Narayanpet
-
మొరాయిస్తుంది..
మూడు నెలలకు సంబంధించి బియ్యం పంపిణీ ప్రక్రియ బాగానే ఉన్నా.. లబ్ధిదారుల వేలి ముద్రలను తీసుకునే సమయంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం అందించడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్ ఇబ్బందులు లేకుంటే రోజుకు గత నెల మాదిరిగానే వంద మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. – తిరుపతిరెడ్డి, రేషన్ డీలర్, అప్పంపల్లి లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకే సారి పంపిణీ చేసే క్రమంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు రావచ్చనే అలోచనతో ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం. మొదట నాలుగు రోజులు మూడు సార్లు వేలిముద్రలు, ఆరు సార్లు తూకం వేసి బియ్యం పంపిణీ చేశారు. సమస్య జఠిలంగా మారడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 6వ తేదీ నుంచి మూడుసార్లు వేలి ముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసింది. – సైదులు, పౌర సరఫరాల శాఖ అధికారి, నారాయణపేట ● -
ఆస్పత్రి తరలింపుపై విచారణ జరపాలి
నారాయణపేట రూరల్: జిల్లా ఆస్పత్రి తరలింపులో భారీ కుంభకోణం ఉందని, వెంటనే విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిని పట్టణానికి దూరంగా తరలించడంపై బీజేపీ ఆధ్వర్యంలో 24గంటల నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. భారీ ర్యాలీగా సత్యనారాయణ చౌరస్తాకు చేరుకున్నారు. దీక్ష శిబిరంలో నామాజీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రి లేకుండా పూర్తిగా తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 60 వేల జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజీకి ఆస్పత్రిని తరలించడం సరికాదని, రోడ్డు సౌకర్యం, విద్యుద్దీపాలు లేక రోగులు అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కొడంగల్, నారాయణపేట రెండు నియోజకర్గాలు రెండు కళ్లు అని చెప్పి ఇప్పుడేమో కొడంగల్కు విద్యాసంస్థలు, ప్రతి గ్రామానికి రోడ్లు వస్తున్నాయి కానీ నారాయణపేటకు వచ్చిన విద్యా సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య చికిత్సలకు, గర్భిణులకు, చిన్న పిల్లలకు వైద్యం ఇక్కడే అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రతన్ పాండు రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, లక్ష్మీ, వినోద్, జ్యోతి, సాయిబన్న, నందు నామాజీ, కిరణ్ పాల్గొన్నారు. -
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్లు
నారాయణపేట: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరిని శుక్రవారం హైదరాబాద్లో నారాయణపేట జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో జిల్లా కేంద్రంలో మంత్రికి ముదిరాజ్ సన్మానసభను ఏర్పాటుచేసినట్లు విన్నవించారు. జిల్లాలోని ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మంత్రిగా తాను పాటుపాడుతామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అదే విధంగా శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ను కలిశారు. మంత్రితో పాటు శాసనమండలి వైస్ చైర్మన్ను కలిసిన వారిలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజు, దామరగిద్ద పీఏసీఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షులు ఎ.కాంతకుమార్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మరికల్ మత్స్యశాఖ అధ్యక్షులు కానుగంటి నారాయణలు ఉన్నారు. -
సర్వర్ కష్టాలు
మరికల్: వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వర్ సమస్యతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద గంటల పాటు పడిగాపులు కాచే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఈ నెల 30 తేదీ వరకు సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో రేషన్ దుకాణాలకు వస్తున్నారు. మరోవైపు ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం సూచనతో జూన్ 1 నుంచి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట నాలుగు రోజులు ఒక్కో లబ్ధిదారుడు ఈ–పాస్ యంత్రంలో మూడు మార్లు వేలి ముద్రలు నమోదు చేయించి, ఆరుమార్లు బియ్యాన్ని తూకం వేయాల్సి వచ్చింది. దీంతో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి ఒక్కో లబ్ధిదారుడికి కనీసం 30 నిమిషాల సమయం తీసుకుంటుందని, ఈ విషయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు వేలిముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా మార్పులు చేస్తు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సమస్య కొద్దిమేర తగ్గింది. మూడు నెలల బియ్యం ఒకసారి పంపిణీ చేయడం వల్ల రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ సాధ్యమవుతుండగా, గత నెలలో రోజుకు వంద కార్డులకు బియ్యం పంపిణీ జరిగేదని డీలర్లు వాపోతున్నారు. సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ ఒక్కో కార్డుకి 20 నిమిషాలు పడుతున్న వైనం ఈ – పాస్ యంత్రాలతో సాంకేతిక సమస్యలు -
‘అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు’ కు గురుకుల విద్యార్థి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి స్వగ్రామం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్పేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని సాయంత్రం జపాన్కు బయలుదేరి వెళ్తాడు. ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్స్ తయారీ.. శివారెడ్డి పాఠశాలలో గత మూడేళ్లుగా ఇన్స్పైర్ అవార్డుల్లో పాల్గొంటున్నాడు. టీజీటీ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు, గైడ్ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్ పవర్ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ఉపాధ్యాయులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. రేపు జపాన్ వెళ్లనున్న దామరగిద్ద విద్యార్థి శివారెడ్డి పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
కోస్గి రూరల్: కోస్గి, గుండుమాల్ మండలాల పరిదిలో జరుగుతున్న అబివృద్ది పనుల్లో వేగం పెంచాలని , పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, గుండుమాల్ మండల పరిదిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండుమాల్లోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనం, బోగారంలోని పాఠశాల, బోగారం నుంచి అమ్లీకుంట వరకు రోడ్డు పనులను పరిశీలించారు. కోస్గి మండలంలోని కడంపల్లి నుంచి హన్మాన్పల్లి గ్రామాన్ని కలిపే బ్రిడ్జి పనులు, సర్జఖాన్పేట్లోని పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి నుండి సర్జఖాన్పేట్ , పోతిరెడ్డిపల్లి నుండి జిన్నారం వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈపిఆర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈపీఆర్ హిర్యానాయక్ , ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ఏఈ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అక్కడి భద్రతా సిబ్బందికి సూచించారు. కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ రాజీకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మనివర్ధన్, వెంకట్రామరెడ్డి, వెంకటయ్య, మహ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు. -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
తొలిరోజు హాజరు అంతంతే..
నారాయణపేట రూరల్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి పూజలు చేసి తరగుతులు ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల్లో రంగులు వేశారు. ఇక గురువారం జిల్లాలోని పాఠశాలల దగ్గర పెద్దగా విద్యార్థుల సందడి కనిపించలేదు. తొలిరోజు జిల్లాలో 57,281 మందికి గాను 18,313మంది విద్యార్థులు పాఠశాలలకు రాగా, కేవలం 31.9శాతం మాత్రమే హాజరు నమోదైంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ అయితే పాఠశాలలకు హాజరైన విద్యార్థులకుగాను తొలిరోజు 1,90,885 పాఠ్యపుస్తకాలు, 3,84,000నోటుపుస్తకాలు, 18,313యూనిఫాం పంపిణీ చేపట్టరు. వీరిలో 10,303 మంది బాలికలు, 8,010మంది బాలురు ఉన్నారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థులను వినూత్న పద్ధతిలో పాఠశాలలోకి ఆహ్వానించారు. కొత్తగా చేరిన వారికి పువ్వులు అందించారు. మరి కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి పిల్లల ఫొటోలు దింపి వారి తల్లిదండ్రులకు వాట్సాఫ్లలో పంపించారు. మొత్తానికి మొదటిరోజు ఆట, పాటలతో చిన్నారులను ఉత్తేజ పరిచారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హాజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. అయితే, బుధవారం ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరు, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. తెరుచుకున్న పాఠశాలలు మొదటిరోజు 32శాతం విద్యార్థుల హాజరు -
పత్తి విత్తనాల ధర తగ్గించాలి
ఎకరాకు పత్తి విత్తనాలు మూడు పాకెట్లు అవసరం కాగా పెరిగిన ధరలతో వాటికి రూ.3,030 ఖర్చువుతుంది. ఇలా వ్యవసాయనికి సంబందించిన ప్రతి వస్తువు పెరిగితే రైతులకు నష్టాలు తప్ప లాభాలు రావు. పెరిగిన పత్తి విత్తనాల ధరలను తగ్గించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. – పాపన్న, పత్తి రైతు, మరికల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి వాణిజ్య పంటల విత్తనాల ధరల ప్రభుత్వ నియంత్రణ ఉంటే బాగుటుంది. తక్కువ ధరకు దొరుకుతాయని లూజుగా తీసుకుని సాగు చేస్తే సరైన దిగుబడి రాక నష్టపోతున్నాం. అన్ని రకాల విత్తనాల ధరలు నియంత్రణలో ఉంచే రైతులకు గిట్టుబాటు అవుతుంది. పెరిగిన కూలీలతో సత్తమతం అవుతుంటే విత్తనాల ధరలు పెరగడం తమను బాధిస్తోంది. – వెంకటన్న, రైతు, మాధవరం విత్తనాలనుపొదుపుగా వాడాలి పెరుగుతున్న విత్తన ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి దూరం, దూరం విత్తనాలు నాటితే పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దగ్గరగా నాటితే ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. ఇలా చేయడం వల్ల ఎకరాకు ఒక ప్యాకెట్ను తగ్గించుకోవచ్చు. పెరిగిన విత్తనాల ధరల విషయం తమ చేతుల్లో ఏమి లేదు. – రహ్మన్, ఏఓ, మరికల్ ● -
ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం..
కోస్గి రూరల్: నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెటర్నరి కళాశాల, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు చేపడుతున్నామని కొడంగల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రి కళాశాలల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత చదువులకు సూదూర ప్రాంతాలకు గతంలో వెళ్లాల్సి వచ్చేదని ప్రస్తుతం తమ ప్రాంతంలోనే కళాశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విద్యాభ్యున్నతి మరింత పెరుగుతుందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ఫిజులు చెల్లించలేని వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, నాయకులు రఘువర్దన్రెడ్డి, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన భారం
● పెరిగిన విత్తనాల ధరలు ● పాకెట్ పత్తిపై రూ.వంద పెంపు ● అదే దారిలో మిరప, కంది, అముదం, వరి ధరలు ● పెట్టుబడి భారమవుతుందని రైతుల ఆందోళన ● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు మరికల్: వానాకాలం సీజన్లో వివిధ రకాల విత్తనాల ధరలను కంపెనీలు పెంచడంతో రైతులపై అధిక పెట్టుబడుల భారం పడుతుంది. సాధారణ పత్తి సాగుకు అవసరమయ్యే సర్టిపైడ్ విత్తనాల ప్యాకెట్ ధరలు పెరగడం రైతులు ఆందోళన కలిగిస్తుంది. కేజీ పత్తి పాకెట్ ధర రూ.910కి పెరిగింది. గతేడాది పోల్చితే రూ.60 వరకు పెరిగింది. జిల్లాలో రైతులపై రూ.కోట్లలో భారం పడనుంది. గతంలో పోల్చితే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగటంతో పెట్టుబడి పెరిగిందని, ఇప్పుడు పత్తి, మిరప, కంది, అముదం, వరి విత్తనాల ధరలు కూడా పెరగడంతో మూలిగేనక్కపై తాడిపండు పడ్డ చందంగా విత్తన ధరలు పెరగటం మరింత భారం కానుందని వాపోతున్నారు. ప్రైవేటుగా కొనుగోలు సాధారణ పత్తి సాగుకు విత్తనాల సరఫరాను ప్రభుత్వం ఎప్పుడో నిలిపి వేసింది. రైతులంతా ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశ పెట్టడంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. యేటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం కంపెనీలకు విక్రయ ధర నిర్ణయిస్తోంది. ఆ మేరకు విత్తనాలు విక్రయించాల్సింటుంది. మార్కెట్లో బీటీ–1, బీటీ–2 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు బీటీ–2 సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధర పెంపుతో దిగాలు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు అవుతుంది. ఎకరాకు 3 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు నాటాలి. ఒక పాకెట్ వెంబడి రూ.100 పెరగటంతో ఎకరాకు రూ.300 అదనంగా భారంగా అవుతుంది. ఇప్పటికే వందల రకాల పత్తి విత్తనాల కంపెనీలు వివిధ పేర్లతో డీలర్లకు అందించటం వారు రైతులకు విక్రయిస్తున్నారు. వీటికి తోడు కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా రైతులు నాసీరకం విత్తనాలతో డీలర్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ధర పెరగడం వల్ల రైతులపై అదనపు భారం పడింది. ఇతర విత్తనాలు మూడేళ్లుగా మిరపతో ఇతర విత్తనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా మిరప విత్తనోత్పత్తి లేకపోవటం పట్ల ప్రైవేట్ కంపెనీలు విక్రయించే విత్తనాలే వారికి దిక్కవుతున్నాయి. పది గ్రాముల విత్తనాలకు రూ. 1500 పలుకుతుంది. సాగును దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన విత్తన కంపెనీలు కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా విత్తనాలు కొనుగోలుకు కర్నూల్ జిల్లా డీలర్లను ఆశ్రయిస్తుంటారు. అలాగే వరి, కంది, అముదం విత్తనాలు కూడా భారీగా పెరిగాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నారాయణపేట: ఎస్పీ యోగేష్ గౌతమ్ను జిల్లా ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొంటూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ సేప్టీ మీటింగ్కు రావాలని సూచించారు. జాతీయ రహదారి 167 రాయచూరు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయని, వాటి నివారణకు సంబంధిత అధికారులు నిర్వహించే రోడ్డు భద్రతా మహోత్సవాలకు ఇక నుంచి భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇక ముందు జరిగే రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పోలీసు శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కురువ మనోజ్, నాయకులు సిద్దన్ లక్ష్మణ్, జరంగ్ రాము, గోల్ల లక్ష్మణ్, వీరేష్ కుమార్, కార్తీక్, అసనుద్దీన్ పాల్గొన్నారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్లు ప్రారంభించినట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైనపాఠశాలలు స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు -
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే
నారాయణపేట: తనపై నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, బావి ప్రధాని రాహుల్గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయంతో చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామన జెండా ఎగరవేస్తూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరవేసేందుకు కృషి చేస్తామన్నారు.బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలినారాయణపేట: యాసంగిలో వరి ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనేప్రభుత్వం బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో 14.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని, అందుకుగాను రూ.71 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ధాన్యం విక్రయించి రెండునెలలు కావస్తున్నా ఇంత వరకు బోనస్ డబ్బులు వేయాలేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. శివకుమార్, శ్రీనివాస్, శరణుబసప్ప పాల్గొన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదలమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
సమయానికి బస్సులు నడిపించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని పాఠశాలలో చదువుకోవడానికి వివిధ గ్రామాల నుండి విద్యార్థులు వస్తారని వారి సౌకర్యార్థం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలని పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ కోరారు. ఈ మేరకు గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఇన్చార్జ్కు వినతిపత్రాన్ని అందజేశారు. విద్యా సంస్థలన్నీ గురువారం నుంచి ప్రారంభ కావడంతో అన్ని గ్రామాలకు విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా బస్సులను నడపాలన్నారు. గత సంవత్సరం పాఠశాల సమయానికి బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యరన్నారు. చాలా మంది విద్యార్థులు పై చదువులు చదవడానికి జిల్లా కేంద్రానికి వస్తుంటారన్నారు. బస్సులు ఆలస్యంగా రావడం వల్ల వారు రోజు ఒకటి, రెండు క్లాస్లు నష్టపోయి విద్యా పరంగా వెనకబాటుకు గురయ్యే అవకాశం ఉందని, గతంలో జరిగిన పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా పాఠశాల సమయానికి బస్సులు నడపాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు శ్వేత, అనిల్, రాము పాల్గొన్నారు. -
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వరదల సమాచారంపై ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో వరద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాదస్థాయి ఎంత అని ఆరా తీస్తూ.. నదీ తీర గ్రామాల్లో 10, మాగనూర్ 4, కృష్ణా గ్రామాలు ఉన్నాయని వాటికి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ వారి యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని ఎస్ఈని కలెక్టర్ ఆదేశించారు. జీపీల దగ్గర వాటర్ ట్యాంకర్స్, బ్లీచింగ్ పౌడర్ వేయాలని అన్నారు. బోట్స్, ఫిషర్ మాన్ పంప్స్ లైవ్ జాకెట్స్, జెసీబీ, ట్రాక్టర్స్ ,ఎమర్జెన్సీ లైట్స్, వాకీ టాకీ అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ వారు వరదలపై జంతువుల రక్షణ కొరకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖ పరిధిలో ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు అందరిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ వరదల్లో ఆహరం, తాగునీరు షెల్టర్ విద్యుత్ రవాణా వాహనాల సదుపాయం తదితర వాటిని ప్రమాద గ్రామాలైన 18 గ్రామ పంచాయతీల్లో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు అందరు హెడ్ క్వార్టర్లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండు నెలల్లో హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ భవన నిర్మాణం హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు రెండు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా కేంద్రానికి సమీపంలో కొనసాగుతున్న హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ సెంటర్లో చేనేత జౌళిశాఖ తరపున ఎలాంటి శిక్షణలు ఇస్తారని ఆరా తీశారు. ఆగస్టు వరకు నిర్మాణ పనులు పూర్తి చేసి సెంటర్ ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం టీజీ ఎంఎస్ఐడిసి టెస్కో ఓఎస్డీ హైదరాబాద్, మహబూబ్నగర్ చేనేత జౌళిశాఖ ఏడితో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టెస్కో ఔస్డి రతన్కుమార్, టిజిఎంఎస్ఐడిసి, ఈఈ రవీందర్, డీఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. మంత్రి శ్రీహరిని కలిసిన కలెక్టర్ నారాయణపేట: మంత్రిగా నియమితులైన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మంత్రి సృగృహంలో కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుదామని మంత్రి కలెక్టర్కు సూచించారు. -
కనులపండువగా ‘రైతుల పండుగ’
భూమిని.. పశువులను.. సేద్యానికి అవసరమైన పరికరాలను.. మొత్తంగా ప్రకృతిని పూజించే.. అన్నదాతల అతిపెద్ద పండుగ ఏరువాక పున్నమిని జిల్లాలోబుధవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. రైతులు ఉదయాన్నే ఎడ్లను కడిగి పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. నైవేద్యాలు సిద్ధం చేసి మంగళ వాయిద్యాలతో పొలాల వద్దకు కుటుంబసభ్యులతో కలిసి ఊరేగింపుగా వెళ్లారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసి పొలం దున్నడం ప్రారంభించారు. సాయంత్రం గ్రామాల్లో ఏరువాక తోరణాలు కట్టి తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా ఆనందోత్సాహాలతో పరుగులు పెట్టించారు. – సాక్షి నెట్వర్క్ మద్దూరు మండలం నందిపాడ్ ఆలయం చుట్టూ ఎద్దుల ఊరేగింపు నర్వలో ఎద్దుల ఊరేగింపులో హారతులు పడుతున్న మహిళలు ఎద్దులను పరుగెత్తిస్తున్న యువకులు -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ లెక్కన మక్తల్ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
మోగనున్న బడిగంట
నారాయణపేట రూరల్: నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం అనంతరం నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఆట, పాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో గురువారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 13మండలాల్లో 339 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 76 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 11 కేజీబీవీలు, రెండు మోడల్, 7 గురుకుల, 4 మాహత్మాపూలే, రెండు మైనార్టీ, రెండు ఎయిడేడ్లతో పాటు 142 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 1.30లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ద్వానా నీరు అందడంలేదు. దీనికి తోడు స్వచ్ఛవిద్యాలయ పేరుతో పాఠశాలలో నిర్మించిన టాయిలెట్స్ వృథాగా ఉన్నాయి. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య, తరగతులకు అనుగుణంగా గదులు లేక ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు శిఽథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల నిర్మాణ పనులు పూర్తికాక దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్ సిద్ధం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడేడ్, గురుకుల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాల కోసం ఆయా ఎమ్మార్సీల నుంచి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు 90శాతం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఎమ్మార్సీకి చేరాయి. వీటిని అన్ని పాఠశాలలకు పంపించగా గురువారం ప్రతి విద్యార్థికి అందించనున్నారు. అదేవిధంగా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నోటుపుస్తకాలను అందిస్తుండగా, ప్రాథమిక తరగతులకు సైతం ఈ సారి నోటు పుస్తకాలు ఇస్తున్నారు. ఇక విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్స్ విషయంలో కొంత వెనకబడి ఉన్నారు. ఒక్కో విద్యార్థికి బడి తెరిచే రోజు ఒక్క డ్రస్ అయిన ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించాలని, అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులకు గతంలో పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు, మార్కులతో బ్యానర్లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల హెచ్ఎంను ఆదేశించారు. ఇక టీచర్లు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే, విద్యాబోధనలో మార్పులకు వేసవి సెలవుల్లో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. నేడే పాఠశాలల పునఃప్రారంభం కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ సిద్ధం స్కావెంజర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు శిక్షణ పూర్తి -
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి
నారాయణపేట: ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి నిర్వహణ ఉండేలా చూసుకోవాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కిడ్స్, అక్షిత, కరుణ, గీత ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి లోపల బయట పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రైస్ చార్టు, నేమ్ బోర్డు, బయో వేస్టేజ్ నిర్వహణ మొదలైనవి సరైన విధంగా ఉండాలని, ఎవరు అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లో నేస్తం ఫిర్యాదు కార్యక్రమం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రైల్వే స్టేషన్లో బుధవారం నేస్తం ఫిర్యాదు పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఆనంద్కట్టా, ఐఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేస్తం కార్యక్రమం ద్వారా ఉద్యోగులు వ్యక్తిగతంగా శాఖ అధికారులను కలిసి తమ సేవా సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తెలియజేసే అవకాశాన్ని పొందుతారని అధికారులు తెలిపారు. సమస్యను బట్టి వాటిని తక్షణం, వారం, 15 లేదా 30 రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేగవంతమైన సమస్యల పరిష్కారం, సానుకూలమైన పని వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. 26న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పోర్ట్స్ స్కూళ్లలో 4 తరగతిలో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసన్ బాల్త్రో, 30 మీటర్ల ఫ్లైయింగ్, 6x10 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాల కోసం 8–9 సంవత్సరాలు 01.09.2016 నుంచి 31.08.2017 మధ్య జన్మించిన వారు ఎంపికలకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ జారీచేసిన జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి ప్రొగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. పైన పేర్కొన్న ధ్రువపత్రాల్లో ఏది లేకున్నా ఎంపికలకు అనుమతించమని తెలిపారు. రాష్ట్రస్థాయి ఎంపికలు జూలైలో ఉంటాయని, మిగతా వివరాల కోసం 94406 56162 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,264 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్కు బుధవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,264, కనిష్టంగా రూ.1,369 ధరలు లభించాయి. అదేవిధంగా ఆముదాలు రూ.6,318, రాగులు రూ.2,310, జొన్నలు రూ.3,067, వేరుశనగ రూ.3,251 ధర పలికాయి. -
నాణ్యమైన విద్యే లక్ష్యం
జిల్లాలోని అన్ని ప్రభు త్వ పాఠశాలలో వి ద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాం. విద్యా శాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. గతంలో వివిధ పాఠశాలల్లో ప్రారంభమైన పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. గత నెల రోజులుగా మిగితా అన్ని పాఠశాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పనులు తుది దశకు చేరుకున్నాయి. మౌళిక సౌకర్యాలైన తాగునీరు కల్పించి టాయిలెట్స్ వినియోగంలోకి తెస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాళీల స్థానంలో సర్దుబాటు జరుగుతుంది. పుస్తకాలు, యూనిఫామ్స్ మొదటిరోజే అందిస్తాం. – గోవిందరాజులు, డీఈఓ ● -
అట్రాసిటీ కేసులకు సత్వర పరిష్కారం
నారాయణపేట: ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతి నెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్గా ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్యువ వికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు పరచాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని నిధులు పక్కదారి పగడకుండా చూడాలని తెలిపారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ వెంటనే ఏర్పాటుచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి చర్యలు కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ ..జిల్లా స్థాయిలో వసతి గృహాల నిర్వహణ, విద్యా, వైద్యం అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కులాంతర వివాహాల కింద 8 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రొత్సాహాన్ని అందిచామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ కోట ప్రకారం మంజూరు చేయాలని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు 9 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా వాటిలో 3 ట్రయల్లో ఉన్నాయని మిగతా 6 విచారణ కొనసాగుతుందని వాటికి గాను రూ.2 లక్షల నష్టపరిహరం చెల్లించడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కేసులలో నింధితులకు శిక్ష పడేలా బలమైన సాక్ష్యాలను ప్రవేశ పెట్టాలని శిక్ష పడకపోతే సంబంధిత అధికారుల శ్రమ అంతా వృథా అవుతుందని కమిషన్ చైర్మన్ చెప్పారు. డీఏఓ జాన్ సుధాకర్ మాట్లాడుతూ రైతుబీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ కింద ఎంతమందికి లబ్ధి చూకూరిన విషయాలు వివరించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, కమిషన్ చైర్మన్ సూచించిన సలహాలు,సూచనలను తప్పక పాటిస్తామని తెలిపారు. అనంతరం బాధితుల సమస్యలపై చైర్మన్ వినతు లు స్వీకరించారు. కమిటి సభ్యులు కొంకటి లక్ష్మినారాయణ, నీలాదేవి, రాంబాబునాయక్, రేణికుంట్ల ప్రవీణ్, ఆర్డీఓ రాంచంద్రనాయక్, జడ్పీసీఈఓ శైలేష్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, డీఆర్డీఏ మొగులప్ప, డీటీడబ్ల్యూఓ జనార్ధన్ పాల్గొన్నారు. ప్రతి నెల చివరి వారంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
నారాయణపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమావేశమై.. 2025–26 విద్యా సంవత్సరం బడిబాట, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, పాఠశాలల్లో సివిల్ వర్క్లు, శిథిలావస్థకు చేరిన పాఠశాలల గుర్తింపు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల తరగతి గదులకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. కిచెన్ షెడ్, స్టోర్ రూం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట ఏజెన్సీ వారు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే తొలగించాలని సూచించారు. బియ్యాన్ని ఒకరోజు ముందే శుభ్రం చేసుకొని ఉంచుకోవాలని తెలిపారు. కడా పరిధిలోని నాలుగు మండలాలకు 313 కంప్యూటర్లు ఎఫ్ఎల్ఎన్ ఏఎక్స్ఎల్ కార్యక్రమం కోసం వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, సీఎంఓసీ రాజేంద్రకుమార్, మిడ్ డే మిల్స్ సమన్వయకర్త యాదయ్యశెట్టి, ప్లానింగ్ కోఆర్డినేటర్ నాగర్జునరెడ్డి, జీఈసీఓ నర్మద ఉన్నారు. ● జిల్లా కేంద్రం సమీపంలోని మెడికల్ కాలేజీలోకి ఇటీవల మార్చిన జిల్లా జనరల్ ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించి.. వివిధ విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద పేర్ల నమోదు కోసం రోగులు అధికంగా ఉండటాన్ని చూసిన కలెక్టర్.. రోజుకు ఎంత మంది ఓపీ, ఇన్ పేషెంట్లు వస్తున్నారని కంప్యూటర్ ఆపరేటర్లను అడిగి తెలసుకున్నారు. ఈ నెల 1నుంచి నేటి వరకు 2వేల మందికి పైగా వైద్యసేవలు పొందినట్లు వివరించారు. రోగులు, వారి బంధువులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అనంతరం సిటీ స్కాన్ విభాగంతో పాటు ప్రసూతి విభాగం, చిన్నపిల్లల వార్డును పరిశీలించారు. మూడో అంతస్తులో ఉన్న నాలుగు ఆపరేషన్ థియేటర్లను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం చేపట్టిన భూమి చదును పనులు, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి.. మరికల్: భూ సమస్యల పరిష్కారం కోసం కోసం ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మరికల్ మండలంలోని మాధవరం, చిత్తనూర్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంకోటి, ఆర్ఐ సుధాకర్రెడ్డి, విజయ్కుమార్, మురళి పాల్గొన్నారు. -
మంత్రి వాకిటి శ్రీహరికి ఘనస్వాగతం
మక్తల్/మరికల్: రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన వాకిటి శ్రీహరి మంగళవారం మొదటిసారిగా మక్తల్ నియోకవర్గానికి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మరికల్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి గజమాలతో సత్క రించి స్వాగతం పలకగా.. గుడిగండ్ల, జక్లేర్, బొందలకుంట, కాచ్వార్ గ్రామాల్లో మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి పూలమాలలతో సత్కరించారు. గుడిగండ్ల నుంచి మక్తల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దండు క్రాసింగ్ వద్ద ఉన్న బసవేశ్వరుడు విగ్రహానికి, నల్లజానమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భగత్సింగ్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామిని మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తంచేస్తూ.. నర్వ మండలం రాయికోడ్కు చెందిన ఆనంద్ శ్రీనల్లజానమ్మ ఆలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ నాగరాజుగౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, గణేశ్కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్ పాల్గొన్నారు. -
తీవ్రంగా నష్టపోతున్నారు..
ప్రభుత్వం ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలను తెప్పించి ఇక్కడి మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో చేపపిల్లలు నాణ్యతగా లేకపోవడం, సరైన మోతాదులో పంపిణీ చేయకపోవడం, చేపపిల్లల నిర్ణీత సైజు లేక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక మత్స్యకారులకు పంపిణీ చేయాలి. అక్రమాలను నివారించాలి. – లక్ష్మయ్య, అమ్మాపూర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు -
పేదల కళ్లల్లో ఆనందం నింపడమే లక్ష్యం
మరికల్: పేదల కళ్లల్లో ఆనందం నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మరికల్లో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో 110 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని.. తాను గృహప్రవేశం కార్యక్రమానికి వస్తానని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్యన్ సదాశివారెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెంకట్రామారెడ్డి, తహసీల్దార్ రాంకోటి, ఎంపీడీఓ కొండన్న, నాయకులు సూర్యమోహన్రెడ్డి, వీరన్న, తిమ్మారెడ్డి, కృష్ణయ్య, రఘు, కుర్మన్న, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాశాఖ అధికారి వెంకటేశ్ శెట్టి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు 15వ తేదీలోగా www.tgss.telangana. gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 94904 09900 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. రాజీమార్గమే ఉత్తమం నారాయణపేట: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివాదాలను పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయని.. ఇరువర్గాలు కలిసి ఒక నిర్ణయానికి వస్తే వెంటనే సమసిపోతాయన్నారు. రాజీ అయ్యే కేసుల పరిష్కారం కోసం ఈ నెల 14న న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 84.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.ప్రవీణ పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే త్వరలో రీకౌంటింగ్కు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే సాక్షి, నాగర్కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచవ్యాప్తం అయిందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కులంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని వివరించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్ప్రసాద్, ప్రమోద్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘నీలి’నీడలు
మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు ఆర్థిక భరోసా అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఏటా రూ.కోట్లు వెచ్చించి.. చేప విత్తనాలు అందిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇది పెద్దగా సత్ఫలితాలు సాధించలేకపోతోంది. దీనికోసం ఉమ్మడి పాలమూరులో ఇప్పటికే అందుబాటులో ఉన్న చేప విత్తనాల ఉత్పత్తి కేంద్రాలకు కొద్దిపాటి నిధులు వెచ్చించి.. వాటిని వినియోగంలోకి తెస్తే ప్రభుత్వం ఆశించిన నీలి విప్లవం సృష్టించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు ‘మీన’ మేషాలు లెక్కిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● పాలమూరులో నష్టపోతున్న మత్స్యకారులు మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిఏటా జిల్లాల వారీగా కోట్లలో చేప విత్తనాలు అవసరమవుతాయి. జిల్లాల వారీగా చేప పిల్లల ఉత్పత్తి జరిగితే వాటిని మత్స్యకారులకు పంపిణీ చేసి పారదర్శకంగా మత్స్య పారిశ్రామిక రంగం వృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఉచిత చేపపిల్లల పంపిణీకి ఉత్పత్తి లేకపోవడంతో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మత్స్య సంపద పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం టెండర్లు నిర్వహించి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేప విత్తనాలను తెస్తే నాణ్యత లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నదులు, జలాశయాలు, చెరువులు, కుంటలు మత్స్యకారులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో 4,624 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ప్రతి ఏడాది 11.07 కోట్ల చేపపిల్లల పెంపకం లక్ష్యంగా ఉంది. చేపపిల్లల పంపిణీ కోసం ఏటా రూ.9 కోట్లు వెచ్చిస్తున్నారు. చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు మత్స్యకారులకు నాణ్యమైన చేప విత్తనాలు లభించడంతోపాటు అక్రమాలకు ఆస్కారం ఉండదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. పిల్లలమర్రిలో నిరుపయోగంగా ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ‘మీన’మేషాలు -
నిఘా నీడలో మార్కెట్!
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు నిఘా నీడలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా పేట మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రూ. 9.92 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 30 సీసీ కెమెరాలను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. యార్డులో విక్రయానికి వచ్చే ధాన్యం చోరీకి గురికాకుండా.. కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేందుకు సీసీ నిఘా దోహద పడనుంది. చోరీలు, జీరో దందాకు కళ్లెం.. వానాకాలం, యాసంగి సీజన్ల్లో రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు మార్కెట్యార్డుకు పెద్దఎత్తున వస్తారు. ఈ సమయంలో ధాన్యం బస్తాలు చోరీకి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే సీసీ కెమెరాల ఏర్పాటుతో ధాన్యం బస్తాల చోరీకి అడ్డుకట్ట పడినట్లు అయ్యింది. మరోవైపు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు చేతివాటానికి, జీరో దాందాలకు కళ్లెం పడుతుందని వ్యాపార పరిశీలకులు భావిస్తున్నారు. చెక్పోస్టుల్లో నిఘా కరువు.. నారాయణపేట మార్కెట్యార్డు పరిధిలోని జలాల్పూర్, మరికల్లో ఉన్న చెక్పోస్టులపై నిఘా లేకుండా పోయింది. వ్యవసాయ ఉత్పత్తుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటుచేసిన చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంపై పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నూతన టెక్నాలజీతో సీసీ కెమెరాలను మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంకు అనుసంధానం చేసుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కానీ మార్కెట్ అధికారులు,పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని పేర్కొంటున్నారు. అక్రమార్కుల్లో దడ.. గతంలో మార్కెట్ యార్డుకు రైతులు ఎంత మేర ధాన్యం తీసుకొస్తున్నారు.. ఎప్పుడు ఏ లారీ వెళ్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సీసీ కెమెరాల ఏర్పాటుతో ఏ దుకాణం నుంచి ఏ లారీ లోడింగ్ చేసుకొని బయటికి వెళ్తుంది.. ఏ మూలన ఏం జరిగినా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. ఏ కమీషన్ ఏజెంట్ వద్ద ఎంత లోడ్ ఉందో కనిపిస్తుంది. అయితే రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించే అక్రమార్కులకు మాత్రం భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా నారాయణపేట మార్కెట్యార్డులో సీసీ కెమెరాల ఏర్పాటుతో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, దళారుల్లో దడ పుట్టిందని చెప్పవచ్చు. రూ. లక్షల్లో ఆదాయం.. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. నారాయణపేట మార్కెట్యార్డులో తొలిసారిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ.. మిగతా మార్కెట్యార్డులను వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాఖాలోని కోస్గి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు అంతంతగానే కొనసాగుతాయి. కానీ చెక్పోస్టు ద్వారా ఆ మార్కెట్ యార్డుకు రూ. లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ మార్కెట్యార్డులో సీసీ నిఘా లేకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా మక్తల్ మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు అంతంతమాత్రం అయినప్పటికీ.. మార్కెట్ పరిధిలోని రాష్ట్ర సరిహద్దు టైరోడ్డు వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ నిఘా లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని మార్కెట్యార్డులు, చెక్పోస్టుల్లో వైర్లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆర్థిక నిపుణులు, వ్యాపార వేత్తలు కోరుతున్నారు. పేట మార్కెట్యార్డులో 30 సీసీ కెమెరాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా.. పారదర్శకంగా వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు ధాన్యం బస్తాల చోరీకి అడ్డుకట్ట -
రెట్టింపు ధరలతో దిగాలు
అమాంతం పెరిగిన జీలుగ విత్తనాల ధర ● గతేడాది 30 కిలోల బస్తా రూ.1,116 ఉండగా.. నేడు రూ.2,137కు పెరిగిన వైనం ● 60 నుంచి 50 శాతానికి పడిపోయిన రాయితీ ● కొనుగోలు చేసేందుకు రైతుల అనాసక్తి ● జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం మరికల్: అధిక దిగుబడులు సాధిచేందుకు సాగు భూమిలో సారం ఉండాలి. ఇందుకు భూమికి బలం ఇచ్చేందుకు రసాయన ఎరువులకు బదులు పచ్చిరొట్ట వినియోగించాలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఈక్రమంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేది జీలుగ. జనుము ధరలు గతేడాది కన్నా రెట్టింపు ధరలు పెరగడంతో ఫర్టిలైజర్, సోసైటీ దగ్గర బోర్డులు దర్శనమిస్తుండటంతో రైతులు బెంబేతెత్తుతున్నారు. జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. జీలుగ ధరలు పెరగడంతో వాటిని కొనుగోలు చేసేందుకు రైతులు అనాసక్తి చూపుతున్నారు. 60 నుంచి 50 శాతానికి పడిపోయిన రాయితీ ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సహకార సంఘాల్లో పంపిణీ చేసే జీలుగ విత్తనాలు గతేడాది వరకు 60 శాతం రాయితీతో అందజేస్తున్న విత్తనాలను ఈ ఏడాది నుంచి 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తోంది. ఒక్కో రైతుకు పాసు పుస్తకంపై రెండున్నర ఎకరాలకు జీలుగ–30 కిలోలు, జనుములు–40 కిలోల విత్తనాలు పంపిణీ చేస్తోంది. సహకార సంఘాల్లో ఎక్కువ చోట్లా పిల్లి పెసర విత్తనాల కొరత నెలకొంది. రాయితీ పోగా గతేడాది 30 కిలోల జీలుగ బస్తా ధర రూ.1,116 ఉండగా 40 కిలోల జనుము బస్తా ధర రూ. 1,448 పలికింది. పిల్లి పెసర 20 కిలోల బస్తా ధర రూ. 1,084 ఉంది. ఈ ఏడాది 30 కిలోల జీలుగ బస్తా ధర రూ. 2,137కు చేరుకుంది. 40 కిలోల జనుము బస్తా ధర 2,510కి పెరిగింది. గతేడాది రాయితీ 60 శాతం వర్తించగా ఈ సారి 50 శాతానికి పడిపోవటం గమనార్హం. మండలానికి800 బస్తాల చొప్పున వానాకాలం కింద సాగు చేసే వరి నేలలు సారవంతం కోసం మండలానికి 800 బస్తాల జీలుగ విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2 వేల బస్తాల జీలుగ విత్తనాలు తెప్పించారు. వరి సాగు అధికంగా ఉండే మండలాల్లో ఎక్కువగా పంపిణీ జరుగుతుంది. కానీ ప్రస్తుతం జీలుగ విత్తనాల ధరలు అమాంతం పెరగడం వల్ల రైతులు పెద్దగా వీటిని తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జీలుగ విత్తనాలు రోజుల తరబడి ఫర్టీలైజర్, సోసైటీల దగర అలాగే ఉన్నాయి. రైతులు జీలుగ విత్తనాలు తీసుకెళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా.. పెరిగిన ధరల కారణంగా రైతులు వాటి జోలికి వెళ్లడం లేదు. -
ధరలను తగ్గించాలి
గతేడాది 30 కిలోల జీలుగ బస్తా రూ.1,116 ఉంటే ఈ ఏడాది 2,137కి పెంచడంతో పిల్లి పెసర విత్తనాలను పొలంలో చల్లుతున్నాం. ఇప్పటికే పంటల పెట్టుబడులు తడిసి మోపెడు అవుతుంటే, జీలుగ విత్తనాల ధర కూడా భారీగా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. రైతుల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకొని పెరిగిన జీలుగ విత్తనాల ధరలను తగ్గించాలి. – భాస్కర్రెడ్డి, రైతు, మరికల్ జీలుగ స్థానంలో పెసర వేస్తున్నాం జీలుగ విత్తనాల ధరలు పెంచడంతో వాటి స్థానంలో భూమి సారం కోసం పిల్లి పెసర వేస్తున్నాం. ఎకరాకు వరి సాగుకు రూ.35 వేల పెట్టుబడి అవుతుంది. జీలుగ విత్తనాల ధరలు పెరగడం వల్ల అదనపు భారం పడుతుంది. అదే స్థాయిలో నేలకు సారం అందజేసే పెసరను పొలంలో చల్లుతున్నాం. ప్రభుత్వం స్పందించి గతేడాది మాదిరిగానే జీలుగ విత్తనాలను రైతులకు అందజేయాలి. – సురేష్, రైతు, కన్మనూర్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు జీలుగ, జనుము, విత్తనాలను అందజేస్తున్నాం. ధరలు పెరిగాయని జీలుగ సాగు చేయడం మానేస్తే పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. తప్పకుండా ఒక హెక్టార్కు 30 కిలోల జీలుగ, 40 కిల్లోల జనుము విత్తనాలు వేయాలి. – జాన్సుధాకార్, జిల్లా వ్యవసాయ అధికారి ● -
మహిళల సమగ్రాభివృద్ధే ధ్యేయం
నారాయణపేట/నారాయణపేట రూరల్: మహిళల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని షీలా గార్డెన్ లో సోమవారం నారాయణపేట మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని 450 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకు అవి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందన్నారు. పేద ప్రజలు పదేళ్లుగా కలలుకన్న సొంత ఇళ్ల నిర్మాణాలు నిజం చేసిందని అన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, ఎంపీడీవో సుదర్శన్, ఎంపీఓ బాలాజీ, నాయకులు శరణప్ప, గౌస్, జనార్దన్ గౌడ్, శంకర్, వెంకటయ్య, మధుసూదన్ రెడ్డి, కోట్ల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
టీపీసీసీలో మనోళ్లు
● ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు ● ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ● ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరో నలుగురు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు. కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్లో పనిచేసిన ఎం.రాజీవ్రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్ ముదిరాజ్ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు. కార్యకర్తల్లో హుషారు టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవ ర్గంలో ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక? టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
సీఎంను కలిసినమంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి సోమవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. హైదరాబాద్లో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అ లాగే, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావును కలిశారు. ఆయన వెంట సతీమణి వాకిటి లలిత, కుమారులు ఉన్నారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి నారాయణపేట: జిల్లాలోని ప్రజాఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఎస్ఐలు, సీఐలకు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఈమేరకు మొత్తం 8 ఫిర్యాదులు అందగా.. వాటిని ఆయా స్టేషన్ సిబ్బందితో మాట్లాడి పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థపై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని తెలిపారు. రేపు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక నారాయణపేట: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాయంత్రం 3 గంటలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల సమస్యల పరిష్కారంతో పాటు భూ సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంఘాల నాయకులు తప్పని సరిగా హాజరై తమ సమస్యలపై కమిషన్కు విన్నవించాలని కలెక్టర్ కోరారు. నీతి ఆయోగ్ సర్వేపై ఎన్యూమరేటర్లకు శిక్షణ కోస్గి (మద్దూరు): కేంద్ర ప్రభుత్వంలో గ్రామాల్లో బీపీఎల్ కింద ఉన్న కుటుంబాలు, వికలాంగుల కుటుంబాలు, విద్యకు దూరంగా ఉన్న కుటుంబాలు, తదితర ఆంశాలపై నిర్వహించే నీతి అయోగ్ సర్వేను ఏ విధంగా చేయాలనేది పంచాయతీ కార్యదర్శులకు, ఆశ, అంగన్వాడీ, ఉపాధ్యాయులకు సోమవారం మద్దూరులోని రైతు వేదికలో నీతి అయోగ్ విషయ నిపుణుడు నరేష్ శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో వీరి శాతం ఎంత, వారి అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సర్వే అధారంగా తీసుకుంటారని తెలియజేశారు. ఈ సర్వే ఏ విధంగా నిర్వహించాలి, ఏఏ ఆంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే దానిపై వివరించారు. పునరావాస పనుల్లో వేగం పెంచాలి సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండాకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
మొదటిరోజే పుస్తకాలు అందించాలి
నారాయణపేట: విద్యాశాఖ, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రగతి పనులపై సోమవారం తన ఛాంబర్లో సమీక్ష జరిపారు. విద్యాశాఖకు సంబంధించి పాఠశాలల పునః ప్రారంభం రోజు వరకు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో బడిబాట కార్యక్రమంలో ఎంత మంది పిల్లలు నమోదు అయ్యారని కలెక్టర్ ప్రశ్నించగా ఇప్పటి వరకు 349 మంది నమోదు అయ్యారని, వారిలో వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి 37 మంది నమోదు అయ్యారని డీఈఓ గోవిందరాజులు వివరించారు. మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఎంత సరఫరా చేశారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను మరింత వేగంగా చేయించాలని నిర్ణీత గడువు నవంబర్లోపు ప్రారంభానికి సిద్దం చేయాలని పీఆర్ఈఈ హీర్యానాయక్కు ఆమె సూచించారు. సోలార్ పవర్ పాయింట్ల కోసం గుర్తించిన ప్రభుత్వ భూముల వివరాలను డీఆర్డీఏ మొగులప్పను అడిగి తెలసుకున్న కలెక్టర్ వెంటనే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూడిఐటి (సదరం) స్లాట్ల పెండింగ్ పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పెండింగ్ను క్లియర్ చేసేందుకు అస్పత్రి సూపరింటెండెంట్తో సమన్వయం చేసుకోవాలని డీఆర్డీఏను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. భూసేకరణ పునరావాసంపై సమీక్ష నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామ సభలు, భూ సేకరణ సర్వేపై వచ్చిన నోటిఫికెషన్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షించారు. ఈమేరకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ భూ సేకరణలో పునరావాసం, పునరుపాధి అనేది భూసేకరణ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన వ్యక్తులు, కుటుంబాలకు మద్దతు అందించే ప్రక్రియను సూచిస్తుందన్నారు. ఇందులో న్యామైన పరిహారాన్ని నిర్ధారించడం వారి పునరావాసం కోసం తగిన సౌకర్యాలను అందించడం, తరచుగా సేకరణ తర్వాత వారి సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం వంటివి ఉంటాయన్నారు. భూ సేకరణ చేసినప్పుడు పట్టాదారులు తమ భూములు కోల్పోతే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. కానీ భూ సేకరణలో భూమితో పాటు జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్అండ్ అర్ చట్టం వర్తిస్తుందని తెలిపారు. వచ్చిన 13 నోటిఫికేషన్లలో 12 మందికి ఆర్అండ్అర్ చట్టం వర్తిస్తుందని పునరావాస పునరుపాధి కమిటీ సభ్యులకు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాంచంద్రనాయక్, సెక్షన్ అధికారి శ్రీధర్, సభ్యులు సతీశ్కుమార్ గౌడ్, పగడాకుల శ్రీనివాసులు, నారాయణపేట, మక్తల ఊట్కూర్ తహశీల్దార్లు పాల్గొన్నారు. ‘బడిబాట’లో బడి బయటి విద్యార్థులను గుర్తించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్భవన్లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి అమ్మమ్మ ఇంట్లో సంబరాలు నారాయణపేట: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, ఆదివారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలోని మంత్రి అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంటా సంబరాలు అంబరాన్నంటాయి. శివమ్మ కుటుంబ సభ్యులు గొడుగుగేరిలోని అంజనేయస్వామి దేవాలయం దగ్గర టపాకులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందంగా డప్పు వాయిస్తూ కేరింతలు కొట్టారు. సత్యనారాయణ చౌరస్తాలో సైతం కుటుంబ సభ్యులందరూ మిఠాయిలను పంపిణీ చేశారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్నగర్), చిత్తరంజన్దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్కర్నూల్), పులి వీరన్న (మహబూబ్నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
బడిబాట.. విద్యకు ప్రగతిబాట
నర్వ: జిల్లాలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ ప్రారంభించింది. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చొప్పున ఈ నెల 19 వరకు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడం.. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు.. పూర్తి వివరాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈమేరకు షెడ్యూల్ను డీఈఓ గోవిందరాజులు ఇదివరకే విడుదల చేశారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. వినూత్నంగా ఉపాధ్యాయులు గ్రామాల్లో పాఠశాలల విద్యాప్రగతితో కూడిన కరపత్రాలను ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలాల స్థాయిలో.. మండల పరిషత్ అధికారులు, ఎస్ఐలు, ఇతర వర్గాల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు ఏం చేయాలనే కార్యచరణను ఎంఈఓ రూపొందిస్తారు. గ్రామ స్థాయిలో కమిటీలు, బడిబాటపై అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహిస్తారు. స్థానిక నేతల భాగస్వామ్యంతో బడిబాటలో గుర్తించిన విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ చేపడుతారు. బడిబాట లక్ష్యాలు.. ● అన్ని గ్రామాల్లోని ఆవాస ప్రాంతంలో బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ● ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచుట, నాణ్యమైన విద్యను అందించడం ● అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్లు దాటిన పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం ● గ్రామ విద్య రిజిష్టర్ను అప్డేట్ చేయడం ● తక్కువ విద్యార్థులున్న పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం ● బాలికా విద్య ప్రాధాన్యతను తెలియజేస్తు వారిని పాఠశాలలో చేర్పించడం ● బడిబాటలో గ్రామాల్లోని పాఠశాలల పరిధిలోని ప్రజాప్రతినిధులను కార్యక్రమంలో పాల్గొనే విధంగా చూడడం ● ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమంలో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించడం. ● ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించి నమోదు చేయడంంతో పాటు పాఠశాలల్లో చేర్పించడం. షెడ్యూల్.. ● మొదటి రోజైన జూన్ 6న ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామసభ, రెండో రోజు 7న ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటింటి సందర్శించి బడీడు పిల్లలను గుర్తించారు. ● 3, 4, 5 రోజులు: 8, 9, 10 తేదీన కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన, బడిమానేసిన పిల్లలను గుర్తించి చేర్పించడం, ప్రత్యేక అవసరాల పిల్లలను భవితా కేంద్రాల్లో చేర్పించడం. ● 11వ తేదీన నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష ● 12వ తేదీన అమ్మ ఆదర్శ కమిటీల ఆద్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం పిల్లలకు పాఠ్య, రాతపుస్తకాల పంపిణీ, ఉచిత యూనిఫామ్స్ అందజేత ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభ ● 16న తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల దినోత్సవం, తరగతి గదుల్లో విషయాల వారీగా అభ్యాసన సామర్థ్యాల వాల్పోస్టర్ల ప్రదర్శన, పిల్లలు రూపొందించిన చార్టులతో గదుల అలంకరణ, చదవడం, గణిత సంబంధిత వాటిపై క్విజ్పోటీలు ● 17న సమీకృత విద్య, బాలిక విద్యాదినోత్సవం నిర్వహణ, బాలికా వివాహాలు, చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు ప్రతిజ్ఞ ● 18న తల్లిదండ్రులు, పోషకులు, గ్రామస్తులు, వార్డుసభ్యులను ఆహ్వానించి తరగతి గదుల్లో చేపట్టిన డిజిటలీకరణ, సౌకర్యాలు చూపించడం, మొక్కల పెంపక ప్రాధాన్యాన్ని పిల్లలకు వివరించడం. ● 19న బడిబాట ముగింపు సందర్భంగా పిల్లలకు క్విజ్పోటీలు. జిల్లా వివరాలిలా.. అన్నిశాఖల సమన్వయంతో.. కలెక్టర్ ఆధ్వర్యంలో అన్నిశాఖలు, అన్ని వర్గాల ప్రజల సమన్వయంతో బడిబాటను ప్రగతిబాటపట్టిస్తాం. పాఠశాల విద్యాశాఖ అందించిన గైడ్లైన్స్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు పీఎంశ్రీ, మన ఊరు మనబడి, దాతల సహకారంతో ప్రత్యేకంగా పాఠశాలల్లో సమకూరిన సౌకర్యాలను, విద్యార్థులు సాదించిన విజయాలను కరపత్రాల ద్వారా తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. – గోవిందరాజులు, డీఈఓ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే లక్ష్యం 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలు.. డ్రాపౌట్స్ తగ్గింపే లక్ష్యంగా ముందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం కలెక్టర్ నేతృత్వంలో డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొదించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కెపాసిటీ బిల్డింగ్పేరిట జిల్లాలోని వివిధ కేటగిరిల ఉపాధ్యాయులకు ఇటీవల మూడు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం లోపు ఉచిత దుస్తువులు, పుస్తకాలు, నోట్బుక్స్ అందించడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచేందుకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు. సామాజిక సేవాసంస్థలు, ఎన్జీవోలు, తదితర వర్గాలను సమన్వయపర్చి బడిబాటను ముందుకు తీపుకెళ్లాలని తెలిపారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని డీఎచ్ఎంఓ మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో హైద్రాబాద్, మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశలోనే క్రీడల పట్ల మక్కువ చూపాలన్నారు. క్రీడలతో శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు అలవడుతాయన్నారు. ఉచితంగా కోచింగ్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయమంటూ.. అసోసియేషన్లను ప్రత్యేకంగా అభినందించారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థులు భవిష్యత్లో క్రికెట్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులకు సెర్టిఫికెట్లు జారీ చేశారు. సమ్మర్ క్రికెట్ క్యాంప్ ఇన్ఛార్జ్ రమణ, డాక్టర్ వినోద్, కోచ్ అజయ్. చెన్నారెడ్డి, జనార్ధన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
‘సీఈఐఆర్’తో పట్టేస్తున్నారు..!
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మనిషి రోజువారి దినచర్యలో సెల్ఫోన్ భాగమైంది. ప్రతిఒక్కరి దగ్గర విలువైన స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. అయితే గతంలో ఫోన్లు చోరీకి గురైనా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా తిరిగి దొరకడం చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోల్పోయిన ఫోన్లను వెంటనే గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోగొట్టుకున్న సెల్ఫోన్లను వెనువెంటనే గుర్తించి రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ల రికవరీ శాతం గణనీయంగా పెరిగింది. దీంతో రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లు పలు సందర్భాల్లో చోరీలకు గురై కోల్పోయిన బాధితులు సకాలంలో తిరిగి లభించడం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్స్టేషన్ల వారీగా.. జిల్లాలో 2024లో 3,261 సెల్ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందగా ఇందులో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1,141 ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఇందులో అత్యధికంగా జడ్చర్ల పోలీస్స్టేషన్ పరిధిలో 715, మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 576 ఫిర్యాదులు, వన్టౌన్ 381, రూరల్ 337, దేవరకద్ర 230 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది మే 31 వరకు 1,348 ఫిర్యాదులు రాగా.. 520 ఫోన్లను రికవరీ చేశారు. చోరీకి గురైన సెల్ఫోన్ల గుర్తింపులోసాంకేతిక తోడ్పాటు రూ.వేల విలువైన ఫోన్లు తిరిగి వస్తుండటంతో బాధితుల ఆనందం -
చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని డీవైఎస్ఓ శెట్టి వెంకటేష్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నెల రోజులపాటు నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. క్రీడాకారులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర జాతీయస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసికోల్లాసంతోపాటు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారని, ప్రతినిత్యం విద్యార్థులు పిల్లలకు వేసవి శిక్షణ శిబిరానికి పంపిస్తే వాళ్లు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తారని అన్నారు. నిజమైన ఆరోగ్యవంతులు క్రీడా స్ఫూర్తిని చాటి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. కోచ్ రమేష్, పిడీ సాయినాథ్, క్రీడాకారులు కనకప్ప పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్కర్నూల్లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి పాలమూరు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన దీక్షల నేపథ్యంలో రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం 2023లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కానీ, 12 గ్రామాల రైతులు, ప్రజలు కంపెనీ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. సరైన న్యాయం కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే చిత్తనూర్లో ఇథనాల్ కంపెనీ వల్ల పెరిగిన కాలుష్య పరిస్థితిని అర్థం చేసుకుని కంపెనీ రద్దు చేయకపోతే తమ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తోందని ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏలినాటి శనిదోష నివారణకు అక్కడే స్నానాలు చేసి నల్లటి వస్త్రాలు ధరించగా వారితో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను సమర్పింపజేశారు. అనంతరం భక్తులు పక్కనే ఉన్న శివాలయాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. పురిటిగడ్డ రుణంతీర్చుకుంటా : మంత్రి చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతులు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి.. ముదిరాజ్ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
నారాయణపేట: బక్రీద్ (ఈద్ –ఉల్ –అజ్హా)ను శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లింలు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నారాయణపేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డితో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు -
ఆర్టీసీ టూర్ ప్యాకేజీ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే వారికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం సంతోష్కుమార్ చెప్పారు. శుక్రవారం ఆర్ఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పది డిపోల నుంచి ఈ బస్సు (సూపర్ లగ్జరీ, డీలక్స్)లను అవసరమైన చోటకు పంపడానికి సిద్ధంగా ఉంచుతామన్నారు. ఏడు రూట్లలో ఆయా ప్యాకేజీలను బట్టి చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ బస్సులో సామూహికంగా ఏదైనా సంస్థ (పాఠశాలలు, కళాశాలలు) లేదా ఇతర సంఘాల తరఫున ఒకేసారి 30 నుంచి 35 మంది వరకు వెళ్లొచ్చేందుకు బుక్ చేసిన వారి పేర ఒకరికి ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే అందరికీ కలిపి పది శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు మహబూబ్నగర్ డిపో మేనేజర్ (ఫోన్ నం.99592 26286)ను సంప్రదించవచ్చన్నారు. దీనికి సంబంధించి ఈనెల 27న రాష్ట్రస్థాయిలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. అంతకంటే ముందే ఎవరైనా ఈ ప్యాకేజీలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఈ ప్యాకేజీకి చెందిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం లక్ష్మీధర్మ, డీఎం బి.సుజాత, పీఓ వి.సుజాత, ఏఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ నుంచి పుణ్యక్షేత్రాలు, దర్శనీయ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం: ఆర్ఎం -
వన మహోత్సవానికి వేళాయె!
నారాయణపేట రూరల్: పచ్చదనం విస్తరింప చే యాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతూ వస్తుంది. గత ప్రభు త్వం హరితహారం పేరుతో 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టగా గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదో విడతలో వనమహోత్సవం పేరుతో దీన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఏడాది ఇప్పటికే నర్సరీలో మొక్కల పెంపకం చేపట్టగా అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈనెల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. పక్కాగా మొక్కల సంరక్షణ సరైన సంరక్షణ లేకపోవడంతో గతంలో నాటిన మొక్కలు కొన్ని రోజులు అయ్యాక చనిపోయి అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు. ఈసారి నాటిన ప్రతి మొక్క బతికేలా సంబంధిత శాఖలు బాధ్యతలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. పంచాయ తీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో నాటిన మొక్కలలో తప్పనిసరిగా 85% మొక్కలు బతికేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీలది. దీంతో మొ క్కల సంరక్షణ పక్కాగా జరగనుందని తెలుస్తోంది. ఆవాసాలను బట్టి పంపిణీ.. ఈసారి ఆవాసాలను బట్టి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి ఇంటి ఆవరణలో స్థలం ఉన్నచోట పూలు, పండ్ల మొక్కలు నాటించేందుకు సిద్ధమయ్యారు. కమ్యూనిటీ స్థలాల్లో కలపనిచ్చే మొక్కలు, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, అవెన్యూ ప్లాంటేషన్, ప్రకృతి వనాల్లో నీడనిచ్చే మొక్కలను పెట్టేందుకు సిద్ధమయ్యారు. రైతుల పొలాల గట్లు, రహదారులకు ఇరువైపుగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏటా తగ్గుతున్న లక్ష్యం జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో 280 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ చొప్పున మొత్తం అన్ని నర్సరీల్లో 13 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. గత ఏడాది మిగిలిన బ్యాగులకు సంబంధించి మరో 3.21 లక్షల మొక్కలను సైతం పెంచారు. నిర్వహణ కోసం అదనంగా మరో ఐదు లక్షలకు పైగా నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 8.6 లక్షల మొక్కలు వనమహోత్సవానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 2023లో 44 లక్షల మొక్కలను నాటారు. తదుపరి ఏడాది 15 లక్షలు, ఆ తర్వాత 12 లక్షలు మొక్కల పెంపకం చేపట్టారు. అందుబాటులోని మొక్కలు.. ముఖ్యంగా జిల్లాలోని గ్రామపంచాయతీ నర్సరీలలో టేకు, సుబాబుల్, వేప, కానుగ, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి రకాలను సిద్ధంగా ఉంచారు. వీటికి తోడు ఈత, తాటి మొక్కలు సైతం అందించనున్నారు. ఆయా మొక్కల పెంపకానికి పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గ్రీన్ షర్ట్స్ వేసి ఎండల నుంచి సంరక్షించారు. ముందస్తుగా వర్షాలు పడడంతో మొక్కలు నాటే ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. మొక్కలు నాటేందుకు సర్వం సిద్ధం జిల్లాలో 8.6 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం నర్సరీలో అందుబాటులో మొక్కలు.. -
బక్రీద్ పండుగకు ఏర్పాట్లు
నారాయణపేట: బక్రీద్ పండుగ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ దర్గా ఈద్గా దగ్గర స్థానిక సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బక్రీద్ రోజు ప్రార్థన చేయడానికి వచ్చే ముస్లింలకు ట్రాఫిక్జామ్ లేకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ప్రజలు శాంతియుతంగా తమ పండగలను జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. -
మూడేళ్లలో ‘పాలమూరు’ పూర్తి చేస్తాం
అడ్డాకుల/నవాబుపేట: ‘కుట్రదారులు ఎన్ని కుతంత్రాలు పన్నినా.. తెలంగాణ రైజింగ్ను ఆపలేరని.. తెలంగాణ వెలుగుతోంది.. మనకు ఇక ప్రపంచంతోనే పోటీ’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతలను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు.శుక్రవారం నవాబ్పేట, మూసాపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ను బట్టి 2033– 35 సంవత్సరానికి ప్రణాళిక వేసుకుని 33,700 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సంపద సృిష్టించి.. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు విద్యుత్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి భవిష్యత్లో తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడేలా వివిధ దేశాల కంపెనీలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ స్వర్ణమ్మ, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ చైర్మన్లు ప్రశాంత్, కథలప్ప, తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ ఇవ్వలేదు: మంత్రి జూపల్లి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినా చంద్రబాబునాయుడు వద్దన్నందుకే బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసినా నాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన గత బీఆర్ఎస్ పాలన మాదిరిగా సాగితే రాష్ట్రాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చేదన్నారు. అందుకే బీఆర్ఎస్ను దగ్గరికి రాకుండా దూరం పెట్టాలని ప్రజలను కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలకు రూ.102 కోట్లు విడుదల చేస్తాం చౌదర్పల్లి లిఫ్ట్కు త్వరలో అనుమతులిస్తాం తెలంగాణ రైజింగ్ను ఆపలేరు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
రాజీమార్గంతో కేసుల పరిష్కారం
నారాయణపేట: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్సివిల్ జడ్జి, లీగల్ సర్విసెస్ కార్యదర్శి వింధ్య నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో భాగంగా నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న 6,500 కేసులను టార్గెట్ దృష్టిలో ఉంచుకొని ఎన్ని కేసులను పరిష్కరిస్తారో ఆరాదీశారు. ఈ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించాలని ఆదేశించారు. త్వరగా పెండింగ్లో ఉన్న కేసులని ఈలోక్ అదాలత్ను కక్షిదారులు ఉపయోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యాధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండాలోని అంశాలను క్రిమినల్ కంపౌండబుల్ కేసులు సివిల్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులను, ఎన్ఐ యాక్ట్ పెండింగ్లో ఉన్నాయా చర్చించారు. పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క కేసు ఈ లోక్అదాలత్లు డిస్పోజల్ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. సమావేశంలో పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎకరాకుసాగునీరు అందిస్తాం మక్తల్: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఈమేరకు భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి వానాకాలం పంటలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ బీమా ఫేస్ –1 కృష్ణానది నుంచి పంప్హౌస్లో మోటార్లను ప్రారంభించి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. వానాకాలం సీజన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, సంగంబండ రిజర్వాయర్ దగ్గర కుడి కాల్వ నుంచి సాగునీరు అందించేందుకు తగు ఏర్పాట్లు చేస్తామని, సంగంబండ గ్రామం దగ్గర బండ పనులు త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కాల్వలు నిర్మించేందుకు నిధులు తీసుకువచ్చి రైతులకు సాగునీరందిస్తామన్నారు. కార్యక్రమలలో నీటిపారుదల శాఖ అధికారి నాగశివ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్కుమార్, వెంకటేస్, తాయప్ప, గోవిందు, రవికుమార్ అదికారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి పాలమూరు: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో భారత్ అవతరించిందని, వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సదస్సులో ఆయన మాట్లాడారు. సమర్థవంతమైన నాయకత్వం, నిర్ణయాత్మకంగా నిర్ణయాలతో మోదీపాలన సాగుతుందన్నారు. ఎన్నో చారిత్రాత్మకమైన విజయాలతో మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవ ఘనంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక గొప్ప విజయం అని, సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పర్యావరణం రక్షించడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతతో ఒక మొక్క నాటాలని పిలపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, సత్యం, కృష్ణవర్ధన్రెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, రమేష్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
నారాయణపేట: జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. గతేడాది పట్టణ, పల్లె ప్రగతి పేరిట మొక్కలు నాటారని, ఈ వర్షాకాల ఆరంభంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అవెన్యూ ప్లాంటేషన్పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, చిన్న చిన్న మొక్కలకు బదులు 5 ఫీట్ల పొడవు గల మొక్కలు నాటాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కోసం రోడ్లను గుర్తించాలని, ఎక్కువ పొడవు కోసం రోడ్లను గుర్తించాలన్నారు. నర్సరీలలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటిలో ఏఏ రకాలు పొడవైన మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడాలని, పట్టణ ప్రాంతాల్లోని లే అవుట్లలో గల పది శాతం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది కోసం ప్రస్తుతం ఇచ్చిన లక్ష్యం కంటె అదనంగా 20 శాతం ఎక్కువ మొక్కలు ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ శైలేష్కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, మండలాల ఎంపిడీఓలు, ఎపిఓలు పాల్గొన్నారు. జీరో సిస్టంను వినియోగించుకోవాలి జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ శాఖలు చేపట్టిన నిర్మాణాలకు బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, గ్రావెల్ కొనుగోలు చేయడం కోసం గనులు, భూగర్భ శాఖ ప్రవేశపెట్టిన జీరో పర్మిట్ సిస్టంను వినియోగించుకోవాలనిఅడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. కలెక్టరేట్లో ఈమేరకు సమీక్షించారు. గనుల భూగర్భ శాఖ జీరో పర్మిట్ సిస్టం ద్వారా ప్రభుత్వానికి చెల్లించే రెవెన్యూ లీకేజీని అరికట్టవచ్చని, అలాగే ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఖనిజాల కొనుగోలు సులభతరం అవుతుందని అన్నారు. జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ నిర్మాణాలలో ఉపయోగించే ఇసుక తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి బల్క్ అర్డర్ల ద్వారా ఇసుక కొనుగోలు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారని తెలిపారు.ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ శాఖలు చేపట్టిన నిర్మాణాలకు ఇసుక తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలిపారు. సమావేశంలో గనులు, భూగర్భశాఖ సహయ సంచాలకులు సంజయ్కుమార్, డీఎస్పీ నల్లపు లింగయ్య, పీఆర్ఈఈ హిర్యానాయక్, హౌసింగ్ పిడి శంకర్ నాయక్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మనందం, మిషన్ భగీరథ ఈఈ రంగరావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనేమెరుగైన విద్య కోస్గి: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, నిష్టాతులైన ఉపాధ్యాయులు బోధిస్తారని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య, నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, పౌష్టికాహరం వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 19 వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుందన్నారు. నాయకులు, మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ బడుల బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంఈఓ శంకర్నాయక్ పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో భయపెడుతున్నారు
ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకం. దీన్ని నిరసిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశామంటున్నారు. ఆ కేసులు వెంటనే ఎత్తివేయాలి. అమాయక రైతులను జైలుకు పంపి వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. – శ్రీనువాసులు, బీఆర్ఎస్ నాయకుడు, రాజోళి పొలం వద్దకు వెళ్లి అరెస్టు చేశారు.. పొలంలో బోర్ మోటార్ ఆన్ చేసి వస్తానని చెప్పిన మా బాబును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పని చేసుకుని జీవించే మా ఇంట్లో వాళ్లను ఇలా అరెస్టు చేస్తే మేము బతికేది ఎలా. వెంటనే మా బాబు చిన్న నాగేంద్రంను వదిలిపెట్టాలి. – నర్సమ్మ, చిన్న నాగేంద్రం తల్లి ఆధారాలు ఉంటేనే కేసులు గ్రామస్తులు మమ్మల్ని లెక్కచేయకుండా వందలాదిగా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న వాహనాలను ధ్వంసం చేసి, వ్యక్తుల పై కూడా దాడులు చేసే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దాడులకు సంబందించి ఆధారాలను చూసే కేసులు నమోదు చేస్తున్నాం. వారు చేస్తున్న నేరం తీవ్రతను బట్టే సెక్షన్లను పెడుతున్నాం. అమాయక రైతులు, దాడుల్లో పాల్గొనని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జగదీశ్, ఎస్ఐ రాజోళి ● -
వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్తో కొత్త వంగడాలు
నర్వ: కేంద్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా కొత్త వంగడాలను రైతులకు అందిస్తుందని ఐసీఏఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్డి. ప్రసాద్ అన్నారు. గురువారం పాథర్చేడ్లో ఐసీఏఆర్, ఐఐఓఆర్, కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం) ఆధ్వర్యంలో నూనెగింజల పంటల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది రైతులకు 700 జిల్లాల్లో ప్రత్యేక్ష సంభాషణ ద్వారా నూతన సాంకేతికత, ఉత్పాదకాలు, కొత్తవంగడాలపై అవగాహన కల్పిస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, మట్టి పరీక్షల కార్డులను రైతులకు అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా సైంటిస్టులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దేశంలో నూనెగింజల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నూనెగింజల ఉత్పత్తిని బాగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆముదం పంట సాగును బాగా విస్తరించేందుకు తీసుకోవాల్సిన అవసరం, పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఎప్పుడు ఒకే పంట కాకుండా పంటల మార్పిడి చేస్తే అధిక దిగుబడులు సాదించవచ్చన్నారు. అనంతరం రైతులకు ఐసీహెచ్–5 అనే ఆముదం విత్తనాలను ఉచితంగా రైతులకు అందించారు. కార్యక్రమంలో సైంటిస్టులు సురేష్, రాజేందర్రెడ్డి, నర్వ ఏఓ అఖిలారెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
జడ్చర్ల/అడ్డాకుల/నవాబుపేట: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట, జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేటలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూసాపేటలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, కలెక్టర్ విజయేందిర, నవాబుపేటలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్తగా 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లు 16, నవాబుపేటలో కొత్తగా 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తెలిపారు. కాగా.. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలంలో 132/33 కేవీ సబ్స్టేషన్తో పాటు మరో ఎనిమిది సబ్స్టేషన్లకు కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మూసాపేట సభలో మైనార్టీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు రైతులకు మంజురైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇలా: శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో మూసాపేటకు రానున్నారు. 12 గంటల వరకు అక్కడే పలు సబ్స్టేషన్లకు సంబంధించి శంకుస్థాపన చేయడంతో పాటు అధికారులు, నాయకులను కలుస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మూసాపేట నుంచి నవాబుపేటకు బయల్దేరుతారు. అక్కడ 17 సబ్స్టేషన్లకు శంకుస్థాపనలు చేయడంతో పాటు అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.15 నుంచి 5 గంటలకు నవాబుపేటలో బహిరంగసభలో పాల్గొంటారు ● డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సభ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. నవాబుపేట సమీపంలోని రైస్మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ లింగం, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ జయరాంనాయక్, తదితరులు ఉన్నారు. జడ్చర్ల పరిధిలో 16, దేవరకద్ర పరిధిలో8 సబ్స్టేషన్లకు శంకుస్థాపన మరో రెండు 132/33 కేవీ సబ్స్టేషన్లకు శ్రీకారం నేడు మూసాపేట, నవాబుపేటలో మల్లు భట్టి విక్రమార్క పర్యటన -
ఆహారం విషయంలోజాగ్రత్తలు పాటించాలి
ఊట్కూరు: వయసు పైబడివారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మండలంలోని పగిడిమారిలో గురువారం ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంపులో ఉచితంగా బీపీ, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించి పలువురికి సూచనలతోపాటు మందులను పంపిణీ చేస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు ఆహార నియమాలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యప్రకాష్, డాక్టర్ సంతోషి, వైధ్య సిబ్బంది విజయ్కుమార్, అశోక్కుమార్, శ్రీదర్, సుజాత తదితరులు పాల్గొన్నారు. భూ భారతిలో 475 దరఖాస్తులకు మోక్షం మద్దూరు: భూభారతి పైలెట్ మండలమైన మద్దూరులో మొత్తం 475 దరఖాస్తులకు మోక్షం లభించింది. ఏప్రిల్ 28 వరకు మండలంలోని 30 గ్రామాల్లో భూభారతిలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. భూ సమస్యలపై ఆయా గ్రామల్లో ప్రజల నుంచి మొత్తం 1341 అర్జీలు రాగా.. వాటిని కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓ, ఆరుగురు తహసీల్దార్లు వాటిని పరిశీలించారు. వీటిలో 475 దరఖాస్తుల భూ సమస్యలను పరిష్కరించారు. వివిధ కారణాలతో 753 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. 113 సాదాబైనామాలు కోర్టులో కేసులు ఉండడం, తిరస్కరణకు గురైన వాటిలో 192 వివిధ దశల్లో ఉన్నట్లు సమాచారం. ఎంపీ మల్లురవిపై అధిష్టానానికి ఫిర్యాదు అలంపూర్: నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్కుమార్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ మల్లు రవి జిల్లాలో పర్యటించారు. ఈక్రమంలో కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత ఇంటికి ఎంపీతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెళ్లడంపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అలంపూర్ క్షేత్రానికి ఆయన విచ్చేయగా.. సొంత పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ను మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఐటీఐలో ప్రవేశాలు వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో 2025–26, 27 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడత ప్రవేశాలకు ఉపాధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేశామని, సీట్ల భర్తీకి అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రమేష్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు iti.telangana.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 21 వరకు అవకాశం ఉందని, ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 79953 35372, 98492 44030లను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: జిల్లాలోని గిరిజన బాల, బాలికల నుంచి బెస్ట్ అవైలేబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 10 ఖాళీలకు గాను 3, 5, 8 తరగతుల విద్యార్థులు అర్హులని, వనపర్తి జిల్లా, గిరిజన తెగలకు చెందిన (లంబాడీ, ఎరుకల వారు) విద్యార్థులు ధ్రువపత్రాలతో ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతం వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత వారి ఆదాయం రూ.2 లక్షలు మించకూడదని, దరఖాస్తు ఫారాలు క లెక్టరేట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. -
విత్తన ఎంపికే కీలకం
‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్ నారాయణపేట: ‘వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం ఎంతో కీలకం. లైసెన్స్డ్ డీలర్లతోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్రతి కొనుగోలుకు సంబంధించి రశీదు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు విత్తితే నష్టమే మిగులుతుంది. జూలై 15 వరకు విత్తనాలు విత్తేందుకు అనువైన సమయం. సేంద్రియ ఎరువులు వాడడం, పంటల మార్పుతో అధిక దిగుబడులు పొందవచ్చు. మరో ముఖ్య విషయం.. బీజీ 3 పత్తి విత్తనాలు విత్తితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలి’.. అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్ అన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విత్తన ఎంపిక, వాడకం, విత్తనశుద్ధి, ఎరువులు, మందుల వాడకం, ఏయే కార్తెల్లో పంటలు, భూముల్లో ఏ రకమైన పంటలు వేయాలి.. ఇలా పలు అంశాలపై రైతులకు డీఏఓ సలహాలు, సూచనలు చేశారు. ● ప్రశ్న: పత్తిలో ఏ రకాలు వేసుకోవచ్చు ? – మహేశ్గౌడ్, బిజ్వార్ ● డీఏఓ: వివిధ కంపెనీలకు చెందిన హైబ్రిడ్ పత్తి విత్తనాలు మార్కెట్లో చాలా ఉన్నాయి. నేలలో సారం, యాజమన్య పద్ధతులను బట్టీ పంటలో దిగుబడులుంటాయి. దుక్కి చేసే సమయంలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, ఎకరానికి 50 కిలోల డీఏపీ ఆఖరి దుక్కిలో వేయాలి. కలుపు నివారణకు విత్తిన 48 గంటలలోపు పెండిమిథిలిన్ లీటర్ల 200 లీటర్ల నీటిలో పిచికారీ తర్వాత కలుపు 2–4 ఆకుల వయస్సులో హిట్వీడ్ మాక్స్, టార్ట సూపర్ మందు వాడాలి. ● ప్రశ్న: ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాలు ఏవి వేయాలి ? – శ్రీహరి, కానుకుర్తి ● డీఏఓ: జ్వాల, జ్యాతి, కిరణ్, పీసీఎస్ 262, పీసీహెచ్111, డీసీహెచ్ 177.. పొద్దుతిరుగడులో ఏపీఎస్హెచ్ 11 కేబీఎస్హెచ్1, ఎస్డీఎస్హెచ్1, డీఆర్ఎస్హెచ్1 వేసుకోవచ్చు. ● ప్రశ్న: జీలుగా సాగు చేయడం ఎలా ? – నర్సింహారెడ్డి, అడవి సత్యారం ● డీఏఓ: జీలుగ విత్తనాలతో పంటకు కావాల్సిన సారం వస్తుంది. జీలుగా సాగు చేసిన 25 నుంచి 45 రోజుల వ్యవధిలో పూత దశకు వస్తుంది. జీలుగ విత్తనాలు సబ్సిడీతో రైతులకు అందిస్తున్నాం. జీలు గ వేయడంతో చౌడు నెలలు సత్వ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మూడేళ్ల పాటు జీలుగా ప్రతి ఏడాది వరి నాటే ముందు వేసి కలియదున్నాలి. ● ప్రశ్న: నువ్వులు, మినుములు, ఉలవలు ఏ రకా ల విత్తనాలు వేసుకోవాలి ? – వెంకట్, దామరగిద్ద ● డీఏఓ: నువ్వుల్లో శ్వేత, రాజేశ్వరి, ఎలమంచిలి 66, చందన, జేసీఎస్ 9428 (హిమ), మినుములో ఎల్బీజీ 623, ఎల్బీజీ 762, ఎల్బీజీ 20, పీయూ 31, ఎంబీజీ 209, ఎల్జీబీ 787, డబ్ల్యూజీ 26, ఉలవలు సిహెచ్సీ 9, పీడీఎం 1, బీజెడ్ఎం1, పాలెం 1, పాలెం 2 , పిహెచ్జీ 62, పీఆర్హెచ్జీ 19 వేసుకోవచ్చు. ● ప్రశ్న: ఎర్ర చలక, నల్ల రేగడి నేలల్లో ఏ పంటలు వేసుకోవచ్చు ? – వెంకటప్ప, ఊట్కూర్ ● డీఏఓ: ఎర్ర చలక నేలల్లో నీటి నిల్వ ఉండే సామర్థ్యం తక్కువ. ఎర్ర చలకలను దుక్కి దున్నడం, విత్తడం, అంతర కృషి చేయడంతో నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేయాలి. ఈ నేలల్లో వేరుశనగ పంట బాగా పండుతుంది. ఇక నల్ల రేగడి నేలల్లో పత్తి, జొన్న పంటలు పండిస్తే అధిక దిగుబడి వస్తుంది. ● ప్రశ్న: అలసంద, సజ్జ, కొర్ర, జొన్నలో ఏ విత్తనాలు వేయవచ్చు ? – రాజు, నర్వ ● డీఏఓ: అలసందలో జీసీ3, వి240, సి152 విత్తనాలు, జొన్నలో సీఎస్హెచ్ 25, సీఎస్హెచ్ 16, సీఎస్హెచ్ 30, పీఎస్వీ 56, సీఎస్వీ 31, సీఎస్వీ 27 విత్తనాలు, సజ్జలో ఐసీఎంవీ 221, ఐసీటీపీ 8203, పీహెచ్వీ 3, కొర్రలో సూర్యనంది, ఎస్ఐ ఏ 3156, ఎస్ఐఏ 3085 విత్తనాలు వేసుకోవచ్చు. ● ప్రశ్న: కంది, పెసర ఏ రకాలు అనువైనవి ? – శ్రీనివాస్, బాపన్పల్లి ● డీఏఓ: కందిలో కొలంబో, డబ్ల్యూఆర్జీ 93 (తెలంగాణ కంది), పీఆర్జీ 100, పీఆర్జీ 158, పీఆర్జీ 175, మారుతి, ఆర్జీపీ 1, అలాగే పెసరలో యాదాద్రి (డబ్ల్యూజీజీ42), టీఎం 9602, ఎంజీజీ 295, ఎంజీజీ 347 విత్తుకోవచ్చు. తెల్ల కందులు విత్తితే ట్రైకోఢర్మ వికోతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పీఆర్జీ 176/పింక్ కందులు, దుర్గ, ఆశ రకాలను నీటి పారుదల కింద విత్తుకోవాలి. ప్రశ్న: వరిలో ఏ సన్న రకాలకు బోనస్ వస్తుంది ? – శ్రీనివాస్రెడ్డి, కొత్తపల్లి డీఏఓ: వరి ధాన్యంలో 33 సన్నరకాలకు ప్రభుత్వం నుంచి బోనస్ వర్తిస్తుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల సన్న రకాల వరి ధాన్యం పండిస్తారు. బోనస్ వచ్చే సన్నరకాల విషయానికి వస్తే.. వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14), వరంగల్ సన్నాలు (డబ్ల్జూఎల్ 32100), జగిత్యాల్ మసూరి (జెజీఎల్11470), సిద్ది (డబ్ల్యూజీఎల్44), కంపసాగర్ వరి 1 (కేవీఎస్2874), సాంబ మసూరి (బీపీటి 5204), జగిత్యాల్వరి 3 (జేజీఎల్ 27356), జగిత్యాల్ వరి 2 (జెజీఎల్ 28545), పొలాసప్రభ (జేజీఎల్ 384), వరంగల్ వరి 2 (డబ్ల్యూజీఎల్ 962), ఎంటీయూ 1271, రాజేంద్రనగర్ వరి 4 (ఆర్ఎన్ఆర్ 21278), కూనరం వరి 1 (కేఎన్ఎం 733), జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798), కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458), మానేరు సోనా (జేజీల్ 3828), తెలంగాణసోనా (ఆర్ఎన్ఆర్ 15048), వరంగల్ వరి 1119, కూనరం వరి 2 (కేనెం 1638), జగిత్యాల సాంబ (జేజేఎల్3844), అంజన (జేజీఎల్ 11118), సోమ్నాథ్ (డబ్ల్యూజీఎల్ 347), ఆన్ఆర్ఆర్ 31479 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), జేజీఎల్ 33124 (పీఆర్సీ), నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34449), ప్రత్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), శోభిని (ఆర్ఎన్ఆర్ 2354), హెచ్ఎంటీ సోనా , మార్జేరు మసూరి (ఎంటీయూ 1262), మార్జేరు సాంబ (ఎంటీయూ 1224 ). ప్రశ్న: సన్న రకాలు ఎప్పటి వరకు విత్తుకోవచ్చు ? – నారాయణరెడ్డి, కొత్తపల్లి డీఏఓ: సన్న రకాల్లో దీర్ఘకాల, స్వల్ప కాలిక వరి ధాన్యం పంటలను సాగు చేసుకోవచ్చు. అందులో దీర్ఘకాలిక పంటలను జూన్ 15 వరకు నారు పోసుకోవాలి. స్వల్పకాలిక రకాలను జూలై 15 వరకు నారు పోసుకోవచ్చు. ప్రశ్న: కూరగాయలు, పండ్ల తోటలకు అనువైన పొలాలు తెలపండి? – రంగారెడ్డి, అప్పిరెడ్డిపల్లి డీఏఓ: ఎర్ర చలక నెలలు అనుకూలం. జిల్లాలో దామరగ్ది, మద్దూర్, కోస్గి, నారాయణపేట మండలాలతో పాటు మిగతా మండలాల్లో సైతం కూరగాయలు, పండ్ల తోటలను పండించవచ్చు. బొప్పాయి, మామిడి, బత్తాయి తదితర పండ్ల తోటలతో పాటు అన్ని కూరగాయలు పండించవచ్చు. ప్రశ్న: కలుపు నివారణకు ఎలాంటి మందులు వేయాలి ? – రాఘవేందర్, ధన్వాడ డీఏఓ: కంది, పత్తి ఇతర పంటలు వేసి 48 గంటల్లో పెండిమిథాలిన ఎకరానికి లీటర్ చొప్పున పిచికారీ చేయాలి. ఏఈఓలను సంప్రదించిన తర్వాతనే మందులు, ఎరువులు వాడాలి. కందిలో ఎండు తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనాలకు 10 గ్రాముల విత్తనశుద్ధి చేయాలి. ప్రశ్న: పత్తి విత్తన కొనుగోలులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – రవీంద్రారెడ్డి, వడ్వాట్ డీఏఓ: జీఈఏసీ అప్రూవల్తో పాటు విత్తనాల ప్యాకెట్పై సుటేబుల్ ఫర్ తెలంగాణ లాట్ నంబర్ ఉండాలి. లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. రషీదులు తప్పక తీసుకోవాలి. పంట కాలం పూర్తి అయ్యే వరకు ఆ విత్తనాల ప్యాకెట్లను, రషీదును భద్రపరచుకోవాలి. ప్రశ్న: బీజీ 3 పత్తి విత్తనాలు వాడితే ఏమవుతుంది? – బాల్రాం, కోటకొండ డీఏఓ: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఇస్తే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో 13 బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ దృష్టి సారిస్తున్నాం. లూజ్ విత్తనాలు అమ్మితే వాటిని కొనుగోలు చేయవద్దు. బీజీ 3 విత్తనాలు వాడితే పొలం పాడవుతుంది. కలుపు నివారణకు వాడే గడ్డి మందులతో పంటంతా విషపూరితంగా మారుతుంది. పత్తి ఏరిన వారికి, దుక్కిలో వాడే పశువులు, తిరిగే మనుషులు సైతం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. బీటీ 2 విత్తనాలు మాత్రమే వాడాలి. లైసెన్స్డ్ డీలర్లతోనే విత్తనాలుకొనుగోలు చేయాలి పదును, అదును చూసి విత్తుకోవాలి సేంద్రియ ఎరువులు, పంట మార్పుతోనే దిగుబడులు నకిలీ విత్తనాల కట్టడికి 13 బృందాలతో నిఘా బీజీ 3 పత్తి విత్తనాలతో క్యాన్సర్ ముప్పు -
అలజడి.. ఆందోళన
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆ చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజల్లో కునుకులేకుండా పోయింది. తాజాగా బుధవారం ఫ్యాక్టరీ వద్ద జరిగిన దాడులు, నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పెద్ద ధన్వాడతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. రైతులు చేసిన దాడికి సంబంధించి కంపెనీకి చెందిన సీఏఓ మంజునాథ్ రాజోళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల్లో తమ సిబ్బంది పలువురికి గాయాలు కావడంతో పాటు కంపెనీకి చెందిన వాహనాలు, సామగ్రి ధ్వంసమైనట్లు అందులో పేర్కొన్నారు. దాడులకు దిగిన 41 మందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేయగా.. ఇందులో జనం సాక్షి పత్రిక ఎడిటర్ రహమాన్తో పాటు నాగర్కర్నూల్ జిల్లా సబ్ జైలర్ నాగరాజు ఉండడం చర్చనీయాంశంగా మారింది. దాడుల సమయంలో వారు ఘటన స్థలంలో లేరని.. అయినా వీరి పేరు చేర్చడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై రాజోళి ఎస్సై జగదీష్ని సంప్రదించగా.. దాడులకు ప్రేరేపించింది రహమాన్, నాగరాజు అని, మంజునాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మానవపాడు మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేఎంఎస్ శ్రావణ్పై కేసు నమోదైంది. 191(2), 191(3), 329(3), 329(4), 324(5), 126(1), 326(జీ), 115(2), 118(1), 121(1), 132, 126(2), 109, 61(2), 199బీఎన్ఎస్, 0 సీఎల్ఏఏ–2013 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా.. కేసులు నమోదైన వారిలో 12 మందిని పోలీసులు గద్వాల జిల్లా కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్కు తరలించిన వారిలో పెద్ద ధన్వాడకు చెందిన రైతులు నర్సింహులు, కె.నర్సింహులు, భరత్ కుమార్, చిన్న నాగేంద్ర, నల్లబోతుల కాటన్, శివ గౌడ్, సూర్యప్రకాష్, భీమన్న, మనోహర్, యేసన్న, నాగేంద్రంతోపాటు చిన్న ధన్వాడకు చెందిన పరుషరాముడు ఉన్నారు. జడ్జి తీర్పు అనంతరం పోలీసులు వీరిని ప్రత్యేక వాహనంలో మహబూబ్నగర్లోని జిల్లా జైలుకు తరలించారు. బిక్కు బిక్కుమంటూ.. బుధవారం ఘటన అనంతరం రాత్రి పోలీసులు అరెస్టులు మొద లు పెట్టడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. గ్రామంతో పాటు ఇటు చిన్నధన్వాడ గ్రామస్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు తీసిన వీడియోల ఆధారంగా అరెస్టులు ఉంటాయని తెలియడంతో, మామూలుగా ఘటనా స్థలి దగ్గరకు వెళ్లిన వారు కూడా ఆందోళన చెందుతున్నా రు. వీరితో పాటు అదే ప్రాంతంలో ఫ్యాక్టరీ పక్కనే తమ పొలాలు ఉన్న వారు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. వారు కూడా తమపై ఏదైనా చర్యలుంటాయనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ సాటి రైతులపై కేసులు నమోదయ్యాయని తెలిసి భయబ్రాంతులకు గురవుతున్న రైతులు ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై దాడి చేయడం తగదని.. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని గురువారం జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలు చేశారు. నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమంగా కేసులు పెట్టి తీవ్రంగా కొట్టారని.. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుని అడ్డుకోవడం రైతుల ప్రాఽథమిక హక్కు అని.. ఓ మైనర్పై కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. రాజోళి ఎస్సై జగదీశ్వర్తో పాటు గాయత్రి ఇండస్ట్రీస్ అండ్ రెన్యువేబుల్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా పోలీస్ హింసలో గాయపడిన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ను స్వీకరించిన కమిషన్ 13030/ ఐఎన్/2025 నంబర్తో కేసు నమోదు చేసింది. ● కాగా.. ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యక్తులు దాడిలో తాము గాయపడ్డామని పెద్ద ధన్వాడకు చెందిన మరియమ్మ, కుర్వ క్రిష్ణ, కుర్వ లింగన్న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.నిర్మానుష్యంగా మారిన పెద్ద ధన్వాడ గ్రామం వ్యవసాయం.. పాడి పశుపోషణ.. కూలీ పనులు.. ఇవే వారి ప్రధాన జీవనోపాధి.రెక్కల కష్టాన్ని నమ్ముకొని.. వచ్చిన కొంత డబ్బుతో కాలం గడిపేవారు ఆ గ్రామస్తుల జీవితం ఒక్కరోజులోనే తలకిందులైంది. పోలీస్స్టేషన్లు.. కేసులు.. జైలు.. ఇలా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు దాదాపు 12 గ్రామాల్లో అలజడి.. వందల కుటుంబాల్లో భయాందోళన సృష్టిస్తోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/రాజోళి ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త ఘటనలతో గ్రామాల్లో అలజడి అరెస్టులతో 12 గ్రామాల్లో ఆందోళన 41 మందిపై కేసు.. 12 మంది రిమాండ్ ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు -
పల్లెల్లో ఇథనాల్ చిచ్చు
ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గతేడాది అక్టోబర్ నుంచి రిలే దీక్షలు.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్ ప్యూయల్స్ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భా గంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు విన తులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు. పరిశ్రమకు సంబంధించి కంటైనర్,టెంట్లు, షెడ్లకు నిప్పు..వాహనాలు ధ్వంసం పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత -
తల్లి చదువుతోకుటంబాల్లో వెలుగులు
తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగు నిండుతుంది. చదువు విలువ తెలిసి కుటుంబమంతా అక్షరాస్యులు ఉంటే ఆ కుటుంబాల ద్వారా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనించేందుకు దోహదపడుతుంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్ తగ్గితే బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందుతాయి. మహిళలకు మంచి అవకాశం నిరక్షరాస్యులైన మహిళలకు చదువడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉల్లాస్ పథకం చదువు రాని వారికి మంచి అవకాశం. జిల్లాలో ఉన్న మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల వివరాలు వయోజన విద్యాశాఖ అధికారులకు అందజేశాం. ఉల్లాస్ పథకంలో భాగంగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులతోపాటు బడి మధ్యలో మానిన వారికి, దివ్యాంగులకు సైతం చదవడం, రాయడం నేర్పిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన పథకాన్ని నిరక్షరాస్యులైన మహిళలందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాలి. – మొగులప్ప, డీఆర్డీఓ, నారాయణపేట ● -
గాత్రంతో పాటలకు ఊపిరిపోసిన ఎస్పీ బాలు
నారాయణపేట రూరల్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో వేలాది పాటలకు ఊపిరిపోశారని, పాటల ద్వారా తెలుగు భాషను ప్రపంచానికి తెలియచెప్పిన మహనీయుడు అని ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి అన్నారు. స్థానిక బాలకేంద్రంలో బుధవారం ఎస్పీ బాలు 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఎస్పీ బాలు పాడిన పలు పాటలను పలువురు గాయకులు ఆలపించారు. వారిని శాలువా, పూలమాల, జ్ఞాపికతో సన్మానించారు. అంతకుముందు బాలు గాయకుడిగా అందించిన సేవలను కొనియాడారు. 18 భాషల్లో 60వేల పాటలను పాడి భారతరత్న అవార్డు సొంతం చేసుకున్నారని అన్నారు. అనంతరం లయన్స్కల్బ్ ఆద్వర్యంలో విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ గందె కార్తిక్, టీయూడబ్లుజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు కే.నారాయణరెడ్డి, బాలకేంద్రం సిబ్బంది సంగ నర్సింహులు, మోహన్, జ్ఞానామృత, వసంత్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమాయక రైతులపైఅక్రమ కేసులు పెడతారా?
వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించే అమాయక రైతులపై కేసులు పెట్టడం తగదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఇథనాల్ కంపెనీ ఘటనలో అరెస్టు చేసిన రైతులను మానవపాడు పోలీస్స్టేషన్కు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ వద్దని చెబితే రైతులను తీసుకొచ్చి అక్రమంగా కేసులు నమోదు చేస్తారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్ద ధన్వాడలో జరిగిన ఘటనలో రైతులకు దెబ్బలు తగిలాయని చెప్పారు. రైతులకు తగిలిన దెబ్బలను పోలీసులకు చూపుతూ...వారి నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తుగా మారిందని, అందుకే రైతులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మండలంలో 45 మంది రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. 12 గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
వయోజన విద్యకు ‘ఉల్లాస్’
నారాయణపేటగురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025వివరాలు 12లో uకోస్గి: మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఉల్లాస్’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలో ఉన్న ప్రతి మహిళా అక్షర జ్ఞానం కలిగి ఉండాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకాన్ని విద్యాశాఖ, సెర్ప్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. దశల వారీగా అమలు చేసే ఉల్లాస్ పథకంలో ముందుగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా చేయడంతోపాటు రెండో దశలో మధ్యలో బడిమానిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతితోపాటు వారి ఆసక్తిని బట్టి ఒపెన్ డిగ్రీ వరకు చదివించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉల్లాస్ లక్ష్యం సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ఉల్లాస్ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా సంఘాల్లో ఉన్న సభ్యుల్లో కేవలం 50 శాతం మందికి మాత్రమే సంతకం చేయడం వచ్చని, మిగిలిన సగం శాతం మంది వేలి ముద్రలు వేస్తారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక సమాచారం. మహిళలందరికి చదవడం, రాయడం నేర్పించాలనే ఉల్లాస్ పథకం ఉద్దేశం. ఓ పక్కా వయోజన మహిళలకు చదవడం, రాయడం నేర్పించి, మరోపక్క మధ్యలో బడి మానిన వారిని సైతం గుర్తించి వారిని నేరుగా ఓపెన్ టెన్త్, వారికి ఆసక్తి ఉంటే ఓపెన్ డిగ్రీ చదివిస్తారు. ఆ తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ కోర్సులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మహిళలకు చదవడం, రాయడంతోపాటు బ్యాంకింగ్ రంగంలో ఆర్దిక క్రమశిక్షణ, పౌష్ఠికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు. మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల గుర్తింపు ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఆర్డీఏ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులను గుర్తించే పనిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగే ఈ ఉల్లాస్ పథకం ద్వారా నిరక్షరాస్యులను గుర్తించే కార్యక్రమాన్ని సెర్ప్ అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఉన్న మహిళా సంఘాల్లోని సభ్యుల్లో నిరక్షరాస్యుల సంఖ్యను వీఓఏ (విలెజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)ల ద్వారా ఏపీఓలు గుర్తిస్తారు. ఈ నెల చివరి నాటికి సంఘాల్లో నిరక్షరాస్యులను, మధ్యలో బడి మానిన వారిని గుర్తించి నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి పథకానికి సంబందించిన విదివిధానాలను సెర్ప్ అధికారులకు, సిబ్బందికి సమగ్రంగా వివరించినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. వలంటీర్లుగా మహిళా సంఘాల అక్షరాస్యులు డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయగానే నిరక్షరాస్యులతో 15 నుంచి 20 మంది చొప్పున గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో మహిళా సంఘాల్లో అక్షరాస్యులైన వారిని వలంటీర్లుగా ఎంపిక చేసి నిరక్షరాస్యుల గ్రూపులను కేటాయించి వారికి చదువు చెప్పిస్తారు. గ్రూపులో ఉన్న వారందరికి చదవడం, రాయడం వచ్చే వరకు వీరికి చదువు చెప్పే బాద్యత వలంటీర్లదే. ఎలాంటి పారితోషికం గాని, గౌరవ వేతనం గాని లేకుండానే కేవలం సేవాభావంతో ఎంపికై న వలంటీర్లు బాద్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ పుస్తకాలు అందించడంతోపాటు పథకం విజయవంతం అయ్యేందుకు ఆయా గ్రామాల్లోని ఉపాధ్యాయుల ద్వారా సహకారం అందించనున్నారు. చదువురాని మహిళలనుఅక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చర్యలు నిరక్షరాస్యులను గుర్తించే పనిలో డీఆర్డీఏ సిబ్బంది విద్యాశాఖ, సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ -
గ్రామస్తులకు గాయాలయ్యాయి
పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది. – శ్యాం ప్రసాద్, పెద్ద ధన్వాడ పికెటింగ్ ఏర్పాటు చేశాం ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల ● -
రేపు డిప్యూటీ సీఎం పర్యటన
అడ్డాకుల: మూసాపేట మండలకేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం పర్యటించనున్నారని, దీనిని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి కోరారు. మూసాపేటలోని అయ్యప్పగుట్ట పక్కన ఏర్పాటు చేయనున్న 132/33కేవీ విద్యుత్ సబ్ స్టేషన్తో పాటు అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని గ్రామాలకు మంజూరైన 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడే శంకుస్థాపన చేయన్నుందున వాటికి సంబంఽధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. సబ్ స్టేషన్ స్థలంలో పాటు బహిరంగ సభ ఏర్పాట్లపై విద్యుత్ శాఖ అధికారులు, పార్టీ నేతలతో చర్చించారు. డిప్యూటీ సీఎం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజునాయక్, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్, నాగిరెడ్డి, బాలనర్సిములు, బగ్గి కృష్ణయ్య, సుధాకర్రెడ్డి, రాంచందర్, ఎన్టీగౌడ్, కృష్ణయ్య, రవి, సుధాకర్ ఉన్నారు. -
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
నారాయణపేట రూరల్: ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా తపస్ కృషి చేస్తుందని తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి నరసింహ అన్నారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం జిల్లా స్థాయి అభ్యాస వర్గ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని, అన్ని గ్రామాల్లో ప్రైవేటు స్కూళ్లకు పిల్లలు వెళ్లకుండా స్థానికంగా ఉండే సర్కారు బడికే వచ్చే విధంగా చర్యలు చేపడదామన్నారు. ఆ లక్ష్యంగా జూన్ మాసాన్ని విద్యార్థుల నమోదు మాసంగా తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతోపాటు పాఠశాలల ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం రెండు డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను అసంబద్ధమైన సర్దుబాటు చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండే విధంగా చూడాలని, సంఖ్యకు తగ్గట్టుగా పాఠశాలలు ప్రారంభం నాటికే విద్యా వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. జూమ్ మీటింగ్ల పేరుతో విద్యాబోధన సమయాన్ని వృథా చేయరాదని, హెడ్ మాస్టర్ లపై ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లాలోని ఉపాధ్యాయ సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గుంపు బాలరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా మహిళా ప్రముఖ్ కెంచే విజయ, జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాలమూరుపై కక్షగట్టిన పాలకులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సాగునీటిని ఇతర జిల్లాలకు తరలించడం, ఇథనాల్ కంపెనీలను పెట్టించి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న తీరును చూస్తుంటే.. పాలకులు కక్ష గట్టినట్టుగా ఉందని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి విమర్శించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు నీరు తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాకు దక్కాల్సిన నీటిని డిండికి తరలించుకుపోతుంటే ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పట్టనట్టుగా ఉండటం దారుణమన్నారు. ఈ పరిణామాలు జిల్లా ప్రజలు బతుకనిచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి తరలింపు చర్యలను ఆపకపోతే మరో పోరాటం చేస్తామన్నారు. అదే విధగా వ్యవసాయ భూములు, ప్రజల జీవనాన్ని నాశనం చేసే ఇథనాల్ కంపెనీలను పెట్టనిచ్చేది లేదని జిల్లా ప్రజలు, రైతులు పోరాటం చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం బలవంతంగా ఫ్యాక్టరీలు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీ పాలసీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తుంగభద్ర నది ఒడ్డున టీజీ వెంకటేశ్ విషపూరితమైన కంపెనీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కంపెనీ ఏర్పాటుతో అలంపూర్ ప్రాంతంతో పాటు కృష్ణానది విషపూరితం అవుతుందన్నారు. బనకచర్ల నుంచి ఆంధ్రాకు గోదావరి నీరు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రశ్నించకపోవడం దుర్మార్గమన్నారు. చంద్రసాగర్ లిఫ్ట్ ద్వారా అమ్రాబాద్ ప్రాంత రైతులకు సాగునీటిని అందించాలని కోరారు. సమావేశంలో టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి, విజయ్కుమార్, తిమ్మప్ప, బాలకృష్ణ, జలీల్ పాషా తదితరులు ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు,సాగునీటి తరలింపుతో అన్యాయం ప్రజావ్యతిరేక విధానాలను విరమించుకోవాలి పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి -
నిర్వాసితులకు న్యాయమైన పరిహారం
ఊట్కూరు: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వరి, కంది విత్తనాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా 9 నెలలకు ఒకసారి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఇవ్వకుండా ప్రతి 2 నెలలకోమారు అందిస్తున్నామని తెలిపారు. 18 నెలల్లో మండలానికి రూ.90 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామని తెలిపారు. ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న భూములకు మార్కెట్ విలువ ఆధారంగా నష్టపరిహారం అందించాలని, ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వాలని దంతన్పల్లి శివారు రైతులు ఎమ్మెల్యేను కోరారు. ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో ఎంత నష్టపరిహారం అందిస్తే అదే లెక్కన ఇక్కడి రైతులకు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, ఏఓ గణేష్రెడ్డి, నాయకులు ఎల్కోటి నారాయణరెడ్డి, లింగం, యజ్ఞేశ్వర్రెడ్డి, మహేష్రెడ్డి, గోపాల్రెడ్డి, దత్తు పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. నర్వ: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మండలంలో ఇప్పటి వరకు 452 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నేరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, వివేక్ వర్ధన్, అయ్యపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వరికి రూ.3 వేలు ఇవ్వాలి..
పెట్టుబడులు ఏటా పెరుగుతున్నందున వరి క్వింటాకు రూ.3 వేలు ప్రకటించాలి. కేంద్రం కేవలం రూ.69 పెంచడం ఎంతో నిరా శగా ఉంది. ఎకరా వరి సాగుకు ప్రస్తుతం రూ. 40 వేలు ఖర్చవుతోంది. మరోమారు పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. – శ్రీనివాసులు, రైతు, ఎలిగండ్ల పత్తి ధర పెంపు మంచిదే.. పత్తికి మద్దతు ధర పెంచడంతో ఈసారి అధిక శాతం మంది రైతులు పంట సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. గతేడాది కలుపు తీసేందుకు నాగళ్లకు రూ.2 వేలు ఉన్న అద్దె ఈసారి ఏకంగా రూ.3 వేలకు పెంచడమే కాకుండా కూలీలు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడంతో ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. ధర పెంచడం కొద్దిమేరకు మంచిదే. – రవి, పత్తి రైతు, మరికల్ ఆదేశాలు రావాలి.. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల పెంపుపై ఆదేశాలు వస్తే ఈ వర్షాకాలం పంటల నుంచి అమలవుతోంది. ప్రస్తుత వానాకాలంలో జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకానున్నట్లు అంచనా వేశాం. ధర పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కంది సాగుపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి ● -
పత్తి రైతుకు ఊరట
నారాయణపేటబుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025మద్దతు ధర క్వింటాకు రూ.589 పెంచిన కేంద్రం ● తక్కువగా వరికి రూ.69.. ● ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 1.80 లక్షల ఎకరాలు ● ధర పెంపుతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ● నిరాశలో వరి రైతులు మరికల్: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పండించే పంటలకు మద్దతు ధరలు ఖరారు చేసింది. అందులో అత్యధికంగా పత్తి క్వింటాకు రూ.589 పెంచడంతో సాగు రైతులకు ఊరట లభించింది. జిల్లాలో వానాకాలం రైతులు అధికంగా పత్తి సాగు చేస్తారు. కేంద్రం మద్దతు ధర పెంచడంతో వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,521 ధర ఉండగా.. రూ.589 పెంపుతో ఈ ఏడాది ధర రూ.8,110గా నిర్ణయించింది. పత్తి తర్వాత సోయాకు రూ.436 పెరగగా గతేడాది ధర రూ.4,892 ఉండగా.. ఈసారి రూ.5,328 కానుంది. వరి ధాన్యంపై కేవలం రూ.69 మాత్రమే పెరిగింది. వ్యవసాయమే ఆధారం.. అందులోనూ పత్తి సాగే ప్రధానంగా ఉన్న జిల్లాకు ధరల పెరుగుదల కాస్త కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ యంత్రాల ధరలతో పోలిస్తే మద్దతు ధరలు మరింత పెరిగితే బాగుండేదన్న భావన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది పత్తి 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా. రైతుల చూపు.. పత్తి వైపు... పత్తికి మద్దతు ధర అధికంగా పెంచడం, సీసీఎస్ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటంతో చాలామంది రైతులు పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో పత్తిని కర్ణాటకకు తీసుకెళ్లి విక్రయించే వారు. ప్రస్తుతం జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, నారాయణపేట మండలాల్లో జిన్నింగ్ మిల్లులు ఉండటం రైతులకు కొంత ఊరటనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో జిల్లాలో పత్తి తర్వాత రెండో స్థానంలో వరి నిలిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.589 పెంచి.. వరికి మాత్రం కేవలం రూ.69 పెరగడంతో వరి సాగు రైతులు నిరాశలో ఉన్నారు. -
అనాథ, బడిబయటి పిల్లలను గుర్తించాలి
నారాయణపేట: జిల్లాలో ఉన్న అనాథ, పాక్షిక అనాథ, బడిబయటి, అక్రమ రవాణా బాలలను గుర్తించడానికి ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఐసీపీఎస్ చైల్డ్ లైన్ సిబ్బంది, జిల్లా విద్యాధికారి, జిల్లా వైద్యాధికారి, శిశు అభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కమిటీ గ్రామంలోని ఆయా చిన్నారుల వివరాలు సేకరించి విజన్ ఎన్జీఓ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలని సూచించారు. విలేజ్ ప్రొఫైల్ ఆధారంగా జిల్లాలోని నర్వ మండలంలో అనాథ, పాక్షిక, బడి బయట పిల్లల సర్వే చేసినట్లు విజన్ సంస్థ సభ్యులు తెలిపారు. అనంతరం జిల్లా విద్యాధికారి గోవిందరాజులు మాట్లాడుతూ.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు డీఆర్డీఏ (ఎస్హెచ్జీలు), అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా, విద్యాశాఖ తరఫున వలంటీర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, డీఎల్పీఓ సుధాకర్రెడ్డి, జీసీడీఓ నర్మద, డీపీఓ బిక్షపతి, చైల్డ్ వెల్ఫేర్ కో–ఆర్డినేటర్ నర్సింహ, ఏపీఓ అనిల్కుమార్, సీడీపీఓలు పాల్గొన్నారు. పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు.. నారాయణపేట రూరల్: రెవెన్యూ సేవలను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. మంగళవారం మండలంలోని బైరంకొండలో జరిగిన రెవె న్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. దరఖాస్తులను స్వీకరించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా, పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అమరేందర్కృష్ణ, పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొనగా గ్రామంలో 26 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా అంత్వార్, అయ్యవారిపల్లిలో జరిగిన సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ హాజరుకాగా ఒకే దరఖాస్తు అందినట్లు చెప్పారు. బుధవారం ఎక్లాస్పూర్, శేర్నపల్లిలో రెవెన్యూ సదస్సులు కొనసాగనున్నాయి. -
‘భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాం’
గద్వాల: దేశంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో అభివృద్ధే అభిమతంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం గద్వాలలోని డీకే బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 11 ఏళ్ల పాలనలో మోదీ సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాఖ్ రద్దు, వక్ఫ్ సరవణ చట్టం, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేలా కృషి చేస్తున్నారన్నారు. పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం ఉగ్ర శిబిరాలు, పాక్పై నరేంద్రమోదీ చేపట్టిన చర్యలకు ప్రపంచ దేశాలు మెచ్చుకుంటుంటే మన దగ్గర మాత్రం కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మోదీ 11 ఏళ్ల పాలనపై కేంద్రకమిటీ పిలుపు మేరకు జిల్లాస్థాయిలో విస్తృత ప్రచారం, ఈ నెల 6న అన్ని మండలాల్లో ఒకేస్థాయి కార్యశాలలు, 9, 10, 11 తేదీల్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రపోషన్ మీట్స్, మేధావుల సదస్సులు, ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప్ సభలు నిర్వహించాలన్నారు. రచ్చబండ కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, ఈ ప్రోగ్రామ్స్, డిజిటల్ కాంపిటీషన్స్ వంటివి నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, జయశ్రీ, దేవదాసు, వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణవేణి పాల్గొన్నారు. -
రామన్పాడులో 1,017 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్ర మట్టానికిపైన 1,017 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా జలాశయానికి నీటి సరఫరా లేదని, రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన పోరాడి విజయం సాధించామని, భవిష్యత్లో ఇదే తరహాలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. విద్యార్థులు లేరనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను మూసివేయాలనే ఆలోచన చేయడం సరికాదన్నారు. 2019 నుంచి ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కీలకమైన విద్యాశాఖ మంత్రి నియమించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రజినీకాంత్, ఉపాధ్యక్షులు కిరణ్, ప్రశాంత్, పూజ పాల్గొన్నారు. జోగుళాంబ ఆలయంలో ఏపీ హైకోర్టు జడ్జి అలంపూర్: పట్టణంలోని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబ ఆలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి హరిహరనాథ్శర్మ మంగళవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అర్చకులతో కలిసి ఈఓ పురేందర్కుమార్ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి, అనంరతం జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. -
భూ సేకరణపై కలెక్టర్ సమీక్ష
నారాయణపేట: జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో సోమవారం భూ సేకరణ, పునరావాసంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామసభలు, భూసేకరణ సర్వేపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కలెక్టర్ ఆధ్వర్యంలో పునరావాస కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో కమిటీ ఆమోదించిన నివేదికను ఆర్అండ్ఆర్ కమిషనర్ హైదరాబాద్కు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచంద్రనాయక్, సెక్షన్ అధికారి శ్రీధర్, సభ్యులు రవికుమార్, సతీశ్కుమార్, కోళ్ల కిష్టమ్మ, శివ, నారాయణపేట, మక్తల్, ఊట్కూర్, దామరగిద్ద తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ నెలలోనే మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండో దశలో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు పరిశీలించి కొనుగోలుదారులకు దస్తావేజులు అందజేశారు. మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు పారదర్శకంగా, మరింత వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం జడ్చర్లలో నూతన సబ్ రిజిస్ట్రార్ భానుప్రసాద్ బాధ్యతలు సైతం స్వీకరించారు. అవగాహన లేకపోవడంతో.. సోమవారం స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని కార్యాలయాల్లో సాఫీగానే సాగగా.. మరికొన్ని కార్యాలయాల్లో ప్రజలకు స్లాట్ బుకింగ్పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అలంపూర్లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. ఆత్మకూర్లో కేవలం 1 దస్తావేజు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 44 స్లాట్ బుకింగ్ చేసుకోగా 35 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగతా 9 దస్తావేజుల అమ్మకపు, కొనుగోలుదారులు కార్యాలయానికే రాలేదు. సోమవారం స్లాట్ బుకింగ్ ప్రారంభమైన కార్యాలయాల్లో జడ్చర్లలో 40, వనపర్తిలో 45, గద్వాలలో 35, మక్తల్లో 7, అచ్చంపేటలో 5, కొల్లాపూర్లో 7, ఆత్మకూరులో ఒక స్లాట్ బుక్ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 12 చోట్ల పూర్తిస్థాయిలో అమలు తొలిరోజు 140 స్లాట్స్ బుకింగ్ జిల్లాకు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కేటాయింపు -
ఘనంగాఆవిర్భావ వేడుకలు
నారాయణపేట: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా సీవీఆర్ భవన్లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి జెండా ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ యార్డుల్లో ఎమ్మెల్యే జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ● జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ యోగేష్గౌతమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాంకేతికంగా దేశంలోనే తెలంగాణ పోలీస్ నంబర్వన్గా ఎదిగిందని ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమకూర్చుకోవడం జరిగిందని అన్నారు. ● నీళ్లు, నిధులు, నియమకాలే లక్ష్యంగా రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్లుగా పోరాడి సాధించుకున్నామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. -
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
నారాయణపేట/మక్తల్/ఊట్కూర్/మాగనూర్/నర్వ: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నారాయణపేటలో 347 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని, వెంటనే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, పదేళ్లుగా ప్రజలు ఇళ్లు, రేషన్కార్డుల కోసం ఎదురుచూశారని, ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇండ్లతో పాటు అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్, ఊట్కూర్, మాగనూర్, నర్వలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. మరికొందరు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తుందని, ఇళ్ల నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేసుకోవాలని అన్నారు. ఇళ్లు విడతల వారిగా అర్హులైన ప్రతీ ఒక్కరికి మంజూరు అవుతాయని ఎవరూ నిరాశ చెందకూడదన్నారు. -
వంద రోజుల ప్రణాళిక ప్రారంభం
కోస్గి రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల ప్రణాళికను సామవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయ అవరణలో ప్రారంభించారు. ముందుగా జెండా అవిష్కరణను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరవీరుల పోరాట ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామన్నారు. మున్సిపల్ కార్మికులకు డ్రస్సులు, వర్క్ జాకెట్స్ పంపిణీ చేశారు. ఆనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి మెప్మా, మున్సిపల్ కార్మికులతో శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. మానవహరం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో బెజ్జురాములు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, నాగులపలి నరేందర్, అన్నకిష్టప్ప, రాజేష్, భానునాయక్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట రూరల్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ కొనసాగుతాయి. పరీక్షల కోసం జిల్లా విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా పంపించింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 367 మంది హాజరుకానున్నారు. వీరిలో 228 బాలురు, 139 బాలికలు. అత్యధికంగా సైన్స్ లో 206, గణితంలో 178, ఇంగ్లీష్ లో 110 మంది ఫెయిల్ కాగా తెలుగు 72, సోషల్ 41, హిందీ 21మంది ఉన్నారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో ఒకే ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కేంద్రానికి సీఎస్ గా సత్యనారాయణ సింగ్, డిఓ గా అనిఫ్ ను నియమించారు. పరీక్షలకు 11మంది ఇన్విజిలేటర్స్ విధులునిర్వ హించనున్నారు. 18 మందికి పదోన్నతి మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 18 మంది కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా పదోన్నతి వచ్చిన హెడ్కానిస్టేబుళ్లను డీఐజీ అభినందించారు. హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన వారిలో సయ్యద్ యాసిన్, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్, వెంకప్ప, వి.నాగరాజురెడ్డి, చెన్నకేశవులు, షాకీర్ ఖాన్, ఎజాజ్ అహ్మద్ ఖాన్, ఎండీ రియాజ్, బాలయ్య, వెంకట్నాయక్, పి.నాగరాజుగౌడ్, ఎండీ అక్బర్, నరేష్కుమార్, వెంకట్రెడ్డి, రాజారమేష్, కె.నాగరాజు, కె.విజయ్కుమార్ ఉన్నారు. పోలీస్ పాత్ర కీలకం మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో కీలకమని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జోగుళాంబ జోన్– 7 డీఐజీ కార్యాలయం ఎదుట డీఐజీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబడి పనిచేయాలన్నారు. అలాగే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. పోలీసులు క్రమశిక్షణతో సేవలు అందిస్తూ ప్రజల అభి మానం గెలుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పీయూలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ల నియామకం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్లను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ సోమవారం నియమించారు. ఈ మేరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఈశ్వర్కుమార్, రవీందర్రెడ్డిలను నియమిస్తూ.. ఉత్తర్వులను వారికి అందజేశారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
నారాయణపేట: రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామని.. అమెరికా, దక్షిణకోరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించడం జరిగిందని.. ఇక జిల్లా విషయానికి వస్తే ప్రజాపాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనమంతా కంకణ బద్దులు కావాలని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీయోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్, గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ వార్ల విజయ్కుమార్తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురున్నాథ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనూ, ప్రపంచస్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇందులో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని అవి పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రీయల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. విద్యకు పెద్దపీట జిల్లా కేంద్రంలో, కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభించారని, మిషన్ భగీరథ ఇంట్రగ్రిడ్ ద్వారా వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు జిల్లాకు రూ.92.91 లక్షలు మంజూరు చేశారన్నారు. ప్రజాపాలన, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 3,566 కొత్త రేషన్కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో శాంతి భద్రతల కల్పనలో భాగంగా పోలీస్ శాఖ నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రూ.2.79 కోట్లతో ధన్వాడ పీఎస్ను, 2.79 కోట్లతో పేట రూరల్ పోలీస్ స్టేషన్ను సీఎం చేతుల మీదుగా ఇదివరకే ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణానికి 7 ఎకరాల ల్యాండ్ , 38.50 కోట్ల రూపాయల బడ్జెట్ మంజూరు అయ్యిందని వివరించారు. రైతులకు రుణ విముక్తి దేశ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రూ.25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. గతేడాది రూ.2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలని, వారి భవిష్యతుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ రాంచందర్నాయక్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, పీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాకు వందనం చేస్తున్న రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీయోగేష్ గౌతమ్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిలక్ష ఎకరాలకుసాగునీరు.. నారాయణపేట – కొడంగల్ – ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వానాకాలం 4.35 లక్షల ఎకరాల్లో సాగు అయ్యే వివిధ పంటల కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, 1.4 కోట్ల సబ్సీడి విలువగల జీలుగ జనుము విత్తనాలు రైతులకు పంపిణీ చేయబోతుందన్నా రు. ఈజీఎస్ ద్వారా జిల్లాలో 1,10,727 జాబ్కార్డులు ఉండగా రూ.1294.13 లక్షల ఖర్చు అయ్యి ందన్నారు. ఆసరా కింద 75,449 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 18.86 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజీ రూ.263.43 కోట్లు మహిళ సంఘాలకు చెల్లింపులు, నాలుగు ఇంది రా మహిళ శక్తి క్యాంటీన్లు, మిల్క్ పార్లర్ పాడి గేదేల పెంపకం, పైడి కోళ్ల పెంపకం తదితర వాటిని ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రైజింగ్–2047విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు.. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్రెడ్డి కలెక్టరేట్లో అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు -
ప్రగతి పరుగులు
విద్య, వైద్య రంగాల్లో జిల్లా ముందడుగు ● అభివృద్ధి.. సంక్షేమానికి పెద్దపీట ● జిల్లాల పునర్విభజనతో పాలన చేరువ ● పెరిగిన పంటల సాగు విస్తీర్ణం ● సీఎం సొంత జిల్లా కావడంతో శరవేగంగా అభివృద్ధి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు 2014 నుంచి ఇప్పటి వరకు విద్యారంగంలో జిల్లా వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. కేజీబీవీల్లో ఎస్ఎస్సీ నుంచి ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ చేసి అన్ని రకాల వసతులు కల్పించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టారు. మెడికల్ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నికల్ కళాశాల, నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కలెక్టరేట్ భవనానికి గత ప్రభుత్వంలోని అప్పటి మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేశారు. ఇప్పటికి పనులు కొనసాగుతునే ఉన్నాయి. నారాయణపేట: కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ప్రగతిలో పరుగులు పెడుతోంది. ముఖ్యమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మిగతా రంగాల్లో అభివృద్ధి అడుగులు వేస్తోంది. ఒకప్పుడు వలసలు, కరువుకు కేరాఫ్గా నిలిచిన నారాయణపేట జిల్లాలో ప్రధానంగా నీటిపారుదల, సాగు రంగంలో 11 ఏళ్లుగా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయడం, రహదారులు విస్తరణతో అనతికాలంలోనే జిల్లా దశ మారింది. జిల్లాల పునర్విభజనలతో పట్టణాల్లో, పల్లెల్లో మౌలిక వసతుల కల్పనతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 ఏళ్లు అవుతున్న సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణమాలు, మారిన ముఖ చిత్రంపై ‘సాక్షి’ కథనం. 11 మండలాలు.. మూడు పురపాలికలతో జిల్లా ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది ఉమ్మడి జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. కాగా 2018 ఎన్నికల్లో నారాయణపేటకు ప్రచారం నిమిత్తం వచ్చిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎస్.రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లాను ఇస్తానని చెప్పిన మాటతో 2019 ఫిబ్రవరి 17న నూతన జిల్లాగా నారాయణపేట ఆవిర్భవించింది. 11 మండలాలు, మూడు మున్సిపాలిటీలతో ఆవిర్భవించిన జిల్లా గత ప్రభుత్వ హయంలోనే 13 మండలాలుగా ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి మరో మున్సిపాలిటీ మద్దూర్ను ప్రకటింపజేయడంతో నాలుగు మున్సిపాలిటీలుగా మారాయి. పెరిగిన సాగు విస్తీర్ణం ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, జిల్లా ఏర్పాటు తర్వాత పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014కు ముందు జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 3.50 లక్షల ఎకరాల్లో సాగు కాగా ప్రస్తుతం 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా పత్తి, వరి వైపే రైతులు ఆసక్తి చూపుతున్నారు. జూరాల బ్యాక్ వాటర్ ద్వారా భూత్పూర్, సంగంబండ రిజార్వాయర్లకు నీటిని నింపడంతో దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. 2014 నుంచి 2018 వరకు విడత వారిగా జిల్లాలో దాదాపు వెయ్యి చెరువులను మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించడంతో భూగర్భజలాలు పెరిగాయి. రాష్ట్ర అవతరణకు ముందు రైతులను ప్రభుత్వం అంతగా పట్టించుకునేది కాదు. బీఆర్ఎస్ పాలనలో 2018లో రైతుబందు పథకం రావడంతో వ్యవసాయ రంగానికి మారింత అండగా నిలిచింది. రైతు రుణమాఫీ సమీకృత మార్కెట్లు, గోదాంల సామర్థ్యం పెంపు, ప్రభుత్వమే మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసుయడం వంటి అంశాలు సాగు రంగానికి దోహదం చేశాయి. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కొడంగల్ మక్తల్ నారాయణపేట పథకానికి పెద్దపీట వేయడంతో అయా నియోజవర్గాలో లక్ష ఎకరాలకు సాగుపెరిగే అవకాశం ఉంది. -
‘ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తాం’
వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని పుర్గర్చర్లలో రూ.2.94 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్స్టేషన్, కల్వరాలకు నూతనంగా ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు రైతులు, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లతోపాటు రాజీవ్ యువ వికాసం, సన్నరకం వరి ధాన్యానికి రూ.500 బోనస్ తదితర సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, విద్యుత్శాఖ ఎస్ఈ రాజశేఖరం, పంచాయతీరాజ్శాఖ ఈఈ మల్లయ్య, నాగర్కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నర్సింహ, నాయకులు రఘునాథ్రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, నారాయణరెడ్డి, బిచ్చయ్యసాగర్, సుదర్శన్రెడ్డి, నరేష్, బాల్రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఉత్సాహంగా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్ బిన్ అహ్మద్, జాకీర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ బుధ, గురువారాల్లో జిల్లాకేంద్రంలోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్బాల్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ లో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు మీర్ ఖాలెద్అలీ, మహ్మద్ ఇలియాజ్, సుబాన్జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్ ముకర్రం, మహ్మద్ షకీల్, వినోద్కుమార్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–19 క్రికెట్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాలో ఎండీసీఏ ఆధ్వర్యంలో మరోసారి ఇంట్రా డిస్ట్రిక్ర్ట్ టోర్నమెంట్ జరగనుంది. గత నెల 19 నుంచి 31 వరకు అండర్– 23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ను నిర్వహించగా మహబూబ్నగర్ జట్టు చాంపియన్షిప్గా నిలిచింది. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇప్పుడు అండర్– 19 క్రికెట్ లీగ్ను నిర్వహించనున్నారు. 2 నుంచి 6 వరకు.. ఔత్సాహిక గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–19 క్రికెట్ లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్లుగా విభజించారు. పూల్–ఏలో జడ్చర్ల, వనపర్తి, నాగర్కర్నూల్ జట్లు, పూల్–బీలో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో 15 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు చాంపియన్గా నిలుస్తుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో అండర్– 19 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి రౌండ్కు సంబంధించి సోమవారం మహబూబ్నగర్– వనపర్తి జట్లు (వేదిక– మహబూబ్నగర్), జడ్చర్ల– గద్వాల జట్లు (జడ్చర్ల), నారాయణపేట– నాగర్కర్నూల్ (నారాయణపేట) జరుగుతాయి. రెండో రౌండ్ మంగళవారం నాగర్కర్నూల్– మహబూబ్నగర్ జట్లు (మహబూబ్నగర్), గద్వాల– వనపర్తి (వనపర్తి), జడ్చర్ల– నారాయణపేట (జడ్చర్ల) మ్యాచ్లు ఉంటాయి. మూడో రౌండ్ బుధవారం మహబూబ్నగర్– గద్వాల (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– జడ్చర్ల (జడ్చర్ల), వనపర్తి– నారాయణపేట (వనపర్తి) కొనసాగుతాయి. నాలుగో రౌండ్ గురువారం మహబూబ్నగర్– నారాయణపేట (మహబూబ్నగర్), జడ్చర్ల– వనపర్తి (జడ్చర్ల), గద్వాల– నాగర్కర్నూల్ (గద్వాల) ఉంటాయి. ఐదో రౌండ్ శుక్రవారం జడ్చర్ల– మహబూబ్నగర్ (మహబూబ్నగర్), నాగర్కర్నూల్– వనపర్తి (నాగర్కర్నూల్), గద్వాల– నారాయణపేట (గద్వాల)లో నిర్వహిస్తారు. ఆరు జట్లు.. 15 లీగ్ మ్యాచ్లు ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణ అధిక పాయింట్లు సాధించిన జట్టు విజేత -
డివిజన్ల విభజన ముసాయిదా సిద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజన ప్రక్రియకు సంబంధించిన ముసాయిదాను అధికారులు సిద్ధం చేశారు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ను కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. ఈ మేరకు గత జనవరి 4న రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనమయ్యాయి. అదే నెల 27 నుంచి పూర్తిస్థాయిలో కార్పొరేషన్గా మారింది. అప్పటి వరకు ఉన్న 49 వార్డులను కాస్త తాజాగా 60 డివిజన్లకు పెంచుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 2012, 2025లో విలీనమైన గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాలు, వార్డుల స్థానంలో డివిజన్ల పేరిట బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేషన్గా పేరు మార్చారు. అనంతరం డివిజన్ల విభజనలో భాగంగా హద్దులను నిర్ణయిస్తూ నక్షలను టౌన్ ప్లానింగ్ అధికారులు రూపొందించారు. త్వరలోనే నోటిఫికేషన్ ఏయే వీధులు ఏ డివిజన్ పరిధిలో ఉంటాయో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సుమారు 15 రోజుల వ్యవధిలోనే నగర ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకుల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాతే డివిజన్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. కాగా.. ప్రస్తుతం నగరంలో జనాభా 3,36,647 మంది ఉండగా.. మొత్తం ఓటర్లు 1,90,774 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఏ డివిజన్ పరిధిలో ఏయే వీధులు ఉంటాయి..? ఏది ఎక్కడికి మారుతుందోనని ప్రజలతోపాటు స్థానిక నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఇప్పటికే నక్ష, హద్దులు నిర్ణయించిన టౌన్ ప్లానింగ్ అధికారులు త్వరలోనే నగర ప్రజలు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో కలెక్టరేట్లో అధికార యంత్రాంగం వేదికను ముస్తాబు చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా బాంబ్ నిర్వీర్య పోలీస్ బృందం, పోలీస్ జాగిలలో జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, కలెక్టర్ కార్యాలయ ఆవరణ, జిల్లా కోర్టు, జనసామర్థ్యం గల ప్రదేశాలలో బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో ఆదివారం తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, సంచులు, వాహనాలు ఏమైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అడిషనల్ ఎస్పీ ఎండి. రియాజ్హుల్ హక్ ఆధ్వర్యంలో సాయుధ పోలీస్ బలగాలు రిహార్సల్స్ నిర్వహించారు. -
‘దోస్త్’ మొదటి విడతలో 94 మందికి సీట్ల కేటాయింపు
మద్దూరు: మద్దూరు డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వార మొదటి విడతలో 94 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు, వీరి జూన్ 5 లోపు అడ్మిషన్లు పొందాల్సిందిగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం కళాశాల అవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టర్, కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2025–26 విద్యాసవంత్సరానికి గాను డిగ్రీ కళశాలలో 240 సీట్లగాను మొదటి విడతలోనే 94 మంది సీట్లు కేటాయించామని అన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ సౌకర్యంతో పాటు, అన్ని సబ్జెక్టు బోధించడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు, తరగతి గదులు, క్రీడా సౌకర్యంతో పాటు ప్రతి రోజు ఓ ఉపన్యాసకుడిచే వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళశాలలో చేరాలని సూచించారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు జనార్ధన్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల పునఃప్రారంభానికి సిద్ధం చేయాలి
నారాయణపేట రూరల్: పాఠశాలలు పున: ప్రారంభం నాటికి అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం తన ఛాంబర్ లో విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే బడిబాటపై ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. టీచర్లకు ఇచ్చిన శిక్షణను పాఠశాలల్లో అమలు చేసి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పెండింగ్ లో ఉన్న పనులు కాంట్రాక్టర్లతో మాట్లాడి పూర్తి చేయించాలని, మధ్యాహ్న భోజన విషయంలో రాజీ లేకుండా నాణ్యతతో వడ్డించే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఉన్న పాఠశాలను గుర్తించాలని, నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఉన్న బడులకు వరద ముప్పు ఉంటే అప్పటికప్పుడే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల రాకపోకలకు సంబంధించి రవాణా పరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులతో మాట్లాడాలన్నారు. పాఠశాలలలో టీచర్ల కొరత ఉంటే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలని, ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, సిఆర్పిలు నిరంతరం పాఠశాలల పర్యవేక్షణ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇతర విద్య కార్యక్రమాలపై ఆమె విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో డీఈవో గోవిందరాజులు, జి సి డి ఓ నర్మదా, సంబంధిత అధికారులు యాదయ్య శెట్టి, రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు
నారాయణపేట రూరల్: జిల్లాలోని ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధిఖారి ఉమాపతి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల ఎస్సీ కులాలకు చెందిన విద్యార్థులు 1వ తరగతి, 5వ తరగతి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 2025 – 2026 విద్యా సంవత్సరంలో చదువుకునేందుకు ఉచిత అడ్మిషన్ కొరకు ఈ నెల 16 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉంటుందన్నారు. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణవాసులకు రూ. 2 లక్షలు మించకుండా ఉండాలని, కులం, ఆదాయం, రెసిడెన్సియల్ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు డీఎస్సీడీఓ కార్యాలయంలోగానీ, 9492957258 నెంబర్ లో సంప్రదించాలని ఆయన తెలిపారు. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య నారాయణపేట రూరల్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు కే.నారాయణరెడ్డి, విద్యాశాఖ కన్వీనర్ ఆకుల రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం డీఈఓకు వినతి పత్రం అందించారు. ఈ మేరకు ఆయన వెంటనే స్పందించి 2025 –26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టు పిల్లలలో ఒకరికి ఉచిత విద్య, మరొకరికి 50 శాతం రాయితీతో చదివించాలని సర్క్యులర్ అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో పిల్లలను ఉచితంగా, రాయితీతో చక్కగా చదివించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రథమ మహాసభ ను సుమారు 200 మంది పైచిలుకు జర్నలిస్టులతో నిర్వహించామని, త్వరలోనే ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అధ్యక్షులు నారాయణరెడ్డి, రాష్ట్ర డిజిటల్ మీడియా కార్యవర్గ సభ్యు లు రఘు గణప, నక్క శ్రీనివాస్, విద్యా శాఖ కన్వీనర్ ఆకుల రాజేష్, హెల్త్ కన్వీనర్ సంజీవ ప్రకాష్, యాదగిరి ప్రవీణ్, నరసింహ, ప్రచార కార్యదర్శి సులిగేమ్ సురేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి తరలింపు నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మండలంలోని అప్పక్పల్లి దగ్గర నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాలకు తరలిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.రాంకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుత దవాఖానా భవనం దెబ్బతిందని ఇంజినీరింగ్ అధికారులు ధ్రువీకరించడంతో ప్రజలు, రోగుల భద్రతా, సంక్షేమం దృశ్య కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ సేవలను మార్పు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఔట్ పేషెంట్ విభాగం తరలిస్తామని తెలిపారు. గర్భిణీలు, చిన్నపిల్లల సేవలు జూన్ 3 నుంచి అప్పక్ పల్లి సమీపంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో అందుబాటులోకి వస్తాయని, కొన్ని రోజుల వరకు అత్యవసర ఆపరేషన్ మహబూబ్నగర్ కి రెఫర్ చేయనున్నట్లు తెలిపారు. పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదం నారాయణపేట రూరల్: దూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు పొగాకు వాడకాన్ని త్యజించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఆయన ఆర్డీఓ కార్యాలయం దగ్గర జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు పొడవున వైద్య సిబ్బంది పొగాకు నియంత్రణపై నినాదాలు చేస్తూ ప్లకార్డుతో వీరసావర్కర్ సర్కిల్ వరకు చేరుకున్నారు. దూమపానం చేయరాదని బాటసారులు, వాహనదారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. పొగాకును ఏ రూపంలో తీసుకున్న మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తుందని, వివిధ రకాలైన రోగాలకు కారణం అవుతుందన్నారు. -
పాలమూరు
సార్థకనామం.. నేడు ప్రపంచ పాల దినోత్సవం పాడి రైతులపై ఆర్థిక భారం ఒకప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్ మిక్చర్స్, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
1975లోనే పాలకేంద్రం
గద్వాల ప్రాంతంలో 1975లో ప్రభుత్వం పాలకేంద్రం స్థాపించింది. చాలా ఏళ్లపాటు రైతులు ఇక్కడ పాలు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా పాల కేంద్రం మూతబడింది. కాగా 2020 ప్రాంతంలో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 5 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రం పునఃప్రారంభమైంది. దీనిద్వారా జిల్లావ్యాప్తంగా 25 పాలసేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ప్రతిరోజు 2,500 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. ఇవి కాకుండా ప్రైవేట్ పరంగా మరో పది దాక పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. -
చేయండి.. చేస్తాం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ పథకంలో అప్పట్లో ఇళ్ల స్థలాలు మనమే ఇచ్చాం.. ఇప్పుడు కూడా మనమే ఇస్తున్నాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణాల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది ? ముందస్తుగా వర్షాకాలం వచ్చింది. ఇప్పటికే హెచ్చరించినా సరైన ప్రణాళిక లేకపోవడం ఏమిటి ? భూభారతి చట్టం వచ్చినా.. అప్పీలేట్ అధికారం ఇచ్చినా.. రైతులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్ చుట్టూ తిప్పించుకోవడం కరెక్టేనా? అంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు కంగుతిన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ వేదికగా మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అధికారులతో సమీక్షలో.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశ్నలకు వివిధ శాఖలకు చెందిన అధికారులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలినట్లు సమాచారం. ఈ క్రమంలో ‘ప్రభుత్వం అమలు చేస్తున పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చేయడం అధికారుల బాధ్యత’ అంటూ మంత్రులు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టండి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించండి.. వానాకాలం సాగులో ఇబ్బందులు తల్తెకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూసుకోండి అంటూ మంత్రులు సూచనలు చేయడం.. ఒకే సార్ అనే సమాధానాలకే పలువురు అధికారులు పరిమితం కావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్షకు పలువురు విభాగాధిపతులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆయా శాఖల ఉద్యోగ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. సమీక్ష సమావేశంలో మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, పరిగి ఎమ్మె ల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వాకిటి శ్రీహరి, డాక్ట ర్ చిట్టెం పర్ణికారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మహబూబ్నగర్, నారాయణపేట జి ల్లాల కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే.. ● గతంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చైర్మన్గా ప్రభుత్వ భూముల పంపిణీకి ఒక అసైన్డ్ కమిటీ ఉండేదని, మళ్లీ ఆ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రులను మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కోరారు. ● యాసంగిలో ఎంత మంది రైతుల వద్ద ఎంత ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంత మందికి బోనస్ వచ్చింది.. పంట నష్టం ఎంత జరిగింది.. వచ్చిన నష్ట పరిహారం వివరాలను నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు అందజేసేలా చూడాలని మంత్రులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఇవ్వాలని వారు అధికారులను ఆదేశించారు. ● కోయిల్కొండ సీహెచ్సీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ● బేస్మెంట్ వేసుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింప చేయాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి కోరారు. ● గతేడాది మహబూబ్నగర్ జిల్లాలో డెంగీ కేసులు అధికంగా నమోదు కాగా.. ఈ సారి ముందస్తుగానే వార్డుల వారీగా దోమల నివారణకు ఫాగింగ్ చేయించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి మంత్రులకు తెలిపారు. మహబూబ్నగర్తోపాటు నారాయణపేట జిల్లాలోనూ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ ఫాగింగ్ యంత్రాలు లేవని కలెక్టర్లు వారి దృష్టికి తీసుకొచ్చారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో వైద్య, ఆరోగ్యశాఖపై నారాయణపేట, మహబూబ్నగర్లలో ప్రత్యేక సమీక్ష చేయనున్నట్లు దామోదర తెలిపారు. కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించే రిపోర్ట్లను ఆయా జిల్లాల శాసనసభ్యులకు కూడా పంపించాలని మంత్రి సూచించారు. నకిలీ విత్తన అమ్మకందారులపై ఉక్కుపాదం మోపాలి.. టాస్క్ఫోర్స్ బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టి.. నకిలీ విత్తనాలు అమ్మేవారు, రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మన ప్రభుత్వం వచ్చాకే వరికి బోనస్ ఇస్తున్నాం. ఆ క్రెడిట్ మన ప్రభుత్వానికే దక్కాలి. సీఎమ్మార్ బకాయిలను రికవరీ చేసేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆయా భూముల వివరాలపై సమాచారం అందించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నంబర్, వాట్సప్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలి. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి రీజినల్ కేన్సర్, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం.. మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంఆర్ఐ త్వరలో ఏర్పాటు చేయిసాం. సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారిపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా సెంటర్, మహబూబ్నగర్ లో రీజినల్ కేన్సర్ సెంటర్, ఆర్గాన్ రిట్రివల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. – దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి ●2 జిల్లాల అధికారులతో సమీక్ష సాగిన తీరు ఇది.. మంత్రుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన పలు శాఖల అధికారులు? సూచనలతో సరిపెట్టిన అమాత్యులు పలు ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై విమర్శలు -
ఇంట్రా డిస్ట్రిక్ట్ చాంపియన్గా మహబూబ్నగర్
మహబూబ్నగర్ క్రీడలు: అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లో మహబూబ్నగర్ జట్టు చాంపియన్గా నిలిచింది. లీగ్లో మొదటి నుంచి మెరుగైన ప్రదర్శన కనబరిచిన మహబూబ్నగర్ జట్టు వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దు కాగా మిగిలిన 4 మ్యాచుల్లో విజయాలు సాధించి 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. లీగ్లో మహబూబ్నగర్ జట్టు బౌలర్ ఎండీ ముఖితుద్దీన్ అత్యధికంగా 35 వికెట్లు తీశాడు. – జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో నారాయణపేటపై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ 49.5 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అక్షయ్ 103 బంతుల్లో 3 సిక్స్లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేపట్టిన నారాయణపేట జట్టు 24.2 ఓవర్లలో కేవలం 72 పరుగులకు ఆలౌట్ అయింది. మహబూబ్నగర్ బౌలర్లు ముఖితుద్దీన్ 18 పరుగులు ఇచ్చి 4, షాదాబ్ అహ్మద్ 11 పరుగులకు 3, శశాంక్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన నారాయణపేట రెండో ఇన్నింగ్స్లో 17.5 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో ముఖితుద్దీన్ అ 6.5 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 6 వికెటు ్ల తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్లో నాలుగు విజయాలతో అగ్రస్థానం చివరి మ్యాచ్లో నారాయణపేటపై ఇన్నింగ్స్ గెలుపు రానున్న హెచ్సీఏ టోర్నీల్లో ప్రతిభచాటాలి రానున్న హెచ్సీఏ టోర్నీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్ చాంపియన్గా నిలిచిన మహబూబ్నగర్ జట్టును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి మొదటిసారిగా ఆరు జట్లతో అండర్–23 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ లీగ్లో రాణించిన క్రీడాకారులను 24 మందితో రెండు జట్లుగా విభజించి మూడు మ్యాచ్లు నిర్వహించి ప్రతిభచాటే 15 మంది తుది జట్టును ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట జిల్లాకు చెందిన డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్, డీపీఓ బిక్షపతి, కోచ్ రమణ, శ్రీనివాస్గౌడ్, ఉమేష్కుమార్, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
విషాదం మిగిల్చిన విహారయాత్ర
ఎర్రవల్లి: విహారయాత్ర ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం మునగాల సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. హైదరాబాద్లోని నిజాంపేటకు చెందిన ఎర్ర వెంకటబాబ్జి ఓ కంపెనీలో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 24న తన భార్య ఎర్ర శ్రావణి (38), పెద్ద కుమార్తె లక్ష్మీసహస్ర, చిన్న కుమార్తె సాయిచైత్ర (7)లతో కలిసి తమ కారులో విహారయాత్ర నిమిత్తం ఊటీకి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సంతోషంగా గడిపారు. గురువారం తెల్లవారుజామున తిరిగి తమ స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గమధ్యంలోని మునుగాల శివారులో జాతీయ రహదారిపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపిన లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా.. వెంకటబాబ్జి భార్య ఎర్ర శ్రావణికి తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన చిన్న కుమార్తె సాయిచైత్రను కర్నూలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన వెంకటబాబ్జి, లక్ష్మీసహస్రలను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వెంకటబాబ్జి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్హెచ్–44పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీకూతురు దుర్మరణం ప్రాణాలతో బయటపడిన తండ్రి, మరో కూతురు తిరుగు ప్రయాణంలో చోటు చేసుకున్న ఘటన -
కారు డ్రైవర్ నిర్లక్ష్యం: యువకుడి మృతి
కొత్తకోట: అతి వేగంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. వనపర్తి నుంచి కొత్తకోట వైపుగా వస్తున్న కారు కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలరాజు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఎస్ఐ ఆనంద్, మృతుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోట మండలంలోని రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్న దాసరి సుక్కమ్మ, శివన్నకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో ఇంట్లో ఉంటుండడంతో కొడుకు బాలరాజు చేపలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని కానాయపల్లి చెరువులో చేపలు పట్టేందుకు బాలరాజు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడని తల్లి తెలిపారు. ఈ క్రమంలో స్థానిక బీపీఆర్ ఫంక్షన్హాల్ వద్దకు రాగానే కారు డ్రైవర్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బాలరాజు తలకు రక్తపు గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తల్లి సుక్కమ్మ తెలిపారని ఎస్ఐ వివరించారు. ఘటన మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు. -
సందర్శకులతో జూరాల కిటకిట
ధరూరు: నైరుతి రుతు పవనాల రాకతో జిల్లాలో వర్షాలు విస్తృంగా కురుస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో ప్రాజెక్టుకు మొదటి సారిగా వరద నీరు రావడం.. అదే రోజు గేట్లను ఎత్తడంతో కృష్ణమ్మ అందాలను వీక్షించేందుకు జిల్లా నలుమూలలతో పాటు కర్ణాటక, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. దీంతో శుక్రవారం ప్రాజెక్టు పరిసరాలు సందర్శకులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా చిన్నారులు, యువత సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉదయం నుంచి ప్రాజెక్టు వద్ద గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదభరిత ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా కంచె వేశారు. కృష్ణానదిలో పెరుగుతున్న నీటిమట్టం కొల్లాపూర్: ఎగువ నుంచి వరద జలాలు రావడంతో కృష్ణానదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం బేసిన్కు 80 వేల క్యూసెక్కుల మేరకు నీటిని విడుదల చేయడంతో బ్యాక్ వాటర్ లెవెల్స్ శుక్రవారం నాలుగు అడుగుల మేరకు పెరిగింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 821 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే త్వరలోనే సంగమేశ్వరుడి ఆలయం మళ్లీ నీటిలో మునిగిపోనుంది. ఈ ఏడాది మార్చి 21 నుంచే సంగమేశ్వర ఆలయంలో పూజలు ప్రారంభయ్యాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే గుడి వద్దకు నీళ్లు చేరుకోవడం ఇదే తొలిసారని పూజారులు, స్థానికులు చెబుతున్నారు. సంగమేశ్వర గుడి సమీపంలో కృష్ణానది నీటిమట్టం -
నలుగురు వేటగాళ్లు అరెస్ట్
లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నలుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ రేంజర్ ఈశ్వర్ తెలిపారు. పద్మన్నపల్లికి చెందిన కాట్రాజు రాజు, కాట్రాజు నిరంజన్, రాయ బాలయ్య, బల్మూరి లింగస్వామి రమేష్ ఉడుములను పట్టుకొని వెళ్తుండగా గుండాల ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఉడుములలో మూడు చనిపోయి ఉండగా మరో 6 బతికి ఉండడంతో వాటిని బేస్ క్యాంపు దగ్గర ఉంచినట్లు వెల్లడించారు. వన్య ప్రాణుల రక్షణ చట్టం ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం నేరమని, అదుపులోకి తీసుకున్న నిందితులను త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వోతో పాటు డీఆర్వో జయదేవ్, ఎఫ్బీఓ శివాజీ పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత హన్వాడ: మండలంలోని వేపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. వేపూర్కు చెందిన గణేశ్, అనిల్ ఎలాంటి అనుమతులు లేకుండా వాగు నుంచి తమ ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ట్రాక్టర్లను పట్టుకుని స్టేషన్కు తరలించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కుటుంబ పోషణ భారం..
నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టమవుతోంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు ఐదు రోజులు పాల్గొన్నాం. ప్రభుత్వం వెంటనే వేతన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలి. – శ్రీనివాస్, బండగొండ వేతనాలు ఇవ్వాలి.. చేస్తున్న ఉద్యోగం మానేసి పాఠశాలలో చేరా. ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోగా.. ఏప్రిల్ 23న టెర్మినేట్ చేశారు. మిగాతా కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులను మూడురోజుల్లో విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను అర్థం చేసుకొని వేతనాలు చెల్లించాలి. – మాధవీలత, కున్సి పెండింగ్లో ఉన్నాయి.. డీఎస్సీ–2008 కాంట్రాక్టు ఉపాధ్యాయుల వేతనాల అంశం రాష్ట్రస్థాయిలో ఉంది. జిల్లాలో 41 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికి నాలుగు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు, సర్వీసు పునరుద్ధరణ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – గోవిందరాజులు, జిల్లా విద్యాధికారి ● -
ప్రభుత్వ నిర్ణయం మేరకే..
రైతులకు అందుబాటులో ఉంటూ సాగు సలహాలు, సూచనలు, సమీక్షల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు మంజూరుకావడం లేదు. సొంతంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ క్లస్టర్ అన్ని వేదికలపై ఏర్పాటు.. ఉమ్మడి జిల్లాలో పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లి రైతులవేదికల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలోని 467 రైతువేదికలపై ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని భవనాలు ఒకే నమూనాలో నిర్మించడంతో సౌర పలకల బిగింపు ఒకేసారి చేపట్టేందుకు వీలుంటుంది. సౌర విద్యుత్ తయారీ, విక్రయం తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అను గుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – మనోహర్రెడ్డి, మేనేజర్, టీజీ రెడ్కో, ఉమ్మడి పాలమూరు జిల్లా ● -
వేతనాలు వచ్చేదెన్నడో..?
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఎదురుచూపులు నారాయణపేట రూరల్: డీఎస్సీ–2008లో వారంతా అర్హత సాధించారు. పోస్టింగ్ రావడంలో ఆలస్యం కాగా.. 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని కాంట్రాక్టు పద్ధతిలోనే విధుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి వేతనాలు అందుతాయని, భరోసా ఉంటుందని భావించారు. అప్పటి వరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారు. నాలుగు నెలలైనా వేతనాలు రాకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 41 మంది.. జిల్లాలో డీఎస్సీ–2008లో 49 మంది అభ్యర్థులు ఎంపిక కాగా.. ఐదుగురు ఇతర ఉద్యోగాల్లో స్థిరపడటంతో 44 మందికి ఆర్డర్ కాపీలు అందించారు. వారిలో మరో ముగ్గురు పాఠశాలల్లో రిపోర్ట్ చేయకపోగా.. 41 మంది ఈ ఏడాది ఫిబ్రవరి 15న విధుల్లో చేరి కేటాయించిన పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్నారు. కాని ఇప్పటి వరకు వారికి కనీసం ఎంప్లాయ్ ఐడీ ఇవ్వకపోగా.. నాలుగు నెలలుగా వేతనాలు సైతం పొందడం లేదు. రోజు పాఠశాలకు రవాణా చార్జీలు సైతం సొంతంగా పెట్టుకొని వెళ్లి వస్తున్నారు. విద్యా సంవత్సరం చివరలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. నాలుగు నెలలుగా అందక ఇక్కట్లు సర్వీసు పునరుద్ధరణపై నీలినీడలు -
రైతువేదికలు.. సౌర కేంద్రాలు
కోస్గి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికల నిర్వహణకు నిధులు సమకూరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆదాయ సమీకరణకు రైతువేదిక భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటుచేసి విద్యుదుత్పత్తి చేసి విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. ఒక్కో వేదికపై 5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర పలకలు అమర్చడంతో విద్యుత్ అవసరాలు పోను ఏడాదికి సుమారు రూ.25 వేల ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రూపొందించింది. పైలెట్ గ్రామాల్లో విజయవంతం.. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకొని జిల్లాకు రెండు చొప్పున పైలెట్ గ్రామాల రైతువేదికలను ఎంపిక చేసి సౌర విద్యుదుత్పత్తి చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జిల్లా జానంపేట, నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో విజయవంతం కావడంతో మిగిలిన రైతువేదికపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో రెడ్కో అధికారులు సిద్ధమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 467 రైతువేదికలపై సోలార్ ప్యానెల్స్ బిగించి సౌర విద్యుత్ తయారీకి చర్యలు తీసుకుంటోంది. నిర్వహణ భారం.. గత ప్రభుత్వ హయంలో రైతులను సమావేశపర్చి శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, సలహాలు, సూచనలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాల పంపిణీ కోసం 5 వేల ఎకరాలను ఓ క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కు ఒకటి చొప్పున రైతువేదిక నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతను ఏఈఓలకు అప్పగించారు. భవనాల నిర్మాణం పూర్తయినా.. నిర్వహణకు నిధులు మంజూరుగాకపోవడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. సొంతంగా ఆదాయం లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతువేదికల లక్ష్యం నీరుగారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. రైతువేదికలపై సోలార్ పలకల ఏర్పాటుతో ఆదాయం సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతువేదికల నిర్వహణకు నిధుల కొరత లేకుండా సక్రమంగా సాగాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. భవనాలపై ప్యానల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్ధం ఒక్కో కేంద్రం వద్ద 5 కిలోవాట్ల సామర్థ్యం.. కేంద్రాల నిర్వహణకు విద్యుత్ విక్రయం పైలెట్ గ్రామాలైన జానంపేట, కొండారెడ్డిపల్లిలో విజయవంతం అన్ని వేదికల్లో ఏర్పాటుకుసిద్ధమవుతున్న టీజీ రెడ్కో -
బీజేపీతోనే నేతన్నలకు న్యాయం
నారాయణపేట రూరల్: చేనేతకు పూర్వ వైభవం తీసుకొచ్చి నేతన్నలను ఆదుకోవడం బీజేపీతోనే సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రాణి అహల్యాబాయి జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న వయసులో భర్త చనిపోగా నాడు సతీ సహగమనాన్ని తిరస్కరించి రాజమాతగా అహల్యాబాయి రాజ్యపాలన చేశారని కొనియాడారు. వితంతువుల హక్కుల కోసం పోరాడి, భర్త ఆస్తిలో వాటాను సాధించిన వీర వనిత అన్నారు. మహిష్మతిని కేంద్రంగా చేసుకొని రాజ్యపాలన చేస్తూ వాణిజ్య, వస్త్ర పరిశ్రమలను స్థాపించి చేనేత కార్మికులు, కళాకారులను గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. సోమనాథ నుంచి గయా వరకు, రామేశ్వరం నుంచి కాశీ వరకు దేశంలోని పలు దేవాలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొచ్చారని.. ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం చేనేత కార్మికులు చేనేత వస్త్రాలతో ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాద వ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, పి.శ్రీనివాసులు, లక్ష్మీకాంత్రెడ్డి, వినో ద్, లక్ష్మి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.డ్రైవర్లు జాగ్రత్తలుపాటించాలినారాయణపేట రూరల్: పోలీసు వాహన డ్రైవర్లు డ్రైవింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, వాహనాల కండీషన్ను పరిశీలించాలని మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ (ఎంటీఓ) శివశంకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఈ లెర్నింగ్ సెంటర్లో జిల్లాలోని పోలీసు వాహన డ్రైవర్ల కు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. పెట్రోకార్, ఎస్హెచ్ఓ దగ్గర విధులు నిర్వర్తించే డ్రైవర్లు రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహించాలని, ఆ సమయంలో నేరస్తులపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనాలకు ఏవైనా సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. మెకానిజంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కేటాయించిన వాహనాన్ని రోజు శుభ్రం చేయడంతో పాటు సమ యానికి సర్వీసింగ్ చేయించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో ఉన్నతాధికారులకు వాహనాన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. డ్రైవింగ్ సమయంలో విధిగా యూనిఫామ్ ధరించాలని, సైన్ బోర్డులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దన్నారు. అనంతరం పోలీస్ హెడ్క్వార్టర్స్ లో మెకానిజంపై అవగాహన కల్పించారు.మక్తల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదంషాద్నగర్రూరల్: నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ టోల్ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాలివీ.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం తన కారులో హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్వైపు వెళ్తున్నారు. జడ్చర్లవైపు నుంచి షాద్నగర్వైపు వెళ్తున్న మరో కారు టోల్ప్లాజాలోని వేరే లైన్కు మారేందుకు డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఎమ్మెల్యే వాహనం టోల్ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో పక్కనుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అనంతరం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి స్థానిక నేతలు గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసి మరో వాహనంలో పంపించారు. -
మీనాక్షితో ‘మహబూబ్నగర్’ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి ప్రతినిధి మహబూబ్నగర్: మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు గురువారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కలిశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని క్యాంపు కార్యాలయంలో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నటరాజన్ వారివారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనుల వివరాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రజాపాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. నియోజకవర్గాల పరిధిలో ఎలాంటి చర్చ జరుగుతోందని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా నియోజకవర్గంలోని సమస్యలు కావాల్సిన నిధుల వివరాలను వారి నుంచి సేకరించినట్లు తెలిసింది. మీనాక్షి నటరాజన్ను కలిసిన వారిలో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మినహా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి ఉన్నారు. మంత్రుల లెక్కనే ఇవ్వాలి: అనిరుధ్రెడ్డి మీనాక్షి నటరాజన్తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో మంత్రులకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధంగా అయితే అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారో.. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా నిధులు కేటాయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు లేరని.. వారికి నిధుల కేటాయింపులో ఏ విధంగా అయితే ప్రాధాన్యం ఇస్తున్నారో.. తమకూ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా, మీనాక్షి నటరాజన్తో భేటీ అనంతరం సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యేలందరూ వెళ్లారు. ఈ క్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి సహచర ఎమ్మెల్యేలను తన వాహనంలో కూర్చోబెట్టుకొని తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు. ట్రిపుల్ ఐటీ కళాశాలను మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ పరిధిలో అభివృద్ధిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆరా మంత్రులకు ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారో.. అలాగే మాకు ఇవ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే విజ్ఞప్తి ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు -
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
దేవరకద్ర: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం దేవరకద్రలోని మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ డోకూర్ పవన్కుమార్రెడ్డి నివాసంలో మున్సిపాలిటీల నూతన కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి కొండా ప్రశాంత్రెడ్డి, నాయకులు యజ్ఞ భూపాల్రెడ్డి, మాధవరెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు. -
మద్దూరులో 4 గ్రామాలు విలీనం
మద్దూరు: స్థానిక పురపాలికలో మరో 4 గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. ఈ ఏడాది జనవరి 27న మద్దూరు, రెనివట్లను కలిపి పురపాలికగా మారుస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. గతంలో మద్దూరు గ్రామపంచాయతీ పరిధిలో భీంపూర్, నాగంపల్లి, సాపన్చెరువుతండా, అలాగే రెనివట్ల పరిధిలో ఎర్రగుంటతండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. తండాలు పంచాయతీలుగా ఏర్పాటుచేసే క్రమంలో అనుబంధ గ్రామాలు గ్రామపంచాయతీలుగా మారాయి. ఆయా గ్రామాలు మద్దూరు, రెనివట్ల పరిధిలో ఉండటంతో వాటిని తిరిగి పురపాలికలో విలీనం చేయాలని ఆదేశాలు రావడంతో గురువారం పుర కమిషనర్ శ్రీకాంత్ ఆయా పంచాయతీల్లో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఈ నాలుగు పంచాయతీలు కూడా మద్దూరు పురపాలికలో చేరనున్నాయి. నేడు భూ భారతిపై ఇన్చార్జి మంత్రి సమీక్ష జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన భూభారతి రెవెన్యూ సదస్సులతో పాటు పలు అభివృద్ధి అంశాలపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్హాల్ ఉదయం 11.30 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమీక్షకు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం సేకరణ, వ్యవసాయం, వ్యాధులు అంశాలపై కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 1న మహిళా క్రికెట్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: త్వరలో జరిగే హెచ్సీఏ ఉమెన్ టోర్నీల్లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టు ఎంపికలను ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు వైట్ డ్రెస్, ఆధార్కార్డు, ఫొటోతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. -
జూరాలకు వరదొచ్చింది
గద్వాల/ధరూరు/ఆత్మకూర్: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది. ● జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్ఈ శ్రీధర్ బృందం ప్రత్యేక పూజలను నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. అనంతరం జన్కో ఉద్యోగులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఎగువలో ఐదు యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టారు. గతేడాది జూలై 17న రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. 49 రోజుల ముందే ప్రారంభం కావడంతో 610 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న జూరాల ప్రాజెక్టు అప్రమత్తంగా ఉండాలి జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో దిగువనున్న లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట కోసం మత్య్సకారులు నదిలోకి వెళ్లవద్దని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వరద పరిిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రవాహం 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో.. 12 గేట్లు ఎత్తివేత అర్ధరాత్రి 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం -
కచ్చితంగా సీజ్ చేస్తాం..
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 16 నుంచి ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్నాం. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సులు పాఠశాలల ప్రారంభం నాటికి పరీక్షలు పూర్తిచేసుకోవాలి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను తరలిస్తే అలాంటి బస్సులను కచ్చితంగా సీజ్ చేస్తాం. ప్రతి బస్సులో విద్యార్థుల వివరాలతోపాటు డ్రైవర్, క్లీనర్ వివరాలు తప్పక ఉంచాలి. సీట్ల సంఖ్యకు మించి విద్యార్థులను తరలించినా, పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకపోయినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – కిషన్, ఉమ్మడి జిల్లా డీటీసీ -
ఫిట్లెస్ బస్సులు
ఈ నెల 16 నుంచి మొదలైన ప్రైవేట్ బస్సుల సామర్థ్య పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 1,383 బస్సులకు గాను 245 పూర్తి ● కండీషన్లో లేని వాహనాలు వెనక్కి పంపాలని నిర్ణయం ● ఫిట్నెస్ పరీక్షలకు రాకుండానే నడిపిస్తున్న వైనం ● విద్యార్థుల సంరక్షణ బాధ్యత యాజమాన్యాలదే ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ విషయంలో కొందరు అధికారులు ఉదాసీనంగా, ఏజెంట్లు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2024– 25లో దాదాపు వందకు పైగా బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోకుండానే విద్యార్థులను తరలించినట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అర్హత పత్రాలు తీసుకోవాల్సిన కొందరు యాజమాన్యాలు మరమ్మతు ఇతర కారణాలతో ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. విద్యాసంస్థల బస్సులన్నీ నిబంధనల మేరకు వసతులు కల్పించి ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి. బస్సుల నిర్వహణకు సంబంధించి విద్యార్థుల పూర్తి సంరక్షణ బాధ్యత తమదేనంటూ పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖకు హామీపత్రం సమర్పించాలి. కఠినంగా వ్యవహరిస్తేనే.. -
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ
నారాయణపేట రూరల్: ముందస్తుగా ముసురు వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దోమలతో వచ్చే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు పంచాయతీరాజ్, నీటి సరఫరా, మున్సిపల్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గతేడాది జిల్లాలో నమోదైన డెంగీ కేసుల వివరాలు అడిగి తెలుసుకొని దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, శిథిలావస్థకు చేరిన పెద్ద భవనాలను కూల్చేందుకు యజమానులకు నోటీసులు జారీ చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ సీజనల్ వ్యాధులు, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శైలజ, డీపీఓ భిక్షపతి, డీఎల్పీఓ సుధాకర్, పుర కమిషనర్లు, వైద్యులు పాల్గొన్నారు. ప్రణాళికలు సిద్ధం చేయండి.. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం మహబూబ్నగర్లో సమీక్ష నిర్వహించనున్నందున కావాల్సిన పూర్తి సమాచారాన్ని తక్షణమే అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ ప్రణాళిక, వరి ధాన్యం కొనుగోలు, భూ భారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్వీస్ వివరాలు ఆన్లైన్లో నమోదు
నారాయణపేట రూరల్: జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది తమ సర్వీస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది సర్వీస్ సమాచార నమోదును ప్రత్యక్షంగా పరిశీలించారు. నమోదులో తలెత్తే ఇబ్బందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెలవులు, ట్రాన్స్ఫర్స్, శిక్షలు, రివార్డ్స్, ఇంక్రిమెంట్స్, వేతనాలు, అటాచ్మెంట్లు, పదోన్నతులు తదితర వివరాల నమోదు ఇక నుంచి హెచ్ఆర్ఎంఎస్లోనే జరగాలని సూచించారు. ఇకనుంచి కాగితంపై రాసిస్తే సెలవులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఉద్యోగి సాంకేతికతపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీజేఎఫ్ రజతోత్సవ వాల్పోస్టర్ ఆవిష్కరణ.. నారాయణపేట: ఈ నెల 31న జరిగే టీజేఎఫ్ రజతోత్సవ ఆవిర్భావ సభ వాల్పోస్టర్ను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వారధి నవీన్కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అనంతరాములు, జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్గౌడ్, ప్రధానకార్యదర్శి పృథ్విరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆవుటి రాజశేఖర్, సభ్యులు బాల్రాజు, శ్రీధర్, రాము, వెంకట్రాములు, కృష్ణ, శ్రీనివాస్, మధు, హర్షద్, రహీం, సోఫీ, నవాజ్, అజహర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తరలుతుంటే ఏం చేస్తున్నారు?
నారాయణపేట: మక్తల్లో రాత్రి వేళల్లో ఇసుక అక్రమంగా తరలిస్తుంటే గనులశాఖ అధికారులు ఏం చేస్తున్నారని, వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) రెండో సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. 46 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మక్తల్ పట్టణంలోని ట్యాంక్బండ్పై హోటల్, టాయిలెట్ బ్లాక్, ఇతర దుకాణాల నిర్మాణానికి ప్రతిపాదించడంపై మున్సిపల్ కమిషనర్పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువుకట్టపై ఎవరైనా దుకాణాలు, హోటళ్లు నిర్మిస్తారా? అసలు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించినా అది సాధ్యం కాదని నిర్మోహమాటంగా చెప్పాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులందరికి ఆయా పథకాలను లబ్ధి చేకూర్చాలనిఅన్నారు. పథకాల్లో లోటుపాట్లు సరిచేసి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వేరుశనగ దిగుబడిని, నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఎంపీ సూచించారు.క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకునేలా అవగాహనకేంద్ర ప్రభుత్వం మహిహిళా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతూ క్యాన్సర్ స్క్రీనింగ్లను ఆశా, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలకు అవగాహన కల్పించి చేసుకునేలా చూడాలని ఎంపీ సూచించారు. డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ వైద్య శాఖనివేదికలో ఎఎన్సీ, ఇమ్యూనైజేషన్, ఫ్యామిటీ ప్లానింగ్ స్టేరిలైజేషన్, ప్రసవాల టార్గెట్లు, అచివ్మెంట్లపై తెలిపారు. డీఎల్పీఓ సుధాకర్రెడ్డి 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధుల వివరాలు, డీఏఓ జాన్సుధాకర్ పీఎం కిసాన్ కింద అందిన సాయం, సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన ఎరువుల వివరాలు, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ కార్యక్రమ అమలు పై అధికారి శ్రీధర్ తెలిపారు. డీఆర్డీఏ మొగులప్ప, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ నెల 22 వరకు 5.15 లక్షల పనిదినాలు కల్పించినట్లు వివరించారు. అస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలకు సంబంధించిన ఐదు అంశాలలో కీలక పనితీరు సూచికల పనితీరు ఆధారంగా నీతి అయోగ్ డిసెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్ను విడుదల చేసిందని, పనితీరు ఆధారంగా నర్వ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును సాధించిందని అధికారులు వివరించారు. పీఎంశ్రీ కింద పాఠశాలల ఎంపికపై డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. పీఎంశ్రీ కింద జిల్లాలో మొదటి దశలో 12, రెండో దశలో 7 పాఠశాలలు ఎంపికయ్యాని, మూడో విడతో 20 పాఠశాలలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దీంతో రెండో దశలో ఎందుకు తగ్గిందని ఎంపీ ఆరా తీశారు. అనంతరం ఎస్సీ వెల్ఫేర్, మిషన్ భగీరథ, జిల్లాపౌరసరఫరాల శాఖ, జీఎండీఐసీ, నాబార్డు, పశుసంవర్ధకశాఖతో తదితర వాటిపై నివేదికలు చదివి వినిపించారు. సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీఎఫ్ఓ అరవింద్, ఆర్డీఓ రాంచంద్రనాయక్, జెడ్పీసీఈఓ శైలేష్కుమార్, దిశ కమిటీ సభ్యులు లక్ష్మి, పాండునాయక్, కిరణ్, పగడాకులు శ్రీనివాస్, బలరాంరెడ్డి పాల్గొన్నారు. -
పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు
నారాయణపేట: పశువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తారని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. బుధవారం ఆయన పలు చెక్పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జలాల్పూర్, కానుకుర్తి, చేగుంట, క్రిష్ణ బ్రిడ్స్ దగ్గర, ఉజ్జెల్లి, సమస్తపూర్, లాల్కోట ఈ మేరకు చెక్పోస్టులు ఏర్పాటుచేశామని, పోలీసు, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిఫ్ట్ల వారీగా సమన్వయంతో పనిచేస్తారన్నారు. ముఖ్యంగా జంతువుల అక్రమ రవాణ, గోవధ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. బక్రీద్ పండుగ సందర్భం పశువుల రవాణా విషయంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులను రవాణా చేసే ప్రతి వాహనానికి తగు నిర్ధారిత ప్రమాణిక పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా , మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. మానవీయ కోణంలో నష్టపరిహారం ఇవ్వాలి ఊట్కూర్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి భూ నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు గ్రామ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఊట్కూర్లో బుధవారం నిర్వహించిన ఆర్ఆండ్ఆర్ గ్రామసభకు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ హాజరయ్యారు. గ్రామసభల్లో ఊట్కూర్, దంతన్పల్లి శివారుల్లో భూములు కోల్పోతున్న రైతుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంలో పూర్తిగా భూములు కోల్పోతున్న రైతులకు ఆర్ ఆండ్ ఆర్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇప్పటికె రెవెన్యూ అధికారులు రైతుల ఆర్థిక, సామాజిక సర్వే చేపట్టారని భూములు కోల్పోతున్న రైతులు వారి కుటుంబ వివరాలను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, వెంటనే వివరాలను అందించాలని కోరారు. దంతన్పల్లి శివారులో డిజిటల్ సర్వే చేపట్టడం వల్ల 15 మంది రైతుల భూముల కోల్పోతున్న వారి పేర్లు అనుభవదారుడిగా వచ్చాయని వెంటనే అధికారులు టిపన్ ద్వారా సర్వే చేపట్టాలని పలువురు రైతులు కోరారు. వారం రోజుల్లో మళ్లీ సర్వే నిర్వహిస్తామని అడిషనల్ కలెక్టర్ రైతలకు హామీ ఇచ్చారు. ఎకరా భూమికి రూ.60 లక్షల నష్టపరిహారం ఒకేసారి చెల్లించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ దనుంజయగౌడ్, ఆర్ఐ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, యజ్ఞేశ్వర్రెడ్డి, లింగం, గోపాల్రెడ్డి, యజ్ఞాదత్తు రైతులు తరణ్ రెడ్డి, సురేంధర్రెడ్డి, భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ సొబగులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పాలమూరు జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారుతోంది. ఇప్పటికే పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు చేయగా.. తాజాగా ఆర్జీయూకేటీ (రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ) బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు అనుబంధంగా మహబూబ్నగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరైంది. ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కళాశాల పూర్తిస్థాయి క్యాంపస్ ఏర్పాటు కోసం దివిటిపల్లి వద్ద స్థల పరిశీలన సైతం అధికారులు పూర్తి చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ కళాశాల వైస్ చాన్స్లర్ గోవర్ధన్ స్థల పరిశీలనలో పాల్గొని.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.మూడు కోర్సులతో ప్రారంభంట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ పూర్తిస్థాయిలో నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతోంది. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణకు తాత్కాలిక భవనం ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బండమీదిపల్లి వద్ద ఉన్న పాతరెడ్డి హాస్టల్ భవనంలో తరగతులు ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు కోర్సులతో కళాశాల ప్రారంభించనున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విద్యాసంవత్సరంలో ఒక్కో కోర్సులో 60 మంది చొప్పున 180 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించనున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.41.32 ఎకరాల్లో క్యాంపస్జిల్లాకు మంజూరైన ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ కోసం జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి శివారులోని సర్వే నంబర్ 1లో 21.26 ఎకరాలు, మహబూబ్నగర్ అర్బన్ మండలం పరిధిలోని 20.06 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలం 44వ నంబర్ జాతీయ రహదారికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ట్రిపుల్ ఐటీ కళాశాల క్యాంపస్ ఏర్పాటుతో జడ్చర్ల రూపురేఖలు మారనున్నాయి. జాతీయ రహదారికి ముఖద్వారంలా ఉన్న జడ్చర్ల మరింత అభివృద్ధి సాధించే అస్కారం ఉంది. జడ్చర్ల, మహబూబ్నగర్ శివార్లలోని జాతీయ రహదారి పక్కన కళాశాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం చిట్టెబోయిన్పల్లి శివారు సర్వే నంబర్ 1లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల నవాబుపేట మండలానికి తరలించనున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గురుకుల పాఠశాలను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్థులకు విద్యనందిస్తూ వచ్చింది. అయితే ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు కావడంతో.. గురుకుల పాఠశాల వేరే ప్రాంతానికి తరలించడం అనివార్యమైంది. నవాబుపేట మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 99493 10297
తేది: 30–5–2025, సమయం: శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు నారాయణపేట: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జెన్ –1 వైరస్ వేరియంట్ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 30న శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్పై తమకు ఉన్న అనుమానాలు, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై నేరుగా ఫోన్ చేసి మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఆర్టీసీ అభివృద్ధికి కృషి
నారాయణపేట రూరల్: ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట డిపోకు మంజూరైన రెండు పల్లె వెలుగు, ఒక ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి పథకం మహిళల కోసం ఆర్టీసీతోనే ప్రారంభించామని గుర్తు చేశారు. బస్సులలో పురుషులకు కొంత ఇబ్బంది అయినా ఇటు ఆడవాళ్ల ఆర్థిక అభివృద్ధికి, ఆర్టీసీ ముందడుగుకు ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. స్థానిక డిపోలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకురాగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో బస్సులు వెళ్లని గ్రామాలకు సైతం పల్లె వెలుగులను పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టమని అన్నారు. మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఎంతోమంది ఉద్యోగులు, వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని అన్నారు. గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేయడంతో పాటు మౌలిక సదుపాయాలు, ఉచిత టాయిలెట్స్ ఏర్పాటు చేశామన్నారు. వివాహాది శుభకార్యాలకు అద్దెకు తీసుకునే బస్సులకు సైతం ధరను తగ్గించి సౌకర్యవంతంగా చేశామని, గమ్యం యాప్తో బస్సుల స్థానాన్ని తెలుసుకోవడం, కార్గో సర్వీసుల ద్వారా వస్తువుల రవాణా, డోర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్య చదువుకునే బాలికలకు సైతం రాయితీ పాసులు కాకుండా ఉచిత రవాణా అందించి విద్యాభివృద్ధికి పరోక్షంగా తోడ్పాటున అందించామన్నారు. ఇటు పుణ్యక్షేత్రాలకు భక్తులను, అటు ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి ఉచిత బస్సు ఎంతో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎం లావణ్య, సీఐ అలివేలమ్మ, ఎంఎఫ్ చంద్ర నాయక్, ట్రాఫిక్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రోటోకాల్పై రగడ.. ఆర్టీసీలో నూతన బస్సుల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ సభ్యుడు పోషల్ రాజేష్, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ బండి వేణు ఆధ్వర్యంలో ప లువురు కాంగ్రెస్ నాయకులు డీఎం చాంబర్లో వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎమ్మెల్యే పట్ల దురుసుగా మాట్లాడినట్టు సమాచారం ఉందని ప్రశ్నించారు. దీనిపై డియం స్పందిస్తూ మంత్రి ఫొటో విషయంలో మరోసారి అలా జరగకుండా చూస్తామని, ఎమ్మెల్యే విషయంలో తాను ఎలాంటి దురుసు మాటలు అనలేదని, అలాంటిది ఏమైనా ఆధారాలు ఉంటే క్షమించమని కోరుతానని, సరిదిద్దుకుంటానని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలో ఎస్డీఎఫ్ నిధులతో కొనసాగుతున్న నారాయణపేట మండలం బండగొండ నుంచి చెన్వార్ వరకు బీటీ పనులు, బండగొండ నుంచి మోమినాపూర్ వరకు బీటీ రోడ్డుతో పాటు హైలేవల్ వంతెన నిర్మాణం, మోమినాపూర్ నుంచి గనిమోనిబండ, అభంగాపూర్, అప్పిరెడ్డిపల్లి నుంచి రెనివట్ల, రాళ్లబాయి వరకు కొనసాగుతున్న బీటీ పనులు, మోమినాపూర్ నుంచి రెనివట్ల వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. పనులను నాణ్యతగా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈ హీర్యానాయక్, డిప్యూటీ విలోక్ను ఆదేశించారు. కొత్త బీటీ పనులతో పాటు రెన్యూవల్ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయించాలన్నారు. భవన నిర్మాణ పనుల పరిశీలన.. కొత్తపల్లి మండలం భూనీడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.6 కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. తరగతులు పునః ప్రారంభమైతే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని.. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మద్దూరులో రూ.30 కోట్లతో చేపట్టే సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వర్షాలు కురుస్తున్నందున మట్టి పరీక్షలు చేపట్టలేకపోయామని కాంట్రాక్టర్ వివరించారు. ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. రవాణాలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తహసీల్దార్తో మాట్లాడి ఇసుక ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భూ భారతి ప్రత్యేక అధికారి యాదగిరి, తహసీల్దార్లు మహేష్గౌడ్, శ్రీనివాస్, జయరాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే వత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్య జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని.. వాటన్నింటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. రోజు ఉదయం 7 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రిలో యోగా తరగతులు నిర్వహిస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. నరసింహారావు, డీపీఓ భిక్షపతి, యోగా ఇన్చార్జ్ నర్సింహులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
నారాయణపేట రూరల్: ప్రతి ఉద్యోగి జీవితంలో వచ్చే పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్కుమార్గౌడ్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందడంతో మంగళవారం తన కార్యాలయంలో భుజంపై పట్టీలు తొడిగి మాట్లాడారు. పోలీసుశాఖలో పదోన్నతి కత్తిమీద సాములాంటిదని, ఆనందంతో పాటు బాధ్యత సైతం రెట్టింపు అవుతుందన్నారు. విధి నిర్వహణలో ధైర్యం, సాహసం కలిగి ఉండాలని, సమయపాలన పాటించాలని, గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు నర్సింహ, ఆనంద్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట రూరల్: జిల్లాలోని కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ–శ్రామ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ అధికారి మహేశ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొరియర్, హోం సర్వీసెస్, ఫుడ్ డెలివరీ, ఏసీ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ డిజైనర్, వీడియో ఎడిటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని.. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ సంస్థల్లో పనిచేసే వారిని సైతం కార్మికులుగా గుర్తించారని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకానికి.. మరికల్: జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి ఫ్లోరెన్స్రాణి తెలిపారు. మంగళవారం పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలని.. ఈ నెల 30న పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు డెమో క్లాస్ నిర్వహిస్తామని వివరించారు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జలయజ్ఞం ప్రాజెక్ట్లపై నజర్
కోయిల్సాగర్: చివరి దశలో పనులు 2006లో రూ.349 కోట్లు కేటాయించి.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి మహానేత వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పనులు పూర్తి కాకుండానే పదేళ్ల తర్వాత 2016లో ప్రారంభించారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలు, లింక్ కెనాల్ కింద కొత్తగా పిల్ల కాల్వల పనులు చేపట్టడానికి రూ.50 కోట్లతో రీ టెండర్లు పిలిచారు. అలాగే నాగిరెడ్డిపల్లి ఫేస్1, తీలేర్ ఫేస్ 2 పంపుహౌస్లలో పెండింగ్లో ఉన్న పనులకు రూ.16.90 కోట్లతో రీ టెండర్లను పిలిచారు. ఎత్తిపోతల పథకం లక్ష్యం 50,250 ఎకరాలు కాగా.. వానాకాలం పంటల కింద 36 వేల ఎకరాలలకు, యాసంగిలో 12వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుంచి దేవరకద్ర గ్రావిటీ కెనాల్ను రూ.23 కోట్లతో చేపట్టగా పనులు చివరిదశలో ఉన్నాయి. అజిలాపూర్, చౌదర్పల్లి ఎత్తిపోతల పథకం, రాజోలి నుంచి పేరూర్ వరకు ఎడమ కాల్వ పొడిగింపు పనులు చేపట్టాల్సి ఉంది. పెండింగ్ భూసేకరణపై సర్కారు ప్రత్యేక దృష్టి ● నెట్టెంపాడులో 610 ఎకరాలకు రూ.25 కోట్లు విడుదల ● ‘పాలమూరు’లో 15 వేల ఎకరాలకు రూ.300 కోట్లు.. ● భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పనులపైనా కసరత్తు ● పనుల పురోగతిపై ప్రత్యేక అధికారి రవినాయక్ ఆరా ● ఇటీవల ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు,ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ప్రాజెక్ట్ -
కేఎల్ఐ: మరో 1.50 లక్షల ఎకరాలకు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2002లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబా బు శంకుస్థాపన చేసినా.. పనులు ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.2,990 కోట్లు కేటాయించారు. ఇందులో నాలుగు రిజర్వాయర్లు ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడి పల్లి నిర్మించారు. ఆ తర్వాత దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. వైఎస్ మరణానంతరం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాజెక్ట్కు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1000 కోట్లు కేటాయించి పలు పనులు చేపట్టింది. మొదట ఈ ప్రాజెక్ట్ ద్వారా 2.30 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం కాగా.. ఆ తర్వాత ఆయకట్టు 4.20 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉండడంతో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్కు రూ.900 కోట్లు కేటాయించగా.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో వచ్చేనెల 1న జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను సోమవారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపికలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించి మాట్లాడారు. అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో 60 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. అండర్– 8 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 200 మీ., టెన్నిస్బాల్ త్రో, స్టాండింగ్ బ్రాడ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 60 మీ., 300 మీటర్ల పరుగు, లాంగ్జంప్, కిడ్స్ జావెలిన్, అండర్–12లో బాల, బాలికలకు 60 మీ., 300 మీ., 600 మీటర్ల పరుగు, లాంగ్జంప్, షాట్పుట్, కిడ్స్ జావెలిన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించామన్నారు. ఆయా క్రీడాంశాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వారి వివరాలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రజలు తమ పిల్లలను విధిగా చేర్పించేలా అవగాహన కల్పించాలని డీఎస్ఓ భాను ప్రకాష్ అన్నారు. మండలంలోని జాజాపూర్లో సోమవారం ప్రజలకు వద్దకు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలలలో అన్ని వసతులు ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, రెండు జతల దుస్తులు అందిస్తున్నామని, ఆరోగ్యానికి రాగి జావా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన పాధ్యాయులు ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో టీచర్లు భారతి, మధుసూదన్ రావు, అంగన్వాడీ టీచర్స్ అనంతమ్మ, సంయుక్త, కమల, చైతన్య, రాధిక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఒకేసారి మూడు నెలలకు..
మహబూబ్నగర్ రూరల్: వర్షాకాలంలో వచ్చే వరదలు, ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకొని తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయం తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ దిశగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం మొత్తం 15,684 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమని భావిస్తున్నారు. జూన్ 1 నుంచి 30 వరకు.. జిల్లాలోని 17 మండలాల్లో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,53,229 మంది కార్డుదారులకు జూన్ 1 నుంచి 30 వరకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. సాధారణంగా ప్రతి నెలా 1 నుంచి 17 వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు. కానీ, కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో జూన్ నెల మొత్తం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ కోటా బియ్యం తీసుకెళ్లాల్సి ఉండగా, అందుకు ఒక్కొక్కరు మూడు సార్లు బయోమెట్రిక్ పెట్టాల్సి ఉంటుంది. ఒక కార్డుదారుడు వరుసగా రెండు, మూడుసార్లు వేలిముద్రలు స్వీకరించే అవకాశం పీఓఎస్లో లేదు. ఈ లెక్కన కార్డుదారులు చౌకధర దుకాణాల్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి వస్తుంది. ఈ విషయమై కేంద్రం పీఓఎస్ (బయోమెట్రిక్ మిషన్)లో ఏమైనా మార్పులు చేస్తుందేమో వేచిచూడాలి. డీలర్లకు ఇబ్బందే.. మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ చేసేందుకు 15,684 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూడు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం రవాణా చేపడుతున్నారు. కాగా మూడు నెలల రేషన్ కోటా బియ్యం ఒకేసారి దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. జూన్లో బియ్యం పంపిణీకిఅధికారుల కసరత్తు వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మహబూబ్నగర్ జిల్లాకు 15,684 మెట్రిక్ టన్నులు అవసరం దుకాణాలకు చేరుతున్న సన్నబియ్యం దిగుమతికి డీలర్ల తంటాలు -
ఆర్టీసీలో ఆన్లైన్ చెల్లింపులు
బైరంకొండకు చెందిన వ్యక్తి నారాయణపేట నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అతను రూ.500 ఇచ్చి టికెట్ అడగగా.. సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ కోరాడు. తనవద్ద చిల్లర లేవని చెప్పగా.. కండక్టర్ టికెట్ వెనక బ్యాలెన్స్ డబ్బులు రాసి ఇచ్చారు. మరికొందరికి ఇలానే రాసిచ్చాడు. చివరకు హైదరాబాద్ చేరుకున్నాక.. అందరికీ కలిపి డబ్బులిచ్చి పంచుకోవాలని చెప్పడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇలా ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఆర్టీసీ క్రమంగా బస్సులో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ను తీసుకొస్తుంది. జిల్లాలో కొన్ని రూట్లలో ఇటీవల ప్రారంభించింది.నారాయణపేట రూరల్: ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ల దిశగా సంస్థ అడుగులు వేస్తుంది. ఎలక్ట్రానిక్ టికెట్ ఇష్యూ మెషిన్ (ఈ టీమ్స్) స్థానంలో నూతనంగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యుయింగ్ మిషన్స్ (ఐ –టిమ్స్) లని ప్రవేశపెట్టింది. ఈ మిషన్ల ద్వారా ప్రయాణికులు యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఏటీఎం కార్డ్ స్వైపింగ్ ద్వారా టికెట్టుకు సరిపడా డబ్బులను ఆన్లైన్లోనే చెల్లించి టికెట్ పొందే అవకాశం ఉంది. కండక్టర్ ఐ –ట్రిమ్ మిషన్లో ప్రయాణికుడి గమ్యస్థానం ఎంటర్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తే వెంటనే మిషన్ నుంచి టికెట్ బయటికి వస్తుంది. ఈ సదుపాయం ఇప్పటికే జిల్లాలోని నారాయణపేట, కోస్గి డిపోలో ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీస్ లలో ఇటీవల అమలు చేశారు.జిల్లాలో ఇలా..జిల్లాలో నారాయణపేట, కోస్గి డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 61 పల్లె వెలుగు, 40 ఎక్స్ ప్రెస్, 6 డీలక్స్ లతోపాటు ఒక సూపర్ లగ్జరీ బస్సు ఉంది. నారాయణపేటలో 24 రూట్లకుగాను 88 షెడ్యూల్స్ ఏర్పాటుచేసి ప్రతిరోజు సుమారుగా 36వేల కిలోమీటర్లు బస్సులు నడవడంతో సరాసరి రూ. 23 లక్షల ఆదాయం సమకూరుతుంది. అదేవిధంగా కోస్గి డిపోలో ఎనిమిది రూట్లకు గాను 16 షెడ్యూల్స్ ఉన్నాయి. నిత్యం 5,500 కిలోమీటర్లు బస్సులు నడవగా రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది. గతంలో నారాయణపేటలో 120 ఈ టీమ్స్ మిషన్లు ఉండగా వాటి స్థానంలో 80 ఐ టిమ్స్ మిషన్లు వచ్చాయి. ఇక కోస్గిలో 20 ఈ టీమ్స్ మిషన్ల స్థానంలో 15 ఐ టీమ్స్ మిషన్లు పంపించారు. వాటిని పల్లె వెలుగు మినహా అన్ని సర్వీసుల్లో ఐ టిమ్స్ మిషన్లని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆన్లైన్ చెల్లింపులపై సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా కండక్టర్లు, వన్ మెన్ సర్వీస్ చేసే డ్రైవర్లకు శిక్షణ ఇప్పించారు.‘ఐ టిమ్స్’తో ఉపయోగంఒక ట్రిప్పునకు సంబంధించి రిపోర్టు, వచ్చిన ఆదాయం వివరాలు ఐ – టిమ్స్ మిషన్లతో సులభంగా తెలియనున్నాయి. డినామినేషన్కు వీలుగా యంత్రంలో ఏర్పాటు ఉండడంతో డ్యూటీ అయిపోయిన తర్వాత డబ్బులు అప్పగించడం చాలా సులభం అవుతుంది. యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించే వెసులుబాటు ఉండటంతో ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లర కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. -
భూ భారతిలో సర్వేయర్ల పాత్ర కీలకం
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతిలో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమ వారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో లైసెన్స్డ్ సర్వేయర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ భారతిలో నిరుద్యోగ లైసెన్స్డ్ సర్వే శిక్షణ పొందేందుకు జిల్లాలో ఐటిఐ, సివిల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద 109 లైసెన్స్డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు అనుభవజ్ఞులైన వారిచే సర్వే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి, హద్దులు, రెవెన్యూ చట్టాలు హక్కులపై తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి కర్ణాటక విధానం అమలు.. ఈ భూ సర్వే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని మనం అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. భూ భారతి చట్టం ద్వారా భూములు, లావాదేవిలు జరిగినప్పుడు సర్వే చేసి హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తర్వాత రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, దీని వల్ల తగదాలకు చోటు ఉండదని అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు శ్రద్ధగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసి రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు. జిల్లాకు చెందిన మొదటి బ్యాచ్ 109 మందికి ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం శిక్షణ మెటిరియల్ను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీఐలు థాను, తయాబ్ సుల్తానా, సర్వేయర్లు రంగయ్య, జయశంకర్, కృష్ణయ్య, రవి, రాజన్న, అరుణ తదితరులు పాల్గొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
‘ప్రజావాణి’కి 36 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 36 రాగా.. వీటిని కలెక్టర్ జెడ్పీసీఈఓ శైలేష్కుమార్కు అందజేసి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ,డీఆర్డీఓ మొగులప్ప, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు రాగా.. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా స్వీకరించారు. ఇందులో రెండు ఆస్తి తగాదాలు, మూడు భూ తగదాలు, రెండు ప్యామిలీ గొడవలు, ఒకటి డబ్బులకు సంబంధించిన ఫిర్యాదులు అందాయనిచ వాటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పి సూచించారు. -
ప్రాధాన్యతా క్రమంలో.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
అచ్చంపేట/ బల్మూర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు, కేఎల్ఐతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రణాళిక, జీఓ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు– రంగారెడ్డి, అచ్చంపేట ఎత్తిపోతలు, ఉమామహేశ్వరం రిజర్వాయర్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిసారించి.. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని బ ల్మూర్ మండలం గట్టుతుమ్మెన్లో రూ.43 కోట్లతో చేపట్టనున్న పలు విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టిందే తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు. అచ్చంపేట నియోజవర్గానికి, తమ కు విడదీయని బంధం ఉందని, అన్న మల్లు అనంతరాములుతోపాటు మల్లు రవి ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేశారని, తాను అప్పట్లో విద్యాభ్యాసం చేస్తూ ఇక్కడికి వచ్చానని గుర్తుచేసుకున్నారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలే.. నీళ్లు, నిధులు, నియామకాలంటూ కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న యువతకు గత పాలకులు అన్యాయం చేశారని డిప్యూటీ సీఎం విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామని, ఇప్పటికే 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేసిందని, దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటి వరకు ఈ ఆలోచన చేయలేదని వివరించారు. ఇందిర సౌర గిరి జల వికాసం పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన 6.70 లక్షల ఎకరాలకు సోలార్ కరెంట్, పంపుసెట్లు, డ్రిప్ స్ప్రింక్లర్లను వినియోగించి ఉద్యానశాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు, నిమ్మ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని.. మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, రాష్ట మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ అధ్యక్షుడు మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేందర్, జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత మాది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం బీఆర్ఎస్ పనులు చేపట్టింది తప్పా పూర్తిచేయలే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క -
నిధులు లేక నీరసం!
●అప్పులు చేసి నిర్వహణ చేపడుతున్నాం.. గ్రామ పంచాయతీలో నిధులు లేకపోవంతో నిర్వహణ కష్టంగా మారింది. అత్యవసర పనుల కోసం బయట అప్పులు తెచ్చి చేయిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలి. – శ్రీనివాస్రావ్, ఉట్కూర్ పంచాయతీ కార్యదర్శి మా పరిధిలో లేదు.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మా పరిధిలోనిది కాదు. అది ప్రభుత్వ విధానం. ప్రస్తుతం స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నెల నెల వేతనాలు చెల్లిస్తుంది. – సుధాకర్రెడ్డి, ఇన్చార్జ్ డీపీఓ, నారాయణపేట మద్దూరు: స్థానిక సంస్థలు నిధులు లేక నీరసించాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి ముగియడంతో.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. రాష్ట్రం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పల్లెల్లో పాలన అస్తవ్యస్థంగా మారింది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణ కూడా కష్టమవుతోంది. ఇక గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అప్పు చేసి అత్యవసర పనులు చేయిస్తున్నారు. ప్రభుత్వాల నుంచి వచ్చే కొద్ది పాటి నిధులు ఏ మూలకు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అంతటా ప్రత్యేక అధికారుల పాలన 2024 ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాల కాల పరిమితి పూర్తయింది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన పెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఇక.. మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి కూడా 2024 జూలై 5 వ తేదీతో ముగిసింది. దాంతో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో మండల, జిల్లా పరిషత్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. అప్పుల్లో కార్యదర్శులు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తూ ఆ ఊబిలో కూరుకుపోయారు. ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. ఇక మండల పరిషత్లో అయితే రెండేళ్ల నుంచి ఎంపీడీఓల వాహనాలకు అద్దె చెల్లింపు నిలిచిపోయింది. నెట్ బిల్లుతో పాటు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. జిల్లా పరిషత్లో నిల్వ ఉన్న ఫండ్తో కార్యాలయ నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఆ ఫండ్ అయిపోతే స్టేషనరీకి కూడా ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నిలిచిన ఆర్థిక సంఘం నిధులు.. కేంద్రం నుంచి జిల్లాకు వచ్చే మొత్తం నిధుల్లో 5 శాతం జిల్లా పరిషత్కు, 10 శాతం మండల పరిషత్కు, 85 శాతం గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తారు. దీంతో ఆయా పాలకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అభివృద్ధి చేసేందుకు ఆవకాశం ఉండేది. ఆ వచ్చిన నిధుల్లోనే 6 శాతం కార్యాలయ నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 6 శాతం నిధులతో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇంతర ఖర్చులకు వాడుకునేవారు. కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలాఉండగా, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాల జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర గ్రాంట్ కూడా అందులో కలిపే ఇవ్వాలనేది నిబంధన ఉంది. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు నిలిపివేసింది. ఆర్థిక సంఘం నిధులు రాక స్థానిక సంస్థల్లో పాలన అస్తవ్యస్తం కార్యాలయాల నిర్వహణ కూడా కష్టంగానే.. రెండేళ్ల క్రితమే నిలిచిన అధికారుల వాహనాల అద్దె ఎన్నికలైతేనే పూర్వ వైభవం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే గతంలో మాదిరిగా ఆర్థిక సంఘం నిధులు ప్రతి నెల విడుదలవుతాయి. వాటితో పాలన గాడిన పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం గ్రామ, మండల, జిల్లా పరిషత్లలో పాలన మరింత అధ్వానంగా మారే పరిస్థితి నెలకొననుంది. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య
కోస్గి రూరల్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని, తాజాగా విద్యార్థులు సాధించిన ర్యాంకులే ఇందుకు నిదర్శనమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల విద్యా వనరుల కార్యాలయంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎంఈఓ శంకర్నాయక్ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిసెట్లో 120 మార్కులకుగాను 112 మార్కులతో పట్టణంలోని నాగసాన్పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని ఐశ్వర్య జిల్లా మొదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. అలాగే, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి అజయ్కుమార్ సైతం పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాడని వారిని పూల మాలలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బస్వరాజ్యాదవ్, నాయకలు ఓంప్రకాష్ ,గోపాల్గౌడ్ , శివకుమార్ ,బాల్రాజ్ , రాములునాయక్ తదితరులు ఉన్నారు. -
రూ.250 దాటడం లేదు..
ఎంత పనిచేసినా రూ.250 కూలి దాటడం లేదు. ప్రభుత్వం రూ.300 ఇస్తామంటున్న ఇక్కడ మాత్రం అలా వస్తలేదు. ఎండలకు భూమి చాలా గట్టిగా ఉండటంతో ఎంత చేసినా పని సాగక తక్కువే వస్తుంది. అసలే కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పని చేస్తున్నాం. ప్రభుత్వం తాము చేసిన కూలీ పనికి అదనంగా కలిపి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – జగత్యానాయక్, పున్యానాయక్తండా, నవాబుపేట పది రోజులుగా పనిలేదు.. నేను ఎండాకాలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లాను. రోజుకు రూ.260 చొప్పున డబ్బులు పడ్డాయి. కానీ, పది రోజులుగా గ్రామంలో ఉపాధి పనులు పెట్టడం లేదు. ఏ పని లేక ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాం. రోజూ పని కల్పిస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది. – లక్ష్మీదేవమ్మ, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం ● -
గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
నారాయణపేట రూరల్: గో సంరక్షణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐకి వినతి పత్రం ఆదివారం అందించారు. వీహెచ్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నా శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గోవధ శాలలను తక్షణమే మూసివేయాలని, అక్రమంలో ఉన్న గోచార భూములను విముక్తి చేయాలన్నారు. గుర్తింపు పొందిన గోశాలలకు నిధులు కేటాయించాలని, ప్రతి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోశాలలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో గోవులను పెంచాలని, గోఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు, గోషకులకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని కోరారు. బక్రీద్ సందర్భంగా గో రక్షకులు ఆవులను పట్టుకొని పోలీసులకు తెలియజేసే విధంగా గోరక్షకులకు గుర్తింపు పత్రాలు అందించాలని, అన్ని పట్టణాల శివారులలో ప్రత్యేకంగా పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలించబడుతున్న గోసంతతిని రక్షించాలని, సదరు ట్రక్కులను సీజ్ చేసి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయోజక్ వడ్ల శ్రావణ్ కుమార్, విజయ్, సందీప్, గోరక్ష ప్రముఖ అనిల్, బాలు పాల్గొన్నారు. కోయిల్సాగర్లో 11 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ అడుగంటుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రం వరకు 11 అడుగులకు చేరింది. వానాకాలం తర్వాత యాసంగి పంటలకు నీటిని వదిలే సమయంలో ప్రాజెక్టు నీటిమట్టం 31.6 అడుగులుగా ఉండగా గత నెలలో పంటలు పూర్తయ్యే నాటికి 13.3 అడుగులకు పడిపోయింది. యాసంగి పంటల సాగు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులో ఉన్న మూడు పంప్హౌస్ల నుంచి పంపులను రన్ చేసి తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. నారాయణపేట, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, మరికల్, ధన్వాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తున్నారు. దీంతో గత నెల రోజుల్లో 2.3 అడుగుల నీటిమట్టం తగ్గి 11 అడుగులకు చేరింది. జూన్ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే పెద్దవాగు ద్వారా కోయిల్సాగర్కు నీరు చేరే అవకాశం ఉంది. అలాగే జూరాలకు వరదలు వస్తే కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం పంపులను రన్ చేసి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తారు. ఇంట్రా టూడే లీగ్లో రాణించాలి మహబూబ్నగర్ క్రీడలు: ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో అండర్–23 పురుషుల ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్లో భాగంగా ఆదివారం మహబూబ్నగర్– నాగర్కర్నూల్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్కుమార్ క్రీడా జట్లను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఇంట్రా డిస్ట్రిక్ల్ లీగ్ క్రీడాకారులకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జట్లకు ఎంపికై న ప్రతి క్రీడాకారుడికి మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లో రాణించే క్రీడాకారులకు త్వరలో జరిగే హెచ్సీఏ టోర్నమెంట్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్లు ప్రారంభించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు అబ్దుల్లా, ఎండీ మన్నాన్, సీనియర్ క్రీడాకారుడు ఆబెద్ హుస్సేన్ పాల్గొన్నారు. -
ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం
మరికల్: ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈక్రమంలోనే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లే వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన మన్కీ బాత్ కార్యక్రమాన్ని ఆమె మరికల్లో వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదుల స్థావరాలపై ప్రతీకార దాడి చేసి విజయం సాధించమన్నారు. సైనికుల విజయానికి మద్దతుగా తీరంగా యాత్ర నిర్వహించామని, ఇందుకు దేశ ప్రజల నుంచి కూడా సంపూర్ణ మద్దతు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. భవిష్యత్లో భారతదేశంపై ఎక్కడ దాడి జరిగిన ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచి వేయడం కోసం చేపట్టి ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాగురావు, రతంగపాండురెడ్డి, నర్సన్గౌడ్, వేణు, తిరుపతిరెడ్డి, భాస్కర్రెడ్డి, రాజేష్, శ్రీరామ్, రమేష్, నిఖిల్ పాల్గొన్నారు. -
రాయితీ విత్తనాలు సిద్ధం
వనపర్తి: రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి భూ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ ఏటా పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించేలా రైతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకు రైతులకు 50 శాతం రాయితీపై మండల వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో విత్తనాల పంపిణీ షురూ చేశారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా జిల్లాలకు కావాల్సిన పచ్చిరొట్ట ఎరువుల ఇండెంట్ ఆధారంగా జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ జీలుగ, జనుము రకాల విత్తనాలను సిద్ధం చేసింది. వనపర్తి జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కర్మాగారంలో ఐదు జిల్లాలకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసి తొలకరి వర్షాలు కురుస్తున్న ప్రస్తుతం సమయంలో సరఫరా కోసం ఆయా ప్రాంతాలకు పంపిణీ చేశారు. జీలుగ రకం ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు, జనుము 760 క్వింటాళ్లను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు ఈ విత్తనాలను వారి అభ్యర్థన మేరకు ఆయా రకాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తారు. పచ్చిరొట్టతో ఉపయోగాలిలా.. పచ్చిరొట్ట ఎరువులతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. వ్యవసాయ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం పరిమితికి మించడంతో భూమిపై గల సారవంతమైన పొర చౌడు నేలగా మారే ప్రమాదం ఉంది. ఏటా ఖరీఫ్ పంటల సాగుకు ముందు వర్షాధారంగా పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి భూమిలో కలియదున్నడం వలన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులు వాటి మనుగడను కాపాడుతాయి. నేలపై పొరలోని సహజ భౌతిక లక్షణాల రక్షణకు ఉపయోగపడతాయి. ఇదే అనువైన సమయం.. పచ్చిరొట్ట విత్తనాలు విత్తేందుకు ప్రస్తుత సమయం అనువైనదని ఇటీవల నిర్వహించిన శాస్త్రవేత్తల పల్లెబాట కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. తొలకరి వర్షాలు ప్రారంభమైన వెంటనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ పంటల సాగుకు ముందు 45 రోజుల ముందు ఈ పచ్చిరొట్ట ఎరువులను నాటుకుంటే.. పచ్చిరొచ్చ మొక్కలు పూత దశకు వచ్చినప్పుడు భూమిలో కలియదున్నేందుకు అవకాశం ఉంటుంది. రాయితీ వివరాలు ఇలా.. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జీలుగ, జనుము రెండు రకాల పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేస్తోంది. జీలుగ క్వింటాల్కు రూ.14,250 కాగా.. రాయితీపై కేవలం రూ.7,425కు, జనుము పూర్తి ధర క్వింటాల్కు రూ.12,550 ఉండగా.. రాయితీపై రూ.6,275కే రైతులకు అందజేస్తోంది. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాలు ఇలా (క్వింటాళ్లలో).. అందుబాటులో జనుము, జీలుగ రకాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీచేసేందుకు చర్యలు వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చినఇండెంట్ మేరకు సరఫరా చాలా ఉపయోగం.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో డిమాండ్ మేరకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రసాయనిక ఎరువుల వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒకసారి పచ్చిరొట్ట ఎరువుల వాడకం పొలానికి చాలా ఉపయోగకరం. – ఆదినారాయణరెడ్డి, రీజినల్ మేనేజర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, వనపర్తి -
భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
మద్దూరు: భూ భారతి పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నెలాఖరులోగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాకాస్తుల పరిశీలనపై ఆర్డీఓ రాంచందర్నాయక్, భూభారతి ప్రత్యేకాధికారి యాదగిరితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరునాటికి వంద శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు104 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో శనివారం కొనసాగిన ఇంటర్ సప్లిమెంటరీ మూడో రోజు పరీక్షకు మొత్తం 104మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో మొత్తం 1844 మంది విద్యార్థులకుగాను 1,765 మంది విద్యార్ధులు హాజరయ్యారు.79 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 53 మందికి 53మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో 497మందికి 473 మంది హాజరుకాగా.. 24 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 37 మందికిగాను 36 మంది హాజరయ్యారని డీఐఈఓ సుదర్శన్రావ్ తెలిపారు. కోర్టు ఏర్పాటుకు భవనం పరిశీలన మక్తల్: పట్టణంలో కోర్టు ఏర్పాటు కోసం ఎంపిక చేసిన భవనాన్ని జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. కోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరల్లో మక్తల్లో కోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తత్రేయ, సూర్యప్రకాస్, అడేం శ్రీనివాసులు, సురేందర్, రాంమోహ్మన్, ఆనంద్, నవీన్కుమార్, సునీత, భాస్కర్ , సౌమ్య పాల్గొన్నారు. మొక్కుబడి విధానానికి స్వస్తి చెప్పాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మొక్కుబడి విధానాలకు స్వస్తి పలికి బాధ్యతగా నిధులు నిర్వర్తించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల మధ్య విభేదాలు ఉండరాదని, ఈగో, మొహమాటం పక్కకు పెట్టేసి పనిచేయాలన్నారు. బడిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చటానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. తల్లిదండ్రులను మోటివేట్ చేయటానికి చొరవ చూపాలని, ప్రైవేట్లో జరిగే బోధన కంటే మిన్నగా ప్రభుత్ర పాఠశాలల్లో సౌకర్యాలు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనంతో పాటు ఇటీవల ప్రవేశ పెట్టిన అధునాతన టెక్నాలజీతో కూడిన బోధన, కృత్రిమ మేధ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంశాలను క్రోడీకరిస్తూ గ్రామాల్లో చైతన్యం తేవలని తెలియజేశారు. విద్యార్థుల సంఖ్యను కాపాడుకుంటూపోతే ఉపాధ్యాయుల పోస్టులు అలాగే ఉంటాయని, చేరికలు తగ్గితే నష్టం జరుగుతుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేసి విద్యార్థులను చురుకుగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, సీఎంఓ రాజేంద్ర కుమార్, డీఎస్ఓ భాను ప్రకాష్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్ రెడ్డి, యాదయ్య శెట్టి, ఆర్పీలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రసాయన మందులవాడకాన్ని నియంత్రించాలి నారాయణపేట రూరల్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళకుమార్, సరిత అన్నారు. మండలంలోని సింగారం గ్రామ రైతు వేదికలో శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ అధ్యక్షతన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించి వాటి స్థానంలో పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు వాడాలని తెలిపారు. అధిక రసాయన ఎరువులు వాడకం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించి ప్రత్యామ్నాయంగా జీవ నాశినులు ఎరువులైన రైజోబియం, ట్రైకోడర్మా, సూడోమొనాస్ వంటివి వేసుకోవాలని సూచించారు. దీంతో భూమి సారవంతమైతుందని, అలాగే పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన రైతులకు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కరపత్రాలు విడుదల చేసి రైతుల పంపిణీ చేశారు. బాలదినకర్, అనిరుధ్, అనిల్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నారుల పొదరిల్లు
● వేసవి శిక్షణకు వేదికగా బాలభవన్, బాలకేంద్రాలు ● నృత్యం, సంగీతం, చిత్రలేఖనం నేర్చుకునేందుకు చిన్నారుల ఆసక్తి ● ఉమ్మడి జిల్లాలో 4 కేంద్రాల్లో 16 ఏళ్ల లోపు బాలబాలికలకుప్రత్యేక శిక్షణ నారాయణపేటలో 1983లో 9 మంది చిన్నారులతో ఏర్పాటైన బాలకేంద్రం చౌక్బజార్లోని అద్దె భవనంలో కొనసాగింది. ఆ తర్వాత మినీస్టేడియం గ్రౌండ్లో వృథాగా ఉన్న ఓ భవనంలోకి మార్చారు. ఇక్కడ తబలా, సితార్, గాత్రం, నృత్యం, చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. 6 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు బాలకేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు. జనరల్ విద్యార్థులకు రూ.50, ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్నారులకు రూ.20 ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. ఏటా వేసవిలో వందమంది పిల్లలు శిక్షణ పొందడానికి వస్తుంటారు. వీరికి దాతల సహకారంతో నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్ వంటి పరికరాలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక తరచుగా దాతలతో స్నాక్స్ సైతం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఎంతో మంది చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పాల్గొని మంచి పేరు తీసుకువచ్చారు. ఉత్సాహభరితంగా.. గద్వాల బాలభవన్లో400కు పైగా విద్యార్థులు వివిధ కళల్లో శిక్షణ పొందారు. 5–16 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సాహభరిత వాతావరణంలో వేసవి శిబిరం కొనసాగుతుంది. వివిధ కళల్లో నైపుణ్యం ఉన్న శిక్షకులు చిన్నారులకు శిక్షణ ఇస్తూ బాల కళాకారులుగా తీర్చిదిద్దారు. చిన్నారులకు భరతనాట్యం, జానపద నృత్యం, శాసీ్త్రయ నృత్యాలను శిక్షకులు సత్యం, చిత్రలేఖనం గణేష్, సంగీతం శివకుమార్, వాయిద్యాలు శంకర్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్లో గాయిత్రి తదితరులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళల ప్రపంచం.. ‘పేట’ బాలకేంద్రం -
భూసేకరణ పనులువేగవంతం చేయాలి
నారాయణపేట: జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి.రవినాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి నారాయణపేట –కొడంగల్ ఎల్వన్స్కీం, రాజీవ్ భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం, కోయిల్సాగర్ భూ సేకరణ పనులను ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 21 గ్రామాల్లో భూసేకరణ జరగగా మక్తల్లో 155.38 ఎకరాలు, ఊట్కూర్లో 234.16 ఎకరాలు, నారాయణపేటలో 94.33 ఎకరాలు, దామరగిద్దలో 76.35 ఎకరాలు పురోగతిలో ఉందన్నారు. ఎల్ఏ ప్రతిపాదన కానుకుర్తి ట్యాంక్ (749 ఎకరాలు) ఒక లక్ష ఎకరాల గ్రావిట్ కెనల్స్ కానుకుర్తి, దౌల్తాబాద్ పనులలో ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 1500 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సీఈ రమణారెడ్డి, ఎస్ఈ హెచ్టి శ్రీధర్, ఈఈ బ్రహ్మం, ఈఈ ప్రతాప్ సింగ్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, తహశీల్ధార్లు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలి నారాయణపేట: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే సీసీ టీఎన్ఎస్ పిటిషన్ మేనేజ్మెంట్ అప్లికేషన్లో నమోదుచేయాలని, ఫిర్యాదుదారులకు రషీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని డీసీఆర్బీ ఎస్ఐ సునీత తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయా పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించే రిసెప్షనిస్టులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం కోసం వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా ఉండాలని, వారి సమస్యను విని.. న్యాయం జరుగుతుందని నమ్మకం, భరోసా కల్పించాలని తెలిపారు. ఫిర్యాదుదారులను వాటి తీవ్రతను బట్టి పైఅధికారులకు సమాచారం అందించి తగిన న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదు పెండింగ్లో ఉంటే కారణాలను ఫిర్యాదుదారుడికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఐటీకోర్ టీం ద్వారా ఆన్లైన్లో నమోదుచేసే విధానం, ఆన్లైన్లో తప్పులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. శ్రీనివాసులు, శ్రీజ, మహేశ్ పాల్గొన్నారు. -
నేతన్నలను ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
నారాయణపేట: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డీసీసీ సమావేశానికి చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా లీడ్ బ్యాంక్ మేనేజర్ వ్యవహరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ నుంచి ఏజీఎం శ్రావ్య, నాబార్డ్ నుంచి డీడీఎం షణ్ముఖచారి, ఎస్బీఐ ఏజీఎం రాంమూర్తి, టిజిబి రిజినల్ మేనేజర్ సత్యనారాయణ, యుబిఐ నుంచి శ్రీనివాసమూర్తి , వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగునిర్ణయాలు తీసుకున్నారని ఎల్డిఎం విజయ్కుమార్ తెలిపారు. అంతకుముందు వార్షిక ప్రణాళిక సంబంధించిన 2024–25 మార్చి 25తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.2514.18 కోట్లతో వృద్ధి, వార్షిక ప్రణాళికలో ఇది 76.93 శాతమని, మే సెగ్మెంట్ సంబంధించి రూ.153.92 కోట్లతో 61.04 శాతం ప్రగతి, ప్రాధాన్యత రంగానికి రూ.2,070 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్డీఎం పేర్కొన్నారు. వార్షిక రుణప్రణాళిక 2025–26 గాను రూ.4204.49 కోట్ల రుణ లక్ష్యంతో ఏసీపీ 2025–26 పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో రైతులకు పంట రుణాలు రూ.2,195.07, వ్యవసాయ ఇతర మౌలిక సదుపాయలకు రూ.1,275.87 కోట్లు మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.3,470.93 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.148 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.162.30 కోట్లు మంజూరు చేయాలని నిర్ధేశించారు. నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలి జిల్లాలో ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహిస్తూ టీజీ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను నిబంధనల మేరకు నిర్ధేశిత గడువులోగా ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈ నెల 28న ఉన్నందున కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖ వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసంతో ఉపాధి రాజీవ్ యువ వికాసం ద్వారా అనేక మంది ఉపాధి పొందుతారని కలెక్టర్ అన్నారు. శుక్రవారం రాజీవ్ యువ వికాసం పథకం పర్చేజ్ కమిటీ ఫర్ ఆల్ కార్పొరేషన్స్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాజీవ్ వికాసం దరఖాస్తుదారులకి ఫైనాన్షియల్ అసిస్టెంట్, గ్రౌండింగ్ తదితర వాటిపై సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిఎస్సి కార్పోరేషన్ అబ్దుల్ ఖలీల్, ఎల్డీఎం విజయ్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో హైదరాబాద్, మహబూబ్నగర్ క్రికెట్ అసోషియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత క్రికెట్ సమ్మర్ క్యాంప్లో పాల్గొని మాట్లాడారు. క్రీడా రంగంలో రాణించడం వల్ల భవిష్యత్లో ఉద్యోగ కల్పనలో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అదే విధంగా శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొని భవిష్యత్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా విద్యా శాఖ ఏఎంఓ నాగార్జున రెడ్డి, ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, క్రికెట్ కోచ్ అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు. కళలకు జీవం నారాయణపేట రూరల్: సాంప్రదాయ శాసీ్త్రయ కళలకు జీవం పోస్తున్నది బాలకేంద్రాలే అని, చిన్నారులు తమకు నచ్చిన కళల్లో శిక్షణ తీసుకోవాలని డీఈఓ గోవిందరాజు అన్నారు. శుక్రవారం బాలకేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ ఎలా ఇస్తున్నారంటూ విద్యార్థులను ఆరా తీశారు. చిన్నారులు చక్కటి కళలను నేర్చుకునేందుకు సహకరిస్తున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఓ నాగార్జున్ రెడ్డి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, సంగ నర్సింహులు, వసంత్ కుమార్, జ్ఞానామృత రమణ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు44 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో గురువారం కొనసాగిన ఇంటర్ సప్లిమెంటరీ రెండో రోజు పరీక్షకు మొత్తం 44మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు జనరల్ విభాగంలో మొత్తం 780 మంది విద్యార్థులకు గానూ 742 మంది విద్యార్థులు హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 53 మందికి 52 మంది హాజరయ్యారు. అలాగే, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 79 మందికిగాను 74 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరయ్యారని డీఐఈఓ సుదర్శన్రావ్ తెలిపారు. క్రీడా అకాడమీప్రవేశాలకు ఎంపికలు నారాయనపేట ఎడ్యుకేషన్: రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా, వసతి గృహల్లో 2025–2026 సంవత్సరానికిగానూ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసులు, క్రీడాల శాఖాధికారి వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హులైన క్రీడాకారులు జూన్ 12, 13న రెండు రోజుల పాటు మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహిస్తారని, ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,281 జడ్చర్ల/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2281, కనిష్టంగా రూ.1,501 ధరలు లభించాయి. ఆముదాలు రూ.6,066, చింతగింజలు రూ.3,457, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,701, కనిష్టంగా రూ.1,629, ఆన్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,159, కనిష్టంగా రూ.1,609, వేరుశనగ గరిష్టంగా రూ.5,326, కనిష్టంగా రూ.4,431 ధరలు లభించాయి. నవాబ్పేట మార్కెట్కు శుక్రవారం 11వేల బస్తాల ధాన్యం వచ్చింది. సీడ్ (1010) ధాన్యం రూ.1967 ధర పలకగా.. ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.1944 ధర లభించింది. జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. దేశ సమైక్యత కోసమే జైసంవిధాన్ యాత్ర పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్రావు, చిన్నయ్య, ఎల్లయ్య కృష్ణయ్య పాల్గొన్నారు. -
బాలికా విద్యకు భరోసా
మరో మూడు కేజీబీవీలు ఇంటర్కు అప్గ్రేడ్ మరికల్: విద్యార్థినుల విద్యాభ్యున్నతి కోసం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు/ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందించేవారు. ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవడంతో పలువురు చదువు మధ్యలోనే ఆపేసిన సందర్భాలున్నాయి. దీన్ని అధిగమించేందుకు వాటిలో పలు కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. తద్వారా ఇప్పటికే జిల్లాలో 8 అందుబాటులో ఉండగా ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలు అప్గ్రేడ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాటి సంఖ్య 11కు చేరుకుంది. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన వారితోపాటు అనాథలైన విద్యార్థినులకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రత్యేక కోర్సులు జిల్లాలోని 11 కేజీబీవీల్లో 8 కేజీబీవీలో ఇప్పటి వరకు ఇంటర్ కోర్సులు ఉండేవి. 2025–26 విద్యా సంవత్సరానికి మరికల్, మాగనూర్, కోస్గి కస్తూర్బాల్లో ఇంటర్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మూడు కేజీబీవీలను ఇంటర్కు ఆప్గ్రేడ్ కావడంతో మరికల్ కేజీబీవీలో బైపీసీ, అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్, కోస్గి కస్తుర్బాలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ(ఎప్), మాగనూర్ కేజీబీవీలో బైపీసీ, ఎంఎల్టీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ విద్య సంవత్సరం నుంచే పాత కేజీబీవీలతో పాటు కొత్తగా ఏర్పడిన మరికల్, మాగనూర్, కోస్గి మండలాల్లో ఇంటర్ కళాశాలల ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రూప్లో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. జూన్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అధిక శాతం అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. నిరుపేదలు.. తల్లి, తండ్రిని కోల్పోయిన వారు.. అనాథలైన విద్యార్థినులకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లు అండగా నిలుస్తున్నాయి. చదువుతో పాటు వసతి కల్పించడంతో చాలా మంది ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు పదో తరగతి పూర్తయ్యాక.. ఇంటర్ చదువులకు కుటుంబసభ్యులు ఒప్పుకోక, వేరే ప్రాంతాలకు పంపించలేక చాలా మంది చదువులు మధ్యలోనే ఆపివేసేవారు. మరికొందరికి చిన్నతనంలోనే వివాహాలు చేసేవారు. ఈక్రమంలో ప్రభుత్వం కేజీబీవీలను ఇంటర్కు అప్గ్రేడ్ చేయడంతో ఎంతో మంది విద్యార్థినులకు ఉన్నత చదువులకు భరోసాగా నిలవనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఈ ఏడాది ఇంటర్ విద్యార్థినులు సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 11 కు చేరిన ఇంటర్ విద్యాలయాలు ఈ ఏడాది ఇంటర్లో 84 శాతంఉత్తీర్ణతతో విద్యార్థినుల రాణింపు చదువుతోపాటు వసతి కల్పించడంతోచేరికకు ఆసక్తి ఎంతో ప్రయోజనం ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థినులకు ఎంతో ప్రయోజనం. కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులను తీసుకురావడం హర్షణీయం. ఇంటర్ ప్రవేశాలకు వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తాం. – నర్మద, జీసీడీఓ, నారాయణపేట -
మెరుగైన విద్యాబోధన..
జిల్లాలో 13 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగతుండగా.. ముందుగా నారాయణపేట, ధన్వాడ, మక్తల్, దామరగిద్ద, ఊట్కూర్ కస్తూర్బాలలో ఇంటర్ తరగతులు నిర్వహిస్తు వస్తున్నారు. అనంతరం నర్వ, మద్దూరు, కృష్ణా కేజీబీవీలను అప్గ్రేడ్ చేశారు. ఈ విద్యాలయాల్లో వసతితోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రస్తుతం మైనారిటీ, జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గిరిజన కళాశాలలు ఉన్నప్పటికీ ఆయా కేటగిరీల వారికి అత్యధిక శాతం సీట్లు కేటాయిస్తోంది. దీంతో పేద వారికి, అనాథలకు సీట్లు లభించే పరిస్థితి లేకపోవడంతో కస్తూర్బాలోనే ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబర్చారు. తాజాగా మరికల్, కోస్గి, మాగనూర్ కేజీబీవీలను ఇంటర్ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆప్గ్రేడ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. -
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
మక్తల్/నర్వ: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అబ్జర్వర్లు సంధ్యారెడ్డి, వేణుగౌడ్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన పార్టీ కార్యవర్గాలను, మండల కార్యవర్గాలను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యవర్గాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించాలని, పార్టీ సూచనల మేరకు ఎన్నిక నిర్వహించి కార్యవర్గాలను పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేలా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తకోట సిద్దార్థారెడ్డి, పోలీస్ జగన్మోహన్రెడ్డి, జగదభిరామ్రెడ్డి, చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శరణప్ప, వివేకవర్దన్రెడ్డి, రాధమ్మ, రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రోగులకు ఉచిత భోజనం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా భోజనం అందజేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజనాన్ని అందించి ప్రారంభించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వమించారు. కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ అధ్యక్షుల నియామకం కొరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో రోడ్లు, కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డీపీఓ గ్రామ పంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పాత ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ సంబంధించి పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీపీఓ ఇరిగేషన్ వారు రిపోర్టు పంపాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ గతేడాది మద్దూర్, మరికల్లో వర్షాలు అధికంగా కురవడం వల్ల అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: ఈ నెల 25న జరిగే గ్రామ పాలన ఆఫీసర్ (జీపీఓ) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే జీపీఓ పరీక్షలో 109 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. నారాయణపేటలోని శ్రీవేద సరస్వతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు హాల్ టికెట్లపై హెచ్ఓడీ అటెస్ట్ చేయించాలన్నారు. అలాగే ఐడి ఫ్రూఫ్ తీసుకొని పరీక్షకు హాజరుకావాలని హెల్ప్లైన్ నంబర్ 9154283913 ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాలలో ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తారని, ఆర్డీఓ పర్యవేక్షిస్తారని తెలిపారు. డీఈఓ సీసీ కెమెరాలు.. అభ్యర్థుల హాజరు, గుర్తింపు విధులను నోడల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎంహెచ్ఓ పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీటీఓ హరిప్రసాద్, ఏఓ జయసుధ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆహార నియమాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: అసంక్రమిక వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. పౌష్టికాహారం, సరైన నిద్ర తప్పనిసరిగా అవసరమని డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్ అన్నారు. మండలంలోని అప్పక్పల్లి సమీపంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఎన్సీడీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనశైలిలో మార్పుతో పాటు ఆహార నియమాలు పాటించకపోవడంతోనే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లు ఉండాలని, ప్రతిరోజు కొంత సమయం యోగా, మెడిటేషన్కు కేటాయించాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ఎన్సీడీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్దుల్ వాసే కార్యక్రమ లక్ష్యాలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, బెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్, అసంక్రమిక వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను రోగులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, సత్య ప్రకాశ్ రెడ్డి, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నారాయణపేట: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో భాగ్యరెడ్డివర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సమాజోద్దరణ, అంటరానితనం, మహిళల బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారని, జోగినీ వ్యవస్థ తొలగించడానికి పాటుపడ్డారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్, ఏఓ జయసుధ, అధికారులు ఉమాపతి, అబ్దుల్ ఖలీల్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. దళిత వైతాళికుడు.. దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి పునాది వేశాడని కొనియాడారు. ఏఎస్పీ రియాజ్హుల్ హక్, ఆర్ఎస్ఐలు శివశంకర్, మద్దయ్య పాల్గొన్నారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు బాలుడు ప్రవీణ్.. తల్లిదండ్రులు, తోబుట్టువులతో స్వరాష్ట్రానికి వెళ్తున్నానంటూ ఆనందంతో గడిపాడు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకొని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతని తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారే తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు -
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల పరీక్ష జరగలేదు. సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు ● మహబూబ్నగర్ ‘ఫాతిమా’ స్కూల్ కేంద్రంలో పరీక్షకు దూరమైన 180 మంది విద్యార్థులు ● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్లైన్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ మరో అవకాశం ఇవ్వాలి.. సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. – రామకృష్ణ, విద్యార్థి, మరికల్ -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
నర్వ/మక్తల్: ఔత్సాహిక క్రీడాకారుల ఇబ్బందులు తీర్చేందుకే జాండ్రగుట్ట వద్ద క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరి అన్నారు. బుధవారం సాయంత్రం నర్వ జాండ్ర గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, క్రీడామైదానానికి అనుమతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల నిధులు క్రీడామైదానం ఏర్పాటు కోసం కేటాయిస్తున్నట్లు శివసేనారెడ్డి ప్రకటించి ఇందుకు సంబందించిన పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ. 45 లక్షలు క్రీడామైదానం అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలో క్రీడామైదానం పనులు చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులు ఆటలు ఆడే విధంగా తయారు చేస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్పోర్ట్స్ చైర్మన్ను, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ● ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.5.30 కోట్లతో మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మారుమూల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. -
నేడు జిల్లాకు మృతదేహాలు..
ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.