breaking news
Narayanpet
-
ఇంటికి వెళితే.. పరువు పోతుంది..!
నారాయణపేట రూరల్: ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భర్త గొంతునులిమి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట మండలం కోటకొండకు చెందిన కంపిలి అంజిలప్ప (32)కు పదేళ్ల క్రితం ధన్వాడ మండలం రామకిష్టయ్యపల్లికి చెందిన రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం ముంబైకి వలస వెళ్లి కూలి పనులు చేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న ధన్వాడ మండలానికి చెందిన ఓ యువకుడితో రాధకు పరిచయం ఉండేది. తనకంటే చిన్నవాడైనా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. భార్యను మందలించాడు. ఆపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో తాండూరుకు చేరుకున్నాక ఇంటికి వెళితే.. పరువు పోతుందని, వేరేచోట పని చూసుకుందామని రాధ పట్టుబట్టడంతో హైదరాబాద్ వెళ్లారు. బాచుపల్లిలోని ఓ అపార్ట్మెంట్ వద్ద పనిచేస్తూ గుడిసెలో ఉంటున్నారు. అయితే రాధ తిరిగి ఆ యువకుడితో మాట్లాడటం అంజిలప్ప గమనించాడు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. హత్యచేసి.. పక్కింట్లో నిద్రించి ఈ క్రమంలోనే గత నెల 23న రాత్రి అంజిలప్ప మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తా గిన మైకంలో భర్త పడుకొని ఉండగా.. భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియ నట్టు పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి భర్త తనను ఇబ్బంది పెడు తున్నాడని చెప్పి అక్కడే పడుకుంది. తెల్లవారుజామున లేచి గుడిసెలోకి వెళ్లి భర్త చనిపోయాడని రోదిస్తూ మృతదేహాన్ని అంబులెన్స్లో కోటకొండకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యుల అనుమానంతో.. మృతుడి సోదరుడు, ఇతర కుటుంబసభ్యులు అంజిలప్ప మృతిపై అనుమానాలు ఉన్నాయని అదేరోజు నారాయణపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో వారు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాచుపల్లి పీఎస్కు కేసును బదిలీ చేశా రు. సైబరాబాద్ కమిషనర్, డీసీపీ ఆదేశాలతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. గతనెల 26న కుటుంబసభ్యులను విచారించారు. రాధను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. తండ్రి చనిపోవడం, తల్లి జైలు పాలు కావడంతో ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఘటనపై బాచుపల్లి సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే హత్యకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా, హత్య ఘటనలో ఒక్కరే ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని సీఐ చెప్పారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం సా యంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆమె అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు జెడ్పీ సీఈవో శైలేష్ కుమార్ వివరించారు. గతంలో 140 ఎంపీటీసీ స్థానాలుండగా మద్దూరు పురపాలిక కావడంతో 136కు తగ్గా యని చెప్పారు. అలాగే గతేడాది సర్పంచి ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం మద్దూరు మున్సిపాలిటీ కావడంతో వాటి సంఖ్య 272కు తగ్గిందని డీఎల్పీఓ సుధాకర్రెడ్డి తెలిపారు. ఎన్నికల ట్రైనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వెలువడినా నిర్వహణకు ఇప్పటి నుంచే అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీ దత్త బృందావన్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై ప్రణాళికతో ముందుకు.. మద్దూరు మండలంతో పాటు మున్సిపాలిటీలో అవసరమైన అభివృద్ధి పనులకు అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పథకాలకు రూ.19 కోట్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డంపింగ్ యార్డ్కు రూ.6.41 కోట్లు, రహదారులకు రూ.35 కోట్లు, ఫేస్–1, ఫేస్–2 రూ.45 కోట్లు, వైకుంఠధామానికి రూ.3.65 కోట్లు, ఇండోర్ స్టేడియానికి రూ.7.67 కోట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, మినీ స్టేడియం, పార్క్, కమ్యూనిటీ హాల్ షాదీఖానా తదితర వాటికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. మద్దూర్ మున్సిపాలిటీలో మొత్తం రూ.340.07 కోట్ల ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కాడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఈఈ విజయభాస్కర్రెడ్డి, డీఈ మల్లేష్, పుర కమిషనర్ శ్రీకాంత్, ఏఈ మహేష్, ఎన్సీపీఈ కన్సల్టెన్సీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య వర్ధంతి.. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, డీపీఆర్వో రషీద్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, బీసీ సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
రైతు సేవలే లక్ష్యం
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతు సేవలే లక్ష్యంగా సహకార రంగ అభివృద్ధికి పాలక మండలి, అధికారులు కృషి చేస్తున్నారు. సింగిల్ విండో సొసైటీలు, డీసీసీబీ బ్రాంచ్ల ద్వారా రైతుల మేలు కోసం ఆర్థిక లావాదేవీలపై సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ రైతులను చైతన్య పరుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారమే ఏడాది పొడవునా సహకార దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 78 సింగిల్ విండో సొసైటీలు, 22 డీసీసీబీ బ్రాంచ్లు పనిచేస్తున్నాయి. వీటి కింద అనేక మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టి కోసం ఇటు బ్యాంకులు.. అటు సొసైటీలు పరస్పర సహకారంతో కృషి చేస్తున్నాయి. సహకార శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం అంతర్జాతీయ సహకార దినోత్సవం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో రైతు చైతన్య కార్యక్రమాలు షెడ్యూల్ విడుదల చేశారు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో మార్చి 22 నుంచి ఇక్కడి సింగిల్ విండో పర్సన్ ఇన్చార్జిలు, అధికారులు రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై నివేదిక జిల్లాలో సహకార బ్యాంకులు, సింగిల్ విండో సొసైటీలు వాటి పరిధిలో జరిగే ఆర్థిక లావాదేవీలు, ప్రగతిపై డీసీసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలు, విద్యా రుణాలు, గ్రామీణ గృహ రుణాలు, కర్షకమిత్ర రుణాలు, రుణ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఖాతాదారుల సౌకర్యం కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖాతాదారుల లావాదేవీలు సులభతరం, సమయాన్ని ఆదా చేసుకోవడం, డిజిటల్ లావాదేవీలతో బ్యాంకు సమర్థత పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ విద్యకు చేయూత రైతు కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉంటే డీసీసీబీ తరపున విద్యా రుణాలు అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పిల్లలకు స్వదేశీ, విదేశీ విద్యా రుణాలు అందించేందుకు పాలక మండలి ప్రత్యేక రుణాల పాలసీ ప్రకటించింది. ఒక్కో విద్యార్థికి రూ.35 లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు మొత్తం 79 మంది విద్యార్థులకు రూ.3.82 కోట్ల రుణాలు అందజేశారు. సహకార రంగాలఅభివృద్ధికి పటిష్ట చర్యలు త్వరలో అందుబాటులోకి మొబైల్ బ్యాంకింగ్ విద్యా రుణాలకు పెద్దపీట.. ఆశాజనకంగా వసూళ్లు రుణమాఫీతో 34,731 మంది రైతులకు ఊరట నేడు అంతర్జాతీయ సహకార దినోత్సవం -
సమస్యలన్నీ పరిష్కరిస్తాం
వివరాలు 8లో uనారాయణపేట: పురపాలికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని నారాయణపేట పుర కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్కు పుర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వార్డుల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి, డ్రెయినేజీల్లో మురుగు, చెత్త తొలగింపు, వీధిదీపాలు, పందులు, దోమల నియంత్రణ, శిథిల భవనాలతో ఇబ్బందులు, కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలా తదితర వాటిపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఆయా విభాగాలుగా అడిగిన సమస్యలను పుర ఇంజినీర్ మహేశ్, శానిటేషన్ ఇన్చార్జ్ శ్రీనివాస్జీ, టీపీబీఓ రాజేశ్ రాసుకున్నారు. సమ స్యలు త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ● సమస్య: పట్టణంలోని 16వ వార్డు పత్తిబజార్లో ఓ ఇల్లు పాడుబడింది. విషపు పురుగుల సంచారం పెరిగింది. వీధి దీపాలు వెలగడం లేదు. – నారాయణ, పత్తిబజార్ ● కమిషనర్: శిథిల ఇంటి యజమానికి నోటీసులు జారీ చేస్తాం. ఆయన తొలగించకపోతే పురపాలిక నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. కాలనీలో త్వరలోనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం. ● సమస్య: బాబాకాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలి. మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్కు సీసీ రోడ్డు వేయండి. – కాశీనాథ్, బాబాకాలనీ ● కమిషనర్: అమృత్ 2.0 పథకం కింద మూడు భారీ నీటిట్యాంకులు, పైప్లైన్ ఏర్పాటు చేస్తున్నాం. డ్రెయినేజీలు, పార్క్కు సీసీ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ● సమస్య: 13వ వార్డులో గుట్టమీద 300 మీటర్ల వరకు పైపులైన్ టెండర్లు పూర్తయినా పనులు కావడం లేదు. చెత్తబండి ఇంటి ఎదుట రెండు నిమిషాలు కూడా నిలపడం లేదు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. – పోలెమోని శ్రీకాంత్, 13వ వార్డు ● కమిషనర్: పుర ఇంజినీర్ దృష్టికి తీసుకెళ్లి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. చెత్త బండి ఇంటింటి ఎదుట 2 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిలపాలని డ్రైవర్లకు సూచిస్తాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడతాం. ● సమస్య: 21వ వార్డులో స్పీడ్ బ్రేకర్లు వేయాలి. డ్రెయినేజీలు వారానికి ఒకసారైన శుభ్రం చేయించాలి. – రవికిరణ్, వార్డు వాసి ● కమిషనర్:అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయిస్తాం. డ్రెయినేజీల్లో మురుగు తొలగింపజేస్తాం ● సమస్య: బాహర్పేటలో డ్రెయినేజీలపై స్లాబ్ వేయకపోవడంతో చెత్త బండి సైతం రావడం లేదు. దోమల బెడద పెరగడంతో పాటు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. – అంజయ్య, 12వ వార్డు వాసి ● కమిషనర్:డ్రెయినేజీలపై అవసరం ఉన్న చోట స్లాబ్ వేయిస్తాం. మురుగు తొలగిస్తాం. దోమలు, పందుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ● సమస్య: జామా మసీద్ సమీపం, గుడ్లక్ దుకాణం దగ్గర చెత్తకుండీలు తొలగించండి. చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. – యూసుఫ్ తాజ్, వార్డు వాసి ● కమిషనర్:చెత్త కుండీలను తొలగిస్తాం. చెత్త సేకరణ వాహనాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తాం. సమస్య: 8వ వార్డులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బోరు మరమ్మతు చేపట్టాలి. వాటర్ లైన్మెన్ను మార్చాలి. – లక్ష్మణ్, 8వ వార్డు కమిషనర్:బోరు మరమ్మతు వెంటనే పూర్తి చేయిస్తాం. వాటర్ లైన్మెన్ సమస్యను పరిష్కరిస్తాం. సమస్య: 20వ వార్డులో పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా నిర్వహించడం లేదు. జవాన్లు ముందుండి పనులు చేయించడం లేదు. డ్రెయినేజీలు ఎప్పుడు శుభ్రం చేస్తారో తెలియడం లేదు. – మహ్మద్ హుస్సేనీ, వార్డువాసి కమిషనర్:పారిశుద్ధ్య పనులు పట్టణమంతా కొనసాగుతున్నాయి. నెలలో రెండు, మూడుసార్లు విధిగా డ్రెయినేజీల్లో పూడిక తొలగిస్తున్నాం. జవాన్లు పారిశుద్ధ్య సిబ్బంది వెంట ఉండి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. సమస్య: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి పళ్ల వంతెన, వల్లంపల్లి వంతెన వరకు పారే సాగునీటి కాల్వలో పెరిగిన ముళ్ల పొదలు, పూడిక తొలగించాలి. వర్షాకాలంలో పళ్ల ప్రాంతంలోని కాలనీల్లోకి నీరు చేరుతోంది. పంట పొలాల్లోకి మురుగు పారుతోంది. – వెంకోభా, బీకేఎస్ నాయకుడు కమిషనర్: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలాలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపునకు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. సమస్య: గాంధీనగర్ శాసన్పల్లి రోడ్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర వీధిలైట్ కాలిపోయి రెండు నెలలు అవుతోంది. మే 21న ఫోన్ చేస్తే కోటా లేదన్నారు. ఎప్పుడు వేస్తారో చెప్పండి. – శ్రీకాంత్, కాలనీవాసి కమిషనర్: పట్టణంలో ఎక్కడెక్కడ వీధి దీపాలు కాలిపోయాయో కొత్తవి వేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే బిగిస్తారు. సమస్య: ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులకు కొళాయి కనెక్షన్లు ఇవ్వాలి. ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు పెరిగి, మురుగు నిలిచి దోమల బెడద అధికమైంది. – అనిల్, 10వ వార్డు వాసి కమిషనర్:ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే కొళాయి కనెక్షన్ ఇస్తాం. ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయించుకోవాలంటూ యాజమానులకు నోటీసులు జారీ చేస్తాం. -
ఆర్బీఐ అనుమతితో..
వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో సహకార బ్యాంకుల పరిధిలో మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆర్బీఐ అనుమతితో వినియోగదారులందరికీ మొబైల్ బ్యాంకింగ్తోపాటు యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి రూ.1,800 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లు రూ.400 కోట్లకు చేరుకున్నాయి. – మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, చైర్మన్, డీసీసీబీ34,731 మందికి మేలు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం–2024 కింద డీసీసీబీ పరిధిలో అనేక మందికి ప్రయోజనం కలిగింది. ఈ బ్యాంకు ద్వారా రూ.2 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలు అర్హత కలిగిన 68,495 మంది సభ్యులకు గాను రూ.47,684.81 లక్షల రుణం పొందారు. ఇందుకు సంబంధించి 2024 నవంబర్ నాటికి మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. దీంతో రూ.2 లక్షల రుణం కలిగి ఉన్న 34,731 సభ్యులకు రూ.20,639.30 లక్షల రుణమాఫీ జరిగింది. ● -
ఓటరు జాబితాల్లో తప్పులు ఉండొద్దు
మద్దూరు: స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఓటరు జాబితాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని కొడంగల్ ఎన్నికల అధికారి, వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ బీఎల్వోలను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల బీఎల్వోలకు ఓటరు నమోదు, జాబితాలో సవరణలు తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఫారం 6, 7, 8 గురించి వివరిస్తూ ఏ విధంగా తప్పులను సరి చేసుకోవాలనే విషయాన్ని విషయ నిపుణులు తెలియజేశారు. మద్దూరు, కొత్తపల్లి తహసీల్దా ర్లు మహేష్గౌడ్, జయరాములు పాల్గొన్నారు. ప్రైవేట్ క్లినిక్ సీజ్ నారాయణపేట రూరల్: మండలంలోని కోటకొండలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న ఓ ప్రైవేట్ క్లినిక్ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హతకు మించి వైద్యం చేయడాన్ని గుర్తించి నిర్వాహకులను హెచ్చరించి రోగులను ఆస్పత్రి నుంచి పంపించి సీజ్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన వైద్యుడిని నియమించుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాతే సేవలు కొనసాగించాలని సూచించారు. వైద్యురాలి తీరుపై అసహనం.. మండలంలోని కోటకొండ పీహెచ్సీతో పాటు అమ్మిరెడ్డిపల్లి ఉపకేంద్రాన్ని సందర్శించి ఫ్రైడే డ్రైడే నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో శుభ్రత పాటిస్తూ డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. డా. చందన, డా. ప్రతిభ భారతి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని, యూనిఫామ్ తప్పక ధరించాలని సూచించారు. అనంతరం డెంగీ కేసు నమోదైన కుటుంబంతో మాట్లాడి సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఎన్సీడీ కో–ఆర్డినేటర్ విజయ్ కుమార్ ఉన్నారు. ఎస్ఈ ఆకస్మిక తనిఖీ నారాయణపేట రూరల్: మండలంలోని అప్పక్పల్లి 132 కేవీ, 33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను శుక్రవారం ఎస్ఈ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు త్రీఫేజ్ విద్యుత్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిర్ణీత సమయానుసారం సరఫరా జరగాలని ఆదేశించారు. అలాగే కొత్తగా అమరుస్తున్న ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ ట్రికటింగ్ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏడీఈ శ్రీనివాస్, రూరల్ ఏఈ సాయినాథ్రెడ్డి, ఎల్ఐజీ రవీంద్రాచారి, దేవణ్ణ, ఏఎల్ఎం శ్రీకాంత్ ఉన్నారు. -
మన్యంకొండ వెళ్తున్నాం..
నేను నా భార్యాపిల్లలతో కలిసి మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు రాయచూర్ డెమోకు వచ్చాం. 6.50 గంటల నుంచి ఇక్కడే నిలిపివేశారు. రాత్రికి ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి. నా పిల్లలు నేను ఏమి తినాలో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. – నర్సింహ, గద్వాల తినడానికి ఏమీ లేవు.. మదనాపురం– వనపర్తిలో రైల్వేస్టేషన్లో ట్రైన్ ఎక్కి గద్వాల వెళ్లాలన్న ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నాను. ఇప్పటికే రెండు రైళ్లను నిలిపివేశారు. ఏం జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. నేను గద్వాల వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రాత్రికి తినడానికి కూడా ఏమీ లేవు. – విజయ్, మహబూబ్నగర్ ● -
మధ్యలో నిలిపేస్తే ఎలా..?
కొన్నేళ్ల క్రితం గొంతుకు శస్త్రచికిత్స అయ్యింది. అందుకే ఎక్కువ సేపు రైలులో ఉండలేనందున బస్సుకు వెళ్దామని పోతున్న. రైళ్ల రాకపోకలు ఇబ్బంది కలిగినప్పుడు బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటది. ఇలా మధ్యలో రైళ్లు నిలిపివేస్తే ఎలా.? – శివమూర్తి, కర్నూలు ఎంతసేపు ఉండాలో.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరా. రైలు ఇక్కడ ఆపారు. ఏం జరిగిందో.. ఎందుకు ఆపారో తెలియక చాలాచేసు ఇబ్బంది పడ్డాం. గూడ్స్ పట్టాలు తప్పిందని ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా ఎంతసేపు ఉండాలో తెలియడం లేదు. చిన్నపాప ఉన్నందున నా భార్య చీరతో ఊయల కట్టి పడుకోబెట్టాం. ప్రమాదాలు జరిగినప్పుడు అందుకు తగినట్లుగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – అమర్నాథ్, కర్నూలు -
ఎక్కడి రైళ్లు అక్కడే..!
స్టేషన్ మహబూబ్నగర్/మదనాపురం/జడ్చర్ల టౌన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి బోయపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రామగుండం నుంచి ఎరువులతో తమిళనాడు వెళుతున్న గూడ్స్ రైలుకు సంబంధించిన ఒక బోగి శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. హైదరాబాద్ కాచిగూడ నుంచి యాక్షన్ రిలీఫ్ ట్రైన్ (ఏఆర్టీ)ను తెప్పించి.. మరమ్మతులు చేసి రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా.. దాదాపు నాలుగు గంటల పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు, డెస్క్లను ఏర్పాటు చేసింది. కర్నూలు వైపు వెళుతున్న హంద్రీ ఎక్స్ప్రెస్ను జడ్చర్ల రైల్వే స్టేషన్లో, చెంగల్పట్టు (చైన్నె ఎగ్మోర్) దివిటిపల్లి వద్ద, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ను (తిమ్మాపూర్) వద్ద, కాచిగూడ–మైసూరు (బెంగుళూరు ఎక్స్ప్రెస్)ను బాలానగర్ స్టేషన్లో, వందేభారత్ డోకూరు స్టేషన్లో, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కౌకుంట్ల స్టేషన్లో, యశ్వంత్పురా వందేభారత్, రాయచూర్ డెమో రైళ్లను మదనాపురం స్టేషన్లో, అలోక్ స్పెషల్ కర్నూలులో, గూడ్స్ రైలును గొల్లపల్లి స్టేషన్లో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతాయని గుర్తించి హంద్రీ ఎక్స్ప్రెస్లో 70 శాతం మంది ప్రయాణికులు వెళ్లిపోయారు. ఆటోల్లో బస్టాండ్కు చేరుకుని అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లారు. వెంకటాద్రి, బెంగళూరు ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు ఇళ్లకు వెళ్లిపోగా..గుంటూరు రైలుకు వచ్చే ప్రయాణికులు స్టేషన్లోనే పడిగాపులు కాశారు. దివిటిపల్లి, మదనాపురం, కౌకుంట్ల స్టేషన్లలో రైళ్లను నిలిపివేయడం వల్ల తిండి లేక చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడ్డారు. బోయపల్లి గేట్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు 4 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం నిలిచిపోయిన హంద్రీ, బెంగళూరు, చైన్నె ఎగ్మోర్, ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లు తీవ్ర అవస్థలు పడిన ప్రయాణికులు రాత్రి 10 గంటల తర్వాత రైళ్ల పునరుద్ధరణ -
పార్కింగ్ పరేషాన్!
వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద ట్రా‘ఫికర్’ ●చర్యలు తీసుకుంటాం.. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకునేలా యాజమానులకు సూచనలు చేస్తాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకూడదు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
బాలల హక్కుల పరిరక్షణ అధికారుల బాధ్యత
వనపర్తి: బాలల హక్కులు పరిరక్షించేందుకు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు నిబద్ధతతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్రెడ్డి కోరారు. గురువారం కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, మర్రిపల్లి చందన, అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్తో కలిసి జిల్లాకేంద్రంలోని బాలల సంరక్షణ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాల, శ్రీరంగాపూర్లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్య, ఆరోగ్యశాఖపై ఉందన్నారు. పిల్లల్లో లోపాలుంటే ముందుగానే గుర్తించి ఎన్ఆర్సీ కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించి సరైన పౌష్టికాహారం, వైద్యం అందించాలని సూచించారు. అదేవిధంగా ఏదైనా వైకల్యంతో ఉంటే డీఎస్టీ పరీక్షలు నిర్వహించి ఫిజియో, స్పీచ్ థెరపీ వంటివి చేయించి సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కచ్చితంగా తినిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలో నమోదైన పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల కేసుల వివరాలు సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ సమన్వయంతో నిర్వహించడమే గాకుండా యజమానులపై జరిమానాలు విధించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే బాధ్యులపై కేసులు చేయడమే కాకుండా పెళ్లి ఆలోచనలు చేస్తున్నప్పుడే ముందుగానే పసిగట్టి అవగాహన కల్పించి నిరోధించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అలాగే పాఠశాలలను తనిఖీ చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..జిల్లాలో వయసుకు తగిన బరువు, ఎత్తు లేని పిల్లలను అంగన్వాడీ కార్యకర్తలు 102 వాహనంలో ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు ఉంచి వైద్యం, పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులను చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించే బాధ్యత ప్రధానోపాధ్యాయులకు అప్పగించామని వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి -
మత విద్వేషాలు రెచ్చగొడితే చర్యలు : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. 2023 నుంచి 2025 వరకు పలు సామాజిక మాధ్యమాల్లో ఇతర మతాలను కించపరుస్తూ 20 పైగా పోస్టులు చేసిన యువకులకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాల్లో ఒకరి మతాన్ని మరొకరు ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం వల్ల మత ఘర్షణలకు దారితీస్తుందన్నారు. అలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఇకపై మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయకూడదని యువకులకు సూచించారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇతరులకు షేర్ చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు. ఆటో కార్మికులపై వేధింపులు ఆపాలినారాయణపేట రూరల్: ఆటో కార్మికులపై ఆర్టీఓ, పోలీసుల వేధింపులు ఆపాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, రాము డిమాండ్ చేశారు. టీయూసీఐ ఆధ్వర్యంలో గురువారం ఆటో కార్మికులు ఆర్టీఓ కార్యాలయ ముట్టడి చేపట్టారు. ముందుగా జిల్లా కేంద్రంలోని సింగారం గేట్ నుంచి ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటోలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేదని వేధించడంతో పాటు ప్రతి చిన్న విషయానికి రూ.వేలల్లో జరిమానాలు విధిస్తుండటంతో ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొట్టకూటి కోసం ఆటోలు నడుపుతున్న వారిని వేధింపులకు గురిచేయడం తగదన్నారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటోలకు గిరాకీ తగ్గి.. డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ. 12వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు జిల్లాకేంద్రంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాశీనాథ్, నర్సింహులు, నారాయణ, సాదిక్, సలీం, ప్రశాంత్, తాయప్ప, అంజి పాల్గొన్నారు. జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ఫలితాలు విడుదల మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాకేంద్రంలోని ప్రధాన స్టేడియంలో గత నెల 26వ తేదీన నిర్వహించిన జిల్లాస్థాయి స్పోర్ట్స్ సెలక్షన్ ఫలితాలను గురువారం జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రస్థాయికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం 18 మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. ఇందులో పది మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారని, వీరు హైదరాబాద్లోని హకీంపేట క్రీడా పాఠశాలలో నేడు (శుక్రవారం), శనివారం రాష్ట్రస్థాయి ఎంపికలకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికై న వారు పాస్పోర్ట్ ఫోటోలు, పాఠశాల, మున్సిపాలిటీ లేదా తహశీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్తో శుక్రవారం(నేడు) మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట స్పోర్ట్ స్కూల్లో రిపోర్ట్ చేయాలని డీవైఎస్ఓ సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఎంపికై న విద్యార్థుల వివరాలు: కొత్తపల్లి ప్రేమ్కుమార్ (మహబూబ్నగర్), ముడావత్ యశ్వంత్ (బాలానగర్), జి.రిశి తేజ్, బెక్కరి వర్షిత్, కట్ల ఆదిత్య (మహబూబ్నగర్), పి.మోక్షిత్ (మహమ్మదాబాద్), కె.జయంత్ మణి (కోడ్గల్), ఎ.శౌర్య యాదవ్ (మహబూబ్నగర్), బి.నందీశ్వర్ (హన్వాడ), మద్దు పార్థ (జడ్చర్ల), బడావత్ వరలక్ష్మి (నవాబ్పేట), పాత్లవత్ భవ్యశ్రీరాథోడ్, వింజమురి భవ్యశ్రీ (కోయిలకొండ), వనం ఆరాధ్య (మూసాపేట), కె.సహస్ర (గండేడ్), ఎన్.హరిక (దేవరకద్ర), గోద లఖిత (మిడ్జిల్), కుర్వ ప్రణవి (దేవరకద్ర). -
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించండి
నారాయణపేట: ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కేసులను పోలీసు అధికారులు సీరియస్గా తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ప్రతి మూడు నెలలకోసారి జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతినెలా చివరి సోమవారం గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే, 2023లో 32 కేసులు నమోదు కాగా.. 16 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2024లో 34 కేసులకు గాను ఒక కేసుకు మాత్రమే నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సంవత్సరం 10 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ లింగయ్య, షెడూ్య్ల్డ్ కులాలు, తెగల అభివృద్ధిశాఖ అధికారి ఉమాపతి, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డీఏఓ జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఖలీల్, డీపీఓ బిక్షపతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్దన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, తహసిల్దార్ అమరేంద్రకృష్ణ తదితరులు ఉన్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి హౌసింగ్ అధికారులు వేసిన మార్కింగ్ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపకుండా, ఆలస్యం చేయకుండా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గ్రౌండింగ్ పూర్తిచేసేందుకు మున్సిపల్, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగా, 11వ వార్డులో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్.. మున్సిపల్ కమిషనర్ను పిలిచి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ శంకర్ నాయక్ ఉన్నారు. ప్రతి మూడు నెలలకోసారి విజిలెన్స్ కమిటీ సమావేశం తప్పనిసరి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288
తేది: 04–07–2025, సమయం: మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పుర కమిషనర్ భోగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. తాగునీటి ఇబ్బందులు, డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడం, దోమలబెడద, పందులు, కుక్కల స్వైరవిహారం, వీధిలైట్లు వెలుగకపోవడం, ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు, ఇళ్ల మధ్య మురుగునీరు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. బోట్ల సహాయంతో.. నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి.. నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది. ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత 7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు -
అధికారులు స్పందించాలి..
రెండు నెలలుగా జీతా లు అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎంఆర్ఐ సంస్థ టెండర్ ప్రకారం ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ, రెండు నెలల జీతాలు రాని విషయమై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి సిబ్బందికి జీతాలు ఇప్పించాలి. వేతనాలు రాకపోవడంతో కుటుంబాలు గడవటం చాలా కష్టంగా ఉంది. – మాసన్న, 108 పైలెట్, మహబూబ్నగర్ రెండు, మూడురోజుల్లో.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 108, 102 సిబ్బందికి రెండు నెలలకు సంబంధించిన జీతాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉంది. నాలుగు స్లాబ్ల ప్రకారం సీనియర్, జూనియర్ సిబ్బందికి జీతాలు ఉంటాయి. – రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ● -
ఏఐ ఆధారిత విద్యతో సామర్థ్యాలు మెరుగు
కోస్గి రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏఐ ఆధారిత విద్య దోహదపడుతుందని డీఎంఓ రాజేంద్రకుమార్ అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై కృత్రిమ మేధ సహకారంతో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్నాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి, హెచ్ఎం ఖుత్బుద్దీన్, మేకల రాజేశ్ పాల్గొన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి నారాయణపేట రూరల్: వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ అన్నారు. మండలంలోని పేరపళ్ల ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణులు, కిశోర బాలికలనుద్దేశించి డీఎంహెచ్ఓ మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట ఎన్సీడీ జిల్లా కోఆర్డినేటర్ విజయకుమార్, ఎంఎల్హెచ్పీ శిరీష, ఆరోగ్య కార్యకర్త సుజాత పాల్గొన్నారు. స్వరాష్ట్రంలోనూ పాలమూరుకు అన్యాయం పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాగునీటి సమస్యలపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సెషన్లలో సదస్సు ఉంటుందని, మొదటి సెషన్లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. మూడు సెషన్లలో ఎంతో మంది వక్తలు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన ఇంకా జల వనరుల దోపిడీ ఆగలేదని, స్వరాష్ట్రంలో కూడా జిల్లా వివక్షకు గురవుతుందన్నారు. సాగునీటి కల్పనలో జిల్లాకు అన్యాయం జరిగిందని, కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వలేదని ఆరోపించారు. జోరుగా ఉల్లి వ్యాపారం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వేలంలో నాణ్యతగా ఉన్న ఉల్లి ధర గరిష్టంగా రూ.2 వేలు, కనిష్ట ధర రూ.1,100 వరకు పలికింది. చిన్నసైజు ఉల్లి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.300 వరకు ధరలు వచ్చాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్ట ధర రూ.వెయ్యి, కనిష్ట ధర రూ.550, చిన్న సైజు ఉల్లి గరిష్ట ధర రూ.350, కనిష్టంగా రూ.150 బస్తాగా విక్రయించారు. మార్కెట్కు దాదా పు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఎక్కువగా చిరు వ్యాపారులు, వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,277 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,277, కనిష్టంగా రూ.2,100 ధరలు వచ్చాయి. అలాగే ఆముదాలకు గరిష్టంగా రూ.5,970, కనిష్టంగా రూ.5,780, వేరుశనగ సరాసరిగా రూ.6,131, ధాన్యం హంస రకం రూ.1,701, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,129, కనిష్టంగా రూ.1,952 ధరలు లభించాయి. -
మెరుగైన వైద్యం అందించాలి
నారాయణపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తేనే.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తాలోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి.. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో పలు రికార్డులతో పాటు మందుల స్టాక్ తదితర వాటిని పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ నరసింహారావుకు సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బోధన తీరును పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ఆట వస్తువులు, బోధనా పరికరాలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. ఉర్దూ పాఠశాల భవనం మార్చాలని ఆదేశం.. దూల్పేటలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న హాజిఖాన్పేట ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ 25 మంది విద్యార్థులు ఉండగా.. కొన్నేళ్లుగా అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అయితే ఉర్దూ మీడియం పాఠశాలను వెంటనే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాల భవనంలోకి మార్చాలని ఎంఈఓ బాలాజీని అదనపు కలెక్టర్ ఆదేశించారు. -
ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288
తేది: 04–07–2025, సమయం: మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పుర కమిషనర్ భోగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. తాగునీటి ఇబ్బందులు, డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడం, దోమలబెడద, పందులు, కుక్కల స్వైరవిహారం, వీధిలైట్లు వెలుగకపోవడం, ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు, ఇళ్ల మధ్య మురుగునీరు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. రేపు మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
నేడు పీయూకు విద్యా కమిషన్ రాక
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ రానుందని పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పీయూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో విద్యా కమిషన్ చైర్పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, కమిషన్ మెంబర్స్ పీఎల్ విశ్వేశ్వర్రావు, చారకొండ వెంకటేష్, జ్యోష్నశివారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. ఇందులో విద్యా బలోపేతం, బోధన లోపాలు, వసతుల కల్పన తదితర అంశాలను కమిషన్కు తెలియజేస్తే వారు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్రెడ్డి, రవికాంత్ పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. దూరం!
నారాయణపేట: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతివనాల్లో వేప, తంగెడు, చింత, టేకు, కానుగ, ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు.. కొన్నేళ్లుగా గాలికొదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి. బోర్డులకే పరిమితం.. తెలంగాణకు హరితహరం.. వార్డుకో ఉద్యానవనం పేరిట మూడేళ్ల క్రితం రూ.లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయి. పట్టణ ప్రకృతివనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల అంతకుముందే మొక్కలు ఉండగా.. పట్టణ ప్రకృతివనం బోర్డు ఏర్పాటుచేసి నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, ప్రజలకు అహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం.. హరితహరంలో నాటిన మొక్కలు లేని చోట వనమహోత్సవంలో మొక్కలు నాటించి పెంచుతాం. మొక్కల సంరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకుంటాం. పట్టణ ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట. నిర్లక్ష్యపు నీడలో పట్టణ ప్రకృతివనాలు నెరవేరని ప్రభుత్వ లక్ష్యం నిర్వహణ లోపంతో పెరగని మొక్కలు పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారిన వైనం -
ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు
కోస్గి రూరల్: మున్సిపాలిటీ ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రెవె న్యూ మేళాకు ట్రెయినీ కలెక్టర్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి మార్పిడి, ఆస్తిపన్ను హెచ్చుతగ్గులు, యజ మాని పేరు, ఇంటి నంబర్ సరిచేయడం, కొత్తగా ఇంటి నంబర్లు జారీ చేయడం తదితర వాటిపై ప్రజల నుంచి 412 అర్జీలు అందినట్లు కమిషనర్ నాగరాజు తెలిపారు. వీటిని క్రోడీకరించి రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు లేని వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అనిల్కుమార్, శ్రీదేవి, పెంటయ్య, శ్రీనాథ్ పాల్గొన్నారు. -
పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: పోలీసు వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని ఆర్ఐ స్టోర్, ఎంటీ సెక్షన్ ఆఫీస్, స్టోర్రూంలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం కోసం వచ్చే వస్తువులను అందరికీ లిస్ట్ ప్రకారం ఇవ్వాలన్నారు. స్టోర్ రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఉపయోగంలో లేని వస్తువులు, ఫర్నిచర్ను వేలం వేయాలన్నారు. అనంతరం పోలీసు మోటారు ట్రాన్స్ఫోర్ట్ సెక్షన్లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. పోలీసు వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనానికి సంబంధించిన స్పేర్ స్పాట్స్ జాగ్రత్తగా ఉంచి.. అవసరమైన వాహనాలకు అందించాలని తెలిపారు. మెకానిక్స్, డ్రైవర్స్, సిబ్బంది అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని.. ప్రతి వస్తువు సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎస్పీ వెంట ఆర్ఐ నర్సింహ, సీఐ శివశంకర్, స్టోర్ ఇన్చార్జి ఏఆర్ ఎస్ఐ శంకర్జీ, రైటర్ నరేశ్ తదితరులు ఉన్నారు. -
కాళ్లు మొక్కుతా.. ఇల్లు మంజూరు చేయండి
కోస్గి రూరల్: నా భర్త మృతిచెందాడు.. కూతురి, నేను కూలి పనిచేసుకొని బతుకీడుస్తున్నాం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి సారూ.. అంటూ ఓ మహిళ కమిషనర్ కాళ్లపై పడి ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం పట్టణంలోని 9వ వార్డు పరిదిలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ నాగరాజు పర్యవేక్షిస్తుండగా చింతల్శెట్టి మణెమ్మ కమిషనర్ను కలిసింది. తమ ఇల్లు శిథిలావస్థకు చేరిందని, వెనుకభాగంలో కొంత కూలిపోయిందని, వర్షం పడితే ఇల్లు మొత్తం కురుస్తుండడంతో పైన ప్లాస్టిక్ కవర్ కప్పుకొని బతుకుతున్నామని తెలిపింది. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ ఒక్కసారిగా కమిషనర్ కాళ్లపై పడింది. స్పందించిన కమిషనర్ మహిళ కుటుంబ వివరాలు నమోదు చేసుకొని ఇల్లు మంజూరయ్యేలా చూస్తానని తెలిపారు. -
నాలాలు మాయం
నారాయణపేట: జిల్లా కేంద్రంలో నాలాలను, వాటిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాలను కొందరు ఆక్రమించి యథేచ్ఛగా భారీ భవంతులు నిర్మించారు. డ్రెయినేజీలపైనా నిర్మాణాలు చేపట్టారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే నీరు ముందుకు పారేందుకు అవకాశం లేక.. లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందని.. తమకు ఎప్పటికై నా ముప్పు పొంచి ఉందని లోతట్టు కాలనీల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలా కబ్జాకు గురైందన్న సమాచారం తెలిసినా.. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కచ్చా నాలాలు ఇరిగేషన్వి.. పేట పురపాలికలో ఉన్న ప్రధాన నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నాయి. కొండారెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చే వరద నీరు పళ్ల ఏరియా, యాద్గీర్రోడ్, ప్రతిభ కళాశాల వెనకభాగం నుంచి ఒల్లంపల్లి రోడ్లోని బ్రిడ్జి దగ్గర వరకు ఉన్న నాలా ఒకటి. అమ్మణ్ణబాయి నుంచి లింగయ్యగుడి, గాంధీనగర్, సాయివిజయ్కాలనీ, ఎస్పీ ఆఫీస్పక్కన, ఆర్టీసీడిపో పక్క నుంచి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ పక్కన, అశోక్నగర్, సత్యనారాయణ స్వామి ఆలయం సమీపం నుంచి ఒల్లంపల్లి బ్రిడ్జి దగ్గర మరో నాలా కలుస్తుంది. ఈ రెండు నాలాలు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నవంటూ అధికారులు చెబుతున్నారు. కాగా అమ్మణ్ణబాయి నుంచి వచ్చే నాలా అక్కడక్కడ సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టడంతో మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిందని.. కొండరెడ్డిపల్లి చెరువు దగ్గర నుంచి వచ్చిన నాలా మాత్రం ఇరిగేషన్ పరిధిలో ఉంది.జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా కబ్జాలు.. అడ్డగోలు నిర్మాణాలు డ్రెయినేజీలపైనా కట్టడాలు భారీ వర్షాలు కురిస్తే ముందుకు పారని నీరు లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు భయాందోళనలో ప్రజలు -
నాలాల్లో సగం కబ్జాలే..
మున్సిపాలిటీలో నాలాలు ఉండే వెడల్పులో వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అవుతున్నాయనేది స్పష్టంగా కానవస్తుంది. నాలాలను పూర్తిస్థాయిలో విస్తరించినట్టయితే.. వరదలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. వర్షం పడితే లోతట్టు ప్రాంతాల్లో, కొత్త కాలనీల్లో వరద నీటితో ఇబ్బందులు తప్పడం లేదంటూ జనం వాపోతున్నారు. ఇదిలాఉండగా, పట్టణంలో డ్రైనేజీలను ఆనుకొని కొందరు.. కబ్జా చేస్తు కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారు. వాటిపై మున్సిపల్ అధికారులకు మౌఖిక ఫిర్యాదులు అందుతున్నా వాటిని తొలగించేందుకు ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితి కానవస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతో నాలాలు, డ్రెయినేజీలను అక్రమించుకొని అక్రమ కట్టడాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నాలాలను కబ్జా చేస్తే చర్యలు నిబంధనల మేరకే భవనాల నిర్మాణాలకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు ఇస్తున్నాం. డ్రెయిన్లపై, నాలాలను అక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడితే మున్సిపల్ శాఖ పరంగా చర్యలు తీసుకుంటాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు
నారాయణపేట: జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈమేరకు మంగళవారం అన్ని మండలాల తహసీల్దార్లతో వరదల ప్రవాహం, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ, కొత్త రేషన్ కార్డుల జారీ పై సమీక్ష జరిపారు. ప్రస్తుతం సీజన్లో వరదల ప్రవాహ సమాచారంపై అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల తహసీల్దార్లకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాద స్థాయి ఎంత అనే పూర్తి వివరాలను ఆయా మండలాల తహపీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం మూడో దశ భూ సేకరణ పనులు ఎంత వరకు వచ్చాయని, ఇంకా ఎన్ని ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉందని అడిగారు. అధికారులు సమన్వయంతో భూ సేకరణను పూర్తి చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులందరికీ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీవో రామచందర్ నాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. బాలసదనం సందర్శన జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. సదనంలో ఎంత మంది చిన్నారులు ఉన్నారని ఆరా తీయడంతోపాటు చిన్నారుల స్టడీ అవర్, వారి బోధనా పటిమను పరిశీలించారు. ఓ చిన్నారి వేసిన యోగాసనాల చూసి అభినందించారు. అందరూ బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అలాగే సదనం లోని వంట గదిని పరిశీలించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల సంరక్షణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దన్నారు. -
జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం
నారాయణపేట టౌన్: జగన్నాథ పాహిమాం.. పురుషోత్తమ రక్షమాం.. అన్న ప్రార్థనలతో జిల్లా కేంద్రం మార్మోగింది. సోమవారం జిల్లాకేంద్రంలో జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు హారతి, పూజలు చేశారు. సరాఫ్ బజార్ బాలాజీ మందిరం నుంచి రథయాత్ర ప్రారంభమైంది. భక్తుల జై జగన్నాథ, హరేరామ్.. హరేకృష్ణ నామస్మరణతో పాలమూరు వీధులో మార్మోగాయి. జగమేలే జగన్నాథుడి రథయాత్ర దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రథన్ని లాగేందుకు జనం పోటీపడ్డారు. రథయాత్ర మెయిన్ చౌక్ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ మాదిరిగా ఆడి పాడారు. పలు ధార్మిక సంస్థ సభ్యులు హాజరై రథయాత్రలో భాగంగా స్వయంగా తాడుతో రథాన్ని లాగారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కనులపండువగాజగన్నాథ రథయాత్ర -
మళ్లీ పగిలిన మిషన్ భగీరథ పైపులైన్
మరికల్: మన్యంకొండ మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం నుంచి జిల్లాకు నీరు అందించే ప్రధాన పైపులైన్కు మరమ్మతు చేసి ఒక్క రోజు కూడా గడవకముందే మళ్లీ పగిలింది. మరికల్, అప్పంపల్లి మధ్య తరచు లీకేజీ అవుతున్న ప్రధాన పైపులైన్ను మరమ్మతు చేయడం కోసం మిషన్ భగీరథ అధికారులు 36 గంటల సమయం తీసుకొని సిబ్బందితో మరమ్మతులు చేయించారు. ఆదివారం రాత్రి వరకు మరమ్మతులు పూర్తి కావడంతో అదే రాత్రి మన్యంకొండ గ్రిడ్ నుంచి నారాయణపేట జిల్లాకు నీటిని వదిలారు. అలా నీటిని వదిలిన గంట వ్యవధిలోనే మరికల్ శివారులో లీకేజీకి మరమ్మతు చేసిన ప్రదేశంలోనే మళ్లీ పైపులైన్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున పత్తి పంటల్లో నీరు వరదలా ప్రవహించడంతో చాకలి రాజు 3 ఎకరాల్లో సాగు చేసిన పత్తి మొక్కలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో రూ. 50 వేల వరకు నష్టం వాటిళ్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాకు మళ్లీ నీటి సరఫరా నిలిచిపోవడంతో పైపులైన్ మరమ్మతులు పనులు అధికారులు నాసీరకంగా చేస్తున్నారనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తోంది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని సిబ్బంది కారణంగా పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు నిండి మురుగు రోడ్లపైకి వస్తోంది. దీంతో రోడ్లన్నీ కంపు..కంపు కొడుతున్నాయి. ఇళ్ల మధ్య నిలిచే మురుగు.. పందులు, దోమలకు ఆవాసాలు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులతోపాటు పలు కొత్త కాలనీల్లోని రోడ్లపై నిత్యం మురుగు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల ముప్పు మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలు మురుగునీటితో అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలను సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. ఇళ్ల మధ్య మురుగు కుంటలు ఏర్పడడం, కొత్త కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, విధిగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, చెత్త తరలించకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమకాటుతో ప్రజ లు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల భారిన పడుతున్నారు. అంతేగాక, వర్షాలు పడుతుండడంతో పలు చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు కావడం, డ్రెయినేజీ నీరు తాగునీటి పైపుల్లోకి చేరడంతో డయేరియా వ్యాధులు వచ్చే అవకాశముందంటూ భయందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘పేట’ పురపాలికలో వర్షానికే నిండుతున్న డ్రెయినేజీలు రోడ్లపై మురుగుతో కంపుకొడుతున్న కాలనీలు పందుల స్వైర విహారం.. దోమల బెడద తీవ్రం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులముప్పు -
ఇసుక తరలించే ప్రయత్నాలు మానుకోవాలి
మాగనూర్: ప్రభుత్వం,అధికారులు గ్రామస్తుల, రైతుల అంగీకారం లేకుండా ఇసుక తరిలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలను సైతం లేక్క చేయమని అధికారులకు మాగనూర్ రైతులు గ్రామస్తులు హెచ్చరించారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పైపుల తయారీ కోసం ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఆయన మాగనూర్ గ్రామ సమీపంలోని హెన్హెచ్–167 వంతెన పక్కనే ఇసుక తరలించేందుకు స్థానిక రెవెన్యూ అధికారుల సహయంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు ఇక్కడ ఇసుక తరలిస్తే ఊరుకోం అన్ని ఈ నెల 27వ తేదీన వాగులోకి వచ్చిన యంత్రాలను టిప్పర్లను అడ్డగించి తిప్పి పంపించారు. అయినా అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే ఇసుక తరలించేందుకు సోమవారం పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు అధికారులు గ్రామస్తులను కాదని ముందుకు వెళితే మరో లగచర్ల, గద్వాల జిల్లాలోని ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. దీంతో అధికారులు తహసీల్ధార్ కార్యాలయంలో గ్రామస్తులు, రైతులతో శాంతి చర్చలు ఏర్పాటు చేశారు. అభివృద్ధి కోసం అందరి సహకారం ఉండాలని తహసీల్ధార్ నాగలక్ష్మి, సిఐ రాంలాల్ కోరారు. గ్రామ సమీపంలో ఇసుక తరలిస్తే రైతుల పొలాలు ఎండిపోవడంతో పాటుగా గ్రామస్తులకు తాగునీరు లభించదని ఆవేదన వ్యక్తం చేశారు. మాగనూర్ మండలంలో పెద్ద వాగు ఇటు నేరడగం నుంచి అటు మందిపల్లి వరకు చాలా ప్రాంతాల్లో ఇసుక లభ్యం అవుతుందని అక్కడ నుంచి తరలించుకోవాలని సూచించారు. కాదని ఇక్కడే ఇసుక తరలించేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు పోయినా పిడికెడు ఇసుక కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు. చేసేది లేక పనులకు కావాల్సిన ఇసుకను వర్కూర్ గ్రామం నుంచి 80 శాతం తరలిస్తామని తెలిపారు. మిగిలిన 20 శాతం ఇసుక సమయం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి తరలించాలనే విషయంపై మేం నిర్ణయం తీసుకుంటామని తహసీల్ధార్ తెలిపారు. ఈ సమావేశంలో మాగనూర్ గ్రామస్తులు, రైతులు , రెవెన్యూ అధికారులు, పోలిసులు తదితరులు ఉన్నారు. -
పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
నారాయణపేట: మున్సిపల్ అధికారులు పనితీరుపై ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేటలోని ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అనుకూలంగా పనిచేస్తున్నా, కొందరు అధికారులు పనులు చేయడం లేదని పనితీరు మార్చుకోవాలని లేకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం సరిగ్గా నిర్వహించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని, వార్డుల్లో ఫాగింగ్ చేయాలని, వీధి లైట్లు అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని కమిషనర్కు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ త్వరగా చేయాలని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారిలో ఉన్న అపోహలు తొలగించాలని వార్డ్ ఆఫీసర్లకు సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణం అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చి మరీ నల్లా బిల్లులు చెల్లించాలని ప్రజలను బలవంతం చేయొద్దని సూచించారు. నాయకులను కలుపుకొని పోవాలి.. ఇదిలాఉండగా, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీంతోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ.. కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అభివృద్ధి పనులు చేపట్టడంలేదని, ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే వార్డుల్లో అధికారులు మార్క్ అవుట్ లో ఇస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న గృహాలకు నెంబర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నాయకులను కలుపుకొనిపోవాలని, తప్పనిసరిగా ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చి ఇళ్ల గ్రౌండింగ్ చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమస్యలన్నీ నెల రోజుల్లో అధికారులు పరిష్కరించాలలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి శంకర్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, ఇంజనీర్ మహేష్, అధికారులు శ్రీనివాస్,లకి్ష్మ్ నర్సింహ, చెన్న కేశవులు, నాయకులు మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, నాయకులు గందే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజావాణి’ అర్జీలను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 ఫిర్యాదులు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో 9 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ యోగేష్గౌతమ్ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని, ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని అన్నారు. సమగ్ర నివేదికలతో రండి నారాయణపేట: అధికారులు సమగ్ర నివేదికలతో మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్న్స్కు హాజరుకావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్లో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్కు ఏసి (ఆర్), డి.డబ్యూఓ, డీఈఓ, డీఎంహెచ్ఓ ఇతర శాఖల అధికారులు అన్ని నివేదికలను సిద్ధం చేసుకుని హాజరు కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రూ.5.23 కోట్లతో 343 ప్రకృతి వనాలు
మద్దూరు: పర్యావరణ పరిరక్షణతోపాటు.. గ్రామాల్లో చిన్నారులు, పెద్దలకు ఆహ్లాదం పంచడానికి ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో దర్శమిస్తున్నాయి. ప్రకృతి వనాల చుట్టూ ముళ్ల కంచెలు పూర్తిగా ధ్వంసమై పోవడంతో పశువులు సంచరిస్తున్నాయి. కొన్ని పార్కుల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసినా సిమెంట్ కుర్చీలు, బల్లాలు విరిగిపోయాయి. అక్కడక్కడా ఊరికి ఆనుకుని ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లోనే కొంత సందడి కనిపిస్తున్నా.. మెజార్టీ గ్రామాల్లో ఊరికి దూరంగా కిలోమీటర్ల దూరంలో పార్కులను ఏర్పాటు చేయడంతో అటువైపు ఎవరూ వెళ్లడమే లేదు. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ఈ వనాలు ఉపయోగపడకపోవడంతో రూ.లక్షల నిధులు వృథా అయ్యాయి. కొందరు వీటిని అసాంఘిక కార్యకలాలపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 2021లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని అప్పటి 11 మండలాల్లో మొత్తం 343 పల్లె ప్రకృతి వనాలను రూ. 5.23 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం 5 ఎకరాల పైనా ఉన్న గ్రామాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను 28 వరకు ఏర్పాటు చేశారు. ఈ వనాల ఏర్పాటు కోసం ఉపాధి హామీ పథకం నుంచి రూ.97.33 లక్షలు వెచ్చించారు. పల్లె ప్రకృతి వనాలలో వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచె మొక్కలు, ఓపెన్ జిమ్ లాంటివి ఏర్పాటు చేశారు. మొక్కలను పెంచడానికి ఒక వాచర్ను కూడా నియమించారు. రెండేళ్ల తర్వాత నిర్వహణ మొత్తం జీపీలకు అప్పగించారు. ఇది మద్దూరు మండలంలోని దోరేపల్లి గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం. ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో గుట్టల్లో నిర్మించారు. అప్పట్లో మొత్తం 460 మొక్కలను నాటారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేసి గేటు అమర్చారు. అయితే ఊరికి దూరంగా ఉండడంతో ప్రజలెవరూ ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో కొంత కాలం క్రితం ఇనుప కంచెను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రస్తుతం గేటు, చుట్టూ సిమెంట్ దిమ్మెలు మాత్రమే ఉన్నాయి. అందులో నాటిన మొక్కలు ఒక్కటీ లేవు. ఈ మధ్య కాలంలో వర్షాలు పడడంతో ప్రకృతి వనం మొత్తం పిచ్చిమొక్కలు మొలిచాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. మరికొన్ని రోజుల్లో గేటు, సిమెంట్ దిమ్మెలను కూడా దొంగిలించే అవకాశం లేకపోలేదు. నిధుల కొరతతో.. గత కొంత కాలంగా గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి ఎందుకు పనికి రాకుండా పోయాయి. వేసవి కాలంలో వీటిని పట్టించుకోకపోవడంతో వనాల్లో మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వీటి నిర్వహణ చేపట్టి కొత్త మొక్కలను నాటి అంబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. కొన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాలు కబ్జాకు గురవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నిర్వహణ మరిచారు.. ఊరికి దూరంగా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడంతో ఎందుకు పనికిరాకుండా పోయింది. ఊరికి సమీపంలో నిర్మించి ఉంటే దాన్ని నిర్వహణ చేపట్టపోయినా అడిగేవాళ్లం. 2 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో అక్కడి వెళ్లలేకపోతున్నాం. ప్రకృతి వనం చుట్టూ ఏర్పాటు చేసిన కంచె ఎవరో ఎత్తుకెళ్లారు. కొన్ని రోజులైతే గేటు కూడా తీసుకెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు మొక్కలు నాటి, నిధులు మంజూరు చేసి పక్కాగా నిర్వహణ చేపట్టాలి. – శ్రీనివాస్గౌడ్, దోరేపల్లి కొత్త మొక్కలు నాటుతాం.. జిల్లాలో ఏర్పాటు చేసినా పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఊరికి దగ్గర ఉన్నవి బాగున్నాయి. ఊరికి దూరంగా ఉన్నవి అక్కడక్కడ నిర్వహణ లేకపోవడంతో పాడైన మాట వాస్తవం. మా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పంచాయతీ సిబ్బందిచే బాగుచేయిస్తున్నాం. ఎండిన మొక్కల స్థానంలో ఈ వర్షాకాలంలో కొత్తవాటిని నాటుతాం. మొక్కలు ఎండకుండా విధిగా నీరు అందిస్తాం. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – సుధాకర్రెడ్డి, ఇన్చార్జ్ డీపీఓ, నారాయణపేట -
సర్వేయర్లు కావాలె..
మహబూబ్నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్లైన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జో.గద్వాల 20 9 11 నాగర్కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు 2 వేలకుపైగానే ఎఫ్లైన్ అర్జీల పెండింగ్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు -
పది నెలల్లో మూడు సార్లు
● గతేడాది సెప్టెంబర్లో దేవరకద్ర నుంచి నారాయణపేట వరకు ఉన్న భగీరథ పైపులైన్లో లీకేజీలను సరి చేయడం కోసం పది రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు. ● జనవరిలో మళ్లీ మరికల్ నుంచి నారాయణపేట మధ్య పైపులు లీకేజీలు ఏర్పడడంతో వాటిని మరమ్మతు చేయడం కోసం ఆరు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేసి సరిచేశారు. ● తాజాగా జూన్లో మరికల్ – అప్పంపల్లి మధ్య రెండు చోట్ల ప్రధాన పైపులైన్ లీకేజీ కావడంతో ఈ సారి మూడు రోజుల పాటు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు చేస్తున్నారు. మరికల్, అప్పంపల్లి మధ్య మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్కు మరమ్మతు చేస్తున్న సిబ్బంది -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. ప్రాజెక్టులకు రక్షణ లేదు.. రాష్ట్రంలో ప్రాజెక్టులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. జూరాల క్రస్ట్ గేట్ల రోప్లు తెగుతున్నాయంటే.. వాటితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని మాట్లాడే వ్యక్తి నీటి పారుదల శాఖ మంత్రి కావడం మన దురదృష్టం అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తూ రైతులకు సాగునీరు అందించేవారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను కిందకు పంపడమే పనిగా పెట్టుకుందని.. అలాంటి పాలకులపై ప్రజలు తిరగబడుతున్నారని, ప్రజలు మరోమారు బీఆర్ఎస్ పాలనే రావాలంటూన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. -
సోమశిలకు సొబగులు
● జటప్రోలు, కొల్లాపూర్లోని పురాతన ఆలయాల అనుసంధానం ● కృష్ణాతీరంలోని సుందర ప్రాంతాలు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు ● హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం ● సోమశిల, అమరగిరి, నార్లాపూర్ వద్ద కాటేజీల నిర్మాణం, బోట్ జెట్టీల ఏర్పాటు ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను అందించనుంది. ‘సోమశిల వెల్నెస్, స్పిరిచ్యూయల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్ట్’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సోమశిల వద్ద కృష్ణానదిలో సిద్ధమవుతున్న లాంచీ – సాక్షి, నాగర్కర్నూల్సోమశిల కేంద్రంగా టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చెందితే మరింత విస్తృతంగా స్థానికులకు ఆదాయం సమకూరేందుకు అవకాశం కలగనుంది. ఇప్పటికే సోమశిలలో హోం స్టే విధానంలో తమ ఇళ్లను తీర్చిదిద్దుకున్నారు. పదుల సంఖ్యలో రిసార్ట్లతో పాటు వందకు పైగా ఇళ్లను హోంస్టేకు అనువుగా మలచుకున్నారు. తమ ఇళ్లలో ఉండేందుకు వసతులు కల్పించడంతో పాటు రుచికరమైన ఇంటి భోజనాన్ని పర్యాటకులకు అందిస్తున్నారు. ఆర్డర్పై చేపల పులుసు, కూరలు, రొట్టెలు, అన్నం ఇతర వంటకాలను పర్యాటకులకు అందిస్తున్నారు. సోమశిల గ్రామానికి వీకెండ్స్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నెలలో కనీసం 15 రోజుల పాటు స్థానికులు ఆదాయం పొందుతున్నారు. తమ ఇళ్లను హోంస్టేలుగా మార్చి అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఎకో టెంపుల్ టూరిజం ఒకేచోట కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాలైన సోమశిల, అమరగిరి ద్వీపం, నార్లాపూర్ గ్రామాల్లో కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, కనెక్టింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అలాగే నల్లమలలోని ఈగలపెంటలో అరైవల్ జోన్, రివర్ క్రూయిజ్, చెంచు ట్రైబల్ ఎక్స్పీరియన్స్ పేరుతో టూరిజం క్లస్టర్ ఏర్పాటు, కొల్లాపూర్లోని మాధవస్వామి ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్ సర్క్యూట్ను ఏర్పాటు చేస్తారు. సోమశిల సర్క్యూట్లోనే ఫారెస్ట్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకోసం అమరగిరి ద్వీప ప్రాంతంలో 18 కాటేజీలు, బోటింగ్ జెట్టీలు, స్విమ్మింగ్పూల్, కేఫేటేరియా, స్పా అండ్ వెల్నెస్ సెంటర్, ఇన్డోర్, అవుట్ డోర్ గేమ్స్, వాటర్స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కొల్లాపూర్ పట్టణంలోని రాజావారి ప్యాలెస్ను సైతం సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. పురాతన భవనాల నిర్మాణ శైలి తో పాటు బంగ్లాలోని పురాతన ఫర్నిచర్, అలనాటి వైభవం, నిర్మాణ ఆకృతులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. కొల్లాపూర్లో రాజా వారి ప్యాలెస్ హోంస్టేల ద్వారా స్థానికులకు ఆదాయం.. -
ఉపాధి కోసం వచ్చాం..
ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం 60 మందికి వచ్చాం. మాకు అక్కడ ప్రస్తుతం పనులు లేవు. ఇక్కడ కొన్ని ఎకరాల చొప్పున గుత్త మాట్లాడుకొని పనులు చేస్తాం. మాకు తినడానికి, ఉండడానికి అవసరమయ్యే సౌకర్యాలు రైతులు కల్పిస్తారు. మేం అందరం కూడా కలిసి పని చేస్తాం. వచ్చిన డబ్బును అందరం సమానంగా పంచుకుంటాం. మాకు ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆయనే మాకు పొలాలను చూయించి రైతులకు, మాకు మధ్య వారధిగా ఉంటాడు. – లవ్కుమార్, వలస కూలి, యూపీ వారి వల్లే సరైన సమయంలో నాట్లు.. మహారాష్ట్ర, బీహార్ ప్రాంతాల నుంచి జిల్లాలో వరినాట్లు వేసేందుకుగాను కూలీలు వస్తుంటారు. వీరు రావడం మూలంగా మా పొలాల్లో సరైన సమయంలో వరి నాట్లు వేస్తున్నాం. దాంతో అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో కూలీల కొరత ఎక్కువగా ఉండడం, అది కూడా అధిక రేట్లు అడుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలు లేకుండా వలస కూలీల ద్వారా మా పొలాలు సాగు చేస్తున్నాం. – రవిగౌడ, గుర్జాల్ రైతు ● -
ఎన్ఎంసీ మార్గదర్శకాలు పాటించాలి
నారాయణపేట: నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా నారాయణపే ట మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వసం వెంకటేశ్వర రెడ్డి సూచించారు. శనివారం నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ఆస్పత్రి లోని అత్యవసర విభాగం, జనరల్ వార్డు, ఐసీయూ, జనరల్ మందుల విభాగాలను పరిశీలించారు. జనరల్ వార్డు లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి లో ఉన్న వసతి సౌకర్యాలు, అవసరమైన వసతులు, ఖాళీ పోస్టుల తదితర అంశాలను వివరించారు. జిల్లా జనాభా, మెడికల్ కళాశాల పరిధి, జిల్లా ఆస్పత్రి విస్తీర్ణం, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ల వివరాలు, సర్జరీలు, ఎన్ని జరుగుతాయో సరాసరి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటెన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల, జిల్లా ఆస్పత్రికి ఇంకా ఏయే వసతులు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరమో గుర్తించి సమగ్ర నివేదిక అందజేయాలని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు సూచించారు. విద్యార్థులకు అనుగుణంగా ఆచార్య పోస్టులు అవసరం, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు, అందుబాటులోని వసతులు, కొత్తగా సమకూర్చాల్సిన వసతుల నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి రెండు రోజుల్లోగా ప్రతిపాదనలు పంపుతానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్, వైద్య నిపుణులు ఆదిత్య, టీజీ ఎమ్ఐడిసి డీ.ఈ. కృష్ణ మూర్తి, ఏ ఈ సాయి మురారి పాల్గొన్నారు. -
వలస జిల్లాకే.. వలసలు
కృష్ణా: ఒకప్పుడు వలస కార్మికులకు పుట్టినిల్లుగా పేరుగాంచింది నారాయణపేట జిల్లా. బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని ముంబాయి.. పూణె.. తదితర మహానగరాలకు వలస వెళ్లేవారు ఇక్కడి ప్రజలు. నేడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రాజెక్టులు.. సాగునీటి కాల్వల పుణ్యమా అని ప్రతి ఎకరా సాగులోకి రావడం.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండడంతో ఇప్పుడు జిల్లాకే ఇతర రాష్ట్రాల కూలీలు ఉపాధి కోసం వలస వస్తున్నారు. మహారాష్ట్ర, యూపీ ప్రజలు కూడా ఇక్కడి పనుల కోసం వలస రావడం గమనార్హం. ఇదిలా ఉండగా కృష్ణా, బీమా నది పరివాహక ప్రాంతంలోని రైతులు గత వారం రోజుల నుంచి వరినాట్లు ప్రారంభించారు. నెల రోజుల నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తుండడంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది నిండుగా ప్రవహిస్తుంది. దీంతో ఇక్కడి రైతులు పంటల సాగుకు నీటి ఇబ్బందులు ఉండవని భావించి వరినాట్లు వేసే పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కృష్ణా, భీమా నదీ తీరాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేశారు. ఈ పరిస్థితులలో ఇక్కడున్న కూలీలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రైతులు తీసుకొస్తుంటారు. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి కృష్ణా రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి వలస కూలీలు గుడెబల్లూర్, టైరోడ్, ముడుమాల్, తంగిడి, గుర్జాల్ తదితర గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో వ్యవసాయ పనులకు తరలి వస్తున్నారు. నదీతీర ప్రాంతాల్లోని సాగు పనులకు కూలీలు ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర నుంచి వందలాది మంది రాక జిల్లాలో నెల రోజులపాటు కొనసాగనున్న వ్యవసాయ పనులు -
డిసెంబర్ నాటికి జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియామకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోటింగ్
కృష్ణానదిలో విహారం కోసం ఇప్పటికే పర్యాటకశాఖ లాంచీ ప్రయాణాన్ని కల్పిస్తోంది. వీటితో పాటు జాలరులు ప్రైవేటుగా బోటు విహారాన్ని కల్పిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. వచ్చే నెలలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ క్రూయిజ్ ప్రయాణాన్ని పర్యాటకశాఖ అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం ఇప్పటికే లాంచీ క్రూయిజ్ను సిద్ధం చేశారు. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి లాంచీ క్రూయిజ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లాంచీ అందుబాటులోకి వస్తే కృష్ణానదిలో ప్రకృతి రమణీయ దృశ్యాలను తిలకిస్తూ ఆరుగంటల పాటు నదిలో ప్రయాణించేందుకు వీలు కలుగనుంది. కృష్ణానదిలో బోటులో విహారం చేస్తున్న పర్యాటకులు -
పర్యావరణానికి పెద్దపీట
నర్వ: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖలు చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం ఏకోక్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరిట ఏర్పాటు చేయాలని ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 31 నాటికి సంబంధిత వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని హెచ్ఎంలకు సూచించింది. పాఠశాలల్లోని ప్రతి తరగతిలో చురుకై న విద్యార్థులు ఐదు మందిని క్లబ్లో భాగస్వామ్యం కల్పించాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. ఈ క్లబ్లో పాఠశాలల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు సభ్యులుగా ఉండాలని ఆదేశించింది. పర్యవేక్షణ కోసం హెచ్ఎంలకు బాధ్యతలను అప్పగించింది. ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి పర్యావరణపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలని సూచించింది. దీంతో పాటు వివిద రకాల కార్యక్రమాల ద్వారా చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు విద్యాశాఖ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా.. పాఠశాల పిల్లలతో క్లబ్లు ఏర్పాటు చేయాలి. తద్వారా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేలా చర్యలు చేపట్టునుంది. ఈ క్రమంలో విద్యార్థులకు బాధ్యతలు నేర్పించడం, వారి హక్కులకు పరిరక్షించేందుకు క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులకు గతంలోనే శిక్షణ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థుల కోసం 1098 నంబర్ను, పోలీస్ సేవల కోసం డయల్ 100 నంబర్లను గోడలపై రాయించడమే కాకుండా వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక నిధులు మంజూరు జిల్లాలో మొత్తం 406 పాఠశాలకు గాను 2024–25 వార్షిక ఏడాదిలో ఏకో క్లబ్ల నిర్వహణ కోసం రూ.16.82 లక్షలు విద్యాశాఖ మంజూరు చేసింది. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 299 గాను రూ.8.97 లక్షలు , యూపీఎస్ పాఠశాలలకు 86కు గాను రూ.4.30 లక్షలు, ఉన్నత పాఠశాలలు 63కుగాను రూ.3.15 లక్షలు, హెచ్ఎస్ఎస్ పాఠశాలలకు 8కు గాను రూ.40 వేలు మంజూరయ్యాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలకు ఒక్కో పాఠశాలకు రూ.3 వేలు, మిగిలిన పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.5 వేల చొప్పున కేటాయించారు. 2025–26 కు విద్యాసంవత్సరానికి గాను పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికై న 19 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున రూ1.90 లక్షలు మంజూరయ్యాయియి. తప్పక అమలుచేయాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యూత్ అండ్ ఏకో క్లబ్లను ఏర్పాటు చేసి నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణంపై ప్రాథమిక దశలోనే అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. గత ఏడాది నుంచి ఈ క్లబ్ల ద్వారా పాఠశాలల ఆవరణలో కిచెన్గార్డెన్స్ ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్కు నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాల కోసం నిధు లు మంజూరయ్యాయి. ప్రతి పాఠశాలలో వారు చేపట్టే కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలల్లో టోల్ఫ్రీ నంబర్లు విధిగా రాయించాలి. విద్యార్థులకున్న హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. – విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి క్లబ్ ద్వారా నేర్పించేవి.. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పెంచడం మొక్కలను, ప్రకృతిని విద్యార్థులకు పరిచయం చేయడం పర్యావరణంపై విద్యార్థులకు అవగతమయ్యేలా ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం ప్రకృతి ప్రాముఖ్యతను తెలియజేసేలా వివిధ నినాదాలతో వాల్పోస్టర్లు రూపొదించడం పర్యావరణ, ధరిత్రి దినోత్సవాలు, చర్చగోష్టీ, విద్యార్థులకు పోటీలు నిర్వహించడం పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి వాటి సమాచారం తెలుసుకునేలా చూడటం తోటలను పెంచి ఆకుకూరలు, కూరగాయలను మధ్యాహ్న బోజనం తయారీలో వినియోగించటం ఈ వ్యర్థాల సేకరణపై అవగాహన తరగతులు నిర్వహించటం పాఠశాలలో నీటి వృథా, ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిపై అవగాహన పాఠశాలల్లో ఏకో క్లబ్ల ఏర్పాటు విద్యార్థి స్థాయి నుంచే అవగాహనకల్పించేందుకు చర్యలు ఆరోగ్యకరమైన జీవనశైలియే లక్ష్యం పీఎంశ్రీ పాఠశాలల్లో క్లబ్ల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు -
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
నారాయణపేట: పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఆపరేషన్ ముస్కాన్–11 కి సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్, జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు బాలల సంక్షేమ సమితి, లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో జులై 1 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్లో ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలనే దానిపై దిశా నిర్దేశం చేశారు. అలాగే నెల రోజుల స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం కి సంబంధించి యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ లింగయ్య, డీసీఆర్బీ, లేబర్ ఆఫీసర్ మహేష్ కుమార్, రాధ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్అడ్మిషన్లు ప్రారంభం మరికల్: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ చెన్నరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితోపాటు, ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూపులో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు జులై 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యలో చదువు మానేసిన వారు, ఏదేని పనిచేసుకుంటూ చదువు కొనసాగించాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశమని, పూర్తి వివరాలకు సెల్ నం.9985523526, 83418 51534లను సంప్రదించాలని తెలిపారు. 5న సాగునీటి సమస్యపై సదస్సు పాలమూరు: పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సాగునీరు సమస్యలపై జూలై 5న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను శనివారం మహబూబ్నగర్లోని టీఎఫ్టీయూ కార్యాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉందని తెలిపారు. కానీ కృష్ణా, తుంగభద్ర లాంటి జీవనదులు ఉన్న కావాల్సిన నీరు లేక భూములు బీడుగా మారుతున్నాయని వాపోయారు. మొక్కజొన్న @ రూ.2,310 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,310, కనిష్టంగా రూ.2,248 ధరలు లభించాయి. జొన్నలు గరిష్టంగా రూ.4,230, కనిష్టంగా రూ.2,000, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,601, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,929 ధరలు పలికాయి. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, నాగర్కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరమ్మతులు పూర్తయితేనే.. కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్లో భాగమైన ఎల్లూర్ పంప్హౌస్లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి జలకళ ఎగువన కర్ణాటక నుంచి కృష్ణానదిలో కొనసాగుతున్న వరద రిజర్వాయర్లో 125 టీఎంసీలకు చేరువైన నీరు ఈ సారి జూన్ నెలలోనే సగానికిపైగా నిండిన ప్రాజెక్టు -
పంద్రాగస్టులోగా దరఖాస్తులను పరిష్కరించాలి
నారాయణపేట: జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో రైతుల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను ఆగస్టు 15 ( పంద్రాగస్టు) లోపే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైని కలెక్టర్ ప్రణయ్ కుమార్తో కలిసి అన్ని మండలాల తమసీల్దార్లతో కలెక్టర్ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. మండలాల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆరా తీశారు. ఇప్పటి వరకు పరిష్కరించిన, తిరస్కరించిన వాటిపై చర్చించారు. 200లోపు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని, ఏదైనా సమస్యాత్మకంగా ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్డిఓ రామచంద్రనాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:15 గంటలకు కలెక్టర్ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రార్థన లో పాల్గొని, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. నిర్ణీత సమయానికి ఎంత మంది ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారని ఆరా తీశారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్లో మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ పరిశీలించి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతోపాటు మరో ఐదుగురు స్టాఫ్ రాలేదని నిర్ధారించారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
స్పాన్సర్లకు అవకాశం.. మూడు గోల్డ్ మెడల్స్ చొప్పున మొత్తం 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించి మొత్తం 13 పీజీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బీ, ఎం ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ ఫార్మ, బీపెడ్, ఎంపెడ్, ఎంబీఏ, బీఈడీ వంటి కోర్సులు ఉండగా.. వీటితో పాటు డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందజేయనున్నారు. వీటితోపాటు పీయూలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. కాన్వకేషన్లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ● పీయూలో 4వ కాన్వకేషన్కు సిద్ధమవుతున్న అధికారులు ● హాజరుకావాలని గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం ● యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్మెడల్స్ ● రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ఇచ్చే అవకాశం -
‘నా ఇల్లు అమ్మి అయినా సరే బిల్లులు ఇస్తా..’
మక్తల్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని.. నిధులు అందవనే భయంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించకపోవడం సరికాదని, అవసరమైతే తన ఇల్లు, ఆస్తులు అమ్మి అయినా సరే డబ్బులు చెల్లిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మక్తల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మున్సిపాలిటీలోని 291 మంది, మండలంలోని 600 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందుకుగాను రూ.175 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, ఒకవేళ ఎవరైన దళారులకు డబ్బులు ఇస్తే వారిపై చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరిస్తామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇళ్ల ప్రొసీడింగ్లను అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని, గ్రామాల్లో పెంకుటిల్లు కనిపించకూడదని అన్నారు. రైతులకు సైతం రుణమాఫీ చేసిందని అన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : కలెక్టర్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, అధికారులు విధిగా పరిశీలించి ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ పిడి శంకర్, కమిషనర్ శంకర్నాయక్, ఎంపీడీఓ రమేస్, తహసీల్దార్ సతీష్కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా, మక్తల్ మున్సిపల్ కార్మికులకు సబ్బులు, నూనె, రేడియం జాకెట్లు అందజేశారు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై అపోహలు వద్దు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
ఘనంగా నిర్వహిస్తాం..
పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 9, యూజీ కోర్సులలో టాపర్స్లో 17 మంది గోల్డ్మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ● -
సమష్టి కృషితోనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం
నారాయణపేట: సమష్టి కృషితో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ మత్తు పదార్థాల నిరోధక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలన్నారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే లభించే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు మహమ్మారి మారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలను వినియోగించినట్లు గుర్తిస్తే 1908 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా పోలీసు శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. తర్వాత యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవలే నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు, జిల్లా అధికారులు బహుమతులను అందజేశారు. అలాగే, ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఏఎస్పీ రియాజ్ హుల్ హాక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఈఓ గోవిందరాజులు, ఆర్టీవో మేఘా గాంధీ, డీపీఆర్ఓ ఎం.ఏ. రషీద్ పాల్గొన్నారు. -
నీరు కలుషితమయ్యే ప్రమాదం
వర్షాకాలంలో అధికంగా కలుషిత నీరు తాగడం వల్లే రోగాల బారిన పడతారు. ఇలాంటి అంటువ్యాధులను దృష్టిలో ఉంచుకొని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలి. అలాగే ఇళ్లకు సరఫరా అయ్యే భగీరథ, స్థానిక నీటి వనరుల బోర్ల వద్ద నీటిని సేకరించి పరీక్ష చేయాలి. అవి తాగడానికి ఉపయోగపడతాయి అంటే సరఫరా చేయాలి. లేదంటే అంటువ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. – ఆంజనేయులు, మాజీ సర్పంచ్, పల్లెగడ్డ నీటి పరీక్షలు చేస్తున్నాం వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథకు సంబందించిన వాటర్ గ్రిడ్ల దగ్గర నిత్యం పరీక్షలు చేసిన తర్వాతనే గ్రామాలకు, పట్టణాలకు నీటి సరఫరా చేస్తున్నాం. లీకేజీలను పూర్తిగా ఆరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ, ఎక్కడో ఒక చోట పైపులైన్ లీకేజీలు అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి మరమ్మతు చేసి కలుషిత నీరు సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించాం. – సరిత, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ● -
జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలివ్వాలి
నారాయణపేట: జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ అనుబంధం) ఆధ్వర్యంలో డీఎల్పీఓ సుధాకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు బి.నర్సింహా, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షకార్యదర్శిలు ఎదిరింటి నర్సింమ, బోయిన్ పల్లి రాములు మాట్లాడుతూ కార్మికులకు చాలీచాలని వేతనాలు నెలకు రూ.9,500 ఇస్తున్నా ఆవి సైతం రెగ్గులర్గా ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నరన్నారు. ప్రభుత్వం వారితో పని చేపించుకొని వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. జీవో ఆరవై ప్రకారం జీతాలు పెంచాలని, పీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూట్ చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 51 రద్దు చేయాలని, అందరిని పర్మిట్ చేయాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాద మరణానికి 10 లక్షలు ఇవ్వాలని, గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా నాయకులు నరేష్, రాంచందర్, హన్మంతు, తాయప్ప, మహాదేవ్, తదితరులు పాల్గొన్నారు. -
పొంచి ఉన్న ముప్పు..
జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. ప్రాజెక్టు క్రస్ట్గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల ● -
తాగునీరు సురక్షితమేనా..?
మరికల్: జిల్లాలో సరఫరాలో అవుతున్న నీటిలో నాణ్యత ఎంత అనేది ప్రశ్నార్థకమవుతోంది. వర్షాకాలం నేపథ్యంలో విధిగా తాగునీటి పరీక్షలు పెంచాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జిల్లాలో పరిస్థితి నెలకొంది. ప్రధానంగా పైపులైన్ లీకేజీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు దాని వెంట అంటు వ్యాధులను తీసుకురావడం సాధారణమైపోయింది. ఈకాలంలో అందరూ తాగునీటి వనరుల నాణ్యతపై దృష్టి సారించాలి. ప్రస్తుతం జిల్లాలో మిషన్ భగీరథ పథకంతో పాటు స్థానిక సంస్థల ద్వారా చాలా గ్రామాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం శరవేగంగా సమాయత్తం కావాల్సి ఉంది. జలాశయాలు, ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు అనేక చోట్ల ఏర్పాటుచేసిన ప్రజా కొళాయిలను గాలికి వదిలేస్తున్నారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా మరిచారు. ట్యాంకులు, మురికివాడల నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. ముఖ్యంగా పాఠశాలల కుళాయిల్లో నీటిని పరీక్షించాలనే బాధ్యత అందరూ విస్మరించారు. ముందుజాగ్రత్తలతో ఎంతో మేలు గ్రామాల్లోని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ కలుపుతున్నారా లేదా దాని శాతం నీటిలో ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం క్లోరింగ్ పరీక్ష ఉపయోగపడుతుంది. అలాగే వర్షాకాలంలో పైపులైన్ లీకేజీల కారణంగా నీటిలో బ్యాక్టీరియా చేరినా క్లోరింగ్ చేస్తే అవి చనిపోతాయి. ఈ పరీక్షలను ఇంటి వద్ద వచ్చే కొళాయిల దగ్గర శిక్షణ పొందిన సిబ్బందితో పాటు కార్యదర్శికి ఇచ్చిన కిట్ ద్వారా నీటిని పరీక్షిస్తే క్లోరింగ్ శాతం ఉందో లేదో తేలిపోతుంది. అలాగే, గ్రామ పంచాయతీ సిబ్బందితో ఏటా నీటి నాణ్యత నిర్ధారణ పరీక్షలు, నీటి ట్యాంకులు తరచూ శుభ్రం చేయించడం, ఫిల్టర్ బెడ్ల గృహాల వద్ద ఉండే నల్లాల నుంచి నమూనాలు సేకరణ, లీకేజీలు ఉంటే మరమ్మతు చర్యలు, వానాకాలంలో ప్రతిరోజు క్లోరిన్ టెస్టు కిట్ల ద్వారా నాణ్యత స్థాయిని పరిశీలించాల్సి ఉంది. కిట్లు ఉన్నా.. వినియోగించని వైనం రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి శాఖ ద్వారా రూ.వేలు వెచ్చించి కిట్లను అందజేస్తోంది. అంతే కాకుండా పంచాయతీలోని తాగునీటి సిబ్బందికి వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందజేస్తోంది. కిట్లు అందజేయడం, శిక్షణ ఇవ్వడం బాగానే ఉన్నా వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడా పరీక్షించిన దాఖలాలు కనిపించలేదు. ఈసారి అలా కాకుండా ప్రతి బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచుగా పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయాలపై పంచాయతీలు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. పరీక్షల్లో నాణ్యత లేవని తేలితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో కలవర పెడుతున్న లీకేజీలు మన్యంకొండ నుంచి జిల్లాకు వచ్చే ప్రధాన పైపులైన్కు తరచూ లీకేజీలు జిల్లాలో 400 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా జాడ లేని నీటి పరీక్ష కిట్లు.. జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం -
నిర్లక్ష్యమేలా..?
నారాయణపేటశుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని..ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్గేట్ల ఇనుప రోప్లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్గేట్లకు ఉన్న ఇనుప రోప్లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
రీవెరిఫికేషన్
గతేడాది ఫిబ్రవరి 20న అప్పటి కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్హెచ్పీ, వీసీసీఎం పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలుపుదల చేశారు. ఆతర్వాత కలెక్టర్ల బదిలీలో కోయ శ్రీహర్ష బదిలీ కావడంతో జూన్ 16న ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. మరో సారి జూలై 2న నోటిఫికేషన్ విడుదల చేసి జూలై 3 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు 25 స్టాఫ్ నర్సు పోస్టులకు 503 మంది దరఖాస్తు చేయగా.. 5 ఎంఎల్హెచ్పీ పోస్టులకు 140 మంది, ఒక్క వీసీసీఎం పోస్టుకు 84 మంది దరఖాస్తు చేసుకున్నారు. 15వ తేదీ నుంచి 25 వరకు దరఖాస్తులను పరిశీలించారు. అయితే, 26న ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో ఉంచాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. తిరిగి సెప్టెంబర్ 20న లిస్టు ఉంచారు. 29వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం విడుదల కాకపోవడం.. అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. గత డీఎంహెచ్ఓపై పలు ఆరోపణలు రావడంతో ఆమెను డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు సరెండర్ చేశారు. ఆ తర్వాత బదిలీపై వచ్చిన ప్రస్తుత డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ సమక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. -
తీపికబురు..
స్టాఫ్నర్స్, ఎంఎల్హెచ్పీ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ● ఆన్లైన్లో మెరిట్ లిస్ట్.. వారంలో ఫైనల్ లిస్ట్ ● 24న సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి ● 16 నెలల ఎదురుచూపులకు తెర ● అదృష్టవంతులు ఎవరో..? నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని 16 నెలలుగా ఎదురుచూస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు సంబంధించి వారం రోజుల్లో పోస్టింగ్ ఇచ్చేందుకు జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలోనే తీపికబురు అందనుంది. దరఖాస్తుల పరిశీలన జిల్లాలో చేపడుతున్న నియామకాలపై గతంలో వచ్చిన అనుమానాలకు తావులేకుండా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్ధేశంతో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో డీఎంహెచ్ఓ కలిసి స్టాఫ్నర్సు, ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను జల్లెడ పట్టారు. గతంలో ఆన్లైన్లో పెట్టిన మెరిట్ లిస్ట్ ఆధారంగా వాటిని క్షణ్ణంగా పరిశీలించి మరోసారి ఈ నెల 16న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ను ఉంచారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో 8 మంది తమకు మెరిట్ లిస్టులో ఎందుకు రాలేదని అడగగా వాటిని సైతం పరిశీలించి అధికారులు సమాధానం ఇచ్చారు. అనంతరం 21 స్టాఫ్ నర్సు, 5 ఎంఎల్హెచ్పీ పోస్టులకు గాను 1:3 ప్రకారం అభ్యర్థులను తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆన్లైన్లో మెరిట్ లిస్టులో ఉన్న వారు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచించారు. ఈ నెల 24న జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ సిక్తా పట్నాయక్తో పాటు డీఎంహెచ్ జయచంద్రమోహన్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సమక్షంలో 78 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
కోస్గిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం మంజూరు చేస్తుందని.. నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని డీఆర్డీఓ మోగులప్ప అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. చంద్రవంచ గ్రామానికి 220 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 102 మంది లబ్ధిదారులు బెస్మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారని, ఇందులో 52 మందికి మొదటి విడత రూ.లక్ష వారి ఖాతాల్లో పడ్డాయని, మిగతా వారికి సోమవారం పడనున్నామని తెలిపారు. అనంతరం మండలంలోని నాచారం గ్రామంలోని కేజీబీవీ పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మీర్జాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలను సందర్శించి మఽధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులతో సహపంక్తి భోజనాన్ని చేశారు. చెన్నారంలో హర్టీకల్చర్ లో మొక్కల నాటడాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో యంపిడిఓ శ్రీదర్ , పంచాయతి కార్యదర్శి సునిత ,తదితరులున్నారు. -
యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలి
నారాయణపేట: యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బుధవారం డీడబ్ల్యూఓ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్పీ, అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారు సూచించారు. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లో కలెక్టరేట్, పోలీస్, ప్రెస్, డీడబ్ల్యూఓ మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి. మొదట పోలీస్ జట్టు, కలెక్టరేట్ జట్లు తలపడగా.. పోలీస్ జట్టు విజయం సాధించింది. అనంతరం డీడబ్ల్యూఓ, ప్రెస్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగగా.. ప్రెస్ జట్టు విజయం సాధించింది. చివరగా పోలీస్ జట్టు, ప్రెస్ జట్టు తుది పోరులో తలపడగా పోలీస్ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్లకు ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్, డీపీఆర్ఓ రషీద్ కప్ లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, ఆర్ఐ నరసింహ, డీవై ఎస్ ఓ వెంకటేష్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరుకు లైన్క్లియర్
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది. పల్లెల్లో పడకేసిన పాలన.. గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ -
‘ఎమర్జెన్సీ చీకటి ఘట్టం’
నారాయణపేట రూరల్: యాబై ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ కాలం దేశ ప్రజలకు చీకటి రోజు అని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ అన్నారు. బుధవారం నారాయణపేటలో బిజెపి వికారాబాద్ జిల్లా ఇన్చార్జ్ పి.శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కె.సత్య యాదవ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ అధికార దాహంతో కోర్టు తీర్పును అపహస్యం చేస్తూ ఒక్క కలం పోటుతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఎందరో నాయకులు, ప్రముఖులను అరెస్ట్ చేయించి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించి తూట్లు పొడిచారని అన్నారు. చివరకు పత్రికా స్వేచ్ఛను కాలరాసిందని విమర్శించారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా గల్లంతై ఇందిరాగాంధీ కనీసం డిపాజిట్ దక్కించుకోలేక పోయిందని అన్నారు. ఎమర్జెన్సీతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కాంగ్రెస్కు గట్టి బుద్ది చెప్పారని అన్నారు. నేడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కానీ ప్రజలు గుర్తించి కాంగ్రెస్ కు ప్రతి ఎన్నికల్లో బుద్ది చెప్పారని అన్నారు. -
మెనూ తప్పనిసరిగా పాటించాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. మెనూ చార్ట్ను చూసి మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తున్నా అని విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పాఠశాలలో నిల్వ ఉంచిన కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించి ఏ రోజుకారోజు బియ్యం శుభ్రం చేసిన తర్వాతే వంటకు వినియోగించాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనం అందించాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇంచార్జ్ అధికారి యాదయ్య శెట్టి, సీఎంఓ రాజేంద్ర కుమార్ అన్నారు. బుధవారం జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని, బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసి వంట చేయాలని సూచించారు. విద్యార్థులకు మెన్ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి చేర్పించాలని అన్నారు. గతేడాది కంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా చేరారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఏం భారతి, టీచర్లు భాను ప్రకాష్, మధుసూదన్ రావు, రఘురాం రెడ్డి, వంట నిర్వాహకులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శైలజ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్లు, స్కానింగ్ సెంటర్లలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఆస్పత్రుల్లో వైద్యుల అర్హత ధ్రువపత్రాలతో పాటు రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఫీజులపై ఆరా తీశారు. స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించిన ధరల పట్టిక ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే స్కానింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తామన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంట ఇన్చార్జి డెమో అధికారి శ్రీనివాస్ ఉన్నారు.విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంనారాయణపేట: ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న ధర్నాకు సంబంధించి మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భగత్సింగ్ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో 6శాతం నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. 2025 నాటికి 2.6శాతం నిధులతో సరిపెట్టిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీకి విరుద్ధంగా కేవలం 0.6శాతం నిధులు పెంచి 7.6 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టే ధర్నాలో విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు రామకృష్ణ, వెంకటప్ప బాలరాజ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, రాము, కృష్ణ మారుతి, వసుంధర, అనిత పాల్గొన్నారు.నేడు మార్కెట్కు సెలవుదేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం సెలవు కారణంగా ఉల్లి వేలం, ధాన్యం క్రయవిక్రయాలు జరగవని వ్యాపారులు తెలిపారు. బుధవారం అమావాస్య కావడంతో మార్కెట్ యార్డు బంద్ ఉంటుందని, దీనివల్ల ప్రతివారం జరిగే ఉల్లిపాయల బహిరంగ వేలం కూడా జరగదన్నారు. అయితే రైతులు నేరుగా వచ్చి మార్కెట్ బయ ట ఉల్లి విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్ యార్డులో తిరిగి గురువారం క్రయవిక్రయాలు కొనసాగుతాయి. -
నారాయణపేట బంద్ సంపూర్ణం
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని అర్ధాంతరంగా అప్పక్పల్లి సమీపంలో ఉన్న మెడికల్ కళాశాల భవనంలోకి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణపేట బంద్ విజయవంతమైంది. బీజేపీ జిల్లాశాఖ పిలుపు మేరకు వ్యాపారులు, ప్రజలు బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి.. ఒక బస్సు కూడా డిపో నుంచి కదలకుండా ధర్నా చేపట్టారు. జిల్లా ఆస్పత్రిని యథా స్థానంలో ఏర్పాటు చేసేంత వరకు తమ ఆందోళన ఆగదని నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా ఆర్టీసీ బస్టాండ్లోనే కూర్చున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు కొండా సత్యయాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ నందు నామాజీ, కేంద్ర సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్, రఘురామయ్యగౌడ్, సిద్ధి వెంకట్రాములు, మిర్చి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేర మొక్కలు నాటాలి
నారాయణపేట: వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యాన్ని శాఖల వారీగా నిర్దేశించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంగళవారం అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ కె.రామకృష్ణారావు కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వీఐపీలు మొక్కలు నాటేందుకు 21 ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా జిల్లాలో ఆయిల్పాం తోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తోటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. వానాకాలం సాగు నేపథ్యంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డీఏఓ జాన్ సుధాకర్, డీఆర్డీఓ మొగులప్ప, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా వైద్యాధికారి జయచంద్రమోహన్ తదితరులు ఉన్నారు. -
పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి
పాలమూరు: ఎంపీగా ఈ ఏడాదిలో పాలమూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఏడాది పాలన సంతృప్తినిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని, ఏడాదిలో రూ.562 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వెల్లడించారు. జడ్చర్ల నుంచి రాయిచూర్ రోడ్ నాలుగు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అంగీకరించిందని, ఎన్హెచ్–44 6 లైన్లు అప్గ్రేడ్ చేశారని, కల్వకుర్తి హైవే పనులను ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించినట్లు చెప్పారు. నారాయణపేట మీదుగా ఎన్హెచ్–167 కర్ణాటక వరకు వెళ్లే రోడ్డు నాలుగు లైన్లు అభివృద్ధి చేస్తామన్నారు. మెడికల్ కళాశాలల్లో వాటాలుగా నిధులు విడుదలలో కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. 70 ఏళ్లు దాటిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. విద్యాపరంగా ఎన్నికల హామీ మేరకు ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, నవోదయ, సైనిక్ స్కూళ్లు తెచ్చుకున్నామన్నారు. అమృత్ స్టేషన్లలో భాగంగా పార్లమెంట్ పరిధిలో రూ.39.87 కోట్లతో మహబూబ్నగర్ రైల్వేస్టేషన్, మరో రూ.10.94 కోట్లతో జడ్చర్ల, రూ.9.59 కోట్లతో షాద్నగర్ రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. కృష్ణ– వికారాబాద్ రైల్వేలైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని, మహబూబ్నగర్ మీదుగా వందేభారత్ను ప్రారంభించుకున్నట్లు వివరించారు. అమృత్ స్కీం కింద పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలకు రూ.400 కోట్లు మంజూరయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కేంద్ర మంత్రుల సహకారంతో పాలమూరు అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేస్తానన్నారు. అనంతరం ‘వికసిత్ భారత్లో పాలమూరు నియోజకవర్గం’ పేరుతో బుక్లెట్ను విడుదల చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలతో భవిష్యత్ అంధకారం
మక్తల్: మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని ఎస్పీ యోగేశ్ గౌతమ్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మక్తల్ పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి అత్యంత కీలకమైనదన్నారు. ఈ సమయంలో మత్తుకు బానిస కావొద్దన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద కొందరు చాకెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని.. అలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో అందరి సహకారంతో మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే 1908 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం మక్తల్ పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎకై ్సజ్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, డీవైఎస్ఓ వెంకటేశ్ శెట్టి, ఎంఈఓ అనిల్గౌడ్, ప్రిన్సిపాల్ రాములు పాల్గొన్నారు. -
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో నూతన కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో సెక్రెటరియేట్లో పీయూకు సంబంధించి ఈసీ (ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, విద్యా శాఖల అధికారులతోపాటు పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబుతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పీయూలో నూతనంగా ప్రారంభించే లా, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈసీ ఆమోదం తెలిపింది. అలాగే విద్యార్థులకు కల్పించే వసతులు, ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఇక టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించి ఆమోదం కూడా జరిగింది. కానీ, ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉందని వీసీ పేర్కొన్నారు. అంతేకాకుండా పీయూలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి మెడికల్ రీయింబర్స్మెంట్ అవకాశం కల్పించే దానికి కూడా అనుమతించారు. 137 మంది సిబ్బంది.. పీయూలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వేతనాల పెంపుపై ఈసీలో చర్చ జరిగింది. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 137 మంది సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు ఈసీ ముందు ఉంచగా దీనిపై పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో పీయూలోని పీజీ కళాశాల ప్రారంభంలో ఇచ్చిన జీఓ, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ వంటి పీజీ కళాశాలల ఏర్పాటు క్రమంలో ఇచ్చిన జీఓ సిబ్బంది నియామకానికి ఇచ్చిన అనుమతులపై ఈసీలో ప్రభుత్వ అధికారులు ప్రశ్నించారు. దీనిపై పీయూ అధికారులు పూర్తిస్థాయిలో వారు అడిగిన వాటికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే త్వరలో నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు వీసీ చెప్పారు. ఆమోదం తెలిపిన ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ వసతుల కల్పన, టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకానికి సైతం అనుమతులు నాన్టీచింగ్ సిబ్బంది వేతనాలపెంపుపై చర్చ రెగ్యులర్ అధ్యాపకులకు మెడికల్ రీయింబర్స్మెంట్ -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విష యం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరోసా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబితా రూపొందించి కలెక్టర్కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
నా భర్త భాస్కర్ వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నాడు..!
నారాయణపేట: సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతూ మోస్ట్ వాంటెడ్ దొంగగా పోలీసు శాఖలో గుర్తింపు పొందిన చాపల భాస్కర్ (35) మృతి అనుమానాస్పదంగా మారింది. బెయిల్పై విడుదలైన వ్యక్తిని వికారాబాద్ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెబుతుంటే.. మాకేం సంబంధం లేదంటున్నారు. దీనికి తోడు సొంతూరులో కాకుండా వేరేరాష్ట్రంలో అంత్యక్రియలు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్కి చెందిన చాపల భాస్కర్ కొన్నేళ్లుగా దొంగతనాలను వృత్తిగా చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేవాడు. పోలీసుశాఖలో చాపల భాస్కర్ మోస్ట్ వాంటెడ్గా గుర్తింపు పొందారు. ఆరు మాసాలుగా మహబూబ్నగర్ జైలులో ఉన్నాడు. కాగా.. ఈ నెల 20వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. అయితే వికారాబాద్ జిల్లాలో 14 చోరీల్లో భాస్కర్పై కేసులు నమోదు కావడంతో భాస్కర్ను మహబూబ్నగర్ జైలు నుంచి బయటికి వచ్చినవెంటనే సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.⇒ వికారాబాద్ పోలీస్స్టేషన్ నుంచి చాపలి భాస్కర్ భార్య తారమ్మకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఫోన్ చేసి.. మీరొచ్చి మీ భర్తను తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన భర్త వికారాబాద్ పోలీస్స్టేషన్లో ఎందుకున్నారంటూ పోలీసులను అడిగినట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 10 గంటల సమయంలో వికారాబాద్ నుంచి మఫ్టీలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓ ప్రైవేట్ ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి గుర్మిట్కల్ దగ్గరలోని ఓ గ్రామస్టేజీ వద్ద చాపలి భాస్కర్ను వారి బంధువుకు అప్పజెప్పారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన భాస్కర్ను ఓ ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడించి కానిస్టేబుళ్లు.. అందులో నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా చేస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఆస్పత్రికి వచ్చేసరికి మృతి..స్పృహలో లేని భాస్కర్ను ఆస్పత్రికి తీసుకువచ్చే సరికి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు భాస్కర్ వెంబడి వచ్చిన బంధువు చేరవేశారు. వెంటనే భార్య తారమ్మతో పాటు కుటుంబసభ్యులు వచ్చి ఆస్పత్రిలో శవమై కనిపించిన చాపలిభాస్కర్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే నారాయణపేట పీఎస్కు వెళ్లగా ఈ కేసు తమ పరిధిలో రాదంటూ సీఐ, ఎస్ఐలు చేతులెత్తేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో శనివారం సాయంత్రం భాస్కర్ మృతదేహాన్ని వికారాబాద్ పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి.. ఆరా తీశారు. మేము కస్టడీలోకి తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలున్నాయా అంటూ బుకాయించినట్లు తెలుస్తోంది. దీంతో దీంతో చేసేదేమి లేక తిరిగి నారాయణపేటకు చేరుకున్నారు. చివరకు ఆదివారం నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాముడు తెలిపారు. నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో చాపలి భాస్కర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన స్వగ్రామం ఊట్కూర్ అయినప్పటికీ భాస్కర్ అత్తగారి ఊరు కర్ణాటకలోని సంకలాపూర్కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
స్థానిక పోరుకు కసరత్తు
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జనవరి 2న ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. అలాగే పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ను సైతం రూపొందించి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావడంతో స్థానిక పోరు నోటిఫికేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వం సన్నద్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తును పూర్తిచేసింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ను అధికారులు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్లను ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడంతో పాటు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో, పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్స్లను ఆయా మండలాలకు తరలించారు. ఎన్నికల నోటి ఫికేషన్ వెలువడిన వెంటనే కార్యాచరణ కొనసాగించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు ప్రధాన పార్టీల కన్ను.. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ మండలాల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కేడర్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్టుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరాలని, లేకపోతే ఈ అంశాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ సైతం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమావేశాలను నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకోగా, కాంగ్రెస్ నాగర్కర్నూల్లో మూడు, నారాయణపేటలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని సంపాదించింది. బీజేపీకి నారాయణపేట జిల్లాలోనే ఒక్క జెడ్పీటీసీ స్థానం దక్కింది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లపైనే ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశమే కీలకంగా మారింది. ఈ విషయంపై కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా.. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన చట్టం ప్రకారం రిజర్వేషన్లను మరోసారి కొనసాగించే వీలుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమో దం తెలిపి పార్లమెంట్కు పంపింది. పార్లమెంట్లో ఈ చట్టాన్ని అమలు చేస్తే బీసీ రిజర్వేషన్లు పెరిగి బీసీ వర్గాలకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే ఈ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నద్ధం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి బీసీ రిజర్వేషన్లపైనే ఉత్కంఠ ప్రధాన పార్టీల సమావేశాలతోవేడెక్కుతున్న రాజకీయ వాతావరణం -
ఇక క్షేత్రస్థాయి పరిశీలన
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025 రెవెన్యూ గ్రామసభలు గత శుక్రవారంతో ముగిశాయి. రైతులు ఇక తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ..ఊరు దాటక్కర్లేదు.. కాలు కదపక్కర్లేదు.. రెవెన్యూ అధికారులే మీ గడప వద్దకు వస్తారనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన భూ భారతి కార్యక్రమం గ్రామస్తుల్లోని రైతుల్లో విశ్వాసం నింపింది. జిల్లాలోని 12 మండలాల్లో 234 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 4,052 మంది రైతుల నుంచి తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందించారు. ఇందులో అత్యధికంగా నారాయణపేట మండలంలో 1230 దరఖాస్తులు రాగా..అత్యల్పంగా నర్వ మండలంలో 107 మంది వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు, రైతుల వద్దకే సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. జూన్ 2 నుంచి నిర్వహించిన రెవెన్యూ సదస్సులు నాలుగు రోజుల క్రితం ముగిశాయి. సర్వేయర్లు, రెవెన్యూ ఇన్న్స్పెక్టర్లు, అధికారులు గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి వారి భూ సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో భూ భారతితో సంబంధిత అవగాహన సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా లు చేపట్టారు. ఈ పథకం మొదట్లో పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని మద్దూర్ మండలాన్ని ఎంపిక చేశా రు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యా ప్తంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కొత్త చట్టం ప్ర కారం, రైతులు వారి భూమి సమస్యలపై సంబంధి త ఫారాల ద్వారా అధికారులకు సమాచారం అందించారు. తర్వాతి దశలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో ప్రధానంగా మిస్సింగ్సర్వే నంబర్లు సరిచేసేందుకు 1284మంది రైతులు, భూముల ఎక్స్టెంట్ను సరిచేసేందుకు 776మంది, పేర్లు సరిచేయాల ని 335 మంది దర ఖాస్తు చేసుకున్నారు. 234 ప్రత్యేక బృందాలు.. జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో రెవెన్యూ అధికారుల బృందాలు స్వీకరించిన 4,052 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. 234 రెవెన్యూ గ్రామాల్లో అధికారుల బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందడుగు వేశారు. భవిష్యత్తులో భూ వివాదం, ఘర్షణలు జరగొద్దనే ఉద్దేశ్యంతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు రెవెన్యూ అధికారుల బృందాలు చెబుతున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని అన్ని మండలాల్లోని సర్వేయర్లకు ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆగస్టు 15 నాటికి అందరూ భూమి సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందేలా ఉచితంగా పరిష్కారాలు అందించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వేయర్లు అవసరమైన సర్వేలు నిర్వహించి, భూమి గీతలు ఖచ్చితంగా గుర్తించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. ‘భూ భారతి’కి సమస్యల వెల్లువ రెవెన్యూ సదస్సులో 4,052 దరఖాస్తులు అత్యధికంగా ‘పేట’లో 1230.. అత్యల్పంగా నర్వలో 107 దరఖాస్తులు మిస్సింగ్ సర్వే నంబర్లు, ఎక్స్టెంట్,పేర్ల సవరణవే అధికం -
తెలంగాణలోనే మోడల్గా ఉర్దూ ఘర్
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణలోనే ఒక మోడల్గా మహబూబ్నగర్లోని ఉర్దూ ఘర్ నిలవనుందని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఉర్దూ ఘర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి షబ్బీర్అలీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్లో అధునాతనమైన ఉర్దూ ఘర్ నిర్మాణమవుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలంటే చాలా కష్టమన్నారు. హిమాలయ పర్వతంలోని అంచువరకు ఎక్కొచ్చుగాని ప్రభుత్వం నుంచి డబ్బులు తేవడం కష్టమని, ఇది నా అనుభవపూర్వకంగా చెబుతున్నానన్నారు. అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు, అందులో రూ.15 కోట్లతో ఉర్దూ ఘర్ నిర్మిస్తున్నందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి వరకు చాలా మంది మైనార్టీ విద్యార్థులు ఉర్దూ తీసుకోవడం లేదని, దీంతో కళాశాలల్లో ఉర్దూ చదివే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకం అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఉర్దూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ రోజు మహబూబ్నగర్ చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉర్దూ ఘర్ నిర్మించుకోవాలనే కల నెరవేరుతుందన్నారు. చదువును జీవితంలో భాగం చేసుకోవాలని, చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ ఉర్దూ ఘర్ మనలోని ఐక్యతకు చిహ్నం అన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మైనార్టీల సంక్షేమం కోసం సీఎంతో మాట్లాడి రూ.45 కోట్లు మంజూరు చేయించారన్నారు. రూ.5 కోట్లతో మౌలాలిగుట్టలో శ్మశాన వాటిక నిర్మిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి జహంగీర్పీర్ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆమేర్ అలీ ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దన్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ బియాబాని తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో టిమిరిస్ చైర్మన్ ఫహిమోద్దీన్ ఖురేషి, మైనార్టీ గురుకులాల కార్యదర్శి షపీవుల్లా, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, అబ్దుల్ హాదీ, సిరాజ్ఖాద్రీ, సాదుల్లా, అజ్మత్అలీ, ఫయాజ్, తఖీయోద్దీన్, రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్అలీ షబ్బీర్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నారాయణపేట: దివ్యాంగుల వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారకశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలో ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మొక్కలు నాటి మాట్లాడారు. యువత దేశానికి వెన్నెముక వంటి వారని, మత్తు పదార్థాల బారినపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, అందరూ చదువుకొని దేశభక్తిలో భాగం కావాలన్నారు. అదే విధంగా ఎస్పీ కార్యాలయంలో మొక్కలను ఎస్పీ యోగేష్ గౌతమ్ నాటి మాట్లాడారు. వారం రోజులు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు లభిస్తున్నట్లు తెలిస్తే పోలీస్ శాఖ వారికి తెలియజేయాలన్నారు. -
మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత
కోస్గిరూరల్: కోస్గి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో నాంపల్లి మెట్రోపాలిటీ కోర్టులో పనిచేయగా బదిలీపై కోస్గికి వచ్చారు. ఇక్కడ పని చేసిన న్యాయమూర్తి ఫర్హిన్బేగం హయత్నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. కోస్గి బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్, వీఎన్గౌడ్, శకనప్ప, మురళీనామాజీ, రాములు, రాజలింగం, భీమేష్, మల్లిఖార్జున్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట
నర్వ: దూప దీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు తెలుసుకునేందుకే గుడిబాట కార్యక్రమం చేపట్టామని డీడీఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాడపాటి జ్ఞానేశ్వర్ అన్నారు. ఆదివారం నర్వ మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అర్చకుల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను హిందూ సమాజానికి అందిస్తూ, ధర్మ పరిరక్షణకు కృషిచేస్తున్న అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం అర్చకులను కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో డీడీఎన్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోషి రామాచారి, ప్రవీణ్ కడ్మూర్, మండల అధ్యక్షుడు నర్సింహయ్య, నాగస్వామి, అంపయ్య, మధుసూదన్చారి, సిద్ధయ్య పాల్గొన్నారు.పెండింగ్ బిల్లులు చెల్లించండినారాయణపేట రూరల్: ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎయిడెడ్ దయానంద్ విద్యా మందిర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ను రద్దుచేసి.. ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న హెచ్ఎంల పోస్టులను భర్తీ చేయడంతో పాటు డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు వేతన సమస్య తీర్చడంతో పాటు అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. రెండేళ్లుగా ప్రకటించాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే వెలువరించి.. మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయులకు బకాయి బిల్లులతో పాటు ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులు, మిగిలిన డీఏలను చెల్లించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల పనివేళలు మార్చాలని.. కేజీబీవీ టీచర్లకు బేసిక్ పే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాములు, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, ఉపాధ్యక్షులు కె.బాలాజీ, రవికుమార్, గోవిందు, వెంకట్ నాయక్, వెంకటేశ్, శంకర్ ఉన్నారు.4 వేల బస్తాల వరిధాన్యం రాకనవాబుపేట: స్థానిక మార్కెట్కు ఆదివారం ఆర్ఎన్ఆర్, ఇతర సీడ్ (1010)లు కలిసి దాదాపు 4 వేల బస్తాలకు పైగా ధాన్యం వచ్చిందని మార్కెట్ కమిటీ కార్యదర్శి రమే్ష్ తెలిపారు. కాగా.. వరి (1010) రకం 1,209 బస్తాలు రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.1,963 ధర వచ్చింది. అలాగే వరి ఆర్ఎన్ఆర్ 3,628 బస్తాలు రాగా క్వింటాల్ గరిష్టంగా రూ.2,285, కనిష్టంగా రూ.1,512 ధర పలికిందని కార్యదర్శి తెలిపారు. -
రూ.3,272 కోట్లతో అభివృద్ధి పనులు
నారాయణపేట: స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కృషితో గతంలో ఎన్నడూ లేనివిధంగా 18 నెలల కాలంలోనే రూ. 3,272 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగునీరు తేలేని ఐరన్ లెగ్ ఎస్ఆర్.రెడ్డి అని.. ఎమ్మెల్యే గోల్డెన్ లెగ్తో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తూర్పారబట్టారు. ఆదివారం స్థానిక సీవీఆర్ భవన్లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రూ. 2.945 కోట్లు, మాతా శిశు సంరక్షణ కేంద్రానికి రూ. 40కోట్లు, నర్సింగ్ కళాశాలకు రూ. 26కోట్లు, 33/11కేవీ సబ్స్టేషన్లకు రూ. 11కోట్లు, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 10కోట్లు, ఎస్సీ కాలనీల అభివృద్ధికి రూ. 10కోట్లు, బీటీరోడ్లకు రూ. 13కోట్లు, రోడ్ల మరమ్మతులకు రూ. 35.79కోట్లు, జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్కు రూ. 1.23 కోట్లు, మహిళా సమాఖ్య నూతన భవనానికి రూ. 5కోట్లు మంజూరైనట్లు వివరించారు. అదే విధంగా రూ. 175కోట్లతో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 7.50 కోట్లతో చిల్డ్రన్ ఆస్పత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆకాల వర్షాలతో జిల్లా ఆస్పత్రి భవనం కూలిపోయే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచన మేరకు మెడికల్ కళాశాలలోకి మార్చడం జరిగిందన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రి భవనం తొలగించి, నూతన కమ్యూనిటీ ఆస్పత్రి భవనం నిర్మిస్తామన్నారు. 2018 ఎన్నికల సమయంలో కృష్ణాజలాలతో రైతుల కాళ్లు కడుగుతానని.. లేకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన వ్యక్తి 2023లో ఎందుకు పోటీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోయిల్కొండ మండలంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసని అన్నారు. బీజేపీ నాయకులకు ప్రతీది రాజకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, ఆర్టీఓ బోర్డు సభ్యుడు రాజేశ్కుమార్, నాయకులు మనోహర్గౌడ్, గందె చంద్రకాంత్, వకీల్ సంతోష్, సరాఫ్ నాగరాజ్, మాజీ కౌన్సిలర్ మహేశ్, వెంకుగౌడ్ ఉన్నారు. -
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
ఆర్టీసీ బాదుడు
●ఇష్టారీతిగా పెంచడం సరికాదు గతంలో చిల్లర సమస్య పేరుతో చార్జీలను రౌండ్ ఫిగర్ చేసి భారం మోపిన ఆర్టీసీ తాజాగా కిలోమీటర్లను రౌండ్ ఫిగర్ చేస్తున్నట్లు అసంబద్ధంగా ఇష్టారీతిగా చార్జీలు పెంచడం సరికాదు. ప్రతి టికెట్పై రూ.10, టోల్గేట్ దాటితే అదనంగా మరో రూ.10 వసూలు చేస్తున్నారు. సీజన్ పాస్ నెలకు మరో రూ.400 చెల్లించాల్సి వస్తుంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – సందీప్, ప్రయాణికుడు, నారాయణపేట పేద విద్యార్థులపై ఆర్థిక భారం.. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆర్టీసీ బస్సుల్లో పట్టణాలకు వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరికాదు. రూ.75 నుంచి ఏకంగా రూ.275 చొప్పున నెలవారి రాయితీ పాసుల ధరలను పెంచడం ఆయా కుటుంబాలకు మోయలేని భారంగా మారుతుంది. ఆడపిల్లలతోపాటు చదువుకునే బాలురకు సైతం ఉచితంగా పాసులు అందించి ఆదుకోవాలి. – నరేష్, ఏబీవీపీ జిల్లా కన్వీనర్, నారాయణపేట స్వల్పంగా పెరిగింది.. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో టోల్గేట్ ధరలను పెంచుతుంది. ఈ క్రమంలో ఆర్టీసీ అందుకు అనుగుణంగా ప్రయాణికుల టికెట్పై ఆ భారాన్ని సరిచేస్తారు. ఈసారి కొంత ఆలస్యంగా వాటిని అమలు చేశాం. ఇక పల్లె వెలుగు మాదిరి ఎక్స్ప్రెస్ బస్సులకు సైతం రౌండప్ కిలోమీటర్లకు టికెట్ ధరను సరిచేయడంతో కొన్ని స్టేజీలకు టికెట్పై స్వల్పంగా ధర పెరిగింది. – సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్, మహబూబ్నగర్ – నారాయణపేట రూరల్ఆర్టీసీలో పల్లె వెలుగు బస్సుల టికెట్ ధరలు కిలోమీటర్ల రౌండ్ ఫిగర్తో నిర్ణయించబడి ఉంటుంది. అయితే ఎక్స్ప్రెస్ సర్వీసులో మాత్రం సరిగ్గా కిలోమీటర్కి లెక్కించి టికెట్ ధర నిర్ణయిస్తారు. అయితే గతంలో చిల్లర సమస్య పేరుతో టికెట్ ధరలను రౌండప్ పేరుతో పెంచారు. తాజాగా మరోసారి కిలోమీటర్లను సర్దుబాటు చేస్తున్నామనే పేరుతో రూ.10 పెంచేశారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై అదనపు భారం పడనుంది. దీనికితోడు టోల్గేట్ దాటి ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అదనంగా మరో రూ.10 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఆయా మార్గాల్లోని ప్రయాణికులపై గరిష్టంగా రూ.20 భారం పడినట్లయ్యింది. సర్దుబాటు, టోల్ ప్లాజా పేర్లతో.. -
ఆమడదూరంలో అపార్
వంద శాతం పూర్తి చేస్తాం విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, విద్యార్థుల వివరాలు ఆధార్ కార్డులో, అడ్మిషన్ రికార్డులలో వేరువేరుగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో నమోదు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. సాంకేతిక సమస్యలు తొలగిపోతే పూర్తిస్థాయిలో అపార్ నమోదు జరగనుంది. ఆధార్ తప్పులను సరి చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. త్వరలో వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ ●‘నారాయణపేట మండలంలోని భైరంకొండ గ్రామానికి చెందిన విద్యార్థి పుట్టినతేదీ యు డైస్లో ఒక విధంగా, ఆధార్ కార్డులో మరో విధంగా ఉండటంతో అపార్ జనరేషన్ కాలేదు. అలాగే షేర్నపల్లికి చెందిన ఓ విద్యార్థిని యు డైస్లో ఇంటి పేరు ఉండగా, ఆధార్కార్డులో లేకపోవడంతో మ్యాచ్ కాక అపార్ జనరేట్ కాలేదు.. జిల్లాలో ఇలా చాలామంది విద్యార్థులకు ఈ పరిస్థితి నెలకొంది. మొదటి స్థానంలో కొత్తపల్లి.. చివరలో నర్వ జిల్లాలోని 13 మండలాల్లో ప్రక్రియ మందకోడిగానే సాగుతోంది. కొత్తగా ఏర్పాటు అయిన కొత్తపల్లి మండలంలో 62శాతం అపార్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిలువగా, 42 శాతం మాత్రమే ఆన్ లైన్ చేసి నర్వ చివరి స్థానంలో ఉంది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్న సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఆధార్ సమాచారం సరి చేసుకోవడానికి పెట్టుకునే దరఖాస్తు పరంగా అవసరమైన పత్రాలను తొందరగా మంజూరయ్యే విధంగా మండల యంత్రాంగం దృష్టి సారించడంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను తెరిస్తే విద్యార్థులకు ప్రయోజన కరంగా ఉంటుంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మందకొడిగా సాగుతున్న విద్యార్థుల నమోదు ● ఆధార్తో వివరాలు సరిపోక తీవ్ర జాప్యం ● విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు ● నూతన విద్యా సంవత్సరంలో ప్రారంభం కాని ప్రక్రియ ● జిల్లాలో 61శాతం మాత్రమే పూర్తి.. నారాయణపేట రూరల్: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కార్పొరేట్ విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ సంఖ్యను కేటాయించాలని నిర్ణయించారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం 2023 అక్టోబర్ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది చివరి వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా ఆధార్ లోని సమాచారం విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్ లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు ఎదురవుతున్నాయి. ఎందుకు కారణంగా నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికాక ఆలస్యం అవుతుందని వాదన వినిపిస్తుంది. సమాచారంలో తేడాలతో జాప్యం చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక ఐడీలు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వ అపార్ కార్డులను మంజూరు చేయనున్నారు. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారాన్ని, కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరుస్తారు. ఉన్నత విద్యా ప్రవేశాలు, పోటీ పరీక్షల కు ఈ డిజిటల్ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని 13 మండల పరిధిలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో కలిపి 1,04,428 మందు విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా కేవలం 55,699 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటి వరకు అపార్ కు అనుకూలంగా ఉండి 61శాతం నమోదైంది. మిగతా విద్యార్థులకు సంబంధించిన సమాచారంలో తేడాలు ఉండడంతో నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ఆధార్ లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ లలో అడ్మిషన్ రిజిస్టర్ లతో పోలికలు కుదరక అపార్ జనరేట్ కావడం లేదు. అన్ని వివరాలు సరిపోలిన విద్యార్థులకి ఇబ్బంది లేకుండా అపార్ నమోదవుతుంది. కొన్నిచోట్ల ముఖ్యంగా పాఠశాలలలో ఆధార్ ను సరిచూసుకొని వారి అడ్మిషన్ రికార్డులలో వివరాలు సరిచేసి అపార్ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. టెన్త్ పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్ కార్డు లోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండడంతో స్థానికంగా ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట: మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక అద్భుతమైన సాధనం యోగా అని, నిత్యం యోగ సాధన ద్వారా మన జీవనశైలిని మెరుగుపరుచుకోవచ్చని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సమితి– భారత స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తదితరులు హాజరై యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు ఎన్నో దేశాలలో యోగా దినోత్సవం జరుపుకోడం ద్వారా యోగాకు నిత్య జీవితంలో ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుందన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు చదువుతో పాటు యోగా చేయించాలన్నారు. యోగా అనేది శారీరక వ్యాయామమే కాదు, ఒక జీవన విధానం అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిదని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా జీవన విధానంలో మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. యోగాను ప్రతిరోజు ఉదయం తప్పకుండా ఒక ఉద్యమంలో చేస్తే అందరి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఆచరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, బిజెపి రాష్ట్ర నేత నాగురావు నామాజీ, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ పాల్గొన్నారు. ఆయుష్సు పెంపు.. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడంతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాస్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ వింధ్య నాయక్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా ఆసనాలు వేయాలని, వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. ఒత్తిడి దూరం పోలీసులు ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం సమయం దొరికినప్పుడు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. మొదటగా యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింలు యోగాను సిబ్బందికి తెలియజేస్తూ, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు చేయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది వయస్సుకు సంబంధం లేకుండా అందరూ చేసే ఒక సాధన అని, గుండెకు, శరీరానికి, మనసు ప్రశాంతతకు యోగా ఆసనాలు ఉపయోగపడతాయన్నారు. ఏఎస్పి రియాజ్ హూల్ హక్, డీఎస్పీ లు ఎన్ లింగయ్య, మహేష్, సిఐ నరసింహ, సిఐ శివ శంకర్ పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
కోస్గి: కొడంగల్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి సాధించి రాష్ట్రంలోనే నంబర్ నియోజకవర్గంగా మారుతుందని, రానున్న అతి తక్కువ సమయంలోనే కొడంగల్ నియోజవర్గ దశదిశ మారుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కోస్గి మున్సిపల్ పరిధిలో రూ.305 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయనతోపాటు కడా చైర్మన్ వెంకట్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు పక్కన బెట్టి ప్రజలందరు మన ప్రాంతం అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు కోస్గి మున్సిపల్ పరిధిలో తాగునీటి సరఫరా పథకానికి రూ.15.99 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రూ.145.81 కోట్లు, వరద నీటి కాల్వల నిర్మాణం కోసం రూ.72.28 కోట్లు, చెరువుల సుందరీకరణ కోసం రూ.5.99 కోట్లు, అంతర్గత రహదారులు రూ.61.60 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమి పూజ చేశారు. వార్ల విజయ్ కుమార్, రఘువర్దన్రెడ్డి, బెజ్జు రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు. కోస్గిలో రూ.305 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ -
కోడే దూడలకు డిమాండ్..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. అటవీ మేతతో దృఢంగా ఉండటం.. 20–25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం వీటి సొంతం. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడ్మిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వట్టువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఆయా గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. మన్ననూర్ గిత్తగా నామకరణం.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే)లో ఈ ప్రాంత రైతులతో కలిసి తెలంగాణ జీవ వైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన, పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 15 వేల వరకు మాత్రమే ఉన్నాయి. ఏటేటా ఈ అరుదైన పశుజాతి తగ్గిపోతోంది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనేవారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతరాలతో పశుగ్రాసం కొరత ఏర్పడి.. పశుపోషణ భారంగా మారి చాలామంది వీటిని వదులుకుంటున్నారు. వ్యవసాయ అనుబంధమైన పశుపోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశుసంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి.. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తా రు. ప్రతి ఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతుంటారు. గతంలో జత గిత్తలకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉండగా.. ప్రస్తుతం రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. రైతులను ప్రోత్సహించాలి నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలవయ్య, మన్ననూర్, అమ్రాబాద్ వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం.. నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. – గెంటెల హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు సంతతి పెంచేందుకు కృషి.. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట కొనసాగుతున్న పరిశోధనలు.. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పించాల్సి ఉంది. ఈ పశుజాతిపై ఏడాదిగా ప్రత్యేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటికి తూర్పుజాతి పశువుగా గుర్తింపు లభించింది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోగనిరోధక శక్తి ఎక్కువే.. నల్లమల పశువులకు రోగనిరోధక శక్తి అధికమే. అటవీ ప్రాంతంలో ఉండే ఔషధ మొక్కలు, రకరకాల మూలికలను ఈ పశువులు తినడం వల్ల రోగాలను తట్టుకునే శక్తి వీటికి అధికంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే శక్తి కూడా అధికమే. తక్కువ పశుగ్రాసంతో ఎక్కువ పనిచేస్తోంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకధాటిగా పనిచేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ పశువులకు త్వరగా అలసిపోయే గుణం ఉండదు. అటవీ ప్రాంతంలో పశువుల మందపై క్రూరమృగాలు దాడి చేసినా.. చురుకుగా తప్పించుకుంటాయి. తూర్పుజాతి పశువు వేడి, చలి వంటి వాతావరణం తట్టుకుని జీవిస్తాయి. ఇవీ ఎంతో తెలివైనవని.. వర్షం రాకను ముందే పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని పరిశోధనలో తేలిందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ బ్రాండ్గా తూర్పుజాతి పశుసంపద నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు మన్ననూర్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు -
ఆయకట్టుకు సాగునీరు
●నారుమడి వేసుకున్నా.. యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేసినా నీరందక ఆశించిన దిగుబడి రాలేదు. వానాకాలంలో ఎడమ కాల్వకు నీటిని ముందస్తుగా వదులుతారన్న ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. మరోమారు 5 ఎకరాల్లో వరి పండించేందుకు పొలం సిద్ధం చేసుకుంటున్నా. – మోహన్రెడ్డి, రైతు, సింగంపేట ఆనందంగా ఉంది.. జూరాల ఎడమకాల్వకు ముందస్తుగా సాగునీరు వదలడం సంతోషంగా ఉంది. ఆదివారం నీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. ఉన్న 5 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు వరి నాడుమడి ఇప్పటికే సిద్ధం చేసుకున్నా. ముందస్తుగా నీటిని వదులుతుండటంతో అనుకున్న దిగుబడి చేతికందే అవకాశం ఉంది. – బానా గిర్రెన్న, కానాయపల్లి (కొత్తకోట) మంత్రి చేతుల మీదుగా విడుదల.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో వానాకాలం పంటల సాగుకుగాను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఎడమ కాల్వకు నీరు వదులుతున్నాం. జూన్లోనే ఆయకట్టుకు నీరందిస్తున్నాం.. పొదుపుగా వినియోగించుకోవాలి. వానాకాలంలో పూర్తిస్థాయిలో నీటిని రోజువారీగా అందించనున్నాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల క్యాంపు డివిజన్ అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు వదిలితే సాగు పనులు ప్రారంభిస్తారని.. ఉన్న నీరంతా దిగువకు వెళ్లిన తర్వాత వదలడంతో తలెత్తే సమస్యను అధికారులు ముందస్తుగా గుర్తించడం సంతోషకరమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు 100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు... జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తుండటంతో వరితో పాటు చెరుకు సాగు చేస్తున్నారు. అధికారుల సూచనల మే రకు నీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతుంది. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
నారాయణపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, చెరువు, శిఖం భూములు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఎక్కడైనా ఆక్రమణకు గురైతే టోల్ ఫ్రీ నం.9154283914 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారించి నిబంధనలకు అనుగుణంగా చర్య లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.215 కోట్లు జమ నారాయణపేట: జిల్లాలో ఇప్పటి 1,67,721 మంది రైతుల ఖాతాల్లో రూ.215 కోట్ల 15 లక్షలు రైతు భరోసా నగదు జమ అయ్యాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,83,500 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారని, కాగా ఇప్పటి వరకు 1,67,721 మంది రైతులకు రూ.215 కోట్ల 15 లక్షలు జమ అయ్యాయని తెలిపారు. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. రైతుభరోసా పథకం కేవలం ఆర్థిక సాయమే కాకుండా రైతుల భవిష్యత్పై ఆశను నింపే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. వానాకాలం పంటల సాగుకోసం అవసరమైన పెట్టుబడి భారం నుంచి రైతులకు విముక్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన ఈ నగదును రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం కోస్గి రూరల్: ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం పట్టణంలోని 10వ వార్డులో తడి–పొడి చెత్తపై ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తడి , పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయవచ్చని సూచించారు. వస్తువుల వినియోగానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బట్ట సంచులను వాడాలన్నారు. అమృత్జల్ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలోని నాగులబావి సమీపంలో మెప్మా సిబ్బంది ఆధ్వర్యంలో ఎర్పాటు చేసిన పండ్ల స్టాల్, ఫుడ్ స్టాల్లను కమిషనర్ సందర్శించారు. గ్రామీణ వంటకాల రుచులు ఎంతగానో బాగున్నాయని వారిని ఆభినందించారు. కార్యక్రమంలో మేనేజర్ అనిల్కుమార్ , హెల్త్అసిస్టెంట్ మొహిన్బాషా,రాస్నం బాల్రాజ్ మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మత్తు పదార్థాలతో జీవితం అంధకారం నారాయణపేట: మత్తు పదార్థాలతో జీవితం అంధకారమవుతుందని, ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉండాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ బుచ్చయ్య, స్థానిక డీఎస్పీ లింగయ్య విద్యార్థులకు సూచించారు. ‘నషా ముక్త్ భారత్,యాంటీ డ్రగ్ దినోత్సవం జూన్ 26 ఉన్నందున యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. డీఎస్పీలు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన, సరఫరా చేసిన, సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూ వారిని బానిసలుగా మారుస్తు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఐయామ్ ఆన్ యాంటీ డ్రగ్ సోల్జర్ గా సుమారు 180 మంది విద్యార్థులను ఎన్రోల్ చేయడం జరిగిందని డీఎస్పి తెలిపారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అమరచింత/ఆత్మకూర్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి శుక్రవారం అమరచింత, ఆత్మకూర్ మండలాలకు రావడంతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట అమరచింతలో పోలీసులు గౌరవ వందనం సమర్పించగా.. స్థానిక కాంగ్రెస్ నాయకులు పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి సత్కరించారు. అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూర్లో అంబేడ్కర్, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. గాంధీచౌక్ నుంచి ఫంక్షన్హాల్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నెత్తిన అప్పులు మోపిందే తప్ప పేదల సొంతింటి కలను అణిచివేసి డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కాలయాప చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నివర్గాలకు సమన్యాయం చేస్తున్నామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు పంపిణీ చేయడం లేదో ప్రజలు గమనించాలన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రకటించుకుంటామని వెల్లడించారు. పరమేశ్వరస్వామి చెరువు అభివృద్ధి, రూ.22 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి భవనం, డయాలసిస్ కేంద్రం, జూరాల వంతెన, రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధి చేపడుతామన్నారు. రాజావళి దర్గాలో మంత్రి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంబీ కర్మేల్ చర్చిలో పాస్టర్ హ్యాపీపాల్తో కలిసి ప్రార్థించారు. మార్కండేయ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్ఖాన్, అరుణ్కుమార్, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు తిరుమల్లేష్ పాల్గొన్నారు. ఆత్మకూర్ డివిజన్ సాధిస్తా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
యోగా డేను విజయవంతం చేయాలి
నారాయణపేట: దశాబ్ది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రానికి సమీపంలోని అభినందన గార్డెన్లో శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట ప్రభుత్వం, నారాయణపేట ఆయుష్ డిపార్ట్మెంట్, పతంజలి యోగా సమితి, సేవా భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అధికారులు, ప్రజలు మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని, ప్రతిరోజు యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ప్రాణాయామ,ం మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి నారాయణపేట రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో సిటిజన్ క్లబ్ నుండి శ్రీ సత్యనారాయణ చౌరస్తా స్వామి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జయ చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పతంజలి యోగ సమితి సభ్యులు, సేవ భారత్ సభ్యులు, అయుష్మాన్ భారత్ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను మన దినచర్యలో భాగం చేసుకోవాలని, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిందని, ఊబకాయం పెరిగిందని, మన దేశం వేలాది సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న యోగా, దాని లాభాలు ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆచారిస్తున్నాయన్నారు. న మనం ప్రతిరోజు యోగ ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పట్టణంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సురేష్, రాజులహోటి, శివకుమార్, నందు నామాజీ, రఘువీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, శనివారం జిల్లా కేంద్రంలోని నిర్వహించే కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని సురేష్, శివకుమార్, శ్రీనివాస్ గౌడ్, యశ్వంత్, భాస్కర్ రెడ్డి తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా సామూహిక యోగా కార్యక్రమాలు -
‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం
మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్హెచ్ఓ సక్రమంగా మానిటరింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్ డీఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్బీ, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. రైతుల అభిప్రాయాలు సైతం.. పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్ అప్లికేషన్ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్రావు, యోగేష్ గౌతం తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల అతి జాగ్రత్త వల్లే తప్పిదం జరిగింది మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
కొత్తపల్లి: త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ శైలేష్కుమార్ అధికారులను అదేశించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మండలంలో ఎంపీటీసీ స్థానాల విభజన, ఓటర్ల జాబితా, ఎన్ని పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలను ఎంపీడీఓ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏఏ రకాలు ఎక్కడెక్కడా నాటుతున్నారనే ఆరా తీశారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటాలని ఆదేశించారు. -
సాధించిన పతకాలు..
వనజారెడ్డి 2007 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అదిలాబాద్ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సాధించింది. అదే ఏడాది వైజాగ్లో జరిగిన పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం సాధించారు. 2023 ఏపీ రాష్ట్రం తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో, 2024లో పలుచోట్ల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంది. సిద్దిపేటలో యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో వనజారెడ్డి ప్రతిభచాటి ప్రథమస్థానంలో నిలిచారు. అదేవిధంగా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని పతకాలు సాధిస్తూ ప్రతిభచాటుతున్నారు. వనజారెడ్డి, కీర్తనారెడ్డి యోగా విన్యాసాలు -
మెరుగైన సేవలు అందించాలి
మద్దూరు: పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్ఐ విజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించి, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాతనేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ రైస్, మత్తు పదార్థాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. సిబ్బందికి లేమైన సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, పోలీసులు పాల్గొన్నారు. వృద్ధులకు ఇబ్బందికలగకుండా చూడాలి నారాయణపేట: వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యం అందుబాటులో ఉండాలని.. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి వింధ్యనాయక్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఆహారం, వసతులు, పనిచేస్తున్న సిబ్బంది విధులపై ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ ఫుటేజీలు, మూ మెంట్ రిజిష్ట్రర్లను పరిశీలించారు. మెనూ ప్రకారం ప్రతి రోజు కూరగాయలు తాజాగా కొనుగోలు చేయాలని, వృద్ధులకు ఎప్పటికప్పుడు మందులు అందజేయాలని, గదులను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. గురుకులంలో అడిషనల్ కలెక్టర్ బస ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. రాత్రి 10 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్న ఆయన తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, విద్యార్థుల గదులు, పరిసరాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ రాజారాంతో మాట్లాడారు. గదుల్లో ఫ్యాన్లు, ఆట స్థలం ఏర్పాటు చేయాలని, సమీపంగా ఉన్న కొండను తొలచాలని అడిషనల్ కలెక్టర్కు విన్నవించారు. అనంతరం పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారా, భోజనం ఎలా ఉంది అని విద్యార్థులతో ఆరా తీస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలన్నారు. అనంతరం గురుకులంలోనే అడిషనల్ కలెక్టర్ బస చేశారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట ఎడ్యుకేషన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని డీఈఓ గోవిందరాజులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో జిల్లాలోని అందరూ ఎంఈఓలు, డీపీఎం, సీసీ, వీవోలకు ఎన్ఐఎల్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్యులను గుర్తించి వారి అక్షరాస్యులుగా చేసే బాధ్యత వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ విషయంలో ఏదైనా జాప్యం జరిగితే శనివారం లోగా అందజేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో అదేరోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహించాలన్నారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే యోగా చేయడాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, విద్యాశాఖ కో ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో పాఠశాలలు
మక్తల్/దామరగిద్ద: మక్తల్ పట్టణంలోని బీసీకాలనీలో, మండలంలోని టేకులపల్లి, సోమేశ్వర్ బండ, ఉప్పర్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదులు నెర్రలుబారడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. భూత్పూర్ గ్రామంలోని పాఠశాల రిజర్వాయర్కు దగ్గరగా ఉండడం.. ప్రహరీ లేకపోవడంతో పాములు, విష పురుగులు తరచూ పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. అలాగే, తీర్యాలపూర్లోనూ ప్రభుత్వ పాఠశాల వ్యవసాయ పొలాలకు సమీపంలో ఉండడంతో పాముల బెడద తీవ్రమై విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ● దామరగిద్ద మండలంలోని తండా పాఠశాలలో కేవలం రెండు గదుల్లో 5వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో 34 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. విద్యార్థులు ప్రమాదపు అంచుల్లో చదువులు కొనసాగిస్తున్నారు. -
నూతన జిల్లా ఆస్పత్రిలో తొలి సిజేరియన్
నారాయణపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాల,జనరల్ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఆపరేషన్ థియేటర్లో క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంకిషన్ తెలిపారు. బుధవారం పెరవళ్ల గ్రామానికి చెందిన నిండు గర్భిణి ప్రసవం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిందని, డాక్టర్లు పరీక్షించగా కడుపులో శిశువు అడ్డంగా ఉందని గుర్తించారని తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తేజస్విని, మహేంద్రవర్మ ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. ఈ అత్యవసర ఆపరేషన్ నూతన ఆస్పత్రిలో మొదటిది అని ఆయన తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్య బృందానికి బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ సదస్సు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో శుక్రవారం ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ పేరిట ఒక రోజు సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వర్క్షాపును పరిశీలించేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి మహబూబ్నగర్ రానున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి నవీన పద్ధతులను అవలంబించే విధానాలపై చర్చించనున్నారు. దీనికి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషన్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తప్పక హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఈపాటికే ఈ సదస్సు నిర్వహణకు స్థానిక మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలోని స్టాల్స్తో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్, సమావేశ హాలు, ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్నసీడీఎంఏ టీకే శ్రీదేవి పాల్గొననున్న రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మక్తల్/మాగనూర్: ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి వారికి వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మాగనూరులో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు దగా పడ్డారని, డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని నీటిమీద రాతలాంటి మాయమాటలు చెప్పి మోసపుచ్చారని విమర్శించారు. పదేళ్ల పాలనలో సంవత్సరానికి గ్రామానికి కొన్ని ఇళ్లు ఇచ్చుకుంటూ పోయినా నేటీకి గ్రామాల్లో ఇంత మంది ఇల్లు లేని లబ్ధిదారులు ఉండేవారు కాదని అన్నారు. ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండలాలకు 385 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని, ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రేషన్కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి శ్రీమంతులు తినే సన్నబియ్యం అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్ల పంపిణీ , రైతులకు బోనస్, రైతు భరోసా ఇస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీఈ హరికృష్ణ, ఏఈ అంజనేయులు పాల్గొన్నారు. క్రీడలపై విద్యార్థుల ప్రత్యేక దృష్టి మక్తల్: క్రీడలపై విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో ఆయన నివాసంలో క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతి ప్రవేశాల కోసం ముద్రించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. విద్యార్థులు మండల, జిల్లా స్థాయి పోటీల్లో రాణించి జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలన్నారు. అనంతరం కన్యకాపరమేశ్వరి, వెంకటేశ్వర, అయ్యప్పస్వామి ఆలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కలిసిమెలిసి ఉంటేనే భవిష్యత్ అందరూ కలిసి మెలిసి ఉంటేనే భవిషత్ ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం జిల్లా రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన మక్తల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్డి సేవా సమితి భవన నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బీసీ బిడ్డగా మంత్రి పదవిని సీఎం ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం మంత్రిని శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డితోపాటు బికేఆర్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, రాదమ్మ, సంతోష్రెడ్డి, వసంత, కుంభం శివకుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, దేవేందర్రెడ్డి, జగన్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
1.80 లక్షల మంది ఖాతాల్లో రూ.260 కోట్లు జమ
నారాయణపేట: వానాకాలం – 2025 సీజన్ కు సంబందించి పంట పెట్టుబడి సాయం కింద జిల్లాలో 1,81,109 మంది రైతులకు రూ.260.36 కోట్ల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తోందని డీఏఓ జాన్సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని తెలిపారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని తెలిపారు. ఈ వివరాలకు అనుగుణంగా గురువారం సాయంత్రం వరకు జిల్లాలోని 1,44,689 మంది రైతుల ఖాతాలలో రూ. 146.55 కోట్ల నిధులు ఇప్పటికే జమ అయ్యాయని తెలిపారు. 4 నుంచి 5 ఎకరాల లోపు 15,096 మంది రైతులకు రూ.40.56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. 5–6–2025 తేదీలోపు పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తులను 20–6–2025 తేదీలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివిధ కారణాల చేత నాలుగు ఎకరాల లోపు 151 మంది రైతుల అకౌంట్లో నగదు జమ కాలేదని, అట్టి రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి కొత్త అకౌంట్లను సమర్పించాలని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని తెలిపారు. -
నిర్మించినా.. నిరుపయోగం
కొత్తపల్లి: భూనీడ్ ఉన్నత పాఠశాలలో 375 మంది విద్యార్థులకుగాను రెండే మూత్రశాలలున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఒంటికి రెంటికి ఆరుబయటకు వెళ్తున్నారు. గతేడాది మన ఊరు– మన బడి కార్యక్రమం కింద మరుగుదొడ్లను, మూత్రశాలలను నిర్మించారు. కానీ బిల్లులు రాకపోవడంతో దాన్ని ప్రారంభించానికి కాంట్రాక్టర్ ఒప్పుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే, మండలంలోని వాల్యనాయక్ తండాలో ప్రస్తుతం 17 మంది విద్యార్థులున్నారు. వీరందరు భూనీడ్లోని పాఠశాలకు వెళ్తున్నారు. గతంలో ఈ తండాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలను తొలగించారు. అప్పటి నుంచి పాఠశాలను గ్రామ పంచాయతీగా భవనంగా మార్చి ఉపయోగిస్తున్నారు. -
మురిసిన పెద్దధన్వాడ
రాజోళి: ఇథనాల్ చిచ్చు వద్దంటూ పోరాడిన రైతుల లోగిళ్లలో పచ్చ తోరణాలు గడపలకు పెనవేసుకున్నాయి. గురువారం రాజోళి మండలం పెద్దధన్వాడలో ఏరువాక సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తున్న రైతులు, 12 గ్రామాల ప్రజలు ఈ నెల 4న పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ వద్దని తమ గొంతుకను వినిపించేందుకు వెళ్లిన నేపథ్యంలో చోటు చేసుకున్న ఘటనలు విధితమే. దీంతో 42 మందిపై కేసు నమోదు కాగా..12 మంది రైతులను 5వ తేదీన రిమాండ్కు తరలించారు. రైతులంతా ఉంటేనే పండుగ చేసుకోవాలంటూ.. ఈ నెల 11న చేసుకోవాల్సిన ఏరువాక పౌర్ణమి పండుగను గ్రామస్తులంతా బహిష్కరించారు. తాజాగా బుధవారం బెయిల్ మంజూరు కావడంతో గురువారం పండుగ నిర్వహించారు. ఉదయం నుండే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు, వాకిళ్లను తోరణాలతో అలంకరించారు. రైతులు తమ ఎద్దులకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం సాగాలని ప్రత్యేకంగా పూజలు చేశారు. కుటుంబసభ్యులు అందరూ కలిసి సుంకులమ్మ తల్లి దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనుకోకుండా జరిగిన పరిణామాల కారణంగా సాగు ఆలస్యమైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రత్యేక పూజలు చేశారు. -
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
నారాయణపేట రూరల్: అభివృద్ధి చెందిన దేశాల మాదిరి పాఠశాల స్థాయి విద్య ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని.. ప్రభుత్వ ఉపాధ్యాయులు సమష్టిగా కృషిచేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు కంకణబద్ధులు కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. నారాయణపేటలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్ విద్యార్థుల అభినందన సభకు కలెక్టర్ సిక్తా పట్నాయక్తోపాటు ఆయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ వ్యవస్థను తొలగించి ప్రాథమిక విద్యకు కేవలం ప్రభుత్వ పాఠశాలను కొనసాగిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్నతనంలోనే ఒత్తిడితో కూడిన విద్యను అభ్యసించడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదగలేక పోతున్నారని, సర్కారు బడిలో స్వేచ్ఛాయుతమైనటువంటి విద్యాభ్యాసం జరుగుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉందని, ఆయన విశేష కృషితో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులైన డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులను అవసరమైన చోట మంజూరు చేసి ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గతంలో కంటే సర్కారు బడుల్లో 20శాతం చేరిక తగ్గిందని, రాబోయే రోజుల్లో సంఖ్య మరింత మెరుగుపడే విధంగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలన్నారు. టెన్త్ లో చక్కటి ఫలితాలకు జిల్లాలో ప్రణాళిక బద్ధంగా విద్యార్థులను సిద్ధం చేశారని, వేక్ అప్ కాల్, ఇంటికి తలుపు తట్టు కార్యక్రమాలతోపాటు రివిజన్ టెస్టులునిర్వహించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియతో పాటు పండిత్ పీఈటీల అప్గ్రేడ్ సమస్యను పీఆర్టీయూ పరిష్కరించిందని, 317 బాధితులకు విడతల వారీగా న్యాయం చేస్తామన్నారు. టీచర్ల హక్కులతో పాటు విద్యారంగాన్ని అభివృద్ధి చేసే బాధ్యత సంఘం భుజాన వేసుకుని నడిపిస్తుందన్నారు. అనంతరం టాపర్లుగా నిలిచిన 200మంది విద్యార్థులతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను శాలువా, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు యాద్గీర్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి, యాదగిరి, డీఈఓ గోవిందరాజు, డీఎస్ఓ భాను ప్రకాష్, గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వకీల్ సంతోష్ కుమార్, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. -
కొత్త రైతులకు అవకాశం
వివరాలు 8లో uనారాయణపేట: రైతులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు సైతం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జూన్ 5 వరకు పట్టా పాసుపుస్తకాలు పొందిన రైతుల నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. కొత్త పట్టా పాసుపుస్తకం , బ్యాంక్ ఖాతా, ఆధార్ జిరాక్స్ లతో సంబంధిత ఏఈఓల వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ సూచించారు. 12వేల మంది కొత్త రైతులు గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు 13 మండలాల్లోని 253 రెవెన్యూ గ్రామాల్లో 12,950 కొత్త పట్టా పాసుపుస్తకాలు ఉన్నట్లు అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. కాగా గతేడాదికి సంబంధించి 8 వేల మంది పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు మరో 4,950 మంది పొందారు. గతేడాదిలో ఒక సారి మాత్రమే పెట్టుబడి సాయం అందడంతో కొత్త పట్టా పాసు పుస్తకం పొందిన వారికి రైతు భరోసా దక్కలేదని రైతులు వాపోయారు. ఈ ఏడాది వానాకాలంలో రైతు భరోసాను ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా కొత్త పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులు సైతం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు రావడం.. ఈ నెల 20 వరకు గడువు విధించడంతో రైతులు దరఖాస్తు చేసుకునేందుకు కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. ‘రైతు భరోసా’కు రేపటితోముగియనున్న దరఖాస్తు గడువు జిల్లాలో 12,950 మందికి కొత్త పాసుపుస్తకాలు ఇప్పటికే 25,929 మంది రైతుల ఖాతాల్లో రూ.38.90 కోట్లు జమ -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మక్తల్: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని డీవైఎస్ఓ వెంకటేశ్శెట్టి, ఎంఈఓ అనిల్గౌడ్ అన్నారు. బుధవారం క్రీడా పాఠశాలలో నాల్గో తరగతిలో ప్రవేశాల నిమిత్తం పట్టణంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. మొత్తం 30 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో రిటైర్ట్ పీఈటీ గోపాలం, విష్ణువర్ధన్, రాజేశ్వరి, దామోదర్, రమేష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు మంత్రి పొన్నం రాక పాలమూరు: జిల్లాకేంద్రంలో ఈనెల 20న రాష్ట్ర రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆర్టీఏ, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం ఈ సమావేశానికి హాజరుకాన్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు. ఉల్లి క్వింటాల్ రూ.2,100 దేవరకద్ర/జడ్చర్ల: ఉల్లి సీజన్ తగ్గిపోవడంతో బుధవారం దేవరకద్ర మార్కెట్కు ఉల్లి రావడం తగ్గింది. ఐదు నెలలుగా కొనసాగిన ఉల్లి సీజన్ మూడు వారాల నుంచి తగ్గడంతో ధరలు కొంత మేర పెరిగాయి. మార్కెట్కు కేవలం 200 బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. వేలంలో ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.2,100, కనిష్టంగా రూ.1,100గా పలికింది. మార్కెట్కు వచ్చిన ఉల్లిని ఎక్కువగా వినియోగదారులే కొనుగోలు చేశారు. వ్యాపారులు బస్తాకు రూ. 50 నుంచి రూ. 100 వరకు లాభం చూసుకుని ఉల్లిని విక్రయించారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,267, కనిష్టంగా రూ.1,569, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,139, కనిష్టంగా రూ.1869 ధర పలికాయి. -
ఎఫ్సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు పునఃప్రారంభం అయిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,429 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటి వరకు 1,066 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా ఇంకా 363 బస్సులకు పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో ఎంవీఐల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో 30 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. మహబూబ్నగర్లో బుధవారం ఉదయం, సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సుకు సంబంధించి ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట) కచ్చితంగా ఉండాలని, లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని డీటీసీ కిషన్ హెచ్చరించారు. -
దోపిడీ చేస్తున్నాయి..
ప్రైవేటు విద్యాసంస్థలు ఐఐటీ, నీట్ పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత బోధించాల్సిన సబ్జెక్టులను ఇప్పుడు బోధిస్తూ.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20వేల నుంచి రూ. 30వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ పుస్తకాలు సీజ్.. బాలానగర్ గీతాంజలి, జడ్చర్ల శ్లోక పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతుండగా పట్టుకొని సీజ్ చేయాలని ఎంఈఓలకు ఆదేశించాం. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలను విక్రయించొద్దు. పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు ఎంఈఓలకు కలెక్టర్ పూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాస్థాయిలో తనిఖీలకు ఒక కమిటీ ఏర్పాటుకు కలెక్టర్కు నివేదించాం. త్వరలో పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ ● -
నిలువు దోపిడీ
● ప్రైవేటు పాఠశాలల్లో తడిసి మోపెడవుతున్న ఫీజులు ● ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో అదనపు వసూళ్లు ● బడుల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయాలు ● చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/అచ్చంపేట: తమ పిల్లలను ఉన్నతంగా ప్రైవేటు బడుల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు కాసుల పంట పండిస్తోంది. విద్యాశాఖ అధికారుల వైఫల్యం, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఎల్కేజీ విద్యార్థికి సైతం రూ.వేలల్లో వసూలు చేసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెట్టు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోటీ పడి మరీ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,350 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 1.90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం పలు కొత్త ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఫీజులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. అడ్మిషన్ ఫీజుతో మొదలుకొని అనేక రకాలుగా దోచుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థికి దాదాపుగా రూ.20 వేలు.. 2, 3 తరగతుల వారికి రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు.. 9, 10 తరగతుల వారికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లోనే పుస్తకాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలలు యూనిఫామ్స్ సైతం విక్రయిస్తుండగా.. మరికొన్ని పలు గార్మెంట్ సంస్థలతో ఒప్పందం ప్రకారం యూనిఫామ్స్ విక్రయాలు సాగిస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువు.. పాఠశాల తరగతి గదుల్లో వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా పాఠశాలల్లో రేకుల షెడ్లే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. వెలుతురు లేకపోగా.. ఫ్యాన్లు కూడా సక్రమంగా తిరగని పరిస్థితి ఉంది. మెజార్టీ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. పిల్లలను ఉదయం 9నుంచి సాయంత్రం వరకు పాఠశాల గదుల్లో యాజమాన్యాలు బంధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో మానసిక వికాసం తగ్గిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పేరుకే పేరెంట్స్ కమిటీలు.. ప్రతి పాఠశాలకు ఒక పేరెంట్స్ కమిటీ ఉండాలి. పాఠశాల యాజమాన్యాలు మాత్రం వారికి అనుకూలమైన వారిని పెట్టుకొని పేరెంట్స్ కమిటీలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. చాలా పాఠశాలలు ఈ కమిటీలను కూడా వేయడం లేదు. ఫీ‘జులుం’ సొంత సిలబస్ బోధన.. అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన సిలబస్ మాత్రమే బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు స్టేట్ సిలబస్ను పక్కన పెట్టి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సొంత సిలబస్ బోధిస్తున్నారని తెలుస్తోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి వాటికి ప్రభుత్వం ఇప్పటికీ సిలబస్ను సూచించలేదు. కానీ వారికి కూడా ప్రైవేటు పబ్లికేషన్స్లో సిలబస్ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రైవేటు కరికులమ్కు ఒక్కో విద్యార్థికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ సిలబస్ పుస్తకాలను విక్రయిస్తే రూ.500 నుంచి రూ.1000 మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఇవీ నిబంధనలు.. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉండాలి. భవన నిర్మాణ నాణ్యత ధ్రువపత్రం ఉండాలి. విద్యార్థుల మానసిక ఎదుగుదల కోసం ఆటస్థలం, ల్రైబరీ, ప్రహరీ, అగ్నిమాపకశాఖ జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గది, మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన వారు బోధన చేయాలి. పిల్లలు రోడ్డు దాటడానికి సౌకర్యంకల్పించాలి. పోషకుల కమిటీ, ఫీజు వివరాలు నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ పుస్తకాలతోనే విద్యాబోధన చేయాలి. ఒక తరగతి గదిలో 40 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ కోసం అనుమతి తీసుకోవాలి. ప్రీ ప్రైమరీ కోసం అనుమతి తప్పనిసరి. తాత్కాలిక బుక్ సెంటర్లు ఏర్పాటు.. కొంత మంది వివిధ బుక్ సెంటర్లలో పుస్తకాలను పెట్టి అమ్ముతుండగా.. మరికొంత మంది బయట తాత్కాలిక షాప్లు ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు ప్రైవేటు పబ్లికేషన్స్కు సంబంధించిన మెటీరియల్స్ సరఫరా చేసేందుకు మహబూబ్నగర్లోని షాషాబ్గుట్ట సమీపంలో గోదాం ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
మక్తల్: పట్టణంలో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేస్తుందని, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్మమని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆస్పత్రి పనులను మొదటిసారిగా పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, హన్మంతు, చంద్రకాంత్గౌడ్, కోళ్ల వెంకటేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగ జీవితంలో భాగంగా మార్చుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని సేవా భారతి ప్రతినిథి డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో బుధవారం యోగా క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని కరపత్రం విడదల చేసి మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్యజీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని వాటన్నింటినీ అధిగమించి ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 7గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా, ఈనెల 21న స్థానిక అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు సామూహిక యోగా దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19న పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో సురేష్, రాజేంద్ర లాహోటి, ల్యాబ్ శివకుమార్, క్యాతన్ రఘు, నరసింహులు, బాలకృష్ణ, రజిత, జ్యోతి, రాణి, శిరీష, ఉమాదేవి, మల్లికార్జున్, శ్రీనివాస్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పనుల్లో వేగం పెంచాలి
నారాయణపేట: జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ఉపాధి హామీ పనులు, ఇందిరా మహిళ శక్తి భవన నిర్మాణం, ఇందిర్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసా తదితర పనులపై అధికారులతో సమీక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం ప్రకారం వంద శాతం మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పాఠశాల ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ను చల్లించి పరిసరాలు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంపీడీవోలు నిరంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయాలని, వంటకు పామాయిల్ వినియోగించకుండా చూడాలని, గ్యాస్ కనెక్షన్ ద్వారానే మధ్యాహ్న భోజనం పండేలా ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించాలన్నారు. జెడ్పీ సీఈవో శైలేష్ కుమార్, డీఎసీప లింగయ్య, డీఆర్డీఓ మొగులప్ప, ఎంపీడీవోలు, ఏపీఓలు పాల్గొన్నారు. కలెక్టరేట్ నిర్మాణ పనులు వేగవంతం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగారం వద్ద నిర్మిస్తున్న ఐడీఓసి (సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ)పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. వివిధ గదులు, వాటిలో కొనసాగుతున్న పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని అధికారులతో ఆరా తీశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
గడువు పెంచితే బాగుండు..
మా పొలం దగ్గర ఉన్న నాలుగు గుంటల భూమి కొనుగోలు చేశా. రైతు భరోసా కోసం ఇటీవల స్థానిక రైతు వేదిక దగ్గర ఏఈఓకు దరఖాస్తు చేసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను అందరికి వేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. కొత్త పట్టపాసుపుస్తకాలు వచ్చిన రైతులకు సైతం వెంటనే ఆప్లోడ్ చేసి రైతుభరోసా వేయాలని కోరుతున్నాం. ఈ నెల 20వరకు పెట్టిన గడువును పెంచితే బాగుంటుంది. – ఉప్పరి రవీందర్, రైతు, వర్కూర్ గ్రామం, మాగనూర్ మండలం సద్వినియోగం చేసుకోవాలి జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20వ తేదీ వరకు ఏఈఓలను కలిసి ఆధార్, బ్యాంకు ఖాతా, పట్టా పాసుపుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేయాలి. ఆ తర్వాత పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తాం. వారికి సైతం రైతు భరోసా వస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జాన్సుధాకర్, డీఏఓ ● -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తుందని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్రెడ్డి అన్నారు. పట్టణంలోని గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ ఫలితాలను సాధించామని, అందుకు కలెక్టర్, విద్యాశాఖ అధికారుల చక్కటి ప్రణాళిక, ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో టాపర్గా నిలిచిన ఇద్దరు విద్యార్థులు, ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు సన్మానం చేసేందుకు సంఘం నిర్ణయించిందని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక అంజనా గార్డెన్ లో జరిగే ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈఓ గోవిందరాజు, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు వాణిశ్రీ, రఘువీర్ పాల్గొన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం నారాయణపేట: కార్మిక హక్కుల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) నిరంతర పోరాడుతుందని రాష్ట్ర కార్యదర్శి కె సూర్యం ప్రకటించారు. ఆది, సోమవారాల్లో జిల్లా కేంద్రంలో టీయూసీఐ మహాసభలు జరగగా.. ఈమేరకు జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని ఆయన మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కిరణ్, బోయిన్పల్లి రాము మాట్లాడుతూ కార్మిక రంగంలో టీయూసీఐ బలంగా పనిచేస్తుందన్నారు. ఈ జిల్లాలో కార్మిక రంగంలో పద్నాలుగు రంగాల్లో నిర్మాణం కలిగి ఉందని, నిరంతరం కార్మికుల సంక్షేమం కోరుతూ వారి హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడుతుందన్నారు. ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేయాలనీ డిమాండ్ చేశారు. అందుకోసం కార్మికులను నిత్య చైతన్యం చేస్తూ పోరాటాల్లోకి నడిపిస్తామని అన్నారు. ఇక కార్యవర్గం విషయానికి వస్తే.. ఉపాధ్యక్షులుగా బి.నర్సింహ, ఏజి. బుట్టో, కె. కాశీనాథ్, సహాయ కార్యదర్శులుగా నర్సింహ, రామాంజనేయులు, శుశాంత్ తదితరులను ఎన్నుకున్నారు. పెద్దధన్వాడ రైతులకు బెయిల్ మంజూరు గద్వాల క్రైం: జోగుళాంబ జిల్లాలోని రాజోళి మండలం పెద్ద ధన్వాడకు చెందిన 12 మంది రైతులకు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అమయాక రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులచే అక్రమ కేసులు నమోదు చేశారని జిల్లా కోర్టులో మంగళవారం న్యాయవాదులు మదన్మోహన్రెడ్డి, శోభారాణి వాదనలు వినిపించారు. ఈ నెల 4న రాజోళి మండలం పెద్దధన్వాడ గ్రామంలో గాయత్రి రెన్యూవబుల్ ఆన్లైన్ ఇండస్ట్రిస్ కంపెనీ యాజమాన్యం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని, దాదాపు 11 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు. పంటల సాగుకు అనుకూలమైన భూములలో రైతులు ఏళ్లతరబడిగా వ్యవసాయం చేసి ఊపాధి పొందుతున్నారని వివరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి కోల్పోవడంతోపాటు కాలుష్య వాతవారణంతో జన జీవనం ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేటు బౌన్సర్లను ఏర్పాటు చేసుకుని రైతులపై ప్రతిఘటించారని, ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అల్లర్లు చోటు చేసుకున్నాయని వివరించారు. దీంతో యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా 42 మంది రైతులపై రాజోళి పోలీసుస్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేయించారన్నారు. ఈ నెల 5న గద్వాల జూనియర్ సివిల్ జడ్జి ముందు పోలీసులు 12 మంది రైతులను హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు జైలుకు తరలించారన్నారు. రైతులపై ఫ్యాక్టరీ యాజమాన్యం, సీఈఓ మంజునాథ్ ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయించారని వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి ప్రేమలత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవాదులు ‘సాక్షి’కి చెప్పారు. -
నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
మాగనూర్: రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించినట్లు విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. పురుగు మందుల నాణ్యత, సిడ్స్, ఫర్టిలైజర్ షాపులో స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ తదితర రికార్డ్స్ను తనిఖీ చేశారు. కాలం చెల్లిన విత్తనాలు, కాలం చెల్లిన పురుగుల మందులపై ఆరా తీశారు. రైతులు వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏ షాపుల్లో కొనుగోలు చేసినా తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏడిఏ మక్తల్ నగేష్ కూమార్, మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం గట్టెక్కేదెలా?
మరికల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చిన్నపాటి వర్షాలకే రహదారులు చిత్తడవుతున్నాయి. వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోతోంది. ఇళ్లలో సేకరించిన చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. డీజిల్ కొరతతో పంచాయతీ ట్రాక్టర్లు కదలడం లేదు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు కోసం దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీల్లో నిధుల లేమితో బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాల ఏర్పాటు, డీజిల్, ఇతర అవసరాలు తీర్చడం భారంగా మారింది. తప్పని పరిస్థితుల్లో సొంత డబ్బులు వెచ్చిస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగక పోవడంతో పల్లెల్లో సర్పంచులు లేరు. పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు ఎలా చేయాలనే విషయమై సందిగ్ధం నెలకొంది. నిధులు కేటాయిస్తేనే.. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. అపరిశుభ్రత వాతావరణం కారణంగా డెంగీ, మలేరియా, చికున్గున్యా, ఇతర వ్యాధు లు వ్యాప్తిచెందే అవకాశం లేకపోలేదు. మరోవైపు తాగునీటి పైపులైన్ల లీకేజీలు ఆందోళన కలిగిస్తోంది. పైప్లైన్లు మరమ్మతుకు నోచుకోకపోవడంతో తాగునీరు కలుషితమవుతోంది. పంచాయతీల్లో నిధుల లేమి నెలకొన్న తరుణంలో వానాకాలం గండం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని దుస్థి తి నెలకొంది. గతంలో పంచాయతీలకు ప్రతినెలా రూ. 7.50 కోట్ల ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. ఏడాదికి పైగా పాలకవర్గాలు లేకపోవడంతో ఈ నిధులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా నిధు లు కేటాయిస్తేనే సమస్యలు తొలగినున్నాయి. పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు నిధుల కొరత బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకూ దిక్కులు చూడాల్సిందే.. మూలనపడిన ట్రాక్లర్లు పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు -
రుచికరమైన భోజనం అందించాలి
నారాయణపేట: పాఠశాలలు, వసతిగృహాల ఆహారం తయారీలో నాణ్యత, శుభ్రత పాటించాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం వీసీ హాల్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వండే ఆహారం విషయంలో వంట సిబ్బందికి పరిశుభ్రత పాటించాలని, తాజా ఆకుకూరలు, ఆహార పదార్థాల్లో నాణ్యత తప్పనిసరి అని అన్నారు. యాక్షన్ ప్లాన్తో తగు చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. పిల్లలు సైతం శుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, విధిగా వసతి గృహాలను పర్యవేక్షించి రాత్రి బస చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతిగృహాలను గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీ చేసి క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్నారు. అలాగే, 300 కంప్యూటర్లు అన్ని స్కూళ్లలో అందుబాటులో ఉండాలని డీఈఓ ని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతంపై 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రామచందర్, జెడ్పీ సీఈఓ శైలేష్, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి భూభారతిపై తహసీల్దార్లతో సమీక్షించారు. దామరగిద్ద, నారాయణపేటలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. పీఓపీ కేసులు, అసైన్డ్ కేసులు ఎన్ని వచ్చాయని అడిగారు. రెండు రోజులలో పురోగతి చూపించాలని సూచించారు. నర్వలో వచ్చిన దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కోస్గిలో దాదాపు పూర్తి చేశామని తహసీల్దార్ వివరించారు. గుండుమాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ఆరా తీయగా.. 149 వచ్చాయని అధికారులు సమాధానం ఇచ్చారు. కొత్తపల్లి మండలంలోని 11 గ్రామాల్లో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయని, ల్యాండ్ ఆక్టివిజేషన్ తదితర వివరాలను తహసీల్దార్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఊట్కూర్లో ఎన్ని కేసులు వచ్చాయని అడగగా క్యాంపులు పూర్తి చేశామని తహసీల్దార్ తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులు తీసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. కృష్ణాలో 153 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ తెలిపారు. మాగనూర్ విషయానికి వస్తే.. 20 గ్రామాలు ఉన్నాయని గ్రామాల వారీగా దరఖాస్తులను తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. మిస్సింగ్ సర్వే నంబర్, కోర్టు కేసులు నేమ్ కరెక్షన్ ఓ ఆర్సి ఫీల్డ్ వెరిఫై చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి దామరగిద్ద: ఉద్యాన కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించేందుకు జిల్లా ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మద్దెల్బీడ్లో రైతులు శంకర్, బుగ్గప్ప సాగు చేసిన కూరగాయల పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వారితో పంటల సాగులో లాభ నష్టాలు, ప్రభుత్వం ద్వారా అందుతున్న, అందాల్సిన పోత్సాహకాలపై ఆరా తీశారు. కూరగాయల సాగు రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేయాలని తేనెటీగల పెంపకం మల్చింగ్, డ్రిప్, శాశ్వత పందిర్లు, ప్లాస్టిక్ ట్రేలు తదితర వాటికి కావల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని గత్ప గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
మన పాలమూరు ఫస్్ట..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘పాలమూరు.. నాకు జన్మనిచ్చిన జిల్లా. మక్తల్ నుంచి ఇక్కడకు కాళ్లతో తిర్లాడిన.. సైకిల్పై తిర్లాడిన.. ఆ తర్వాత బండిపై తిర్లాడిన. ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం చెప్పలేని ఆనందంగా ఉంది.’ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, పాడి అభివృద్ధి, క్రీడా, యువజన సర్వీ సుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించగా.. పలు విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితం, పలు పరిణామాలతో పాటు 1991లో ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ఇతర జిల్లాల్లో మంత్రి పదవులకు పోటీ ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నన్ను మంత్రిగా చేయాలని కోరారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఏ లక్ష్యంతోనైతే నాకు మంత్రిగా బాధ్యత కట్ట్టబెట్టారో.. అందుకనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తా. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా. -
ఎన్నికలు నిర్వహిస్తేనే..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతోనే పల్లెల్లో సమస్యలు నెలకొన్నాయి. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. నిధులు లేక తాగునీటితో పాటు పారిశుద్ధ్యం, తదితర సమస్యలు వేధిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి సమస్యలకు మార్గం చూపాలి. – తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్, అప్పంపల్లి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. వానాకాలంలో ప్రబలే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం జరిగింది. పల్లెల్లో మురుగు నిలిచే ప్రాంతాలను గుర్తించాలని కార్యదర్శులకు అదేశాలు జారీ చేశాం. ఫాగింగ్ యంత్రాలు సిద్ధం చేశాం. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ ద్రవణాలు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటాం. – సుధాకర్రెడ్డి, డీఎల్పీఓ ● -
గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్, పత్తి బజార్లో గల పాత పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ స్థలంలో నిర్మిస్తున్న పోలీస్ జాగిలాల నూతన గదులను మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. నాలుగు పోలీస్ జాగిలాలకు నూతన గదులను నిర్మిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జాగిలాల ఆరోగ్యం, భద్రత, శుభ్రతను దృష్టిలో ఉంచుకొని గదుల నిర్మాణం ఉండాలని, వీటిని త్వరగా పూర్తిచేయాలని, తగిన వెళుతురు ఉండేలా చూడాలని, డాగ్స్ వాషింగ్కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, సీఐ నరసింహ, హెడ్ కానిస్టేబుల్ రాములు ఉన్నారు. -
భారమైన నిర్వహణ..
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉండగా.. వర్షాకాలంలో అంతటా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ యంత్రాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.. నిధులు మాత్రం కేటాయించలేదు. దీంతో ఊరంతటికీ కలిపి ఒకసారి ఫాగింగ్ చేయాల్సి వస్తే దోమల నివారణ ద్రావణం, పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలుకు కనీసం రూ. 4వేలు ఖర్చవుతోంది. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేని తరుణంలో ఫాగింగ్ ఎలా చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. గతంలో కొనుగోలుచేసిన వీధి దీపాలు, బ్లీచింగ్ పౌడర్, తాగునీటి పరికరాలకు సంబంధించి బకాయిలు ఉండటంతో దుకాణదారులు తిరిగి అప్పు ఇచ్చేందుకు వెనకాడుతున్నారని తెలుస్తోంది. -
రైతుకు భరోసా
నారాయణపేట: వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సాగు ఖర్చుల నిమిత్తం రైతుభరోసా పథకం నిధులను సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో మొదటి రోజు 94,489 మంది ఖాతాల్లో రూ. 59.18 కోట్లు జమయ్యాయి. వానాకాలం సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత యాసంగి సీజన్లో 3.5 ఎకరాలకే రైతుభరోసా అందగా.. ప్రస్తుతం 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుభరోసా అందించేందుకు సంబంధిత అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో 1,78,017 మంది రైతులకు గాను రూ. 257 కోట్లు పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా అందించనున్నారు. ఇది వరకు ఎకరా, రెండెకరాలు, మూడెకరాలు, ఆ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు దశల వారీగా నెల రోజులపాటు రైతుభరోసా జమ అయ్యేది. కానీ అలాంటి నిబంధనలు ఏమి లేకుండా రైతులందరికీ రైతుభరోసా అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25 వరకు విడతల వారీగా.. చిన్నా, సన్నకారు రైతులకు పంటసాగు పెట్టుబడి భారం తగ్గించి.. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 12వేలు వానాకాలం, యాసంగి సీజన్లలో రూ. 6వేల చొప్పున అందిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం వానాకాలానికి సంబంధించి సోమవారం నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా, కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను శ్రీరైతుభరోసా’ జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వారికి ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం మొదటి రోజు 94,489 మందికి రూ. 59,18 కోట్లు జమ జిల్లాలో 1,78,017 మందికి అందనున్న రూ. 257కోట్లు అనందంలో అన్నదాతలు -
విరివిగా మొక్కలు నాటి కాపాడాలి
నారాయణపేట: వన మహోత్సవంలో భాగంగా ప్రతి శాఖ తమ పరిధిలో మొక్కలు నాటి కాపాడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం వన మహోత్సవంపై కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 3.87 లక్షల మొక్కలు పెంచాలన్నారు. వివిధ శాఖలకు 15.41 లక్షల మొక్కల టార్గెట్ నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. శాఖల వారీగా అగ్రికల్చర్ 0.86 పశుసంవర్ధక శాఖ 0.01, డీఆర్డీఓ 8.66, ఎలక్ట్రికల్ 0.01, ఎకై ్సజ్ 0.25, ఫారెస్ట్ 0.43, హార్టికల్చర్ 1.23 లక్షల మొక్కలు నాటి పెంచాలని ఆదేశించారు. ● ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 45 మంది కలెక్టర్కు ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయ సమావేశ హాల్ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ చాలా కీలకమైందని.. అన్ని కార్యక్రమాల్లో లక్ష్యాల పరంగా పురోగతి సాధించాలని సూచించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్ఓ కె.జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, డీపీఓ భిక్షపతి, సబ్ యూనిట్ అధికారి అశోక్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారులు విజయ్ కుమార్, గోవిందరాజు, ఫార్మసిస్ట్ సూర్యకాంత్రెడ్డి, డీడీఎం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘అసమగ్ర’ ఐటీడీఏ
సిబ్బంది, నిధులకు నోచుకోని గిరిజనాభివృద్ధి సంస్థ గతమెంతో ఘనం.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మినీ కలెక్టరేట్ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళలాడింది. ఐటీడీఏ పీఓతోపాటు గిరిజన, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఉపాధి హామీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. చెంచులు, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఎకనామిక్ సపోర్ట్ స్కీం అమలు చేసేవారు. కానీ, నాలుగేళ్లుగా ఐటీడీఏ ప్రాజెక్ట్కు ఎలాంటి నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ పీఓ సహా ఇతర అధికారులు ఎవరూ లేక, సిబ్బంది లేకపోవడంతో చెంచులు, గిరిజనులు సైతం కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నల్లమల లోతట్టు ప్రాంతాల్లోని చెంచులు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలకు నోచుకోలేకపోతున్నారు. వారి జీవనోపాధికి ఉపకరించే పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ సరుకులపై మాత్రమే చెంచులు ఆధారపడి జీవించాల్సి వస్తోంది. చెంచుల ఉపాధి, జీవనాభివృద్ధి కోసం ఉద్దేశించిన గిరివికాసం, ఈఎస్ఎస్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల సేకరణ తదితర పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ● ఒకే ఒక్క ఉద్యోగితో కొనసాగుతున్న మన్ననూరు కార్యాలయం ● ఏళ్లతరబడిగా ఇన్చార్జ్ పీఓతోనే నెట్టుకొస్తున్న వైనం ● అగమ్యగోచరంగా చెంచులు, గిరిజనుల జీవనం ● నల్లమలలోని అడవి బిడ్డలకు అందని ఆర్థిక ప్రోత్సాహకాలు నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ నిధులు, సిబ్బంది లేక నామమాత్రంగా తయారైంది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజన జాతులు (పర్టిక్యూలర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్– పీవీటీజీ), చెంచులు, గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏ ప్రాజెక్ట్లో దశాబ్ద కాలంగా రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) లేకపోవడం ఇక్కడి గిరిజనుల పాలిటశాపంగా మారింది. అత్యంత కీలకమైన పీఓ పోస్టు ఖాళీగా ఉండటం, ఏళ్లుగా ఇన్చార్జ్తోనే నెట్టుకొస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు మందగించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా జిల్లాలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చెంచులకు ఉచితంగా సోలార్ బోర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు కావాలన్నా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం చేపడితేనే అది సాధ్యమవుతోంది. ఏళ్లుగా ఒక్కరే దిక్కు.. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ సున్నిపెంట (శ్రీశైలం) పరిధిలో కార్యకలాపాలు కొనసాగగా.. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. అయితే గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వం రెగ్యులర్ పీఓను మాత్రం నియమించలేదు. ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, ఇన్నేళ్లుగా తాత్కాలికంగా, జిల్లాస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తోంది. పీఓతోపాటు కార్యాలయంలో వివిధ విభాగాలకు అధికారులు, కార్యాలయ నిర్వహణకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కేవలం సీనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడంతో ఐటీడీఏ ప్రాజెక్ట్ నామమాత్రంగా మారింది. పీఎం జన్మన్కే పరిమితం.. చెంచు పెంటల సంఖ్య 150 చెంచుల జనాభా (సుమారు) 18,000 మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలు 3 (మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ) చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిస్సహాయత చాటుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సంబంధించి మన్ననూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కనీసం పూర్తిస్థాయి పీఓకు నోచుకోలేకపోతోంది. దీనికితోడు నిధులు కేటాయించక, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో సదరు కార్యాలయం ఒకేఒక్క ఉద్యోగితో నెట్టుకొస్తోంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య సాగుతున్న ఐటీడీఏ ఇక చెంచు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఏమాత్రం తోడ్పాటునందిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, నాగర్కర్నూల్ ప్రభుత్వానికి ప్రతిపాదించాం.. మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ రెగ్యులర్ పీఓ, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం పీఎం జన్మన్ కింద చెంచుల్లోని ప్రతి ఒక్కరికి అవసరమైన పత్రాలను అందించేందుకు కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్యసేవలు ప్రారంభించాం. – రోహిత్ గోపిడి, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, మన్ననూర్ అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు (పీవీటీజీ) గ్రూప్నకు చెందిన చెంచులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా పీఎం జన్మన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌలికమైన పత్రాలను ప్రతి ఒక్క చెంచు వ్యక్తికి అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహించి అవసరమైన పత్రాలను అధికారులు అందజేస్తారు. ఈ కార్యక్రమం మినహా గిరిజనుల కోసం ఉద్దేశించిన ఇతర ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. చెంచులు ఉండే మండలాలు 25 -
పాలనలో కలెక్టర్ మార్క్
నారాయణపేట: గతేడాది జూన్ 16న కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సిక్తా పట్నాయక్.. అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తూ సమర్థవంతమైన పాలన జిల్లా ప్రజలకు అందిస్తున్నారు. సహజ వనరుల అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. ఉన్నత లక్ష్యాల దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలతో పాటు కొత్త మండలాల్లో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలను వేగిరం చేయిస్తున్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్ సౌకర్యం కల్పించారు. కలెక్టర్గా ఏడాది పూర్తి చేసుకున్న సిక్తా పట్నాయక్ సమర్థవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా పథకాల అమలు ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ఉక్కుపాదం -
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
నాకు ఐదెకరాల పొలం ఉంది. పంట పెట్టుబడులు పెట్టే సమయంలో ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు అందించడం సంతోషంగా ఉంది. రైతులకు కొంత భారం తగ్గుతుంది. ఇందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్ నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – అల్లీ వెంకటయ్య, రైతు, కొత్తపల్లి సంతోషంగా ఉంది.. వానాకాలం పంటల సాగుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పంట పెట్టుబడికి ప్రభుత్వం అందించే డబ్బులు ఉపయోగపడతాయి. ఈ డబ్బులతోనే పనులు మొదలుపెడతాం. పి.నర్సింహులు, రైతు, మాగనూర్ 1,78,017 మందికి లబ్ధి.. జిల్లావ్యాప్తంగా 1,78,017 మందికి రైతుభరోసా కింద వానాకాలం పెట్టుబడి సాయం రూ. 257కోట్లు జమ కానున్నాయి. ప్రభుత్వం సోమవారం నుంచి రైతుభరోసా అందిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. కొత్తగా పాసుపుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. – జాన్సుధాకర్, డీఏఓ ● -
ఇంటర్ సప్లిమెంటరీలో 65శాతం ఉత్తీర్ణత
నారాయణపేట రూరల్/ నారాయణపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 65శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 2,283 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,318 మంది (57.73శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 125 మందికి గాను 98 మంది (78.4శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,316 మందికి గాను 652మంది (49.54శాతం), ఒకేషనల్లో 63 మందికి గాను 40మంది (63శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా, విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.100, రీవెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సుదర్శన్రావు తెలిపారు. బాధితులకు భరోసానివ్వాలి: డీఎస్పీ నారాయణపేట: వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీసు అధికారులకు సూచించారు. డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు. హక్కుల సాధన కోసం పోరాడుదాం నారాయణపేట: కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని.. వాటిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.సూర్యం పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో జరిగిన టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభల ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా విభజించి అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, మధ్యాహ్నం భోజన కార్మికులకు భద్రత కల్పిస్తామని, మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పీఫ్, ఈఎస్ఐ అమలు చేస్తామని, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూర్చే జీఓలు అమలుచేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చుకోవడం లేదన్నారు. కార్మికుల హక్కుల కోసం రాజీ లేని లేని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎం. కాళేశ్వర్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.కిరణ్, ప్రధాన కార్యదర్శి బి.నర్సింహ, ఉపాధ్యక్షుడు ఏజి బుట్టో, బోయిన్పల్లి రాము, సహాయ కార్యదర్శి ఎదిరింటి నర్సింహ, రామాంజనేయులు కోశాధికారి కొలిమి రాములు, కాశీనాథ్ ఉన్నారు. -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 ఒక్కో పాకెట్పై రూ.37 పెంపు -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన రీజియన్ కమిటీ అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యశీలారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ రహెమాన్ సోఫి, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సత్యన్న ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బసన్న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా సత్యశీలారెడ్డి, కోశాధికారిగా కేకే మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాంమూర్తి, ఉపాధ్యక్షుడిగా గోపాల్రెడ్డి, చీఫ్ అడ్వయిజర్గా ఎంకే జోసెఫ్, జాయింట్ సెక్రటరీగా దమ్మాయిపల్లి శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని పది డిపోలకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ ●పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్కర్నూల్ సాక్షి, నాగర్కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు -
అతివల ఆర్థికాభివృద్ధి
నర్వ: జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.262.13 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం విధించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంకు లింకేజీ రుణాలను సర్కారు ఏటా అందజేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించడానికి ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 7,072 సంఘాలు.. ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు, 91,065 సభ్యులు ఉండగా.. అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఏర్పాటు చేసే వ్యాపారం ఆధారంగా రుణాలిస్తారు. చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో సభ్యులు తీసుకున్న రుణాల్లో వసూలు శాతం సక్రమంగా ఉన్నందున ఈ వార్షిక ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగా రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే గాకుండా వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. కాగా వారు దేనికి రుణం తీసుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాలకు బృందం సభ్యులు పూచికత్తు ఇవ్వాలి. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తే మేలు.. మహిళా సంఘాల రుణాల వడ్డీని ప్రభుత్వమే ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తే వారికి ఇబ్బంది ఉండదు. కానీ వడ్డీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో సభ్యులే ప్రతి నెలా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. కాగా మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు వారి ఖాతాల్లో జమ చే స్తోంది. గతేడాది బకాయిలు ఇంకా పెండింగ్లో ఉండగా.. వడ్డీ డ బ్బులను ప్రతి నెలా చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. మాగనూరు, కృష్ణాలో వెనుకబాటు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మహిళా సంఘాలకు ఇచ్చిన వార్షిక రుణ లక్ష్యాన్ని దాదాపు అన్ని మండలాలు పూర్తిచేయగా.. మాగనూర్, కృష్ణా బాగా వెనుకబడ్డాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాది రుణ లక్ష్యం రూ.262 కోట్లు చేరుకోగా.. మాగనూర్ 79.66 శాతం, కృష్ణా 74.89 శాతం మాత్రమే పూర్తిచేసి కాస్త వెనుకబడ్డాయి. మండలం సంఘాలు సభ్యులు లక్ష్యం(రూ.లక్షల్లో..) మద్దూరు 1,073 14,078 4,031.67 దామరగిద్ద 929 11,628 3,419.19 నారాయణపేట 848 11,287 3,167.85 ఊట్కూర్ 707 9,093 2,662.35 మక్తల్ 651 9,223 2,476.45 మరికల్ 586 6,855 2,080.63 కోస్గి 572 7,679 2,181.76 ధన్వాడ 547 6,678 1,983.55 నర్వ 483 6,217 1,737.14 మాగనూర్ 359 4,445 1,319.57 కృష్ణా 317 3,882 1,197.13 జిల్లాలో మహిళా సంఘాల రుణ లక్ష్యం ఖరారు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.262.13 కోట్లు రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు మండలాల వారీగా 2025–26 రుణ లక్ష్యంసద్వినియోగం చేసుకోవాలి.. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏటా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని నిర్దేశించి వందశాతం చేరుకునేలా దిశా నిర్దేశ్యం చేశాం. గతేడాది జిల్లాలో రుణ లక్ష్యం చేరుకున్నాం. వెనుకబడ్డ మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమయాత్తం చేస్తాం. – మొగులయ్య, డీఆర్డీఓ సభ్యుల ఎంపిక ఇలా.. కొత్తగా ఏర్పాటు చేసే సంఘాల్లో 18 ఏళ్లు నిండిన వివాహత మహిళలే సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల భార్యలకు సంఘాల్లో చోటు ఉండదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. -
‘కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం’
నారాయణపేట: కాంగ్రెస్ పాలనలో భూ సెటిల్మెంట్లు, ఒండ్రు మట్టి, ఇసుక అక్రమ రవాణాపై కమీషన్లు తప్పా అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గంలో ఒక్క పని కూడా కొత్తగా చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆస్పత్రి తరలింపుపై ప్రజలకు సరైన సమాధానం చెప్పలేక ఓ కరపత్రం విడుదల చేసి చేతులు దులుపుకొంటున్నారన్నారు. నారాయణపేటలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో రాజకీయ నాటకాలు మొదలు పెట్టాయని.. రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడి నుంచి తరలివెళ్లినట్లు తెలుస్తోందని.. అదే జరిగితే రైతులు, విద్యార్థులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాల తీసుకొచ్చింది తానేనంటూ ఎస్ఆర్ రెడ్డి గట్టిగా చెప్పుకొచ్చారు. పట్టణ పరిసరాల్లో వైద్య, నర్సింగ్ కళాశాల, జిల్లా ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన భూమి లేకనే అప్పంపల్లి వద్ద ఉన్న స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంజూరైన ప్రసవ, చిన్న పిల్లల ఆసుపత్రిని పట్టణంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేయించిన నిధులు ఇతర నియోజకవర్గాలకు తరలి వెళ్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అర్అండ్బీ అతిథిగృహం నిర్మాణానికి రూ.4 కోట్లు వస్తే ఆ నిధులు కొడంగల్కు బదిలీ అయ్యాయని, కోయిలకొండ మండలం రామకొండ దేవాలయానికి రూ.10 కోట్లు, జిల్లాకేంద్రంలో సంత్ సేవలాల్ మహరాజ్ భవన్ నిర్మాణానికి తీసుకొచ్చిన రూ.కోటి వెనక్కి వెళ్లాయన్నారు. 18 నెలలు గడుస్తున్నా ఎస్పీ కార్యాలయం, స్టేడియం నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. భూముల పంచాయితీలు, కబ్జాల్లో కాంగ్రెస్ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయని.. మట్టి, ఇసుక, ఒండ్రు తవ్వకాల్లో కాంగ్రెస్ నాయకులే ఉన్నారని ఇదేనా ప్రజాపాలన అన్నారు. ఎమ్మెల్యే అధిష్టానంతో పోరాటం చేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తే అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని తెలిపారు. సైనిక్ స్కూల్ ఏర్పాటుపై స్థానిక బీజేపీ నాయకులు కేంద్రంపై వత్తిడి చేయకపోగా.. బీఆర్ఎస్పై నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మొసట జ్యోతి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అంజలి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, మాజీ ఎంపీపీలు వెంకట్రెడ్డి, నర్సప్ప, నాయకులు సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
నారాయణపేట: కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నయని, కార్మికులందరూ సంఘటితంగా పోరాడేందుకు సిద్ధం కావాలని హెచ్సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.హన్మేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో టీయూసీఐ జిల్లా మొదటి మహాసభలు నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదట కొత్త బస్టాండ్ నుంచి నర్సిరెడ్డి చౌరస్తా, పాత బస్టాండ్, మెయిన్ చౌక్, సరాఫ్ బజార్ మీదుగా ఎస్ఆర్ గార్డెన్ వరకు భారీఎత్తున కార్మిక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికుల శ్రమను పాలకుల రూపంలో ఉండే పెట్టుబడిదారులు దోచుకుంటున్నారని.. దేశంలో రూ.వేల కోట్ల సంపద అతికొద్ది మంది చేతుల్లో ఉండగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారికి మద్దతునిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ రెండూ ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా విభజించి కార్మిక సంఘాల అణచివేతకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కార్మికులు అధికంగా ముంబై, హైదరాబాద్, డిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా, ఇతర రంగాల్లో చాలీచాలని వేతనాలకు పని చేస్తున్నారని.. వారి పిల్లల చదువులు, వాళ్ల బతుకులు రోడ్డుపాలు కావడం చూస్తూనే ఉన్నామని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ, కనీస వేతనాల అమలు, సకాలంలో వేతనాల చెల్లింపులు తదితర సమస్యల పరిష్కారానికి అందరూ ఏకం కావాలని అప్పుడే రాష్ట్రంలో దేశంలో మార్పు వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రజా, కార్మిక సంఘాల నాయకులు రాము, కాశీనాథ్, కాళేశ్వర్, యాదగిరి, జయలక్ష్మి, రామకృష్ణ, కృష్ణ, నర్సింహ, కంచే నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నా తండ్రి సహకారంతోనే..
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. అమ్మ వసుంధర గృహిణి కాగా.. నాన్న శ్రీనివాసులు ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ.. మా ముగ్గురిని చదివించారు. ఆర్థిక స్థోమత లేకపోయినా ఆ విషయాన్ని మేం గుర్తించకుండా అవసరమైనవి సమకూర్చారు. చిన్నతనం నుంచి ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నన్ను నిరుత్సాహపర్చకుండా ఎంత కష్టమైనా డబ్బులు పెట్టి చదివించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం గ్రూప్స్ పరీక్ష రాయగా తాజాగా వచ్చిన ఫలితాల్లో 484.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 118వ ర్యాంకు, మల్టీ జోన్–2లో మూడో ర్యాంకు.. మహిళా కేటగిరిలో రెండో స్థానంతో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యాను. నా తండ్రి సహకారంతోనే ఈ స్థాయికి చేరాను. -
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ యోగా జీవితంలో భాగంగా మార్చుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని డీఎంహెచ్ఓ జయచంద్ర మోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో శనివారం యోగా క్లబ్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్యజీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని వాటన్నింటినీ అధిగమించి ఆరోగ్యంగా ఉండడానికి యోగ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఒత్తిడితోపాటు అంగవైకల్యం, బీపీ, షుగర్, ఇతర మానసిక వ్యాధులు నియంత్రణకు యోగా తోడ్పడుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 7గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేడుకలు విజయవంతం చేద్దాం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న స్థానిక అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పతాంజలి యోగాసమితి, ఆయుష్ విభాగం, సేవా భారతి సంయుక్తంగా చేపడుతుందని, ఈనెల 20న పాఠశాల, కళాశాల విద్యార్థులకు నేటి సమాజానికి యోగా ఆవశ్యకత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో సురేష్, రాజేంద్ర, శివకుమార్, కేతన్, రఘు, నరసింహులు, మల్లికార్జున్, శ్రీనివాస్, చంద్రశేఖర్, దేవానంద్, రమేష్, రఘు, బాలాజీ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 5,583 కేసుల పరిష్కారం
నారాయణపేట: జిల్లాలోని 14 పోలీస్స్టేషన్లు, రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 5,583 కేసులను జాతీయ లోక్అదాలత్లో పరిష్కరించారు. శనివారం జిల్లా న్యాయ సేవా సంస్థ, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బోయ శ్రీనివాసులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జడ్జి మమతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్లో జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 5,583 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. కేసుల పరిష్కారానికిగాను రూ.26,52,800 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. -
నాన్నే.. సూపర్ హీరో
వెన్నుదన్నుగా నిలబడ్డారు.. నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు ● పిల్లల ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ భరోసా ● భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి ● నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం -
నారాయణపేట
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025రియల్ హీరో.. ‘మా నాన్న రఘునాథ్ గైక్వాడ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. కిరాణ షాపు నిర్వహిస్తూ మా చదువుల కోసం ప్రోత్సహించారు. ఆయన నుంచి కష్టపడే తత్వాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికీ నాన్నే రియల్ హీరోగా ఉంటారు. నాన్న రఘునాథ్ గైక్వాడ్తో నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నాన్నంటే ఓ ఆసరా.. ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత.. ఓ ధైర్యం.. నాన్నంటే ఓ స్ఫూర్తి..ఓ ఆర్తి.. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే సూపర్ హీరో. నవ మాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడిస్తాడు. బుడిబుడి అడుగుల నుంచి ప్రతి చోట వెన్నంటి ఉంటాడు. కష్టాల్లో నిర్భరంగా.. ఆపదలో ధైర్యంగా నిలబడేలా భరోసానిస్తాడు. విజయంలో మెట్టుగా మారుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని కళ్లలో దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టి.. తన కోసం ఏదీ దాచుకోకుండా.. కన్న బిడ్డలే సర్వస్వంగా బతుకుతాడు. అందుకే నాన్నంటే ప్రతి కుమారుడు, కుమార్తెకు కొండంత ధైర్యం. తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు ఎందరో ఉన్నారు. ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. – సాక్షి నాగర్కర్నూల్/ నారాయణపేట రూరల్/ గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్)/ పాలమూరు -
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యావత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ఎస్బీఐలో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సాధించి ఐపీఎస్ సాధించారు. మహారాష్ట్ర ఐపీఎస్ కేడర్కు ఎంపికై హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే యశ్వంత్నాయక్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. -
మొరాయిస్తుంది..
మూడు నెలలకు సంబంధించి బియ్యం పంపిణీ ప్రక్రియ బాగానే ఉన్నా.. లబ్ధిదారుల వేలి ముద్రలను తీసుకునే సమయంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం అందించడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. సర్వర్ ఇబ్బందులు లేకుంటే రోజుకు గత నెల మాదిరిగానే వంద మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. – తిరుపతిరెడ్డి, రేషన్ డీలర్, అప్పంపల్లి లబ్ధిదారులు ఆందోళన చెందొద్దు రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకే సారి పంపిణీ చేసే క్రమంలో ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు రావచ్చనే అలోచనతో ఈ నెల 30 వరకు బియ్యం పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశాం. మొదట నాలుగు రోజులు మూడు సార్లు వేలిముద్రలు, ఆరు సార్లు తూకం వేసి బియ్యం పంపిణీ చేశారు. సమస్య జఠిలంగా మారడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. 6వ తేదీ నుంచి మూడుసార్లు వేలి ముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసింది. – సైదులు, పౌర సరఫరాల శాఖ అధికారి, నారాయణపేట ● -
ఆస్పత్రి తరలింపుపై విచారణ జరపాలి
నారాయణపేట రూరల్: జిల్లా ఆస్పత్రి తరలింపులో భారీ కుంభకోణం ఉందని, వెంటనే విచారణ జరపాలని బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిని పట్టణానికి దూరంగా తరలించడంపై బీజేపీ ఆధ్వర్యంలో 24గంటల నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. భారీ ర్యాలీగా సత్యనారాయణ చౌరస్తాకు చేరుకున్నారు. దీక్ష శిబిరంలో నామాజీ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రి లేకుండా పూర్తిగా తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 60 వేల జనాభా ఉన్న జిల్లా కేంద్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెడికల్ కాలేజీకి ఆస్పత్రిని తరలించడం సరికాదని, రోడ్డు సౌకర్యం, విద్యుద్దీపాలు లేక రోగులు అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో కొడంగల్, నారాయణపేట రెండు నియోజకర్గాలు రెండు కళ్లు అని చెప్పి ఇప్పుడేమో కొడంగల్కు విద్యాసంస్థలు, ప్రతి గ్రామానికి రోడ్లు వస్తున్నాయి కానీ నారాయణపేటకు వచ్చిన విద్యా సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడని ఆరోపించారు. వెంటనే జిల్లా కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య చికిత్సలకు, గర్భిణులకు, చిన్న పిల్లలకు వైద్యం ఇక్కడే అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రతన్ పాండు రెడ్డి, శ్రీనివాస్, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, లక్ష్మీ, వినోద్, జ్యోతి, సాయిబన్న, నందు నామాజీ, కిరణ్ పాల్గొన్నారు. -
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్లు
నారాయణపేట: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సేవల మంత్రి వాకిటి శ్రీహరిని శుక్రవారం హైదరాబాద్లో నారాయణపేట జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో జిల్లా కేంద్రంలో మంత్రికి ముదిరాజ్ సన్మానసభను ఏర్పాటుచేసినట్లు విన్నవించారు. జిల్లాలోని ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం మంత్రిగా తాను పాటుపాడుతామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అదే విధంగా శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ను కలిశారు. మంత్రితో పాటు శాసనమండలి వైస్ చైర్మన్ను కలిసిన వారిలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజు, దామరగిద్ద పీఏసీఎస్ చైర్మన్ పుట్టి ఈదప్ప, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షులు ఎ.కాంతకుమార్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కోనంగేరి హన్మంతు, మరికల్ మత్స్యశాఖ అధ్యక్షులు కానుగంటి నారాయణలు ఉన్నారు. -
సర్వర్ కష్టాలు
మరికల్: వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వర్ సమస్యతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద గంటల పాటు పడిగాపులు కాచే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఈ నెల 30 తేదీ వరకు సన్న బియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో రేషన్ దుకాణాలకు వస్తున్నారు. మరోవైపు ఈ–పాస్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం సూచనతో జూన్ 1 నుంచి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట నాలుగు రోజులు ఒక్కో లబ్ధిదారుడు ఈ–పాస్ యంత్రంలో మూడు మార్లు వేలి ముద్రలు నమోదు చేయించి, ఆరుమార్లు బియ్యాన్ని తూకం వేయాల్సి వచ్చింది. దీంతో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి ఒక్కో లబ్ధిదారుడికి కనీసం 30 నిమిషాల సమయం తీసుకుంటుందని, ఈ విషయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు వేలిముద్రలు, మూడు సార్లు బియ్యం తీసుకునేలా మార్పులు చేస్తు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సమస్య కొద్దిమేర తగ్గింది. మూడు నెలల బియ్యం ఒకసారి పంపిణీ చేయడం వల్ల రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ సాధ్యమవుతుండగా, గత నెలలో రోజుకు వంద కార్డులకు బియ్యం పంపిణీ జరిగేదని డీలర్లు వాపోతున్నారు. సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పడిగాపులు రోజుకు 50 కార్డులకు మాత్రమే బియ్యం పంపిణీ ఒక్కో కార్డుకి 20 నిమిషాలు పడుతున్న వైనం ఈ – పాస్ యంత్రాలతో సాంకేతిక సమస్యలు -
‘అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు’ కు గురుకుల విద్యార్థి
దామరగిద్ద: వినూత్న ఆలోచనలో భాగంగా పర్యావరణ హితమైన పూల కుండీలు తయారు చేసిన గురుకుల విద్యార్థి అంతర్జాతీయ స్ఫూర్తి అవార్డు పోటీలకు ఎంపికయ్యాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో 2023– 24 ఏడాదిలో పదో తరగతి చదివిన విద్యార్థి శివారెడ్డి స్వగ్రామం మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి. జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక కావడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు అంతర్జాతీయ స్థాయిలో జపాన్లోని సకురా సైన్స్ స్కూల్లో జరగనున్న సైన్స్పేర్ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భవన్లో జరిగే సమావేశంలో పాల్గొని సాయంత్రం జపాన్కు బయలుదేరి వెళ్తాడు. ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్ పాట్స్ తయారీ.. శివారెడ్డి పాఠశాలలో గత మూడేళ్లుగా ఇన్స్పైర్ అవార్డుల్లో పాల్గొంటున్నాడు. టీజీటీ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు, గైడ్ జరీనా ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో శివారెడ్డి కొబ్బరి పీచు, మైదా పిండితో హైడ్రాలిక్ పవర్ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో పూల కుండీలను తయారీ చేసి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి.. అంతర్జాతీయ స్థాయి స్ఫూర్తి పోటీలకు ఎంపికయ్యాడు. దీంతో ఉపాధ్యాయులు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. రేపు జపాన్ వెళ్లనున్న దామరగిద్ద విద్యార్థి శివారెడ్డి పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
కోస్గి రూరల్: కోస్గి, గుండుమాల్ మండలాల పరిదిలో జరుగుతున్న అబివృద్ది పనుల్లో వేగం పెంచాలని , పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యత పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, గుండుమాల్ మండల పరిదిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండుమాల్లోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనం, బోగారంలోని పాఠశాల, బోగారం నుంచి అమ్లీకుంట వరకు రోడ్డు పనులను పరిశీలించారు. కోస్గి మండలంలోని కడంపల్లి నుంచి హన్మాన్పల్లి గ్రామాన్ని కలిపే బ్రిడ్జి పనులు, సర్జఖాన్పేట్లోని పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలన్నారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి నుండి సర్జఖాన్పేట్ , పోతిరెడ్డిపల్లి నుండి జిన్నారం వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈపిఆర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈపీఆర్ హిర్యానాయక్ , ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ఏఈ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన నారాయణపేట: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అక్కడి భద్రతా సిబ్బందికి సూచించారు. కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ రాజీకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్రెడ్డి, మనివర్ధన్, వెంకట్రామరెడ్డి, వెంకటయ్య, మహ్మద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు. -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
తొలిరోజు హాజరు అంతంతే..
నారాయణపేట రూరల్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పలు ప్రభుత్వ పాఠశాలల్లో మామిడి తోరణాలు కట్టి పూజలు చేసి తరగుతులు ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల్లో రంగులు వేశారు. ఇక గురువారం జిల్లాలోని పాఠశాలల దగ్గర పెద్దగా విద్యార్థుల సందడి కనిపించలేదు. తొలిరోజు జిల్లాలో 57,281 మందికి గాను 18,313మంది విద్యార్థులు పాఠశాలలకు రాగా, కేవలం 31.9శాతం మాత్రమే హాజరు నమోదైంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ అయితే పాఠశాలలకు హాజరైన విద్యార్థులకుగాను తొలిరోజు 1,90,885 పాఠ్యపుస్తకాలు, 3,84,000నోటుపుస్తకాలు, 18,313యూనిఫాం పంపిణీ చేపట్టరు. వీరిలో 10,303 మంది బాలికలు, 8,010మంది బాలురు ఉన్నారు. జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థులను వినూత్న పద్ధతిలో పాఠశాలలోకి ఆహ్వానించారు. కొత్తగా చేరిన వారికి పువ్వులు అందించారు. మరి కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి పిల్లల ఫొటోలు దింపి వారి తల్లిదండ్రులకు వాట్సాఫ్లలో పంపించారు. మొత్తానికి మొదటిరోజు ఆట, పాటలతో చిన్నారులను ఉత్తేజ పరిచారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హాజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది. అయితే, బుధవారం ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరు, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. తెరుచుకున్న పాఠశాలలు మొదటిరోజు 32శాతం విద్యార్థుల హాజరు -
పత్తి విత్తనాల ధర తగ్గించాలి
ఎకరాకు పత్తి విత్తనాలు మూడు పాకెట్లు అవసరం కాగా పెరిగిన ధరలతో వాటికి రూ.3,030 ఖర్చువుతుంది. ఇలా వ్యవసాయనికి సంబందించిన ప్రతి వస్తువు పెరిగితే రైతులకు నష్టాలు తప్ప లాభాలు రావు. పెరిగిన పత్తి విత్తనాల ధరలను తగ్గించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. – పాపన్న, పత్తి రైతు, మరికల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి వాణిజ్య పంటల విత్తనాల ధరల ప్రభుత్వ నియంత్రణ ఉంటే బాగుటుంది. తక్కువ ధరకు దొరుకుతాయని లూజుగా తీసుకుని సాగు చేస్తే సరైన దిగుబడి రాక నష్టపోతున్నాం. అన్ని రకాల విత్తనాల ధరలు నియంత్రణలో ఉంచే రైతులకు గిట్టుబాటు అవుతుంది. పెరిగిన కూలీలతో సత్తమతం అవుతుంటే విత్తనాల ధరలు పెరగడం తమను బాధిస్తోంది. – వెంకటన్న, రైతు, మాధవరం విత్తనాలనుపొదుపుగా వాడాలి పెరుగుతున్న విత్తన ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించి దూరం, దూరం విత్తనాలు నాటితే పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. దగ్గరగా నాటితే ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. ఇలా చేయడం వల్ల ఎకరాకు ఒక ప్యాకెట్ను తగ్గించుకోవచ్చు. పెరిగిన విత్తనాల ధరల విషయం తమ చేతుల్లో ఏమి లేదు. – రహ్మన్, ఏఓ, మరికల్ ● -
ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతాం..
కోస్గి రూరల్: నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెటర్నరి కళాశాల, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు చేపడుతున్నామని కొడంగల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి, కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రి కళాశాలల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఉన్నత చదువులకు సూదూర ప్రాంతాలకు గతంలో వెళ్లాల్సి వచ్చేదని ప్రస్తుతం తమ ప్రాంతంలోనే కళాశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విద్యాభ్యున్నతి మరింత పెరుగుతుందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ఫిజులు చెల్లించలేని వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లవిజయ్కుమార్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, నాయకులు రఘువర్దన్రెడ్డి, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన భారం
● పెరిగిన విత్తనాల ధరలు ● పాకెట్ పత్తిపై రూ.వంద పెంపు ● అదే దారిలో మిరప, కంది, అముదం, వరి ధరలు ● పెట్టుబడి భారమవుతుందని రైతుల ఆందోళన ● జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు మరికల్: వానాకాలం సీజన్లో వివిధ రకాల విత్తనాల ధరలను కంపెనీలు పెంచడంతో రైతులపై అధిక పెట్టుబడుల భారం పడుతుంది. సాధారణ పత్తి సాగుకు అవసరమయ్యే సర్టిపైడ్ విత్తనాల ప్యాకెట్ ధరలు పెరగడం రైతులు ఆందోళన కలిగిస్తుంది. కేజీ పత్తి పాకెట్ ధర రూ.910కి పెరిగింది. గతేడాది పోల్చితే రూ.60 వరకు పెరిగింది. జిల్లాలో రైతులపై రూ.కోట్లలో భారం పడనుంది. గతంలో పోల్చితే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగటంతో పెట్టుబడి పెరిగిందని, ఇప్పుడు పత్తి, మిరప, కంది, అముదం, వరి విత్తనాల ధరలు కూడా పెరగడంతో మూలిగేనక్కపై తాడిపండు పడ్డ చందంగా విత్తన ధరలు పెరగటం మరింత భారం కానుందని వాపోతున్నారు. ప్రైవేటుగా కొనుగోలు సాధారణ పత్తి సాగుకు విత్తనాల సరఫరాను ప్రభుత్వం ఎప్పుడో నిలిపి వేసింది. రైతులంతా ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశ పెట్టడంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. యేటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం కంపెనీలకు విక్రయ ధర నిర్ణయిస్తోంది. ఆ మేరకు విత్తనాలు విక్రయించాల్సింటుంది. మార్కెట్లో బీటీ–1, బీటీ–2 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు బీటీ–2 సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధర పెంపుతో దిగాలు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు అవుతుంది. ఎకరాకు 3 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు నాటాలి. ఒక పాకెట్ వెంబడి రూ.100 పెరగటంతో ఎకరాకు రూ.300 అదనంగా భారంగా అవుతుంది. ఇప్పటికే వందల రకాల పత్తి విత్తనాల కంపెనీలు వివిధ పేర్లతో డీలర్లకు అందించటం వారు రైతులకు విక్రయిస్తున్నారు. వీటికి తోడు కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ప్యాకెట్పై క్యూఆర్ కోడ్ నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా రైతులు నాసీరకం విత్తనాలతో డీలర్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ధర పెరగడం వల్ల రైతులపై అదనపు భారం పడింది. ఇతర విత్తనాలు మూడేళ్లుగా మిరపతో ఇతర విత్తనాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా మిరప విత్తనోత్పత్తి లేకపోవటం పట్ల ప్రైవేట్ కంపెనీలు విక్రయించే విత్తనాలే వారికి దిక్కవుతున్నాయి. పది గ్రాముల విత్తనాలకు రూ. 1500 పలుకుతుంది. సాగును దృష్టిలో ఉంచుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన విత్తన కంపెనీలు కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాయి. రైతులు ఎక్కువగా విత్తనాలు కొనుగోలుకు కర్నూల్ జిల్లా డీలర్లను ఆశ్రయిస్తుంటారు. అలాగే వరి, కంది, అముదం విత్తనాలు కూడా భారీగా పెరిగాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నారాయణపేట: ఎస్పీ యోగేష్ గౌతమ్ను జిల్లా ఆర్టీఏ మెంబర్ పోషల్ రాజేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొంటూ ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని సూచించారు. సంబంధిత అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి నెల కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే రోడ్ సేప్టీ మీటింగ్కు రావాలని సూచించారు. జాతీయ రహదారి 167 రాయచూరు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయని, వాటి నివారణకు సంబంధిత అధికారులు నిర్వహించే రోడ్డు భద్రతా మహోత్సవాలకు ఇక నుంచి భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇక ముందు జరిగే రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పోలీసు శాఖ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కురువ మనోజ్, నాయకులు సిద్దన్ లక్ష్మణ్, జరంగ్ రాము, గోల్ల లక్ష్మణ్, వీరేష్ కుమార్, కార్తీక్, అసనుద్దీన్ పాల్గొన్నారు. -
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే
నారాయణపేట: తనపై నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, బావి ప్రధాని రాహుల్గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులను సమన్వయంతో చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామన జెండా ఎగరవేస్తూ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరవేసేందుకు కృషి చేస్తామన్నారు.బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలినారాయణపేట: యాసంగిలో వరి ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనేప్రభుత్వం బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి.వెంకట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్గంగ్వార్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో 14.25 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని, అందుకుగాను రూ.71 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉందన్నారు. రైతులు ధాన్యం విక్రయించి రెండునెలలు కావస్తున్నా ఇంత వరకు బోనస్ డబ్బులు వేయాలేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. శివకుమార్, శ్రీనివాస్, శరణుబసప్ప పాల్గొన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదలమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.