breaking news
Narayanpet
-
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మరికల్/ధన్వాడ: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకా శం ఉన్నందున వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం మరికల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మందుల స్టాక్ను పరిశీలించి.. సబ్ సెంటర్లకు అన్నిరకాల మందులను సక్రమంగా పంపిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటు లో ఉండి మెరుగైన సేవలు అందించాలని వైద్యుల కు సూచించారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాగా, ఆస్పత్రిలో కాలం చెల్లి న మందులను ఎక్కడపడితే అక్కడ వేయడాన్ని గమనించిన కలెక్టర్.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 65 ఇళ్లకు 11 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయా? మరికల్కు 65 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే.. కేవ లం 11 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ దశలో ఉండటం ఏమిటని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అసహనం వ్యక్తంచేశారు. ఇళ్ల జాబితాలో పేర్లు ఉండి నిర్మించుకోలేని వారి పేర్లను వెంటనే తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదే విధంగా ధన్వాడ బీసీ కాలనీలో చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. స్లాబ్ లెవల్ వరకు ఇంటి నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారు శారదను శాలువాతో సన్మానించి అభినందించారు. ధన్వాడ మండలానికి 500 ఇళ్లు మంజూరు కాగా.. మండల కేంద్రానికి 102 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు రాంకోటి, సిందుజా, ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, డాక్టర్ రాఘవేంద్రారెడ్డి, ఎంపీఓ పావని, ఆర్ఐ సుధాకర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్సుందర్రెడ్డి ఉన్నారు. -
సారా తయారు చేస్తే జైలుకే..
సారా తయారు చేసినా.. గంజాయి విక్రయించినా జైలుకు పోవాల్సిందే. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సారా తయారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నా ఆకస్మిక దాడులు నిర్వహించి అడ్డుకట్ట వేస్తున్నాం. గంజాయిపై పోలీసుశాఖ సమన్వయంతో ఉక్కుపాదం మోపుతున్నాం. – అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ, నారాయణపేట ప్రత్యేక నిఘా.. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎక్కడైనా గంజాయి మొక్కలు పెంచినా.. విక్రయించినా కేసులు నమోదు చేస్తున్నాం. యువత గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి. నిషేధిత మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలునిర్వహిస్తున్నాం. – యోగేష్ గౌతమ్, ఎస్పీ ● -
కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి
నారాయణపేట క్రైం: జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ కోరారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. రాబోయే వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అందుకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పెద్దలు, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డీజేలను నిషేధించడం జరిగిందని.. ఉత్సవాల్లో అందరూ పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి డీజేలు పెడితే సీజ్ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా మతపరమైన జెండాలు కట్టే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగల సమయంలో ఏమైన సమస్యలు ఏర్పడితే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సీవీఆర్ ఆశయ సాధనకు కృషి
నారాయణపేట: తన తండ్రి, ఉమ్మడి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దివంగత చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సీవీఆర్ 60వ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని న్యూగంజ్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణపేట ఆధ్వర్యంలో సీవీఆర్ భవన్లో ఎమ్మెల్యే తన సోదరుడు, టీపీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డితో కలిసి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిల్డ్రన్స్ హాస్పిటల్లో మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యశిబిరాలు, రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. తన తండ్రి చిట్టెం వెంకటేశ్వర్రెడ్డి జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువకులు ముందుకొచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సీవీఆర్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సరిత, గవర్నర్ హరినారాయణ్ బట్టడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, వైస్చైర్మన్ కొనంగేరి హన్మంతు, డైరెక్టర్ బోయ శరణప్ప, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం, మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గుట్టుగా గంజాయి దందా!
నారాయణపేటకలెక్టరేట్ భద్రమేనా..? చిన్నపాటి వర్షాలకే మహబూబ్నగర్ కలెక్టరేట్లోకి నీరు చేరడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2025–8లో uనారాయణపేట: జిల్లాలో గుడుంబా తయారీ గుట్టుగా సాగుతుండగా.. గంజాయి గుప్పుమంటోంది. రాష్ట్ర సరిహద్దుకు 20 కి.మీ. దూరంలో ఉన్న కర్ణాటకలోని గుర్మిట్కల్ అడ్డాగా గంజాయి దందా కొనసాగుతోందని పోలీసు, ఎకై ్సజ్శాఖ దాడుల్లో స్పష్టమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో నమోదైన మూడు కేసులను పరిశీలిస్తే.. గుర్మిట్కల్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఊట్కూర్, నారాయణపేట ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. మరో కేసులో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఎకై ్సజ్శాఖ దాడుల్లో 6, పోలీసుశాఖ దాడుల్లో 8 గంజాయి కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర సరిహద్దు దాటి.. కర్ణాటక నుంచే అధికంగా గంజాయి సరఫరా జరుగుతోందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే జిల్లాలోని మక్తల్లో కృష్ణా చెక్పోస్టు, నారాయణపేటలో జలాల్పూర్ చెక్పోస్టు, దామరగిద్దలో కానుకుర్తి చెక్పోస్టు, ఊట్కూర్లో సంస్థాపూర్ వద్ద చెక్పోస్టులు ఉన్నప్పటికీ సరిహద్దు దాటి జిల్లాలోకి గంజాయి ఎలా వస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దామరగిద్ద మండలం సజానాపూర్, మాగనూర్ మండలం ఉజ్జెలి, కృష్ణా మండలంలోని చేగుంటా, కున్షి, హిందూపూర్, నారాయణపేట మండలంలోని ఎక్లాస్పూర్, ఊట్కూర్ సమీపంలోని ఇడ్లూర్, కొల్లూర్ గ్రామాలు సైతం కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఆ రోడ్డు మార్గానా గంజాయి విక్రయదారులు వస్తున్నారనే దానిపై పోలీసులు నిఘా పెట్టారు. ● జిల్లాలోని గుండుమాల్ మండలంలో ఓ తండాకు చెందిన ఆటోడ్రైవర్ గంజాయిని సినీ ఫక్కీలో విక్రయిస్తుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. కోస్గి పట్టణంలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను ఆసరాగా చేసుకొని గంజాయి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని బువ్వమ్మ దర్గా సమీపంలోని శ్మశానవాటిక, హైదరాబాద్ రోడ్డులోని నూతన చిల్డ్రన్స్ పార్కు గుట్ట ఏరియా, పట్టణ శివారులో రాత్రివేళ యువతకు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంతో పాటు కృష్ణా, మాగనూర్, నా రాయణపేట, మక్తల్, కోస్గి పట్టణాల్లో పోలీసులు పటిష్ట నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 264 సారా కేసులు.. జిల్లాలో అక్కడక్కడ సారా తయారీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎకై ్సజ్శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ.. నారాయణపేట, మద్దూర్, మరికల్, దామరగిద్ద, ధన్వాడ, ఊట్కూర్ మండలాల్లోని పలు తండాల్లో గుట్టుచప్పుడు కాకుండా సారాను తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐదేళ్ల కాలంలో ఎకై ్సజ్ పోలీసులు 264 కేసులు నమోదుచేసి.. 140 మందిని బైండోవర్ చేశారు. ఈ కేసుల్లో ఐదుగురిని రిమాండ్కు పంపగా.. ఏడుగురికి జరిమానా విధించారు. మక్తల్ శివారులో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి పాకెట్లు జిల్లాలో విచ్చలవిడిగా విక్రయాలు కర్ణాటక నుంచి అక్రమ రవాణా శివారు ప్రాంతాల్లో యువతకు విక్రయం ఇటీవల పోలీసులకు పట్టుబడినగుర్మిట్కల్ వాసులు మరోవైపు ఆందోళన కలిగిస్తున్న సారా తయారీ -
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
ధన్వాడ: భూ భారతి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. గురువారం ధన్వాడ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధికారులతో భూ భారతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని తహసీల్దార్ సింధుజాకు అదనపు కలెక్టర్ సూచించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. -
ప్రారంభానికి ‘ట్రిపుల్ ఐటీ’ సిద్ధం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ కళాశాలను జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయనుంది. దీంతో పాలమూరు చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానునుంది. కళాశాల ఏర్పాటుకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా కళాశాల ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ విద్యార్థులకు, ప్రత్యేక తరగతి గదులతోపాటు అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరికి హాస్టల్ గదులు, డైనింగ్ హాల్ వంటివి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే వారం కళాశాలను ప్రారంభించి.. అక్కడే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రెగ్యులర్ కళాశాల భవనం కోసం జిల్లాకేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద 40 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వీటిలో త్వరలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టనున్నారు. అవకాశాలతో మేలు.. సాధారణంగా ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ఇంటర్మీడియట్ తర్వాత ఎఫ్ సెట్ వంటి పోటీ పరీక్షలు రాస్తే సీటు లభించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఐఐఐటీలో ఎస్సెస్సీ పూర్తయిన తర్వాత నేరుగా మొదటి సంవత్సరంలో అడ్మిషన్ను పొందవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులు కావడంతో 2 ప్లస్ 4 విధానంలో విద్యాబోధన జరుగుతుంది. మొదటి రెండేళ్లు అందరికీ కామన్ సిలబస్ ఉండగా.. తర్వాత మరో నాలుగేళ్లు వివిధ డిపార్ట్మెంట్లు విడిగా తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇందులోనే ఇంటర్తోపాటు ఇంజినీరింగ్ విద్య కూడా పూర్తి అవుతుంది. ఒక విద్యార్థి ఎస్సెస్సీ తర్వాత అడ్మిషన్ పొందితే నేరుగా ఇంజినీరింగ్ సర్టిఫికెట్తో బయటికి వచ్చి.. ఉద్యోగం పొందేందుకు సంసిద్ధంగా ఉంటారు. ఐఐఐటీ కళాశాలలో గదులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీ కళాశాల ఆన్లైన్ విధానంలోనే.. ఐఐఐటీ కళాశాల ఏర్పాటు మొదటి సంవత్సరం కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా యూనివర్సిటీ నుంచి నేరుగా ఆన్లైన్ విధానంలో జరిగింది. ఈ మేరకు ఎస్సెస్సీలో అత్యధిక మార్కులు సాధించిన 208 మంది విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం 144 మంది బాలికలు, 64 మంది బాలురకు అవకాశం కల్పించారు. ఇక స్టాఫ్ నియామకాల ప్రక్రియను సైతం అధికారులు పూర్తిచేశారు. గత నెల టీచింగ్ సిబ్బంది నియామకానికి ప్రకటన ఇవ్వగా.. 31 మంది దరఖాస్తు చేసుకుంటే 9 మందిని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధ్యాపకులను భర్తీ చేశారు. మరో 6 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని సైతం నియమించినట్లు తెలుస్తోంది. ఇందులో వార్డెన్లు, అటెండర్లు, స్వీపర్ ఇతర సిబ్బంది ఉన్నారు. వచ్చేవారం ఓరియంటేషన్ కార్యక్రమాల నిర్వహణ ఇప్పటికే ఎస్సెస్సీ మెరిట్ ఆధారంగా 208 మందికి అడ్మిషన్లు ఇంటర్మీడియట్తోపాటు ఇంజినీరింగ్చదివేందుకు వెసులుబాటు బండమీదిపల్లి వద్ద ఉన్న రెడ్డి హాస్టల్భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకాలు చేపడుతున్న బాసర అధికారులు -
ప్రతి ఏటా అవస్థలే..
● మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి, దివిటిపల్లి, న్యూమోతీనగర్, ఏనుగొండ, బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాల దారి), మన్యంకొండ స్టేషన్ దగ్గర సూగురుగడ్డ ఆర్యూబీల్లో వరద నీరు పారడం నిత్యకృత్యంగా మారింది. ప్రతి ఏటా పలు కాలనీలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నా.. అధికారులు శాశ్వత చర్యల దిశగా అడుగులు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● దేవరకద్రలోని దళితవాడ వద్ద ఆర్యూబీ గుండా రైతులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. భారీ వర్షం వస్తే అండర్ పాస్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలుస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకాలు ఎదురవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ● జడ్చర్ల నుంచి ఆలూరు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న ఆర్యూబీలో నీళ్లు నిలుస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నీరు సాఫీగా వెళ్లేందుకు పైపులైన్ వేసే పనులు కొనసాగుతున్నాయి. -
ఉపాధి హామీ పథకంలో పనుల జాతర
నారాయణపేట: ఉపాధి హామీ పథకం పనుల జాతర – 2025లో భాగంగా ఈ నెల 22న జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీలో కొత్త పనులు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈజీఎస్ పథకం కింద ప్రతి ఏటా నిర్వహించే పనుల జాతర విజయవంతంగా కొనసాగుతుందన్నారు. పనుల జాతర–2024లో భాగంగా నవంబర్ 26న అన్ని జీపీల్లో భూ సంస్కరణ, పశువుల పాకలు, నాడెప్ కంపోస్ట్ పిట్స్, పౌల్ట్రీ షెడ్స్, పొలం బాటలు, చెక్ డ్యాంలు, ఊటకుంటలు, బోర్వెల్స్ రీచార్జ్, గ్రామపంచాయతీ, అంగన్వాడీ భవనాలు వంటి పనులకు శ్రీకారం చుట్టి.. గత మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పనుల జాతర–2025లో భాగంగా 22న అన్ని జీపీల్లో కొత్త పనులకు భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పనులు నాణ్యతగా సకాలంలో పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు.గురుకులంలో శుభ్రత పాటించరా?● మీ చాంబర్పై ఉన్న శ్రద్ధ విద్యార్థినుల గదులపై ఎందుకు లేదు..● గురుకుల ప్రిన్సిపాల్పై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహంమరికల్: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఉంటున్న గదులతో పాటు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వెదజల్లుతుండటంతో ఆయన అసహనానికి గురయ్యారు. మీ చాంబర్పై ఉన్న శ్రద్ధ విద్యార్థినులు ఉంటున్న గదులపై ఎందుకు లేదని ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే గ్రామపంచాయతీ సిబ్బందికి చెప్పినా రావడం లేదని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మరింత ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక్కడికి గ్రామపంచాయతీ సిబ్బంది ఎందుకు వస్తారని.. ఇక్కడ పనిచేసే శానిటేషన్ సిబ్బందితో శుభ్రం చేయించుకోవాలన్నారు. పీఎంశ్రీ కింద గురుకులానికి వచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారని అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించగా.. పోతన లేని సమాధానం చెప్పారు. గురుకుల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ కొండన్న, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్రెడ్డి ఉన్నారు.పకడ్బందీగా మాదకద్రవ్యాల నిషేధం అమలునారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిషేధం (యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై సీరియస్గా ఉందని.. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు జరగకుండా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. ఇటీవల మక్తల్, ఊట్కూర్లో గంజాయిని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అన్ని కళాశాలల్లో డ్రగ్స్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎకై ్సజ్ ఏఈఎస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదుచేసి.. రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కృష్ణా మండలంలో గంజాయి సాగుచేసిన రైతుపై కేసు నమోదు చేయించి.. ఆ పొలానికి వచ్చే రైతుభరోసాను నిలిపి వేసినట్లు డీఏఓ జాన్ సుఽ దాకర్ అదనపు కలెక్టర్కు తెలియజేశారు. సమావేశంలో ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎంహెచ్ ఓ డా.జయచంద్రమోహన్, సీఐలు శివశంకర్, రాంలాల్, ఎకై ్సజ్ ఎస్ఐ శిరీష ఉన్నారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నారాయణపేట: ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా జిల్లాలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. గణేశ్ నిమజ్జన వేడుకలకు సంబంధించి జిల్లా కేంద్రంతో పాటు మక్తల్, కోస్గి, ఊట్కూర్తో పాటు అన్ని మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని.. రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన కంపచెట్లు, ముళ్లపొదలను తొలగించాలన్నారు. నారాయణపేట, మక్తల్, కోస్గి పట్టణాల్లో జరిగే నిమజ్జన వేడుకల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఉత్సవాల్లో డీజే సౌండ్, ఇతర శబ్ధకాలుష్యం వచ్చే సిస్టమ్లను జిల్లాలో నిషేధించినట్లు తెలిపారు. గణేశ్ మండపాల వద్ద, ప్రధాన వీధుల్లో ఫ్లాగ్స్, రిబ్బన్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు పోర్టల్ https://policeportal.tspolice.gov.inలో అనుమతి పొందాలని సూచించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్కు నాణ్యమైన కేబుల్ వినియోగించాలన్నారు. నిమజ్జన వేడుకలకు రెండు రోజుల ముందే మద్యం దుకాణాలను మూసివేయాలని ఎస్పీ సూచించారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్డీఓ రామచందర్ నాయక్, ఎకై ్సజ్ ఏఈఎస్ నర్సింహారెడ్డి, డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, సీఐలు శివశంకర్, రాంలాల్, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు సురేఖ రాంబాబు, కార్యదర్శి కన్న శివకుమార్, గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భీంచందర్గౌడ్, కార్యదర్శి మిర్చి వెంకటయ్య, భాస్క ర్, రఘువీర్ యాదవ్, బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ వడ్ల శ్రావణ్ ఉన్నారు. గణేశ్ నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్పురాలోని ఆర్యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్ను ఇవతల ఉంచి న్యూటౌన్లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా -
నా జీవితం ప్రజాసేవకే అంకితం
నారాయణపేట: ‘‘ఈ ప్రాంతంలోని జాయమ్మ చెరువు ద్వారా రైతులకు సాగునీరు అందించడమే మా తాత చిట్టెం నర్సిరెడ్డి లక్ష్యం.. అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చేయాలన్నదే మా నాన్న ఆశయ సాధన.. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిట్టెం కుటుంబం చివరిశ్వాస వరకు పనిచేస్తుంది.. నా జీవితం ప్రజా సేవకే అంకితం’’ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే పర్ణికారెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని శక్తిపీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఘనంగా జరుపుకొన్నారు. మరికల్ మండల నాయకుడు సూర్యమోహ న్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు. అదే విధంగా జిల్లా యు వజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేయగా.. 30మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. ఓ ఆశయం కోసం తన మేనమామ కుంభం శివకుమార్రెడ్డి 20 ఏళ్లుగా చేసిన కష్టానికి అందరూ తోడు కావడంతో తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. త్వరలోనే ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమా ర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ హరినారాయణ భట్టడ్, పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజ్, సుధాకర్, రవీందర్ రెడ్డి, చంద్రకాంత్, బోయ శరణప్ప, నరహరి, వీరన్న, రవీందర్, విద్యాసాగర్గౌ డ్, పీఏసీఎస్ చైర్మన్లు పుట్టి ఇదప్ప, కె.నర్సింహారెడ్డి, వెంకట్రామారెడ్డి, కాంత్కుమార్ పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కోల్పోకుండా అర్హత గల వారిని చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు. బీఫార్మసీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని బీఫార్మసీ సెమిస్టర్–8 రెగ్యులర్, 1, 3, 5, 7 సెమిస్టర్లకు సంబంధించి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు 8వ సెమిస్టర్లో 82.74 శాతం, 7వ సెమిస్టర్లో 71.43 శాతం, 5వ సెమిస్టర్లో 50 శాతం, 3వ సెమిస్టర్లో 54.55 శాతం, 1వ సెమిస్టర్లో 58.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ రవికాంత్, ఈశ్వర్కుమార్, సురేష్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘యమ’డేంజర్..!
ప్రమాదకరంగా ఆర్యూబీలు ● ప్రతి ఏటా ఇదే తంతు.. తాత్కాలిక చర్యలతోనే సరి ● భారీ వర్షాలతో అండర్ పాస్లకు పోటెత్తుతున్న వరద ● పలు గ్రామాలు, కాలనీలకు నిలిచిపోయిన రాకపోకలు ● డ్రెయినేజీల విస్తరణ, అనుసంధానంపై నిర్లక్ష్యం● ప్రత్యేక పైపులైన్ల ఏర్పాటును పట్టించుకోని రైల్వే శాఖ 2022 జూలై 08: ఇది మహబూబ్నగర్ రూరల్ మండలం సూగురుగడ్డ రైల్వే అండర్ బ్రిడ్జిలో భారీగా చేరిన వరద నీటి లో చిక్కుకున్న ఓ స్కూల్ బస్సు. ఆ సమయంలో 30 మంది విద్యార్థులు బస్సులో ఉండగా.. యువకుల సమయస్ఫూర్తితో ప్రాణాపాయం తప్పింది. 2025 ఆగస్ట్ 14: ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బండమీదపల్లి (పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి)లోని రైల్వే అండర్ బ్రిడ్జి. భారీ వర్షంతో వరద పోటెత్తగా చెరువును తలపిస్తోంది. ఐదు రోజులుగా అటు ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. -
పత్తి రాలిపోతుంది
ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాను. ఒక్కో ఎకరాకు ఇప్పటికే రూ.30 వేలు ఖర్చు చేశాను. పంట బాగా వస్తుందని ఆశపడ్డా. కానీ గత 15 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పొలంలో నీళ్లు నిలిచి ఎర్రతేగెళ్లు సోకింది. పూత రాలిపోవడంతో చెట్టుకు కాయలు లేకుండాపోయాయి. అప్పులే మిగులుతాయన్న భయం వెంటాడుతోంది. – రాజు, రైతు, మరికల్ నిండా ముంచింది.. రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి 15 రోజుల నుంచి వర్షాలు విడవడంలేదు. విత్తనాలు నాటిన సమయంలో వర్షాలు రాక అలా నష్టపోతే.. ప్రస్తుతం పంట పూత, కాయ దశలో ఉండగా రోజుల తరబడి వర్షాలతో పూత, కాయ రాలిపోతుంది. గతేడాది కూడా ఇలాగే వర్షాలు రావడంతో రూ.50 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఏర్పడితే పంటలు వేయడం మానేయాల్సిందే. – నర్సిములు, రైతు, చిత్తనూర్ ● -
పత్తికి వాన గండం!
మరికల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటకు గండం పొంచి ఉందంటూ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చేల్లో నీరు చేరడంతో పంటతోపాటు ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉండడంతో తెగుళ్లు వ్యాప్తి చెందుతుండడంతో భయం వెంటాడుతోంది. దీనికితోడు తేమశాతం పెరిగి పత్తి పూత నేలరాలుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతులు అధికంగా పత్తి పంటను నమ్ముకున్నారు. పత్తి సాగు చేసిన నాటి నుంచి కాపు దశకు వచ్చే వరకు వర్షాలు వెంటాడుతుండడంతో పంట దిగుబడులు సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉందని, పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావోనని దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో పత్తి చేల్లో కలుపు సమస్య, తెగుళ్ల సమస్యలు అధికమయ్యాయి. ప్రస్తుతం పత్తి కాయల్లో నీరు చేరి నల్లగా, ఎర్రగా మారుతున్నాయి. గతేడాది ఇదే పరిస్థితి.. గతేడాది జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట కాపు దశకు వచ్చిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల వల్ల 6 క్వింటాళ్లకు పడిపోయింది. వర్షాలకు తడిసిన పత్తికి మార్కెట్లో తేమ శాతం పేరుతో క్వింటాల్కు రూ.4 వేల కంటే ఎక్కువ ధర పలకలేదు. దీంతో ఆశించిన దిగుబడితో పాటు మద్దతు ధర లేక రైతుకు ఎకరాకు రూ.30 వేల వాటిల్లింది. పత్తికి కలుపు సమస్య.. కూలీలకు డిమాండ్ జిల్లాలో 80వేల మందికి పైగా రైతులు ఈ వానాకాలం సీజన్లో 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఊట్కూర్, మరికల్, ధన్వాడ, కోస్గి, మద్దూ రు, దామరగిద్ద, మక్తల్, నర్వ అత్యధికంగా సాగు చేయగా, మిగితా మండలాల్లో తక్కువగా సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటలో కలుపు పెరగడంతో వాటిని తీసివేసేందుకు కూలీలకు డిమాండ్ పెరిగింది. పంటలో వచ్చిన కలుపు తీయడం కోసం రైతులు అష్టకష్టాలుపడుతున్నారు. ఒక్కో కూలీ రోజుకు రూ.500 నుంచి 800 వరకు డిమాండ్ చేస్తున్నారు. దీనిని అధిగమించేందుకు రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి కలుపుతీత పనులు చేయిస్తున్నారు. భారీ వర్షాలతో చీడపీడలు, దిగుబడులపై ప్రభావం తేమశాతం పెరిగి రాలుతున్న పూత పెట్టుబడిపై ఆశలు ఆవిరి జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో పత్తిసాగు -
జిల్లాలో ఎరువుల కొరత లేదు..
● పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ సరఫరా ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ దామరగిద్ద: జిల్లాలో ఎరువుల కొరత లేదని.. పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం దామరగిద్దలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ను పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్సుధాకర్తో మాట్లాడి ఎరువుల సరఫరా వివరాలను తెలుసుకున్నారు. రైతులకు పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు ఆధారంగా ఎన్ని ఎకరాల భూమి సాగుచేశారు.. ఎంత యూరియా అవసరం తదితర వివరాలను గుర్తించి ఎరువులు అందించాలని సూచించారు. అదే విధంగా ఒక్కో రైతు ఎన్ని సార్లు యూరియా తీసుకెళ్తున్నాడు.. ఏ పంటకు ఎంత మోతాదులో వేస్తున్నారో తెలుసుకోవాలని వ్యవసాయశాఖ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అదే విధంగా నానో యూరియా, డీఏపీల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువుల సరఫరా ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ వెంట ఏఓ మణిచందర్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధన చేయాలి
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని జాజాపూర్లో మంగళవారం ఏర్పాటుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్తో కలిసి ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. పాఠ్యాంశాలు చక్కగా అర్థం కావడానికి బోధనోపకరణాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఒక్కో టీచర్ వద్ద ఒక్కొక్క వినూత్న విధానం దాగి ఉంటాయని.. వాటన్నిటిని ఇలాంటి మేళాలో ప్రదర్శించడం వల్ల మరింత మంది ఉపాధ్యాయులు నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కాగా, మండలస్థాయి మేళాలో మొత్తం 125 ప్రాజెక్టులను ప్రదర్శించగా.. వీటిలో 10 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జీహెచ్ఎంలు అనురాధ, సత్యనారాయణ సింగ్, సునీత, భారతి, డీఎస్ఓ భాను ప్రకాశ్, యాదయ్యశెట్టి పాల్గొన్నారు. ● పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతగా నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. జాజాపూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించి.. బేస్మెంట్ లెవల్ పూర్తిచేసిన 14మంది లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంజూరైన వంట సామగ్రిని అందజేశారు. మండలంలోని లక్ష్మీపూర్లో వర్షానికి కూలిన చంద్రప్ప, సుదర్శన్రెడ్డి ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, యువజన సంఘం నాయకులు కోట్ల రవీందర్రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్ ఉన్నారు. -
‘పల్లెగడ్డ’ గ్రామస్తులకు అండగా ఉంటాం
మరికల్: మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నివాసముంటున్న నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామస్తులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి అన్నారు. ‘సాక్షి’లో ఈ నెల 17, 18 తేదీల్లో వరుసగా ప్రచురితమైన ‘మేమెక్కడికి పోవాలె.. ఈ పల్లె.. మా గడ్డ’ ‘పల్లెగడ్డను వదులుకోం’ కథనాలకు స్పందించిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి.. పల్లెగడ్డ గ్రామాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం పల్లెగడ్డ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సూర్యమోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2018 నుంచి గ్రామాన్ని ఖాళీ చేయాలని 36 మందికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని.. ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రూ.లక్షలు వెచ్చించి నివాస గృహాలు నిర్మించుకున్నామని, ఇప్పుడు పొమంటే ఎక్కడికి వెళ్లాలని ఆయనతో గ్రామస్తులు గోడు వెల్లబోసుకున్నారు. ఆయన స్పందిస్తూ.. ఈ విషయంపై ఎమ్మెల్యే దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడారని, ఇకపై గ్రామంలో ఎవరికి నోటీసులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చి కోర్టుకు తిరుగుతున్న వారి తరపున ప్రభుత్వం నుంచి న్యాయవాదిని నియమించి కోర్టులో వాదన వినిపిస్తామని.. పల్లెగడ్డ గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట నాయకులు రాయుడు, కుర్మయ్య, రాములు, నర్సప్ప తదితరులు ఉన్నారు. -
శభాష్.. వెంకటేశ్
నారాయణపేట జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రమంలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంపై వైరు తెగిపోయి తన పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి వైర్లు సరిచేసి సరఫరా పునరుద్ధరించి శభాష్ అనిపించుకున్నాడు యువకుడు వెంకటేశ్. సంబంధిత గ్రామాలకు కొన్నేళ్లుగా విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా లైన్మెన్ లేకపోయినా కరెంట్ బిల్లుల వసూలుకు నియమించబడిన సదరు యువకుడు తన పని కాకపోయినా ధైర్యం చేసి విద్యుత్ మరమ్మతులు చేశాడు. ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు సంబంధించిన కరెంట్ బిల్లుల వసూలుకు స్పాట్బిల్లర్గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముశ్రీఫా శివారులో ఉన్న చెరువు మధ్యలో విద్యుత్ వైరు తెగిపోయింది. దీంతో ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో చీకటి అలుముకుంది. సోమవారం ఉదయం విద్యుత్ లైన్ను పరిశీలించగా.. చెరువు మధ్యలో వైరు తెగినట్లు గుర్తించారు. స్పాట్బిల్లర్ వెంకటేశ్ ఎల్సీ తీసుకొని చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వెంకటేశ్ను అభినందించారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ ధైర్యం చేసి చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు పూర్తి చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో వెంకటేశ్కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
కళాశాలను మరో భవనంలోకి మార్చండి
మక్తల్: ప్రభుత్వ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంటనే ప్రైవేట్ భవనంలోకి కళాశాలను మార్చాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని మినీ స్టేడియాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుత కళాశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన నిర్మాణం కోసం ఎంత భూమి అవసరం అవుతుందని ఆరా తీశారు. మైదానం ఎన్ని ఎకరాల్లో ఉందో సమగ్ర సర్వే చేయించి రిపోర్టు ఇవ్వాలన్నారు. జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, ఇండోర్ స్టేడియం భవనాలను తొలగించే విషయంపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల కోసం పక్కన ఉన్న ప్రైవేట్ భవనంలోకి మార్పు చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించడం జరిగిందని అన్నారు. అనంతరం మక్తల్ మండలం కర్ని చెరువు అలుగు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, తహసీల్దార్ సతీస్కుమార్, ఎంపీడీఓ రమేష్, కమిషనర్ శంకర్నాయక్, వాకిటి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
మార్మోగిన శివనామస్మరణ
కళాకారుల అడుగుల భజన.. డోలు వాయిద్యం.. కోలాటం.. ఒగ్గుడోలు వివిధ కళాప్రదర్శనలు ఒకవైపు.. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ శంభో శంకర అను భక్తుల నామస్మరణ మరోవైపు.. ఇలా కోస్గి పట్టణమంతా సోమవారం పండుగ వాతావరణం నెలకొంది కురిహినశెట్టి(జాండ్ర సంఘం) ఆధ్వర్యంలో శ్రావణ మాస ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠ స్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో స్వామి వారిని ఊరేగిస్తూ ఆటపాటలు, భజనల నడుమ గంగా స్నానానికి తీసుకెళ్లారు. ప్రతి గడప నుంచి నీటి బిందెలతో యువకులు, కుల పెద్దలు, సంఘ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ రకాల కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. – కోస్గి -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ
మక్తల్: పండుగలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, వినాయక చవితి వేడుకలకు సంబంధించి డీజేలకు అనుమతి లేదని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. సోమవారం మక్తల్లో మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగలు, దేవతల ఊరేగింపులో డీజేలు, పెద్ద శబ్దం వచ్చే బాణాసంచాలకు అనుమతి లేదని, ఉత్సవ కమిటీ సభ్యులందరు సహకారించాలని అన్నారు. భారీ శబ్దాలతో వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. గణేష్ మండపాల ఏర్పాటు, డెకరేషన్, ఇతర సందర్భాల్లో చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టవద్దని, తప్పనిసరిగా మండపాల ఏర్పాటుకు పోలీస్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులను సంప్రదించాలని, 24 గంటలు ఒక వలంటీర్ మండపాల దగ్గరే ఉండాలని అన్నారు. ట్యాంకు బండ్ దగ్గర పరిశుభ్రంగా చెత్తాచెదారం లెకుండా ఉంచాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీల వారు పోలీసులకు సహకరించాలని అన్నారు.కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐలు రాంలాల్, ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, నవీద్, ఆశోక్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
నారాయణపేట: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రజావాణి హాల్లో గల సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, గౌడ సంఘం సభ్యులు, అధికారులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు.స అనంతరం ధన్వాడకు చెందిన బాలకృష్ణ సర్దార్సర్వాయి పాపన్న వేషధారణతో ప్రదర్శన అందరిని అకట్టుకుంది. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఇంచార్జ్ అధికారి ఉమాపతి, డీపీఆర్ఓ రషీద్, జెడ్పీఈసీఓ శైలేష్, సీఐ అనంతయ్య, నాయకులు లక్ష్మణ్ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్, వెంకటేష్గౌడ్, ఆనంద్కుమార్గౌడ్, రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
కుండపోత వర్షం
నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మక్తల్ మండలంలోని కర్నే గ్రామానికి వెళ్లేదారిలో కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్ కల్వర్టును పరిశీలించారు. నారాయణపేట మండలంలోని పేరపళ్ల వాగు వరద ఉధృతమవడంతో సీఐ శివశంకర్ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో కల్వర్టులు, బ్రిడ్జిలు, వాగులపై పారుతున్న వరద తగ్గేంతేవరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తమకు వర్షం, వరదల సమాచారాన్ని చేరవేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్, ఎస్పీ యోగేష్గౌతమ్ సూచించారు. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వానాలతో పంటపొలాల్లో నీరు నిల్వ ఉండడం.. తెగుళ్ల భారిన పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వర్షపాతం వివరాలిలా.. జిల్లాలోని ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దామరగిద్ద 51.2 మి.మీ వర్షపాతం, నారాయణపేట 60.2, ఊట్కూర్ 47.9, మాగనూర్ 38.2, కృష్ణా 37.1, మక్తల్ 43.3, నర్వ 45.8, మరికల్ 53.6, ధన్వాడ 45.8, మద్దూరు 42.7, కోస్గి 34.2, గుండుమాల్ 55.5, కొత్తపల్లి 47.3 మి.మీల వర్షపాతం నమోదైంది. నిలిచిపోయిన రాకపోకలు భూనేడ్ నుంచి మద్దూర్ మధ్యలో ఉన్న భూనేడ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి – భూనేడ్ మధ్య నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేయగా.. వరద పోటెత్తడంతో తాత్కాలిక బ్రిడ్జి తేగిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రయాణిలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మక్తల్ మండలంలోని నేరడ్గాం, సంగంబండ బ్రిడ్జి, ముస్లాయపల్లి, పారేవుల మధ్య, గొల్లపల్లి–మంతోన్గోడ్, సామాన్పల్లి–మంతోన్గోడ్, కాచ్వార్ –ఎడివెల్లి, చిట్యాల– పంచదేవ్పహాడ్, కర్నె– చిట్యాల మధ్యలో కల్వర్టులపై వరద పారుతుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాగనూర్ మండలంలోని వర్కూర్ వంతెనా, అడవి సత్యారం పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిండిన చెరువులు నారాయణపేట రూరల్: మండలంలోని కోటకొండ, బండగొండ, అప్పిరెడ్డిపల్లి, బైరంకొండ చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతుంది. సింగారం, అభంగాపూర్ వాగులకు వరద పోటెత్తింది. ఇక జాజాపూర్ గ్రామశివారులో లోలెవల్ వంతెనపై నుంచి నీరు వెళ్తుండటంతో శేర్నపల్లి గ్రామానికి రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అభంగాపూర్ వాగులో నీటి స్థాయి పెరుగుతుండటంతో బండగొండ, భూనేడ్ వైపు వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది. బైరంకొండ చెరువు నీరు కర్ణాటక వైపు వెళ్ళే రహదారిపైకి రావడంతో జలాల్పూర్, యాద్గీర్ వైపు రాకపోకలు కొంత సమయం నిలిచిపోయాయి. పేరపళ్ళ చెరువు నీరు రోడ్డుపైకి రావడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు,వంకలు పలు గ్రామాల్లో నిలిచిపోయిన రాకపోకలు పంటల్లో నిలిచిన నీరు.. రైతుల ఆందోళన కలెక్టర్, జిల్లా అధికారుల పరిశీలన -
పీహెచ్డీ చేయాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు
నారాయణపేట: అసలు వారణాసిలో ఏమి జరిగిందంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్యూ) మరోసారి వెలుగులోకి వచ్చింది. తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సీఎస్ రామచంద్రమూర్తిపై గత నెలలో జరిగిన దాడి కేసును వారణాసి పోలీసులు సీరియస్గా తీసుకొని .. 15 రోజుల్లోనే చేధించారు. ఈ నేపథ్యంలో అసలు ఏమి జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు కథ ... అంతర్గత వివాదమే దాడికి దారి ప్రొఫెసర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మధ్య జరిగిన వివాదమే దాడికి దారి తీసిందనేది వారణాసి పోలీసుల విచారణలో వెల్లడైంది. కలత చెందిన మాజీ విభాగాధిపతి తెలంగాణకు చెందిన తన ఇద్దరు పూర్వ పరిశోధన విద్యార్థులు భాస్కర్, మోడ్గు కాసిం బాబుకు హెచ్ఓడీ తనను వేధిస్తున్నాడని, తనను పని చేయనివ్వడం లేదని తన బాధను వెలిబుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వారు ప్రయాగ్రాజ్లోని మహమ్మద్ కాసీం అనే పరిచయస్తుడిని సంప్రదించారు. ఈ ముగ్గురు కలిసి జూలై 25న వారణాసికి చేరుకొని కాంట్రాక్ట్ నేరస్తులను నియమించుకున్న గణేష్పాసిని కలిశారు. బీహెచ్యూ క్యాంపస్ వెలుపల ప్రొఫెసర్ మూర్తిపై దాడి చేయడమే అసలు పథకం. ముందుగా క్యాంపస్ లోపల దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కుదరకపోవడంతో.. కట్చేస్తే ఫ్రొఫెసర్పై దాడి జరిగిందిలా.. జూలై 28న సాయంత్రం 6:30 గంటకు ప్రొఫెసర్ మూర్తి క్యాంపస్ నుంచి బ్రిజ్ఏన్క్లేవ్ కాలనీలోని ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బిర్లా హాస్టల్ క్రాసింగ్ వద్ద ప్రొఫెసర్పై కడ్డీలతో దాడి చేశారు. దాడిలో ప్రొఫెసర్ రెండు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం దుండగులు హైవేపై పారిపోయారు. స్థానికులు గాయపడిన ప్రొఫెసర్ను చికిత్స నిమిత్తం బీహెచ్యూ ట్రామా సెంటర్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కటకటాల పాలయ్యాడు చిన్నప్పుడే భాస్కర్ తల్లిదండ్రులను కోల్పోయాడు. పెద్దనాన్న కిష్టప్ప పోషణలో పెరిగాడు. పీజీ వరకు టాప్ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. పీహెచ్డీ ఎంట్రెన్స్లో సైతం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పీహెచ్డీ పూర్తి చేయాలనుకున్న భాస్కర్ విధి రాత.. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పెట్టిన ఆశతో కటకటాల వైపు తీసుకెళ్లినట్లు అవుసలోనిపల్లి గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
పల్లెగడ్డను వదులుకోం!
మరికల్: తమ పూర్వీకులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ తమకు కానుకగా ఇచ్చిన ‘పల్లెగడ్డ’ను వదులుకోమని గ్రామస్తులు ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకపోయినా కోర్టులో న్యాయ పోరాటం చేసి.. తమ గ్రామాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన నాటి నుంచి తరతరాలుగా తమ పూర్వీకులు ఊరిని కాపాడుకుంటూ వస్తున్నారని.. 2018లో ఓ అజ్ఞాత వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో పల్లెగడ్డ గ్రామం ఉందని ఫిర్యాదు చేయడంతో తమకు సమస్యలు మొదలయ్యాయని వాపోతున్నారు. అప్పటి నుంచి ఎండోమెంట్ అధికారులు తమకు దశల వారీగా కోర్టు నుంచి నోటీసులు జారీచేస్తూ భయాందోళనకు గురిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు కుటుంబాలతో మొదలైన పల్లెగడ్డ గ్రామంలో 250కి పైగా ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. 20 ఎకరాల గ్రామకంఠం ఉంది. మొత్తం 1,624 జనాభా ఉండగా.. 745 మంది ఓటర్లు ఉన్నారు. 254 రేషన్కార్డులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 40 మంది, అంగన్వాడీ కేంద్రంలో 25మంది చదువుకుంటున్నారు. 250 ఇళ్లకు పైగా విద్యుత్ మీటర్లు ఉండగా.. ఇంటి పన్ను, నల్లా పన్నులు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా గ్రామంలో ఆంజనేయస్వామి, శివాలయాలు, నాలుదిక్కులా గ్రామదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. 2వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉన్నాయి. చిన్నరాజమూరు ఆంజనేయస్వామి దేవాలయ భూమిలో నిర్మితమైన పల్లెగడ్డ గ్రామం మొదట్లో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. మరికల్ పంచాయతీ పరిధిలో ఉండటంతో కనీస వసతులకు నోచుకోక గ్రామస్తులు ఇబ్బందులు పడేవారు. కాలక్రమేణా గ్రామ జనాభా పెరుగుతూ రావడంతో 1980లో అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చింది. అప్పట్లోనే ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుచేశారు. గ్రామంలో అంతర్గత రహదారులకు ఇరువైపులా డ్రెయినేజీలు, పబ్లిక్ కొళాయిలు ఏర్పాటుచేశారు. ఇలా ప్రభుత్వ నిధులతో ప్రజా సమస్యలు తీరుస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వచ్చాక గత ప్రభుత్వం నూతన పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చూట్టింది. అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి చొరవతో మరికల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పల్లెగడ్డను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తున్నారు. నూతన గ్రామపంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్యార్డు వంటి వాటిని నిర్మించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. మొదటి విడతలో 66 ఇందిరమ్మ ఇళ్లను మంజూరుచేసింది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నారు. అయితే పల్లెగడ్డ గ్రామస్తుల సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టనట్టుగా ఉండటం గమనార్హం. నాకు 75 ఏళ్లు. మా తాత ఎప్పుడు ఒకటి చెబుతుండే. నిజాం పాలనలో ప్రజలను చిత్రహింసలకు గురిచేసి దొచ్చుకునే వారట. వారి నుంచి కుటుంబాన్ని కాపాడుకునేందుకు అడవులకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నామని చెప్పేవారు. తల్లితో సమానమైన గ్రామాన్ని ఖాళీ చేయాలని 200 ఏళ్ల తర్వాత నోటీసులు ఇస్తే ఎలా ఖాళీ చేస్తాం. చావైనా, బతుకై నా ఇక్కడే ఉంటాం. – హన్మంతు, పల్లెగడ్డ ఇంటికి కోర్టు నోటీసులు వచ్చాయని కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా తెలియజేస్తే అమర్నాథ్ నుంచి రెండు రోజుల క్రితం వచ్చాను. మూడు తరాల తర్వాత నాల్గో తరం వారికి దేవాదాయశాఖ అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని.. లేకుంటే కోర్టుకు హజరు కావాలని నోటీసులు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. రూ.లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నాం. గ్రామాన్ని మాత్రం వదిలిపెట్టాం. – నర్సింహులు, పల్లెగడ్డ తమ పూర్వీకుల కాలం నాటి నుంచి ఉంటున్న మా ఊరిని విడిచి ఎక్కడికి వెళ్లం. ఏమైనా పండుగలు వచ్చినా మంచి, చెడు జరిగినా ఊళ్లో అందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటాం. తమను అధికారులు విడదీయలేరు. నోటీసులకు భయపడేది లేదు. – చెన్నమ్మ, పల్లెగడ్డ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, రేషన్షాపు, సీసీరోడ్లు, డ్రెయినేజీలు, మిషన్ భగీరథ నీటి సరఫరా తదితర అభివృద్ధి పనులు ఎన్నో జరిగాయి. కొత్త పంచాయతీగా పల్లెగడ్డ అవతరించింది. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పల్లెగడ్డ గ్రామాన్ని ఖాళీ చేయాలని 2018 నుంచి కోర్టు చుట్టూ తిప్పడం భావ్యం కాదు. ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి న్యాయం చేయాలి. – కుర్మయ్య, పల్లెగడ్డ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పల్లెగడ్డ గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో మొదటి విడతగా 66 ఇళ్లు మంజూరయ్యాయి. 1980లో కూడా అప్పటి ప్రభుత్వం 15 ఇళ్లను పేదలకు మంజూరు చేసింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి ఎండోమెంట్ అధికారులకు కనిపించడం లేదు. కోర్టులో న్యాయ పోరాటం చేసి గ్రామాన్ని కాపాడుకుంటాం. – విజయ్, పల్లెగడ్డ పల్లెగడ్డ గ్రామం విషయం దేవాదాయ ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. త్వరలోనే మరికొంత మందికి కోర్టు నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 25 మందికి నోటీసులు జారీ అయ్యాయి. వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టులో సమర్పించాలి. – కవిత, దేవాదాయశాఖ ఈఓ, మహబూబ్నగర్ ముక్తకంఠంతో నినదిస్తున్న గ్రామస్తులు నేడు దేవాదాయశాఖ ట్రిబ్యునల్ కోర్టుకు హాజరుకానున్న 25మంది పుట్టిన ఊరి కోసం తమ వాదన వినిపిస్తామని వెల్లడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరిని విడిచివెళ్లమని శపథం స్పందించని ప్రజాప్రతినిధులు -
అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలి
మక్తల్: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. అందులో భాగంగా మక్తల్లో అన్ని హంగులతో 150 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. అనంతరం కర్ని గ్రామంలో చెరువు అలుగును మంత్రి పరిశీలించారు. పంచదేవ్పాడులో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, కట్ట సురేశ్, రాజుల ఆశిరెడ్డి, కృష్ణయ్య, వెంకటేశ్, రాము, చిన్న హన్మంతు, బాలప్ప, ఆంజనేయులుగౌడ్, లింగప్ప రవికుమార్ పాల్గొన్నారు. నర్వ: రైతులు యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు వస్తే అర్ధరాత్రి అయినా అందించాల్సిందేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నర్వ పీఏసీఎస్లో యూరియా స్టాక్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో నర్వ మండలానికే 20 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేయడం జరిగిందని.. రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ సిబ్బందికి మంత్రి సూచించారు. యూరియాను పక్కదారి పటిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పీఏసీఎస్లో సీఈఓ అందుబాటులో లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా పంపిణీ పూర్తయ్యే వరకు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఉన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సంఘం గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, సంఘం నాయకులు పలు తీర్మానాలు చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు, సకాలంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సంఘ భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలన్నారు. అనంతరం ఆనంద్గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అదనపు కార్యదర్శి కె.సత్యన్నచారి, నాయకులు రహిమాన్సోఫి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు సంస్కారం నేర్పాలి
ఊట్కూరు: తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని పండిత్ ప్రియదత్తు శాస్త్రి అన్నారు. ఊట్కూరులోని ఆర్యసమాజ్ భవ నంలో నిర్వహిస్తున్న శ్రావణవేద త్రిదివసీయ కార్యక్రమం ఆదివారం ముగిసింది. మూడు రోజులపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో వేదయజ్ఞం ప్రవచనాలు నిర్వహించారు. చివరిరోజు పూర్ణాహు తి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసమానతలు, రుగ్మతలను రూపు మాపేందుకు ఆర్యసమాజం కృషి చేస్తుందన్నారు. ప్రపంచంలో భారతదేశ కుటుంబ వ్యవస్థ పటిష్టమైనదని.. కుటుంబ వ్యవస్థ ఇలాగే కొనసాగాలంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం చాలా ముఖ్యమన్నారు. సాత్విక ఆహారం భుజించాలని, దాన ధర్మా లు చేపట్టాలని ఆయన కోరారు. ఆర్యసమాజం వ్యక్తిలో సంస్కారాన్ని నింపేందుకు పాటు పడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గరిడి లింగిరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు బాల్రెడ్డి, ఆర్యసమాజ్ ప్రతినిధులు కనకప్ప ఆర్య, శివపాల్, దివాకర్, పవన్, బాలరాజు, జ్ఞానేశ్వర్, సుధాకర్ పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు అండగా నిలుస్తాం
నారాయణపేట/దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అండగా నిలుస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, రైతు సంఘం నాయకులు వెంకోబ, గోపాల్, ధర్మరాజుగౌడ్ తదితరులు మాట్లాడారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని.. ప్రతి ఎకరానికి రూ. 30లక్షల నష్టపరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అనంతరం శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. అవసరమైతే సీఎం కాలు మొక్కి న్యాయమైన పరిహారం చెల్లించేలా చూస్తానని భరోసానిచ్చారు. గతంలో 69 జీఓపై కొందరు దొంగ నాటకాలు ఆడారని అన్నారు. ఇటీవల కానుకుర్తికి వచ్చిన ఓ నాయకురాలు రైతులను మభ్యపెట్టే విధంగా మాట్లాడారని.. తాము పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తెస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరూ రాజకీయాలు చేయొద్దని కోరారు. భూ నిర్వాసితుల తరఫున ఈ నెల 22 తర్వాత సీఎంను కలిసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అదే విధంగా దామరగిద్ద మండలం కాన్కుర్తి గ్రామంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. కార్యక్రమాల్లో గోపాల్రెడ్డి, శెట్టి రమేశ్, భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పీఏఎస్సీ చైర్మన్ ఈదప్ప, మాజీ ఎంపీపీ వెంకట్రెడ్డి, భీంరెడ్డి, బసిరెడ్డి పాల్గొన్నారు. ● భూ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని భూ నిర్వాసితుల సంఘం తీర్మానించింది. జిల్లా కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 18నుంచి 19 వరకు భూ నిర్వాసిత గ్రామాల్లో చైతన్య సదస్సులు, 20, 21 తేదీల్లో హైదరాబాద్లో వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు వినతిపత్రాలు అందజేయడం, రాష్ట్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు, 25న ట్రాక్టర్లతో చలో కొడంగల్ (కాడ) కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. -
దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
నారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 11ఏళ్ల కాలంలో పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు పెరిగిపోయాయన్నా రు. 2020లో విధించిన లాక్డౌన్ దివ్యాంగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న దివ్యాంగుల్లో సగం మందికి యూడీఐటీ కార్డులు రాలేదని.. 65శాతం మందికి ఉపాధి లేదన్నారు. పోరాటాలతో సాధించుకున్న 2016 ఆర్పీడబ్ల్యూ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సుగమ్య భారత్ అభియాన్ పథకం మోదీ ప్రచారం కోసమే తప్ప.. దివ్యాంగుల కోసం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా చేయూత పింఛన్లు ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు బాబు, రంగయ్య, మల్లప్ప, నర్సప్ప, కృష్ణ, బాలరాజు, బస్వరాజు, పెంటయ్య, మల్లేష్, గోవిందు, చంద్రశేఖర్, సాయబన్న, హన్మంత్ తదితరులు ఉన్నారు. -
తోపుడు బండిపై ఆస్పత్రికి మృతదేహం..
నారాయణపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలంతా చూ స్తుండగానే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఈ ఘటన జరిగింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులయ్య (28) భార్యాపిల్లలతో కలసి కోస్గి లోని అత్తగారింట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం అతను ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్క డే మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తోపుడు బండిలో తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచి్చన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అను మ తి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించిన తీరును చూ సి అక్కడ గుమిగూడిన జనం అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడి యో తీసి ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఇదీ పరిస్థితి.. అంటూ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్హెచ్ఓగా ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా మృతుని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో తోపుడు బండిపై మృతదేహం తరలించామన్నారు. సమయానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేయాల్సి వచి్చందని చెప్పారు. -
వేతనం పెంచాలి
పదేళ్లుగా చాలీచాలని జీతంతో పనిచేస్తున్నాం. ఏపీలో మాదిరి రాష్ట్రంలో పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సీఆర్పీల పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలి. – రవిప్రకాష్, సీఆర్పీ, కొల్లంపల్లి కాంప్లెక్స్ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కాంప్లెక్స్లో వారికి సంబంధించి విధి విధానాల ప్రకారం సీఆర్పీలు పనిచేస్తున్నారు. వేతన సవరణ ప్రభు త్వ పరిధిలోని అంశం. వాస్తవానికి జిల్లాలో ఐదు కాంప్లెక్స్లలో సీఆర్పీలు లేరు. ఇతర సీఆర్పీలకు తాత్కాలికంగా చూసుకునేలా సూచించాం. వారికి కాంప్లెక్స్ గ్రాంట్స్ నుంచి టీఏ, డీఏలు చెల్లించే విధంగా చర్యలు చేపడతాం. – గోవిందరాజు, డీఈఓ -
పని బారెడు.. వేతనం మూరెడు
నారాయణపేటవాతావరణం రోజంతా ఆకాశం నిర్మానుష్యంగాఉంటుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025నారాయణపేట రూరల్: విద్యాశాఖలో సీఆర్పీల పరిస్థితి ‘పనిబారెడు.. వేతనం మూరెడు’ అన్న చందంగా ఉంది. విద్యావిదానంలో నూతన పద్ధతులు అమలు చేస్తుండగా.. వీటి పర్యవేక్షణ కొరకు నియమించిన సీఆర్పీలకు మాత్రం సమాన పనికి సమా న వేతనం మాత్రం అందడంలేదు. రెండేళ్ల క్రి తం తమ డిమాండ్ల సాధనకు సీఆర్పీలు హైదరాబాద్లో ధర్నా సైతం చేపట్టారు. గత ఏడాది విధులు బహిష్కరించి జిల్లా కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు నిర్వహించిన రేవంత్ ప్రభుత్వం కనికరించలేదు. నియామకం ఇలా.. ఉపాధ్యాయులు, అధికారులకు మద్య వారధులు గా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్ ఇంచార్జీ, ఎంఈఓలకు అనుసంధానంగా పనిచేయడానికి సీఆర్పీలను నియమించారు. సీఆర్పీ వ్యవస్థ అంటేనే విపరీతంగా పని ఉంటుంది. దీంతో ఒత్తిడితో కూడిన పనులతో పాటు ఒక వైపు అధికారులు, మరో వైపు ఉపాధ్యాయ సంఘాలతో ఇబ్బందులు పడుతున్నారు. తరచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెచ్ఎంకు సహకరిస్తూ యూడైస్, చైల్డ్ ఇన్ఫో పూర్తి చేయాలి. ప్రతి నెలకు సంబంధించి డైరీ రాస్తూ, ఎస్టీపీఎస్ టీచర్లు లీవ్ పెడితే స్కూల్కు వెళ్లి పిల్లలకు పాఠం చెప్పాలి. ఇక ప్రతి నెల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలి. దీనికితోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు చేపట్టి, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇక రవాణా సౌకర్యం లేని స్కూల్ గుర్తించాలి, మధ్యాహ్న భోజనం చూడాల్సి ఉంటుంది. క్లస్టర్ పరిధిలోని పాఠశాలలల్లో నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు హాజరు కావాలి. వారి నుంచి వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రతి పాఠశాలను నెలలో రెండు సార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. వివిధ రకాలైన మేళాలు, పోటీలు న్విహించాలి, కేజీబీవీలను సైతం సందర్శించాలి వేతనాల్లోనే వ్యత్యాసం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఆర్పీల వ్యవస్థ ప్రారంభంకాగా.. అరకొర వేతనంతోనే విధులు నిర్వహించారు. క్రమంగా పెరుగుతూ వచ్చిన జీతం ఇప్పటికి రూ.15వేలకు చేరింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా సీఆర్పీలకు తెలంగాణలో రూ.15 వేల గౌరవ వేతనం కొనసాగిస్తూ వచ్చింది. మూడే ళ్ళ క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 19,350కు పెంచారు. కాని ప్రస్తుతం విభజన ఆంధ్రప్రదేశ్లో వీరితో పాటు నియామకం కాబడిన సీఆర్పీలకు దాదాపు రూ.23,500 అక్కడి ప్రభు త్వం చెల్లిస్తుంది. విధులు, బాధ్యతలు సమానంగా ఉన్న రెండు రాష్ట్రాల్లో మాత్రం వేతనం చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఐదు కాంప్లెక్స్లకు సీఆర్పీలు కరువు జిల్లాలోని 13 మండలాల్లో 33 కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో ఐదు చోట్ల సీఆర్పీలు లేరు. నర్వ, మాగనూర్, దామరగిద,కోటకొండ,మద్దూర్కు సంబంధించిన సీఆర్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లోని వారు ఉపాధ్యాయ ఉద్యోగం రావడం, ఇతర ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దీంతో ఆయా చోట్ల ఖాళీగా ఉన్న వాటిని పక్కనే ఉన్న ఇతర సీఆర్పీలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. చాలీచాలని వేతనాలతోసీఆర్పీల అవస్థలు విద్యాశాఖలో అదనపు భారంతో సతమతం అందని ద్రాక్షగానే సమాన పనికి సమాన వేతనం -
కనులపండువగా ఆంజనేయస్వామి ఉత్సవాలు
మద్దూరు: మండల కేంద్రంలోని పాతబస్టాండ్ ఆంజనేయస్వామి ఉత్సవాలు అలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే జల్ధి ఊరేగింపు నిర్వహించారు. గంగజాలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకొచ్చారు. జైశ్రీరాం అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాఘవేంద్రచారి ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు, అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ, దాతల సహకారంలో అన్నదానం చేశారు. ఇదిలాఉండగా, ఉత్సవాల సందర్భంగా పాతబస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రెటపట్ల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ పోటీల్లో ఉజ్జెలి, పల్లెర్ల, రెనివట్ల, క్యాతన్పల్లి, బొమ్మన్పాడ్, కంసాన్పల్లి, చెన్నారెడ్డిపల్లి, గుర్మిట్కాల్, తదితర గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ సామాజిక బాధ్యత
మాగనూర్: మొక్కలు సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ కోరారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీడీఓ శ్రీనివాసులుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి మనుగడకు ఆక్సిజన్ ఎంతో అవసరమన్నారు. మొక్కలు పెంచడం వల్ల సహజ సిద్ధంగా ఆక్సిజన్ లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రకృతి సహకరిస్తేనే సకల జీవకోటికి మనుగడ ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలు మన పూర్వీకులు మాదిరిగా ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్ల్లో టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. యోగా జీవితంలో ఒక భాగంగా అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి అఫ్రోజ్, ఏపీఓ మన్యం, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దంచికొడుతున్న వాన
నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా వాన దంచికొడుతుంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను సీపీఓ యోగానంద్ వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ధన్వాడ మండలంలో 55.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మరికల్ మండలంలో 0.5 మి.మీల వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలోని 15.8 మి.మీ, కృష్ణాలో 6.8 మి.మీ, చిన్నజట్రంలో 39.0 మి.మీ, నారాయణపేటలో 26 మి.మీ, మాగనూర్లో 3.5 మి.మీ, మద్దూర్లో 13.5 మి.మీ, ఊట్కూర్లో 17 మి.మీ, జక్లేర్లో 15.5 మి.మీ, బిజ్వార్లో 22 మి.మీ, కొత్తపల్లిలో 19.5 మి.మీ, మక్తల్లో 7 మి.మీ, మొగల్మడ్కాలో 2 మి.మీ, నర్వలో 35.5 మి.మీ, గుండుమాల్లో 32.3 మి.మీ, కోటకొండలో 0.5 మి.మీ, కోస్గిలో 7 మి.మీ వర్షపాతం నమోదయింది. అధికారులు, పోలీసులకు సహకరించండి మక్తల్: మరో రెండు, మూడు రోజులు జిల్లా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రావద్దన్నారు. రోడ్లపై వాగులు ఉధృతంగా పారుతున్న సమయంలో వాహనదారులు వాటిని దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడొద్దని కోరారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే అధికారులు, పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. అనుకోని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేరాల నియంత్రణకు కృషి కోస్గి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు నేరాల నిర్మూ లన కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ పోగ్రాం చేపట్టామని డీఎస్పీ లింగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని 14వ వార్డులో 60 మంది పోలీసులతో 250 ఇళ్లల్లో సోదాలతో కార్డెన్సెర్చ్ చేపట్టి సరైన పత్రాలు లేని 56 వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మహిళలు, చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తే జైలుకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ సైదులు, ఎస్ఐలు బాల్రాజ్, విజయ్కుమార్, రాముడు, నవీద్, మహేశ్వరి, గాయత్రి, సిబ్బంది ఉన్నారు. ఎడ్లబండ్లతో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి నారాయణపేట/ఊట్కూర్: పేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారాన్ని అందించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు ఎడవెల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. ఊట్కూర్, దంతన్పల్లి శివారులోని భూ నిర్వాసితులు చెక్పోస్టు నుంచి పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లతో ర్యాలీ చేపట్టి ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయాల్ని ముట్టడించారు. అంతకుముందు బీజే పీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా భూ నిర్వాసితులు జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నా ప్ర భుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మార్కెట్లో భూముల ధరలు రూ. 50 లక్షల నుంచి రూ.కోటి దాకా పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ.14 లక్షలు అందించి చేతులు దులుపుకోవాలని చూస్తుందని ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం రూ.24 లక్షలు ఇస్తున్నా.. ఇక్కడ రైతులకు కేవలం రూ.14 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ గోవింద్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, అధ్యక్షుడు మశ్చేందర్, ఉపాధ్యక్షులు ధర్మరాజుగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, సీపీఐ ఎంఎల్ నాయకులు సలీం, ఆంజనేయులు, గోపాల్, భగవంతు, బలరాం పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
మక్తల్: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండి రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ సిక్తానపట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి గది, స్కానింగ్ సెంటర్, ల్యాబ్, డయాలసిస్ సెంటర్, జనరల్ వార్డు, డ్రగ్స్స్టోర్ను పరిశీలించారు. ఆస్పత్రిల్లో జరిగిన కాన్పుల గురించి ఆరా తీశారు. ల్యాబ్లో రక్త, టీబీ నిర్ధారణ పరీక్షలు, వాటి నమూనాలను ఎక్కడ భద్రపరుస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. డయాలసిస్ సెంటర్లో అందుబాటులో బెడ్ల పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో మరుగుదొడ్లు మరమ్మతు పనులు చేయించాలని కమిషనర్ శంకర్నాయక్కు ఆదేశించారు. ప్రతిరోజు 200 నుంచి 300 ఓపీలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. రా త్రి సమయంలో అత్యవసరంగా రోగులు వస్తే వారి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డెంగీ కేసులు నమోదుపై ఆరా తీశారు. పంద్రాగస్టు వేడుకలకు మంత్రి రాక నారాయణపేట: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15న నిర్వహించే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బెడ్ల కొరత
ఐదు రోజుల క్రితం కలరా సోకడంతో ఆస్పత్రికి వచ్చి, అడ్మిట్ అయ్యాను. ఒకే బెడ్పై నాతో పాటు మరో వ్యక్తికి వైద్యం చేశారు. మూడు రోజులు పాటు ఆస్పత్రిలో ఒకే బెడ్ ఇద్దరం సైలెన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. – దేవప్ప, నర్సపూర్, దామరగిద్ద మండలం ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాలి నాకు తీవ్ర జ్వరం రావడంతో వైద్యం కోసం మద్దూరు ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులగా వైద్యం అందించారు. కానీ కొన్ని రకాల మందులకు బయటికి పంపుతున్నారు. మంచాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. – మల్లమ్మ, లోకుర్తి, దామరగిద్ద మండలం పోస్టులు మంజూరు కాలేదు స్థానిక సీహెచ్సీకి నిత్యం రోగులు వస్తుంటారు. 30 పడకలు ఏ మాత్రం సరిపోవడం లేదు. అలాగే పోస్టులు మంజూరు కాకపోవడంతో జిల్లాలోని వివిధ ఆస్పత్రులో పనిచేస్తున్న వారిని ఇక్కడికి డిప్యూటేషన్పై వేశారు. నేను కూడా డిప్యూటేషన్పైనే వచ్చాను. ప్రస్తుతం ఆస్పత్రిలో ఈసీజీని త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. స్కానింగ్, ఆక్సిజన్ సౌకర్యం గురించి నాకు తెలియదు. – పావని, మద్దూరు సీహెచ్సీ సూపరింటెండెంట్ ● -
కష్టాల కడలిలో ‘గంగ’మ్మ
మృతి చెందిన హరిబాబు ఫొటో చూపిస్తూ ఆదుకోవాలని దీనంగా అర్ధిస్తున్న ఆయన భార్య గంగ, తల్లి మల్లమ్మ, తండ్రి మిద్దె పెద్ద లక్ష్మయ్యను పైదృశ్యంలో చూడవచ్చు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న బండరాయిపాకుల గ్రామానికి చెందిన నిర్వాసిత కుటుంబం. పొలం, నివసిస్తున్న ఇల్లుతో పాటు వారి జ్ఞాపకాలన్నీ ప్రాజెక్ట్లో తుడిచిపెట్టుకుపోయాయి. వచ్చిన పరిహారం ఫైనాన్స్ నిర్వాహకులకు ఫలహారంగా మారడం.. డబ్బులు వస్తాయో, రావోననే బెంగతో హరిబాబు కిడ్నీ వ్యాధి బారిన పడి మృతిచెందడంతో ఆ కుటుంబం కకావికలమైంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ సాఫీగా సాగుతున్న జీవితంలో.. మిద్దె మల్లమ్మ, పెద్ద లక్ష్మయ్యకు నలుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు కాగా.. మొదటి ముగ్గురు గతంలోనే బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలసవెళ్లారు. చిన్నకుమారుడు హరిబాబు కాగా.. పెద్దకొత్తపల్లికి చెందిన గంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ప్రస్తుతం పెద్ద కుమార్తె శ్రుతి ఇంటర్, శాన్వి ఏడు, సమీర నాలుగో తరగతి చదువుతున్నారు. హరిబాబు ఆటో, ట్రాక్టర్ నడుపుతూ వీరిని పోషించేవాడు. తల్లిదండ్రులు కూడా వీరితోనే ఉండేవారు. ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తున్న క్రమంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో ఆ కుటుంబం పొలం, ఇల్లును కోల్పోవాల్సి వచ్చింది. వచ్చిన పరిహారంలో హరిబాబు తనకు వచ్చిన వాటాలో నెలనెలా వడ్డీ వస్తుందనే ఆశతో 2021లో ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో పెట్టాడు. ఇదే వారి కుటుంబానికి శాపంగా మారింది. ఫైనాన్షియర్ల ఉచ్చులో పడి.. అనారోగ్యం పాలై.. ఫైనాన్స్లో రూ.5 లక్షలను జమచేయగా.. నిర్వాహకులు తొలుత నెలకు రూ.2 చొప్పున వడ్డీ చెల్లించారు. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో హరిబాబు నాగర్కర్నూల్లోని ఫైనాన్స్ కార్యాలయం, నిర్వాహకుల ఇళ్లకు నిత్యం తిరిగేవాడు. ఈ నేపథ్యంలో మనోవేదనకు గురై.. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సుమారు 8 నెలలు హైదరాబాద్లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో పునరావాసం కింద వచ్చిన ప్లాటును అమ్మి వైద్య చికిత్స చేయించారు. ఈ క్రమంలో 11 నెలల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. హరిబాబుకు ఆస్పత్రి ఖర్చులు రూ.10 లక్షలకు పైగా అయ్యాయని.. అయినా బతికించుకోలేకపోయామని.. ప్రస్తుతం అప్పుల కుప్ప అయిందని ఆయన కుటుంబసభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి గూడు లేకపోవడంతో ముంపులోని పాత బండరాయిపాకులలో తమ చేను వద్ద కవర్తో కప్పిన చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఫైనాన్స్ బోర్డు తిప్పేయడంతో బతుకు కుదేలు మనోవేదనతో కిడ్నీలు దెబ్బతిని భర్త హరిబాబు మృతి ఆస్పత్రుల్లో చికిత్సకు రూ.10 లక్షలు దాటిన ఖర్చు ముగ్గురు ఆడపిల్లలు, ముసలి అత్తామామలతో పోషణ భారం -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
● ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట: పేట–కొడంగల్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు అండగా ఉంటామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి భరోసానిచ్చారు. ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన ఊట్కూరు మండలం బాపూర్, దామరగిద్ద మండలంలోని బాపన్పల్లి, నారాయణపేట మండలంలోని పేరపళ్ల, కౌరంపల్లి శివారులోని దాదాపు 71 మంది రైతులకు చెందిన 51.36 ఎకరాల భూమికి సంబంధించిన రూ.7.7 కోట్ల నష్టపరిహారం చెక్కులను బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాంచందర్నాయక్ తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వలే.. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద భూములు ముంపునకు గురయినా ఇంత వరకు రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని, సీఎం రేవంత్రెడ్డి చొరవతోనే స్థానిక రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇన్నేళ్లు ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఎత్తిపోతల పథకం పూర్తయితే సస్యశ్యామలం అవుతుందన్నారు. భూనిర్వాసితులు నిరాశ చెందొద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిలో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతుల మేలు మరచిపోలేమని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, దామరగిద్ద విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, నారాయణపేట, దామరగిద్ద, ఊట్కూరు తహసీల్దార్లు అమరేంద్రకృష్ణ, తిరుపతయ్య, చింత రవి, ఆర్డీఓ ఆఫీస్ డీటీ బాల్రాజ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, మధు, కోట్ల రవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాన్ని వినియోగించుకోవాలి మరికల్: ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. మరికల్లోని నారాయణపేట రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ఆ దిశగా రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం దుకాణ యాజమాని ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సూర్యమోహన్రెడ్డి, వీరన్న, రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి, కృష్ణయ్య, హరీష్, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, ఆంజనేయులు, రాములు, శ్రీకాంత్రెడ్డి, రాజు, చెన్నయ్య, సత్యానారాయణ, దస్తన్న పాల్గొన్నారు. -
‘మత్తు రహిత జిల్లానే లక్ష్యం’
నారాయణపేట క్రైం: మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ.. నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల సమాజానికి, యువతకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, ఆర్ఐ నరసింహ, ఎస్ఐ సునీత, ఆర్ఎస్ఐలు శివశంకర్, కృష్ణ చైతన్య, శ్వేత, శిరీష, డీపీఓ, డీసీఆర్బీ, ఎస్బీ, ఐటీ కోర్ స్టాఫ్, ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను ఎస్పీ యోగేష్గౌతమ్ పరిశీలించారు. రానున్న రెండు రోజులలో భారీ వర్షాలు ఉన్నందున వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో కలిసి ఏర్పాట్లను చేయాలని, పరేడ్ మైదానంలో సాయుధ పోలీసుల కవాతు సజావుగా నిర్వహిచాలని అధికారులను ఆదేశించారు. వేడుకలను తిలకించడానికి వచ్చే అతిథులు, విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, ఆర్ఐ నరసింహ, ఆర్ఎస్ఐలు ఉన్నారు. -
అత్యవసరమైతేనే బయటకు రావాలి
నారాయణపేట: రానున్న 72 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం, మూగ జీవాలు ప్రాణాలు కోల్పోకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులకు సెలవులు రద్దు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రజలకు అండగా ఉండాలన్నారు. చెరువులు, కాలువల్లో చేపల వేటకు వెళ్లొద్దు లోతట్టు ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, కాల్వలు, నదులల్లో చేపల వేట, ఈత కోసం ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడం వంటివి చోటుచేసుకున్న సందర్భాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో సిబ్బందిని ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడైనా రోడ్లు తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు కొనసాగించాలన్నారు. పురాతన, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని పీహెచ్సీలు, ఆస్పత్రుల్లో సరిపడా మందులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు చోట్ల ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించామన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటామని తెలిపారు. జిల్లాలో మక్తల్ మంతన్గోడు వాగు, ఊట్కూరు మల్లేపల్లి నాగిరెడ్డిపల్లి, మరికల్ ఇబ్రహీంపట్నం వాగులు అలుగు పారుతున్నాయని ఆయా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్. శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, జెడ్పీ సీఈవో శైలేష్, ఆర్డీఓ రామచంద్రనాయక్, అధికారులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్కుసమాచారం ఇవ్వండి రెవెన్యూ, పోలీస్, వైద్యారోగ్య, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాల శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు రాబోయే మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించవచ్చని కలెక్టర్ సూచించారు. పరిస్థితులను బట్టి పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు సెలవులపై తగు నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్గౌతమ్ -
నేత్రపర్వంగా మహారథోత్సవం
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని రాఘవేంద్రస్వామి ఆలయంలో మంగళవారం ఉత్త ర ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మహారథోత్సవ వేడు కలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు సుప్రభాతం, నిర్మల్యం, పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ, భజ న, పల్లకీసేవా, మహిళల కోలాటాలతో కనకాభిషేకం చేశారు. అనంతరం మహా నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సింహాచారి, అనిల్దేశాయి, శ్రీపాద్, రఘు ప్రేమ్, రాఘవేంద్ర, బీంసేన్రావు, శేషు, సీతారామరావ్, ధరణిధర్, శ్రీధర్రావు, గోపినాథ్, మంజునాథ్ పాల్గొన్నారు. -
29వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్–ఎత్తిపోత ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మశ్చందర్ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి బల్రామ్ పూలదండలు వేసి ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్ ధర కనుగుణంగా పరిహారం అందించాలని రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నారు. భూ నిర్వాసితుల గోడును ప్రభుత్వం పెడచెవిన పెడితే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో చేపట్టిన వారిలో భీంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆశప్ప, అశోక్, దానప్ప, అన్వర్ చంద్రశేఖర్, అశోక్ , జైపాల్ గౌడ్, రాములు , వెంకటప్ప, మాశప్ప, అబ్దుల్ వహీద్ , చాకలి నర్సప్ప ఉన్నారు. -
‘నేను ఆడుకున్న మైదానం.. అభివృద్ధి చేస్తా’
మక్తల్: విద్యార్థిగా ఉన్నప్పుడు ఆడుకున్న మైదానం రుణం తీర్చుకుంటానని, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల, యువజన, మత్స్యసహకార, పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం స్థానిక మినీ స్టేడియం పరిసరాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను రాష్ట్ర స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలదేవి, డైరెక్టర్ రవీందర్రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. మినీ స్టేడియానికి రూ.20కోట్లు కేటాయించి అన్ని వసుతులు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. స్టేడియంలో ఉన్న పాత భవనాలు కూల్చేందుకు కలెక్టర్ అనుమతి ఇవ్వాలని కోరారు. మైదానంలో వాకింగ్, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్ కోర్టులను నిర్మిస్తామని తెలిపారు. రూ.3 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ షెడ్ నిర్మించామని తెలిపారు. జూనియర్, డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. అనంతరం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బంగారు, వెండి పతకాలను సాధించిన క్రీడాకారులను శాలువాతో సన్మానించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, లక్ష్మణ్, కట్ట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఊట్కూరు: మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 763లో రూ.1.50కోట్లతో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించేందుకు మంత్రి వాకిటి రెండు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, కోరం మహేష్రెడ్డి, యజ్ఞేశ్వర్రెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు. నర్వ: మండల కేంద్రంలోని జొన్నగుట్ట వద్ద 5.28 ఎకరాల స్థలంలో చేపట్టబోయే మైదాన స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలదేవీతో కలిసి మంత్రి పరిశీలించారు. గ్రౌండ్ నిర్మాణం కోసం రూ.2కోట్లు మంజూరు చేస్తానని తెలిపారు. అనంతరం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
ఉద్యానానికి ఊతం
నర్వ: ఉద్యాన పంటల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆయిల్పాం వంటి పథకాలను అమలు చేస్తూ రైతులకు రాయితీలను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యాన పంటల సాగును పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఏడాది పండ్ల తోటల సాగు తగ్గుతుండడంతో రాయితీని పెంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 16,600 ఎకరా ల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇందులో 3,500 ఎకరాల్లో కూరగాయలు, ఆయిల్ పాం 6,500 ఎకరాల్లో సాగవుతుండగా ప్ర భుత్వ రాయి తీతో పాటు గిట్టుబాటు ధర కల్పింస్తుడడంతో పండ్ల తోటలను తొలగించి ఆయిల్పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది. డ్రాగన్ఫ్రూట్కు అధిక రాయితీ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం ద్వారా పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గతేడాది డ్రాగన్ఫ్రూట్కు హెక్టార్కు రూ.1,60,000 రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచింది. బొప్పాయి సాగుకు గతేడాది ఇచ్చిన రూ.30 వేల రాయితీని కొనసాగిస్తోంది. మిర్చి, కూరగాయల సాగులో వాడుకునే మల్చింగ్కు ఈ ఏడాది రూ.20 వేలకు పెంచింది. మూడేళ్ల పాటు ఇదే రాయితీలను కొనసాగించనుంది. రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సాగుపై అవగాహన ప్రభుత్వం ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రైతులను ప్రోత్సహించేందుకు గతంలో కంటే సబ్సిడీని పెంచింది. పండ్ల తోటలు సాగు పెంచడానికి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యాన పంటల సాగు పద్ధతులు, లాభాలు గురించి వారికి వివరిస్తున్నాం. – వెంకటరమణ, క్లస్టర్ హార్టికల్చర్ అధికారి, మక్తల్ రైతులు సద్వినియోగం చేసుకోవాలి ప్రస్తుత మార్కెట్లో ఉ ద్యాన పంటలకు డిమాండ్ బాగా ఉంది. ప్రభుత్వం ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ రాయితీలను పెంచింది. జిల్లాలో భూములు ఉద్యాన పంటల సాగుకు అనువైనవి. సంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగు లాభాదాయకం. ఆసక్తి కలిగిన రైతులు హార్టికల్చర్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి. – సాయిబాబా, జిల్లా ఉద్యాన, పట్టపరిశ్రమ శాఖ అధికారి రాయితీని పెంచిన ప్రభుత్వం ఎంఐడీహెచ్ పథకం ద్వారా అమలు మూడేళ్ల పాటు సబ్సిడీ వర్తింపు జిల్లాలో 16,600 ఎకరాల్లో సాగు -
కానరాని పురోగతి!
గద్వాల: పదేళ్ల క్రితమే పూర్తికావాల్సిన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనులను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేసి.. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెబుతున్న అమాత్యుల హామీలు కేవలం సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగే ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది. నెరవేరని లక్ష్యం బీడు భూముల్లో సాగునీటిని పారించి వలసల పాలమూరు రూపురేఖలు మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి దివంగత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం కింద కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 1 0లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని సంకల్పించారు. అయితే వైఎస్సార్ అకాల మరణాంతరం పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుల పనులను పూర్తిచేయకుండా వదిలేయడంతో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా 10 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగునీరు పారుతోంది. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించినా.. గతేడాది సెప్టెంబర్లో జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు జడ్చర్ల వద్ద పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగలు తగిలాయి. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూసేకరణ సమస్యను పరిష్కరించాలని గ్రహించిన మంత్రులు.. భూసేకరణ ప్రక్రియతో పాటు పెండింగ్ పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించి వేగం పెంచాలని కలెక్టర్లకే బాధ్యత లు కట్టబెట్టారు. అయితే 10 నెలల కాలంలో ప్రాజెక్టుల పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ● 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు అసంపూర్తిగానే ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కింద 2.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. వివిధ కారణలతో రెండుపంపులు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులు పదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయ్యాయి. మొత్తం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. గూడ్డెందొడ్డి, ర్యాలంపాడు జలాశయాల కింద 1.45 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మోటార్ల నిర్వహణ కొరవడటంతో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తి నీటి పంపింగ్కు ఆటంకాలు ఏర్పడటం పరిపాటిగా మారింది. ● నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ర్యాలంపాడు జలాశయం గుండెకాయలాంటిది. అయితే రాక్టోల్, తూములు, ఆనకట్ట బండ్లో లీకేజీలు ఏర్పడటంతో నాలుగేళ్లుగా 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ వస్తున్నారు.గతేడాది పుణెకు చెందిన ఇంజినీరింగ్ నిపుణుల బృందం ర్యాలంపాడు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతుకు రూ.185 కోట్లు వ్యయం అవుతుందని నివేదించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చలనం లేదు. కొనసా..గుతున్న ‘పాలమూరు’ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సివిల్, మెకానికల్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అదే విధంగా పలు రిజర్వాయర్ల కింద భూ సేకరణకు సంబంధించి సమస్యలు పెండింగ్లో కొనసాగుతున్నాయి. ● మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు. గత పాలకులు కోయిల్సాగర్ పనులను పూర్తిచేయకపోవడంతో నేటికీ పెండింగ్లోనే ఉంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్న క్రమంలో మోటారు పంపులలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ కూడా నిర్వహణ లోపమే ప్రధాన కారణం. ● నారాయణపేట జిల్లాలో 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకం పనులు సైతం పెండింగ్లో కొనసాగుతున్నాయి. ఫలితంగా పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా మరమ్మతుకు నోచుకోని ర్యాలంపాడు రిజర్వాయర్ నేడు సమీక్ష.. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై సమీక్షించనున్నారు. ఉదయం సెషన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రాజెక్టులు, మఽధ్యాహ్నం సెషన్లో మహబూబ్నగర్ పార్ల మెంట్ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులపై కాలయాపన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమే ఊసేలేని ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతు మంత్రుల సమీక్షలు, క్షేత్రస్థాయిపర్యటనల్లో ప్రకటనలకే పరిమితం నేడు రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష -
సస్పెండ్ అయినా.. సగం జీతం వస్తుందిలే!
నారాయణపేట: ‘‘సస్పెండ్ అయితే ఏంటి.. సగం జీతం వస్తుంది కదా.. దాంతో జీవితాన్ని సరదాగా గడిపేస్తా’’ అని చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ సమాధానమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చా’ కథనానికి ఎంఈఓ భగీరథరెడ్డి స్పందించారు. ఈ మేరకు చిన్నధన్వాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడు రవిచందర్ తీరుపై విచారణ చేపట్టారు. అప్పటికే సదరు ఉపాధ్యాయుడు ఫూటుగా మద్యం తాగి వాటర్ట్యాంక్ వద్ద ఏదీ గుర్తులేకుండా నిద్రించాడు. ఎంఈఓ విద్యార్థులతో వివరాలు సేకరించగా.. తరగతి గదిలోనే మద్యం తాగి నిద్రిస్తాడని.. మద్యం మత్తులో తమను ఇష్టం వచ్చినట్లు తిడతాడని విద్యార్ధులు ఎంఈఓతో వాపోయారు. ఈ క్రమంలోనే వాటర్ట్యాంక్ వద్ద మద్యం మత్తులో నిద్రిస్తున్న సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంఈఓతో అతడు మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న సమస్యల కారణంగా పిల్లల సంఖ్య తగ్గుతుందని, అందుకు తామేమి చేస్తామని బదులిచ్చారు. అయితే విద్యార్థులతో పుస్తకాలు చదివించవమని ఎంఈఓ సూచించగా, మద్యం మత్తులో ఊగుతూ.. తూగుతూ నానా తంటాలు పడ్డాడు. పాఠశాలలోనే మద్యం తాగే నీపై చర్యలు తప్పవని ఎంఈఓ అనగా.. పర్లేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అనంతరం ఎంఈఓ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తమ విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలే అని అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విచారణ చేసి వదిలేశారని.. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారో లేదోనని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
గుండె పగిలిపోయి..
ఒక్కొక్కరుగా ‘పాలమూరు–రంగారెడ్డి’ నిర్వాసితుల మృత్యువాత చనిపోయిన తన భర్త పస్పుల శేఖర్ ఫొటోను చూపిస్తున్న మహిళ పేరు పార్వతమ్మ. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరాయిపాకుల గ్రామానికి చెందిన ఆ దంపతులకు ముగ్గురు సంతానం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగమైన ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో వీరికి ఉన్న ఎకరం భూమి ముంపునకు గురైంది. ఎకరాకు రూ.3.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.2 చొప్పున వడ్డీ ఇస్తామని నమ్మబలకడంతో శేఖర్ రూ.2 లక్షలను ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్ కంపెనీలో జమచేశాడు. ఆరునెలల్లో డబ్బులు తిరిగిస్తామని పత్రం రాసివ్వగా, మూడేళ్లు గడిచినా డబ్బులు ఇవ్వలేదు. పైసలు రావడం లేదన్న బెంగతో 2023 ఆగస్టు 26న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పునరావాసం కింద నిర్మించుకుంటున్న ఇల్లు సైతం డబ్బులు లేక అసంపూర్తిగానే ఉండగా.. పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని భార్య పార్వతమ్మ వాపోతోంది. -
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
మక్తల్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నానని పశుసంవర్ధక, మత్స్య, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంని తెలిపారు. బుధవారం ఆయన మక్తల్ పెద్ద చెరువు అలుగును పరిశీలించారు. నల్లజానమ్మ ఆలయం వద్ద నూతనంగా రోడ్డుడ్యాం నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. నియోజకవర్గ కేంద్రానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరయ్యిందని పేర్కొన్నారు. దీంతో పేద విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అన్ని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే రూ.833.50 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో భాగంగా రూ.15.13 కోట్లు కేటాయించామన్నారు. అందరి సహాకారంతో మక్తల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, ఆనంద్గౌడ్, నాగరాజు, నారాయణ, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానిక కృషి మక్తల్లో రాష్ట్ర ఉత్పత్తులదారుల సంఘాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచేందుకు సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సహకార పద్ధతిలో దళారి వ్యవస్థకు తావులేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్లో రైతులకు భాగస్వామ్యం పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, తిరుపతి, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ మాద్వార్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొంబాయి నర్సిములు, ఉందెకోడ్ సాబెన్న అనారోగ్యంతో మృతి చెందడంతో మంత్రి వాకిటి శ్రీహరి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దు
నారాయణపేట రూరల్: జీఓ 69 కింద నిర్మిస్తున్న నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అన్యా యం చేయొద్దని నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పేరపళ్ల నుంచి కాడెద్దులతో నారాయణపేట జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి పాదయా త్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ అమ్మకో ళ్లు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ మార్కె ట్కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం భూనిర్వాసితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నా రు. ఈ ప్రాంతానికి నీళ్లు రావడం ఎంతో సంతోషదాయకమని.. అదే సమయంలో ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకు త్యాగం చేస్తున్న భూనిర్వాసితులకు న్యా యం చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు న్యా యం అందే దాకా ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యపై పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా.. న్యాయం చేసేందుకు ముందుకు రావడంలో ఆలస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ అమరేందర్ కృష్ణ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వేపూర్ రాము లు, ఆంజనేయులు, కాశీనాథ్, మచ్చేందర్, బలరాం, గోపాల్, ధర్మరాజు, భీమప్ప పాల్గొన్నారు. కాడెద్దులతో పాదయాత్రగాజిల్లాకేంద్రానికి వచ్చిన నిర్వాసితులు -
ఆందోళన చేపడతాం..
పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే దాదాపు 150 మంది చనిపోయారు. ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి ప్రోద్బలంతోనే అందరూ ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబుతో కలిసి పక్కా ప్లాన్తో బోర్డు తిప్పేశాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి.. వారి ఆస్తులను గ్రామాల వారీగా బాధిత రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు పరిహారం చెల్లించకుంటే.. పోరు కార్యాచరణ ప్రకటించి.. ఆందోళన చేపడతాం. ఆయా నిందితుల ఇంటి వద్ద వాంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతాం. మా బాధను అందరూ అర్ధం చేసుకోవాలి. – బంగారయ్య, బాధితుడు, బండరాయిపాకుల -
ఇదేం గడువు?
రైతు బీమా దరఖాస్తుకు 8న సర్క్యూలర్ జారీ.. 13 చివరి తేదీ నారాయణపేట: రైతు బీమా పథకం 2025–26 కు సంబంధించి దరఖాస్తులకు ఈ నెల 8న రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి సర్క్యూలర్ జారీ చేశారు. 2024– 25 బీమా గడువు ఈ నెల 13కు ముగుస్తోంది. మళ్లీ 2025–26 కు ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. అయితే రైతు బీమాలో చేరేందుకు రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. జూన్ 5 నాటికి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసిన రైతులకు ఈ పథకంలో చేరే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. 6వ తేదీ నుంచి జారీచేసిన పాస్ పుస్తకాలను ఈ ఏడాదికి పరిగణనలోకి తీసుకోమని వ్యవసాయశాఖ వెల్లడించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,15,244 రైతులు బీమా పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు. ఇందులోంచి 59–60 ఏళ్ల వయసున్న రైతులను తొలగిస్తారు. జిల్లా వ్యాప్తంగా కొత్త పట్టా పాసుపుస్తకాలు 8,915 ఉండగా సోమవారం నాటికి 1,652 మంది రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండిన రైతులను కొత్త లబ్ధిదారులుగా చేర్చనున్నారు. మిగిలింది రెండు రోజులే.. ప్రభుత్వం ఈ నెల 8న దరఖాస్తుల స్వీకరణకు సర్క్యూలర్ జారీ చేసింది. శని, ఆదివారం రెండు రోజులు సెలవులు కావడంతో బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు రైతులకు వీలు కలగలేదు. కాగా సోమవారం ఒక రోజు ముగియగా ఈ పథకం పునరుద్ధరణకు రెండు రోజులే గడువు మిగిలినట్లయింది. రైతులే స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనతో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నామని వాపోతున్నారు. ధ్రువీకరణ పత్రాలు.. ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న రైతులే అర్హులు. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో జన్మించిన వారికే అవకాశం. తాజాగా వ్యవసాయ శాఖ చేపడుతున్న కసరత్తులో.. 18 ఏళ్లు నిండి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులను ఈ పథకంలో చేరుస్తున్నారు. 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు. వ్యవసాయ అధికారులు (ఏఓలు), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)ల వద్ద రైతు బీమా పత్రాలు తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు కాపీ జతచేసి, దరఖాస్తు పత్రంపై సంతకం చేసి ఏఈఓకు అందజేయాలి. అదేక్రమంలో నామినీ ఆధార్ కార్డు, వివరాలను ఏఈఓలకు ఇవ్వాలి. ● శని, ఆదివారాలు సెలవులే మూడు రోజుల గడువుతో తిప్పలు జిల్లాలో కొత్త పట్టా పాసుపుస్తకాలు 8,915 వచ్చిన దరఖాస్తులు 1,652 -
No Headline
పరిహారం డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే దాదాపు 150 మంది చనిపోయారు. ఆర్అండ్ఆర్ కమిటీ చైర్మన్గా ఉన్న నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్రెడ్డి ప్రోద్బలంతోనే అందరూ ఓం శ్రీసాయిరాం ఫైనాన్స్లో డబ్బులు పెట్టారు. ఫైనాన్స్ నిర్వాహకుడు సాయిబాబుతో కలిసి పక్కా ప్లాన్తో బోర్డు తిప్పేశాడు. ఫైనాన్స్ కంపెనీ వాళ్లు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి.. వారి ఆస్తులను గ్రామాల వారీగా బాధిత రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. మాకు పరిహారం చెల్లించకుంటే.. పోరు కార్యాచరణ ప్రకటించి.. ఆందోళన చేపడతాం. ఆయా నిందితుల ఇంటి వద్ద వాంటావార్పు వంటి కార్యక్రమాలు చేపడతాం. మా బాధను అందరూ అర్ధం చేసుకోవాలి. – బంగారయ్య, బాధితుడు, బండరాయిపాకుల -
No Headline
మా తల్లిదండ్రుల పేరిట ఉన్న 8 ఎకరాలు మొత్తం ప్రాజెక్ట్లోనే పోయింది. పరిహారం కింద వచ్చిన డబ్బులను మా తల్లిదండ్రుల పేరిట రూ.10 లక్షలు, నా పేరిట మరో రూ.2 లక్షలు ఫైనాన్స్ కంపెనీలో జమచేశాం. 2019లో డబ్బులు జమచేస్తే నాలుగేళ్లయినా తిరిగి ఇవ్వలేదు. మా అమ్మ లక్ష్మమ్మకు పక్షవాతం వస్తే, చికిత్స చేయించేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏడాది కిందట చనిపోయింది. జీవనాధారమైన భూములు కోల్పోయి, డబ్బులు పోగొట్టుకుని అరిగోస పడుతున్నాం. – అలివేలు, బండరాయిపాకుల, రేవల్లి, వనపర్తి -
భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దు
● కాడెద్దులతో పాదయాత్రగాజిల్లాకేంద్రానికి వచ్చిన నిర్వాసితులు నారాయణపేట రూరల్: జీఓ 69 కింద నిర్మిస్తున్న నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అన్యా యం చేయొద్దని నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం పేరపళ్ల నుంచి కాడెద్దులతో నారాయణపేట జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి పాదయా త్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీపీ అమ్మకో ళ్లు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ మార్కె ట్కు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం భూనిర్వాసితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నా రు. ఈ ప్రాంతానికి నీళ్లు రావడం ఎంతో సంతోషదాయకమని.. అదే సమయంలో ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకు త్యాగం చేస్తున్న భూనిర్వాసితులకు న్యా యం చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు న్యా యం అందే దాకా ఈ పోరాటం, ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యపై పలుమార్లు ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా.. న్యాయం చేసేందుకు ముందుకు రావడంలో ఆలస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ అమరేందర్ కృష్ణ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వేపూర్ రాము లు, ఆంజనేయులు, కాశీనాథ్, మచ్చేందర్, బలరాం, గోపాల్, ధర్మరాజు, భీమప్ప పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తం మద్దూరు: కొన్ని రోజులుగా కుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, సిబ్బంది ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మద్దూరులోని సీహెచ్సీ, బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశానే. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉండే మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. చిన్న పిల్లల వార్డును పరిశీలించి వైద్య నిఫుణుడు క్రాంతికిరణ్తో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 30 బెడ్లు సరిపోవడం లేదని, బెడ్ల సంఖ్యను పెంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పక్కనే ఉన్న పీహెచ్సీలో 5 బెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు ఆదేశించారు. మెస్ కమిటీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. రోజూ అందించే భోజనం, అల్పాహారం నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్గౌడ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ తక్షణ స్పందన..వృద్ధురాలికి స్వాంతన నారాయణపేట: ‘కొడుకు, కోడలు ఉన్నా.. నిరాధరణకు గురై నడవలేని స్థితిలో ఉన్న పట్టణానికి చెందిన వృద్ధురాలు రుక్మిణి తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్కు రావడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ తక్షణం స్పందించారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడానికి తన కుమార్తెల సహాయంతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి వద్దకే కలెక్టర్ వెళ్లి విషయంపై ఆరా తీశారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం పొందిన కొడుకు తనకు తిండి పెట్టడం లేదని, కోడలు సైతం వేధింపులకు దిగుతోందని వృద్ధురాలు వాపోయింది. స్పందించిన కలెక్టర్ వృద్ధురాలికి వీల్చైర్ తెప్పించారు. అనంతరం ఆమెకు సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించాలని సూచించడంతో పాటు విచారణ చేసి కొడుకుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రాంచందర్ను ఆదేశించారు. -
‘ప్రజావాణి’ ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 22 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తం మద్దూరు: కొన్ని రోజులుగా కుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, సిబ్బంది ఆస్పత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మద్దూరులోని సీహెచ్సీ, బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశానే. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఉండే మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. చిన్న పిల్లల వార్డును పరిశీలించి వైద్య నిఫుణుడు క్రాంతికిరణ్తో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న 30 బెడ్లు సరిపోవడం లేదని, బెడ్ల సంఖ్యను పెంచాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ పావని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. పక్కనే ఉన్న పీహెచ్సీలో 5 బెడ్లను వినియోగించుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్కు ఆదేశించారు. మెస్ కమిటీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ.. రోజూ అందించే భోజనం, అల్పాహారం నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచాలని మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్గౌడ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ తక్షణ స్పందన..వృద్ధురాలికి స్వాంతన నారాయణపేట: ‘కొడుకు, కోడలు ఉన్నా.. నిరాధరణకు గురై నడవలేని స్థితిలో ఉన్న పట్టణానికి చెందిన వృద్ధురాలు రుక్మిణి తనకు న్యాయం చేయాలని కలెక్టరేట్కు రావడంతో కలెక్టర్ సిక్తాపట్నాయక్ తక్షణం స్పందించారు. కలెక్టరేట్ మెట్లు ఎక్కడానికి తన కుమార్తెల సహాయంతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి వద్దకే కలెక్టర్ వెళ్లి విషయంపై ఆరా తీశారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం పొందిన కొడుకు తనకు తిండి పెట్టడం లేదని, కోడలు సైతం వేధింపులకు దిగుతోందని వృద్ధురాలు వాపోయింది. స్పందించిన కలెక్టర్ వృద్ధురాలికి వీల్చైర్ తెప్పించారు. అనంతరం ఆమెకు సఖీ కేంద్రంలో ఆశ్రయం కల్పించాలని సూచించడంతో పాటు విచారణ చేసి కొడుకుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ రాంచందర్ను ఆదేశించారు. -
ఎట్టకేలకు..!
సమస్య మాది కాదు.. జూరాల జలాశయం క్రస్ట్గేట్ల రోప్లు మొరాయిస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్త అవాస్తవం. విద్యుదుత్పత్తి కోసం ఆరు బ్లాక్లకు నీటిని వదులుతున్నాం. వాటికి సంబంధించిన వ్యవహారం జెన్కో అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రాజెక్టు 64 క్రస్ట్గేట్ల రోప్లు బాగానే ఉన్నాయి. ఎలాంటి ముప్పులేదు. – ఖాజా జుబేర్ అహ్మద్, ప్రాజెక్టు ఈఈ, గద్వాల ప్రారంభించాం.. రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ టర్బైన్ను మరమ్మతుల తర్వాత ఆదివారం ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన బ్లాక్ బురదలో పూడుకుపోవడంతో రోప్ ద్వారా సాధ్యం కాకపోవడంతో క్రేన్ల సాయంతో పైకెత్తాం. అంతేగాని రోప్లు తెగిపోయాయనే మాటాల్లో వాస్తవం లేదు. – పవన్కుమార్, డీఈ, జెన్కో జూరాలలో 3వ యూనిట్ వినియోగంలోకి ●● రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన వైనం ● బాగు చేసి ఆదివారం క్రేన్ల సాయంతో బ్లాక్ను పైకెత్తి నీటి సరఫరా ● ప్రాజెక్టుపై మూడుగంటల పాటు నిలిచిన వాహనాలు ●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండేళ్ల కిందట మరమ్మతుకు గురైన 3వ యూనిట్ను జెన్కో అధికారులు బాగు చేయించారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించే సమయంలో వాటికి సంబంధించిన బ్లాక్ పూడుకుపోవడంతో క్రేన్లను రప్పించి వాటి సాయంతో బ్లాక్ను పైకెత్తడంతో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో జూరాల క్రస్ట్ గేట్లకు సంబంధించిన రోప్లు మొరాయించడంతో క్రేన్ల సాయంతో పైకెత్తుతున్నారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. జూరాలకు మళ్లీ సమస్య తలెత్తిందా.. ప్రాజెక్టు భద్రమేనా అనే విషయాలను పరిసర గ్రామాల ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. సమస్య క్రస్ట్ గేట్లదు కాదని.. జెనన్కో సమస్య అంటూ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ● జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని ఆరు యూనిట్లకు 12 గేట్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. వరద నిలిచిపోతే గేట్లు మూసివేస్తారు. వీటికి సంబంధించిన గేట్ల రోప్లు అప్పుడప్పుడు మొరాయించడం సాధారమేనని, వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని జెన్కో సిబ్బంది వెల్లడిస్తున్నారు. రెండేళ్ల కిందట.. జూరాల ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లకుగాను మూడో యూనిట్కు సంబంధించిన టర్బైన్ రెండేళ్ల కిందట కాలిపోయింది. మరమ్మతుకుగాను జెన్కో అధికారులు టెండర్లు ఆహ్వానించగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అలస్యంగా చేపట్టారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తవడంతో అధికారులు విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 3వ యూనిట్కు నీటిని సరఫరా చేసే బ్లాక్ బురదలో ఇరుక్కొని పైకెత్తేందుకు మొరాయించడంతో అధికారులు కర్ణాటక నుంచి అధునాతన క్రేన్లను రప్పించి వాటి సాయంతో పనులు పూర్తి చేశారు. భారీగా నిలిచిన వాహనాలు జూరాల హైడల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్ బ్లాక్ను పైకెత్తే సమయంలో జెన్కో అధికారులు ఆనకట్టపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 వరకు మరమ్మతులు భారీ క్రేన్ల సాయంతో చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాజెక్టుపై తాగేందుకు కనీసం నీరు సైతం లభించలేదు. ఎలాంటి సమాచారం లేకుండా రాకపోకలు నిలిపివేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించినా సమస్యను వినేవారే కరువయ్యారు. -
ముమ్మరంగా వరి నాట్లు
మక్తల్: మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం అంటే ఒకప్పుడు వలసల ప్రాంతంగా పేరొందింది. కానీ నియోజకవర్గంలో సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా ఆయకట్టుకు నీరు వదులుతుండడంతో వలసలు తగ్గి గ్రామాలు కళకళలాడుతున్నాయి. దీంతో రైతులు ఏడాదిలో వానాకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. భూత్పూర్ రిజర్వాయర్ కింద మక్తల్, నర్వ మాగనూర్, కృష్ణ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో 45 వేల ఎకరాల ఆయకట్టు, సంగంబండ రిజర్వాయర్ ద్వారా మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా నియోజకవర్గంలో 1.10లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. కృష్ణా నది నుంచి.. కృష్ణానది బ్యాక్ వాటర్లో భాగంగా పంచదేవవ్పహాడ్ భీమా కాల్వ స్టేజ్ 1 నుంచి చిన్నగోప్లాపూర్ పంప్హౌజ్కు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాల్వ రెగ్యూలేటర్ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్కు, కానాపూర్కు నీరు వస్తుంది. కానాపూర్ స్టేజ్ 2 నుంచి సంగంబండ రిజర్వాయర్ను నింపుతారు. అనంతరం కాల్వ ద్వారా మక్తల్ చెరువును నింపుతారు. సంగంబండ బ్యాక్వాటర్ నుంచి ఉజ్జెల్లి, సోమేశ్వర్బండ, మాద్వార్, సంగంబండ గ్రామాలకు చెందిన రైతులు పైపులైన్ల నుంచి పంటలు సాగు చేసుకుంటున్నారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల కింద ఆయకట్టు 1.1లక్షల ఎకరాలకు సాగునీరు -
ఎకరాకు రూ.60లక్షల నష్టపరిహారం ఇప్పించండి
నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ముంపుకు గురవుతున్న భూములకు తగిన నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదివారం ఎంపీ డీకే అరుణను దేవరకద్రలో ఊట్కూర్కు చెందిన భూ నిర్వాసితులు కలిసి విన్నవించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద ౖపైడ్లెన్, కాలువలు, ఎఫ్టీఎల్ స్థాయిలో నీరు నిల్వ ఉంచే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ పనుల కారణంగా తమ గ్రామ పరిధిలోని సుమారు 400 ఎకరాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ భూములను కోల్పోతే తమ జీవనోపాధి కోల్పోతమంటూ ఎంపీ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ గ్రామ పరిధిలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరాకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతుందని అయితే, అధికారులు పాత రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు వాపోయారు.తమకు ఎకరాకు రూ.60లక్షల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అలాగే తమ గ్రామ పరిధిలో పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, ప్రభావిత ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇందుకు ఎంపీ స్పందించి ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు వడ్ల మోనప్ప, భూ నిర్వాసితులు తరుణ్రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
‘సంగంబండ’ మూడు గేట్లు ఎత్తివేత
మక్తల్: ఎగువ నుంచి వస్తున్న వరదతో మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ సంగంబండ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ డీఈ సురేష్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని ఇడ్లూర్ పెద్దవాగు నుంచి రిజర్వాయర్కు వరద కొనసాగుతుందన్నారు. దేశభక్తికి యాత్ర స్ఫూర్తి నర్వ: అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజ్లింగ్ రాజ్ కలశ యాత్ర దేశభక్తికి, యాదవుల ఐక్యతకు స్ఫూర్తినిస్తుందని నర్వ మండల యాదవ సంఘం అధ్యక్షుడు మల్లేష్యాదవ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన ఈ యాత్రకు ఆదివారం నారాయణపేట జిల్లాలో సంఘీబావం తెలుపుతూ.. స్వాగతం పలికామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాత్రతో భారత యాదవ జవాన్ల వీరత్వాన్ని, దేశభక్తిని, అహిర్ రెజిమెంట్ ఆవస్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లే మహా ఉద్యమంగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అయ్యలన్న యాదవ్, శేఖర్యాదవ్, గుర్లపల్లి మొగిలప్ప, రామంచంద్రి, ఎర్రగుంట వెంకటప్ప, కుర్వ అయ్యలప్ప తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త నారాయణపేట క్రైం: ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసపూరిత ప్రకటనలను చూసి అత్యాశకు పోయి మోసపోవద్దని ఎస్పీ యోగేష్గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్నారు. అధిక లాభాలకు ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టొద్దని, సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ను చూసి మోసపోవద్దన్నారు. ఆన్లైన్ యాప్ల నుంచి రుణాలు తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు లేదా 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందిచాలన్నారు. రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని పరిమళగిరిపై వెలసిన రాఘవేంద్రస్వామి మఠంలో 354వ ఆరాధన ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్వారాధన వేడుకలు, వివిధ పూజా కార్యక్రమాల ను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సు ప్రభాతసేవ, పాదపూజ, కనకాభిషేకం, వివిధ రకాల ఫలాలతో కూడిన ఫలపంచామృతాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి బృందావనానికి అభిషేకం జరిపారు. అలాగే అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, నైవేద్యం, అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించారు. హస్తోదకం, మహామంగళహారతి ఇచ్చి.. సాయంత్రం స్వామివారిని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివా రి ఆరాధనోత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. ఆరా ధనోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వేడుకలు జరపనున్నారు. రిజర్వేషన్లను ఆమోదించాలి అడ్డాకుల: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేదంటే బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అడ్డాకులలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. -
జోరు వాన..
నారాయణపేట: వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పగలు ఎండ, ఉమ్మరంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. రాత్రి వేళలో ఎక్కడపడితే అక్కడ రెండు, మూడు గంటల పాటు వర్షం దంచికొడుతుంది. జిల్లాలో అత్యధిక వర్షపాతం మద్దూరు మండలంలో నమోదు కాగా నారాయణపేట, ధన్వాడ, గుండుమాల్లో సాధారణ వర్షపాతం, మిగతా 9 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో జూన్, జూలైలో వర్షాలు అంతంత మాత్రంగానే పడ్డాయి. కానీ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 769 చెరువులు, కుంటలు, భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతుంది. అత్యవసర సమయంలో.. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో వర్షాలతో ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే కంట్రోల్రూం ఫోన్ నంబర్ 9154283913 సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని చెరువుల్లో చేరిన నీటి శాతం ఇలా.. బయటికి వెళ్లాలంటేనే.. జిల్లాలో మండలాల వారీగా వర్షం మి.మీలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రాకపోకలకు ఇబ్బందులు భారీ వర్షాలు వస్తే మక్తల్ మండలంలోని కర్నె చెరువు వద్ద, చిట్యాల, ముసలయ్యపల్లి, పారేవుల గ్రామాల మధ్య ప్రధాన కల్వర్టులు వద్ద రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుంది. కల్వర్టుపైన నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నీరు పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. పసుపుల సమీపంలో దత్తక్షేత్రం, కురుమగడ్డ, నారగడ్డ, రామలింగేశ్వర ఆలయాలు ఉండడంతో మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని భక్తులు వస్తుంటారు. కల్వర్టు ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలకు కోరుతున్నారు. ఊట్కూర్ మండలంలోని మల్లెపల్లికి వేళ్లే రహదారిలో కల్వర్టుపై వరద పారుతుండడంతో వారం రోజులుగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు నిండుతున్న చెరువులు, పారుతున్న కుంటలు మద్దూర్ మండలంలో అత్యధిక వర్షపాతం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154283913 -
మాకో న్యాయమా?
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.24 లక్షలు పరిహారం ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. పేట– కొడంగల్ ప్రాజెక్టులో ఎకరాకు రూ.14 లక్షలు ఇవ్వడం న్యాయమేనా? ఇప్పటికై నా ఎకరాకు రూ.30 లక్షలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కేశవులు, భూ నిర్వాసితుడు, కాట్రేవుపల్లి, మక్తల్ మండలం ముంపు గ్రామంగా ప్రకటించాలి ఊట్కూర్ గ్రామానికి 100 మీటర్ల దూరంలో పెద్ద చెరువు ఉంది. ఇప్పటికే చెరువు నిండితే ఇంటి పరిసరాల్లో ఊట నీరు వస్తుంది. భవిష్యత్తులో రిజర్వాయర్ నిర్మిస్తే ఊరంతా ఊటవచ్చే పరిస్థితి ఉంది. విష పురుగులు, పాముల బెడద, రోగాలు ప్రబలే అవకాశం లేకపోలేదు. అందుకే గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి. – వడ్ల మోనప్ప, మాజీ వార్డు సభ్యుడు, ఊట్కూర్ ప్రభుత్వం స్పందించాలి భూ నిర్వాసితులు గత 26 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. – బలరాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నారాయణపేట ● -
ఉద్యోగం సాధించడమే లక్ష్యం..
వాలీబాల్ అంటే చాలా ఇష్టం. వాలీబాల్ అకాడమీకి ఎంపికై నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎస్జీఎఫ్ అండర్– 14, అండర్– 14 రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాను. గతేడాది సీఎం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా ద్వితీయ స్థానం వచ్చింది. భవిష్యత్లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా. – ప్రశాంత్, పల్లెగడ్డ, మహబూబ్నగర్ రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ మొదటిసారి వాలీబాల్ అకాడమీకి ఎంపికయ్యాను. రెండేళ్ల నుంచి ప్రాక్టిస్ చేస్తున్న. సిద్ధిపేట, మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్కు వెళ్లాను. ఈ రెండింట్లో కూడా ఎంపికయ్యాను. కానీ, మహబూబ్నగర్ అకాడమీలో చేరాను. ఇక్కడ వసతులు బాగున్నాయి. అటాకర్గా శిక్షణ తీసుకుంటున్న. – నరేష్, ఇప్పలపల్లి, రంగారెడ్డి -
అంజనీపుత్రా.. పాహిమాం
మద్దూరు: మండలంలోని దోరేపల్లి శివారులో తండాలో ఆంజనేయస్వామి జాతర అంగరంగ వైభవంగా సాగాయి. శనివారం దోరేపల్లి గ్రామంలోని వీరప్ప ఇంటి నుంచి స్వామివారి ప్రతిమను ఎండ్లబండ్ల ఊరేగింపు నడుమ ఆయానికి తీసుకువచ్చారు. గ్రామస్తులు అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. బావి నుంచి నీటిని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. జాతర సందర్భంగా మిఠాయిలు, ఆట వస్తువుల దుకాణాల్లో రద్దీ నెలకొంది. జాతరలో ఎలాంటి అంవచానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దోరేపల్లి నుంచి స్వామివారిని ఎడ్లబండ్ల ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకొస్తున్న భక్తులు కల్యాణ.. వైభోగమే -
ఔత్సాహికులకు వరం.. వాలీబాల్ అకాడమీ
మహబూబ్నగర్ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీడాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచేవారు. అప్పట్లో ఈ వాలీబాల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులుగా ఎదిగారు. అయితే నిధుల నిర్వహణ భారంతో 2008 సంవత్సరంలో వాలీబాల్ అకాడమీని మూసివేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల కృషి, అధికారుల చొరవతో మరోసారి వాలీబాల్ అకాడమీ ఏర్పాటై.. పూర్వవైభవం సంతరించుకునే దిశగా ముందుకు సాగుతోంది. అధునాతన సౌకర్యాలతో.. మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంలో నూతన వాలీబాల్ అకాడమీ రూ.19.70 లక్షల నిధులతో ఏర్పాటు చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు నిర్మించారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్ 12న వాలీబాల్లో అకాడమీలో ప్రవేశాల కోసం సెలక్షన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి బాల, బాలికలు హాజరయ్యారు. అకాడమీలో 32 మంది బాలురు, బాలికలు ప్రవేశాలు పొందారు. స్విమ్మింగ్పూల్ అంతస్తులో బాలురకు, ఇండోర్ స్టేడియంలో బాలికలకు వసతి ఏర్పాటు చేశారు. అదేవిధంగా భోజన వసతి కల్పించారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలు పొందిన బాల, బాలికలకు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒక కోచ్ ఉండగా త్వరలో మరో కోచ్ రానున్నారు. కోచ్ పర్వేజ్పాషా క్రీడాకారులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళలో రిక్రియేషన్ గేమ్, స్టెచ్చింగ్ ఫ్లెక్సిబిలిటీ, గ్రౌండ్ మూమెంట్, బాల్ డ్రిల్స్, సా యంత్రం బ్లాకింగ్, అటాకింగ్ డ్రిల్స్, బాల్ ప్రాక్టిస్పై శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతి శుక్రవారం ఐదు సెట్ల మ్యాచ్ ఆడిపిస్తున్నారు. మహబూబ్నగర్లో నూతన వాలీబాల్ స్టేడియం ఏర్పాటు శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాల క్రీడాకారులు బాల, బాలికలకు మెరుగైన వసతి సౌకర్యాలు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా ముందుకు.. -
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ ప్రవేశాలు
కోస్గి రూరల్: కోస్గి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11 స్పాట్ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమో కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కేటాయించిన కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనేశ్వరుడికి తైలాభిషేకాలు బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు శనేశ్వరాలయాన్ని సందర్శించి తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం స్వామివారికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: అమరరాజా కంపెనీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. మహబూబ్నగర్ నగర పరిధిలోని దివిటిపల్లి ఐటీ పార్క్లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇక్కడ యువతకు మూడు నెలలపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ ఇస్తారన్నారు. కేవలం అమరరాజా కంపెనీ కోసమే కాకుండా అభ్యర్థులు ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందేలా శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. మహబూబ్నగర్ను విద్య, వైద్య, రవాణా రంగాల్లో అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఇంజినీరింగ్, లా, ఐఐఐటీ కళాశాలలను మంజూరు చేశారన్నారు. మహబూబ్నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహకారంతో మహిళలకు స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రానున్న పదేళ్లలో కనీసం 20 వేల మంది యువత నైపుణ్య శిక్షణ పొందేలా యత్నిస్తున్నామన్నారు. అనంతరం శిక్షణ పొందే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ జయకృష్ణ, ఓఎస్ఎస్ఐ సీఈఓ సలీంఅహ్మద్, నాయకులు సిరాజ్ఖాద్రీ, అజ్మత్అలీ, అవేజ్, హన్మంతు, శివశంకర్, రాషెద్ఖాన్, ఖాజాపాషా, శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి కందనూలు: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని కోరారు. 317 జీఓ బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్రావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా మాజీ అధ్యక్షుడు సుదర్శన్ ఉన్నారు. -
సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలి
ధన్వాడ: అదివాసుల సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు ఇప్పటి విద్యార్థులు తెలియజేయాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ రాజారాం అన్నారు. ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోరాటయోధడు కొమరం బీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి ఆదివాసి హక్కులను గుర్తించిందని అన్నారు. 1994 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం రాఖీపండుగ వేడుకలను నిర్వహించారు. ఇందులో వైస్ప్రిన్సిపల్ సాంబయ్య, సాయిబాబు, నరేంద్రమూర్తి, తిమ్మప్ప, నరేందర్, గోపినాయక్, లాలుప్రసాద్, సంజీవ్, నర్సిములు, రుక్మిణిబాయి తేజ పాల్గొన్నారు. -
సీఎం హామీ నిలబెట్టుకోవాలి
నారాయణపేట రూరల్: జీవో 69 కింద నిర్మిస్తున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో భూ నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భూ నిర్వాసితుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు న్యాయమైన, ఆమోదయోగ్యమైన పరిహారం ఇవ్వలని కోరారు. రైతులకు 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా, ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబానికి ఉద్యోగం కల్పించాలని కోరారు. రిలే దీక్షలు 25వ రోజుకు చేరినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. రిజిస్ట్రేషన్ విలువల మేరకు పరిహారం ఇవ్వడం భూముల విలువను తీవ్రంగా తగ్గిస్తుందని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి తక్షణమే స్పందించి పరిహారంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. రైతులు భూములు కోల్పోతే భవిష్యత్తులో రైతు భరోసా, రైతుబంధు, బ్యాంకు రుణాలు అన్ని కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రైతులను పక్కదోవ పట్టించే మాటలు మాట్లాడడం సరికాదని, వేరువేరుగా ఉద్యమాలు చేసే విధంగా ప్రోత్సహించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు మచ్చేందర్, గోపాల్, బాల్రాం, ధర్మరాజు పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.8,559 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.8,559, కనిష్టంగా రూ.4,591 ధరలు పలికాయి. అలాగే, ఎర్ర కందులు గరిష్టం, కనిష్టంగా రూ.6,469 ధర పలికింది. పాత అలుగుకు చేరిన కోయిల్సాగర్ నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో నీటిమట్టం పాత అలుగు స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. శుక్రవారం సాయంత్రం వరకు అలుగు మట్టానికి నీరు చేరింది. ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా.. మరో 6 అడుగుల నీరు చేరితే గేట్లను తెరిచే అవకాశం ఉంటుంది. గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎడమ కాల్వను మూసివేయగా.. కుడి కాల్వలో నీటి విడుదల నిలిపివేసి సన్నగా ధారలా వదిలారు. -
నిరసన సెగలు!
‘పేట – కొడంగల్’ భూసేకరణ సర్వేకు అడ్డంకులు ●ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రభుత్వాలు భూ నిర్వాసితులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వాల కంటే మేం ఎక్కువగా డబ్బులు ఇస్తున్నామని చెప్పడమే తప్పా నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తూ పోరాటాన్ని కొనసాగిస్తాం. – వెంకట్రామరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జీవనోపాధి పోతుంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. అలాంటి భూములను ప్రభుత్వం కోరితే ఇస్తున్నాం. భూమి ఉంటే తమకు రైతు భరోసా. భీమా, బ్యాంకు రుణం, పీఎం కిసాన్ వచ్చే వాటన్నింటిని ఈ రోజు కోల్పోవాల్సి వస్తుంది. – మశ్చందర్, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు అర ఎకరా రాదు ఎకరాకు రూ.14లక్షలు ప్రభుత్వం పరిహారం ఇస్తే ఈ రోజు మార్కెట్లో అర ఎకరా భూమి కొనలేని పరిస్థితి. సమాజం కోసం భూమి త్యాగం చేస్తే న్యాయపరమైన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రైతులపక్షాన పోరాడుతేనే ఉంటాం. – డాక్టర్ రఘవేందర్ గౌడ్, భూ నిర్వాసితుడు, ఊట్కూర్ రైతులు సహకరించాలి రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్రాజెక్టు కింద భూములను అందజేసిన వారికి ప్రభుత్వం నుంచి భూ పరిహారం కింద ఎకరాకు రూ.14 లక్షలు ఇస్తున్నాం. రైతులు సహకరించి ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములు కావాలి. – రాంచందర్నాయక్, ఆర్డీఓ నారాయణపేట: సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వే పనులకు రోజు రోజుకు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో రైతులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రైతుల నుంచి నిరసన సెగలు తగులుతుండడంతో అధికారులు, పాలకులకు ప్రాజెక్టుకు కావాల్సిన భూసేకరణ కత్తిమీద సామైంది. తమకు భూ నష్టపరిహారం బహిరంగ మార్కెట్ను అనుసరించి ఇవ్వాలని రైతులు భూ నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఎకరానికి రూ.14 లక్షల పరిహారాన్ని చెల్లించేలా 141 మంది రైతులకు చెక్కులను అందజేసింది. అయితే తమకు ఈ ధర సరిపోదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్లు ఇవే భూముల బేసిక్ ధర నిర్ణయించడానికి న్యాయమూర్తి అధ్వర్యంలో ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిర్ధారించిన బేసిక్ ధరకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలుపరచాలని, బలవంతపు భూసేకరణను ఆపడంతోపాటు భూ సేకరణకు ముందే భూ రికార్డులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. అడుగడుగునా నిరసనలు నాలుగు మండలాల పరిధిలో 21 గ్రామాలకు చెందిన సుమారు 1500 మందికి పైగా రైతుల నుంచి 1957.39 భూమిని ప్రభుత్వం సేకరించే పనిలో పడింది. అయితే, తమ భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ రైతులు సర్వేకు వెళ్లే ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే అధికారులను అడుగడుగున అడ్డుకుంటున్నారు. ప్రత్యేక పోలీసు బందోబస్తు మద్య భూ సర్వేలను చేపడుతున్నారు. మొదటి దశలో పంప్హౌస్, సబ్స్టేషన్ ప్రెజర్ మెయిన్ కాల్వకై 550 ఎకరాల భూమిని మక్తల్ మండలం కాట్రేవ్ పల్లి నుంచి దామరగిద్ద మండలం కానుకుర్తి వరకు సర్వే చేపట్టారు. ఆ తర్వాత సెకండ్ పేజ్లో జయమ్మ రిజార్వాయర్కు 337 ఎకరాలు, 3వ దశలో ఊట్కూర్రిజార్వాయర్కు 311 ఎకరాలు భూ సర్వే పూర్తి చేశారు. నాల్గో దశలో దామరగిద్ద మండలంలోని కానుకుర్తి రిజార్వాయర్కు కావాల్సిన 792 ఎకరాల భూసర్వేకు బుధవారం వెళ్లి అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అక్కడికి ఆర్డీఓ రాంచందర్నాయక్, డీఎస్పీ లింగయ్య వెళ్లి రైతులను సముదాయించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సర్వేయర్లు, అధికారులను రైతులు తిప్పిపంపించారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో గత 25 రోజులుగా జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, నిరసనలు, కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకోలు, గ్రామాల్లో సభలు చేపడుతున్నారు. సమాజంలో ‘న్యాయం బతకాలి– బతికించాలి‘ అని నిర్వాసితులు నినాదాలు చేస్తూ ప్రజలు కోరుకుంటున్నారు. పరిహారం విషయంలో వెనక్కి తగ్గని భూనిర్వాసితులు మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వాలని ఆందోళన బాట పోలీసుల భద్రత నడుమ సర్వే చేపడుతున్న అధికారులు -
కార్యకర్తల సంకల్పం గొప్పది
అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని.. ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ఓట్లేసి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అధ్యక్షతన జరగగా ఆయనతోపాటు మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు కేసీఆర్కు అండగా ఉన్నారని, ఇందుకు నిదర్శనం అచ్చంపేటలో నాయకుడు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలేనని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత వారికే దక్కుతుందని విమర్శించారు. కరుడుగట్టిన కార్యకర్తల ఆదరణ ఉన్నా.. గువ్వల బాలరాజు లాంటి నాయకుడు పార్టీ మారడం అవివేకమని, ఓ రకంగా ఆయన పతనానికి ఆయనే కారణమయ్యారని విమర్శించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గువ్వల పార్టీ మారడం దురదృష్టకరమని, నాయకుడు కార్యకర్తలకు భరోసా కల్పించేలా ఉండాలన్నారు. రానున్నది బీఆర్ఎస్ పాలనేనని.. కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగమన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ 28న అచ్చంపేటలో కేటీఆర్ సభ ఉంటుందని పేర్కొన్నారు. -
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కోస్గి: ఖాతాదారుల సౌకర్యార్థం బ్యాంకులు ఎన్నో రకాలుగా ఆర్థిక సేవలను అందిస్తున్నాయని, ప్రజలు బ్యాంకులు కేవలం రుణాలు ఇవ్వడానికి, వడ్డీలు వసూలు చేయడానికి ఉన్నాయనే అపోహలు వీడి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎస్బీఐ మేనేజర్ అనంతనాగ్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చెన్నారంలో జన్ సురక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా బ్యాంకు సేవలు, ఆర్దిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్యాంకులో ఖాతా ఉన్న వారందరికి నామమాత్రపు ప్రీమియంలో జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. మహిళా సంఘాల్లో మహిళా గ్రూపులు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ఉమ్మడి లోన్ లేదా ఇతర వ్యక్గిగత రుణాలుగాని సకాలంలో చెల్లించి బ్యాంకులకు సహకరించడంతోపాటు బ్యాంకులు అందించే రాయితీలు, ప్రొత్సాహకాలకు అర్హులవుతారన్నారు. అవసరం కోసం ఎంత బాధ్యతగా రుణాలు తీసుకుంటామో అంతే బాధ్యతగా రుణ బకాయిలు తిరిగి చెల్లించాలన్నారు. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు వడ్డిలో సైతం ఎన్నో రాయితీలు ఉంటాయన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవిలు, ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, సైబర్ నేరాలు, మోసపూరిత బ్యాంకు లావాదేవీలను గురించి సమగ్రంగా వివరించారు. ఇందులో ఆర్దిక అక్షరాస్యత కౌన్సిలర్ మల్లేష్, ఫీల్డ్ అధికారి యశ్వంత్రెడ్డి, బ్యాంకు సిబ్బంది అంజి పాల్గొన్నారు. -
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఊట్కూరు: పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని, గణేష్ ఉత్సవాలు, ఇతర అన్ని మతాల పండుగలకు డీజేలను అనుమతించేది లేదని ప్రజలు సహకరించాలని డీఎస్పీ ఎన్ లింగయ్య సూచించారు. శుక్రవారం గణేష్ ఉత్సవాల సందర్భంగా ఊట్కూర్ రైతు వేదిక భవనంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణలో బాగంగా మతపరమైన పండుగలు, ఊరేగింపుల సమయంలో శబ్దకాలుష్యం వచ్చే డీజే సిస్టమ్స్ను, బాణసంచారం వాడరాదని తెలిపారు. శబ్ద కాలుష్యం వల్ల వృద్దులకు, దీర్ఘకాలిక రోగులకు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఉత్సవాలను శాంతియుతంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైన డీజేలను ఏర్పాటు చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, వాటికి బదులుగా సౌండ్బాక్స్లు, సన్నాయి, కోలాటం, చెక్కభజన తదితర వాటిని వాడాలన్నారు. కార్యక్రమంలో సిఐ రామరాజ్, ఎస్ఐ రమేష్, ఉత్సవ కమిటి నాయకులు భాస్కర్, సూర్యప్రకాష్రెడ్డి, మహేష్రెడ్డి, షెట్టి రమేష్, శివప్రసాద్రెడ్డి, వడ్ల మోనప్ప, గౌతం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా వీరుడు పండుగ సాయన్న
నారాయణపేట: పండుగ సాయన్న జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ సాయన్న జయంతి, వర్ధంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చొరవ చూపేలన్నారు. జిల్లాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో త్వరలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటుకు తగిన స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ముదిరాజ్ సంఘం కృషి చేస్తుందన్నారు. పట్టణ అధ్యక్షుడు మిర్చి వెంకటయ్య మాట్లాడుతూ సాయన్న జీవితాన్ని బీసీలందరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంత్ కుమార్ మాట్లాడుతూ 1860 నుంచి 1890 మధ్యకాలంలో పెత్తందాదారులు, భూస్వాములు, పట్వారిలపై కొట్లాడి పెద్దోన్ని కొట్టు పేదోలకు పంచు అనే నిదానంతో జీవించారన్నారు. కార్యక్రమంలో పట్టణ భాజపా అధ్యక్షులు పోశల్ వినోద్ , జిల్లా ఆర్టిఏ మేంబర్ పోషల్ రాజేష్, పళ్ళ వెంకట్రాములు, మ్యాకల హన్మంతు, కాకర్ల భీమయ్య,గోవిందుగేరి గోపాల్ పాల్గొన్నారు. -
‘రక్షా’నుబంధం
నేడు రక్షాబంధన్ వేడుకలు ● సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షల వెల్లువ ● ఆధునిక కాలంలోనూ ఆదరణ తగ్గని వైనం ● ప్రేమానుబంధాలను చాటుతున్న రాఖీ పండుగ● కొరియర్ల ద్వారా తమ వారికి రాఖీలు పంపిస్తూ సంబరంఅక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్లు అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనేదే రాఖీ పండుగ. సోదరి తన సోదరుడు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే.. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ సోదరికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. సమాజంలో నానాటికి బంధాలు చెదిరిపోతున్న తరుణంలో రక్షాబంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు అనుబంధాలను బలోపేతం చేస్తుంది. సోదర, సోదరీమణుల మధ్య ఉండే అనుబంధాలు.. ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలుస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. అలాగే విదేశాల్లో ఉన్నవారు సైతం కొరియర్లోనూ తమవారికి రాఖీలు పంపిస్తూ.. అనుబంధాలను చాటి చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్ట్రాగాంలోనూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. – స్టేషన్ మహబూబ్నగర్/ అచ్చంపేట 400 ఏళ్ల పండుగ రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. గాయత్రీ మాలధారణ.. పత్తితో తయారు చేసిన ధారంతో కంకణం ధరించడమే కాకుండా.. జంధ్యం (గాయత్రిమాల)కూడా ధరిస్తారు. ముందుగా గాయత్రి హోమం నిర్వహించిన తర్వాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 43 ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. స్థానిక భక్తమార్కండేయ ఆలయంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం 44వ నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికల్లో రాఖీ ఆకారంలో కూర్చున్న విద్యార్థులుమార్కెట్లో వివిధ డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. ముఖ్యంగా అన్నయ్య, తమ్ముడు పేర్లతో వచ్చిన రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారులకు సంబంధించి వినూత్నంగా రాఖీలు మార్కెట్లో లభిస్తున్నాయి. అదేవిధంగా మెటల్, కుందన్, ప్రింటెడ్, హ్యాండ్మేడ్, వుడన్, ఫ్యాషన్ బోటిక్, యాక్ససిరీస్, మోటోపట్లు తదితర రకాల రాఖీలు ఆకట్టుకుంటున్నాయి. లైట్ వెయిట్తో ఉన్న రాఖీల నుంచి కొంతమేర పెద్దసైజు గల రాఖీలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లను బట్టి రూ.10 నుంచి రూ.500 వరకు రాఖీలు లభిస్తున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన చిట్టెమ్మ 1997లో మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా నియామకమైంది. తనకు ఎంతో ఇష్టమైన రాఖీ పండుగను తోటి కండక్టర్లు, డ్రైవర్లతో జరుపుకోవాలనే ఉద్దేశంతో అదే ఏడాది నుంచి రాఖీలు కట్టడం ప్రారంభించింది. డిపోలోని దాదాపు 220 మందికిపైగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి కులమతాలకతీతంగా రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుతోంది. రాఖీపండుగ వచ్చిందంటే డిపోలోని అందరూ చిట్టెమ్మ కట్టే రాఖీ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా చిట్టెమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రతి ఏడాది రాఖీ పండుగ రోజు ఆర్టీసీ ఉద్యోగులందరికీ రాఖీలు కడతానని, రిటైర్డ్ అయ్యే వరకు రాఖీ పండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా డిపోలోని ఉద్యోగులందరికి రాఖీలు కడతానని పేర్కొన్నారు. 28 ఏళ్ల నుంచి.. -
11 నుంచి పాదయాత్ర
ఆగస్టు 7న దామరగిద్ద మండలం కానుకుర్తి నుంచి భూ నిర్వాసితుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 11న పేరపళ్ల నుంచి నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం వరకు, 13న ఊట్కూర్లో, 14న కాట్రేవ్పల్లి నుంచి మక్తల్ తహసీల్దార్ కార్యాలయం వరకు , 20 21 తేదీలలో ‘చలో కాడా‘ (కొడంగల్)కు పాదయాత్రను చేపట్టేందుకు నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకపోతే ‘చలో సీఎం‘ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భూ నిర్వాసితుల సంఘం నిర్ణయించింది. ఇదిలాఉండగా, ఇటీవల దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత సంఘీబావం తెలిపారు. ఆ గ్రామ రైతులు కవిత ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడు పట్టించుకునే నాథుడేవరంటూ గోడుమన్నారు. -
అయ్యో.. నేతన్నా
75 ఏళ్లయినా సభ్యత్వం ఇవ్వరు.. ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయరు! ●● ఆందోళనలో గాంధీనగర్ చేనేత కార్మికులు ● సమస్యల పరిష్కారం పట్టని పాలకులు ● చేనేత కార్మిక దినోత్సవంలో నల్లబ్యాడ్జీలతో నిరసన రిజిస్ట్రేషన్ చేయండి.. ఎన్నికల సమయంలో నాయకులు రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. చేనేత కార్మికులకు సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలి – కెంచె నారాయణ, చేనేత కార్మిక సంఘం నాయకుడు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. గాంధీనగర్లోని చేనేత కార్మికుల గోడును అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ పాలకవర్గం అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించాలి. సభ్యత్వ నమోదు, ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించాలి. లేనిపక్షంలో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తాం. – కె.కాశీనాథ్, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ డివిజన్ నాయకుడు, నారాయణపేట ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి.. 1951లో ఏర్పడిన చేనేత సహకార సంఘంలో మా నాన్న నర్సప్ప సభ్యత్వం పొందారు. మాకు సొసైటీ ద్వారా ఇంటిని కట్టించారు. మేము ముగ్గురం అన్నదమ్ముళ్లం. 35ఏళ్లుగా తమకు సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నాం. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించాలని వేడుకుంటున్నాం. అయినా సోసైటీ పాలకవర్గం తమను లెక్కచేయడం లేదు. – మ్యాకలి వెంకటేశ్ నారాయణపేట: జిల్లా కేంద్రంలో చేనేత సహకార సంఘం 1951లో ఏర్పడింది. అప్పట్లో దాదాపు 4,265 మంది కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మిక సొసైటీ తరఫున గాంధీనగర్ కాలనీ నిర్మించారు. మొత్తం 104 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు చేనేత పనిముట్లు పంపిణీ చేశారు. ఇందుకు గాను కార్మికుల నుంచి ప్రతినెలా రూ. 5 చొప్పున దాదాపు రూ. 2,475 వసూలు చేశారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధరను 35ఏళ్ల క్రితమే లబ్ధిదారులు తమ వాటాధనం చెల్లింపులను పూర్తిచేశారు. అయినా నేటికీ సొసైటీ నిర్వాహకులు ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారంటూ చేనేత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా.. గాంధీనగర్లోని చేనేత సహకార సంఘం సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు, సొసైటీ సభ్యత్వాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఏ ఎన్నికలు వచ్చినా ఆయా పార్టీల నాయకులు చేనేత కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ఎన్నికల్లో తమను ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప సొసైటీని ఒప్పించి తమకు ఇళ్ల రిజిస్ట్రేషన్, సభ్యత్వాలు ఇప్పించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోయారు. గాంధీజీ సాక్షిగా నల్లబ్యాడ్జీలతో నిరసన.. చేనేత కార్మిక సంఘం (టీయూసీఐ) ఆధ్వర్యంలో గాంధీనగర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్కడి నుంచి ప్రధాన రహదారుల గుండా ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన చేనేత కార్మికుల దినోత్సవ సమావేశానికి చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తమ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇక్కడ ఏం జరుగుతోంది.. చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా సంబురాలు జరుపుకోవాల్సిన చేనేత కార్మికులు.. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అవాక్కయ్యారు. ఇక్కడ ఏం జరుగుతుందంటూ అక్కడే ఉన్న ఆర్డీఓ రాంచందర్ నాయక్ను అడిగే ప్రయత్నం చేశారు. ఆ పక్కనే ఉన్న చేనేత, జౌళీశాఖ అధికారి కలెక్టర్కు సమస్యను వివరించారు. ఇటీవల తమకు గాంధీనగర్కు చెందిన చేనేత కార్మికులు తమ ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సొసైటీలో సభ్యత్వం ఇప్పించాలని విన్నవించినట్లు చెప్పారు. అంతలోనే చేనేత కార్మిక సంఘం నాయకులు కలెక్టర్ వద్దకు వెళ్లి సదరు అధికారి వ్యవహార తీరుపై ఫిర్యాదు చేశారు. అయితే సంబంధిత అధికారులతో విచారించి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ చెప్పడంతో చేనేత కార్మికులు శాంతించారు. -
చేనేత ఉత్పత్తులను ఆదరించాలి : కలెక్టర్
నారాయణపేట: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నారాయణపేట చేనేత ఉత్పత్తులను ప్రజలు ఆదరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం చేనేత, జౌళీశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో చేనేత కార్మికులు, సహకార సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చేనేతతో అనేకమంది ఉపాధి పొందుతున్నారని.. వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. చేనేత కార్మికుల స్థితిగతులు, మగ్గాల నిర్వహణ, సమస్యలపై ప్రత్యేకాధికారిని నియమించి.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. హౌసింగ్ స్కీం ద్వారా కార్మికుల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ప్రతి మగ్గాన్ని జియో ట్యాగ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం చేనేత పొదుపు భరోసా కింద రూ. 25,03,200 చెక్కును కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, చేనేత సొసైటీ కోటకొండ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గడప జ్ఞానదేవ్, సిల్క్ సంఘం అధ్యక్షుడు రమేశ్, కళ్యాణి, విజయ్ కుమార్, హ్యాండ్లూమ్స్ ఏడీ బాబు పాల్గొన్నారు. కామన్ డైట్ మెనూ అమలుచేయాలి.. నారాయణపేట రూరల్: ప్రభుత్వం సూచించిన కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వంటగది, సరుకుల నిల్వ గది, విద్యార్థులు నిద్రించే గదులను పరిశీలించారు. కలెక్టర్ వెంట మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రషీద్, ప్రిన్సిపాల్ ఖాజా పాల్గొన్నారు. -
డిజిటల్ బోధనపై అశ్రద్ధ వహించొద్దు
ధన్వాడ: విద్యార్థులకు డిజిటల్ బోధన అందించడంపై అశ్రద్ధ వహించొద్దని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ధన్వాడ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం తరగతి గదుల్లో ఏర్పాటుచేసిన స్మార్ట్ టీవీలను ఆయన పరిశిలించారు. ఓ గదిలో స్మార్ట్ టీవీ దుమ్ము పట్టి ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాలకు అందించిన స్మార్ట్ టీవీలను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాగా, పాఠశాలలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయని సిబ్బంది అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. నిర్వహణ నిధులతో మరమ్మతు చేయించాలని ఎంఈఓ గాయత్రికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ డీఈ
● రూ.11 వేలు తీసుకుంటూ పట్టుబడిన అధికారి అలంపూర్: కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని రక్షణ గోడ మరమ్మతు, ఇతర పనులను కాంట్రాక్టర్కు రూ.4 లక్షలకు అప్పగించారు. అయితే రెండురోజుల క్రితం కాంట్రాక్టర్ పనులకు సంబంధించిన ఎంబీ బుక్ మెజర్మైంట్ చేయడానికి ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్నాయుడును కలిశారు. ఈ క్రమంలో డీఈ రూ.12 వేలు లంచం అడగగా.. పనుల్లో నష్టం వచ్చిందని అన్ని డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు గురువారం కాంట్రాక్టర్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈకి డబ్బులు ఇస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నం.1064, వాట్సప్ నం.94404 46106కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. -
పరిహారం పెంచకపోతే ప్రాజెక్టు ఆపండి
దామరగిద్ద: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే కాన్కుర్తి రిజర్వాయర్లో భూములు కోల్పోతున్న రైతులు అడిగిన మేరకు పరిహారం ఇవ్వాలని.. లేదా ప్రాజెక్టునైనా ఆపాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని కాన్కుర్తిలో భూ నిర్వాసితులకు మద్దతుగా బీఆర్ఎస్ తరఫున రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా, డీపీఆర్ ప్రకటించకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, గ్రామాల్లో రైతుల ద్వారా తీర్మానాలు తీసుకోకుండా, భూములకు సరైన పరిహారం ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఇక్కడి రైతులు ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని.. మార్కెట్ విలువ మేరకు తగిన పరిహారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారని అన్నారు. ఎకరాకు రూ. 20లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. మాట నిలబెట్టుకోకుండా రూ. 14లక్షలు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు రూ. 35లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. కాన్కుర్తి, గడిమున్కన్పల్లి, మల్రెడ్డిపల్లి గ్రామాల్లో భూములు కోల్పోతున్న వందలాది రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టగా.. అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు పట్టు వీడవకుండా ముందుకుసాగారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, మశ్చందర్, గోపాల్, భీంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, సుభాష్, భీమయ్యగౌడ్, అమ్మకోళ్ల శ్రీని వాస్, గవినోళ్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ రాములు, కిషన్రావు, దామోదర్రెడ్డి, భీంరెడ్డి పాల్గొన్నారు. -
పేద పిల్లలకు ఆధార్ నమోదు చేయిద్దాం
నారాయణపేట: జిల్లాలోని నిరుపేద పిల్లలకు ఆధార్ నమోదు చేయించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్జడ్జి వింధ్యనాయక్ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఏ ఒక్కరికీ చట్టపరమైన గుర్తింపు లేదా హక్కులు, అర్హత కల్పించడమే లక్ష్యంగా ‘సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇంక్లూజన్‘ కార్యక్రమం చేపట్టాలని జిల్లా సాథి కమిటీ సభ్యులకు సూచించారు. ఇటీవల జాతీయ న్యాయ సేవల అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచనల మేరకు జిల్లా సాథి కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా అనాథ పిల్లల జనన నమోదు, ఆధార్ నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ నుంచి తిరుపతయ్య, ఆధార్ మౌలిక సదుపాయాలు, నమోదు ప్రతినిధి అమరేంద్ర కృష్ణ, డీఈఓ గోవిందరాజులు, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ నుంచి శైలజ, జిల్లా మహిళా, శిశుసంక్షేమశాఖ నుంచి జయ, పలు సంస్థల ప్రతినిధులు శివలీల, శ్వేత, న్యాయవాదులు రఘువీర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా : బీజేపీనారాయణపేట రూరల్: అమలు సాధ్యంకాని బీసీ రిజర్వేషన్లు కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్లు అని చెప్పిన ప్రభుత్వం.. అందులో స్పష్టంగా ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొనడాన్ని చూస్తే కాంగ్రెస్కు బీసీలపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర జనాభాలో 12శాతం ఉన్న ముస్లింలకు 10శా తం రిజర్వేషన్లు ఇచ్చి, 80 శాతం జనాభా ఉన్న బీసీలకు మాత్రం కేవలం 32 శాతం రిజర్వేషన్లతో సరిపెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు టీల నీతిని ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కెంచె శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న ఉన్నారు.పరిహారం మూడింతలు పెంచి ఇస్తాందేవరకద్ర: దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి శివారు నుంచి బల్సుపల్లి వరకు చేపట్టే రైల్వే డబ్లింగ్ పనుల కోసం కావాల్సిన భూసేకరణపై బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి రైతులతో చర్చించారు. దాదాపు 70 మంది రైతులకు సంబంధించిన భూములను రైల్వే డబ్లింగ్ పనుల కోసం ఇప్పటికే గుర్తించామని ఆయన తెలిపారు. ప్రభుత్వపరంగా ఎకరాకు నిర్ణయించిన ధర కంటే మూడింతలుగా పెంచి నష్టపరిహారం అందించనున్నట్లు వివరించారు. కాగా.. మార్కెట్లో ఎకరాకు పలుకుతున్న ధరను దృష్టిలో పెట్టుకొని ఆ మేరకు నష్టపరిహారం లెక్కించి ఇవ్వాలని రైతులు కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని ఆయన తెలిపారు. అనంతరం భూసేకరణ చేసే రైతుల జాబితాలను వెల్లడించారు.నేడు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమావేశంస్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నేడు (గురువారం) స్థానిక తెలంగాణ చౌరస్తాలోని రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎ.రాజసింహుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుదల, నూతన కార్యవర్గం ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
మహబూబ్నగర్ క్రైం: మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఓ ఏఈఈ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ ఇరిగేషన్ సబ్ డివిజన్–1లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్.. ఓ వ్యక్తి తన 150 గజాల ప్లాట్కు సంబంధించి ఎల్ఆర్ఎస్, ఎన్ఓసీలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. బుధవారం ఉదయం జిల్లాకేంద్రంలోని వన్టౌన్ చౌరస్తాలో ఉన్న ఓ బేకరి దగ్గరకు రావాలని ఏఈఈ ఫోన్ చేయడంతో బాధితుడు అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న రూ.3 వేల నగదు ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకున్న ఏఈఈ జేబులో పెట్టుకున్న కాసేపటికే అక్కడికి వచ్చిన ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం ఏఈఈని నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లి.. ఆయన చాంబర్తో పాటు వన్టౌన్ ఏరియాలో ఆయన అద్దె ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి ఆస్తులు, నగదు లభ్యం కాలేదని డీఎస్పీ వెల్లడించారు. మహ్మద్ ఫయాజ్ను గురువారం ఏసీబీ కోర్టు నాంపల్లిలో హాజరుపరుస్తామని తెలిపారు. రూ.3వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం -
పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు వచ్చే ముఖ్య అతిథి ప్రసంగం సీపీఓ ఆధ్వర్యంలో ఉంటుందని, 8వ తేదీలోగా అన్నిశాఖల అధికారులు సీపీఓకు స్పీచ్ నోట్స్ అందించాలని సూచించారు. తహసీల్దార్ స్టేజీ ఏర్పాట్లు, హార్టికల్చర్ వారు డెకరేషన్, పోలీస్శాఖ గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాట్లు చూడాలన్నారు. డీఈఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చూడాలన్నారు. అవార్డుల కోసం ప్రతి శాఖ ఇద్దరు లేదా ముగ్గురు అధికారుల పేర్లు పంపాలన్నారు. పౌరసరఫరాలశాఖ డీఎస్ఓ, డీఎం స్నాక్స్, టీ ఇతర వసతులు కల్పించాలన్నారు. ట్రాన్స్కో వారు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలన్నారు. జనరేటర్ను స్టాండ్ బై ఏర్పాటు చేయాలని తెలిపారు. మత్స్య, పశుసంవర్ధకశాఖ స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ తదితరులు ఉన్నారు. ● జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గాను టీజీ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి.. నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు 23 దరఖాస్తులు రాగా.. వాటిలో వివిధ శాఖల నుంచి అనుమతులు పొందిన 16 మంజూరుకు డీఐపీసీ కమిటీలో ఆమోదం తెలిపారు. సమావేశంలో జీఎం భరత్ రెడ్డి, నర్సింగ్రావు, జి.మేఘాగాంధీ తదితరులు ఉన్నారు. జయశంకర్ కృషి మరవలేనిది.. నారాయణపేట: తెలంగాణ ఉద్యమంలో ప్రొ. కొత్తపల్లి జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో జయశంకర్ సార్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సార్ వెన్నెముకగా నిలిచి, స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, డీపీఆర్ఓ రషీద్, సీపీఓ యోగానంద్, డీవైఎస్ఓ వెంకటేశ్, డీఏఓ జాన్ సుధాకర్, ఏఓ జయసుధ పాల్గొన్నారు. -
ఆదాయ శాఖకు..అద్దె భవనాలే దిక్కా?
ఇబ్బందులు లేకుండా చూస్తాం.. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నూతన భవన ప్రతిపాదనలపై నాకు ఎలాంటి సమాచారం లేదు. అయితే కార్యాలయాలకు వచ్చే క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – ఫణీందర్, జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్లు అధికారి మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూర్చే ఈ కార్యాలయాలు ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎంత ఆదాయం ఆర్జించినా.. కార్యాలయానికి సొంత భవనాలు సమకూర్చుకోలేని దుస్థితిలో ఈ శాఖ ఉంది. సరైన వసతులు లేకపోవడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయవిక్రయదారులు సైతం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మాట అలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వ్యవహారాలు పర్యవేక్షించే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం కూడా అద్దె భవనంలోనే కొనసాగుతుండటం మరో విశేషం. ఆడిట్, చిట్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సైతం ఇందులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు సైతం వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు చోట్లే పక్కా భవనాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇందులో కేవలం కల్వకుర్తి, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. మిగతా పది కార్యాలయాలు అద్దె భవనాల నుంచే రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాయి. వీటికి గాను రూ.వేలల్లో ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నారు. ఏళ్లతరబడిగా ఇలా చెల్లిస్తున్న అద్దెలతోనే పక్కా భవనాలు నిర్మించవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. అయితే మక్తల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇటీవల నూతన భవనంలోకి మార్చినా.. అద్దె నిర్ణయించలేదని అధికారులు చెబుతున్నారు. వసతులు లేక అవస్థలు.. జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. ఎక్కడా సరైన వసతులు లేవు. ఒక్కో కార్యాలయానికి సగటున ప్రతిరోజు వందమంది వరకు వస్తుండటంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు, పార్కింగ్, తాగునీరు వంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చిన్నగా ఉండటంతో పార్కింగ్ లేక అవస్థలు పడుతున్నారు. అచ్చంపేటలో చిన్నపాటి రోడ్డులో ఉండటంతో వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఇళ్లలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం ఎక్కువ.. వసతులు తక్కువ వాహనాల పార్కింగ్కూ స్థలం కరువు అవస్థలు పడుతున్న క్రయవిక్రయదారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
సర్వేను అడ్డుకున్న భూ నిర్వాసితులు
● న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా బుధవారం దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి శివారులో రెవెన్యూ అధికారులు భూ సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న మల్రెడ్డి, కాన్కుర్తి, గడిమున్కన్పల్లి గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు, ప్రజా సంఘాల నాయకులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని అధికారుల సర్వేను అడ్డుకున్నారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించినా తర్వాతే సర్వే నిర్వహించాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ రాంచందర్నాయక్, డీఎస్పీ లింగయ్య అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే రైతులు ససేమిరా అనడంతో దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయంలో చర్చలకు ఆహ్వానించారు. దాదాపు 100 మంది రైతులతో పాటు భూ నిర్వాసిత రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, గోపాల్, భీంరెడ్డి, నర్సిరెడ్డిలతో అధికారులు చర్చలు జరిపారు. ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తుందని.. అంతకుమించి పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎకరాకు రూ. 14లక్షల పరిహారంతో తమ భూములను కోల్పోవ డానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. రైతులతో చర్చలు ఫలించకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కాగా, న్యాయమైన పరిహారం కోసం గురువారం అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల మద్దతుతో కాన్కుర్తి నుంచి దామరగిద్ద తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు భూ నిర్వాసితులు తెలిపారు. -
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
మద్దూరు: పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తి చేయాలని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ శైలజ పల్లె దవాఖానా డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు ఆదేశించారు. మంగళవారం మద్దూరు పట్టణంలోని పీహెచ్సీలో పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సుదేశ్నతో కలిసి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు, తల్లి పాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, జాతీయ నులిపురుగులు దినోత్సవం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి శ్రీలత, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’పై కాంగ్రెస్వి తప్పుడు ఆరోపణలు
నారాయణపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావు హైదరాబాద్లో తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించడాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులతో కలిసి తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్ భావిస్తే అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్క అనుమ తి తీసుకు రాలేదన్నారు. అక్కడ ప్రాజెక్ట్ కడితే మహారాష్ట్ర నుంచి అభ్యంతరం ఉంటుందని తెలిసినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆరోపించారు. కానీ సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి 11అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని కొనియాడారు. రైతుల నోట్లో మట్టి కొడితే ఖబడ్దార్ జిల్లాలో చేపడుతున్న నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎక్కడుందని.. కొడంగల్లో ఇచ్చిన విధంగానే నష్ట పరిహారం నారాయణపేట, మక్తల్ నియోజవకర్గాలోని రైతులకు ఇవ్వాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఎస్ఆర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మక్తల్లో మంత్రి, ఎమ్మెల్యే కలిసి సీఎం రేవంత్రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. 95 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వ పనులు ఎందుకు చేపట్టడం లేదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అశోక్గౌడ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రామకృష్ణ, నాయకులు సుదర్శన్రెడ్డి, వేపూరి రాములు, సుధాకర్రెడ్డి, విజయ్సాగర్, కన్నా జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
భరత్ భవితవ్యంపై బెంగ..
సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి రాములు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్ప్రసాద్ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలో చేరి.. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. రానున్న కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయితే గులాబీ పార్టీలో గువ్వలలో అంతర్గత పోరులో భాగంగా బీజేపీలో చేరితే.. ఇప్పుడు మళ్లీ గువ్వల రూపంలోనే పోటీ ఎదురవుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా, నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన రాములు కార్యక్షేత్రంపైనే ఆయన తనయుడు భరత్ ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్లో ఉండగా జెడ్పీ చైర్మన్ పదవి, అచ్చంపేట ఎమ్మెల్యే సీటు, నాగర్కర్నూల్ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ప్రధానంగా గులాబీ పార్టీలో గువ్వల బాలరాజు ప్రభావంతో తమకు అవకాశాలు దక్కలేదని భరత్ప్రసాద్ భావించారు. ఈ కారణాలతోనే రాములు సైతం కుమారుడితో కలసి పార్టీని వీడి అనూహ్యంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు గువ్వల సైతం బీజేపీలోనే చేరుతుండటంతో భరత్ప్రసాద్ భవితవ్యంపై వారి అనుచరులు బెంగ పెట్టుకుంటున్నారు. -
పీయూలో అధికారుల నియామకం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అధికారులను నియమిస్తూ వీసీ శ్రీనివాస్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా పొలిటికల్ సైన్స్ సీనియర్ అధ్యాపకులు భూమయ్యను నియమించారు. ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా కంప్యూటర్ అప్లికేషన్స్ గౌస్ మోయినోద్దీన్ను నియమించారు. పీఆర్వోగా సోషల్ వర్క్ విభాగానికి చెందిన గాలెన్నను నియమించారు. అకాడమిక్ ఆడిట్ సెల్ కోఆర్డినేటర్గా రవికుమార్ను నియమించారు. తమపై నమ్మకం ఉంచి భాద్యతలను అప్పగించినందుకు అధికారులు వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు, కరుణాకర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
మక్తల్/కృష్ణా: పట్టణ కేంద్రంలోని 150 పడకల ఆస్పత్రి, కృష్ణా మండల కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణ పనుల్లో పెంచాలని కలెక్టర్ సిక్తాపట్నాయాక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పనులు ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.34 కోట్లు, కృష్ణా ఆస్పత్రి కోసం రూ.1.56 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్కు సూచించారు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ గదులు, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గదులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా కృష్ణా మండలంలోని ముడుమాల్ గ్రామంలో జింకల పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని అటవీ శాఖ అప్పగించారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అందుకు కావల్సిన అన్ని రికార్డులను వేగంగా అటవీ అధికారులకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, టీజీఎస్ఐడీసీ ఈఈ వేణుగోపాల్, డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయిమురారి, తహసీల్దార్లు సతీష్కుమార్, శ్రీనివాస్ ఎంపీడీఓ రమేష్కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు నారాయణపేట రూరల్: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ప్రాజెక్టు పరిధిలో రూ.26 కోట్ల వ్యయంతో మండలంలోని అప్పక్పల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్ కాలేజీ, రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎంసీహెచ్ (మెటర్నిటీ చైల్డ్ హెల్త్) సెంటర్ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. నర్సింగ్ కాలేజీ పరిసరాల్లో సర్వే చేసి, స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాలని తహసీల్దార్ అమరేంద్రకృష్ణను ఆదేశించారు. మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కొనసాగించాలని డిపో మేనేజర్ లావణ్యకు సూచించారు. సింగారం క్రాస్ రోడ్డులో రూ.8.50 కోట్లతో చేపపడుతున్న హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా సెంటర్ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ రహదారి నిర్మాణం, టాయిలెట్ బ్లాక్ పనుల కోసం అదనంగా రూ.4 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్కుమార్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
రాయితీ పరికరాలకు దరఖాస్తుల ఆహ్వానం
కోస్గి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్నకారు, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల వ్యవసాయ పనిము ట్లు అందజేస్తుందని, కోస్గి, గుండుమాల్, మ ద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలోని ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏడీఏ రామకృష్ణ ఓ ప్రకటనలో కోరారు. నిబంధనల మేరకు అర్హత ఉన్న రైతులకే ఈ రాయితీ పరికరాలు అందజేస్తున్నామని, ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కా ర్డు, భూమి పట్టాపాస్ బుక్, ( కేవలం ట్రాక్టర్ పనిముట్లకు దరఖాస్తు చేసే వారు మాత్రం ట్రాక్టర్ ఆర్సీ) జిరాక్స్లను ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలకు అందజేయాలన్నారు. రాయితీపై బ్యాటరీ స్పేయర్లు, పవర్ స్పేయర్లు, రోటో వేటర్స్, కల్టీవేటర్లు, కేజీ వీల్స్, బండ్ ఫార్మర్ అందుబాటులో ఉన్నాయన్నారు. చట్టాలపై అవగాహన తప్పనిసరి నారాయణపేట రూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మన్పాడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం చట్టాలు, ర్యాగింగ్ ముప్పు నివారణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ర్యాగింగ్ చేసినా, సహకరించిన వారికి సమాన శిక్ష ఉంటుందని తెలిపారు. సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించరాదని, బాల్య వివాహాలు, మానసికంగా, శారీరకంగా మాటలతో హింసించడం, విద్యార్థిని, విద్యార్థులను ప్రేమ పేరుతో వేధించడం, అవమాన పర్చడం వంటివి నేరంగా పరిగణించి ఆరునెలల జైలు శిక్షతో రూ.వేయి జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 18001805522 కి సంప్రదించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, రూ.మూడు లక్షల లోపు ఆదాయం కలిగిన బీసీలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయన్నారు. న్యాయ సలహాల కోసం 15100 నంబర్కు ఫోన్ చేసి సమస్యను చెప్తే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీపతిగౌడ్, పంచాయతీ కా ర్యదర్శి వేణుగోపాల్, అనిల్, కుర్మన్న, మల్లికా ర్జున్, కృష్ణవేణి, చంద్రకళ, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు. పేట వాసులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు నారాయణపేట రూరల్: చేనేత రంగంలో అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ఈ ఏడాదికి గాను నారాయణపేట జిల్లావాసులను వరించాయి. సాంప్రదాయ కాటన్ చీరల నేత విభాగంలో మండలంలోని చిన్నజట్రం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు జన్ను ఆంజనేయులు, పట్టు శాలువా డిజైనర్ విభాగంలో మండలంలోని కోటకొండకు చెందిన యంగల్ ఆంజనేయులు అవార్డు దక్కించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మాస్టర్ వీవర్ రఘురాములు పట్టు వస్త్రంపై 33 జిల్లాలతో కూడిన తెలంగాణ పటానికి ఎడమ వైపు సీఎం రేవంత్రెడ్డి చిత్రం, కుడి వైపు ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి మగ్గంపై నేసినందుకు అవార్డు పొందినాడు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి లో అందించే ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ. 25వేల నగదు బహుమతిని అందిస్తారు. ఈ నెల 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజాలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో అవార్డులు అందించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి వారిని ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పెసర క్వింటాల్కు రూ.8,419 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.8,419, కనిష్టంగా రూ.5,909 పలికింది. వ్యాపారస్తులు పోటీ పడి మార్కెట్కు వచ్చిన 254 బస్తాల పెసరను కోనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చూడాలి
ఫేిషయల్ అటెండెన్స్ ఉపాధ్యాయులకు అమలు చేయడం శుభపరిణామం. దీంతో మరింత పారదర్శకత పెరుగుతోంది. ఈ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – ఎండీ బాల్చేడ్, ఉపాధ్యాయుడు, ఎల్లంపల్లి ప్రాథమిక పాఠశాల వంద శాతం నమోదుతో అమలు యాప్లో వందశాతం వివరాలను నమోదు చేసిన వెంటనే ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ఫేషియల్ రికగ్నేషన్ ఎంతో సహకరిస్తుంది. ఎఫ్ఆర్ఎస్ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట ● -
చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు అందించాలి
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర గాంధీనగర్ చేనేత కార్మికులకు ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, సొసైటీలో కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీడీఈ ప్రకాష్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సీసీఐ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ.. గాంధీనగర్ కాలనీకి చెందిన వంద మందికి కార్మిక సొసైటీ తరుపున ఇళ్లు నిర్మించి, చేనేత పరికరాలు ఇచ్చి కాలనీ నిర్మించారని, కార్మికుల దగ్గర నెలకు కొంత నగదు వసూలు చేశారన్నారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధర 35 సంవత్సరాల క్రితమే లబ్ధిదారులు చెల్లించినా.. నేటికి ప్రభుత్వం సొసైటీ ఇంటి యాజమానులకు రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సొసైటీ ఇళ్ల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే చేనేత కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జయ, టీయూసీఐ జిల్లా కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కలకలం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా తీవ్రంగా చర్చ సాగుతోంది. రెండు దశాబ్దాలుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన గువ్వల పార్టీ వీడుతుండటంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ కేడర్లో నెలకొంది. ఈనెల 9న ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని, ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ప్రాధాన్యత లేదని.. బీఆర్ఎస్ పార్టీలో 2007లో చేరిన గువ్వల బాలరాజు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు. 2009లో మొదటిసారిగా నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్, టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్గా వ్యవహరించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు ఆశించినా భంగపాటు ఎదురైంది. ఈ సీటును ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తనకు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని, పార్టీ అధినేత కేసీఆర్ తనను పట్టించుకోవడం లేదని అనుచరులతో చెబుతున్నారు. భవిష్యత్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటారని, వారి కన్నా ముందే తానే బీజేపీలో చేరుతున్నట్లు ముఖ్య అనుచరులతో స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు బీఆర్ఎస్తోనే: మర్రి తాను చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన తనకు లేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ దర్శకాలతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. ఎప్పటికీ పార్టీ లైన్లోనే ఉంటా: జైపాల్యాదవ్ తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే ఉంటానని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గువ్వల నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పారు. తాను నిత్యం పార్టీ కార్యకర్తల నడుమ ఉంటున్నానని, బీఆర్ఎస్ పార్టీ కోసమే నిరంతరం పని చేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు కారు పార్టీకి గుడ్బై చెప్పినమాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ నెల 9న బీజేపీలో చేరే అవకాశం? ప్రచారంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేల పేర్లు -
బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి
ఊట్కూరు: బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సోమవారం అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఊట్కూరులోని ఆర్యసమాజ్ భవనంలో భూ నిర్వాసితులతో కలిసి అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, మాజీ సర్పంచ్ ఎం భాస్కర్ మాట్లాడుతూ నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి భయబ్రాంతులకు గురి చెయ్యడం తగదని ఆరోపించారు. గత నెల రోజుల క్రితం పోలీసు పహారాలో భూసేకరణ చేపట్టిందని, సర్వే చేసేటప్పుడు రైతులు సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం కలిపించలేదని ఆరోపించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.14 లక్షలు అందించడం తగదని మార్కెట్ ధర రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పలుకుతుందని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించడంలో జిల్లా మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు నెల రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులకు న్యాయమైన పరిహారం అందేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు సిద్ధమైనట్లు వారు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి పాదయాత్రలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, చంద్రశేకర్గౌడ్, మాజి ఎంపీటీసీ హనుమంతు, వెంకటరామారెడ్డి, శివారెడ్డి, మోనప్ప, ధర్మరాజు, ఇబాదూర్రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
నారాయణపేట: మహిళలు వ్యాపార రంగంలో రాణించి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. వీ హబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ ప్రోగ్రాంపై జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరల్డ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాపారాలు/ఎంఎస్ఎంఈ లకు భరోసా అందనుందన్నారు. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికై న మహిళా పారిశ్రామికవేత్తలకు తమ వ్యాపార అభివృద్ధిని వేగవంతం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందని వీ హబ్ డైరెక్టర్ జాహిద్ షేక్ తెలిపారు. దీనిలో భాగంగా టెక్స్టైల్స్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హస్తకళలు వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ – డైవర్సిఫికేషన్, బ్రాండింగ్ – మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు అందనుందని వీ హబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించి మహిళల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీ.ఆర్.డీ.ఓ మొగులప్ప, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సాయి రామ్ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం నారాయణపేట రూరల్: జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్లో భాగంగా నర్వ బ్లాక్ చక్కటి పనితీరు కనబర్చడంతో రజత పతకం సాధించి ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆమె కార్యాలయంలో స్థానిక టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ధన్వాడ: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రోగులతో మాట్లాడారు. అనంతరం అస్పత్రి పరిసరాలను పరిశీలించి అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే వైద్యులను ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో వైద్యులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. -
యథేచ్ఛగా డీజిల్ దందా!
మరికల్: పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా జిల్లాకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. వీరితో జిల్లాలోని కొందరు పెట్రోల్బంక్ డీలర్లు చేతులు కలపడంతో వీరి వ్యాపారం కాస్తా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా కొనసాగుతోంది. పక్కనే ఉన్న కర్ణాటకలో డీజిల్, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండటంతో రాష్ట్ర సరిహద్దులో ఉండే గద్వాల్, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలోని పెట్రోల్ బంకుల డీలర్లు, కర్ణాటకలో పెట్రోల్బంకు డీలర్లతో చేతులు కలిపారు. అక్కడ నుంచి ట్యాంకర్లకు నింపి రాత్రికి రాత్రే సరిహద్దు దాటిస్తున్నారు. అక్కడక్కడ విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా.. దందా మాత్రం ఆగడం లేదు. రోజుకు వేల లీటర్ల తరలింపు కర్ణాటకలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో తెలంగాణ పెట్రోల్బంకు నిర్వాహుకులు గత ఐదేళ్ల నుంచి రహస్యంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. లీటర్కు రూ.9 తక్కువగా ఉండటం వల్ల అక్రమంగా డీజిల్ను ట్యాంకర్ల ద్వారా గద్వాల్, నారాయణపేట, మక్తల్, మరికల్, కొడంగల్ మీదుగా నిత్యం పదుల సంఖ్యలో ఇతర పట్టణాలకు తరలించ్చి వారి పెట్రోల్బంకుల్లో లీటర్ రూ.96.92 విక్రయించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు 12 వేల లీటర్ల సామర్థ్యం ఉండే ట్యాంకర్లను 8 నుంచి 10 దాకా తరలిస్తున్నారని సమాచారం. లీటర్కు రూ.9 తక్కువగా ఉండటంతో ఒక్కో ట్యాంకర్కు రూ.లక్షకు పైగా లాభం వస్తుంది. గతేడాది ఊట్కూర్, మరికల్ మీదుగా వెళ్తున్న రెండు ట్యాంకర్లను సివిల్ సప్లయ్ అధికారులు దాడి చేసి పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది కూడా నిత్యం కర్ణాటక నుంచి డీజిల్ ట్యాంకర్లు వస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా, మరికల్, నర్వ మండలాల సమీపంలోని కొన్ని తండాలకు చెందిన వారు జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఆగిన లారీలు, ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకొని ఒక్కో బండి నుంచి 40 లీటర్ల వరకు డీజిల్ను దొంగతనం చేస్తుంటారు. ప్రతిరోజు 5 నుంచి 10 వాహనాల్లో ఇలా డీజిల్ లాగేసి మరుసటి రోజు కొందరు ట్రాక్టర్ల యాజమానులకు విక్రయిస్తారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం.. కర్ణాటక నుంచి అక్రమంగా జిల్లాలోకి డీజిల్ ట్యాంకర్లు వస్తే పట్టుకొని యజమానులపై కేసులు నమోదు చేస్తున్నాం. తమ దృష్టికి వచ్చిన ఆయిల్ ట్యాంకర్లను తనిఖీలు చేస్తున్నాం. గడిచిన ఏడాది రెండు కేసులు నమోదు చేశాం. ట్యాంకర్లు పట్టుబడితే అందులో ఉన్న డీజిల్ను బట్టి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. ఇక డీజిల్ దొంగల విషయం గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. – నాగరాజ్, సివిల్ సప్లయ్ అధికారి, నారాయణపేట నిఘా వైఫల్యమే.. ఇంత పెద్ద ఎత్తున కర్ణాటక నుంచే కాకుండా జాతీయ రహదారులపై ఆగిన లారీల నుంచి డిజీల్ చోరీ చేస్తు సరిహద్దు చెక్పోస్టును తప్పించుకొని ఎలా వస్తున్నారు. అక్కడ తప్పించుకున్న జాతీయ రహదారిపై మాగనూరు, మక్తల్, మరికల్, దేవరకద్ర, మహబూబ్నగర్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై నిత్యం 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ వాహనాలు ఉన్నా వీరు డిజిల్ కార్లు, ట్యాంకర్లను ఎలా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి అటు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న వారిపై, ఇటు వాహనాల్లో డీజిల్ దొంగతనం చేసే వారిని పట్టుకొని కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు. కర్ణాటక నుంచి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న వైనం అక్కడ లీటర్ రూ. 87.. ఇక్కడ రూ.96 రాత్రికి రాత్రే సరిహద్దు దాటుతున్న ట్యాంకర్లు -
‘గండేడ్’లో ఘరానా దొంగ..!
గండేడ్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్ల కృష్ణయ్యకు 39/అ/1లో 1.06 ఎకరాల భూమి ఉంది. అతడి తండ్రి మైబయ్య పేరుపై ఇదే సర్వే నంబరులో 0.22 ఎకరాల భూమి ఉంది. మైబయ్య 2013లో మృతిచెందిన తర్వాత విరాసత్ కింద ఆ భూమిని సైతం కృష్ణయ్య తన పేరుపై మార్చుకున్నాడు. మైబయ్య మృతి చెందినప్పుడు రైతు బీమా పథకం లేదు. ఎప్పుడైతే ఆ భూమిని కృష్ణయ్య తన పేరు మీద మార్చుకున్నాడో.. గండేడ్ మండలానికి చెందిన ఓ మోసగాడు రైతు బీమాతో లబ్ధిపొందాలని భావించి తన ప్లాన్ను అమలు చేశాడు. సదరు సర్వే నంబర్కు బై నంబర్ 39/రుగా మార్చి 4.28 ఎకరాలు ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆధార్కార్డులో మైబయ్య పేరు అలాగే ఉంచి.. అతడి ఫొటోకు బదులు కృష్ణయ్య ఫొటోను మార్ఫింగ్ చేశాడు. డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. అనంతరం మృతి చెందిన మైబయ్య పేరిట రైతుబీమాకు దరఖాస్తు చేశాడు. ఆ డబ్బులు వచ్చాయా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు. ..ఇలా ఒక్క కృష్ణయ్య మాత్రమే కాదు. మహబూబ్నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడ మండలాల్లో వందలాది మంది బాధితులు ఉన్నారు. మృతిచెందిన వ్యక్తులు.. వారి కుటుంబాలే టార్గెట్గా ఓ వ్యక్తి కొన్నేళ్లుగా మోసాలకు తెగబడ్డాడు. బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో కుమ్మకై ్క ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. అమాయక ప్రజలతోపాటు బ్యాంకులు, ప్రభుత్వాన్నీ బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి లీలలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రెవెన్యూ సిబ్బంది, బ్యాంకర్ల హస్తం.. గండేడ్, మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో సదరు మోసగాడికి మంచి పరిచయాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పర్సంటేజీలతో వారిని మచ్చిక చేసుకుని దందా నడిపించినట్లు సమాచారం. అతను తీసుకొచ్చిన వారందరికీ రుణ మంజూరులో బ్యాంకర్లు ఎలాంటి అడ్డంకులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలను.. పరిశీలించకుండా రుణాలు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకుల్లో కొందరు కిందిస్థాయి సిబ్బంది కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో పనిచేసిన కొంత మంది రెవెన్యూ సిబ్బంది కూడా దీనికి వంతపాడినట్లు తెలుస్తోంది. కాగా, సదరు మోసగాడి బాగోతాలపై బాధితులు ఇటీవల మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని.. విచారణ జరుగుతోందని సీఐ తెలిపారు. ఎలా అంటే.. గొల్ల, కురుమలకు ఆరాధ్య దేవుడి పేరు కలిగిన గండేడ్ మండలానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఇంటి పేరు, లేదా పేరు, లేదా తండ్రి పేరు ఒకటే ఉన్న వారిని ఎంచుకుని మరి వారిని బురిడీ కొట్టిస్తున్నాడు. ఆధార్, రేషన్కార్డుల మార్ఫింగ్తో మాయాజాలం ప్రదర్శిస్తూ.. సదరు వ్యక్తులపై భూమి లేకున్నా ఉన్నట్లు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు, ఇన్సూరెన్స్ సొమ్ము కాజేశాడు. బతికున్న వారి పేరిట తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు పుట్టించి.. బతికుండగానే పలువురు రైతుల పేరిట రైతు బీమా పొందినట్లు సమాచారం. అధికారులకు అనుమానం రాగా.. ఒకరిద్దరివి నిలిచిపోయినట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. మోసగాడి వలలో చిక్కి వందలాది మంది అమాయకులు విలవిల్లాడుతున్నారు. ● మృతిచెందిన వారే టార్గెట్గా మోసాలు ● పలువురు బ్యాంకర్లు, ప్రభుత్వ సిబ్బందితో కుమ్మక్కు ● ఆధార్, రేషన్కార్డుల మార్ఫింగ్తో మాయాజాలం ● భూమి లేకున్నా ఉన్నట్లు సృష్టించి స్వాహా పర్వం ● బ్యాంకుల్లో రుణాలు, ఇన్సూరెన్స్ సొమ్ము కాజేత ● బతికున్న వారి పేరిట తప్పుడు డెత్ సర్టిఫికెట్లు.. ● రైతు బీమా పొందేందుకూ యత్నాలు ● మోసగాడి వలలో చిక్కి విలవిల్లాడుతున్న అమాయకులు -
పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి చేద్దాం
కొల్లాపూర్: పెరుగుతున్న డిమాండ్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ హితమై న విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నాగర్కర్నూ ల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో జెన్కో, ట్రాన్స్కో అధికారులతో విద్యుదుత్పత్తి, వి నియోగం, ఉత్పాదక సామర్థ్యం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. హైడల్ పవర్తోపాటు పంప్డ్ స్టోరేజీతో పెద్దఎత్తున విద్యుదుత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 23 పాయింట్స్ గుర్తించి, వాటిమీద సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కృష్ణానదిపై ఉన్న జూరాల నుంచి పులిచింతల వరకు గల హైడల్ ప్రాజెక్టులను సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే అంతర్జాతీయంగా పేరుగాంచిన కన్సల్టెంట్ల సహకారం తీసుకోవాలని చెప్పారు. సోలార్ ద్వారా పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్ను స్టోరేజీ చేసి రాత్రివేళల్లో వినియోగించుకునేందుకు సాంకేతిక, స్టోరేజీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. 1978 లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తోషిబా, మిస్టు బుషి వంటి సంస్థల సాంకేతికతను వినియోగించుకున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. సాంకేతికత వినియోగం కోసం కిందిస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం స్థానిక లంబాడీ గిరిజనులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట రూరల్: శారీరక రుగ్మతలను తొలగించుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని డీఈఓ గోవిందరాజులు, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో ఆదివారం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన విధానంలో యోగా అలవర్చుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 120 మంది విద్యార్థులు యోగా పోటీల్లో పాల్గొనగా.. చక్కటి ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. ● జిల్లాస్థాయి యోగా పోటీల్లో సబ్ జూనియర్ విభాగం నుంచి సాయిచరణ్, విఘ్నేశ్, చరణ్తేజ, వనజ, లావణ్య, హారిక, జూనియర్ విభాగంలో నందిని, పార్వతి, సృజన, సీనియర్ విభాగంలో బాలకృష్ణ, సూర్యప్రకాశ్, వెంకటేశ్, మల్లికార్జున్, రజిత, ప్రసన్న, రజినీ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో డీఎస్ఓ భాను ప్రకాశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యానికి భరోసా!
నారాయణపేట: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఎంతో మంది బాలబాలికల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. బడికి వెళ్లి పాఠాలు చదువుకోవాల్సిన చిన్నారులు కొందరు ఇటుక బట్టీలు, హోటళ్లు, పశువులు, గొర్రెల కాపరులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రతి ఏడాది జనవరి 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశానిర్దేశంతో గత నెలలో ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. వివిధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల పల్లెల్లో సైతం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 56మంది బాలకార్మికులను గుర్తించడంతో పాటు 20 కేసులు నమోదు చేశారు. ఏడేళ్లలో 59 కేసులు నమోదు.. 2019 నుంచి ప్రతి ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా 1,124 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పినా వినని వారిపై 59 కేసులు సైతం నమోదు చేశారు. పలువురికి జరిమానాలు విధించారు. ఇదిలా ఉంటే, గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బాలకార్మికులను గుర్తించేందుకు పోలీసు, కార్మికశాఖ, చైల్డ్ లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖి, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు ఇతర పని ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలను గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమ రవాణాకు గురైన బాలలను రక్షించి.. పునరావాసం కల్పించడంతో పాటు చట్టపరమైన హక్కులు, రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు. సత్ఫలితాన్నిస్తున్న ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ప్రతి ఏటా జనవరి, జూలైలో విస్తృతంగా తనిఖీలు ఏడేళ్లలో 1,124 మంది బాలకార్మికులకు విముక్తి -
భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దు
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథ కం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చె ల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎకరా భూమికి ఇస్తామన్న పరిహారం రూ. 14లక్షలు ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ డబ్బుతో మరో ప్రాంతంలో భూమి కొనే పరిస్థితి లేదన్నారు. న్యాయమైన పరిహారం కోసం 20 రోజులుగా భూ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించ డం సరికాదన్నారు. ప్రాజెక్టులకు భూములు ఇస్తు న్న భూ నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కో రారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఇచ్చే భూముల ధర నిర్ణయించేందుకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాల్రాం మాట్లాడుతూ.. అన్నివిధాలా వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతానికి పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం మంచిదేనని.. అదే స్థాయిలో భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రాధా న్యం ఇచ్చి తగిన పరిహారం అందించాలని కోరారు. కాగా, భూ నిర్వాసితుల ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రూరల్ ఎస్ఐ రాముడు, పట్టణ ఏఎస్ఐలు ఆంజనేయులు, అంజిలయ్య బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఆంజనేయులు, హనుమంతు, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
చదువులమ్మ ఒడిలో.. సరిగమలు
సంగీతం ఒక అద్భుతం. సృష్టిలో దాని స్థానం అద్వితీయం. అందుకే చదువుల తల్లి సరస్వతిదేవికి కూడా ఒక చేతిలో పుస్తకం.. మరో చేతిలో వీణ ఉంటుంది. రాతియుగం నుంచి కంప్యూటర్ యుగం దాకా సంగీతం స్వేచ్ఛగా రాజ్యమేలుతుంది. ఇంతటి మహత్తు కలిగిన సంగీత నాదం చదువులోనూ తోడైతే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆమేరకు చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు బోధించేందుకు నిర్ణయించాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులకు ఈ సంగీత పరికరాల సాధన ద్వారా కొంతైనా ఉపశమనం కలగనుంది. అంతేగాక, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాయపడనుంది. ఈమేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 36 పాఠశాలలను ఎంపిక చేశారు. – నారాయణపేట రూరల్/ అచ్చంపేట రూరల్కళలనుప్రోత్సహించడం హర్షణీయం పిల్లలకు చదువుతోపాటు వివిధ కలలను నేర్పించడం ఎంతో హర్షనీయం. చిన్నతనం నుంచి సంగీతం నేర్చుకోవడం వల్ల దేశ సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయి. సంగీతం వల్ల మనస్సు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కళల్లో ప్రావిణ్యం సంపాదిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బాల కేంద్రానికి పరిమితమైన సంగీత శిక్షణ పాఠశాలకు విస్తరించడం స్వాగతిస్తున్నాం. – మహిపాల్రెడ్డి, ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిభను వెలికితీసేలా.. ప్రభుత్వ బడుల్లో విద్యతోపాటు సంగీత తరగతుల నిర్వహణతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధనతో అలసటకు గురయ్యే పిల్లలు సంగీతంతో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక పాఠశాలలో టీచర్లు పాటాలను కథలు, గేయాల రూపంలో చెబుతూ విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. సంగీత తరగతులు సత్ఫలితాలిస్తాయి. – అన్నపూర్ణ, జీహెచ్ఎం, కానుకుర్తి, నారాయణపేట సంగీత పరికరాలు వచ్చాయి పీఎంశ్రీ పథకంలో జిల్లాలోని ఎంపిక చేయబడ్డ పాఠశాలలకు మొదటి విడత కింద సంగీత పరికరాలను పంపిణీ చేశారు. దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. 6నుంచి 12వ తరగతి విద్యార్థులకు వారానికి ఒక్కో పీరియడ్ సంగీతం, వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేందుకు టైం టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో శిక్షకుల నియామకానికి సూచనలు చేశాం. – గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే వంటి అంశాలను ఐచ్చికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది. తాజాగా సంగీత పాటలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎం శ్రీ కింద ఎంపిక కాబడిన బడులకు ముందు అవకాశం కల్పించనుంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలను మొదటి విడత కింద ఎంపిక చేసి సంబంధిత పరికరాలను ఆ బడులకు పంపిణీ చేశారు. ఈమేరకు విద్యార్థులు రోజు పాఠ్యాంశాల బోధనకు పరిమితం కాకుండా వారంలో ఒక రోజు సంగీత పాఠాలు నేర్చుకోకున్నారు. దీంతో పిల్లలకు శ్రావణానందంతో పాటు ఏకాగ్రత పెరగనుంది. సంగీత సాధనతో వివిధ రకాలైన కళల్లో ప్రావీణ్యం పొందనున్నారు. పిల్లలు వాటిని నేర్చుకునేందుకు మరింత ఆసక్తి చూపనున్నారు. సంగీత సాధనతో టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయా వృత్తులలో సైతం స్థిరపడేందుకు ఉపకరిస్తుంది. శిక్షకులు వస్తే ప్రయోజనం పాఠశాలలకు సంగీత వాయిద్య పరికరాలు అంది నెల రోజులు అవుతుంది. కానీ, విద్యార్థులతో సాధన చేయించే శిక్షకులను మాత్రం ఇంకా నియమించలేదు. అన్ని రకాల వాయిద్యాలు తెలిసినవారు అరుదుగా ఉంటారు. సాధారణంగా ఒక్కో దాంట్లో ఒక్కొక్కరికి ప్రావీణ్యం ఉంటుంది. ఇలాంటి వారిని ఎంపిక చేయడం సులభమే కానీ అన్ని తెలిసిన వారికి రూ.10వేల గౌరవ వేతనం సరిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. భిన్న రంగాల్లో ప్రతిభ ఉన్న ఇద్దరిని నియమించి వేతన సర్దుబాటు చేస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు అంటున్నారు. సంగీత పాటలు బోధించడంలో ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే సంగీత ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే సంగీత పాటలు బోధించేందుకు ఆస్కారం ఉంటుంది. 36 పాఠశాలలకు పరికరాల పంపిణీ ఉమ్మడి జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికై న 36 పాఠశాలలకు సంగీత పరికరాలను పంపిణీ చేశారు. డోలక్, తబలా, హార్మోనియం, డ్రమ్స్, వయోలిన్ వంటివి అందించారు. వీటిని 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులతో పాటు కేజీబీవీ, గురుకుల, మోడల్ స్కూళ్లలో ఇంటర్ విద్యార్థులకు సైతం నేర్పించనున్నారు. తగ్గుముఖం పట్టిన వరద ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం తగ్గుముఖం పట్టింది. –8లో uప్రభుత్వ పాఠశాలల్లో సంగీత పాఠాలు పీఎంశ్రీ స్కూల్స్కు వాయిద్య పరికరాలు అందజేత వారానికి ఒక తరగతి చొప్పున నిర్వహణ శిక్షకుల నియామకానికి కమిటీ ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో 36 పాఠశాలలు ఎంపిక -
‘పాలమూరు’పై బీఆర్ఎస్ నిర్లక్ష్యం
కొల్లాపూర్: ‘పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది.. ప్రాజెక్టు పనులు పూర్తిచేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీటిని నింపుకొనేవాళ్లం.. పాలమూరు ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, కేఎల్ఐ ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం.. ఇందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని’ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించి.. పలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం రాజాబంగ్లా ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు, రేషన్కార్డులు, రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొల్లాపూర్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1980లో మల్లు అనంతరాములు నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేశారని, తాను అప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించానని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్రావు, రామచందర్రావుతో పాటు కుడికిళ్ల గుప్తా, బాలస్వామిరెడ్డి వంటి వారు గుర్తున్నారన్నారు. మధిర ప్రజలతో ఉన్న అనుబంధమే కొల్లాపూర్ ప్రజలతోనూ ఉందన్నారు. ఇది ఒకప్పటి కోన్పూచ్తా కొల్లాపూర్ కాదని, సబ్పూచ్తే కొల్లాపూర్ అన్నారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్రెడ్డి, కొల్లాపూర్తో అనుబంధం ఉన్న నేను ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో తొలగించిన బ్యాంకులన్నింటినీ తిరిగి గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు బ్యాంకింగ్ అధికారులతో మాట్లాడతామన్నారు. శ్రీశైలం నిర్వాసితుల అంశం ఆర్థిక పరమైనది కాబట్టి దీనిపై పరిశీలన చేసి చెబుతానన్నారు. ముంపు బాధితుల కోసం జూపల్లి కోరిన 3 వేల అదనపు ఇళ్ల గురించి కలెక్టర్లతో మాట్లాడి సమాచారం తెలుసుకొని తగిన న్యాయం చేస్తానన్నారు. డిజిటల్ బుక్స్ ఆవిష్కరణ.. ఐఐఎఫ్సీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ విద్యార్థుల కోసం రూపొందించిన డిజిటల్ బుక్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. వీటికి సహకరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు జగదీశ్వర్రావు, ఒబేదుల్లా కొత్వాల్, సరిత పాల్గొన్నారు. అభివృద్ధికి సహకరించండి: మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దికి సహకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎంను కోరారు. కొల్లాపూర్కు ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు పంచాయతీ కార్యదర్శి, లష్కర్ పోస్టులు ఇవ్వాలని, లేనిపక్షంలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని, నిర్వాసితుల కోసం నియోజకవర్గానికి అదనంగా 3 వేల ఇళ్లు మంజూరు చేయాలని, నక్సల్స్ కారణంగా గ్రామాల్లో ఎత్తేసిన బ్యాంకులను తిరిగి ఏర్పాటు చేయాలని విన్నవించారు. అప్పుడే పూర్తి చేసి ఉంటే రిజర్వాయర్లలో కృష్ణానీళ్లునింపుకొనేవాళ్లం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అసంపూర్తి పనులకు నిధులు కేటాయిస్తాం అడ్వాన్స్ టెక్నాలజీతో ఐటీఐ ఏర్పాటుకు కృషి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి కొల్లాపూర్ నియోజకవర్గంలో విస్తృత పర్యటన -
అక్ర మాలకు చెక్..!
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ (ముఖ గుర్తింపు) అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి చేయూత పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానం అమలుపై సెర్ఫ్ పెన్షన్ విభాగం డీపీఎం, ఏపీఎంలకు ఇది వరకే హైదరాబాద్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామాల వారీగా పంపిణీ చేసే పోస్టల్ శాఖకు సంబంధించిన బీపీఎంలకు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లకు ఇటీవలే అవగాహన కల్పించారు. ప్రభుత్వం జులై 29 నుంచి ఎస్ఆర్ఎస్ విధానం అమల్లోకి తేవడంతో బయోమెట్రిక్ సమస్యలకు తెరపడినట్లయింది. పోస్టాఫీసుల్లో ఎఫ్ఆర్ఎస్ సిస్టం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పోస్టాఫీసుల్లో మొదటి విడతగా ఫేసియల్ రికగ్నేషన్ సిస్టంతో జిల్లా వ్యాప్తంగా పింఛన్లు చెల్లిస్తున్నారు. ఈ విధానంలో లబ్ధిదారుడి ఫొటో తీసి ఆధార్తో సరిపోల్చుకొని యాప్లో అప్లోడ్ చేస్తారు. ఫొటోలు తీసినా కూడా యాప్లో చూపించకపోతే ఈ సారి బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు ఇచ్చేశారు. బయోమెట్రిక్, ముఖ గుర్తింపు పనిచేయని వారుంటే పంచాయతీ కార్యదర్శులు వేలి ముద్రలు వేసి ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అవినీతికి ఆస్కారం లేదు మున్సిపాలిటీల్లో పింఛన్ను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. కానీ పింఛన్దారులు మృతి చెందినా.. వారి కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా నగదును ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటున్నారని తెలుస్తోంది. గ్రామాల్లో సైతం మృతి చెందిన ఫించన్దారుల డబ్బులను పంచాయతీ కార్యదర్శులు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పింఛన్ చెల్లింది 45 శాతమే.. మొదటగా పోస్టాఫీస్ల్లో పింఛన్ తీసుకునే వారికి ఎఫ్ఆర్ఎస్ విధానం అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 74,608 మంది పింఛన్దారులుండగా.. వారికి రూ.19.03 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు రూ.8.18కోట్లు ఇవ్వడంతో 45 శాతమే చెల్లించినట్లయింది. ఇంకా 55 శాతం చెల్లించాల్సి ఉంది. జిల్లాలో వృద్ధులు 26,340, చేనేత 2,546, వితంతువులు 30,259, గీత కార్మికులు 900, బీడీ వర్కర్లు 1,172, ఒంటరి మహిళలు 3,160, వికలాంగులు 9,957, ఫైలేరియా పేషెంట్లు 164, డయాలసిస్ పేషెంట్లు 110 మంది ఉన్నారు. సాధారణ పింఛన్దారులకు రూ. 2,016, దివ్యాంగులకు రూ.4,016 ఇస్తున్నారు. చేయూత లబ్ధిదారుల ముఖం స్కాన్ చేస్తేనే పింఛన్ అందజేత జిల్లాలో 74,608 పింఛన్దారులు పింఛన్ చెల్లించింది 45 శాతమే ఎఫ్ఆర్ఎస్పై సిబ్బందికి శిక్షణ -
ఎఫ్ఆర్ఎస్తో స్పీడ్గా
ఇది వరకు చేయూత పింఛన్లను బయో మెట్రిక్ ద్వారా చెల్లించే వాళ్లం. అయితే వృద్ధులు పింఛన్ పొందేందుకు ఇబ్బందులు పడేవారు. వారి చేతి వేలిముద్రలు అరిగిపోవడంతో తొందరగా మ్యాచ్ అయ్యేది కాదు. ఫేస్ రికగ్నేషన్తో పది సెకండ్లలో పింఛన్ పొందే అవకాశం లభించింది. – వెంకటేశ్, ఏబీపీఎం, కొత్తపల్లి పారదర్శకతతో పింఛన్ పంపిణీ ఫే్స రికగ్నేషన్ యాప్తో పారదర్శకతతో పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పటికే డీపీఎంలు, ఏపీఎంలు, బీపీఎంలకు శిక్షణనిచ్చాం. స్మార్ట్ఫోన్లలో ఎఫ్ఆర్సీ యాప్ ద్వారా జిల్లావ్యాప్తంగా పింఛన్ పంపిణీ చేస్తున్నారు. – మొగులప్ప, డీఆర్డీఓ, నారాయణపేట వేలిముద్రతోనే బాగుండే.. సెల్ఫోన్లో ఫొటో తీసే సమయంలో కళ్లు కొట్టుకోవడంతో పింఛన్ తీసుకోవడం ఆలస్యం అవుతుంది. వృద్ధులు కావడం, కళ్ల ఆపరేషన్ అవడం, కంటి సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు వస్తున్నాయి. అదే పాతపద్ధతి వేలిముద్ర ద్వారా త్వరగా తీసుకునే అవకాశం ఉంది. – వెంకటన్న, వృద్ధుడు, మరికల్ ● -
సాంకేతికతతో కూడిన విద్య అందించాలి
● తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన కోస్గి రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం సాంకేతికతతో కూడిన విద్య అందించాలని తెలంగాణ రారష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ఆమె సందర్శించి, హెచ్ఓడీ, ప్రిన్సిపాల్తో రివ్యూ చేపట్టారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్, హాస్టల్ సౌకర్యం ఉండాలని, సిబ్బంది కొరత ఉంటే తేలియజేయాలన్నారు. కళాశాలల నిర్వహణ సక్రమంగా లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కోస్గి కళాశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఆనంతరం బాలుర వసతి గృహన్ని సందర్శించి, భోజనాన్ని, నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రెయిని కలెక్టర్ ప్రణయ్కుమార్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. శ్రామికుల శ్రమ దోపిడీపై పోరాటం నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 282 జీఓతో 12 గంటల పని దినం ప్రవేశపెట్టడం శ్రామికులను నిలువు దోపిడి చేయడమేనని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తితో 8 గంటల పని దినాన్ని నేడు ప్రభుత్వాలు రూపమాపేందుకు ప్రయత్నిస్తున్నాయని వాపోయారు. దేశంలో మొదటగా గుజరాత్, ఆ తర్వాత కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ 12 గంటల పని దినాన్ని అమలు చేసేందుకు జీఓలు జారీ చేయడం దారుణమన్నారు. రూ.16 లక్షల కోట్లు ఆస్తులున్న అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ శక్తులకు రైట్ ఆఫ్ చేసిన కేంద్ర ప్రభుత్వం కార్మికులకు మాత్రం కనీస వేతనం రూ.26 వేలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తుందని దుయ్యబట్టారు. స్వాతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటిని సవరించి యజమానులకు అనుకూలంగా నాలుగు కార్మిక కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఆగస్టు 10న మక్తల్లో నిర్వహించే అంగన్వాడీ, ఆగస్టు 11న ఆశా వర్కర్స్ నారాయణపేట జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్రాం, ఉపాధ్యక్షుడు జ్యోషి తదితరులు పాల్గొన్నారు. రైతు హితమే కేంద్రం అభిమతం మహబూబ్నగర్ రూరల్: రైతు హితమే కేంద్ర ప్రభుత్వ అభిమతం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం పీఎం కిసాన్ సమ్మాన్ 20వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని అధికారులు, రైతులతో కలిసి ఆమె ప్రత్యక్షంగా ప్రధాని మోదీ సందేశాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, చెప్పిందే చేసి చూపుతుందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలోని 65,996 మంది రైతులకు లబ్ధి కలిగిందన్నారు. ఏడాదిలో ఎకరాకు రూ.18వేల సబ్సిడీతో ఎరువులు అందించడంతో పాటు ధాన్యం సేకరణ కోసం అయ్యే ప్రతి రూపాయిని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకే కిసాన్ సమ్మాన్, ఫసల్ బీమా యోజన, పీఎం ధాన్య సమృద్ధి కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి ఎన్నో పథకాలను తీసుకు వచ్చామన్నారు. -
నర్వకు సంపూర్ణ అభియాన్ రాష్ట్రస్థాయి ర్యాంకు
నర్వ: నీతి అయోగ్ చేపట్టిన సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలం మూడు నెలలుగా సాధించిన ప్రగతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న గట్టు మండలంతో పాటు నర్వ మండలం సిల్వర్ మెడల్ సాధించింది. ఆరు విభాగాల్లో ప్రగతి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఆరు విభాగాల్లో న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్, విద్య, నీటి వసతితో పాటు సోషల్ సెక్టార్లో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. కార్యక్రమంలో గర్భిణులకు, ఆరోగ్య, పోషణ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. మండలంలో 21,405 మందికి బీపీ, షుగర్, టీబీ పరీక్షలు నిర్వహించారు. సంపూర్ణ అభియాన్ ద్వారా స్థానిక పీహెచ్సీకి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు 7,145 ఆరోగ్య మట్టి పరీక్షలు నిర్వహించి పరీక్షల కార్డులను రైతులకు అందించారు. మరో 3,200 కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నారు. సోషల్సెక్టార్ కింద మహిళా సంఘాలకు రూ.9.40 కోట్లు రుణాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం లబ్ధిదారులు వినియోగించుకునేలా చేసి మెరుగైన ఫలితాలు సాధించారు. కేంద్ర మంత్రి రాకతో.. సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలంలో మూడు నెలల ప్రగతిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విచ్చేసి ఆరు విభాగాల పనితీరును పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. నేడు రాజ్భవన్లో అవార్డు అందుకోనున్న ఎంపీడీఓ -
జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం
నారాయణపేట: నీతి ఆయోగ్ ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమం కింద శుక్రవారం జిల్లా, నర్వ మండల అధికారులు, సంపూర్ణ అభియాన్ సమ్మన్ సమరోహ్ కింద నర్వలోని ఫ్రంట్లైన్ కార్మికులకు సౌకర్యాలు కల్పించడానికి జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్లో జిల్లా స్థాయి అవార్డులను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించి సంపూర్ణ అభియాన్– ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి రంగాల నుంచి సూచికల సంతృప్తం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్ మాట్లాడుతూ అధికారులు నిజాయితీగా పని చేయాలని, కేపీఐ సూచికలను సంతృప్తి పరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, నోడల్ అధికారి మొగులప్ప, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, డాక్టర్ శైలజ, నర్వ ఎంపీడీఓ శ్రీనివాస్, సీడీపీఓ, మెప్మా అధికారులు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు వైఎస్ఆర్.. నేడు రేవంత్రెడ్డి
నారాయణపేట/ఊట్కూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాడు సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేశారని, మళ్లీ పదిహేనేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఉట్కూరు మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఊట్కూర్ మండలానికి మంజూరైన 1,261కొత్త రేషన్ కార్డులు, 122 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలతో పాటు మండలానికి చెందిన 14 మంది భూ నిర్వాసితులకు రూ.50 లక్షల నష్టపరిహారం చెక్కులను రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల మంజూరు, నిర్మాణ విషయంలో ఎవరైనా ఒక్క పైసా అడిగినా నేరుగా తనకు ఫోన్ చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉట్కూర్ మండలానికి రూ.25 కోట్ల నిధులతో 500 ఇళ్లు మంజూరు చేశానని, అవి తొందరగా పూర్తి చేసుకుంటే అదనంగా మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 39 వేల ఎకరాలకు.. జీఓ 69 ద్వారా బీడు వారిన 39 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం లభించిందన్నారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు 5,045 మందికి ఒకరికి 6 కిలోల చొప్పున ఇచ్చే 30,624 కిలోల సన్న బియ్యం పంపిణీకి నెలకు ప్రభుత్వం రూ.1.40 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మండలానికి ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీఎస్ఓ బాలరాజ్, తహసీల్దార్ సింధూజ, ఇన్చార్జి తహసీల్దార్ సతీష్కుమార్, ఎంపీడీఓ ధనుంజయ్గౌడ్, ఎల్కోటి నారాయణరెడ్డి, ప్రకాష్రెడ్డి, యజ్ఞేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో.. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామస్తులకు ఆర్డీఓ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డితో కలిసి ఆర్డీఓ రాంచందర్నాయక్ నష్టపరిహరం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగారెడ్డిపల్లిలో 1.33 ఎకరాలకు సంబంధించి 11 మంది రైతులకు రూ.26.27 లక్షల విలువ చేసే చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఈదప్ప ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలిచ్చారు.. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి -
అద్దె బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న బస్సుల యజమానులు, డ్రైవర్లు శుక్రవారం మెరుపు సమ్మె చేపట్టారు. ఇటీవల డిపోలో ఆరు కొత్త షెడ్యూల్ను తయారు చేసే క్రమంలో హైదరాబాద్ రూట్లో నడుస్తున్న అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల ఇన్కమింగ్ సమయం దాదాపు గంట పెరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్కు నడిచే పల్లె వెలుగు బస్సులు అప్పక్పల్లి వద్ద గల జిల్లా ఆస్పత్రి వరకు లోపలికి వెళ్లి రావాల్సి ఉండటంతో రోడ్డు ఎత్తుగా ఉన్నందున డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ప్రతి సర్వీస్కు ఇవ్వాల్సిన 10 కిలోమీటర్ల అదనపు డబ్బులు చెల్లించలేదు. వీటిపై స్థానిక డిపో మేనేజర్ లావణ్యతో యజమానులు మాట్లాడగా.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రోజువారీగా తిరగాల్సిన బస్సుల్లో సగానికి పైగా నిలిచిపోయాయి. ఇతర డిపోల నుంచి.. ప్రైవేటు బస్సుల సమ్మెతో నిలిచిపోయిన సర్వీసుల స్థానంలో మహబూబ్నగర్, తాండూర్, కోస్గి, గద్వాల డిపోల నుంచి బస్సులను తెప్పించి రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయాణికులు బస్సులు చాలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారుల సమీక్ష.. సమ్మైపె కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించి డిపో మేనేజర్ లావణ్యతో తన చాంబర్ సమావేశమయ్యారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి మెడికల్ కళాశాల రోడ్డు విషయంలో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎక్స్ప్రెస్ సర్వీసుల సమయపాలన విషయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వాకబు చేసి ప్రైవేటు బస్సు యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. మధ్యాహ్నం తర్వాత మహబూబ్నగర్ ఆర్ఎం కార్యాలయంలో ప్రైవేట్ వాహన యజమానులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అటెండెన్స్ ఇవ్వకుండా సెలవు వేశారు.. రోజులాగే డిపోకు వచ్చిన కండక్టర్లు చాట్లో సంతకాలు చేశారు. అయితే ప్రైవేట్ బస్సులు సమ్మె చేపట్టడంతో అందులో విధులు నిర్వర్తించాల్సిన కండక్టర్లు డిపోకే పరిమితమయ్యారు. అయితే వారు డ్యూటీ కోసం వచ్చినా.. వారి ప్రమేయం లేకుండా బస్సులు ఆగిపోయినా వారికి అటెండెన్స్ ఇవ్వకుండా వ్యక్తిగత సెలవులు ఇచ్చారు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ప్రయాణికులు, విద్యార్థులు రద్దీగా ఉండే మక్తల్, కోస్గి, మహబూబ్నగర్, హైదరాబాద్ రూట్లలో బస్సులు తగ్గిపోగా ఆయా మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్గా మార్చి పంపించారు. చాలా గ్రామాలకు విద్యార్థుల బస్సులు వెళ్లకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. మరికొందరు పాఠశాలలకు గైర్హాజరయ్యారు. -
‘అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవద్దు’
● ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలి ● హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గొప్పలకు పోయి అప్పులు చేసి ఇంటిని నిర్మించుకోవద్దని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య సూచించారు. శుక్రవారం ఉమ్మడి మద్దూరు మండలంలోని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న హన్మనాయక్తండా, గోకుల్నగర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు, ఏ ఏ దశల్లో ఉన్నాయని డీఈ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మే విధంగా చూడాలని, ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు రహ్మతుద్దీన్, వెంకట్కృష్ణ, ఎంపీఓ రామన్న, తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్గా శ్రీను నారాయణపేట: స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా శుక్రవారం ఎస్.శ్రీను బాధ్యతలు స్వీకరించారు. కల్వకుర్తి ఆర్డీఓగా పనిచేస్తున్న శ్రీను పదోన్నతిపై నారాయణపేట జిల్లాకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకె అందజేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలు నారాయణపేట క్రైం: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను వ్యాప్తి చేసినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో తుది విడత అడ్మిషన్లు కోస్గి రూరల్: స్థానిక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అందుబాటులో ఉన్న నూతన కోర్సు ల్లో చేరేందుకు తుది విడత అడ్మిషన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న స్లాట్ బుకింగ్, 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, 10న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈఏపీఈసెట్ అర్హత ఉన్నా, లేకపోయినా ఈ నెల 23న అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్స్, బాలురకు హాస్టల్ వసతి ఉందన్నారు. -
పదోన్నతుల సందడి
నిరంతర పోరాటం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. –8లో u● నేటినుంచి ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకుగెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 11 వరకు.. -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు.. మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
అత్తాకోడళ్లవి వెన్నుపోటు రాజకీయాలు
నారాయణపేట/ధన్వాడ: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఇటీవల పాలమూరులో జరిగిన సభలో ఎంపీ డీకే అరుణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోడలు పర్ణికారెడ్డి గెలుపునకు ఎంపీ తెర వెనుక మద్దతు తెలుపారని.. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్త ఎంపీ డీకే అరుణకు తెర వెనుక మద్దతు తెలిపి కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచిందెవరో నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అత్తాకోడళ్లు సొంత ఊరు ధన్వాడ అని చెప్పుకొంటున్నారని.. ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంత్రులు పంచాయతీ ఎన్నికలపై తలోమాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా నిర్వహణకు ముందుకు రావడం లేదన్నారు. ధన్వాడ పెద్ద చెరువులో ఒండ్రుమట్టి తరలింపు నీరు నింపేందుకా లేక జేబులు నింపుకొనేందుకా అని ప్రశ్నించారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కనబెట్టి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారని.. కష్టపడితే ఊరూరా గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కావలి భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు వాహిద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు సునీల్రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, దామోదర్రెడ్డి, నాయకులు మురళీధర్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి -
ఎమ్మెల్సీ కవిత మాటలు బాధ్యతా రాహిత్యం
నారాయణపేట: పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, ఈ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మానుకోవాలని మార్కెట్ చైర్మన్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించామని చెప్పే బీఆర్ఎస్ నాయకులు నేడు కానుకుర్తికి వచ్చి ప్రాజెక్టుపై రైతులను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశారని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత మేధావులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు ఏళ్ల తరబడి పోరాటం చేశారని, నిర్మాణం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని.. ఊట్కూర్, పేరపళ్ల జాయ మ్మ చెరువు, కానుకుర్తి రిజర్వాయర్ల ద్వారా చెరువులు నింపే పథకమన్నారు. బాధితులకు చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా నష్ట పరిహారం అందిస్తారని.. ఎవరూ బలవంతంగా భూములు ఇవ్వడం లేదని, కోర్టు మార్గం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ అమాయక రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా కాల్వల నిర్మాణం చేయకుండానే నీళ్లు ఇస్తామంటూ మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రైతులను మోసం చేస్తే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఈదప్ప, ఎండీ గౌస్, శ్రీనివాస్, శరణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు క్రీడల్లోనూ రాణించాలి
నారాయణపేట రూరల్: బాలికలు బాలుర కంటే ముందుండి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకాంక్షించారు. జిల్లాకేంద్రంలో మహిళ, శిశు సంక్షేమశాఖ పరిధిలో కొనసాగుతున్న మహిళా సాధికారత కేంద్రంలో గురువారం అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందని.. వినూత్న కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేష్, పీఈటీ సాయినాథ్, అక్తర్ పాషా, ఖేలో ఇండియా కోచ్ హారికదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్లు అనిత, నర్సింహ, క్రికెట్ కోచ్ అజయ్, అథ్లెటిక్స్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట రూరల్: హైదరాబాద్లోని బేగంపేట, రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా మహబూబ్నగర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 13న లాటరీ విధానంలో ఆరుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నేతన్నలు దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తోందని.. అర్హులైన నేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి డి.బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. నేతన్న భరోసా పథకంలో నమోదైన కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు మంజూరవుతాయని.. నేతన్న పొదుపులో నమోదైన కార్మికులు, అనుబంధ కార్మికులు ఆయా పథకాలకు అర్హులని పేర్కొన్నారు. అర్హులందరూ 5వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, గతేడాది నేతన్న బీమా పథకంలో నమోదైన చేనేత కార్మికులు దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. బలవంతపు భూ సేకరణ వద్దు నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతలలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా గత పాలకుల మాదిరిగా బలవంతంగా భూ సేకరణ చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారం 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం మొండిగా ఎకరా రూ.14 లక్షలకు సేకరించి రైతుల కడుపుకొట్టడం సరికాదన్నారు. భూ నిర్వాసితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. తప్పించుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు రైతులకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని భయపెట్టడం చూస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు. ఇకనైనా అధికారులు భూ నిర్వాసిత సంఘం ప్రతినిధులతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎడవెల్లికి చెందిన భూ నిర్వాసితులు అంజప్ప, లక్ష్మణ్, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతు ,శ్రీనివాసులు, బాలప్పతో పాటు భూ నిర్వాసిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, మశ్ఛందర్,బాల్రాం, మహేష్కుమార్గౌడ్, ధర్మరాజు, శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, అంజప్ప తదితరులు పాల్గొన్నారు. వినూత్న బోధనతో ఆకట్టుకోవాలి నర్వ: సులభంగా అర్థమయ్యేలా వినూత్న బోధనతో విద్యార్థులను ఆకట్టుకోవాలని ఏఎంఓ విద్యాసాగర్ సూచించారు. గురువారం మండలంలోని పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బయోసైన్స్పై విద్యార్థులు ఆసక్తికనబర్చేలా బోధనను కృత్యాలతో చేసి చూపించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాఠశాలల్లో సైన్స్పై కృత్యాలను విద్యార్థులతో చేయించేలా ప్రోత్సహించాలన్నారు. పదోతరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే ఓ లక్ష్యంతో చదివేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు భానుప్రకాష్, శ్రీనివాసులు, కాంప్లెక్స్ జీహెచ్ఎం భాగ్యలక్ష్మి, సీఆర్పీ నర్సింహులు, సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
మక్తల్: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని బాబూ జగ్జీవన్కాలనీ, బీసీకాలనీల్లో ఏళ్లుగా పాఠశాలలు లేకపోవడంతో మంత్రి ప్రత్యేక చొరవతో కొత్తగా మంజూరు చేయించి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా కాలనీల్లో ఏళ్లు పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు చాలా నష్టపోయారని.. సమస్య తన దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించనున్నామని.. దండు గ్రామానికి చెందిన 9 మంది రైతులు పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చారని, ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.833.50 కోట్లు మంజూరయ్యాయని, ఏడాదిలో పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15.13 కోట్లు మంజూరుకాగా పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు పలుకలు పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను కాలనీవాసులు మంత్రికి వివరించగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం జీఓనంబర్ 317 రద్దు చేసి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రశాంత్కుమార్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, ఎంఈఓ అనిల్గౌడ్, మాజీ ఎంపీటీసీలు కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, అనంద్గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూర్యచంద్ర, హైమావతి, పరందారాములు, నాగరాజు, మారెప్ప, నారాయణ, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం నిర్ణయించేందుకు గాను న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు తన భూమిని ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంతోషంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం పరిహారం అందించాలన్నారు. నిర్మాణంలో కొంత ఆలస్యమైతే గుత్తేదారులకు ప్రాజెక్టు వ్యయం పెంచే ప్రభుత్వాలు.. భూ నిర్వాసితులకు కాన్సెంట్ అవార్డు పేరుతో అతి తక్కువ పరిహారం ఎకరాకు రూ. 14లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. తరాలుగా సాగుచేసుకుంటున్న తమ భూమిని ప్రాజెక్టుకు అప్పగిస్తున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాచ్వార్, ఎర్నాగన్పల్లి గ్రామాల నిర్వాసితులు కలాల్రాజు, నగేశ్గౌడ్, బస్వరాజ్గౌడ్, రఘురెడ్డి, తిమ్మారెడ్డి, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
సృజనాత్మకత చాటాలి
ఊట్కూరు: విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఇతర అంశాల్లోనూ సృజనాత్మకత చాటాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని బిజ్వార్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థుల హాజరుశాతం తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలు, అల్లికలు తదితర క్రాఫ్ట్ కృత్యాలను ట్రెయినీ కలెక్టర్ పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు క్రీడలు, చిత్రలేఖనం, అల్లికలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు సాంకేతిక విద్యలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజయ్యగౌడ్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గౌరమ్మ, హెచ్ఎం కిషోర్కుమార్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించండి నారాయణపేట రూరల్: అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ అమలుచేసి.. పదోన్నతులు కల్పించాలన్నారు. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. పాఠశాలల హేతుబద్ధీకరణ జీఓ 25ని సవరించి.. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రిటైర్డ్ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో వచ్చేనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అబ్దుల్ ఖాదర్, భాస్కర్, వెంకటేశ్వర్రెడ్డి, రుద్రసముద్రం రాములు, అశోక్, ప్రతాప్, వెంకటయ్య, నర్సింహులు, జహంగీర్ తదితరులు ఉన్నారు. -
సేంద్రియానికి సై..
వివరాలు 8లో uకోస్గి: వ్యవసాయ రంగంలో వినియోగించే రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను అమాంతం పెంచేస్తుండటంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాటి వినియోగంతో ఆశించిన పంటల దిగుబడి రాకపోవడం.. వచ్చిన పంటలో నాణ్యత లోపిస్తుండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగంతో భూసారం సైతం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సేంద్రియ విధానంలో పంటల సాగుతో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు వస్తాయని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. పథకం ప్రధాన లక్ష్యం.. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలకు సైతం కొత్త కొత్త తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులు అధిక ధరలకు క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడం.. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పంటల దిగుబడులు రాకపోవడమే కాకుండా పంటల నాణ్యత సైతం సరిగ్గా ఉండటం లేదు. రోజురోజుకూ భూమిలో సారం కూడా తగ్గిపోతోంది. ఈ పద్ధతి మరింత కాలం కొనసాగితే వ్యవసాయ పొలాలు పంటసాగుకు పనికి రాకుండా పోతాయనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు రైతులు మొగ్గు చూపేలా చర్యలు చేపట్టింది. పూర్వకాలంలో ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేసిన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ఎన్ఎంఎన్ఎఫ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దశల వారీగా సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచి రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రతి క్లస్టర్ నుంచి 125మంది రైతుల ఎంపిక మట్టి నమూనాల సేకరణలో అధికారుల నిమగ్నం భూసారానికి అనుగుణంగా సేంద్రియ సాగుపై అవగాహన రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు సాగు విస్తీర్ణం పెంచుతాం.. పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో ఈ పథకానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరిస్తున్నాం. భూమి స్వభావం మేరకు పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్లో సేంద్రియ సాగు దశల వారీగా మరింత పెరిగే అవకాశం ఉంది. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం నారాయణపేట మండలం బొమ్మన్పాడు ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు కలెక్టర్ పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎఫ్ఏ–1 పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తయారీకి నాణ్యమైన కూరగాయలు, వంట సరుకులు వినియోగించాలని ఆదేశించారు. బోధన సమయంలో టీఎల్ఎం ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ● కోటకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీలో ఓపీ తక్కువగా నమోదు కావడం, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్క ప్రసవం కూడా జరగకపోవడం, జూలైలో రెండు మాత్రమే కాన్పులు కావడం, ఈడీడీ అప్డేట్ లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. 10 సబ్ సెంటర్లకు 16మంది డాక్టర్లు ఉన్నప్పటికీ.. పీఓ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. ఏఎన్సీ, టీబీ, ఎన్సీడీ కార్యక్రమాల తీరు సక్రమంగా లేకపోవడం.. మందుల నిల్వ అంతంతమాత్రంగా ఉండటం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లలో మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. టీబీ నివారణపై కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం కోటకొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మొదటి విడతలో 31 ఇళ్లు మంజూరు కాగా.. 28 గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని ఆందోళన
మద్దూరు: పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తా – చింతల్దిన్నె రోడ్డు వరకు చేపట్టనున్న రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులు ఆందోళనకు దిగారు. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు రహదారి ఇరువైపులా ఉన్న దుకాణాలు, గృహాల వివరాలతో పాటు యజమానుల ఆర్థిక స్థితి, రోడ్డు విస్తరణతో పూర్తిగా కోల్పోతున్న ఇళ్ల వివరాలు సేకరించేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బందిని బాధితులు అడ్డుకున్నారు. రోడ్డు ఇరువైపులా 35 ఫీట్ల వెడల్పుతో 78 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పుర కమిషనర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని చెప్పారు. పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. -
దేశమంతటా నాగుల పంచమి.. కందుకూరులో తేళ్ల పంచమి
నారాయణపేట: దేశమంతా నాగుల పంచమి పండుగ జరుపుకుంటే మంగళవారం నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాద్గీర్ జిల్లా గురి్మత్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ (మహేశ్వరి) అమ్మవారి సన్నిధిలో భక్తులు కొండమవ్వను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా నాగుల పంచమి రోజే ఇక్కడ తేళ్ల పంచమి జరుపుకోవడం ఆచారం. ఈ ఆలయ పరిసరాల్లో తేళ్లు మనుషులకు హాని చేయవు. అమ్మవారి మహిమ వల్లే తేళ్లు తమకు హాని చేయవనేది భక్తుల విశ్వాసం. కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపిస్తాయి. వాటిని చేతితో తాకినా.. పట్టుకున్నా..ముఖం, మెడ నాలుకపై వేసుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవు. ఇది అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా తేళ్లు కుట్టవని కొందరు విద్యావంతులు చెబుతున్నారు. -
నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలి
నారాయణపేట టౌన్: అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన చేనేత సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమగ్గాలు ఉన్న కార్మికులకు నేతన్న త్రిఫ్ట్ ఫండ్ అమలు చేయకుండా చేనేతకు సంబంధం లేని వారికి ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి నర్సింహులు తదితరులు ఉన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా దానిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 13లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు. -
ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలు
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నా మని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం మంత్రి హోదా లో తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పేదలకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కు టుంబాలు, ఊర్లు బాగుపడి రాష్ట్రాభివృద్ధికి దోహదం అవుతాయని భావించిన ప్రభుత్వం.. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేర్లతోనే అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేద కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారం ఉన్నప్పుడు హంగూ ఆర్భాటాలు ఉంటాయని.. తాను మాత్రం సామాన్యమైన జీవితాన్నే గడపాలని కోరుకుంటానని మంత్రి చెప్పారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని.. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమంలో రాజీ పడబోమన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. రూ. 4,500 కోట్లతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని.. రాబోయే కాలంలో నారాయణపేట మరో తూర్పు, పశ్చిమ గోదావరి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. పేటకు మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. వీటిని త్వరగా పూర్తిచేస్తే, అదనంగా మరో 3,500 ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో కొత్త రేషన్కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, కొత్త కార్డులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. తన నాన్న చిట్టెం వెంకటేశ్వరరెడ్డికి, మంత్రి వాకిటి శ్రీహరితో మంచి సత్సంబంధాలు ఉండేవన్నారు. ఈ రోజు మంత్రి పదవిలో బాబాయ్ శ్రీహరిని చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. జిల్లా కేంద్రానికే 900 కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్, సివిల్ సప్లై అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు.. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రుణ లక్ష్యం.. నిర్దేశం
నర్వ: గ్రామీణ ప్రాంత మహిళలను సంఘటితం చేసి, ఆర్థికంగా రాణించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం.. 2025–26 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 262.13కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం విధించింది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ రుణాలను ప్రభుత్వం ఏటా అందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ. లక్ష నుంచి రూ. 20లక్షల వరకు.. ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఆయా సంఘాల సభ్యులు ఏర్పాటుచేసే వ్యాపారాల మేరకు రూ.లక్ష నుంచి రూ. 20లక్షల వరకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు. గతంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాల్లో రకవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ వార్షిక ఏడాదిలోనూ బ్యాంకర్లు త్వరగానే రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహిళలు వ్యక్తిగతంగా రూ. 5లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు దేనికోసం రుణం తీసుకుంటున్నారో వివరించాలి. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు మహిళా సంఘం సభ్యులు పూచీకత్తుగా ఉంటారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తే మేలు.. మహిళా సంఘాలకు అందించే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లిస్తే సభ్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తోంది. అయితే నెలల తరబడి వడ్డీ బకాయి ఉంటోంది. ప్రభుత్వం ప్రతినెలా వడ్డీ డబ్బులు చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. గతేడాది ఇలా.. జిల్లాలో గతేడాది (2024–25) రుణ లక్ష్యం రూ. 262కోట్లు కాగా.. వందశాతం అచీవ్మెంట్ సాధించారు. మాగనూర్లో 79.66శాతం, కృష్ణాలో 74.89 శాతం మాత్రమే రుణ లక్ష్యం సాధించి కొంత వెనకబడ్డాయని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా వార్షిక రుణ లక్ష్యాన్ని విధించింది. ఈ మేరకు వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా దిశానిర్దేశం చేశాం. గతేడాది జిల్లాలో వందశాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. రుణ లక్ష్యంలో వెనకబడిన మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమాయత్తం చేస్తాం. – మొగులయ్య, డీఆర్డీఓ మహిళల ఆర్థిక సంఘటితమే లక్ష్యంగా ప్రణాళిక 2025–26 ఆర్థిక సంవత్సరం రూ. 262.13 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్ ఒక్కో సంఘానికి రూ.లక్ష నుంచి రూ. 5లక్షల వరకు అందనున్న రుణాలు జిల్లాలో 7,072 మహిళా సంఘాలు -
మహిళా సంఘాలు మరింత బలోపేతం
నారాయణపేట: మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన ఉత్పత్తుల విక్రయ ప్రదర్శన ఏర్పాటు చేయగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల జిల్లాస్థాయి ప్రదర్శన ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రతి ఒక్కరికీ వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి కోస్గి: పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న ఇంజినీరింగ్ కళాశాల భవనాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి.. కళాశాలలో కల్పించాల్సిన వసతులు, బోధన సిబ్బంది, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పట్టణ శివారులోని సర్వే నంబర్ 1737లో ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన 10.08 ఎకరాల స్థలంతో పాటు సర్వే నంబర్ 1809, 1811, 1812లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం తరగతులు సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదుల, ల్యాబ్, కంప్యూటర్లు, బాలికల హాస్టల్, ఇతర సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపాల్ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ డీఈ విలోక్, ఆర్అండ్బీ డీఈ రాములు తదితరులు ఉన్నారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
ఊట్కూరు: సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సూచించారు. మంగళవారం పులిమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీ పరిధిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట డా.సాయిబాబా, డా.నరేందర్, సిబ్బంది సురేశ్, ప్రభాకర్ ఉన్నారు. టెండర్ల ఆహ్వానం నారాయణపేట: త్వరలో జరిగే సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, స్టేషనరీ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ శైలేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు దరఖాస్తు ఫారాలు విడివిడిగా ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు జెడ్పీ కార్యాలయంలో లభిస్తాయని పేర్కొన్నారు. అనుభవం, అర్హత గల వారు వచ్చే నెల 2వ తేదీలోగా సీల్డ్ కవర్లో టెండర్ దాఖలు చేయాలని సూచించారు. 4న టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జెడ్పీ కార్యాలయంలో సంప్రదించాలని సీఈఓ సూచించారు. -
నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం తగదు
నారాయణపేట రూరల్: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ అన్నారు. మండలంలోని పేరపళ్లలో మంగళవారం భూ నిర్వాసితులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తుంటే.. ప్రభుత్వం మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు మొండివైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులతో బలవంతంగా భూ సేకరణ చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య, నాగరాజు, సంతోష్, వెంకటేశ్, నర్సింహ, హనుమంతు, ఆశప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయికి ‘అనంతపురం’ విద్యార్థుల ప్రాజెక్టు
గద్వాలటౌన్ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో గద్వాల మండలం అనంతపురం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ వారు పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జానకమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇర్ఫాన్, పవన్, ప్రశాంత్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో ప్రతిభ చాటారు. ‘మొక్కజొన్న కంకులపై పొట్టుతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కార్న్ హస్క్ పెన్స్’ అనే అంశంపై ప్రాజెక్టును రూపొందించగా.. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జులై 28 నుంచి 31 వరకు డిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 27 ప్రదర్శనలను ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి గద్వాలతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం విద్యార్థులు జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక కావడంపై డీఈఓ అబ్దుల్ ఘనీ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి బాస్కర్పాపన్న, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజావాణికి 46 దరఖాస్తులు
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్ల క్ష్యం వహించొద్దని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
ఊట్కూరు: అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేయాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. సోమవారం ఊట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను వనమహోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ధనుంజయ్యగౌడ్, ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏపీఎం నిర్మల, ఎంపీఓ లక్ష్మీనర్సింహరాజు ఉన్నారు. కోయిల్సాగర్లో 26 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 26 అడుగులకు చేరింది. ఈ నెల 1న ప్రాజెక్టులో కేవలం 11 అడుగుల కనిష్ట స్థాయిలో ఉండగా అదేరోజు జూరాల నుంచి కోయిల్సాగర్ లిఫ్ట్ ఫేస్–1లో ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేశారు. 6న తీలేరు వద్ద ఉన్న ఫేస్–2 పంపుహౌస్కు చేరిన నీటిని ఒక పంపును రన్ చేసి కోయిల్సాగర్కు విడుదల చేశారు. గత 22 రోజుల నుంచి ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితోనే ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పెద్ద వాగు ద్వారా కొంత నీరు కూడా ప్రాజెక్టులోకి చేరుతోంది. కాగా.. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు రావాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా మరో 6.6 అడుగుల నీరు వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. దరఖాస్తుల ఆహ్వానం బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. -
‘బలవంతపు భూ సేకరణ ఆపండి’
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథ కం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి భూ నిర్వాసితులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే శాసనపల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఆర్డీఓ రైతులను బెదిరింపులకు గురిచేస్తూ భూ సేకరణ చేపట్టడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా, 2013 భూ సేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించినా తర్వాతే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తరతరాలు గా సాగుచేసుకుంటు న్న భూమిని అన్యాయంగా సేకరించొద్ద ని అన్నారు. భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ మా ట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందే దాక తమ పోరాటం ఆగదన్నారు. కాగా, భూ నిర్వాసితుల ఆందోళనకు పాలమూరు అ ధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మద్దతు తెలిపారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న 20 గ్రామాల నుంచి రైతు లు పెద్దఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ రావాలని.. లేదంటే తామే కలెక్టరేట్కు వెళ్తామని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రైతుల వద్దకు చేరుకోగా.. వినతిపత్రం సమర్పించారు. కా ర్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి అంజిలయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాశప్ప, భూ నిర్వా సితుల సంఘం నాయకులు ధర్మరాజు, ఆంజనేయులు, హనుమంతు, అంజప్ప పాల్గొన్నారు. -
ఖర్చు పెరిగింది..
పెరిగిన ధరలతో ఎకరా వరిసాగుకు రూ. 30వేలకు పైగా ఖర్చు అవుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు తప్పడం లేదు. పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలుచేసి.. అదనంగా రూ. 500 బోనస్ ఇస్తుందనే ధైర్యంతో వరిసాగు చేస్తున్నాం. – వెంకట్రెడ్డి, రైతు, పూసల్పహాడ్ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం.. జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతేడాది కంటే ఈ సారి 10వేల ఎకరాల్లో అదనంగా సాగవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ అందిస్తుండటంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉంది. – జాన్సుధాకార్, డీఏఓ ● -
బీజేపీలో రగడ!
నేతల మధ్య రచ్చకెక్కినఅంతర్గత పోరు ● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనేబహిర్గతం ● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు ● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ● ‘స్థానిక’ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. పెద్దంపల్లి, వల్లంపల్లి, చిత్తనూర్, శ్రీరాంనగర్, ఊట్కూర్, మండిపల్లి, సింగారం, పీఎస్ నారాయణపేట (అశోక్నగర్,) భూత్పూర్, కచ్వార్, పరేవుల, గుడెబల్లూర్, పాల్లబుర్గ్ (నారాయణపేట)లో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు -
వరిసాగు జోరు
మరికల్: జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. ఎక్కడా చూసినా వరి నాడుమడులలో కరిగెట్లు చేయడం.. నాట్లు వేయడం వంటి పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమై కనిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. బోరుబావుల్లో భూగర్భజలమట్టం పెరగడంతో రైతులు వరిసాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గతేడాది వానాకాలం 1.60లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఈ ఏడాది 1.70లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే 50శాతం పైగా వరినాట్లు పూర్తయ్యాయి. వరినాట్ల సమయం ముగిసే నాటికి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కూలీలకు డిమాండ్.. జిల్లాలో 15 రోజులుగా వరిసాగు జోరందుకోవడంతో కూలీల ధరలు అమాంతం పెంచేశారు. రైతులందరూ ఒకేసారి వరినాట్లు వేస్తుండటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర మండలాల నుంచి కూలీలను రప్పిస్తుండగా.. ఎకరా నాట్లు వేసేందుకు రూ. 6వేలు డిమాండ్ చేస్తున్నారు. వారు వచ్చేందుకు రవాణా ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు పెరిగిన పెట్టుబడుల కారణంగా ఎకరా వరిసాగుకు రూ. 30వేల ఖర్చవుతోంది. అయితే సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసే సమయం ఉండటంతో కూలీలు ఎక్కువగా ఇతర వ్యవసాయ పనులకు వెళ్లకుండా వరినాట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బోనస్తో పెరిగిన సాగు విస్తీర్ణం.. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు. గత యాసంగిలో బోనస్ రాకపోవడంపై రైతులు కొంత నిరాశలో ఉన్నప్పటికీ వరివైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాధార పంటలపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు కూడా తమ పొల్లాలో బోరుడ్రిల్లింగ్ చేసి వరిసాగు చేస్తున్నారు. జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అంచనా ఇప్పటికే 50శాతం పైగా నాట్లు కూలీల కొరతతో రైతుల అవస్థలు ఎకరాకు రూ. 30వేల వరకుఖర్చవుతుందని ఆందోళన -
ఆశల వాన!
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వివరాలు 8లో u●ఆనందంగా ఉంది.. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా పెద్దగా వర్షాలు లేకపోవడంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరగలేదు. పంటలు పండుతాయో లేదో అన్న బెంగ ఉండేది. వారం రోజులుగా కురిసిన వర్షాలతో మా ఊరి చెరువు నిండింది. మరో రెండు, మూడు భారీ వర్షాలు పడితే చెరువు అలుగు పారుతుంది. ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీరు అందుతుంది. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుంది. – డొల్ల నరేశ్, రైతు, మాగనూర్ నారాయణపేట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన తర్వాత వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ఈ నెలలో సైతం మూడు వారాలుగా వరుణుడు కరుణించలేదు. ఒక్కానొక దశలో వర్షాల కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. పలు గ్రామాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 769 చెరువులు, కుంటలతో పాటు భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జిల్లాలోని 5 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. జిల్లావ్యాప్తంగా చూస్తే వర్షపాతం నమోదు సాధారణమేనంటూ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మండలాల వారీగా జూలై 27 వరకు నమోదైన వర్షపాతం ఇలా (మి.మీ.)లలో.. మండలం సాధారణం కురిసింది దామరగిద్ద 222 300 నారాయణపేట 237 218 ఊట్కూర్ 215 282 మాగనూర్ 207 222 కృష్ణా 197 227 మక్తల్ 183 190 నర్వ 202 226 మరికల్ 214 293 ధన్వాడ 235 234 మద్దూర్ 194 277 కోస్గి 249 309 గుండుమాల్ 222 239 కొత్తపల్లి 194 221 చెరువులు, కుంటలకు చేరుతున్న నీరు సంగంబండ రిజార్వాయర్లో గేట్లు ఎత్తివేత ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు చేపపిల్లలు వదిలేందుకు అనుకూలం.. జిల్లాలోని 641 చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు అనుకూలంగా మారాయి. గతేడాది వర్షాలు ఆలస్యం కావడంతో పాటు చేపపిల్లల పంపిణీ టెండర్లు సైతం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది చెరువులు, రిజర్వాయర్లలో నీటిశాతం అనుకూలంగా ఉండటంతో త్వరగా టెండర్లు పిలిచి చేపపిల్లలను వదిలితే బాగుంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక గడువుతీరిన పాలు, పెరుగు వల్లే ఘటన ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ? -
నిత్యం.. కలకలం
జనావాసాల్లోకి చిరుతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇటీవల వీరన్నపేట, మొన్న టీడీగుట్ట, చౌదర్పల్లి, నిన్న మొగుళ్లపల్లి.. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక్క చోట చిరుతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో అటవీ ప్రాంతంలో అవి కనపడుతున్నాయని అనుకుంటే పరవాలేదు. కానీ జనావాసాల పరిధిలోనే దర్శనమిస్తుండడంతో ప్రజలు హడలెత్తుతున్నారు. సుమారు నెల రోజులుగా ఆయా ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే చిరుత పులులు కనపడడం.. తదితర చోట్ల గొర్లు, మేకలు, పశువులపై దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు ఉన్నాయి. తాజాగా కోయిల్కొండ మండలం కొత్లాబాద్, హన్వాడా మండలం రామన్నపల్లి శివారులో ముగ్గురిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి. ● పట్టణ, మండల శివార్లలోని గుట్టల్లో ఆవాసం ● రోజుకో చోట దర్శనం.. గొర్రెలు, మేకలు, పశువులపై దాడి ● ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో 15 నుంచి 18 వరకు చిరుతలు ● ఫలితం లేని అధికారుల ఆపరేషన్.. భయంభయంగా ప్రజల జీవనం ● కొత్లాబాద్లో ముగ్గురిపై దాడితో స్థానికుల్లో ఆందోళన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ రేంజ్ పరిధిలో 19,132 హెక్టార్లు, మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలో 7,852 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ఫారెస్ట్లో ప్రస్తుతం 15 నుంచి 18 వరకు చిరుతలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాలను ఆనుకుని సహజసిద్ధంగా గుట్టలు ఉండగా.. వాటిని చిరుత పులులు ఆవాసాలుగా ఏర్పరచుకున్నాయి. ముగ్గురిపై దాడితో బీ అలర్ట్.. కొత్లాబాద్ శివారులో గొర్రెల కాపరితో పాటు మరో ఇద్దరు రైతులపై చిరుత దాడి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రజలపై అవి దాడికి దిగవని.. సదరు వ్యక్తులు కుక్క అనుకుని టార్చిలైట్ వేయడం, తరముతున్న క్రమంలో చిరుత దాడికి దిగినట్లు తెలుస్తోందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో గుట్టల పరిసరాల్లో పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అదేవిధంగా గుట్టల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య సాయంత్రం కాగాలే ఇళ్లకు తలుపులేసి భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆహారం దొరక్క జనావాసాల్లోకి.. ప్రధానంగా అడవి పందులు, అడవి కుందేళ్లు, నెమళ్లు ఇతరత్రా వన్యప్రాణులతో పాటు అక్కడక్కడా నీటి సదుపాయం ఉండడం.. జూన్ నుంచి ఆగస్టు వరకు సంపర్క సమయం కావడంతో ఆయా గుట్టల ప్రాంతాల్లో చిరుతలు నివాసం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీరన్నపేట–టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టు గుట్టపై, ధర్మాపూర్ సమీపంలోని చౌదర్పల్లి గుట్టపై, నవాబుపేట మండలంలోని మొగుళ్లపల్లి గుట్టపై చిరుతలు కనిపించడమే నిదర్శనం. ఈ క్రమంలో ఆహారం దొరకనప్పుడు గుట్టల సమీపంలోని నివాస ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. ఫలితం లేని ఆపరేషన్.. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ చిరుతతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మహబూబ్నగర్లోని వీరన్నపేట, టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టుపై జూన్ 30న చిరుత మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఈ నెల రెండో తేదీన మళ్లీ దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్, విజయేందిర బోయి, ఎస్పీ జానకి స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ముందుగా రెండు, ఆ తర్వాత మరో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. తెల్లారి అదే గుట్టపై ఒకేసారి రెండు చిరుతలు కనపడ్డాయి. కానీ.. ఇప్పటివరకు అవి చిక్కలేదు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అచ్యుతాపూర్లో చిరుత ముగ్గురిపై దాడి చేయగా.. ముందు రోజే ఆ గ్రామ సమీపంలోని కొత్లాలాబాద్లో బోన్ ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకపోగా.. ముగ్గురిపై దాడి నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని చోట్ల కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశాం.. జూన్ నుంచి ఆగస్టు వరకు చిరుతల సంపర్కానికి అనుకూల సమయం. ప్రస్తుతం అవి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఆహారం, నీరు సమృద్ధిగా దొరకనప్పుడే అవి నివాసిత ప్రాంతాలకు వస్తాయి. చిరుతలు అనుకోని సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా తక్కువ. గుట్టల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దు. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే పోవాలి. వాటిని బంధించేందుకు అన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. – సత్యనారాయణ, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ చిరుత జాడ లేకుండా ఏ ఒక్క నెల లేదు.. చిరుతల సంచారంతో వణికిపోతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయమైతాంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఊరంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిరుత జాడ లేకుండా కనీసం ఏ ఒక్క నెల లేదు. గత నెలలో మా గ్రామంలోని ఓ రైతుకు చెందిన పశువుల పాకలో కట్టేసిన లేగదూడను చిరుత ఎత్తుకుని వెళ్లి రక్తం తాగి పడేసింది. – రవి, మొగుళ్లపల్లి, నవాబుపేట ●వామ్మో.. చిరుతజిల్లాలో 15 నుంచి 18 వరకు.. -
సరికొత్తగా సైబర్ మోసాలు
నారాయణపేట క్రైం: సైబర్ నేరగాళ్లు సరికొత్తగా మోసాలకు పాల్పడుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విలాసవంతమైన వస్తువులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని రకరకాల మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధానంగా గొలుసుకట్టు వ్యాపారాలకు తెరలేపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్న తీరు, సైబర్ నేరాలకు ప్రజలు గురవుతున్న విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మొబైల్ లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లో అనేక కంపెనీల పేర్లతో లింక్లు పంపిస్తూ మోసాలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతే వెంటనే డయల్ 1930 లేదా సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించండి కోస్గి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి.. అన్ని డీఏలతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గుండమాల్, కోస్గి మండలాల్లో ఆ సంఘం నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. గతంలో కొందరు భాషా పండిట్లు, పీఈటీలను అప్గ్రేడ్ చేయలేదన్నారు. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ టీచర్లకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి అంజిలయ్య, ఆయా మండలాల ప్రతినిధులు పరందాములు, వెంకట్రాములు, ఆంజనేయులు, రాఘవేందర్, వెంకటేశ్, అర్జున్, చంద్రమౌళి, రవితేజ, సత్య కుమార్ తదితరులు ఉన్నారు. -
భూ నిర్వాసితులకు అన్యాయం
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎకరాకు రూ. 14లక్షల పరిహారం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంతంగా భూ సేకరణ చేపట్టడం మంచిది కాదన్నారు. చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతవాసి రేవంత్రెడ్డి ఉన్నప్పటికీ రైతులకు మేలు జరగడం లేదని.. ఉద్యమాలు తప్పడం లేదన్నారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో ఉండాల్సింది పోయి.. పంతానికి పోవడం, రైతులను ప్రలోభాలకు గురిచేయడం, ఆర్డీఓ స్థాయి అధికారితో బెదిరింపులకు పాల్పడటం మంచిదికాదన్నారు. ఎద్దు ఏడిసిన వ్యవసాయం.. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదనే విషయం గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్, ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి’
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మరికల్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, మండలంలో ఎక్కువగా జరిగే కేసులపై ఆరా తీశారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ క్రమం తప్పకుండా తమ గ్రామాన్ని విజిట్ చేయాలని సూచించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులతో పాటు దర్యాప్తులో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చోరీలు జరగకుండా పెట్రోలింగ్ పకడ్బదీంగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది నూతన సాకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. న్యాయం చేస్తారనే నమ్మకం ఫిర్యాదుదారులకు కల్పించినప్పుడు ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెక్కుల అందజేత
నారాయణపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన 36 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులను ఆర్డీఓ రామచంద్రనాయక్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో నష్టపరిహారం అందించలేదని, సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వేగంగా నష్టపరిహారం అందిస్తుందని కొనియాడారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవిస్తానని హామీనిచ్చారు. ఆర్డీఓ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకంలో భూములు, ఇతర ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. దామరగిద్ద మండలంలోని బాపన్పల్లికి చెందిన 21 మంది రైతులకు రూ.59.99 లక్షలు, నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన 15 మంది రైతులకు రూ.52.15 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్కుమార్, తహసీల్దార్లు తిరుపతయ్య, వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్, డీటీ బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.