఆదివారం 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి జలాశయానికి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచినట్లు వివరించారు. రామన్పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూ సెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
‘చేయి’ తడపాల్సిందే!
ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ● ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ ● పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు ● తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ● ఆందోళనలో లబ్ధిదారులు.. సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. ఇవ్వాల్సిందే.. లేదంటే నడవనివ్వం ‘ఇందిరమ్మ ఇంటికై నా.. ఇతర అవసరాలకై నా.. ఏదైనా సరే.. పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఒక్కో టిప్పర్కు రూ.6 వేలు చెల్లించాల్సిందే’నని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ ‘అధికార’ నేత తేల్చిచెప్పడంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తుమ్మిళ్ల రీచ్ వద్దకు అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ వాహనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేత నుంచి పర్సంటేజీ ఇవ్వని పక్షంలో ఒక్క వాహనాన్ని కూడా తిరగనిచ్చేది లేదంటూ సదరు కాంట్రాక్టర్కు వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. డ్రైవర్ల ఆందోళన.. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. పండ్ల తొక్కలు డీగ్రేషన్ చేయడం, పొల్యూషన్ ఉండకుండా ఉండే విధంగా, ఫ్రూట్జ్యూస్ కు సంబందించి క్లాసిఫికేషన్ పై పరిశోధన చేశాం. అందుకోసం గైడ్ టీచర్ మధుసూదన్రెడ్డి ఇతర అధికారులు ఎంతో సహకరించారు. అందుకు ప్రతి ఫలంగా కాన్వకేషన్లో డాక్టరేట్ అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తు పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేస్తాం. – ఏ.చేతన, పీహెచ్డీ గ్రహీత ఫిజిక్స్ విభాగంలో వాటర్సాలబుల్ రీఏజెంట్స్ పై పరిశోధన పూర్తి చేశాం. దానికి పేటెంట్ కూడా వచ్చింది. పరిశోధన పూర్తి చేయడానికి మా గైడ్ చంద్రకిరణ్తో పాటు అధికారులు అందరు ఎంతో సహకరించారు. పరిశోధన పూర్తి అయిన వెంటనే కాన్వకేషన్ నిర్వహించి డాక్టరేట్లు అందించడం చాలా సంతోషంగా ఉంది. – స్వాతి, పీహెచ్డీ గ్రహీత ●ప్రస్తుతం కాన్వకేషన్లో ఇద్దరు మా స్కాలర్స్ డాక్టరేట్ తీసుకుంటున్నారు. సమాజ హితం కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి వచ్చే అంశాలపై పరిశోధనలు చేశాం. అందుకోసం పేటెంట్లు సైతం వచ్చాయి. భవిష్యత్ ప్రయోగాలు కూడా ప్రజలకు ఉపయోగ పడే విధంగా నిర్వహిస్తాం. – ఎన్.చంద్రకిరణ్, అధ్యాపకుడు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ పీయూలో ఇటీవల వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఎక్కువ సంఖ్యలో రీసెర్చి స్కాలర్స్ రావడం గొప్ప విషయం. ఇద్దరు స్కాలర్స్ మా ఆధ్వర్యంలో రీసెర్చి పూర్తి చేశారు. వారి పరిశోధనలు పూర్తిగా సమాజం, ప్రజల అవసరాలను తీర్చే విధంగా జరిగాయి. వారికి కాన్వకేషన్లో డాక్టరేట్లను ప్రదానం చేయడం గొప్ప విషయం. – మధుసూదన్రెడ్డి, అధ్యాపకుడు మైక్రోబయాలజీ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. -
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణంతో పాటు శ్రీపడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు రూ. 153 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూ. 833.50 కోట్లు మంజూరైనట్లు వివరించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. కాగా, పడమటి ఆంజనేయస్వామి జాతర నాటికి కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ చైర్మన్ ప్రాణేశ్కుమార్, ఈఓ సుందరాచారి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్గౌడ్, నాగరాజు, గోవర్ధన్, దండు రాము, శ్రీనివాసులు, తాయప్ప, రవికుమార్, సురేశ్ పాల్గొన్నారు. -
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
అభిప్రాయంతోనేడీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతోనే డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ నారాయణస్వామి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల సీనియర్ నాయకులతో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకొని ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందజేస్తామన్నారు. 13, 14, 15 తేదీల్లో జిల్లా కేంద్రంలోనే ఉండి గ్రూపులు, వ్యక్తిగతంగా పార్టీలోని అందరి అభిప్రాయలు సేకరిస్తామన్నారు. డీసీసీ ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పార్టీ పునర్నిర్మాణ దిశగా ముందడుగు వేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు తప్పకుండా పదవులు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర మత్స్య సహకార శాఖ అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన అతి సామాన్య కుటుంబానికి చెందిన తనను సీఎం రేవంత్రెడ్డి గుర్తించి అతి చిన్న వయస్సులో రాష్ట్ర చైర్మన్ పదవి కట్టబెట్టారన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ ఆర్ శివారెడ్డి, పోషల్ రాజేష్కుమార్, మధుసూదన్రెడ్డి, ప్రసన్నరెడ్డి, ఎండీ సలీం, బండి వేణుగోపాల్, సరాఫ్నాగరాజు, సుధాకర్, మనోహర్గౌడ్ పాల్గొన్నారు. ‘హిందుత్వం జీవన విధానం’ నారాయణపేట టౌన్: హిందుత్వం జీవన విధానమని, సనాతన ధర్మంతో విశ్వశాంతి చేకూరుతుందనిసంస్కార భారతి ప్రాంత సహ కార్యదర్శి చక్రవర్తి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన పథ సంచలన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయినా సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం సాయత్రం 4.30 గంటలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనిఫాం ధరించి జిల్లా కేంద్రంలోని పరిమళపూర్ హనుమాన్ మందిరం నుంచి కవాతు ప్రారంభించి సరాఫ్ బజార్, సెంటర్ చౌక్, సుభాస్ రోడ్, వీరసావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగించి శ్రీగార్డెన్కు చేరుకున్నారు. సంఘ్ సేవకులు చేసిన కవాతు చూపరులను ఆకట్టుకుంది. ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పట్టణ యువత పూలతో అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి సరోదే, నగర సంఘ చాలక్ డాక్టర్ మదన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు
పీయూలో కొత్త పుంతలు తొక్కుతున్న పరిపాలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఆటుపోట్లను దాటుకుంటూ.. ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ వినూత్నంగా ముందుకెళ్తోంది. ప్రస్తుత వైస్ చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పీయూలో పరిపాలన కొత్త పుంతలు తొక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సమర్థ్ స్కీం పోర్టల్ ద్వారా సిబ్బందికి ఆన్లైన్ అటెండెన్స్, వర్క్లోడ్, పే స్లిప్ల వంటివి అందిస్తున్నారు. వీటితోపాటు పీయూలో వినియోగిస్తున్న నీటి పునర్వినియోగం కోసం నూతనంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ భవనంపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ను ఆదా చేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యం అవుతున్నారు. సమర్థ్ పోర్టల్తో సేవలు.. పీయూలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి సెలవుల మంజూరు, వేతనాల పే స్లిప్లు, విద్యార్థి అడ్మిషన్, అటెండెన్స్, స్కిల్స్ తదితర అంశాలను పొందుపర్చుకోవడం, వివిధ కార్యక్రమాలు, హాస్పిటల్స్ తదితర అంశాలను మ్యానువల్ పద్ధతిలో జరిగేవి. దీనిని ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చి సమగ్రంగా యూనివర్సిటీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి అందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పీఎం ఉషా స్కీం నిధులను అందిస్తున్న ప్రతి ప్రభుత్వ విద్యా సంస్థకు కేంద్రం సమర్థ్ పోర్టల్ను ఉచితంగా అందిస్తుంది. ఈ స్కీంలో భాగంగా యూనివర్సిటీ సిబ్బందికి ప్రత్యేకంగా సమర్థ్ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందించేందుకు అధికారులు ఇటీవల ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయగా.. కాంట్రాక్టు అధ్యాపకుల వివరాలను ఈ పోర్టల్ దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అనంతరం నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులనూ ఇందులో చేర్చనున్నారు. తద్వారా పీయూకు సంబంధించిన ప్రతి ఫైల్ కూడా ఈ–పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫైలింగ్ నిర్వహించి.. ఫైల్ స్టేటస్ ఎక్కడ.. ఏ అధికారి వద్ద ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కీలకంగా సీవేజ్ ప్లాంట్.. యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా తీసుకువస్తున్న మార్పుల్లో కీలకమైంది సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. రూ.5 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ కిందభాగంలో దీనిని నిర్మిస్తున్నారు. యూనివర్సిటీలో పలు హాస్టల్స్, కళాశాలలు నుంచి వచ్చే డ్రెయినేజీ నీటిని ఇక్కడ ఉండే పెద్ద మూడు ట్యాంకుల్లోకి మళ్లించి నీటితోపాటు ఇతర వ్యర్థాలను శుద్ధి చేసే విధంగా సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేస్తుంది. ఇందులో శుద్ధి చేసిన నీటిని తిరిగి చెట్లు, తోటలు, గార్డెన్లకు, ఘన పదార్థాల వ్యర్థాలను బయో ఫర్టిలైజర్గా వినియోగిస్తున్నారు. చెట్లకు ఇతర అవసరాల కోసం ఎరువులుగా ఉపయోగించనున్నారు. దీని ద్వారా పీయూ వ్యర్థాల పునర్వినియోగంలో టాప్లో నిలువస్తుంది. న్యాక్ ర్యాంకింగ్లో మెరుగైన స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల వివరాలు విద్యుదుత్పత్తి కోసం సోలార్ ప్యానెల్స్ బిగింపు రూ.5 కోట్లతో సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు నీటి పునర్వినియోగం,వ్యర్థాలతో బయో ఫర్టిలైజర్స్ తయారీ -
డీసీసీ అధ్యక్షులపై కసరత్తు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దుతో ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇదే క్రమంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడం.. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డీసీసీ అధ్యక్ష పీఠాల భర్తీకి కసరత్తు ప్రారంభించడంతో పార్టీలో మళ్లీ సందడి మొదలైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఖరారుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితులైన వారు జిల్లాల బాట పట్టారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల పరిశీలకుడు కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి శనివారం పాలమూరుకు చేరుకున్నారు. ముందుగా నారాయణపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మహబూబ్నగర్కు చేరుకుని స్థానిక నేతలతో ముచ్చటించారు. ఆదివారం నుంచి ఈ రెండు జిల్లాల్లో అభిప్రాయాల సేకరణతో పాటు డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అదేవిధంగా మరో పరిశీలకుడు పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఆదివారం నాగర్కర్నూల్, 14న వనపర్తి, 16న జోగుళాంబ గద్వాలలో పర్యటించనున్నారు. నవంబర్లో ఖరారయ్యే అవకాశాలు ఏఐసీసీ పరిశీలకులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. అదేవిధంగా అధ్యక్ష పదవులను ఆశిస్తున్న నేతల నుంచి ఈ నెల 18వ తేదీ దాకా దరఖాస్తులు స్వీకరించనున్నారు. వడబోత తర్వాత ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ఈ నెల 22వ తేదీ నాటికి అటు ఏఐసీసీ, ఇటు పీసీసీకి అందజేయనున్నారు. అనంతరం సీఎం ఇతర ముఖ్య నేతలు జిల్లా ఇన్చార్జిలు, ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులతో సంప్రదింపులు జరిపి సామాజిక వర్గాల (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ) వారీగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించనున్నారు. మొత్తానికి వచ్చే నెల తొలివారంలో డీసీసీ అధ్యక్షులు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆశావహులు తా ము చేసిన దరఖాస్తుల్లో పార్టీకి అందించిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొంటూ బయోడేటా ఇవ్వాలని పరిశీలకులు సూచిస్తున్నారు. జిల్లాల వారీగా పోటాపోటీ ఇలా.. వనపర్తి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. లక్కాకుల సతీష్, రాజేంద్రప్రసాద్, డి.కిరణ్ కుమార్ డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వర్గాల మధ్య డీసీసీ పదవికి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గంలోని గద్వాలకు చెందిన గడ్డం కృష్ణారెడ్డి, మల్దకల్ మండలానికి చెందిన పటేల్ ప్రభాకర్రెడ్డి.. జెడ్పీ మాజీ అధ్యక్షురాలు సరిత భర్త తిరుపతయ్య, మల్దకల్కు చెందిన నల్లారెడ్డి పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ నాయకుడు సంపత్కుమార్.. సరిత వర్గంలోని నల్లారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి డీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయనతో పాటు ఈ పదవి కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకుడు ఎన్పీ వెంకటేష్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్ఖాద్రి పోటీపడుతున్నారు. జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకులు పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 18 వరకు కొనసాగనున్న ప్రక్రియ ఒక్కో జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదన 5 జిల్లాల్లోనూ పలువురి మధ్య పోటాపోటీ నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఉన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవిపై పార్టీ మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు హబీబ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి విజయ్కుమార్ రెడ్డి, కొల్లాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరికల్ మండలం తీలేరుకు చెందిన ఆయనతో పాటు మక్తల్ మండలానికి చెందిన బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, ధన్వాడ మండలంలోని గోటూరు నాగేశ్వర్రెడ్డి పోటీలో ఉన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, కోస్గి మండలం పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి సైతం డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
● ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ● పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభం నారాయణపేట రూరల్: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డీకె అరుణ, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం, పప్పు ధాన్యాల మిషన్ను భారత ప్రధాని నరేంద్రమోదీగా వర్చువల్గా శనివారం ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట మండలంలోని జాజాపూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, నోడల్ అధికారి సాయిబాబా, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి దేశంలోని 100 జిల్లాలను ఎంచుకోగా అందులో నారాయణపేట స్థానం సంపాదించడం ఈ ప్రాంత అభివృద్ధికి శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద నాలుగు జిల్లాలు ఎంపిక కాగా వాటిలో నారాయణపేట, నాగర్కర్నూల్, గద్వాల మూడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. పథకం అమలు కోసం ప్రతి ఏటా రూ.960 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వాటిని పరిష్కరించేందుకు మోదీ సర్కార్ 2025 కేంద్ర బడ్జెట్లో పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించిందన్నారు. గ్రామీణాభివృద్ధి, సహకారం, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, ఐసీఏఆర్, నీతి ఆయోగ్, నాబార్డ్ విభాగాలు రాష్ట్రాలు వాటి అనుబంధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సన్నిహిత సహకారంతో పనిచేస్తుందని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రత్యేక జాయిన్ డైరెక్టర్ను నియమించిందని, వ్యవసాయ రంగంలోని 36 అంశాలకు సంబంధించి ఒక్కో అంశంపై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించి కేంద్రానికి పంపిస్తారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, బీజేపీ ముఖ్య నాయకులు నాగురావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, వివిధ మోర్చాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. సాగు ఉత్పాదకతను పెంచడం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం కింద నారాయణపేట ఎంపిక కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నాంది అన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడం, పంట వైవిధ్యీకరణ, పంటల పెరుగుదల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పంటకోత తర్వాత నిల్వ, విలువ జోడింపును పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్రెడిట్ను సులభతరం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2018–2019 నుంచి ఆస్పిరేషన్ బ్లాక్ కొనసాగుతోందని, 2021లో జిల్లాలోని నర్వ మండలం ఆ బ్లాక్ కింద ఎంపికై ందని, నీతి అయోగ్ ద్వారా రూ.2 కోట్ల నిధులు వచ్చాయని ఆమె తెలిపారు. వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం, మత్స్య శాఖ, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ, సహకార మంత్రిత్వ శాఖ, జలవనరులు, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద పనిచేస్తాయన్నారు. -
పల్లి సాగు అంతంతే..
మరికల్: అధిక వర్షాల కారణంగా ఖరీఫ్ సాగు చేసి న రైతులకు నష్టాలే మిగిలాయి. వాటిని భర్తీ చేసేందుకు యాసంగిలో వేరుశనగ సాగుపై రైతులు దృష్టి సారించారు. కానీ ఇప్పటికీ వర్షాల జోరు ఇప్పటికీ తగ్గకపోవడంతో వేరుశనగ వేసేందుకు సైతం రైతులు వెనకాడుతున్నారు. ఇప్పటికే పది రోజులుగా జిల్లాలో అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మరికల్, ధన్వాడ, దామరగిద్ద, మక్తల్, మద్దూరు, కోస్గి, నర్వ మండలాల్లో ఏటవాలు భూములల్లో ఎక్కువగా సాగు చేయగా.. ఇతర మండలాల్లో ఓ మోస్తరుగా వేరుశనగ సాగవుతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరిగినా రైతులు వేరుశనగ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. కొందరు రైతులు వేరుశనగ పంటలకు అడవి పందుల బెడద అధికంగా ఉంటుందని, మొక్కజొన్న, పత్తి, ఆముదం పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తుంపర సేద్యంతో అధిక దిగుబడులు.. నీటి వనరులను బట్టి ఏటవాలు భూముల్లో నీటి తడులు ఇచ్చే సమయంలో పొలం కోతకు గురి కాకుండా తుంపర సేద్యంతో తడులు ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఎకరాకు సరిపోయే నీటితో మూడు ఎకరాలు సాగు చేయొచ్చు. అంతే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. ప్రధానంగా వానాకాలంలో పెస ర, జొన్న సాగు చేసిన భూముల్లో వేరుశనగ వేస్తా రు. మరికొన్ని భూములు ఏ పంట సాగు చేయకుండా దుక్కి దున్ని యాసంగిలో నేరుగా వేరుశనగ మాత్రమే సాగు చేస్తారు. అందువల్ల భూసారం కాపాడుకోవచ్చని రైతులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని, పెట్టుబడి పోనూ సుమారు రూ. 40 వేల వరకు చేతికి అందుతుండటంతో రైతులు యాసంగి వేరుశనగ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. విత్తనాల కోసం ఇతర జిల్లాలకు ఉమ్మడి జిల్లాలో నాణ్యమైన వేరుశనగ విత్తనాలు లభించకపోవడంతో కొందరు రైతులు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, తిరుపతికి వెళ్లి కే6, 1694 రకాల విత్తనాలకు క్వింటాల్కు రూ.12 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు రైతులు మహబూబ్నగర్, గుత్తి, మదనాపురం, రాయిచూర్ తదితర ప్రాంతాల నుండి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. వనపర్తి విత్తనోత్పత్తి సంస్థలో కే6, కదిరి లేపాక్షి–1812 రకాల విత్తనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎకరానికి 65 కిలోల విత్తనాలు అవసరం ఉండటంతో పెద్ద రైతులు మంచి విత్తనాల కోసం ఇతర జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి వేరుశనగ రైతులు ప్రతి ఏడాది విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. విత్తనాలు కొనబోతే ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అమ్మబోతే గిట్టుబాటు ధరలు లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంటుంది. జిల్లావ్యాప్తంగా వేరుశనగ విత్తనాలు కొనేందుకు వ్యాపారులను ఆశ్రయిస్తే డిమాండ్ను బట్టి ఆగస్టులో క్వింటాల్కు రూ.8 నుంచి రూ.9 వేల వరకు ఉండగా, సెప్టెంబర్లో రూ.9 నుంచి రూ.12 వేల పెంచారు. ప్రభుత్వం మాత్రం కేవలం 3 వేల ఎకరాలకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేసింది. విత్తనాలు అందని రైతులు ఇతర జిల్లాలకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. 2024 మార్చిలో రైతులు వేరుశనగను క్వింటాల్కు మార్కెట్లో రూ.4,100 నుంచి రూ. 7,600 వరకు విక్రయించారు. జిల్లాలో 8 వేల ఎకరాలకు తగ్గే అవకాశం ఉందని అంచనా 3 వేల ఎకరాలకు విత్తనాలు పంపిణీ చేసిన అధికారులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జోరందుకున్న సాగు వేధిస్తున్న అడవి పందుల బెడద ప్రత్యామ్నాయంగా పత్తి, ఆముదం, మొక్కజొన్న సాగుకు ఆసక్తి విత్తనాలు పంపిణీ చేశాం జిల్లాలో 8 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉంది. ఇందుకు గాను ప్రభుత్వం 3 వేల ఎకరాలకు సరిపడా విత్తనాన్ని అందించడంతో రైతులకు పంపిణీ చేశాం. ఇతర జిల్లాలో వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసే రైతులు నాణ్యమైన వాటిని ఎంచుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయధికారి, నారాయణపేట -
టార్పాలిన్లు అందేనా..
మక్తల్: పంట కోతల తర్వాత అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగించే టార్ఫాలిన్లను ప్రభుత్వం పదేళ్లుగా అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది వర్షాకాలంలో టార్ఫాలిన్ల కొరత కారణంగా ధాన్యం తడిసి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చిన్న, సన్న కారు రైతులకు రూ.వేలు ఖర్చు చేసి టార్ఫాలిన్లు కవర్లు కొనుక్కోవడం భారంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సబ్సిడీపై అందించే టార్ఫాలిన్లను మళ్లీ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో జిల్లాలో 1.14లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది, వివిధ పంటలను సాగు చేశారు. పంట కోతల సమయం ప్రారంభం కావడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నా.. సాయంత్రం అయిందంటే చాలు నల్లమబ్బు కమ్మి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎండిన ధాన్యాన్ని రాశులుగా పోసిన వాటిపై కప్పేందుకు సరైన టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవడంతో వారి కష్టం అంతా వరద పాలవుతోంది. రైతులకు ఆర్థిక భారం గతంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సమన్వయంతో రైతులకు రాయితీపై టార్ఫాలిన్లు పంపిణీ చేసేవారు. 250 జీఎస్ఎం నాణ్యత కలిగిన 8–6 మీటర్ల విస్తీర్ణం ఉన్న టార్ఫాలిన్ రూ.2,500 కాగా.. 50 శాతం రాయితీపై రూ.1,250 లకు అందించేవారు. కానీ 2017–2018 సంవత్సరం నుంచి ఈ పథకం అమలును ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటులో ఒక్కో టార్ఫాలిన్ రూ.3,500 నుంచి రూ.8వేల వరకు పలుకుతుండడంతో సన్నకారు రైతులతో పాటు దాదాపు 1.25 లక్షల మంది రైతులపై భారం పడుతోంది. 10 ఏళ్ల నుంచి రైతులకు తప్పని ఎదురుచూపులు సబ్సిడీ కవర్లపై స్పందించని వ్యవసాయ శాఖ రూ.వేలు ఖర్చు చేసి బయట కొనుగోలు చేస్తున్న వైనం జిల్లాలోని 1.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు పంట కోతలు సమీపిస్తున్న తరుణంలోఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు -
ప్రభుత్వ భూములను గుర్తించండి
● భూ భారతి పోర్టల్లో నిషేధితజాబితాలోకి చేర్చాలి ● తహసీల్దార్ల సమీక్షలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట: జిల్లాలో ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలను సేకరించి, భూ భారతి పోర్టల్లో నమోదు చేసి వాటిని నిషేధిత జాబితాలోకి చేర్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా అసైన్డ్ భూము లు, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డులు లేదా ఇతర మత సంస్థలకు కేటాయించిన భూములు, సీలింగ్, భూదాన్ భూముల వివరాలను సేకరించాలన్నారు. మండలాల వారీగా ఆయా భూముల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల పర్యవేక్షణ తప్పనిసరి వానాకాలం సీజన్లో జిల్లాలో వరి ధాన్యం దిగుబడి పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలపై తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. గత సీజన్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో ఏఓ, ఏఈఓ, హార్వెస్టర్ల యజమానులతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి వరి కోతలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా కొనసాగించేలా చూడాలన్నారు. వరి ధ్యానంతో పాటు ఈ సారి పత్తి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని, కపాస్ కిసాన్ యాప్లో రైతులు తమ స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్నాయక్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, డీఏఓ జాన్ సుధాకర్, డీఎంఓ బాలామణి, పౌరసరఫరాల శాఖ అధికారులు సైదులు, బాల్రాజ్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ఓటు చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ
నారాయణపేట: ఒకే ఇంటి నంబర్పై పదుల సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకుంటూ కొందరు ఓటు చోరీకి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ సలీం ఆధ్వర్యంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకం చేసి, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటు చోరీ చేయడమంటే దేశ పౌరుల హక్కులను దొంగలిస్తూ ప్రజాస్వామ్యం దగా చేయడమే అన్నారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, మహారాష్ట్ర, కర్ణాటకలో ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఆధారాలతో సహా నిరూపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కొన్ని రాష్ట్రాల్లో ఓట్లును అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్ల తొలగింపును కొందరు ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నట్లు బహిర్గతం కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం, వార్డుల్లో ప్రజలు సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సుధాకర్, సరాఫ్ నాగరాజు, మార్కెట్ వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, ఆర్టీఓ బోర్డు సభ్యుడు పోషల్ రాజేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి, సీనియర్ నాయకులు గందె చంద్రకాంత్, మనోహర్గౌడ్, హరినారాయణ భట్టడ్, కోట్ల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీపై ఇవ్వాలి
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై అందించే టార్ఫాలిన్లను నిలిపివేయడం సరికాదు. దీంతో ఆరుకాలం కష్టపడి పండించి రైతుల ధాన్యం వర్షార్పణం అవుతోంది. ఖాళీ యూరియా సంచులతో కుట్టిన వాటిని రోజుకూ రూ.30 చొప్పున అద్దెకు తీసుకొనే ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకుంటున్నాం. పథకం మళీ ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – రాజు, గుడిగండ్ల అధికారుల నిర్లక్ష్యం వ్యవసాయ అధికారు లు ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో టార్ఫాలిన్లు రైతులకు అందడం లేదు. రైతు లు పడుతున్న బాధలు చూసినా అధికారులు ప్రభుత్వానికి నివేదించాలి. రూ.వేలు ఖర్చుపెట్టి టార్ఫాలిన్లు కొనుగోలు చేసుకుంటున్నాం. రైతులపై భారం తగ్గించాలి. – గోవిందురాజు, దాసర్దొడ్డి ప్రభుత్వం అందిస్తే.. ప్రభుత్వం నుంచి సబ్సిడీపై టార్ఫాలిన్లు వస్తే రైతులకు పంపిణీ చేస్తాం. 2017, 2018 నుంచి ప్రభుత్వం రాయితీని ఎత్తేసింది. రైతుల ఇబ్బందులను మరోమారు ఉన్నతాధికారులకు వివరించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – జాన్సుధాకర్, డీఏఓ, నారాయణపేట ● -
14న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి ఎన్నిక
నారాయణపేట: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ పదవీకాలం ముగియడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశాలతో ఈ నెల 14న ఉదయం 11 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఎన్నికల సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శంకరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఆఫీసు బేరర్లు అయిన చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యవర్గ నాయకుల ఎన్నిక జరుగుతుందన్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికలకు ప్రతి సభ్యుడు హాజరుకావాలని కోరారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి కృష్ణా: మండల సరిహద్దులోని చెక్పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని మక్తల్ సీఐ రాంలాల్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎస్ఐ ఎండీ నవీద్తో కలిసి సరిహద్దులోని చెక్పోస్టును సందర్శించా రు. అనంతరం మాట్లాడుతూ కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మద్యం, గంజాయితో పాటు ఇతర నిషేధిత పదార్థాలు రాష్ట్రంలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
నారాయణపేట: అధికారులకు అప్పగించిన బాధ్య తలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయం, జాజాపూర్ గ్రామపంచాయతీ, దామరగిద్దలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. నోటీసు బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారా? లేదా అని తనిఖీ చేశా రు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఈసీ మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. జిల్లాలో మొదటి విడతగా 8 జెడ్పీటీసీ, 82 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సాధారణ పరిశీలకురాలు పి.కాత్యాయనిదేవి ఆరా తీశారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్తో స మావేశమై పలు అంశాలపై చర్చించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వ హించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఉన్నారు. -
రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాలకు న్యాయం
నారాయణపేట టౌన్: రాజ్యాధికారంతోనే అణగారిన వర్గాలకు న్యాయం చేకూరుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో బహుజనులకు రాజ్యాధికార స్ఫూర్తి నింపిన మహనీయుడు కాన్షీరాం అని కొనియాడారు. జనాభా ప్రాతిపదికన దేశ సంపదను అందరికీ సమానంగా పంచడమే బీఎస్పీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి గువ్వల తిరుపతి, అశోక్, నర్సింహ, వెంకటయ్య, హన్మంతు పాల్గొన్నారు. -
పరిశోధనలకు పునాది
బీసీలకు తీరని అన్యాయం నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధతతో కూడిన రిజర్వేషన్ల అమలుకు కృషి చేయకుండా, కోర్టు స్టే ఇవ్వడానికి పరోక్షంగా కారణమైందని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మండిపడ్డారు. జిల్లాకేంద్రంలో గురువారం బీసీ జాగృతిసేన జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కుర్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఏళ్లుగా బీీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా కేవలం ఓటుబ్యాంకుగానే చూశారన్నారు. కనీసం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలైతే కిందిస్థాయి పాలనలో భాగస్వామ్యం దక్కుతుందని ఆశించామని అన్నారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం వెనుక బీసీ వ్యతిరేక శక్తులు పనిచేశాయన్నారు. బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీలోని బీసీ సామాజిక వర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి కదలిరావాలని కోరారు. సమావేశంలో బీసీ జాగృతిసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, రాజు, సతీశ్, గోవింద్, జనార్దన్, రాములు, ఎల్లప్ప, మల్లేశ్ ఉన్నారు. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ త్వరలో పరిశోధనలకు అడ్డాగా నిలవనుంది. విద్యార్థులు, రీసెర్చి స్కాలర్స్, అధ్యాపకులను పరిశోధనల పరంగా ప్రోత్సహించేందుకు పీయూలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2008లో ప్రారంభం అయినప్పుడు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితమైన పీయూ.. ప్రస్తుతం రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణంతో ప్రయోగాలకు నిలయంగా మారనుంది. తెలంగాణలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితం భవనం పనులు ప్రారంభమవగా.. దాదాపుగా చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ భవన నిర్మాణం, వసతుల కల్పన కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు సైతం విడుదల చేయడంతో దీని నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రూ. 25 కోట్ల వ్యయం.. రీసెర్చి ఫెసిలిటీ భవనాన్ని నిర్మించేందుకు రూ.11 కోట్లను గతంలో కేటాయించి నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 5 ల్యాబ్లు, రెండు సెమినార్ హాళ్లు, కంప్యూటర్ ల్యాబ్, ఇంక్యూబేషన్ సెంటర్ వంటివి నిర్మించనున్నారు. ఈ భవనం మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో ఇందులో ఏర్పాటు చేసే వసతుల కోసం నిధులను సైతం ప్రభుత్వం సమకూర్చడం గమనార్హం. ఇందులో పీఎం ఉషా స్కీం ద్వారా గత విద్యా సంవత్సరం రూ.100 కోట్లను కేటాయించగా.. ఈ నిధుల్లోంచి రూ.14 కోట్లు కేవలం రీసెర్చి ఫెసిలిటీ సెంటర్ కోసం మాత్రమే కేటాయించింది. ప్రభుత్వం ఒక్కో మైక్రోస్కోప్, ఇతర ఎక్విప్మెంట్ రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు వెచ్చించనుంది. ఫిజిక్స్, మైక్రోబయోలజీ, బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి వారికి ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. ఇంక్యూబేషన్ సెంటర్.. ల్యాబ్తోపాటు ఇంక్యూబేషన్ సెంటర్ను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నూతనంగా ఆవిష్కరణలు చేసే స్టార్టప్లు ప్రారంభించే వారు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాల్లో ప్రొటోటైప్ ఆవిష్కరణలు చేసేందుకు, చేర్పులు, మార్పులు చేసేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటితోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ ప్రైవేటు కంపెనీలు, ఫార్మాలు సైతం అత్యంత ఖరీదైన ప్రయోగాలను ఇక్కడ కొద్దిపాటి ఫీజులు చెల్లించి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అత్యంత ఖరీదైన ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండటంతో ఎలాంటి ప్రయోగాలనైనా తక్కువ ఖర్చుతో చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల యూనివర్సిటీకి సైతం ఆదాయం సమకూరనుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ సైతం ఇందులో ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కీలక మైలురాయి.. పీయూలో రూ.11 కోట్లతో రీసెర్చ్ ఫెసిలి టీ భవనం నిర్మిస్తున్నాం. దీనిలో ఎక్విప్మెంట్ కోసం రూ.13 కోట్లు పీఎం ఉషా స్కీం ద్వారా కేటాయించాం. ఈ భవన నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రీసెర్చి స్కాలర్స్, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రైవేటు ఫార్మ కంపెనీలు ఇక్కడ ప్రయోగాలు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంక్యూబేషన్ సెంటర్లో స్టార్టప్ల ఎంటర్ ప్రెన్యూరర్స్ ప్రొటోటైప్ ప్రయోగాల ద్వారా కొత్త అంశాలపై దృష్టి సారించవచ్చు. – జీఎన్ శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ ఎంతో ఉపయోగం.. రీసెర్చి ఫెసిలిటీ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. అందులో రీసెర్చి చేసే వారికి అన్ని రకాల వసతులు కల్పించనున్నాం. దీంతో ఇక్కడ ప్రయోగాలు చేసుకునే ప్రైవేటు వారు కొద్ది మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంక్యూబేషన్ సెంటర్ ద్వారా కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం లభిస్తుంది. ఉమ్మడి పాలమూరుతోపాటు చుట్టు పక్కల జిల్లాల వారికి ఇది ఎంతో ఉపకరించనుంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూలో నిర్మితమవుతున్న రీసెర్చ్ ఫెసిలిటీ భవనం రూ.11 కోట్లతో భవనం, ఉమ్మడి జిల్లాలో రీసెర్చి ఊతం రూ.14 కోట్లతో పరికరాల కొనుగోలుకు అనుమతి ఇతరత్రా వసతుల కల్పనకు సైతం నిధులు విడుదల ఇంక్యూబేషన్ సెంటర్తో కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: బ్యాంక్లలో డబ్బు జమ, డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ శివశంకర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లుతో కలిసి గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పరిశీలించి, కస్టమర్లకు పలు సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్ నంబర్లు ఎవరికీ చెప్పొద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అని సూచించారు. అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బందికి సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా నిర్ధారించుకోవాలన్నారు. ప్రజలు సైబర్ నేరాలు, బ్యాంక్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. -
పాలమూరులో భారీ వర్షం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్, నవాబుపేట, దేవరకద్ర మండలాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.నవాబుపేట మండలం రుద్రారంలో వాగు నిండి గ్రామంలోకి నీరు ప్రవహించడంతో ఇళ్లలోకి భారీగా వరద వచ్చి చేరింది. చెన్నారెడ్డిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో కాజ్వే ఉధృతంగా ప్రవహించడంతో మదనాపురం–ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లా పళ్ల ప్రాంతానికి చెందిన కందుకూరు పద్మ(35) పొలం పనులకు వెళ్లగా.. అక్కడ పిడుగు పడటంతో మృత్యువాతపడింది. -
నారాయణపేట
వీడని సందిగ్ధం.. గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరణ ఈ నెల 11 వరకు తుది గడువు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 39 జెడ్పీటీసీ, 426 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ -
వరి కొనుగోళ్లకు సన్నద్ధం
జిల్లాలో 3.12 లక్షల మె.ట. ధాన్యం సేకరణే లక్ష్యం ● 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ● 78 లక్షల గన్నీ బ్యాగులు, 3,510 టార్పాలిన్లు అవసరమని అంచనా ● కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు నర్వ: జిల్లాలో సాగుచేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ధాన్యం సేకరణపై ఇప్పటికే కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రాథమిక సహకార సంఘం, మెప్మా, ఎఫ్పీఓ, మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో మొత్తం 117 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వారంలో కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉండగా.. వచ్చే నెలలో పంట కోతల ఆధారంగా మిగతా చోట్ల పూర్తిస్థాయిలో ప్రారంభించాలని నిర్ణయించారు. 4.28 లక్షల మె.ట. దిగుబడి.. వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్రాలు ప్రారంభం కాగానే అవసరాన్ని బట్టి సంచులు తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 71 వేల హెక్టార్లలో.. జిల్లావ్యాప్తంగా 71,063 హెక్టార్లలో వరి సాగుకాగా.. ఇందులో సన్న రకం 56,082 హెక్టార్లు, దొడ్డురకం 14,981 వేల హెక్టార్లు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం క్వింటాకు రూ.2,369 మద్దతు ధర చెల్లించనుంది. జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా.. స్థానిక అవసరాలకు 85,767 మెట్రిక్ టన్నులు వినియోగించే అవకాశం ఉంది. మిల్లర్లు, ట్రేడర్లు 30,457 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. మిగిలిన 3.126 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 78.15 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 19.01 లక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 59.14 కొత్తవి సేకరించాల్సి ఉంది. 3,510 టార్పాలిన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 3,029 ఉన్నాయి. కేంద్రాల నుంచి మిల్లులు, గోదాంలకు ధాన్యం తరలింపునకు లారీలు సిద్ధంగా ఉంచేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆర్టీసీ లక్కీ డ్రాకు విశేష స్పందన
● రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లక్కీడ్రాకు ప్రయాణికుల నుంచి విశేషమైన స్పందన లభించిందని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. గత నెల 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో (ఎలక్ట్రికల్ వాహనాలతో సహా) ప్రయాణించే వారికి లక్కీడ్రా నిర్వహించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీఓ రఘుకుమార్ చేతుల మీదుగా లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. ప్రథమ శివశంకర్, ద్వితీయ బిందు, తృతీయ మోక్షజ్ఞలు నిలవగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్గా నిలుస్తున్నదన్నారు. దసరా పండుగ రోజుల్లో ఉమ్మడి జిల్లా ప్రయాణికులు ఆర్టీసీని ఎంతో ఆదరించారని తెలిపారు. మహబూబ్నగర్ రీజియన్లోని ప్రధాన బస్టాండ్లలో ఏర్పాటు చేసిన 17 బాక్సుల్లో లక్కీడ్రా తీసినట్లు చెప్పారు. మొదటి బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
మూడు రోజులే గడువు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా తీర్పు గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రానికి రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో గురువారం ఉదయం 10.30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న అయోమయం ఆశావహుల్లో నెలకొంది. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైనా ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయలేదు. రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే పార్టీలు అభ్యర్థిత్వాలను పెండింగ్లో ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో గురువారం నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలవుతున్నా ప్రధాన రాజకీయ పార్టీల తరపున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. మొత్తం రెండు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించనుండగా.. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలుకానుంది. శనివారం తుది గడువు ఉండటంతో నామినేషన్ల దాఖలుకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహణ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు గత నెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఇందులో భాగంగానే గురువారం నుంచి తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలు కానుండగా ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి నామినేషన్లను ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ అధికారిగా జిల్లాస్థాయి అధికారి, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరించనున్నారు. తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 11 వరకే తుది గడువు ఉంది. గురువారం నుంచే నామినేషన్లను అధికారులు స్వీకరించనుండగా ఆయా స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు మంచిరోజు, ముహూర్తాలను బట్టి నామినేషన్లను దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు గురువారమే బీసీ రిజర్వేష్లన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో శుక్ర, శనివారాల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. -
ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి
నారాయణపేట: వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ అన్నారు. రామాయణం రచించిన వాల్మీ కి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రత్నాకరుడి నుంచి మహర్షి వా ల్మీకిగా ఆయన పరివర్తన, వ్యక్తిగతవృద్ధి, విముక్తిని సూచిస్తుందని, ఆయన రామాయణాన్ని సృష్టించిన గొప్ప రుషి అని కొనియాడారు. వాల్మీకి సంసృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అన్నారు. రామాయణాన్ని రాసిన ఆయనను సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్గంగ్వార్, శ్రీను, ఎస్డీ రాజేందర్గౌడ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖలీల్, డీపీఆర్ఓ రషీద్, సీపీఓ యోగానంద్, వసతి గృహా వార్డెన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అధికారులను అడిగినా..
నేను నాలుగు నెలల క్రితం ఎకరా భూమిని కొనుగోలు చేసి, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. కానీ ఇంత వరకు పాసుబుక్కు రాలేదు. ప్రతి రోజు పోస్టుమెన్ను అడిగి తెలుసుకుంటున్నాను. తహసీల్దార్ను అడిగినా సమాధానం రావడం లేదు. ప్రభుత్వ అధికారులు స్పందించి పాసు పుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – గౌస్, మద్దూరు రైతు ఇంటికే వస్తుంది.. నాలుగు నెలల నుంచి భూమి రిజిస్ట్రేషన్, భూదానాలు, విరాసత్, భాగపరిష్కారాలు చేసుకున్న రైతులకు పాసుబుక్కులు రాకపోవడం నిజమే. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే పాసు పుస్తకానికి సంబంధించిన డబ్బులు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. పాసుబుక్కు సైతం పట్టదారు నమోదు చేసుకున్న అడ్రస్కే పోస్టులో వస్తుంది. ఎక్కడ జాప్యం జరుగుతుందో ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతుల సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – జయరాములు, తహసీల్దార్, కొత్తపల్లి ● -
విజయానికి సృజనాత్మకత తప్పనిసరి
కోస్గి రూరల్: జీవితంలో అవకాశాలు ఎల్లప్పు డు వస్తుంటాయని, వాటిని గుర్తించి క్రమశిక్షణ, నిజాయితీ, సృజానాత్మకతతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టిన డిప్లొమా విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల త్యాగం, గురువుల మార్గదర్శనానికి విద్యార్థుల కృషి తోడైతే లక్ష్యాలు చేరుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హెచ్ఓడీలు వసంతకుమారి, మీన, వెంకటాద్రి, వెంకట్రెడ్డి, విద్యా ర్థుల తల్లిదండ్రలు తదితరులు ఉన్నారు.మద్దూరు ఘటనపై విచారణ చేయించాలినారాయణపేట రూరల్: మద్దూరు మండలంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలను భరించలేక ఒక గిరిజన యువకుడు రమేష్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించి సమగ్ర విచారణ జరపాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్నాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీతో కలిసి మంగళవారం నారాయణపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మద్దూరులో ఇస్లామిక్ వాదులు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకు తాజోద్దీన్, యాసిన్ వ్యాపారం నిర్వహిస్తూ అప్పులు ఇస్తామని ఎరవేస్తూ.. డబ్బులు ఇవ్వకుండానే అప్పు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బంగారు నాణేల పేరుతో నకిలీ ఇచ్చి డబ్బుల దండుకుంటున్నారన్నారు. మతం మారితే రూ.2 లక్షలు ఇస్తామని, పాకిస్థాన్కు ఏజెంట్గా వ్యవహరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇది వరకే రాంచంద్రప్ప వారి ఒత్తిడితో మృతి చెందాడన్నారు. రాంచంద్రప్ప, తాజొద్దీన్ ఫోన్లను సీజ్ చేసి పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతాయని సూసైడ్ నోట్లో తెలిపాడన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీగౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.బాధిత కుటుంబానికి పరామర్శమద్దూరు: సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన రమేష్నాయక్ కుటుంబాన్ని మంగళవారం బీజేపీ నాయకులు పరామర్శించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బోడమరిగుట్టతండాలో ఆయన తల్లిదండ్రులు తారాబాయి, దమ్లానాయక్ ను కలిసి ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, దౌల్తాబాద్ అధ్యక్షుడు అశోక్, మద్దూర్ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.మన్యంకొండలో వైభవంగా కల్యాణోత్సవంమహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ వేడుకను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే..
అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ ● -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పాసు పుస్తకాల కోసం తహసీల్దార్కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ● రుణాలు ఇవ్వని బ్యాంకర్లు ● ఇబ్బందులకు గురవుతున్న రైతులు నారాయణపేట: జిల్లాలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం నివాసంలో ఆమె సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన సీఎం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, పీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్రెడ్డి ఉన్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూపులుకొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు మండలాల పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు, విరాసత్లు, భూ దానాలు తదితర విక్రయాలు జరిగినా జూన్ మాసం నుంచి ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు రైతులకు పాసు పుస్తకాలు అందించడంలో జాప్యం చేస్తున్నారు. కోస్గి మండలంలో 810, మద్దూరులో 704, కొత్తపల్లిలో 283, గుండుమాల్ మండలంలో 372మంది రైతులకు పాసుపుస్తకాలు రావాల్సి ఉంది. భూమి హక్కులు ఉన్నా.. భూమిపై సంబంధిత రైతులకు హక్కులు ఉన్నా.. పాసుపుస్తకం లేని కారణంగా వారికి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. భూమి రిజిస్టేషన్ చేసుకున్న సమయంలోనే వాటికి సంబంధించిన ప్రొసీడింగ్, తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం ఇచ్చి పంపిస్తున్నారు. ఈ పత్రం తీసుకొని ఆయా బ్యాంకుల చుట్టు తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి
నారాయణపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ లింగయ్య పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు అర్జీదారులతో డీఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. ప్రజలకు పోలీసుశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు. సీజేఐపై దాడి హేయనీయం నారాయణపేట టౌన్: దేశంలో మతోన్మాద విద్వేష భావాజాలం పెరగడంతోనే సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడికి పాల్పడటం హేయమైన చర్యన్నారు. దేశంలో పతనమవుతున్న సామాజిక విలువలకు ఈ దాడి పరాకాష్టగా మారిందన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు.


