breaking news
Narayanpet
-
నర్వకు సంపూర్ణ అభియాన్ రాష్ట్రస్థాయి ర్యాంకు
నర్వ: నీతి అయోగ్ చేపట్టిన సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలం మూడు నెలలుగా సాధించిన ప్రగతికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న గట్టు మండలంతో పాటు నర్వ మండలం సిల్వర్ మెడల్ సాధించింది. ఆరు విభాగాల్లో ప్రగతి మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో ఆరు విభాగాల్లో న్యూట్రీషణ్ (పోషణ), అగ్రికల్చర్, విద్య, నీటి వసతితో పాటు సోషల్ సెక్టార్లో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. కార్యక్రమంలో గర్భిణులకు, ఆరోగ్య, పోషణ వంటి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టారు. మండలంలో 21,405 మందికి బీపీ, షుగర్, టీబీ పరీక్షలు నిర్వహించారు. సంపూర్ణ అభియాన్ ద్వారా స్థానిక పీహెచ్సీకి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు 7,145 ఆరోగ్య మట్టి పరీక్షలు నిర్వహించి పరీక్షల కార్డులను రైతులకు అందించారు. మరో 3,200 కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నారు. సోషల్సెక్టార్ కింద మహిళా సంఘాలకు రూ.9.40 కోట్లు రుణాలు అందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం లబ్ధిదారులు వినియోగించుకునేలా చేసి మెరుగైన ఫలితాలు సాధించారు. కేంద్ర మంత్రి రాకతో.. సంపూర్ణ అభియాన్ పథకానికి ఎంపికై న నర్వ మండలంలో మూడు నెలల ప్రగతిని సమీక్షించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విచ్చేసి ఆరు విభాగాల పనితీరును పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. నేడు రాజ్భవన్లో అవార్డు అందుకోనున్న ఎంపీడీఓ -
జిల్లా స్థాయి అవార్డుల ప్రదానం
నారాయణపేట: నీతి ఆయోగ్ ఆకాంక్ష బ్లాక్ కార్యక్రమం కింద శుక్రవారం జిల్లా, నర్వ మండల అధికారులు, సంపూర్ణ అభియాన్ సమ్మన్ సమరోహ్ కింద నర్వలోని ఫ్రంట్లైన్ కార్మికులకు సౌకర్యాలు కల్పించడానికి జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్స్లో జిల్లా స్థాయి అవార్డులను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించి సంపూర్ణ అభియాన్– ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి రంగాల నుంచి సూచికల సంతృప్తం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్ మాట్లాడుతూ అధికారులు నిజాయితీగా పని చేయాలని, కేపీఐ సూచికలను సంతృప్తి పరచాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ, నోడల్ అధికారి మొగులప్ప, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయచంద్రమోహన్, డాక్టర్ శైలజ, నర్వ ఎంపీడీఓ శ్రీనివాస్, సీడీపీఓ, మెప్మా అధికారులు, నీతి ఆయోగ్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు వైఎస్ఆర్.. నేడు రేవంత్రెడ్డి
నారాయణపేట/ఊట్కూర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాడు సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేశారని, మళ్లీ పదిహేనేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం ఉట్కూరు మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగులు, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఊట్కూర్ మండలానికి మంజూరైన 1,261కొత్త రేషన్ కార్డులు, 122 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలతో పాటు మండలానికి చెందిన 14 మంది భూ నిర్వాసితులకు రూ.50 లక్షల నష్టపరిహారం చెక్కులను రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల మంజూరు, నిర్మాణ విషయంలో ఎవరైనా ఒక్క పైసా అడిగినా నేరుగా తనకు ఫోన్ చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉట్కూర్ మండలానికి రూ.25 కోట్ల నిధులతో 500 ఇళ్లు మంజూరు చేశానని, అవి తొందరగా పూర్తి చేసుకుంటే అదనంగా మరో 500 ఇళ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 39 వేల ఎకరాలకు.. జీఓ 69 ద్వారా బీడు వారిన 39 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం లభించిందన్నారు. మండలంలో కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారులు 5,045 మందికి ఒకరికి 6 కిలోల చొప్పున ఇచ్చే 30,624 కిలోల సన్న బియ్యం పంపిణీకి నెలకు ప్రభుత్వం రూ.1.40 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మండలానికి ఓ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, హౌసింగ్ పీడీ శంకర్నాయక్, డీఎస్ఓ బాలరాజ్, తహసీల్దార్ సింధూజ, ఇన్చార్జి తహసీల్దార్ సతీష్కుమార్, ఎంపీడీఓ ధనుంజయ్గౌడ్, ఎల్కోటి నారాయణరెడ్డి, ప్రకాష్రెడ్డి, యజ్ఞేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో.. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న దామరగిద్ద మండలం లింగారెడ్డిపల్లి గ్రామస్తులకు ఆర్డీఓ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డితో కలిసి ఆర్డీఓ రాంచందర్నాయక్ నష్టపరిహరం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగారెడ్డిపల్లిలో 1.33 ఎకరాలకు సంబంధించి 11 మంది రైతులకు రూ.26.27 లక్షల విలువ చేసే చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ఈదప్ప ఉన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలిచ్చారు.. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి -
అద్దె బస్సు డ్రైవర్ల మెరుపు సమ్మె
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న బస్సుల యజమానులు, డ్రైవర్లు శుక్రవారం మెరుపు సమ్మె చేపట్టారు. ఇటీవల డిపోలో ఆరు కొత్త షెడ్యూల్ను తయారు చేసే క్రమంలో హైదరాబాద్ రూట్లో నడుస్తున్న అన్ని ఎక్స్ప్రెస్ సర్వీసుల ఇన్కమింగ్ సమయం దాదాపు గంట పెరిగింది. అదేవిధంగా మహబూబ్నగర్కు నడిచే పల్లె వెలుగు బస్సులు అప్పక్పల్లి వద్ద గల జిల్లా ఆస్పత్రి వరకు లోపలికి వెళ్లి రావాల్సి ఉండటంతో రోడ్డు ఎత్తుగా ఉన్నందున డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో ప్రతి సర్వీస్కు ఇవ్వాల్సిన 10 కిలోమీటర్ల అదనపు డబ్బులు చెల్లించలేదు. వీటిపై స్థానిక డిపో మేనేజర్ లావణ్యతో యజమానులు మాట్లాడగా.. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వారు సమ్మె చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రోజువారీగా తిరగాల్సిన బస్సుల్లో సగానికి పైగా నిలిచిపోయాయి. ఇతర డిపోల నుంచి.. ప్రైవేటు బస్సుల సమ్మెతో నిలిచిపోయిన సర్వీసుల స్థానంలో మహబూబ్నగర్, తాండూర్, కోస్గి, గద్వాల డిపోల నుంచి బస్సులను తెప్పించి రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయాణికులు బస్సులు చాలక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్నతాధికారుల సమీక్ష.. సమ్మైపె కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించి డిపో మేనేజర్ లావణ్యతో తన చాంబర్ సమావేశమయ్యారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి మెడికల్ కళాశాల రోడ్డు విషయంలో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎక్స్ప్రెస్ సర్వీసుల సమయపాలన విషయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వాకబు చేసి ప్రైవేటు బస్సు యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది. మధ్యాహ్నం తర్వాత మహబూబ్నగర్ ఆర్ఎం కార్యాలయంలో ప్రైవేట్ వాహన యజమానులతో చర్చలు జరిపినట్లు సమాచారం. అటెండెన్స్ ఇవ్వకుండా సెలవు వేశారు.. రోజులాగే డిపోకు వచ్చిన కండక్టర్లు చాట్లో సంతకాలు చేశారు. అయితే ప్రైవేట్ బస్సులు సమ్మె చేపట్టడంతో అందులో విధులు నిర్వర్తించాల్సిన కండక్టర్లు డిపోకే పరిమితమయ్యారు. అయితే వారు డ్యూటీ కోసం వచ్చినా.. వారి ప్రమేయం లేకుండా బస్సులు ఆగిపోయినా వారికి అటెండెన్స్ ఇవ్వకుండా వ్యక్తిగత సెలవులు ఇచ్చారు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ప్రయాణికులు, విద్యార్థులు రద్దీగా ఉండే మక్తల్, కోస్గి, మహబూబ్నగర్, హైదరాబాద్ రూట్లలో బస్సులు తగ్గిపోగా ఆయా మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లె వెలుగు బస్సులను ఎక్స్ప్రెస్గా మార్చి పంపించారు. చాలా గ్రామాలకు విద్యార్థుల బస్సులు వెళ్లకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. మరికొందరు పాఠశాలలకు గైర్హాజరయ్యారు. -
‘అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవద్దు’
● ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో నిబంధనలు పాటించాలి ● హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గొప్పలకు పోయి అప్పులు చేసి ఇంటిని నిర్మించుకోవద్దని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రాష్ట్ర హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ చైతన్య సూచించారు. శుక్రవారం ఉమ్మడి మద్దూరు మండలంలోని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న హన్మనాయక్తండా, గోకుల్నగర్ గ్రామాల్లోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు, ఏ ఏ దశల్లో ఉన్నాయని డీఈ హరికృష్ణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే స్టీల్, సిమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మే విధంగా చూడాలని, ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు రహ్మతుద్దీన్, వెంకట్కృష్ణ, ఎంపీఓ రామన్న, తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్గా శ్రీను నారాయణపేట: స్థానిక అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా శుక్రవారం ఎస్.శ్రీను బాధ్యతలు స్వీకరించారు. కల్వకుర్తి ఆర్డీఓగా పనిచేస్తున్న శ్రీను పదోన్నతిపై నారాయణపేట జిల్లాకు వచ్చారు. అనంతరం ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకె అందజేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలు నారాయణపేట క్రైం: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఈ నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 1 నుంచి 31వ తేదీ వరకు అమలులో ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాళ్లలో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను వ్యాప్తి చేసినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఇంజినీరింగ్ కళాశాలలో తుది విడత అడ్మిషన్లు కోస్గి రూరల్: స్థానిక ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అందుబాటులో ఉన్న నూతన కోర్సు ల్లో చేరేందుకు తుది విడత అడ్మిషన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న స్లాట్ బుకింగ్, 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, 10న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఈఏపీఈసెట్ అర్హత ఉన్నా, లేకపోయినా ఈ నెల 23న అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్స్, బాలురకు హాస్టల్ వసతి ఉందన్నారు. -
పదోన్నతుల సందడి
నిరంతర పోరాటం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. –8లో u● నేటినుంచి ప్రక్రియ ప్రారంభం ● ఎస్జీటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్ఏలుగా అవకాశం ● స్కూల్ అసిస్టెంట్లకుగెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్ ● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు ● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు మహబూబ్నగర్ 791 62,724 4,650 నాగర్కర్నూల్ 808 54,152 3,513 వనపర్తి 495 38,147 2,097 జోగుళాంబ గద్వాల 448 55,289 2,064 నారాయణపేట 458 52,314 1,879 ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్సైట్లలో గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 11 వరకు.. -
గూడు.. తీరొక్క గోడు!
‘ఇందిరమ్మ ఇళ్ల’లో కొర్రీలు ●పునాది కూల్చేస్తేనే బిల్లు ఇస్తామన్నారు.. మొదటి విడతలో నా పేరు మీద ఇందిరమ్మ ఇలు్ల్ మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో నింబంధనల ప్రకారం రెండు వరుసల పునాది వేశాం. అధికారులు పరిశీలనకు రాగా.. మేం ముగ్గు వేసిన తర్వాతనే పనులు ప్రారంభించాలని.. పునాది కూల్చివేయాలని చెప్పారు. ఆ తర్వాతే ముగ్గు పోస్తామని.. మళ్లీ పునాది నిర్మించిన తర్వాత బిల్లు మంజూరవుతుందన్నారు. లేదంటే ఇల్లు రద్దు చేస్తామని చెప్పారు. చేసేదేమీ లేక పక్కనే చిన్న పూరి గుడిసె వేసుకుని అప్పులు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. – లక్ష్మమ్మ, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట బిల్లు అడిగితే స్పందించడం లేదు.. నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నాకున్న ఖాళీ స్థలంలో అధికారులు 60 గజాలు కొలిచి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేశారు. నాకు ఇద్దరు కుమారులు. దీంతో పక్కన మరింత ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణ పునాదిని విస్తరించాను. అధికారులు పరిశీలించి నిబంధనలు ఒప్పుకోవన్నారు. మేం ముగ్గు వేసిన వరకు నిర్మిస్తేనే బిల్లు మంజూరవుతుందని చెప్పారు. దీంతో వారు వేసిన ముగ్గు వరకే ఇల్లు నిర్మిస్తున్నా. గోడల పని పూర్తయింది. మొదటి బిల్లు ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. స్పందించడం లేదు. – గోపాల్, పల్లెగడ్డ, మరికల్, నారాయణపేట ● అర్హుల జాబితాలో చేర్చి.. ఆపై తీసేయడంతో ఆందోళన ● అడ్డంకిగా మారిన పలు నిబంధనలు ● 600 ఎస్ఎఫ్టీలలోపే అనుమతితో పలువురు దూరం ● పక్కా ఇళ్లలో అద్దెకున్న వారికి వర్తించని పథకం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పేద, మధ్య తరగతి కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనల కొర్రీలు లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రధానంగా 600 చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తే ఇందిరమ్మ పథకం వర్తించదని అధికారులు తేల్చిచెబుతుండడంతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా వేచి చూస్తున్నారు. మరో వైపు అర్హుల జాబితాలో చేర్చి, ఆపై తీసేయడం.. పక్కా ఇళ్లలో అద్దెకుంటున్న వారికీ మొండిచేయి చూపడంతో పలువురు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిబంధకాలుగా మారిన నిబంధనలతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇబ్బందిపడుతున్న లబ్ధిదారులు, ఆశావహుల తీరొక్క గోడుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. జిల్లాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల వివరాలు.. -
అత్తాకోడళ్లవి వెన్నుపోటు రాజకీయాలు
నారాయణపేట/ధన్వాడ: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో వెన్నుపోటు రాజకీయాలు చేశారని ఇటీవల పాలమూరులో జరిగిన సభలో ఎంపీ డీకే అరుణ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోడలు పర్ణికారెడ్డి గెలుపునకు ఎంపీ తెర వెనుక మద్దతు తెలుపారని.. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్త ఎంపీ డీకే అరుణకు తెర వెనుక మద్దతు తెలిపి కాంగ్రెస్పార్టీ ఎంపీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచిందెవరో నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అత్తాకోడళ్లు సొంత ఊరు ధన్వాడ అని చెప్పుకొంటున్నారని.. ఏడాదిన్నరలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మంత్రులు పంచాయతీ ఎన్నికలపై తలోమాట మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్పా నిర్వహణకు ముందుకు రావడం లేదన్నారు. ధన్వాడ పెద్ద చెరువులో ఒండ్రుమట్టి తరలింపు నీరు నింపేందుకా లేక జేబులు నింపుకొనేందుకా అని ప్రశ్నించారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలను పక్కనబెట్టి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థులే గెలుపొందేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులే ఉన్నారని.. కష్టపడితే ఊరూరా గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కావలి భాస్కర్ కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కో–ఆప్షన్ సభ్యుడు వాహిద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు సునీల్రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, దామోదర్రెడ్డి, నాయకులు మురళీధర్రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి -
ఎమ్మెల్సీ కవిత మాటలు బాధ్యతా రాహిత్యం
నారాయణపేట: పేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని, ఈ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నాలు మానుకోవాలని మార్కెట్ చైర్మన్ శివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం సాధించామని చెప్పే బీఆర్ఎస్ నాయకులు నేడు కానుకుర్తికి వచ్చి ప్రాజెక్టుపై రైతులను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశారని, ఇది చాలా బాధాకరమన్నారు. ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత మేధావులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు ఏళ్ల తరబడి పోరాటం చేశారని, నిర్మాణం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని.. ఊట్కూర్, పేరపళ్ల జాయ మ్మ చెరువు, కానుకుర్తి రిజర్వాయర్ల ద్వారా చెరువులు నింపే పథకమన్నారు. బాధితులకు చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా నష్ట పరిహారం అందిస్తారని.. ఎవరూ బలవంతంగా భూములు ఇవ్వడం లేదని, కోర్టు మార్గం అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ అమాయక రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. పాలమూరు–రంగారెడ్డి ద్వారా కాల్వల నిర్మాణం చేయకుండానే నీళ్లు ఇస్తామంటూ మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రైతులను మోసం చేస్తే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, దామరగిద్ద మండల అధ్యక్షుడు బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఈదప్ప, ఎండీ గౌస్, శ్రీనివాస్, శరణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికలు క్రీడల్లోనూ రాణించాలి
నారాయణపేట రూరల్: బాలికలు బాలుర కంటే ముందుండి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆకాంక్షించారు. జిల్లాకేంద్రంలో మహిళ, శిశు సంక్షేమశాఖ పరిధిలో కొనసాగుతున్న మహిళా సాధికారత కేంద్రంలో గురువారం అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి మాట్లాడారు. బేటీ బచావో.. బేటీ పడావో పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడలకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందని.. వినూత్న కార్యక్రమాలతో బాలికా విద్యను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేష్, పీఈటీ సాయినాథ్, అక్తర్ పాషా, ఖేలో ఇండియా కోచ్ హారికదేవి, మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త నర్సింహులు, జెండర్ స్పెషలిస్ట్లు అనిత, నర్సింహ, క్రికెట్ కోచ్ అజయ్, అథ్లెటిక్స్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట రూరల్: హైదరాబాద్లోని బేగంపేట, రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 2025–2026 విద్యా సంవత్సరంలో డే స్కాలర్ విధానంలో ప్రవేశానికి 01–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదని, కుల, ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, ఆధార్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని 8వ తేదీలోగా మహబూబ్నగర్ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 13న లాటరీ విధానంలో ఆరుగురిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. నేతన్నలు దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తోందని.. అర్హులైన నేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి డి.బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. నేతన్న భరోసా పథకంలో నమోదైన కార్మికులకు ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు మంజూరవుతాయని.. నేతన్న పొదుపులో నమోదైన కార్మికులు, అనుబంధ కార్మికులు ఆయా పథకాలకు అర్హులని పేర్కొన్నారు. అర్హులందరూ 5వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, గతేడాది నేతన్న బీమా పథకంలో నమోదైన చేనేత కార్మికులు దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. బలవంతపు భూ సేకరణ వద్దు నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతలలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా గత పాలకుల మాదిరిగా బలవంతంగా భూ సేకరణ చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య ప్రభుత్వాన్ని కోరారు. భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు గురువారం 17వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని వారు సందర్శించి రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం మొండిగా ఎకరా రూ.14 లక్షలకు సేకరించి రైతుల కడుపుకొట్టడం సరికాదన్నారు. భూ నిర్వాసితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని.. తప్పించుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు రైతులకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని భయపెట్టడం చూస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు. ఇకనైనా అధికారులు భూ నిర్వాసిత సంఘం ప్రతినిధులతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎడవెల్లికి చెందిన భూ నిర్వాసితులు అంజప్ప, లక్ష్మణ్, నర్సింహులు, కిష్టప్ప, హన్మంతు ,శ్రీనివాసులు, బాలప్పతో పాటు భూ నిర్వాసిత సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, మశ్ఛందర్,బాల్రాం, మహేష్కుమార్గౌడ్, ధర్మరాజు, శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, అంజప్ప తదితరులు పాల్గొన్నారు. వినూత్న బోధనతో ఆకట్టుకోవాలి నర్వ: సులభంగా అర్థమయ్యేలా వినూత్న బోధనతో విద్యార్థులను ఆకట్టుకోవాలని ఏఎంఓ విద్యాసాగర్ సూచించారు. గురువారం మండలంలోని పెద్దకడ్మూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బయోసైన్స్పై విద్యార్థులు ఆసక్తికనబర్చేలా బోధనను కృత్యాలతో చేసి చూపించాలన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాఠశాలల్లో సైన్స్పై కృత్యాలను విద్యార్థులతో చేయించేలా ప్రోత్సహించాలన్నారు. పదోతరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే ఓ లక్ష్యంతో చదివేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధికారులు భానుప్రకాష్, శ్రీనివాసులు, కాంప్లెక్స్ జీహెచ్ఎం భాగ్యలక్ష్మి, సీఆర్పీ నర్సింహులు, సైన్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
మక్తల్: రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలోని బాబూ జగ్జీవన్కాలనీ, బీసీకాలనీల్లో ఏళ్లుగా పాఠశాలలు లేకపోవడంతో మంత్రి ప్రత్యేక చొరవతో కొత్తగా మంజూరు చేయించి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా కాలనీల్లో ఏళ్లు పాఠశాలలు లేకపోవడంతో విద్యార్థులు చాలా నష్టపోయారని.. సమస్య తన దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించనున్నామని.. దండు గ్రామానికి చెందిన 9 మంది రైతులు పాఠశాల నిర్మాణానికి భూమి ఇచ్చారని, ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.833.50 కోట్లు మంజూరయ్యాయని, ఏడాదిలో పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15.13 కోట్లు మంజూరుకాగా పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అంతకుముందు విద్యార్థులకు పలుకలు పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో నెలకొన్న సమస్యలను కాలనీవాసులు మంత్రికి వివరించగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం జీఓనంబర్ 317 రద్దు చేసి సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రశాంత్కుమార్, జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, ఎంఈఓ అనిల్గౌడ్, మాజీ ఎంపీటీసీలు కోళ్ల వెంకటేశ్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, అనంద్గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూర్యచంద్ర, హైమావతి, పరందారాములు, నాగరాజు, మారెప్ప, నారాయణ, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం నిర్ణయించేందుకు గాను న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం, భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు తన భూమిని ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంతోషంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం పరిహారం అందించాలన్నారు. నిర్మాణంలో కొంత ఆలస్యమైతే గుత్తేదారులకు ప్రాజెక్టు వ్యయం పెంచే ప్రభుత్వాలు.. భూ నిర్వాసితులకు కాన్సెంట్ అవార్డు పేరుతో అతి తక్కువ పరిహారం ఎకరాకు రూ. 14లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. తరాలుగా సాగుచేసుకుంటున్న తమ భూమిని ప్రాజెక్టుకు అప్పగిస్తున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాచ్వార్, ఎర్నాగన్పల్లి గ్రామాల నిర్వాసితులు కలాల్రాజు, నగేశ్గౌడ్, బస్వరాజ్గౌడ్, రఘురెడ్డి, తిమ్మారెడ్డి, రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
సృజనాత్మకత చాటాలి
ఊట్కూరు: విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు ఇతర అంశాల్లోనూ సృజనాత్మకత చాటాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సూచించారు. బుధవారం మండలంలోని బిజ్వార్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థుల హాజరుశాతం తదితర వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు చిత్రీకరించిన చిత్రాలు, అల్లికలు తదితర క్రాఫ్ట్ కృత్యాలను ట్రెయినీ కలెక్టర్ పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు క్రీడలు, చిత్రలేఖనం, అల్లికలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు సాంకేతిక విద్యలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజయ్యగౌడ్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గౌరమ్మ, హెచ్ఎం కిషోర్కుమార్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించండి నారాయణపేట రూరల్: అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డప్ప డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బుధవారం నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు కామన్ సర్వీస్ రూల్స్ అమలుచేసి.. పదోన్నతులు కల్పించాలన్నారు. సీపీఎస్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. పాఠశాలల హేతుబద్ధీకరణ జీఓ 25ని సవరించి.. ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రిటైర్డ్ పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పీఆర్సీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో వచ్చేనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అబ్దుల్ ఖాదర్, భాస్కర్, వెంకటేశ్వర్రెడ్డి, రుద్రసముద్రం రాములు, అశోక్, ప్రతాప్, వెంకటయ్య, నర్సింహులు, జహంగీర్ తదితరులు ఉన్నారు. -
సేంద్రియానికి సై..
వివరాలు 8లో uకోస్గి: వ్యవసాయ రంగంలో వినియోగించే రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను అమాంతం పెంచేస్తుండటంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాటి వినియోగంతో ఆశించిన పంటల దిగుబడి రాకపోవడం.. వచ్చిన పంటలో నాణ్యత లోపిస్తుండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. విచ్చలవిడిగా రసాయన ఎరువుల వినియోగంతో భూసారం సైతం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సేంద్రియ విధానంలో పంటల సాగుతో పెట్టుబడులు తగ్గి నాణ్యమైన పంట దిగుబడులు వస్తాయనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు లాభాలు వస్తాయని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. పథకం ప్రధాన లక్ష్యం.. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలకు సైతం కొత్త కొత్త తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులు అధిక ధరలకు క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడం.. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగిస్తున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పంటల దిగుబడులు రాకపోవడమే కాకుండా పంటల నాణ్యత సైతం సరిగ్గా ఉండటం లేదు. రోజురోజుకూ భూమిలో సారం కూడా తగ్గిపోతోంది. ఈ పద్ధతి మరింత కాలం కొనసాగితే వ్యవసాయ పొలాలు పంటసాగుకు పనికి రాకుండా పోతాయనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు రైతులు మొగ్గు చూపేలా చర్యలు చేపట్టింది. పూర్వకాలంలో ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేసిన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ఎన్ఎంఎన్ఎఫ్ పథకానికి శ్రీకారం చుట్టింది. దశల వారీగా సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచి రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,250 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రతి క్లస్టర్ నుంచి 125మంది రైతుల ఎంపిక మట్టి నమూనాల సేకరణలో అధికారుల నిమగ్నం భూసారానికి అనుగుణంగా సేంద్రియ సాగుపై అవగాహన రసాయన ఎరువుల వినియోగం తగ్గించడమే లక్ష్యంగా ఎన్ఎంఎన్ఎఫ్ పథకం అమలు సాగు విస్తీర్ణం పెంచుతాం.. పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో ఈ పథకానికి ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరిస్తున్నాం. భూమి స్వభావం మేరకు పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్లో సేంద్రియ సాగు దశల వారీగా మరింత పెరిగే అవకాశం ఉంది. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం నారాయణపేట మండలం బొమ్మన్పాడు ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు కలెక్టర్ పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఎఫ్ఏ–1 పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తయారీకి నాణ్యమైన కూరగాయలు, వంట సరుకులు వినియోగించాలని ఆదేశించారు. బోధన సమయంలో టీఎల్ఎం ఉపయోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ● కోటకొండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీలో ఓపీ తక్కువగా నమోదు కావడం, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్క ప్రసవం కూడా జరగకపోవడం, జూలైలో రెండు మాత్రమే కాన్పులు కావడం, ఈడీడీ అప్డేట్ లేకపోవడంతో అసహనం వ్యక్తంచేశారు. 10 సబ్ సెంటర్లకు 16మంది డాక్టర్లు ఉన్నప్పటికీ.. పీఓ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. ఏఎన్సీ, టీబీ, ఎన్సీడీ కార్యక్రమాల తీరు సక్రమంగా లేకపోవడం.. మందుల నిల్వ అంతంతమాత్రంగా ఉండటం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లలో మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. టీబీ నివారణపై కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం కోటకొండలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మొదటి విడతలో 31 ఇళ్లు మంజూరు కాగా.. 28 గ్రౌండింగ్ అయ్యాయని, మిగతా వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని ఆందోళన
మద్దూరు: పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తా – చింతల్దిన్నె రోడ్డు వరకు చేపట్టనున్న రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులు ఆందోళనకు దిగారు. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు రహదారి ఇరువైపులా ఉన్న దుకాణాలు, గృహాల వివరాలతో పాటు యజమానుల ఆర్థిక స్థితి, రోడ్డు విస్తరణతో పూర్తిగా కోల్పోతున్న ఇళ్ల వివరాలు సేకరించేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బందిని బాధితులు అడ్డుకున్నారు. రోడ్డు ఇరువైపులా 35 ఫీట్ల వెడల్పుతో 78 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రోడ్డు విస్తీర్ణం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, బాధితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పుర కమిషనర్ శ్రీకాంత్ అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. ప్రజాభిప్రాయం మేరకే రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని చెప్పారు. పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. -
దేశమంతటా నాగుల పంచమి.. కందుకూరులో తేళ్ల పంచమి
నారాయణపేట: దేశమంతా నాగుల పంచమి పండుగ జరుపుకుంటే మంగళవారం నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాద్గీర్ జిల్లా గురి్మత్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ (మహేశ్వరి) అమ్మవారి సన్నిధిలో భక్తులు కొండమవ్వను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా నాగుల పంచమి రోజే ఇక్కడ తేళ్ల పంచమి జరుపుకోవడం ఆచారం. ఈ ఆలయ పరిసరాల్లో తేళ్లు మనుషులకు హాని చేయవు. అమ్మవారి మహిమ వల్లే తేళ్లు తమకు హాని చేయవనేది భక్తుల విశ్వాసం. కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపిస్తాయి. వాటిని చేతితో తాకినా.. పట్టుకున్నా..ముఖం, మెడ నాలుకపై వేసుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవు. ఇది అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా తేళ్లు కుట్టవని కొందరు విద్యావంతులు చెబుతున్నారు. -
నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలి
నారాయణపేట టౌన్: అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న పొదుపు పథకం వర్తింపజేయాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన చేనేత సంఘం ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరమగ్గాలు ఉన్న కార్మికులకు నేతన్న త్రిఫ్ట్ ఫండ్ అమలు చేయకుండా చేనేతకు సంబంధం లేని వారికి ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి నర్సింహులు తదితరులు ఉన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా దానిని ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 13లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ చేరిన నాయకుల పంచాయితీ గద్వాల: నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు హైదరాబాద్కు చేరింది. మంగళవారం జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గం నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను విస్మరించడంతో పాటు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవులు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ కమిటీలలో పదవులు అన్ని కూడా ఎమ్మెల్యే వర్గానికి ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థలలో బీ–ఫారాలను పాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని, ఇదేవిషయంపై పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఛలో గాంధీభవన్కు పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ శంకర్, డీఆర్ శ్రీధర్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, వెంకటస్వామిగౌడ్, కృష్ణ, డీటీడీసీ నర్సింహులు, ఆనంద్గౌడ్, పటేల్ శ్రీనివాసులు, ప్రకాష్, మాభాషా, రాఘవేంద్రరెడ్డిలు ఉన్నారు. -
ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలు
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీ ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నా మని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం మంత్రి హోదా లో తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన.. ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పేదలకు కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కు టుంబాలు, ఊర్లు బాగుపడి రాష్ట్రాభివృద్ధికి దోహదం అవుతాయని భావించిన ప్రభుత్వం.. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేర్లతోనే అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేద కుటుంబాలకు కొత్త రేషన్కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అధికారం ఉన్నప్పుడు హంగూ ఆర్భాటాలు ఉంటాయని.. తాను మాత్రం సామాన్యమైన జీవితాన్నే గడపాలని కోరుకుంటానని మంత్రి చెప్పారు. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని.. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజా సంక్షేమంలో రాజీ పడబోమన్నారు. ఈ ప్రాంతానికి చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. రూ. 4,500 కోట్లతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారని.. రాబోయే కాలంలో నారాయణపేట మరో తూర్పు, పశ్చిమ గోదావరి అవుతుందని మంత్రి పేర్కొన్నారు. పేటకు మొదటి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. వీటిని త్వరగా పూర్తిచేస్తే, అదనంగా మరో 3,500 ఇళ్లు మంజూరు చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి మండలంలో కొత్త రేషన్కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే, కొత్త కార్డులు వస్తాయన్నారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. తన నాన్న చిట్టెం వెంకటేశ్వరరెడ్డికి, మంత్రి వాకిటి శ్రీహరితో మంచి సత్సంబంధాలు ఉండేవన్నారు. ఈ రోజు మంత్రి పదవిలో బాబాయ్ శ్రీహరిని చూస్తే తనకు గర్వంగా ఉందన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. జిల్లా కేంద్రానికే 900 కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్, సివిల్ సప్లై అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముందుకు.. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రుణ లక్ష్యం.. నిర్దేశం
నర్వ: గ్రామీణ ప్రాంత మహిళలను సంఘటితం చేసి, ఆర్థికంగా రాణించేందుకు కృషిచేస్తున్న ప్రభుత్వం.. 2025–26 ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికను ఖరారు చేసింది. జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 262.13కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం విధించింది. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ రుణాలను ప్రభుత్వం ఏటా అందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ. లక్ష నుంచి రూ. 20లక్షల వరకు.. ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు ఉన్నాయి. అందులో అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఆయా సంఘాల సభ్యులు ఏర్పాటుచేసే వ్యాపారాల మేరకు రూ.లక్ష నుంచి రూ. 20లక్షల వరకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటున్నారు. గతంలో మహిళా సంఘాలు తీసుకున్న రుణాల్లో రకవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ వార్షిక ఏడాదిలోనూ బ్యాంకర్లు త్వరగానే రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహిళలు వ్యక్తిగతంగా రూ. 5లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు దేనికోసం రుణం తీసుకుంటున్నారో వివరించాలి. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు మహిళా సంఘం సభ్యులు పూచీకత్తుగా ఉంటారు. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తే మేలు.. మహిళా సంఘాలకు అందించే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లిస్తే సభ్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు తిరిగి వారి ఖాతాల్లో జమచేస్తోంది. అయితే నెలల తరబడి వడ్డీ బకాయి ఉంటోంది. ప్రభుత్వం ప్రతినెలా వడ్డీ డబ్బులు చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. గతేడాది ఇలా.. జిల్లాలో గతేడాది (2024–25) రుణ లక్ష్యం రూ. 262కోట్లు కాగా.. వందశాతం అచీవ్మెంట్ సాధించారు. మాగనూర్లో 79.66శాతం, కృష్ణాలో 74.89 శాతం మాత్రమే రుణ లక్ష్యం సాధించి కొంత వెనకబడ్డాయని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా వార్షిక రుణ లక్ష్యాన్ని విధించింది. ఈ మేరకు వందశాతం లక్ష్యాన్ని చేరుకునేలా దిశానిర్దేశం చేశాం. గతేడాది జిల్లాలో వందశాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. రుణ లక్ష్యంలో వెనకబడిన మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమాయత్తం చేస్తాం. – మొగులయ్య, డీఆర్డీఓ మహిళల ఆర్థిక సంఘటితమే లక్ష్యంగా ప్రణాళిక 2025–26 ఆర్థిక సంవత్సరం రూ. 262.13 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్ ఒక్కో సంఘానికి రూ.లక్ష నుంచి రూ. 5లక్షల వరకు అందనున్న రుణాలు జిల్లాలో 7,072 మహిళా సంఘాలు -
మహిళా సంఘాలు మరింత బలోపేతం
నారాయణపేట: మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన ఉత్పత్తుల విక్రయ ప్రదర్శన ఏర్పాటు చేయగా.. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల జిల్లాస్థాయి ప్రదర్శన ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తిలకించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు. మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రతి ఒక్కరికీ వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి కోస్గి: పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న ఇంజినీరింగ్ కళాశాల భవనాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి.. కళాశాలలో కల్పించాల్సిన వసతులు, బోధన సిబ్బంది, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం పట్టణ శివారులోని సర్వే నంబర్ 1737లో ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన 10.08 ఎకరాల స్థలంతో పాటు సర్వే నంబర్ 1809, 1811, 1812లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం తరగతులు సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో తరగతి గదుల, ల్యాబ్, కంప్యూటర్లు, బాలికల హాస్టల్, ఇతర సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కళాశాలలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రిన్సిపాల్ను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, పీఆర్ డీఈ విలోక్, ఆర్అండ్బీ డీఈ రాములు తదితరులు ఉన్నారు. -
వైద్యులు అందుబాటులో ఉండాలి
ఊట్కూరు: సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ సూచించారు. మంగళవారం పులిమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీ పరిధిలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట డా.సాయిబాబా, డా.నరేందర్, సిబ్బంది సురేశ్, ప్రభాకర్ ఉన్నారు. టెండర్ల ఆహ్వానం నారాయణపేట: త్వరలో జరిగే సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, స్టేషనరీ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ శైలేష్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు దరఖాస్తు ఫారాలు విడివిడిగా ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2గంటల వరకు జెడ్పీ కార్యాలయంలో లభిస్తాయని పేర్కొన్నారు. అనుభవం, అర్హత గల వారు వచ్చే నెల 2వ తేదీలోగా సీల్డ్ కవర్లో టెండర్ దాఖలు చేయాలని సూచించారు. 4న టెండర్లు ఓపెన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జెడ్పీ కార్యాలయంలో సంప్రదించాలని సీఈఓ సూచించారు. -
నష్టపరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం తగదు
నారాయణపేట రూరల్: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ అన్నారు. మండలంలోని పేరపళ్లలో మంగళవారం భూ నిర్వాసితులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడం కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తుంటే.. ప్రభుత్వం మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించేందుకు మొండివైఖరి ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులతో బలవంతంగా భూ సేకరణ చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య, నాగరాజు, సంతోష్, వెంకటేశ్, నర్సింహ, హనుమంతు, ఆశప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయికి ‘అనంతపురం’ విద్యార్థుల ప్రాజెక్టు
గద్వాలటౌన్ : 2024–25 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో గద్వాల మండలం అనంతపురం పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ వారు పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అనంతపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు జానకమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇర్ఫాన్, పవన్, ప్రశాంత్ ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనలో ప్రతిభ చాటారు. ‘మొక్కజొన్న కంకులపై పొట్టుతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కార్న్ హస్క్ పెన్స్’ అనే అంశంపై ప్రాజెక్టును రూపొందించగా.. ఆ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జులై 28 నుంచి 31 వరకు డిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం 27 ప్రదర్శనలను ఎంపిక చేశారు. ఇందులో రాష్ట్రం నుంచి గద్వాలతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల పాఠశాలలు ఉన్నాయి. అనంతపురం విద్యార్థులు జాతీయస్థాయి ఇన్నోవేషన్ మారథాన్ ప్రదర్శనకు ఎంపిక కావడంపై డీఈఓ అబ్దుల్ ఘనీ, ఎంఈఓ శ్రీనివాస్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి బాస్కర్పాపన్న, ఉపాధ్యాయలు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజావాణికి 46 దరఖాస్తులు
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్ల క్ష్యం వహించొద్దని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు
ఊట్కూరు: అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో పనిచేయాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. సోమవారం ఊట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను వనమహోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ ధనుంజయ్యగౌడ్, ఏపీఓ లక్ష్మారెడ్డి, ఏపీఎం నిర్మల, ఎంపీఓ లక్ష్మీనర్సింహరాజు ఉన్నారు. కోయిల్సాగర్లో 26 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్లో నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 26 అడుగులకు చేరింది. ఈ నెల 1న ప్రాజెక్టులో కేవలం 11 అడుగుల కనిష్ట స్థాయిలో ఉండగా అదేరోజు జూరాల నుంచి కోయిల్సాగర్ లిఫ్ట్ ఫేస్–1లో ఒక పంపును రన్ చేసి నీటిని విడుదల చేశారు. 6న తీలేరు వద్ద ఉన్న ఫేస్–2 పంపుహౌస్కు చేరిన నీటిని ఒక పంపును రన్ చేసి కోయిల్సాగర్కు విడుదల చేశారు. గత 22 రోజుల నుంచి ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితోనే ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పెద్ద వాగు ద్వారా కొంత నీరు కూడా ప్రాజెక్టులోకి చేరుతోంది. కాగా.. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు రావాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా మరో 6.6 అడుగుల నీరు వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. దరఖాస్తుల ఆహ్వానం బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు. -
‘బలవంతపు భూ సేకరణ ఆపండి’
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథ కం భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి భూ నిర్వాసితులు ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే శాసనపల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి మూడు గంటలపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఆర్డీఓ రైతులను బెదిరింపులకు గురిచేస్తూ భూ సేకరణ చేపట్టడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా, 2013 భూ సేకరణ చట్టం మేరకు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించినా తర్వాతే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తరతరాలు గా సాగుచేసుకుంటు న్న భూమిని అన్యాయంగా సేకరించొద్ద ని అన్నారు. భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ మా ట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం అందే దాక తమ పోరాటం ఆగదన్నారు. కాగా, భూ నిర్వాసితుల ఆందోళనకు పాలమూరు అ ధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మద్దతు తెలిపారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న 20 గ్రామాల నుంచి రైతు లు పెద్దఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ రావాలని.. లేదంటే తామే కలెక్టరేట్కు వెళ్తామని పెద్దపెట్టున నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రైతుల వద్దకు చేరుకోగా.. వినతిపత్రం సమర్పించారు. కా ర్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, కార్యదర్శి అంజిలయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు కాశప్ప, భూ నిర్వా సితుల సంఘం నాయకులు ధర్మరాజు, ఆంజనేయులు, హనుమంతు, అంజప్ప పాల్గొన్నారు. -
ఖర్చు పెరిగింది..
పెరిగిన ధరలతో ఎకరా వరిసాగుకు రూ. 30వేలకు పైగా ఖర్చు అవుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు అప్పులు తప్పడం లేదు. పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలుచేసి.. అదనంగా రూ. 500 బోనస్ ఇస్తుందనే ధైర్యంతో వరిసాగు చేస్తున్నాం. – వెంకట్రెడ్డి, రైతు, పూసల్పహాడ్ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం.. జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కనిపిస్తుంది. గతేడాది కంటే ఈ సారి 10వేల ఎకరాల్లో అదనంగా సాగవుతుందని అంచనా వేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ అందిస్తుండటంతో రైతులు వరిసాగుపై మక్కువ చూపుతున్నారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉంది. – జాన్సుధాకార్, డీఏఓ ● -
బీజేపీలో రగడ!
నేతల మధ్య రచ్చకెక్కినఅంతర్గత పోరు ● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలోనేబహిర్గతం ● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్? ● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు ● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం ● ‘స్థానిక’ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. ఇద్దరు చొప్పున నియామకం.. ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్తోపాటు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్సీఆర్టీ జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్ను బోధించాల్సి ఉంటుంది. ప్రైమరీ పాఠశాలల్లో.. నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు. ఏయే పాఠశాలల్లో అంటే.. పెద్దంపల్లి, వల్లంపల్లి, చిత్తనూర్, శ్రీరాంనగర్, ఊట్కూర్, మండిపల్లి, సింగారం, పీఎస్ నారాయణపేట (అశోక్నగర్,) భూత్పూర్, కచ్వార్, పరేవుల, గుడెబల్లూర్, పాల్లబుర్గ్ (నారాయణపేట)లో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు ఈసారి నుంచే ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అనుమతి జాతీయ స్థాయి సిలబస్ బోధనకు చర్యలు -
వరిసాగు జోరు
మరికల్: జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. ఎక్కడా చూసినా వరి నాడుమడులలో కరిగెట్లు చేయడం.. నాట్లు వేయడం వంటి పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమై కనిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. బోరుబావుల్లో భూగర్భజలమట్టం పెరగడంతో రైతులు వరిసాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గతేడాది వానాకాలం 1.60లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఈ ఏడాది 1.70లక్షల ఎకరాల్లో వరిసాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే 50శాతం పైగా వరినాట్లు పూర్తయ్యాయి. వరినాట్ల సమయం ముగిసే నాటికి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కూలీలకు డిమాండ్.. జిల్లాలో 15 రోజులుగా వరిసాగు జోరందుకోవడంతో కూలీల ధరలు అమాంతం పెంచేశారు. రైతులందరూ ఒకేసారి వరినాట్లు వేస్తుండటంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర మండలాల నుంచి కూలీలను రప్పిస్తుండగా.. ఎకరా నాట్లు వేసేందుకు రూ. 6వేలు డిమాండ్ చేస్తున్నారు. వారు వచ్చేందుకు రవాణా ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ. 100 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు పెరిగిన పెట్టుబడుల కారణంగా ఎకరా వరిసాగుకు రూ. 30వేల ఖర్చవుతోంది. అయితే సెప్టెంబర్ మొదటి వారం వరకు వరినాట్లు వేసే సమయం ఉండటంతో కూలీలు ఎక్కువగా ఇతర వ్యవసాయ పనులకు వెళ్లకుండా వరినాట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. బోనస్తో పెరిగిన సాగు విస్తీర్ణం.. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుండటంతో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పవచ్చు. గత యాసంగిలో బోనస్ రాకపోవడంపై రైతులు కొంత నిరాశలో ఉన్నప్పటికీ వరివైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాధార పంటలపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు కూడా తమ పొల్లాలో బోరుడ్రిల్లింగ్ చేసి వరిసాగు చేస్తున్నారు. జిల్లాలో 1.70లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అంచనా ఇప్పటికే 50శాతం పైగా నాట్లు కూలీల కొరతతో రైతుల అవస్థలు ఎకరాకు రూ. 30వేల వరకుఖర్చవుతుందని ఆందోళన -
ఆశల వాన!
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వివరాలు 8లో u●ఆనందంగా ఉంది.. వర్షాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా పెద్దగా వర్షాలు లేకపోవడంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరగలేదు. పంటలు పండుతాయో లేదో అన్న బెంగ ఉండేది. వారం రోజులుగా కురిసిన వర్షాలతో మా ఊరి చెరువు నిండింది. మరో రెండు, మూడు భారీ వర్షాలు పడితే చెరువు అలుగు పారుతుంది. ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీరు అందుతుంది. బోరుబావుల్లో నీటిమట్టం పెరుగుతుంది. – డొల్ల నరేశ్, రైతు, మాగనూర్ నారాయణపేట: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన తర్వాత వర్షాలు అంతంత మాత్రంగానే కురిశాయి. ఈ నెలలో సైతం మూడు వారాలుగా వరుణుడు కరుణించలేదు. ఒక్కానొక దశలో వర్షాల కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. పలు గ్రామాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని 769 చెరువులు, కుంటలతో పాటు భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలోకి నీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు జిల్లాలోని 5 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. జిల్లావ్యాప్తంగా చూస్తే వర్షపాతం నమోదు సాధారణమేనంటూ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. మండలాల వారీగా జూలై 27 వరకు నమోదైన వర్షపాతం ఇలా (మి.మీ.)లలో.. మండలం సాధారణం కురిసింది దామరగిద్ద 222 300 నారాయణపేట 237 218 ఊట్కూర్ 215 282 మాగనూర్ 207 222 కృష్ణా 197 227 మక్తల్ 183 190 నర్వ 202 226 మరికల్ 214 293 ధన్వాడ 235 234 మద్దూర్ 194 277 కోస్గి 249 309 గుండుమాల్ 222 239 కొత్తపల్లి 194 221 చెరువులు, కుంటలకు చేరుతున్న నీరు సంగంబండ రిజార్వాయర్లో గేట్లు ఎత్తివేత ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు చేపపిల్లలు వదిలేందుకు అనుకూలం.. జిల్లాలోని 641 చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు అనుకూలంగా మారాయి. గతేడాది వర్షాలు ఆలస్యం కావడంతో పాటు చేపపిల్లల పంపిణీ టెండర్లు సైతం ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది చెరువులు, రిజర్వాయర్లలో నీటిశాతం అనుకూలంగా ఉండటంతో త్వరగా టెండర్లు పిలిచి చేపపిల్లలను వదిలితే బాగుంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. భయంతో ఇంటిదారి.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులతోపాటు మరో 360 మంది ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు చదువుతున్నారు. ఫుడ్ పాయిజన్తో 64 మంది ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరో 30 మంది వరకు భయాందోళనకు గురై జనరల్ ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో చూయించుకున్నారు. విద్యార్థినులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత కొంతమంది తమ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయారు. చాలామంది విద్యార్థులు భయాందోళనలో ఉన్న కారణంగా వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. అమలుకాని మెనూ.. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్ రైస్, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్డ్ వెజ్ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్, గుడ్డు, స్నాక్స్ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక గడువుతీరిన పాలు, పెరుగు వల్లే ఘటన ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్ నిర్వహణ? -
నిత్యం.. కలకలం
జనావాసాల్లోకి చిరుతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇటీవల వీరన్నపేట, మొన్న టీడీగుట్ట, చౌదర్పల్లి, నిన్న మొగుళ్లపల్లి.. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక్క చోట చిరుతలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఎక్కడో అటవీ ప్రాంతంలో అవి కనపడుతున్నాయని అనుకుంటే పరవాలేదు. కానీ జనావాసాల పరిధిలోనే దర్శనమిస్తుండడంతో ప్రజలు హడలెత్తుతున్నారు. సుమారు నెల రోజులుగా ఆయా ప్రాంతాల వారికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే చిరుత పులులు కనపడడం.. తదితర చోట్ల గొర్లు, మేకలు, పశువులపై దాడి చేసిన ఘటనలే ఇప్పటివరకు ఉన్నాయి. తాజాగా కోయిల్కొండ మండలం కొత్లాబాద్, హన్వాడా మండలం రామన్నపల్లి శివారులో ముగ్గురిపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజల్లో మరింతగా భయాందోళనలు నెలకొన్నాయి. ● పట్టణ, మండల శివార్లలోని గుట్టల్లో ఆవాసం ● రోజుకో చోట దర్శనం.. గొర్రెలు, మేకలు, పశువులపై దాడి ● ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో 15 నుంచి 18 వరకు చిరుతలు ● ఫలితం లేని అధికారుల ఆపరేషన్.. భయంభయంగా ప్రజల జీవనం ● కొత్లాబాద్లో ముగ్గురిపై దాడితో స్థానికుల్లో ఆందోళన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ రేంజ్ పరిధిలో 19,132 హెక్టార్లు, మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలో 7,852 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ ఫారెస్ట్లో ప్రస్తుతం 15 నుంచి 18 వరకు చిరుతలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాలను ఆనుకుని సహజసిద్ధంగా గుట్టలు ఉండగా.. వాటిని చిరుత పులులు ఆవాసాలుగా ఏర్పరచుకున్నాయి. ముగ్గురిపై దాడితో బీ అలర్ట్.. కొత్లాబాద్ శివారులో గొర్రెల కాపరితో పాటు మరో ఇద్దరు రైతులపై చిరుత దాడి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రజలపై అవి దాడికి దిగవని.. సదరు వ్యక్తులు కుక్క అనుకుని టార్చిలైట్ వేయడం, తరముతున్న క్రమంలో చిరుత దాడికి దిగినట్లు తెలుస్తోందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో గుట్టల పరిసరాల్లో పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. అదేవిధంగా గుట్టల పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయాందోళనల మధ్య సాయంత్రం కాగాలే ఇళ్లకు తలుపులేసి భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఆహారం దొరక్క జనావాసాల్లోకి.. ప్రధానంగా అడవి పందులు, అడవి కుందేళ్లు, నెమళ్లు ఇతరత్రా వన్యప్రాణులతో పాటు అక్కడక్కడా నీటి సదుపాయం ఉండడం.. జూన్ నుంచి ఆగస్టు వరకు సంపర్క సమయం కావడంతో ఆయా గుట్టల ప్రాంతాల్లో చిరుతలు నివాసం ఏర్పరుచుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీరన్నపేట–టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టు గుట్టపై, ధర్మాపూర్ సమీపంలోని చౌదర్పల్లి గుట్టపై, నవాబుపేట మండలంలోని మొగుళ్లపల్లి గుట్టపై చిరుతలు కనిపించడమే నిదర్శనం. ఈ క్రమంలో ఆహారం దొరకనప్పుడు గుట్టల సమీపంలోని నివాస ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు, పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. ఫలితం లేని ఆపరేషన్.. ఆయా ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ చిరుతతో ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. మహబూబ్నగర్లోని వీరన్నపేట, టీడీగుట్ట మధ్య ఉన్న గుర్రంగట్టుపై జూన్ 30న చిరుత మొదటిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఈ నెల రెండో తేదీన మళ్లీ దర్శనమిచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్, విజయేందిర బోయి, ఎస్పీ జానకి స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ముందుగా రెండు, ఆ తర్వాత మరో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. తెల్లారి అదే గుట్టపై ఒకేసారి రెండు చిరుతలు కనపడ్డాయి. కానీ.. ఇప్పటివరకు అవి చిక్కలేదు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసి గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అచ్యుతాపూర్లో చిరుత ముగ్గురిపై దాడి చేయగా.. ముందు రోజే ఆ గ్రామ సమీపంలోని కొత్లాలాబాద్లో బోన్ ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకపోగా.. ముగ్గురిపై దాడి నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని చోట్ల కెమెరాలతోపాటు బోన్లు ఏర్పాటు చేశాం.. జూన్ నుంచి ఆగస్టు వరకు చిరుతల సంపర్కానికి అనుకూల సమయం. ప్రస్తుతం అవి జనావాసాల్లోకి రావడానికి కారణాలు అంతుచిక్కడం లేదు. ఆహారం, నీరు సమృద్ధిగా దొరకనప్పుడే అవి నివాసిత ప్రాంతాలకు వస్తాయి. చిరుతలు అనుకోని సందర్భాల్లో తప్ప మనుషులపై దాడి చేసిన ఘటనలు చాలా తక్కువ. గుట్టల సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా వదిలేయొద్దు. ఎక్కడికి వెళ్లినా గుంపులుగానే పోవాలి. వాటిని బంధించేందుకు అన్ని చోట్ల బోన్లు ఏర్పాటు చేశాం. కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నాం. – సత్యనారాయణ, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ చిరుత జాడ లేకుండా ఏ ఒక్క నెల లేదు.. చిరుతల సంచారంతో వణికిపోతున్నాం. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయమైతాంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఊరంతా తలుపులేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. చిరుత జాడ లేకుండా కనీసం ఏ ఒక్క నెల లేదు. గత నెలలో మా గ్రామంలోని ఓ రైతుకు చెందిన పశువుల పాకలో కట్టేసిన లేగదూడను చిరుత ఎత్తుకుని వెళ్లి రక్తం తాగి పడేసింది. – రవి, మొగుళ్లపల్లి, నవాబుపేట ●వామ్మో.. చిరుతజిల్లాలో 15 నుంచి 18 వరకు.. -
సరికొత్తగా సైబర్ మోసాలు
నారాయణపేట క్రైం: సైబర్ నేరగాళ్లు సరికొత్తగా మోసాలకు పాల్పడుతున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విలాసవంతమైన వస్తువులు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని రకరకాల మాయమాటలతో మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధానంగా గొలుసుకట్టు వ్యాపారాలకు తెరలేపుతున్నారని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్న తీరు, సైబర్ నేరాలకు ప్రజలు గురవుతున్న విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మొబైల్ లేదా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్లో అనేక కంపెనీల పేర్లతో లింక్లు పంపిస్తూ మోసాలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతే వెంటనే డయల్ 1930 లేదా సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించండి కోస్గి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ప్రకటించి.. అన్ని డీఏలతో పాటు పెండింగ్ బిల్లులు చెల్లించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం గుండమాల్, కోస్గి మండలాల్లో ఆ సంఘం నాయకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. గతంలో కొందరు భాషా పండిట్లు, పీఈటీలను అప్గ్రేడ్ చేయలేదన్నారు. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని, డీఎస్సీ 2008 కాంట్రాక్ట్ టీచర్లకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని కోరారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి అంజిలయ్య, ఆయా మండలాల ప్రతినిధులు పరందాములు, వెంకట్రాములు, ఆంజనేయులు, రాఘవేందర్, వెంకటేశ్, అర్జున్, చంద్రమౌళి, రవితేజ, సత్య కుమార్ తదితరులు ఉన్నారు. -
భూ నిర్వాసితులకు అన్యాయం
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించకుండా అన్యాయం చేస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎకరాకు రూ. 14లక్షల పరిహారం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బలవంతంగా భూ సేకరణ చేపట్టడం మంచిది కాదన్నారు. చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతవాసి రేవంత్రెడ్డి ఉన్నప్పటికీ రైతులకు మేలు జరగడం లేదని.. ఉద్యమాలు తప్పడం లేదన్నారు. భూ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ పెద్దలు పెద్ద మనసుతో ఉండాల్సింది పోయి.. పంతానికి పోవడం, రైతులను ప్రలోభాలకు గురిచేయడం, ఆర్డీఓ స్థాయి అధికారితో బెదిరింపులకు పాల్పడటం మంచిదికాదన్నారు. ఎద్దు ఏడిసిన వ్యవసాయం.. రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదనే విషయం గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్, ఉపాధ్యక్షుడు ధర్మరాజుగౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి’
మరికల్: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మరికల్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం సిబ్బంది యొక్క కిట్ ఆర్టికల్స్, మండలంలో ఎక్కువగా జరిగే కేసులపై ఆరా తీశారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ క్రమం తప్పకుండా తమ గ్రామాన్ని విజిట్ చేయాలని సూచించారు. స్టేషన్కు సంబంధించిన రికార్డులు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులతో పాటు దర్యాప్తులో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో చోరీలు జరగకుండా పెట్రోలింగ్ పకడ్బదీంగా నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది నూతన సాకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. న్యాయం చేస్తారనే నమ్మకం ఫిర్యాదుదారులకు కల్పించినప్పుడు ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐ రాము, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెక్కుల అందజేత
నారాయణపేట: జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన 36 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులను ఆర్డీఓ రామచంద్రనాయక్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు దేశంలో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో నష్టపరిహారం అందించలేదని, సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వేగంగా నష్టపరిహారం అందిస్తుందని కొనియాడారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవిస్తానని హామీనిచ్చారు. ఆర్డీఓ రామచంద్రనాయక్ మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకంలో భూములు, ఇతర ఆస్తులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. భూములు అందించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. దామరగిద్ద మండలంలోని బాపన్పల్లికి చెందిన 21 మంది రైతులకు రూ.59.99 లక్షలు, నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన 15 మంది రైతులకు రూ.52.15 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్కుమార్, తహసీల్దార్లు తిరుపతయ్య, వెంకటేష్, సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్, డీటీ బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యార్థినులకు ఇబ్బందులు రానివ్వొద్దు’
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ బాలికల హాస్టల్ (కస్తూర్బా గాంధీ టైపు–4) విద్యార్థులను గురువారం రాత్రి స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలలోని హాస్టల్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మోడల్ హాస్టల్లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతన్నామని గురువారం విద్యార్థులు రాస్తారోకో చేసి విషయం తెలిసిందే. దీంతో గురువారం రాత్రి మోడల్ హాస్టల్ను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ తనిఖీ చేశారు. మోడల్ హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేసే వరకు విద్యార్థులకు కస్తూర్బా గాంధీ పాఠశాలలో వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం మరోసారి కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. మోడల్ హాస్టల్లో కనీస వసతులు కల్పించిన వెంటనే మళ్లీ అక్కడికే తరలిస్తామని, అంత వరకు సర్దుకోవాలని సూచించారు. విద్యార్థినులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ ఫండ్ రూ.2.50లక్షలతో.. మోడల్ హాస్టల్లో మరుగుదొడ్లు, బాత్రూంల్లో లీకేజీల మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. పనులను పరిశీలించిన డీఈఈ రాములు మాట్లాడుతూ.. కల్టెకర్ ఫండ్ రూ.2.5 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభించామని, నాలుగు రోజుల్లో పూర్తి అవుతాయన్నారు. ఇందుకోసం రూ.20 లక్షలపైనే ఖర్చు అవుతుందని, హాస్టల్లో ఉన్న సమస్యలను పరిశీలించి, అంచనా వ్యయాన్ని కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ రఘునందన్, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాసులు, రాజేంద్రప్రసాద్, ఎస్ఓ గంగమ్మలు ఉన్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం అవుతుందని జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో జడ్జి మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘దేశం కోసం, 90 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివాహ వివాదాలు, ప్రమాద దావా, గృహ హింస, చెక్బౌన్స్, వాణిజ్య వివాదాలు, సర్వీస్ విషయాలు, క్రిమినల్ కాంపౌండబుల్, వినియోగదారుల వివాదాలు, రుణ రికవరీ, విభజన, తొలగింపు, భూసేకరణ, ఇతర సివిల్ కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని అన్ని కోర్టుల్లో కలిపి 2,178 కేసులను త్వరగా పరిష్కరించాలని న్యాయమూర్తులను ఆదేశించారు. అనంతరం కోర్టు కేసుల్లో మీడియేషన్పై న్యాయమూర్తులు, న్యాయవాదులకు/మధ్యవర్తులకు శిక్షణ ఇచ్చారు. సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ కోడ్ నిబంధనల ప్రకారం, పార్టీలు మధ్యవర్తుల సహాయంతో రాజీకి వచ్చే వారి కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన లాయర్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ ఆదేశాల అనుగుణంగా కోర్టు కేసుల్లో మీడియేషన్పై ప్రజలకు, కక్షిదారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్యనాయక్, జూనియర్ సివిల్ జడ్జి సాయిమనోజ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నేటినుంచి బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
పాలమూరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రామచందర్రావు నియామకం అయిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో నియోజకవర్గాల్లో పర్యటించి జిల్లాస్థాయి నేతలతో పాటు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనున్నారు. తొలిసారిగా ఉమ్మడి జిల్లాకు వస్తున్న క్రమంలో ఆయా జిల్లాలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట రామచందర్రావు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జడ్చర్లకు చేరుకుంటారు. అక్కడ పాలమూరు బీజేపీ శాఖ, బీజేపీ శ్రేణులు స్వాగతం పలుకుతారు. తర్వాత మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో అన్నపూర్ణ గార్డెన్కు చేరుకుంటారు. అక్కడ జిల్లా, నియోజకవర్గ, మండల, బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మరికల్, నారాయణపేటకు వెళ్లి.. వివిధ వర్గాల నాయకులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి గద్వాల జిల్లాకేంద్రానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రెస్మీట్, ఆ తర్వాత మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశం నిర్వహించి.. 10 గంటలకు పెబ్బేరు, ఆ తర్వాత వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాకేంద్రాల్లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాలో 2 రోజుల పాటుకార్యక్రమాలు భారీ ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు -
టెండర్లలో జాప్యమేనా?
నారాయణపేట: రాష్ట్రంలోని మత్స్యకారులు జీవనోపాధి కోసం వంద శాతం రాయితీపై చేప పిల్లల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరో వైపు చేప పిల్లలను వదిలే వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే టెండర్ల ప్రక్రియ మొదలై జులై నుంచి సెప్టెంబర్ వరకు జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని బట్టి చేప పిల్లలు వదిలేవారు. కానీ ఇప్పటి వరకు టెండర్ల నోటిఫికేషన్పై అధికారిక ఉత్తర్వులు జారీ కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు. 11,039 మందికి జీవనపాధి చెరువుల్లో చేప పిల్లలను వదిలితే జిల్లాలో 146 మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని 11,039 సభ్యులకు జీవనోపాధి కలుగుతుంది. అందులో 141 మత్స్య పారిశ్రామిక సహాకార సంఘాలలో 10,058 మంది సభ్యులు, 11 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 692 మంది మహిళా సభ్యులు ఉన్నారు. జిల్లాలో 2 రిజర్వాయర్లు, 641 చెరువులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం చేపపిల్లలు 1.02 కోట్లు, 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలను 80 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. గతేడాది నాలుగు సార్లు టెండర్లు గతేడాది జులై 8న కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించి తొలిసారి టెండర్లకు పిలుపినిచ్చింది. వ్యాపారస్తులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగస్టు 2 వరకు పొడిగించారు. రెండు, మూడో సారి అవకాశం ఇస్తూ ఆగస్టు 13వరకు టెండర్లకు ఆహ్వానించినా ఒక్క టెండర్ దాఖలు కాలేదు. నాలుగోసారి టెండర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ సెప్టెంబర్ 9 నుంచి 19 వరకు పొడిగించి పూర్తి చేసింది. కమిటీ పర్యవేక్షణలోనే.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశా నిర్దేశంతో జిల్లా మత్స్యశాఖ అధికార యంత్రాంగం చేప పిల్లలను పంపిణీ చేసే టెండర్ల ప్రక్రియ కొనసాగనుంది. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు టెండర్ల కమిటీ చైర్మన్గా అడిషనల్ కలెక్టర్, సభ్యుడు కం కన్వీనర్గా జిల్లా మత్య్సశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉంటారు. చెరువులకు జలకళ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 764 చెరువులకు జల కళ సంతరించుకుంది. చెరువుల్లో నీరు చేరుతుండడంతో కుంటలు, వాగులు పారుతున్నాయి. ఇప్పటిఏ జూరాల డ్యాం, భూత్పూర్, సంగంబండి రిజర్వాయర్లు నిండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ చేప పిల్లల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. చేప పిల్లల పంపిణీకి నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వం 641 చెరువుల్లో 1.82 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యం జిల్లాలో 146 మత్స్యపారిశ్రామికసంఘాలు పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఆసక్తి చూపని వ్యాపారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వని అధికారులు -
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ కేసుల సత్వర పరిష్కారానికి పెన్షన్ అదాలత్ నిర్వహించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిత్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అకౌంటెంట్ జనరల్ (ఏఅండ్ఈ), కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్, జీపీఎఫ్ అదాలత్లో కలెక్టర్ విజయేందిరతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు, జీపీఎఫ్ అందజేతలో ఏమైనా సందేశాలు ఉంటే అదాలత్లో నివృత్తి చేసుకోవాలని సూచించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ పత్రాలు, సాధారణ భవిష్య నిధి పత్రాలు అందిన వెంటనే వాటిని పరిశీలించి మంజూరు ఉత్తర్వులు అందిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్ ఫైనల్ విత్ డ్రాయల్ ఉత్తర్వులు అందేలా ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ పింఛన్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కు, పదవీ విరమణ చేసిన రోజున ఉద్యోగులకు పెన్షన్ ఉత్తర్వులు అందేలా చూడాలన్నారు. ఉద్యోగ బాధ్యతలతోపాటు ఆర్థిక నిర్వహణ కూడా ఇది ముఖ్యమన్నారు. అలాగే పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేసి పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వారి పెన్షన్ పత్రాలు, జీపీఎఫ్ ఫైనల్ పత్రాలు సత్వరమే ఏజీకి పంపించాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న పెన్షన్ సమస్యలను అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా.. పెన్షన్ అదాలత్లో 116 ప్రభుత్వ శాఖల అధికారులు, 50 మంది పెన్షనర్లు, 28 మంది చందాదారులు, పెన్షనర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంజూరు పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేత.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్తో కలిసి కలెక్టర్ 20 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 16 జీపీఎఫ్ ఆథరైజేషన్ ప్రొసీడింగ్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు అందజేశారు. 10 పెండింగ్ పెన్షన్ కేసులను పరిష్కరించారు. ఉదయం పెన్షన్ అదాలత్ తర్వాత మధ్యాహ్నం పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సంబంధిత సమస్యలపై నిర్వహించిన వర్క్షాప్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పెన్షన్ మంజూరు అధికారులు, పెన్షన్ జారీ, పంపిణీ అధికారులకు మార్గదర్శకాలు వివరించి అవగాహన కల్పించారు. అకౌంట్ సంబంధిత సమస్యలు చేసే తప్పుల గురించి వివరించారు. సమావేశంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (అకౌంట్స్– వీఎల్సీ) నరేష్కుమార్, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ (ఎన్ టైటిల్మెంట్స్) అభయ్ అనిల్ సోనార్కర్, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు యాదయ్య, నర్సింగ్రావు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు త్వరగా పేమెంట్ ఆర్డర్ అందజేతకు చర్యలు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్చందా పండిత్ ప్రిన్సిపల్, అకౌంటెంట్ జనరల్, కలెక్టరేట్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ పెన్షన్, జీపీఎఫ్, అకౌంట్ సమస్యలపై వర్క్షాప్ విజయవంతం -
గర్భిణి పోలీస్కు సన్మానం
మక్తల్: స్థానిక పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే మహిళా పోలీస్ చైతన్య ఏడు నెలల గర్భిణి కావడంతో ప్రసూతి సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీస్స్టేషన్లోనే సీఐ రాంలాల్, ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, రేవతితో పాటు సహచర సిబ్బంది ఆమెకు సీమంత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరలు, పూలు, పండ్లు, తినుబండారాలు పెట్టి సన్మానించారు. పండింటి బిడ్డకు జన్మనివ్వాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న గర్భిణి కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు చూపించే ఆప్యాయతను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 27న గ్రామ పాలనాధికారుల పరీక్ష నారాయణపేట: గ్రామ పాలనాధికారుల రెండో దఫా పరీక్ష ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు పాస్పోర్ట్ ఫొటోను హాల్ టికెట్లో నిర్ణీత స్థలంలో అతికించాలని సూచించారు. హాల్ టికెట్ను పరీక్షా కేంద్రం ప్రవేశ ద్వారం, హాల్లో చూపించాలని, లేని పక్షంలో అభ్యర్థులు పరీక్ష రాయడానికి అనర్హులని హెచ్చరించారు. అంతేకాకుండా అభ్యర్థి నామినల్ రోల్స్లో అతికించడానికి పరీక్షా హాల్లో ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ లేదా ఇతర గాడ్జెట్లను తమ వెంట తీసుకు రావొద్దన్నారు. జీపీఓ పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలకు 91542 83913 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చని ఆయనతెలిపారు. జములమ్మ హుండీ ఆదాయం రూ.29 లక్షలు గద్వాల న్యూటౌన్: గద్వాల ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన జములమ్మ ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురంధర్కుమార్, చైర్మన్ వెంకట్రాములు యూనియన్ బ్యాంక్ అధికారుల సమక్షంలో భక్తులు నాలుగు నెలలకుగాను హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా నగదు రూ. 29.34లక్షలతో పాటు అర కేజీ మిశ్రమ వెండి ఆలయానికి ఆదాయంగా సమకూరింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు ఇటిక్యాల: రైతులు ఉద్యాన పంటలను సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అక్బర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునగాలలో రైతు కుర్వ మల్లేష్ సాగుచేస్తున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం ఇచ్చే కూరగాయలు, ఆయిల్పాం పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూరగాయల సాగుకు ప్రభుత్వం వివిధ పధకాల నుంచి రాయితీని అందిస్తుందన్నారు. కలుపు సమస్య లేకుండా నీటిని ఆదా చేసుకుంటూ ప్లాస్టిక్ మల్చింగ్ పథకానికి 50 శాతం రాయితీ లభిస్తోందన్నారు. ఒక హెక్టార్కు రూ.20 వేల చొప్పున ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు అందిస్తామని, అదే విధంగా తీగజాతి కూరగాయలు బీర, కాకర, సొరకాయ సాగు రైతులకు శాశ్వత పందిళ్ల నిర్మాణానికి అర ఎకరానికి రూ. 50 వేలు రాయితీని కల్పించబడుతుందని అన్నారు.కార్యక్రమంలో డివిజినల్ ఉద్వాన అధికారి రాజశేఖర్, సిబ్బంది ఇమ్రానా, మహేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీతోనే పేదలకు సంక్షేమం
మరికల్: బీజేపీతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యకర్తల నుంచి సలహాలు స్వీకరించారు. అనంతరం నాగురావు నామాజీ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీలు ప్రజాధారణ కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉన్నాయన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్, 18 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా మారిందన్నారు. స్థానిక ఎన్నికల్లో మండలంలో 11 ఎంపీటీసీలతో పాటు 17 సర్పంచ్లను కై వసం చేసుకోవాలని నాయకులకు నాయకులకు దిశానిర్ధేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నర్సన్గౌడ్, మండల అధ్యక్షుడు వేణు, సురేందర్, తిరుపతిరెడ్డి, శ్రీరామ్, మోహన్రెడ్డి, వెంకటేష్, రాజేష్, రమేష్ పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థినులు
ధన్వాడ: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు రోడ్డెక్కారు. శుక్రవారం తరగతులను బహిష్కరించి కిష్టాపూర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విద్యార్థినుల ఆందోళనకు ధర్మసమాజ్ పార్టీ, పీడీఎస్యూ నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. స్థానిక కేజీబీవీ పరిధిలోని టైప్–4 బాలికల హాస్టల్లో వసతి పొందుతున్న మోడల్ స్కూల్ విద్యార్థినులు మౌలిక సదుపాయాల లేమితో అవస్థలు పడుతున్నారన్నారు. వసతిగృహాలు దయనీయ స్థితిలో ఉన్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేజీబీవీ ఎస్ఓ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మధ్య సమన్వయం లేకపోవడం మరిన్ని సమస్యలకు కారణమని ఆరోపించారు. అయితే ఆందోళన సమాచారం అందుకున్న డీఈఓ గోవిందరాజులు, జీసీడీఓ నర్మద విద్యార్థినుల వద్దకు చేరుకొని నచ్చజెప్పారు. మోడల్ స్కూల్ హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతోఆందోళన విరమించారు. ఇదిలా ఉంటే, మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురికావడం.. రోడ్డెక్కి ఆందోళన చేపట్టడంపై కలెక్టర్ సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై డీఈఓతో ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే కేజీబీవీ ఎస్ఓ గంగమ్మ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాయి ఆశ్రకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మోడల్ స్కూల్ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ -
పాలమూరులో పోకిరీలు
ఉమ్మడి జిల్లాలో ఏటా పెరుగుతున్న పోక్సో కేసులు అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో షీటీం బృందాలు విద్యార్థినులు, అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఘటనలు తీవ్రంగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నాం. అన్ని రకాల పాఠశాలల్లో పోక్సో, అమ్మాయిల రక్షణ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నాం. అమ్మాయిలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటివి మెరుగుపరుచుకోవాలి. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నష్టాలపై చైతన్యం చేస్తున్నాం. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ అండగా సఖి కేంద్రం.. వివిధ రూపాల్లో దాడులకు గురైన మహిళలకు సఖి కేంద్రం అండగా ఉంటుంది. మైనర్లపై అత్యాచారాలు, లైంగిక దాడులు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, వరకట్నం వంటి అన్ని రకాల వేధింపుల నుంచి రక్షించడానికి కృషి చేస్తోంది. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు మహిళలకు ఏదైనా సమస్య వస్తే సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తారు. అలాగే టోల్ఫ్రీ నం.181కు ఫోన్ చేసి సమస్యను చెప్పవచ్చు. – సౌజన్య, సఖి కేంద్రం కో–ఆర్డినేటర్, మహబూబ్నగర్ బాలికలకు అండగా.. ● చైల్డ్ హెల్ప్లైన్ 1098, ఉమెన్ హెల్ప్లైన్ 181, డయల్ 100 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ● షీటీంకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59365, భరోసాకు ఫిర్యాదు చేయాల్సిన నం.87126 59280 ● భరోసా సెంటర్లో మైనర్లకు రక్షణతోపాటు న్యాయం అందుతుంది. ● మహిళా, శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) సహాయం పొందవచ్చు. ● లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం–2012 (పోక్సో) కఠిన శిక్షలు పడేలా చేస్తోంది. ● సఖి సెంటర్ ద్వారా అన్యాయానికి గురైన చిన్నారులు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి, రక్షణతో,పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ● మహబూబ్నగర్ జిల్లా షీటీం విభాగానికి నెల రోజుల్లో 27 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వగా.. 25 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ‘మహబూబ్నగర్ రూరల్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు కొన్నిరోజుల నుంచి పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో ఈ నెల 4న విద్యార్థులు షీటీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పాఠశాలను పరిశీలించి జరిగిన ఘటనపై విచారణ చేయగా ఉపాధ్యాయుడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై రూరల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు.’ మహమ్మదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై జీలకరపురం కృష్ణయ్య లైంగిక దాడి చేయడంతో 376(2) ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై చార్జీషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17న ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితుడు కృష్ణయ్యకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బాలికలు, అమ్మాయిలపై వేధింపులు పెరుగుతున్నాయి. దీనికి కారకులపై కూడా పోక్సో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిలో మైనర్ అబ్బాయిలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా జులాయిగా తిరిగే కొందరు యువకులే ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు అయితే పనిగట్టుకొని పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం, వదిలే సమయానికి బైక్లపై ఉంటూ వచ్చిపోయే వారిని టీజ్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే కొందరు బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటే.. మరికొందరు సర్దుకుపోతున్నారు. ఇలాంటి వారిని అలుసుగా తీసుకొని కొందరు యువకులు మరింత రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2022 నుంచి 1,412 పోక్సో కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా మహబూబ్నగర్లో 451, నాగర్కర్నూల్లో 327, గద్వాలలో 234, నారాయణపేటలో 211, వనపర్తిలో 189 కేసులున్నాయి. నిత్యం తనిఖీలు చేస్తే.. మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ, పోలీస్శాఖ ఆధ్వర్యంలోని షీటీం బృందాలు తనిఖీలు చేపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ తనిఖీలు మరింతగా పెరగాలి. ముఖ్యంగా బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నిత్యం తనిఖీలు చేయడం చాలా అవసరం. వసతి గృహాలు, పాఠశాలలు, గురుకులాలకు వెళ్లి చిన్నారులు తమ బాధలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాలి. ఎక్కడైనా అనుమానంగా అనిపించినా.. బాలికలకు సరైన రక్షణ అందని పరిస్థితులను గుర్తించినా తగు చర్యలు తీసుకోవాలి. చిన్నప్పటి నుంచే.. ● లైంగిక వేధింపుల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ● వేధింపులకు గురైతే ఎవరి సహాయం కోరాలి.. ఎలా స్పందించాలో వివరంగా చెప్పాలి. ● ఒంటరిగా ఎక్కడికీ వెళ్దొదని, వెళ్లినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించాలి. ● శరీరంలోని ఏ భాగాలను ఇతరులు తాకకూడదనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ● ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముట్టొద్దు అని గట్టిగా అరవడం, అక్కడి నుంచి పారిపోవడం, ఎదురించడం వంటివి తెలియజెప్పాలి. 2022 నుంచి ఉమ్మడి జిల్లాలో నమోదైన పోక్సో కేసులు నమోదైన కేసులు 2022 2023 2024 2025 (జూన్) మహబూబ్నగర్ 133 116 133 69 వనపర్తి 47 46 54 42 జోగుళాంబ గద్వాల 74 73 51 36 నాగర్కర్నూల్ 86 91 105 45 నారాయణపేట 50 42 80 39 జిల్లా ఆందోళన కలిగిస్తున్న అఘాయిత్యాలు కీచకులుగా మారుతున్న పలువురు ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ విద్యార్థినులపై లైంగిక దాడులు నాలుగేళ్లలో 1,412 కేసులు నమోదు -
ఎకరాకు రూ. 30లక్షల పరిహారం ఇవ్వాలి
ఊట్కూరు: మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కోల్పోతున్న భూములకు న్యాయమైన పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహం వద్ద దంతన్పల్లి శివారు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ నష్టపరిహారాన్ని రూ.14 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదన్నారు. ఊట్కూరు మండలంలో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో ఎకరా రూ. 30లక్షల నుంచి రూ. 60లక్షల వరకు పలుకుతుందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎకరాకు రూ. 30లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు సురేందర్రెడ్డి, తరుణ్రెడ్డి, రాంరెడ్డి, డా.రాఘవేందర్గౌడ్, బాలరాజు పాల్గొన్నారు. -
రైతులకు విస్తృత సేవలు..
సహకార సంఘాన్ని ఎఫ్పీఓగా గుర్తించడం ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందనున్నాయి. వివిధ వ్యాపారాల నిర్వహణతో సంఘం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు సభ్యులకు సైతం లాభాలు వస్తాయి. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తా. – వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, మాగనూర్ వ్యాపార ప్రణాళికలు.. ఎఫ్పీఓలుగా ఎంపికై న సొసైటీల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. రైతుల నుంచి వాటాధనం వసూలు చేసి సభ్యులుగా నమోదు చేస్తున్నాం. మొదటి విడతగా ఒక్కో సంఘానికి వచ్చిన రూ. 3.16లక్షల చొప్పున వచ్చిన నిధులను ఆయా సొసైటీలకు అందజేశాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలి. – శంకరాచారి, జిల్లా కోఆపరేటివ్ ఇన్చార్జి అధికారి ● -
మరింత సహకారం!
వివరాలు 8లో uకోస్గి: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాగులో అధిక దిగుబడులు సాధించడమే కాకుండా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సా గుతోంది. ఇప్పటికే రైతులకు అనేక సేవలందిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులను సంఘటితపరిచి మరిన్ని సేవలు అందించేందుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తోంది. అందులో భాగంగా రైతులకు అశేష సేవలందిస్తున్న నాలుగు పీఏసీఎస్లను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఎంపిక చేసింది. ఎఫ్పీఓగా గుర్తించిన ఒక్కో పీఏసీఎస్కు ఎన్సీడీపీ నుంచి తొలి విడతగా రూ.3.16 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా సంఘా ల్లో ప్రత్యేకంగా కార్యాలయ ఏర్పాటుకు అవసరమై న ఫర్నిచర్, కంప్యూటర్, ఇతర సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎంపికై న సొసైటీలకు ప్రతి సంవత్సరం కార్యాలయ నిర్వహ ణ కోసం రూ.6లక్షలు, వ్యాపార నిర్వహణ కోసం మరో రూ. 5లక్షలు కలిపి మూడేళ్ల కాలంలో రూ. 33లక్షలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఎఫ్పీఓల ప్రధాన లక్ష్యం.. రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఎఫ్పీఓలు పనిచేయనున్నాయి. ముఖ్యంగా భూసార పరీక్షలు, విత్తన స్వావలంబన, సరైన ఎరువుల ఎంపిక, జలవనరుల సద్వినియోగం, సాంకేతికత వినియోగం, లాభసాటి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించడం, మార్కెట్ సౌలభ్యం, సహజ, సేంద్రియ పంటలు పండించడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం వంటి వాటికి ప్రోత్సాహం అందించనున్నారు. భూమి, నీరు, గాలి కాలుష్య నియంత్రణ, వ్యవసాయ ఆధారిత, వ్యవసాయేతర వ్యాపారాల నిర్వహణ, గ్రామీణ యువత, మహిళలు వ్యవసాయేతర ఉత్పత్తుల వారికి సహాయ పడటం, సంపద సృష్టి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీఓలను ప్రారంభించింది. ● జిల్లాలోని 13 మండలాల పరిధిలో 10 పీఏసీఎస్లు ఉన్నాయి. వీటిలో ధన్వాడ, ఊట్కూర్, మాగనూర్, తీలేరు పీఏసీఎస్లను రైతు ఉత్పత్తి సంఘాలకు ఎంపిక చేశారు. వీటికి మొదటి విడత నిధులను అందజేశారు. సొసైటీల్లో రైతుల వాటాధనం కింద ఒక్కొక్కరు రూ. 2వేల చొప్పున చెల్లించి.. 750 మంది రైతులు సభ్యులుగా చేరి రూ.15 లక్షలు జమ చేయాల్సి ఉంటుంది. రైతులకు ఎంతో ప్రయోజనం... రైతులు జమచేసిన వాటాధనం ఆధారంగా ఎస్సీడీసీ మంజూరుచేసే రుణంతో సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాలను నేరుగా రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. వివిధ వ్యాపారాల నిర్వహణ ద్వారా సంఘానికి వచ్చిన లాభాన్ని ఏటా సభ్యులకు వాటాధనం ఆధారంగా చెల్లిస్తారు. త్వరలోనే ఎఫ్పీఓలుగా ఎంపికై న సొసైటీల్లోని సభ్యులకు సంఘం ఏర్పాటు చేయడం.. ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వనున్నారు. నిధుల వినియోగం ఇలా... ప్రభుత్వం మంజూరుచేసే నిధులను ఆయా సొసైటీలు నిబంధనల మేరకు వినియోగించాల్సి ఉంటుంది. సీఈఓ వేతనం రూ. 25వేలు, అకౌంటెంట్ జీతం రూ.10 వేలకు మించకుండా ఖర్చు చేయాలి. కంప్యూటర్, ప్రింటర్, ఇతర సామగ్రి కొనుగోలు కోసం గరిష్టంగా రూ. లక్ష వరకు ఖర్చు చేయవచ్చు. కార్యాలయ భవనం అద్దె కింద ఏడాదికి రూ. 48వేలు, విద్యుత్, టెలిఫోన్ చార్జీల కోసం రూ. 12వేలు, ప్రయాణ, సమావేశాల ఖర్చుల కోసం రూ. 18వేలు, స్టేషనరీ, ఇతర ఖర్చుల కింద రూ. 12వేలకు మించొద్దు. రైతు ఉత్పత్తి సంఘాలుగాపీఏసీఎస్లు అన్నదాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చర్యలు జిల్లాలో మొదటి విడతగా నాలుగుసొసైటీల ఎంపిక వాటాధనం చెల్లించిన రైతులను సభ్యులుగా నమోదు చేస్తున్న అధికారులు -
విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట రూరల్: జిల్లాలో విద్య, వైద్యరంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నజట్రం ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. బోధన సమయంలో టీఎల్ఎం ఉపయోగించాలని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని సబ్ సెంటర్లలో మందులు అందుబాటులో ఉండాలన్నారు. టీబీ నివారణపై కార్యాచరణ పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. -
సర్వం పోయింది
పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణలో ఊట్కూర్ మండలంలోని బాపుర్ గ్రామ శివారులో తన భార్య పేరుపై ఉన్న 2.28 ఎకరాల భూమి పోతుంది. ఆ గ్రామ శివారులో ఇంకో 49 ఎకరాలు భూమి పోతుండడంతో బాపురం, తిప్రాస్పల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.14 లక్షలు సరిపోదు. వెంటనే ప్రభుత్వం బహిరంగా మార్కెట్ అనుగుణంగా తమకు భూ నష్టపరిహారం ఇవ్వాలి. – మశ్ఛందర్, జిల్లా అధ్యక్షుడు, భూ నిర్వాసితుల సంఘం న్యాయం జరిగే వరకు పోరాటం పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తాము వ్యతిరేకం కాదు. రైతులకు భూ నష్టపరిహారాన్ని న్యాయపరంగా చెల్లించాలి. ఎకరాకు రూ.14 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఊరుకోం. జిల్లాకు చెందిన సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసి ఆదర్శంగా నిలువాలి. అంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. – వెంకట్రామరెడ్డి, గౌరవ అధ్యక్షుడు, భూ నిర్వాసితుల సంఘం రూ.14 లక్షలు చెల్లిస్తున్నాం ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోతు న్న రైతులకు ఎకరానికి రూ. 14 లక్షలు చెల్లిస్తున్నాం. దీనికి రైతులు ముందుకు రాకపోతే జ నరల్ అవార్డు పాస్ చేసి ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 39 మంది రైతులు ముందుకు వచ్చి నష్టపరిహారాన్ని తీసుకున్నారు. మిగతా రైతులు సహకరించి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలి. – రాంచందర్నాయక్, ఆర్డీఓ, నారాయణపేట ● -
విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ
నారాయణపేట క్రైం: ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందిస్తే సమాజంలో పోలీసులపై గౌరవం పెరుగుతుందని, ఉద్యోగికి పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యత పెంచుతుందని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్లో బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు రవి, బాలునాయక్ హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి పొందడంతో వారు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు హోదాకు సంబంధించిన పట్టీలు అలంకరించి, వారిని అభినందించారు. అనంతరం ఎస్సీ మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్హుల్హాక్, ఆర్ఐ నరసిహులు పాల్గొన్నారు. 27న లైసెన్స్ సర్వేయర్లకు పరీక్ష నారాయణపేట: లైసెన్స్ సర్వేయర్ల కోసం ఈ నెల 27న పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. 23 నుంచి అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా అధికారిక పోర్టల్ నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రానికి చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీతో పాటు హాల్ టికెట్ ముద్రిత కాపీని తప్పకుండా తీసుకెళ్లాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://ccla.tela ngana.gov.in/employeeDetails.do ను చూడవచ్చని తెలిపారు. -
అప్పుడే.. లోకల్ ఫైట్!
ఎమ్మెల్యే అనడం కన్నా.. 1300 ఓట్లతో గెలిచిన గఫ్లత్ ఎమ్మెల్యే అంటే బాగుంటుంది. అటువంటి ఎమ్మెల్యే కల్లు తాగిన కోతి లాగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీశ్రావును విమర్శిస్తున్నాడు. సీఎం రేవంత్రెడ్డితో మెప్పు పొందాలనే ఈ విమర్శలు చేస్తున్నాడు. – దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అవినీతి చిట్టనా దగ్గర ఉంది. భారీగా ఆస్తులు సంపాదించాడు. పదేళ్లుగా నియోజకవర్గ కేంద్రాన్ని గాలి కొదిలేశాడు. – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు అక్రమంగా తీసుకున్న అసైన్డ్ ల్యాండ్ను ప్రభుత్వానికి అప్పగించాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణకు సంబంధించి పాత బస్టాండ్ వైపు నేరుగా వాహనాలు వెళ్లేందుకు మార్గం లేదు. డిజైన్ లోపంతో ఇబ్బందులు వస్తాయి. – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడ దేవాలయం భూములపై శ్వేతపత్రంవిడుదల చేయాలి. సిగ్నల్గడ్డ రోడ్డు విస్తరణ పనుల డిజైన్లో ఎలాంటి లోపాలు లేవు. పోలేపల్లి సెజ్ నుంచి నా ఖాతాకు డబ్బులు వచ్చాయని ఆరోపణలను రుజువు చేయాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి. – లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల వేళ వేడెక్కినరాజకీయం ● షెడ్యూల్ విడుదలకు ముందుగానే చేరికలకు తెరలేపిన పార్టీలు ● ముఖ్య నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు ● గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాల కసరత్తు ● సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ‘హస్తం’ ముందడుగు ● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ‘కారు’ కార్యాచరణ ● పట్టు సాధించాలనే తపనతో ‘కమలం’ -
12.13 ఎకరాలకు నష్టపరిహారం చెల్లింపు
తమ భూములను ప్రాజెక్టుకు ఇస్తామని ముందుకు వచ్చిన రైతులకు కన్సర్డ్ అవార్డు పేరిట ఎకరానికి రూ.14 లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 12.13 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఆర్డీఓ, భూసేకరణ అధికారి రాంచందర్నాయక్ చెక్కులు అందజేశారు. ముక్తల్ మండలంలోని టేకులపల్లి ఆరుగురు రైతులకు చెందిన 2.19 ఎకరాలకు సంబంధించి రూ.32.49లక్షలు, మంతోన్గోడ్లో 27 మంది రైతులకు చెందిన 8.15 ఎకరాలకు సంబంధించి రూ.1.22కోట్లు, ఊట్కూర్ మండలంలోని తిప్రాస్పల్లిలో ఆరుగురు రైతులకు చెందిన 1.27 ఎకరాలకు రూ.23.45లక్షల భూ నష్టపరిహారం చెల్లించారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
కోస్గి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రికి ప్రతిరోజు వచ్చే రోగులన రిజిస్టర్ను పరిశీలించారు. ప్రసవాల వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, రక్త పరీక్షల గది, ఈసీజీ, జనరల్ వార్డులు, రికవరీ, మందుల పంపిణీ గదులను పర్యవేక్షించారు. ఆస్పత్రిలో అందే వైద్య సేవలపై రోగులతో ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన వైద్య సిబ్బంది, మందుల ఇండెంట్ను పంపించాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. ఆస్పత్రికి ఆర్వో ప్లాంట్ అవసరమని సిబ్బంది కోరగా.. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని సూచించారు. శిథిలావస్థ పాఠశాల సందర్శన మున్సిపాలిటీ పరిధిలోని సంపల్లి ప్రాథమిక పాఠశాల భవనాన్ని పరిశీలించారు. రూ.75 లక్షలతో మంజూరైన పాఠశాల నూతన భవన పనులపై ఆరా తీశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం వేరే భవనంలో కొసాగుతున్న తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం గురించి చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీని వాసులు, ఏఈ జ్ఞానేశ్వర్ తదితరులు ఉన్నారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల పరిశీలన నారాయణపేట: జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.55 కోట్ల నిధులతో కొనసాగుతున్న కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఇప్పటి దాకా జరిగిన నిర్మాణ పనులపై ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆమె సూచించారు. భవన సముదాయ నిర్మాణ పనులతో పాటు బయట రోడ్లు, ఇతర పనులు వెంటనే ప్రారంభించి, ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రివైజ్డ్ ప్రతిపాదనలు ఉంటే పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, డీఈ శరత్చంద్రారెడ్డి, ఏఈ అభిలాష్ పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ -
కొత్త పోలింగ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు
కోస్గి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 1,200 జనాభా కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జెడ్పీ సీఈఓ శైలేశ్వర్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల బాక్స్లను భద్రపరచేందుకు పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలను బుధవారం పరిశీలినట్లు ఆయన తెలిపారు. కోస్గి మండలంలో కొత్తగా 7 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ను చేపట్టారు. 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని, మార్పులు, చేర్పులను చేపట్టే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మరణించిన వారి పేర్లను జాబితాలో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఓటరు జాబితాను సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు అందించామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ తిరుపతయ్య తదితరులు ఉన్నారు. -
పరిహారం పెంచండి సారూ..
పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణపై రైతుల నిరసన నారాయణపేట: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అరంభంలోనే రైతుల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. బహిరంగ మార్కెట్ను అనుసరించి 2013 చట్ట ప్రకారం తమకు భూ నష్టపరిహారం ఇవ్వాలని రైతులు భూ నిర్వాసితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని రోజుకో రీతిలో నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఊట్కూర్ మండలంలోని దంతనపల్లి, ఊట్కూర్, బాపూర్, మక్తల్ మండలంలోని కాట్రేవ్పల్లి, కాచ్వర్, నారాయణపేట మండలంలోని జాజాపూర్, సింగారం, పేరపళ్ల, దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి, పీడెంపల్లి తదితర గ్రామాల్లో రైతులు తమ ఇంటి వద్దే ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు. బుజ్జగింపులు భూములు కోల్పోతున్న రైతులను సముదాయించే పనిలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి నిమగ్నమయ్యారు. గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వం చెల్లిస్తున్న భూ నష్టపరిహారాన్ని తీసుకొని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. 21 గ్రామాల పరిధిలో.. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టి నాలుగు మండలాల పరిధిలో 21 గ్రామాల్లో 1957.39 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఫస్ట్ ఫేజ్లో పంప్హౌస్, సబ్స్టేషన్, ప్రెజర్ మెయిన్ కెనాల్కు 550.03 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో జయమ్మ చెరువు రిజర్వాయర్కు 337.02 ఎకరాలు, థర్డ్ ఫేజ్లో ఊట్కూర్ చెరువు రిజార్వాయర్ కింద 311.06 ఎకరాలు, ఫోర్త్ఫేజ్లో కానుకుర్తి రిజర్వాయర్కు 792.04 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు. వినూత్న రీతీలో నిరసనలు నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో 9 రోజులుగా వినూత్న రీతీలో నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. న్యాయ నిపుణులతో కమీషన్ ఏర్పాటు చేయాలని 21 గ్రామాల్లో పంచాయతీల ఎదుట ఈ నెల 22న నిరసనలు చేపట్టి పంచాయతీ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు. 25న అర్ధనగ్న ప్రదర్శన, 26న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి, 28న కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, అధ్యక్షుడు మశ్చందర్ వెల్లడించారు. రైతులను సముదాయిస్తున్న మంత్రి శ్రీహరి, పేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సహకరిస్తున్న రైతులకు చెక్కుల పంపిణీ భూ సేకరణలో 1,957 ఎకరాల గుర్తింపు 28న కలెక్టరేట్ వద్ద అన్నదాతల శాంతియుత ధర్నా -
ప్రజా పంపిణీపై పర్యవేక్షణేది?
నర్వ: ప్రభుత్వం రేషన్కార్డుదారులకు బియ్యం.. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరుకులు.. అందజేస్తుంది. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుందా.. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఏర్పడుతున్నాయా.. ఎవరైన ఇబ్బందులు పెడుతున్నారా.. ఇలా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే విజిలెన్స్ కమిటీల లక్ష్యం. అయితే, ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో గత రెండేళ్లుగా వీటిని పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేయడంలేదు అనే ఆరోపణలున్నాయి. కొత్త జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి విజిలెన్స్ కమిటీలు ఏర్పాటును పూర్తిచేయడంలో అధికారులు తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఈ కమిటీలు నేటికి ఏర్పాటు కాలేకపోవడంతో ఎలాంటి సమావేశాలు నిర్వహించక పోవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ లేక గాడితప్పుతుందని ప్రజల నుంచి ఆరోపణలున్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేదెలా.. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ కమిటీల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఒకే దేశం.. ఒకే రేషన్ విధానం అమలులో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి రేషన్ బియ్యం అందడం లేదు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం గురించి ప్రశ్నించేవారు కరువయ్యారు. క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఆసక్తి చూపుతారు. సమావేశాలు నిర్వహించకపోవడంతో సమస్యలను గుర్తించినా ప్రయోజనం ఉండటం లేదు. మూడు నెలలకోసారి విజిలెన్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు నిర్వహిస్తే సమస్యలు కొన్ని అయినా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలోని 13 మండలాల్లో 280 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో జిల్లా వ్యాప్తంగా ఎఫ్ఎస్సీ కార్డులు 1,30,736 కార్డులుండగా ఏఎఫ్ఎస్సీ కార్డులు 9,401, ఏఏపీ కార్డులు 30.. మొత్తం 1,40,217 కార్డులున్నాయి. వీరికి ప్రతి నెల 323 రేషన్ దుకాణాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో 300 మందికి పైగా డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల ఇందుకుగాను 15వ తేది వరకు బియ్యం తీసుకునేందుకు గడువు ఉంటుంది. గతంలో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందజేసేవారు. ఇప్పుడు బియ్యం మాత్రమే ఇస్తున్నారు. బియ్యం పంపిణీలో ఏమైన సమస్యలుంటే విజిలెన్స్ కమిటీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి. త్వరలో నూతన కమిటీల ఏర్పాటు విజిలెన్స్ కమిటీల నియామకం కాస్త ఆలస్యమైంది. త్వరలో జిల్లా విజిలెన్స్ నూతన కమిటీని ఏర్పాటుచేస్తాం. ఆ తర్వాత డివిజన్, మండలాల స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా ప్రజలకు సేవలు అందే విధంగా చూస్తాం. – వంగాల బాలరాజు, డీఎస్ఓ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం విజిలెన్స్ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. రేషన్ బియ్యం నాణ్యత, పంపిణీ తీరు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహారంపై చర్చించాలి. లోపాలపై చర్చించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతో సదుద్ధేశంలో అమల్లోకి తీసుకొచ్చిన విజిలెన్స్ కమిటీల నిర్వహణ నామమాత్రంగానే మారింది. గత రెండేళ్ల కిందట సమావేశాలు నిర్వహించగా ఆ తర్వాత వాటి ఊసేలేదు. జిల్లాలో పూర్తికాని విజిలెన్స్ కమిటీల ఏర్పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఊసేలేని కమిటీల నియామకం జిల్లాలో 1,40,217 రేషన్ కార్డులు -
రూ.100 కోట్ల పంట రుణాలు
పాన్గల్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రూ.100 కోట్ల పంట రుణాలు ఇవ్వనున్నట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను సకాలంలో పునరుద్ధరించుకుంటే వడ్డీ తగ్గుతుందని.. దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సహకార సంఘం పరిధిలో గ్రామానికి 10 మంది రైతులను ఎఫ్పీఓ ద్వారా వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు పెంచేందుకు సభ్యులుగా చేర్చుతామని.. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు ఉత్పత్తులు పెంచుతామన్నారు. పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక, వ్యవసాయేతర రుణాలను కూడా అందిస్తున్నామని.. కర్షకమిత్ర ద్వారా 2 నుంచి 4 ఎకరాలున్న రైతులకు ఎకరాకు రూ.4 లక్షల చొప్పున మార్టిగేజ్ రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాన్గల్ సింగిల్విండో ద్వారా రైతులకు రూ.కోటి వరకు రుణాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని అపోహలను నమ్మవద్దన్నారు. మండలంలోని కేతేపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని చెప్పారు. విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్గౌడ్, విండో డైరెక్టర్లు జైపాల్రెడ్డి, ప్రసాద్గౌడ్, బాలరాజు, బీరయ్య పాల్గొన్నారు. -
పీయూలో ఏం జరుగుతోంది?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపుల పర్వానికి తెరలేపారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ముగ్గురు సిబ్బందిపై సస్పెషన్ వేటు వేసి తమలోని అక్కసును బయటపెట్టుకున్నారు. దీంతో పాటు నాన్టీచింగ్ సిబ్బంది చేసే చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీలు వేసి భయాందోళనకు గురిస్తున్నారు. వేసవిలో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన అధికారులు.. నాన్టీచింగ్ సిబ్బందికి మాత్రం ఒక్క సెలవు ఇవ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సిబ్బందిని కనీసం అధికారులు వారి చాంబర్లోకి కూడా రానివ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం తమకు వేతనాలు పెంచమని కోరినందుకే అణచివేత ధోరణికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీయూలో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బందిలో కిందిస్థాయి వారికి రూ.6 వేల నుంచి మధ్యస్థాయి వరకు రూ.15 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. టీచింగ్ సిబ్బందిలోనూ అసంతృప్తి.. పీయూలో ప్రొఫెసర్ స్థాయి లెక్చరర్లు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకోవడంపై రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారిని దూరంగా పెట్టడం, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● ఇటీవల అన్ని హాస్టళ్లకు కలిపి ఒక రెగ్యులర్ అధ్యాపకుడిని చీఫ్ వార్డెన్గా నియమించారు. ఇందులో రెండు బాలికల హాస్టళ్లు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో బాలికల హాస్టల్కు గతంలో ఉన్న చీఫ్ వార్డెన్ (మహిళ)ను తప్పించి పురుష అధికారిని నియమించారు. బాలికల హాస్టల్లో సమస్యలు, ఇబ్బందులు వస్తే వారు ఆయనకు ఎలా చెప్పుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది. బదిలీల పరంపర.. నాన్టీచింగ్లో రెగ్యులర్ ప్రతిపాదిక పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్కు సైతం వేధింపులు తప్పలేదు. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆయనను ఎలాంటి కారణం చెప్పకుండా నేరుగా ఎగ్జామినేషన్ విభాగానికి బదిలీ చేశారు. అంతేకాకుండా మరో నాన్టీచింగ్ సిబ్బందిని సరిగా విధులకు రావడం లేదన్న కారణంతో ఫార్మసీ కళాశాలకు బదిలీ చేసి.. అక్కడి నుంచి గద్వాల పీజీ కళాశాలకు బదిలీ చేసి అక్కడి వెళ్లాలని సూచించారు. చాలా రోజులుగా వైస్ చాన్స్లర్ను కలిసి సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే కనీసం చాంబర్లోకి సైతం రానివ్వలేదని తెలిసింది. అంతేకాకుండా మరో మహిళా సిబ్బందిని ఎలాంటి కారణం లేకుండా నేరుగా ఎగ్జామినేషన్ బ్రాంచ్కు బదిలీ చేశారు. గతంలో తప్పిదాలు చేసి బదిలీపై వెళ్లిన వారిని ప్రస్తుత అధికారులు పైరవీలు చేసి తిరిగి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్కు రప్పించుకుంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరిపై విచారణ కోసం కమిటీలు వేసి, వారి వివరణ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి ధోరణితో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. నాన్ టీచింగ్ సిబ్బందిపై వేధింపుల పర్వం ఇటీవల పలువురిపై సస్పెన్షన్ వేటు చిన్నపాటి తప్పిదాలకే విచారణ కమిటీల ఏర్పాటు వేతనాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు టీచింగ్ సిబ్బందిలో సైతం అధికారుల తీరుపై తీవ్ర అసహనం -
అతిథి అధ్యాపకపోస్టులకు దరఖాస్తులు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫిజిక్స్, మాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను బోధించుటకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్వేత మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, బీఈడీ విద్యార్హత కలిగిన మహిళా అభ్యర్థులు దరఖాస్తులను నారాయణపేట కేజీవీబీలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు అందించాలని ప్రిన్సిపల్ తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నం.9912989334 సంపదించాలని, జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. నేడు విద్యా సంస్థల బంద్కు పిలుపు నారాయణపేట రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర సహ కార్యదర్శి సాయికుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు నరహరి కోరారు. విద్యారంగ సమస్యల సాధనకు చేపడుతున్న బంద్కు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి నారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చిన కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ రాష్ట నేత, హైదరాబాద్ మున్సిపల్ మాజీ మేయర్ బండా కార్తీకా రెడ్డి, రాష్ట్ర నాయకుడు సుంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం బీజేపీ జిల్లా స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ 11ఏళ్లుగా చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించేలా కృషి చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొండా సత్య యాదవ్, సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో 24వ తేదీ (గురువారం)న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఆ శాఖ అఽధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలో 500 ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మళ్లీ కనిపించిన చిరుత మహబూబ్నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను చిరుత భయబ్రాంతులకు గురిచేస్తోంది. అటవీశాఖ, పోలీసు బృందాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం రెండు బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నా చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. గత నెల 30న కనిపించిన చిరుత తరచుగా గుట్టపై ఉన్న గుండ్లు, బండరాళ్లపై తిరగాడుతూ కనిపిస్తోంది. పోలీసులు, అటవీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం దొరకడంలేదు. కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి స్వయంగా గుట్టపైకి ఎక్కి చిరుత సంచారాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపడుతున్నా బోనుకు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం సాయంత్రం టీడీగుట్ట ఫైర్స్టేషన్ ఎదురుగా గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు వెంటనే అటవీ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఎఫ్ఓ రాంబాబు, డీఎఫ్ఓ సత్యనారాయణ, సీఐ అప్పయ్య సిబ్బందితో అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటికే చిరుత తప్పించుకోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. చిరుతను చూసేందుకు కోస్గి రోడ్డుపై జనం గుమిగూడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.టీడీగుట్ట పరి సర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాల ని ఆటోల ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
నారాయణపేట: ప్రాజెక్టు కోసం భూములు ఇస్తున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్క్ వద్ద భూ నిర్వాసితుల దీక్షకు ఆ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి వాకిటి శ్రీహరి స్పందించాలని బహిరంగ మార్కెట్ ధరలకనుగుణంగా న్యాయమైన పరిహారం అందించే విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో భూనిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు. రింగ్ రోడ్డుకు, నేషనల్ హైవేలకు ఖమ్మం, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల మేర పరిహారం అందిస్తుంటే సీఎం సొంత నియోజకవర్గంలో కేవలం రూ.14 లక్షలు పరిహారం అని ప్రకటించడం సరికాదన్నారు. రైతు తన ఇష్టంతో భూమిని అమ్ముకోవ డం లేదని ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మాట ప్రకారమే భూమిని కోల్పోతున్నారని, అలాంటి రైతుకు సరైన పరిహారం అందించాలన్నారు. అన్ని విధాలుగా వెనుకబాటు గురైన నారాయణపేట ప్రాంతానికి నీరు అవసరం, ప్రాజెక్టు అవసరం, అదే సందర్భంలో ప్రాజెక్ట్కు భూమిని ఇస్తున్న రైతు బాధను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. దీక్షల్లో పేరపళ్ల భూనిర్వాసితులు కూర్చోగా.. నాయకులు నరసింహ, కెంచ నారాయణ మద్దతు తెలిపారు. -
సిబ్బంది తరఫున పోరాడతాం..
సిబ్బంది చిన్నచిన్న తప్పిదాలు చేస్తే వారిని విచారణ చేయాలి.. నోటీసులు ఇవ్వాలి.. కానీ, నేరుగా సస్పెండ్ చేయడం అనేది సిబ్బందిని వేధింపులకు గురిచేయడమే. బాధిత సిబ్బంది తరఫున మేము పోరాటం చేస్తాం. అధికారులు అణచివేత ధోరణి అవలంబించడం సరైంది కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధికారుల వ్యవహారశైలిని ఖండిస్తున్నాం. వేతనాలు పెంచకుండా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దు. – రాము, పీయూ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరినీ సమానంగా చూస్తాం.. పీజీ కళాశాలలో సిబ్బంది నేరుగా సంతకం పెట్టి వెళ్లిపోతున్నట్లు తెలిసింది. అప్పటికే సంతకం పెట్టి బయటికి వెళ్తున్న ఓ సిబ్బందిని ఎక్కడికి వెళ్తున్నావని అడిగా.. సంతకం పెట్టి బయటికి పోతే ఎలా అని సస్పెండ్ చేశాం. ఏ సిబ్బంది పైనా మాకు కోపం లేదు. అందరినీ సమానంగా చూస్తాం. వేతనాల పెంపు కోసం కృషి చేస్తున్నాం. వేసవి సెలవుల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి సెలవులు ఉండవు. గతంలో సెలవులు ఎలా ఇచ్చారో నాకు తెలియదు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకుంటాం
మక్తల్: సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ల కింద ముంపునకు గురైన భూత్పూర్, నేరడ్గాం గ్రామ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, త్వరలో ఆర్అండ్ఆర్ సెంటర్లకు స్థలాలు గుర్తించి ఏర్పాటుచేస్తామని పశుసంవర్ధక, క్రీడలు, యువజన, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడుతో కలిసి మంత్రి ముంపు గ్రామాలైన భూత్పూర్, నేరెడ్గాంను సందర్శించారు. గ్రామా ల్లో ఊట నీటితో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను, నిత్యం పాములు, తేళ్లు ఇళ్లలో సంచరించడం, గ్రా మస్తుల పరిస్థితిని వారు ప్రత్యక్షంగా పరిశీలించా రు. ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్కు మంత్రి తెలిపారు. ఈక్రమంలోనే ఓ ఇంటి వద్ద పాము కనిపించడంతో అంద రూ భయభ్రాంతులకు లోనయ్యారు. ఈక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇళ్లలో నీటి ఊట, పాములు, తేళ్లు, విష పురుగులు రావడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని వాపోయారు. 2005 సంవత్సరంలో భూత్పూర్ రిజర్వాయర్ ఏర్పాటు చేయగా దాదాపు 2వేల ఎకరాల భూము లు రైతులు కోల్పోవడం జరిగిందని, అప్పట్లో కేవ లం రూ.50వేలు ఎకరాకు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొన్నారని వాపోయారు. జీఓ విడుదలై 15 ఏళ్లు గడిచినా నేటి వరకు సమస్యలు పరిష్కరించలేదని, త్వరగా ఆర్అండ్ఆర్ సెంటర్ కోసం స్థలం చూపించి ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తారు, పోతారు తప్పా ముంపు గ్రామాల ప్రజల సమస్యలను మా త్రం ఎవరూ పరిష్కరించడంలేదని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రెండు ముంపు గ్రామాల సమస్యలను స్వయంగా తెలుసుకొనేందు కే గ్రామాలను సందర్శించామని, ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటుకు, స్థలం ఇతర విషయాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసాఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్నా యక్, తహసీల్దార్ సతీష్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటే ష్, కుర్మయ్యగౌడ్, చెన్నయ్యగౌడ్, రాఘవేందర్రెడ్డి, రఘుపతిరెడ్డి, బీంసేన్రావ్ పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడుతో కలిసి ముంపు గ్రామాల సందర్శన -
ప్రజావాణి ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట క్రైం: వివిధ సమస్యలపై పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని డీఎప్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు ఫిర్యాదుదారుల సమస్యలను డీఎస్పీ నేరుగా తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులతో అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ నిర్వహించాలని తెలిపారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పరిష్కార మార్గం చూపాలన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100ను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. -
భూ నిర్వాసితులను ఆదుకోవాలి
దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మల్రెడ్డిపల్లిలో భూములు కోల్పోతున్న రైతులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎకరాకు రూ. 30లక్షల నుంచి రూ. 50లక్షల విలువ ఉన్న భూములకు కేవలం రూ. 14లక్షలు మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, మనోహర్, మహేశ్, శివశంకర్, హుస్సేనప్ప ఉన్నారు. అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం వివిధ పోస్టుల వారీగా మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, 24వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లతో డెమో పరీక్షకు రావాలని సూచించారు. ఎంవీఎస్లో గెస్టు అధ్యాపకుల పోస్టులు.. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల వారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోగా కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 24న తేదీన నిర్వహించే డెమోకు హాజరుకావాలని సూచించారు. రామన్పాడులో 1,019 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో సోమవారం 1,019 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030, సమాంతర కాల్వ ద్వారా 700 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. రామన్పాడు జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 894, కుడి, ఎడమ కాల్వలకు 52, వివిధ లిఫ్ట్లకు 872, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి పాన్గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లి తండా సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొల గిస్తున్నారు. అయితే సంబంధిత అధికారు లు స్పందించి కేఎల్ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్మును పూర్తి గా తొలగించాలని కోరుతున్నారు. -
మరో నాలుగు..!
ఉమ్మడి పాలమూరులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు కోస్గి లేదా అయిజ.. ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పెబ్బేరు వనపర్తి జిల్లా, ఆ నియోజకవర్గంలో ఉన్న పెబ్బేరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలను దీని పరిధిలో చేరుస్తారని అంచనా. 2011 లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఆయా మండలాలు/పట్టణంలో జనాభా 2,12,253. సగటు జనాభా 2,30,064లో పదిశాతం తీసేసి పోలిస్తే.. జనాభా కొంత ఎక్కువగానే ఉంది. దీంతో పాటు పెబ్బేరు, కొత్తకోట జాతీయ రహదారి 44ను ఆనుకుని ఉండడడంతో ఈ నియోజకవర్గ ఏర్పాటు ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. మండలం జనాభా పెబ్బేరు (వనపర్తి) 48,749 కొత్తకోట (దేవరకద్ర) 59,331 శ్రీరంగాపూర్ (వనపర్తి) 19,941 వీపనగండ్ల (కొల్లాపూర్) 27,378 చిన్నంబావి (కొల్లాపూర్) 28,949 మదనాపురం (దేవరకద్ర) 27,905 మొత్తం 2,12,253 సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు పూర్తి చేసి.. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నెమరువేసుకుంటూ.. ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యే ఆశావహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. మారనున్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటు జనాభా 2,30,064 (పది శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు). దీని ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు చేరుకోనున్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జనాభా 40,53,028 (2011 లెక్కల ప్రకారం) ఉండగా.. 14 అసెంబ్లీ స్థానాలు 18కి చేరుకోనున్నాయి. ● ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు (షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్. దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట) ఉన్నాయి. పునర్విభజన చేపడితే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇందులో పెబ్బేరు/కొత్తకోట, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయమని.. కోస్గి, అయిజలో ఏదైనా ఒకటి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ ఐదు జిల్లాలుగా (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల) విడిపోగా.. పలు నియోజకవర్గాలు, మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు. మండలం జనాభా ఆమనగల్ (కల్వకుర్తి) 62,034 మాడ్గుల (కల్వకుర్తి) 49,133 తలకొండపల్లి (కల్వకుర్తి) 52,835 కడ్తాల్ (కల్వకుర్తి) 36,406 వెల్దండ (కల్వకుర్తి) 46,006 మొత్తం 2,46,414 ఆమనగల్ ఉమ్మడి మహబూబ్నగర్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది. ముఖ్యనేతల నజర్ 2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తతంగం ముగించేలా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2028 నవంబర్ లేదా డిసెంబర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు 23కు చేరుకుంటాయి. దీని తర్వాత మహబూబ్నగర్ జిల్లా 18 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవనుంది. పునర్విభజనతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆశావహులు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై దృష్టి సారించారు. తమ కుటుంబసభ్యులను రాజకీయారంగేట్రం చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నూతనంగా పెబ్బేరు, ఆమనగల్, మహబూబ్నగర్ రూరల్ ఖాయం కోస్గి లేదా అయిజలో ఏదైనా ఒక్కటి.. రాష్ట్రంలో రంగారెడ్డి తర్వాత 18 సీట్లతో రెండోస్థానంలో జిల్లా.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మారనున్న భౌగోళిక సరిహద్దులు 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ షురూ -
మహబూబ్నగర్ రూరల్
మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు (మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర) ఉన్నాయి. మరో నియోజకవర్గంగా మహబూబ్నగర్ రూరల్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మహబూబ్నగర్ పరిధిలోని మహబూబ్నగర్ రూరల్ మండలం, హన్వాడ, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, నారాయణపేట సెగ్మెంట్లోని కోయిల్కొండ, జడ్చర్ల పరిధిలోని నవాబుపేట మండలాలతో కలిపి మహబూబ్నగర్ రూరల్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి (2011 లెక్కల ప్రకారం జనాభా 2,17,942)ని మహబూబ్నగర్ అర్బన్ నియోజకవర్గం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మండలం జనాభా మహబూబ్నగర్ రూరల్ 42,523 హన్వాడ (మహబూబ్నగర్) 55,044 మహమ్మదాబాద్ (పరిగి) 34,087 కోయిల్కొండ (నారాయణపేట) 66,721 నవాబుపేట (జడ్చర్ల) 52,061 మొత్తం 2,50,436 -
ప్రైవేటులో కొంటున్నాం..
జబ్బు బారినపడే పశువులను వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే మందుల చీటి రాసి బయట తీసుకురామని అంటున్నారు. ఇదేమని అడిగితే తమ వద్ద మందులు అందుబాటులో లేవని చెబుతుండటంతో ప్రైవేటులో కొంటున్నాం. వర్షాకాలంలో పశువులకు అనేక వ్యాధులు సోకుతున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని పశువైద్య కేంద్రాల్లో మందులను అందుబాటులో ఉంచాలి. – మోహన్రెడ్డి, రైతు, మరికల్ ప్రతిపాదనలు పంపించాం.. అన్నిరకాల మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రెండేళ్ల నుంచి సరిపడా మందులు లేవనే విషయాన్ని ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధశాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మంత్రి హామీ మేరకు వారం రోజుల్లో జిల్లాకు అన్నిరకాల మందులు వచ్చే అవకాశం ఉంది. పశువులు, ఇతర జీవాలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. – ఈశ్వర్రెడ్డి, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి ● -
లేబర్ కోడ్లతో హక్కులు నిర్వీర్యం
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తుందని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.హన్మేశ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన టీయూసీఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా.. పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మికులకు పనిగంటల పెంపు జీఓ 282 జారీ చేసిందన్నారు. కార్మిక సంఘం నిర్మాణం చేసుకునే హక్కును నిర్వీర్యం చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐలో కోత విధించడం ఇలా అనేక రకాలైన నష్టాలను తెచ్చిందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి కనీస వేతనం రూ. 26వేలకు పెంచాలని, పెన్షన్ రూ. 9వేలు ఇవ్వాలని, పీఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న టీయూసీఐ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి బోయిన్పల్లి రాము, ఉపాధ్యక్షుడు కె.కాశీనాథ్, బి.నర్సింహ, సహాయ కార్యదర్శి సుశాంత్, నాయకులు పద్మమ్మ, వెంకటయ్య, నారాయణ, సలీం, సాబిర్, రఫియాబేగం ఉన్నారు. -
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
నాగర్కర్నూల్ రూరల్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు పింఛన్లు పెంచి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు రూ.6 వేలకు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రుణమాఫీపై ప్రశ్నించే ప్రతిపక్షాలు పింఛన్ పెంచకపోవడంపై ఎందుకు నిలదీయడం లేదని విమర్శించారు. పింఛన్ల పెంచాలని కోరుతూ వచ్చే నెల 13న హైదరాబాద్లో నిర్వహించ సభకు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. -
పశువైద్యం.. దైన్యం!
మరికల్: జిల్లాలో పశువైద్యం గాలిలో దీపంలా మారింది. ఓవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతుండగా.. మరోవైపు పశువైద్య కేంద్రాల్లో మందుల కొరత వేధిస్తోంది. ఏదేని జబ్బు బారినపడే పశువులు లేదా జీవాలను పశువైద్యశాలకు తీసుకెళ్తే.. వైద్యులు పరీక్షించి ప్రైవేటులో మందులు తీసుకోవాలని చీటి రాసిస్తుండటంతో పెంపకందారులపై ఆర్థిక భారం పడుతోంది. వర్షాకాలంలో పశువులు గాలికుంటు, జబ్బవాపు, గొంతువాపు.. జీవాలు గాలికుంటు, పాటురోగం ఇతర వ్యాధుల బారిన పడుతున్నాయి. పశువులకు సోకుతున్న వ్యాధుల నివారణకు అవసరమయ్యే మందులు పశువైద్యశాలల్లో అందుబాటులో లేకపోవడంతో పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులకు సోకే వ్యాధులను నయం చేసుకునేందుకు ప్రైవేటులో మందులు కొనుగోలు చేయక తప్పడం లేదని వాపోతున్నారు. పేరుకు మాత్రమే ప్రభుత్వ పశువైద్యశాలలు ఉన్నాయని.. మందుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 16 పశువైద్యశాలలు ఉండగా.. నారాయణపేట, మక్తల్లో రెండు సంచార వైద్యశాలలు ఉన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రులకు తీసుకొచ్చే పశువులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్సలు చేయడం మినహా వ్యాధుల నివారణకు అవసరమై న మందులను ఇవ్వలేకపోతున్నారు. చివరి సారిగా రెండేళ్ల క్రితం జీవాలకు నట్టల నివారణ మందులు వచ్చాయి. మళ్లీ నేటి వరకు నట్టల నివారణ మందులు రాలేదు. గతేడాది నవంబర్లో వచ్చిన అరకొర మందులతోనే పశువైద్య కేంద్రాలను నడిపిస్తున్నారు. అక్కడ లేని మందులను ప్రైవేటు దుకాణాల్లో తీసుకోవాలంటూ వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు దుకాణాల నిర్వాహకులు అధిక ధరలకు మందులు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వ్యాధులకు అవసరమైన మందులను పశువైద్యశాలలకు సరఫరా చేయాలని కోరుతున్నారు. పశువైద్యశాలల్లోవేధిస్తోన్న మందుల కొరత ప్రైవేటులో తీసుకోవాలని చీటి రాసిస్తున్న వైద్యులు ఇబ్బందులు పడుతున్న పశుపోషకులు పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల ముప్పు -
జీజీహెచ్లో గాడితప్పిన పాలన
పాలమూరు: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధ ఆస్పత్రి (జీజీహెచ్)కి గత కొన్నేళ్లుగా ఇన్చార్జీలే దిక్కు అవుతున్నారు. ఇప్పుడైతే ఏకంగా ఇన్చార్జ్ కూడా కాకుండా తాత్కాలికంగా సూపరింటెండెంట్ కొనసాగుతుండటంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ను ప్రభుత్వం నియమించకపోవడం వల్ల వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఫలితంగా గత కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో పాలన పూర్తిగా పడకేసింది. ప్రస్తుతం అనస్తీ షియా హెచ్వోడీ డాక్టర్ మాధవి తాత్కాలిక సూప రింటెండెంట్గా కొనసాగుతుండగా.. దీనిపై ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాకపోవడం గమనార్హం. ● అటు పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేకపోవడంతో తాత్కాలిక బాధ్యతలకే పరిమితం అవడం వల్ల జనరల్ ఆస్పత్రి రోజురోజుకూ అధ్వానంగా తయారవుతోంది. పూర్తిస్థాయి, కాంట్రాక్టు వైద్యులు, హౌజ్ సర్జన్లు, ఎస్ఆర్లు, పరిపాలన సిబ్బంది ఎవరూ సమయపాలన అసలు పాటించడం లేదని విమర్శలు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా ఓపీ ఉదయం 9 గంటలకు మొదలు కాగా 10 గంటలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసి, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రైవేట్ క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. ప్రధానంగా ఏ విభాగం ఎక్కడ ఉంది.. ఏ సేవలు ఎక్కడ అందుతాయో.. అని చెప్పడానికి ఉపయోగించే హెల్ప్డెస్క్ ఏమాత్రం అందడం లేదు. దీంతో రోగులు, ఆడ్మిట్ అయిన వారి కోసం వచ్చిన అటెండర్లు పలు రకాల విభాగాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇక పారిశుద్ధ్యం అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వర్షం వస్తే వార్డులలో నీరు రావడం, సక్రమంగా శుభ్రం చేయకపోవడం, టాయిలెట్స్ అయితే దుర్వాసన వస్తున్నాయి. బయో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేక దుర్వాసన వెదజల్లుతోంది. వైద్యుల సమయపాలనపై దృష్టిపెట్టని వైనం -
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
మద్దూరు: రైతులకు మద్దతు ధర తదితర ఆంశాలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మద్దూరులో ఏఐయూకేఎస్ సంఘం డివిజన్ స్థాయి ప్రథమ మహాసభకు హాజరై ప్రసంగించారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా నల్లచట్టాలను అమలు చేస్తోందన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలను పార్లమెంట్లో ఆమోదం తెలిపిందన్నారు. వీటన్నింటిపై పోరాటం చేయడానికి రైతులను సంఘటితం చేయాలని సూచించారు. ఈ మహాసభలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో మార్కెట్ ధర రైతులకు చెల్లించాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లును రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల గ్యారెంటీ చేసి అమలు చేయాలని తీర్మానించారు. అనంతరం ఏఐయూకేఎస్ నారాయణపేట డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా నారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొండ నర్సిములు, సహాయ కార్యదర్శిగా బాలకృష్ణతో పాటు మరో 10 మందిని కార్యవర్గు సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ, సంఘం నాయకులు సిద్దు, రాములు, తాయప్ప, నర్సిములు, అంజి, శ్రీహరి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
సృజనాత్మకత వెలికితీయాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ ముఖ్యంగా నాణ్యత, సైన్స్ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి. గణితం, సామాన్యంపై దృష్టిపెట్టేలా సంబంధిత టీచర్లు చొరవ చూపాలి. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి పిల్లల ఇన్నోవేషన్లను స్వీకరించాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట కొత్త ఆలోచనలతో రావాలి గత సైన్స్ఫేర్లో ప్రదర్శించిన ప్రయోగాలు వద్దు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించాం. ఇప్పటికే గైడ్ టీచర్లకు అవసరమైన సలహాలు అందించాం. త్వరలో టీచర్లకు అవగాహన కల్పిస్తారు. తర్వాత విద్యార్థులకు గైడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. సందేహాలు ఉంటే డీఎస్ఓను సంప్రదించండి. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట -
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం
నర్వ: స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు వచ్చిన పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు. ప్రజాసమస్యలపై ఎల్లప్పుడు పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నేటికి ఎలాంటి ప్రజాధారణ తగ్గలేదన్నారు. కార్యకర్తలంతా వెన్నంటి ఉండి గ్రామాగ్రామాన స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఎలాంటి అధైర్యపడకుండా ఇప్పటి నుండే కష్టపడితే రాబోవు రోజులు మనవేనన్నారు. మక్తల్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం తప్పదన్నారు. సమావేశంలో పార్టీ నాయకురాలు చిట్టెం సుచరితరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ నర్సింహాగౌడ్, రాజవర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మెన్ లక్ష్మన్న, మాజీ ఎంపీపీ జయరాములుశెట్టి పాల్గొన్నారు. రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి స్టేషన్ మహబూబ్నగర్: ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగా పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్కు రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ ద్వారా చదువులో ముందంజలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన పేద రెడ్లకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, సహధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు/మన్ననూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, జు వాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్, పీహెచ్డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ● అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు–1, కామర్స్–2, ఇంగ్లిష్–1, హిస్టరీ–1, ఎకనామిక్స్–1, పొలిటికల్ సైన్స్–1, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 ఖాళీల భర్తీకి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ తెలిపారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సెట్, నెట్, స్లేట్, పీహెచ్డీ కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 85228 73729, 83319 58940 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
‘పాలమూరు’ కుంభకోణంలో సీఎం పాత్ర
నారాయణపేట రూరల్: కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని, అందులో నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి పాత్ర ఉందని బిజెపి రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటివరకు మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క నియోజకవర్గానికి తాగు, సాగునీరు రాలేదని అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో కుంభకోణం దాగి ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బయటికి తీయడం లేదని, అందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. రెండు రోజుల క్రితం కొల్లాపూర్ సభలో సైతం పాలమూరు ప్రాజెక్టుపై సీఎం మాట్లాడకపోవడం మరింత అనుమానాలకు తావిస్తుందన్నారు. అపెక్స్ కమిటీలో నాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సంతకం చేసి తెలంగాణకు అన్యాయం చేశారని, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సరియైన వాదన వినిపించకపోవడంతో రాష్ట్రానికి నష్టం జరిగిందన్నారు. నీటి వాటా పంపకంలో తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి జలమండలి సమావేశం నిర్వహించి ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించిందన్నారు. అలాగే, జీవో 69 అమలులో భూములు కోల్పోతున్న రైతులకు మరోచోట భూమిని కేటాయించాలని, న్యాయమైన నష్టపరిహారం అందించాలని కోరారు. అంతేగాక, జిల్లా కేంద్ర ప్రజలకు వైద్య సేవలను దూరం చేయడం గర్హనీయమన్నారు. వారంలో ఆసుపత్రి విషయంలో చర్యలు తీసుకోకపోతే మరో ఆందోళన మొదలవుతుందని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రతంగపండు రెడ్డి, జిల్లా అధ్యక్షులు కొండా సత్తి యాదవ్, మాజీ అధ్యక్షులు పగుడాకుల శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ పాల్గొన్నారు. -
లయన్స్ క్లబ్ సేవలు గ్రామాలకు విస్తరించాలి
దామరగిద్ద: లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తతం చేయాలని, సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగాలని రాష్ట్ర పోలీస్, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గడిమున్కన్పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భీమయ్యగౌడ్ అద్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతం చేయాలని సూచించారు. అనంతరం దామరగిద్ద మండల నూతన లయన్స్క్లబ్ అధ్యక్షుడిగా బసిరెడ్డి, కార్యదర్శి గా ఎం.అశోక్, ట్రెజరర్గా తిప్పణ్ణ లను ఎన్నుకున్నారు. సేవల్లో భాగంగా దామరగిద్ద జీపీఎస్, కాన్కుర్తి పాఠశాలకు వాటర్ ట్యాంకును, బాపన్పల్లికి పలువురి పేదలకు దుప్పట్లు, గడిమున్కన్పల్లి గ్రామ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరినారాయణ బట్టడ్, ఉమాకాంత్, రవికుమార్గౌడ్, భీమయ్యగౌడ్, రవీంద్రనాథ్, వెంకట్రెడ్డి, బసిరెడ్డి, జనార్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోయిల్సాగర్లో పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర/ చిన్నచింతకుంట: కోయిల్సాగర్లో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 24.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి కేవలం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు పంపులు రన్ చేస్తే 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. దీంతో కాల్వల ద్వారా నీటిని వదిలిన ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో బండర్పల్లి చెక్డ్యాం నుంచి ఆదివారం అలుగు పారింది. చెక్డ్యాం వల్ల చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఏ గఫార్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగులో కవిగా రాణించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నల్లమల రత్నాలు, ప్రజాప్రస్థానం, మేలుకొలుపు తదితర రచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మకట శతకంలో వచన కవిత్వాన్ని రచించడం చాలా అరుదు అని.. అలాంటి వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయన ముందు వరుసలో ఉంటారన్నారు. ఇలాంటి కవులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవులను డాక్టర్ బాలనారాయణ శాలువాలతో సన్మానించారు. కవులు వల్లభాపురం జనార్దన్, కర్నాటి రఘురాములుగౌడ్, ముచ్చర్ల దినకర్, వనపట్ల సుబ్బయ్య, సాయిజ్యోతి, కాటమరాజు నరసింహులు, ఎదురవల్లి కాశన్న, ఖాజా మైనొద్దీన్, కందికొండ మోహన్ పాల్గొన్నారు -
కోట మైసమ్మ బోనాలు
కోస్గి: పట్టణంలోని మున్నూర్ వీది పాశం గేరిలో ఉన్న కోట మైసమ్మ గ్రామదేవతకు ఆదివారం బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు నిర్వహించడం అనవాయితీ. ఈ సందర్భంగా కాలనీకి చెందిన మహిళలు, యువతులు ప్రత్యేకంగా వేప కొమ్మలు, పసుపు, కుంకుమలతో అలంకరించిన మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యం వండి బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు. డప్పుల మోతల మధ్య శివసత్తుల పూనకాలతో నిర్వహించిన బోనాలు ఎంతగానో అలరించాయి. ఇదే క్రమంలో పట్టణంలోని హరిజన్ వాడ మైసమ్మ బోనాల వేడుకను మహిళలు, యువతులు ఘనంగా నిర్వహించారు. -
రైతులకు అందుబాటులో ఎరువులు
మాగనూర్: రైతులకు అవసరమైన మేర వరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు రైతు ఆగ్రోస్ సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కోనుగోలు చేయాలని అన్నారు. యూరియా దొరకదు అనే తప్పుడు సమాచారాల వల్ల చాలా మంది రైతులు ముందస్తుగానే రెండవ దఫా, మూడవ దఫా ఎరువులు కొని దాచుకుంటున్నారని అన్నారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే కొనుగోలు చేయాలని సూచించారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అన్నారు. ప్రస్తుతం పీఏసీఎస్ నందు 1500 బస్తాలు, ఆగ్రో నందు 500 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, ప్రతి రోజు కూడా వస్తూ ఉంటుందని, రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్, చైర్మన్ వెంకట్రెడ్డి, ఆగ్రో మహేష్ పాల్గొన్నారు. -
ఆలోచించండి.. ఆవిష్కరించండి
నారాయణపేట రూరల్: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది. మూస విధానాలు, ఒకరిని చూసి మరొకరు కొద్దిపాటి మార్పులతో ప్రయోగాలు అనుకరించకుండా ఉండేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టింది. కోవిడ్ సమయంలో విద్యార్థులకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఒక వేదికను తయారు చేసింది. ఇందులో అన్ని ప్రభుత్వ, అనుబంధ విద్యా సంస్థల్లో చదువుతున్న ఆరు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇద్దరు విద్యార్థులతో కూడిన జట్టుతో ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులకు మించకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ ప్రయోగాలకు నోచాన్స్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ స్కిల్ ఇండియా, మేకింగ్ ఇండియా, స్వచ్ఛ భారత్, మరి కొన్ని అనే నాలుగు విభాగాల్లో దరఖాస్తులు తీసుకుంటుంది. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్గా అనుకరణలు వస్తున్నాయని గుర్తించారు. విద్యార్థులు, సంబంధిత సైన్స్ టీచర్లు ఇవి కొత్తగా కనిపించినా సంస్థ మాత్రం చాలా సులువుగా గుర్తిస్తుంది. దీనికితోడు గతంలో ప్రదర్శించిన వాటికి అనుమతి ఉండదని చెబుతోంది. ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో.. నిరుపయోగంగా ఉన్న బ్యాటరీల ద్వారా విద్యుత్, శక్తి ఉత్పతి, వర్షపునీటి వినియోగం, నీటి నిల్వ స్థితి– హెచ్చరిక యంత్రాలు, వంటగ్యాస్, అగ్నిప్రమాదాలు– అప్రమత్తం చేసే యంత్రాలు, వర్మీ కంపోస్టు, లెటర్బాక్స్, అలారం, బిందుసేద్యం, సెన్సార్ ఆధారిత ప్రదర్శనలు, అప్రయత్నంగా వీధిదీపాల నిర్వహణ, ఆహార పదార్థాల కల్తీ గుర్తింపు, కార్బన్ సైకిల్, ఆహార గొలుసు, మానవ శరీర అవయవాల ప్రదర్శన, నక్షత్ర మండలం, జలశుద్ధి వంటి పాఠ్యపుస్తకాలు, యూట్యూబ్లలో చూసిన ప్రదర్శనలు అనుమతించరు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత ప్రయోగాలు ఉండాలని నిబంధన ఉంది. మెరుగైన కొత్త వాటికి మాత్రమే అర్హత ఉంటుంది. పాల్గొనేందుకు అర్హతలు ● ప్రభుత్వ, ప్రైవేటు, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ● యూపీఎస్ నుంచి రెండు, హైస్కూల్ నుంచి ఐదు, కళాశాల నుంచి రెండు చొప్పున ప్రాజెక్టులు గరిష్ఠంగా ఆన్లైన్ చేయవచ్చు ● ప్రతి తరగతి ఒక సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి నూతన ఆవిష్కరణలకు‘ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్’ వేదిక విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి.. నైపుణ్యం పెంపొందించడమే లక్ష్యం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి పాఠశాల నుంచిప్రాజెక్టులకు ఆహ్వానం ఉమ్మడి జిల్లాలో గతేడాది 3,658 దరఖాస్తులు -
సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్దే..
మక్తల్: రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య సహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మక్తలో నూతన లభ్ధిదారులకు రేషన్ కార్డులను మంత్రితోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 7వేల రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో 2.37లక్షల మందికి 74,013 రేషన్కార్డులు ఉండగా వారికి 622 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పంపిణి చేసే వారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్తరేషన్కార్డులతో మొత్తం సంఖ్య 81,114 చేరిందని, 3 లక్షల మందికి ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రేషన్కార్డుల్లో మొత్తం 43,497 మంది పేర్లను నమోదు చేశామని, కొత్త కార్డులకు బియ్యానికిగాను ఆదనంగా రూ.5.6 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్రెడ్డి సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. ఇదిలాఉండగా, పట్టణంలో నూతన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఒక్క రేషన్ డీలర్ హాజరుకాకపోవడం ఏమిటని డీలర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయపై డీలర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్కుమార్, సురేష్, శ్రీనివాసులు, ఎంపిడిఓ రమేష్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, కట్టసురేస్, వెంకటేస్, రవికుమార్, ఫయాజ్, నూరోద్దిన్, డిటి పుష్పలత, ఆర్ఐ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. మహిళా సంక్షేమానికి కృషి మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇందిరమ్మ సంబరాలకు మంత్రి, కలెక్టర్ ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అమరచింత, నర్వ, ఊట్కూర్, మహిళా సంఘాలకు రూ.1.8 కోట్ల చెక్కును అందజేయడంతోపాటు, మూడు ఇందిరా మహిళా శక్తి సంఘాలకు చెందిన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆత్మకూర్, మక్తల్ మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్ కొరకు రూ.6 కోట్ల చెక్కు అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే నియోజక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని తెలిపారు. డీఆర్డీఓ మొగులప్ప, డీపీఎం జయన్న, మాసన్న, గోవిందు, ఏపిఎం వనజ, సీసీలు హన్మంతు, శ్రీనివాసులు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి 7వేల నూతన రేషన్కార్డులు మంజూరు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
వంద శాతం ఉత్తీర్ణతపై శ్రద్ధ వహించాలి
కోస్గి రూరల్: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని, పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. శనివారం గుండుమాల్ ఆదర్శ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడుతూ.. ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు తమ బాధ్యతలు గుర్తిస్తే విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుందన్నారు. మాడల్ స్కూళ్లలో రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారని కాని పదో తరగతి ఉత్తీర్ణత 85 శాతం మాత్రమే వచ్చిందని, కేజీబీవీలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు 99 శాతం ఫలితాలను రాబడుతున్నారని వివరించారు. పాఠశాలలోని ల్యాబ్ల నిర్శహణ, పరిసరాలు పరిశభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించాలన్నారు. -
ఆరునెలల క్రితం దరఖాస్తు..
కొత్త రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేయడం.. అందులో మా పేర్లు ఉండటం సంతోషంగా ఉంది. కొత్త కార్డులో ముగ్గురి కుటుంబ సభ్యులను నమోదు చేశారు. ఇకపై రేషన్ బియ్యం వస్తాయనే నమ్మకం వచ్చింది. – కుటుంబ సభ్యులతో రామకృష్ణ, మరికల్ త్వరలోనే అందరికీ పంపిణీ.. ప్రస్తుతం ఆన్లైన్లో కొత్తగా మంజూరైన రేషన్కార్డు పత్రాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త కార్డులను ప్రింట్ చేసేందుకు పై నుంచి అధికారికంగా ఆదేశాలు అందలేదు. త్వరలోనే మంత్రి వాకిటి శ్రీహరిచే అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. – బాల్రాజ్, డీఎస్ఓ ● -
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధుల నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షలను తప్పకుండా చేసుకొని వైద్యుల సూచన మేరకు తగిన మందులు వాడి వ్యాధి నుంచి బయటపడాలి. – సత్యప్రకాష్రెడ్డి, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి వ్యాధుల నివారణే లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ముక్తభారత్అభియాన్ ద్వారా తీవ్రమైన వ్యాధుల నివారణే లక్ష్యంగా వైద్యశిబిరాలు చేపట్టాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 40 వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగామనతో పాటు చైతన్యం కల్పించాం. వ్యాధుల తీవ్రతను బట్టీ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేసి చికిత్స అందిస్తున్నాం. కేవలం టీబీ వ్యాధే కాకుండా హెచ్ఐవీ, ఎనిమియా, సుఖ వ్యాదు లు, బీపీ, షుగర్ వ్యాధుల నిర్ధారణ, చికిత్సలు అందిస్తున్నాం. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్య్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – జయచంద్రమోహన్, డీఎంహెచ్ఓ ● -
నిషేధిత ప్లాస్టిక్ వాడితే చర్యలు
కోస్గి రూరల్: నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలలో నిషేధిత ప్లాస్టిక్ వాడితే జరిమానాతో పాటు చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు. 100 రోజులు కార్యచరణలో భాగంగా శుక్రవారం పట్టణంలోని హోటల్స్, బెకరీలు, వ్యాపార సముదాయాలలో నిషేధిత పాస్టిక్ కవర్ల నియంత్రణ చర్యలను చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలు దుకాణాలౖపై దాడులు చేసి జరిమానా విధించారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సంచులను వాడాలని, తమ టీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. పలు వ్యాపార సముదాయాలకు నూతన ట్రేడ్ లైసెన్స్లను జారీ, రెన్యూవల్ చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టలలో వేయాలని, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అనిల్కుమార్, హెల్త్అసిస్టెంట్ మొహిన్బాషా, మున్సిపల్ అదికారులు, మెప్మా సిబ్బంది , కార్మికులు ఉన్నారు. బతికున్నా.. రికార్డుల్లో చంపేశారు! మక్తల్: బతికున్న వృద్ధురాలిని మృతిచెందిందని పింఛన్ల జాబితా నుంచి తొలగించిన ఘటన మండలంలోని జక్లేర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జక్లేర్ గ్రామానికి చెందిన ఫాతిమాబేగం వృద్ధాప్య పింఛన్ పొందుతుంది. ప్రతి నెల జకే్ల్ర్ పోస్టాఫీస్కు వెళ్లి పింఛన్ తీసుకునేది. గత రెండు నెలలుగా ఆమెకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వడంలేదు. ఇదే విషయమై ఫాతిమాబేగం శుక్రవారం జక్లేర్ పోస్టాఫీస్కు వెళ్లి అక్కడి సిబ్బందితో ఆరా తీసింది. తనకు రెండు నెలల నుంచి పింఛన్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేయగా.. అక్కడి సిబ్బంది రికార్డుల్లో నువ్వు చనిపోయావని ఉందని, అందుకే పింఛన్ రాలేదని చెప్పారు. దీంతో తాను బతికే ఉన్నా ఎలా పేరు తొలగిస్తారంటూ రోదిస్తూ అక్కడి నుంచి వచ్చింది. అనంతరం విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా రికార్డులు పరిశీలించి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటానని, పింఛన్ వచ్చేలా చూస్తానని అన్నారు. ఓపెన్ స్కూల్ను సద్వినియోగం చేసుకోవాలి నారాయణపేట రూరల్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా టెన్త్, ఇంటర్ చదువుకునే వెసులుబాటు ఉందని, రెగ్యులర్గా విద్యాలయానికి రానివారు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ రామకృష్ణ సూచించారు. పట్టణంలోని శ్రీ సాయి కళాశాల కేంద్రంలో శుక్రవారం ఓపెన్ స్కూల్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులకు, ఇంటి దగ్గరే ఉండే గృహిణులకు ఓపెన్ స్కూల్ ఎంతో ఉపకరిస్తుందని, ఇంటర్ ఏడాదిలోనే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. తమకు ఇష్టమైన ఐదు సబ్జెక్ట్ లను ఎంపిక చేసుకోవచ్చని, రెగ్యులర్ సర్టిఫికెట్ తో సమానమని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో చదువుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 99080 69789, 94419 06514లను సంప్రదించాలన్నారు. బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి కోయిల్కొండ: మహిళలు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకొని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి షణ్ముఖచారి అన్నారు. మండలంలోని రామన్నపల్లితండాలో నిర్వహించిన నాబార్డు ఫౌండేషన్ డేలో ఆయన రైతులు, గ్రామస్తులకు పండ్ల మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు నాబార్డు ఆధ్వర్యంలో స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, డెయిరీ, పౌల్ట్రీ తదితర రంగాల్లో రుణాలు పొందడానికి ముద్ర యోజన ద్వారా అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాబార్డు అమలు చేస్తున్న వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి సహకార సంఘాల ఆవశ్యకత, సహకార భావనపై ప్రజలను చైతన్యం చేశారు. సామాజిక భద్రత పథకాలు, బ్యాంక్ రుణ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. బ్యాంకు అధికారులు పథకాల అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రయోజనా లపై ప్రజలకు సరళమైన భాషలో వివరించారు. -
న్యాయమైన పరిహారం అందివ్వాలి
నారాయణపేట: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా నష్ట పరిహారం అందివ్వాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం భూనిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు, వెంకట్రామిరెడ్డి జిల్లా అధ్యక్షుడు మశ్చందర్, సిఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రాం దీక్ష చేపట్టిన భూ నిర్వాసితులకు పూలమాలలు వేసి మాట్లాడారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన మన ప్రాంతానికి ప్రాజెక్టు తప్పనిసరి కాని ప్రాజెక్టు కోసం భూములిస్తున్న భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.14 లక్షల పరిహారం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆ డబ్బుతో ఎకరం భూమి ఎక్కడ కూడా కొనలేని పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టుతో నీటి వసతి పెరగడం వలన భూముల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. మార్కెట్ ధర ప్రకారం బేసిక్ ధర నిర్ణయించి దానికి మూడు రెట్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసిన వాళ్లమవుతామన్నారు. ఈ దీక్షలను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నీకరెడ్డి సందర్శించి రైతులకు న్యాయమైన పర్యాయం అందే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో కాశప్ప, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం
నర్వ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్క్రీనింగ్ చేసి ముందస్తుగా టీబీని గుర్తించవచ్చు. ఇంటింటికీ వెళ్లి అల్ట్రాపోర్టబుల్ హ్యాండ్–హెల్డ్ ఎక్సరే సాయంతో స్క్రీనింగ్ చేసి మధుమేహం, బీపీ, హెచ్ఐవీ తదితర వ్యాధుల సమూహాలను గుర్తిస్తారు. న్యాట్(న్యూక్లియిక్ యాసిడ్, యాంప్లిఫికేషన్ టెస్టింగ్) ఉపయోగించి నిర్ధారణ తర్వాత అనేక వ్యాధులను గుర్తిస్తారు. జిల్లాలో జూన్ 2 నుంచి 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. వ్యాధుల నిర్ధారణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యభారత్ కోసం చేపట్టిన ముక్తభారత్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో టీబీ వ్యాధితో పాటు, షుగర్, బీపీ, హెచ్ఐవీ, ఎనీమియా, వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తద్వారా ఈ వ్యాధులను గుర్తించడం, నిర్ధారణ అనంతరం వ్యాధిగ్రస్తులకు సరైన మందులు అందించడం, వ్యాధుల తీవ్రతను బట్టీ జిల్లా ఆసుపత్రులకు రెఫర్ చేసి మెరుగైన చికిత్స అందించనున్నారు. తద్వారా వ్యాధుల భారిన పడకుండా ప్రజలను చైతన్యపరచడం, అవగాహన కల్పించడం చేపట్టారు. అత్యాధునిక పరికరాలతో స్క్రీనింగ్ జిల్లాలో గత జూన్ 2 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల్లోని పీహెచ్సీల పరిధి సబ్సెంటర్లలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో రూ.20 లక్షల విలువ గల అత్యాధునిక అల్ట్రాపోర్టబుల్ హ్యాండ్–హెల్డ్ ఎక్సరే ద్వారా టీబీ వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు. ఈ పరికరాన్ని వైద్యశిబిరాలకు తరలించి అక్కడే వ్యాధి నిర్ధారణతో పాటు ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు చేపట్టి మెరుగైన చికిత్సం కోసం 102 ద్వారా జిల్లా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి 6 నెలల పాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి నెల రూ.వెయ్యి బాధితులకు అందిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యభారత్ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం గత రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలో ఇలా .. జిల్లా వ్యాప్తంగా ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 40 వైద్యశిబిరాలు నిర్వహించారు. ఇందులో మొత్తం 3,987 పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాపోర్టబుల్ హ్యాండ్ – హెల్డ్ ఎక్సరే ద్వారా 2,890 పరీక్షలు నిర్వహించగా.. ఎక్సరే పాజిటివ్ 42 వచ్చాయి. వీటితో పాటు హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెపటైటిస్, టీబీ, బీపీ, షుగర్ పరీక్షలు చేపట్టి పాజిటివ్ రోగులను గుర్తించారు. వీరితో పాటు గత ఏడాది నవంబర్ నుంచి నేటి వరకు టీబీ వ్యాధిగ్రస్తులు 541 మందిని గుర్తించి వీరికి ప్రతి నెల రూ.1000 అందించాల్సి ఉన్న బడ్జెట్ లేమి కారణంగా నేటికి వీరికి అందడం లేదు. ‘టీబీ ముక్త్భారత్ అభియాన్’లోభాగంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జిల్లాలో వంద రోజులపాటువైద్య శిబిరాలు అత్యాధునిక పరికరాలతోఅనుమానితులకు ఆరోగ్య పరీక్షలు -
విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి
నారాయణపేట రూరల్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ గ్రౌండ్ స్కూల్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో డీఈఓ పోస్టులను మంజూరు చేసి వాటి స్థానంలో రెగ్యూ లర్ అధికారులను నియమించాలని, ఎంఈఓ, సీఆర్పీలతో నిరంతరం మండల పర్యవేక్షణ చేయించాలన్నారు. చాలా చోట్ల ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్న పీఎస్ లకు అదనపు గదులను మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతుల విషయంలో తగిన చర్యలు చేపట్టి మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత పాటించేవిధంగా, మెనూ ప్రకారం అందించే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మహేష్, గణేష్ పాల్గొన్నారు. -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘కొల్లాపూర్ ప్రాంతం.. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతం.. ఒకప్పుడు కౌన్ పూచ్తా కొల్లాపూర్ అనుకున్న ప్రాంతాన్ని, హమ్ జాదా లేనా కొల్లాపూర్ అంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, తట్ట, పార పని చేసినా పాలమూరు బిడ్డలే ఉంటారని చెప్పారు. ఇక్కడి మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం బాధ్యతను తీసుకుంటానని అన్నారు. డిసెంబర్ 9 నాటికి అన్ని ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారాన్ని చెల్లిస్తామని, భూసేకరణ పూర్తి చేస్తామని తెలిపారు. రెండేళ్ల కాలంలో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని పేర్కొన్నారు. ‘పాలమూరు బిడ్డగా ఇక్కడి పరిస్థితులు, కష్టాలు నాకు తెలుసు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్సాగర్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేసింది. రైతుల పొలాల్లోకి నీళ్లు రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం వల్ల మొన్న జూరాలకు నిమిషాలలో రూ.120 కోట్లు మంజూరు చేశాం. ఇక్కడి నుంచి గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు దొంగలకు సద్దులు మోశారు. మొన్నటి ఎన్నికల్లో ఇంకో రెండు సీట్లు వచ్చుంటే.. ఈ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుండే.’ అని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క మోటార్ను ప్రారంభించి చేతులు దులుపుకున్న కేసీఆర్.. ఈ గడ్డకు చేసిందేమీ లేదన్నారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్లు తెచ్చింది ఏమీ లేదు. 98 జీఓ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని శ్రీశైలం నిర్వాసితులు ఏళ్ల తరబడి అడుగుతూ వస్తున్నా.. వారిని గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొల్లాపూర్ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కొల్లాపూర్ అభివృద్ధికి అవసరమై సహకారం అందిస్తామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు ఏడాదిన్నర లోపు పూర్తి చేసి, దాని ప్రారంభానికి మళ్లీ ఇక్కడికి వస్తా సీఎం అన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,52,635 స్వయం సహాయక సంఘాలకు రూ.334 కోట్ల వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని 2,671 స్వయం సహాయక సంఘాలకు రూ.6.33 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బ్యాంక్ లింకేజీ రుణాలు, ప్రమాధ బీమా తదితర వాటిక సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి, నాయకులు బెల్లయ్యనాయక్, సరిత, జగదీశ్వర్రావు, శివసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. సాధికారత దిశగా పయనం: మంత్రి దామోదర రాజనర్సింహ మహిళలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ రిజర్వేషన్లు చారిత్రాత్మకం: మల్లురవి బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మక నిర్ణయమని, ఈ ఘ నత సీఎం రేవంత్రెడ్డికే దక్కు తుందని ఎంపీ మల్లు రవి అన్నారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని, విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచామన్నారు.కొల్లాపూర్ అభివృద్ధికిసహకరించాలి: మంత్రి జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గానికి అదనంగా మరో 3 వేల ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయాలని, శ్రీశైలం నిర్వాసితులకు జీఓ 98 ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువపత్రాలు ఇప్పించాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు, కొల్లాపూర్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొలచింతలపల్లి శివారులో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, పెంట్లవెల్లి సింగిల్ విండో సొసైటీలోని 409 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయాలని, సోమశిల– సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి త్వరగా అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని సీఎం దృష్టికి తెచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి వాకిటి సీఎం రేవంత్రెడ్డి ఆలోచనా విధానంలో విద్య, ఉపాధి, రైతు, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభిస్తోందని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడం అభినందనీయమన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ల బాధ్యత నాదే: సీఎం రేవంత్డ్డి డిసెంబర్ 9 నాటికి భూసేకరణ పూర్తి చేస్తాం.. పరిహారం చెల్లిస్తాం బీఆర్ఎస్ పాలనలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం గత ప్రభుత్వంలో జిల్లా మంత్రులుతెచ్చింది ఏమీలేదు శ్రీశైలం నిర్వాసితులనుఎందుకు ఆదుకోలేదు జటప్రోలులో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన -
అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
మక్తల్/నర్వ: అన్నివర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్తో కలిసి మంత్రి వాకిటి 200మంది ముస్లిం మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం న్యాక్ ఆధ్వర్యంలో కుట్టుశిక్షణ పూర్తిచేసుకున్న 35మంది మహిళలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య లిమిటెడ్ పెద్దజట్ర ఆధ్వర్యంలో మంత్రి చేతుల మీదుగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పలు అభివృద్ధి పనులకు రూ. 600కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు. ● జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రస్థాయి ఖేల్ ఇండియా సైక్లింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన ఊట్కూర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు. జిల్లా క్రీడాకారులకు ప్రోత్సా హం అందిస్తున్న రిటైర్డ్ పీఈటీ గోపాలానికి మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ● నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 140 మందికి సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. అదే విధంగా మక్తల్ మండలం మంథన్గోడు గ్రామానికి చెందిన కురుమూర్తి ఇటీవల విద్యుదాఘాతంతో మృతిచెందగా.. అతడి కుటుంబానికి మంజూరైన రూ. 5లక్షల చెక్కును మంత్రి అందజేశారు. ● గ్రామీణ ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకొని మత సామరస్యాన్ని చా టాలని మంత్రి వాకిటి అన్నారు. నర్వ మండలం లంకాల్లో కౌడీపీర్ల (చిన్నపీర్ల)ను ఆయన దర్శించుకున్నారు. ముందుగా పీర్లకు చాదర్, పూలు, దట్టీలు సమర్పించారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అదికారి రషీద్, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు లక్ష్మారెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎల్కో టి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, హాజమ్మ, జగన్మోహన్రెడ్డి, శ్రీని వాస్రెడ్డి, కృష్ణారెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్రెడ్డి, బీసం రవికుమార్, వేణుగౌడ్ పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను నెరవేరుస్తాం రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
నారాయణపేట: తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూనిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రెండోరోజైన బుధవారం కొనసాగాయి. మక్తల్ మండల కాచ్వార్, ఎర్నాగన్ పల్లి గ్రామ రైతులు దీక్షలో కూర్చోగా.. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు మశ్చందర్ మాట్లాడారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా బేసిక్ ధర నిర్ణయించి మూడు రేట్లు పెంచి ఇవ్వాలని, దురాశతో ఉద్యమించటం లేదన్నారు. న్యాయమైన పరిహారం కావాలని పోరాటం చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్కు మొదట రూ.1400 కోట్లుగా నిర్ణయించి ఆ తర్వాత రూ.4500 కు పెంచారని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది కానీ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిస్తున్నా రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడంలో సంకోచిస్తున్నారని అన్నారు. దీక్షల్లో నాయకులు గోపాల్, బాల్రాం, రాఘవేందర్రెడ్డి, అనంతయ్యగౌడ్, వెంకటేష్, కావలి రాజు పాల్గొన్నారు. -
కేజీబీవీలో రాష్ట్రవిద్యాశాఖ కార్యదర్శి బస
మరికల్: మండలంలోని పస్పుల కస్తుర్బా గాంధీ విద్యాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఐఏఎస్ యోగతా రాణా బుధవారం రాత్రి సందర్శించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి పాఠశాలకు చేరుకున్నారు. ముందుగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చేయగా తిలకించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అంతకుముందు వివిధ పాఠ్యంశాలకు సంబంధించిన ప్రశ్నలు వేసి విద్యార్థులతో జవాబులు రాబట్టారు. ఎస్ఓ రాజ్యలక్ష్మితో పలు విషయాలపై ఆరా తీశారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో గల మెడికల్ ఆఫీసర్ (కాంట్రాక్ట్ విధానంలో) పనిచేయుటకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జయచంద్రమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నవారు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు www.nara yanapet.telangana.gov.in కు సంప్రదించాలని తెలిపారు. పెరపళ్ల భూ నిర్వాసితులను ఆదుకోవాలి నారాయణపేట: పేట– కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న పెరపళ్ల రైతులను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెరపళ్ల గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులతో వారు మాట్లాడారు. ప్రభుత్వం రూ.14 లక్షలు ఎకరాకు ఇస్తామనడం సమంజసం కాదని, ఈ ప్రాంతంలో ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర బహిరంగ మార్కెట్లో పలుకుతుందన్నారు. గ్రామంలో దాదాపుగా 370 ఎకరాల వరకు ప్రాజెక్ట్ కింద భూములు సేకరించాల్సి ఉందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందులో కొంతమంది రైతులకు సంబంధించి ఉన్న మొత్తం భూమి కోల్పోతున్నారని అలాంటి వారికి భూమికి బదులు భూమి చూయించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకోవడం ఆపాలన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, తరువాత భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతులు ఎం అంజప్ప,ఆంజనేయులు, రామాంజనేయులు, భీమప్ప, బోయిని రాములు, గొల్ల కిష్టప్ప, కొనంగేరి బాలప్ప తదితరులు పాల్గొన్నారు. మీసేవ కేంద్రం ఆకస్మిక తనిఖీ నారాయణపేట: జిల్లా కేంద్రంలోని శ్రీలత మీ సేవను ఈడీఎం కె .విజయ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రానికి ధ్రువపత్రాల కోసం, రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అంతేకాక ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని మీ–సేవ ఆపరేటర్ ను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని 22 శాఖలకు సంబంధించి 482 రకాల సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా అందిస్తున్నారని, రెవెన్యూ శాఖ కు సంబంధించిన దరఖాస్తులు వీటి ద్వారానే సంబంధిత కార్యాలయాలకు చేరుతున్నాయన్నారు. వీటితో పాటు తాజాగా వివాహ ధ్రువీకరణ పత్రం, మార్కెట్ విలువ సర్టిఫికెట్ మీ సేవ ద్వారానే ప్రజలకి అందుబాటులో వచ్చాయని వాటిని సైతం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి
మరికల్: రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు అన్నారు. మరికల్లో బుధవారం ఆయనకు ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిసిటి యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఏఈ పోస్టులు, కింది స్థాయి సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతుందన్నారు. ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్తో పాటు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింప చేయాలని, వ్యవసాయ రంగానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్ కార్మికులను చూడాలన్నారు. ఆర్టిజన్ కార్మికుల పదోన్నతులు ఇచ్చి ఏపిఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని సూచించారు. 2009లో రద్దు చేసిన పింఛన్ను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017 నుంచి ఆర్టిజన్ ఉద్యోగులకు ఈపీఎస్, జీపీఎస్, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ అందజేసి పదవీ విరమణ పొందే విధంగా అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, డివిజన్ కార్యదర్శి మొగులప్ప, మధుసూదన్గౌడ్, రఘు, రవీంద్ర చారీ,శ్రీనివాస్రెడ్డి, ఆనంద్కుమార్, శ్రీధర్లు పాల్గొన్నారు. -
పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
ధన్వాడ: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల, కళాశాలను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈక్రమంలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి విద్యార్థులకు ఇబ్బందిగా మారడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందితో వెంటనే శుభ్రం చేయించాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డిని ఆదేశించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. అనంతరం వంట చేసేందుకు గది లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలియడంతో వంట రూం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెనూ తప్పనిసరి కోస్గి రూరల్: పాఠశాలలు, వసతి గృహాల్లో మెనూ తప్పక పాటించాలని, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ సిక్తా సట్నాయక్ అన్నారు. బుధవారం గుండుమాల్లోని ఆదర్శ పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. చదువుపై శ్రద్ధ వహించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల వరకు సీసీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని, సమీపంలోని చెత్తా చెదారాలను తొలగించాలని ఆదేశించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని గ్రామ పంచాయతీ అధికారులు శ్రద్ద వహించాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ నిలిమవర్దిని, పీఈటీ బాల్రాజ్ తదిదరులు ఉన్నారు. -
ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల కంటే ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్లపై వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. రానున్న ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘకాలంగా ప్రత్యేక పాలన కొనసాగుతుండటంతో తిరిగి ఎన్నికలు ఎప్పుడు చేపడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు సన్నాహాలు చేపడుతోంది. ఈ ప్రక్రియ వేగవంతమైన ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితేనే బీసీలకు రిజర్వేషన్ పెంపు అమలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధం నెలకొంది. కొత్తగా బీసీలకు రిజర్వేషన్ను పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా, లేక పాత రిజర్వేషన్లకే పరిమతమవుతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు.. జిల్లా జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ మహబూబ్నగర్ 16 16 175 నాగర్కర్నూల్ 20 20 214 వనపర్తి 15 15 113 జోగుళాంబ గద్వాల 13 13 142 నారాయణపేట 13 13 136 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ప్రకటించిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 780 ఎంపీటీసీ స్థానాలు పంచాయతీ కన్నా ముందే జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఊహగానాలు -
కలెక్టర్కు ఫిర్యాదు
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని నందిన్నెలోని సదరు రైస్ మిల్లుకు కేటాయిస్తే.. మిల్లు యజమాని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై నందిన్నె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రైస్ మిల్లు యజమానిపై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్ బీఎం సంతోష్కు వినతిపత్రం అందజేశారు. ఇదిలాఉండగా, ఈ ఽవ్యవహారంపై విచారణ జరుపుతున్న సివిల్ సప్లయ్ డీఎస్ఓ స్వామిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. -
వ్యాధుల భయం
పారిశుద్ధ్య లోపం.. ●ఫాగింగ్ చేయాలి గ్రామాల్లో దోమల నివారణకు విధిగా ఫాగింగ్ చేయాలి. గ్రామాల్లో దోమకాటుతో జ్వరాల భారిన పడుతున్నారు. వైద్యాధికారులు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి రోగాల భారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. – లక్ష్మణ్, ముస్లాయిపల్లి డ్రెయినేజీలు నిర్మించాలి దోమల విజృంభణకు కారణమైన మురుగును ఇళ్ల మధ్య నిల్వ ఉండకుండా, పారకుండా డ్రెయినేజీలు నిర్మించాలి. ప్రభుత్వం డ్రెయినేజీ నిర్మాణాలకు అరకొర నిధులు మంజూరు చేస్తుండటంతో ఎక్కడా పూర్తి స్థాయి డ్రెయినేజీలు నిర్మించలేకపోతున్నారు. అధికారులు స్పందించి డ్రెయినేజీలు నిర్మించాలి. – కిరణ్, మక్తల్ దోమల నివారణకు చర్యలు మురుగు రోడ్లపై ప్రవహించకుండా డ్రెయినేజీలు నిర్మిస్తాం. మురుగు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్ను చల్లడంతోపాటు దోమల నివారణకు విధిగా ఫాగింగ్ చేపట్టేలా పంచాయతీ కార్యదర్శులను ఆదేశిస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే డ్రెయినేజీలు నిర్మిస్తాం. – రమేష్, ఎంపీడీఓ, మక్తల్ మక్తల్: నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజల్లో సీజనల్ వ్యాధుల భయం పట్టుకుంది. అడపాదడపా వర్షాలతో చాలా గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగుతో వర్షపు నీరు చేరి రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ కారణంగా రోడ్లపై ఉన్న మురుగు కుంటలు దోమల వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. పారిశుద్ధ్య లోపం కారణంగా వ్యాధులు ప్రబలుతుండడం సమస్యగా మారుతోంది దోమల దండయాత్ర నియోజకవర్గంలో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వలో రోజు రోజుకు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగియడం.. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువవడం.. శానిటేషన్ నిధులు సక్రమంగా వినియోగించకపోవడం.. పారిశుద్ధ్య పనులు పడకేయడంతో రాత్రి అయ్యిదంటే చాలు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఏ పని చేయాలన్నా కార్యదర్శులు చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ● మాగనూర్, వర్కూర్, గుడేబల్లూర్, నేరడ్గాం, సూకూర్లింగంపల్లి, కృష్ణా, మందిపల్లి, వడ్వాట్, ముడుమాల్, తంగిడి, అడవిసత్యావార్, గురజాల గ్రామాల్లో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని అయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ● ఊట్కూర్ మండంలోని మల్లేపల్లి, చిన్నపోర్ల, పెద్దపోర్ల, పులమామిడి, నిడుగుర్తి, తిప్రాస్పల్లి, వల్లంపలి, ఓబ్లాపూర్ల్ ఆయా గ్రామాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక కాల్వల్లో మురుగు నిలిచి దోమలు అంతకంతకూ రెట్టింపవుతున్నాయి. ● మక్తల్ మండలంలోని సోమేశ్వర్బండ, కర్ని, అనుగొండ, గుడిగండ్ల, జక్లేర్, మంతన్గోడ్, సామాన్పల్లి, దాదాన్పల్లి, కాచ్వార్, టెకులపల్లి, సత్యవార్, గుడిగండ్ల, జక్లేర్, ముస్లాయిపల్లి, లింగంపల్లిలో పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టకపోవడం, వర్షాలు కురుస్తుండడంతో ఇళ్ల మధ్య మురుగు కుంటలు ఏర్పడుతున్నాయి. పందులు ఇవే ఆవాసాలుగా చేసుకొని స్వైర వివాహరం చేస్తుండడంతో అటుగా వెళ్లాలంటేనే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ● నర్వ మండంలోని లంకాల, యాంకి, పాతర్చేడ్, నర్వ, పెద్దకడ్మూర్లో డ్రైనేజీ కాల్వలు సరిగా తీయడంలేదని దీంతో మురుగుకాల్వలు పూడుకపోయి మురుగు రోడ్లపైనే ప్రవహిస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అధికారులు సక్రమంగా పనులు చేపట్టడంలేదని, వైద్యసిబ్బంది సైతం గ్రామాల్లో క్లోరినేషన్ దోమల నివారణకు ఫాగింగ్ చేయడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాల్లో ఫాగింగ్ నిర్వహించి దోమలను అరికట్టాలని, పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వలు, నీటి గుంతల్లో దోమల విజృంభణ కానరాని ఫాగింగ్ పెరుగుతున్న జ్వర బాధితులు -
ప్రభుత్వం గుర్తించాలి..
23 ఏళ్లుగా గోపాలమిత్రలుగా పనిచేస్తూ చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టుల్లో సీనియర్ గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. కనీస వేతనం రూ. 24వేలు అందించాలి. గోపాలమిత్రల సేవలను ప్రభుత్వం గుర్తించాలి. – మాశప్ప, గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రతినెలా వేతనం అందించాలి.. పాడి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పశుసంవర్ధక శాఖ ఆదేశాల మేరకు పశువైద్య సేవలు అందిస్తున్నాం. పనికి తగిన వేతనాలు మాత్రం పొందలేకపోతున్నాం. ప్రభుత్వం గోపాలమిత్రలకు వేతన బాధ తీర్చాలి. ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు అందించాలి. – మల్లేష్, గోపాలమిత్రల సంఘం జిల్లా కార్యదర్శి ● -
వేతన వెతలు!
గోపాలమిత్రలకు 10 నెలలుగా అందని జీతాలు వివరాలు 10లో uకోస్గి: పశుసంవర్ధకశాఖ సిబ్బందికి ఏమాత్రం తక్కువ కాకుండా రైతుల చెంతకు వెళ్లి క్షేత్రస్థాయిలో పాడి పశువులకు వైద్యసేవలు అందిస్తున్నారు గోపాలమిత్రలు. వీరికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పశువైద్య సేవలు అందిస్తూ వేతన గోస పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయడంతో పాటు క్రమం తప్పకుండా నెలనెలా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. దశాబ్ధాలుగా పశువైద్య సేవల్లో.. 2001లో ‘గోపాలమిత్ర’ పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశువైద్యశాలలకు దూరంగా ఉన్న గ్రామాల్లో పశువులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఆసక్తి గల యువతను గోపాలమిత్రలుగా నియమించింది. సీజన్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాధినిరోధక టీకాల పంపిణీ, ఇతర పశువైద్య శిబిరాల సమయంలో గోపాలమిత్రలు వైద్యులకు సహాయకులుగా పనిచేస్తూ వస్తున్నారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గోపాలమిత్రల సేవలను గుర్తించి.. గౌరవ వేతనంగా రూ. 2వేలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం వేతనాలు పెంచాలంటూ గోపాలమిత్రలు ధర్నాలు, నిరసనలు చేపట్టడంతో 2012లో అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య రూ. 3,500కు వేతనం పెంచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2019 నవంబర్లో అప్పటి సీఎం కేసీఆర్ రూ. 8,500లకు పెంచగా.. 2021 నుంచి పీఎఫ్తో కూడిన వేతనం రూ. 11,500 గోపాలమిత్రలకు అందిస్తున్నారు. నిర్దేశిత లక్ష్యం సాధిస్తేనే పూర్తి వేతనం.. జిల్లావ్యాప్తంగా 46 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. పాడి పశువులకు కృత్రిమ గర్భదారణ విషయంలో పశుసంవర్ధకశాఖ వీరికి టార్గెట్ ఇస్తోంది. ఒక్కో గోపాలమిత్ర 1,000 కృత్రిమ గర్భదారణ సెమన్లను పశువులకు వేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పశువులు ఎదకు వచ్చే సమయాన్ని గుర్తించి.. రైతు సమ్మతితో టార్గెట్ పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకపోతే అరకొర వేతనం మాత్రమే అందుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో సేవలు.. ప్రభుత్వం పశువైద్యశాలలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవసరమైన మేరకు వైద్యులు, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో గ్రామాల్లో పశువైద్య సేవల్లో గోపాలమిత్రలే కీలకంగా పనిచేస్తున్నారు. పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు గోపాలమిత్రలు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తారు. పశువైద్యులకు సమాచారం ఇచ్చి.. వారి సూచనల మేరకు అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సీజన్ల్ నిర్వహించే పశువైద్య శిబిరాల్లో ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పశువైద్య సిబ్బందితో కలిసి పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగజీవాలకు వ్యాధినిరోధక టీకాలను వేస్తున్నారు. గోపాలమిత్రలు ఉన్న గ్రామాలతో పాటు పరిసర గ్రామాల్లోని పశువులకు కృత్రిమ గర్భదారణ ఇంజక్షన్లు అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే లక్ష్యం మేరకు సంకరజాతి, మేలుజాతి, జెర్సీ, ముర్రజాతి పశుసంపద పెంచేందుకు కృషి చేస్తున్నారు. నెలల తరబడి ఎదురుచూపులు.. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం సైతం సక్రమంగా అందకపోవడంతో గోపాలమిత్రలు ఆర్థిక ఇబ్బందులతోనే సేవలు కొనసాగిస్తున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 10 నెలల వేతనాలు పెండింగ్లో ఉండటంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పాడి పశుసంపద పెంపునకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికై నా నెలనెలా వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి పెండింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధికి గోపాలమిత్రల కృషి రైతులతో మమేకమై పశువులకు కృత్రిమ గర్భదారణ చికిత్సలు నెలనెలా వేతనాలు చెల్లించాలని వేడుకోలు -
దివ్యాంగులకు రుణాలు
నారాయణపేట: జిల్లాలోని దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రుణాలు మంజూరు చేయనున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 100 శాతం రాయితీతో రూ. 50వేల చొప్పున 14 యూనిట్లు, 80 శాతం రాయితీతో రూ. లక్ష విలువైన ఒక యూనిట్, 70 శాతం రాయితీతో రూ. 2లక్షల విలువైన ఒక యూనిట్, 60శాతం రాయితీతో రూ. 3లక్షల విలువగల ఒక యూనిట్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈ నెల 31వ తేదీలోగా https://tgobmms. cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీలకతీతంగా ఏకం కావాలి కోస్గి: రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న యాదవులను పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని.. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకతీతంగా యాదవ కులస్తులంతా ఏకమైతేనే రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధిస్తారని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం హన్మంతు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాదవ కులానికి ప్రాధాన్యతనిచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు నలుగురికి ఎమ్మెల్సీగా, మరో నాలుగు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతామన్నారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు పీరంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంటల రమేశ్, కోస్గి మండల అధ్యక్షుడు మోహన్ ఉన్నారు. చేనేత ఉత్పత్తుల సంఘానికి అవార్డు అమరచింత: అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘాన్ని ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా కంపెనీ సీఈఓ చంద్రశేఖర్కు అవార్డును అందించారు. నాబార్డు ఏర్పడి నేటికి 44 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నాబార్డ్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆరేళ్లుగా సంఘాన్ని కొనసాగిస్తూ చేనేత కార్మికులే కంపెనీ షేర్ హోల్డర్స్గా నియమించడంతో పాటు వచ్చిన లాభాల్లో అందరికీ సమాన వాటా ఇస్తున్నామని తెలిపారు. తమ కృషిని గుర్తించి నాబార్డు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, టీజీ క్యాబ్ చైర్మన్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ గద్వాల: జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన బీసీ నిరుద్యోగ యువతకు గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీతోపాటు బ్యాంకింగ్ సర్వీసులకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు టీజీ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే 5 నెలలు కోచింగ్ ఇవ్వబడుతుందని, అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్ధులు ఆన్లైన్ వెబ్సైట్ https://studycircle.cgg.gov.in నందు ఈ నెల 16 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ తరగతులు ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతాయని, కోచించ్ సమయంలో నెలకు రూ.వెయ్యి స్టైఫండ్ ఇవ్వబడునని తెలిపారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50 లక్షలలోపు పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర కీలకం
నారాయణపేట: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని ఇన్చార్జి డీపీఓ పి.సుధాకర్రెడ్డి అన్నారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భారత ప్రభుత్వం పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, పెన్షన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం, గ్రామ సభల నిర్వహణపై కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీపీఓ మాట్లాడుతూ.. తెలంగాణ పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం గ్రామస్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం, ప్రజలకు అందాల్సిన సేవలు, అభివృద్ధి పనులపై గ్రామసభల్లో చర్చ జరిగేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీపీఓ కృష్ణ, ఎంపీడీఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
మా ప్రాణాలు పోవాలా..
‘వెనకా.. ముందు చూడకుండా రయ్మని దూసుకొస్తున్నారు.. దుమ్ము, ధూళి లేచి మధ్యాహ్న భోజనంలో పడుతోంది.. వీటి భయంతో ఇప్పటికే కొంతమంది పాఠశాలకు రావడం మానేశారు.. మా ప్రాణాలు పోవాలా.. అలా అయితేనే వీటిని ఆపుతారా..’ అంటూ మంగళవారం మండలంలోని తిర్మలాపూర్ గ్రామ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇసుక టిప్పర్లను అడ్డుకొని రాస్తారోకో చేశారు. దాసర్దొడ్డి నుంచి తిర్మలాపూర్ మీదుగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ల డ్రైవర్లు పాఠశాల విద్యార్థులు ఉన్నారనే ధ్యాస లేకుండా దూసుకెళ్తారని, ఇసుక టిప్పర్లతో మా ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. – మక్తల్ -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
నారాయణపేట: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తన ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్లో మరికల్, ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలాలు, పట్టణానికి చెందిన 75 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ, రైతుభరోసా తదితర పథకాలతో అండగా నిలిచామన్నారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పేదల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం, ఆర్టీఓ బోర్డు సభ్యుడు పోషల్ రాజేశ్, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు మహమూద్ ఖురేషి, యూసుఫ్ తాజ్, పళ్ల అనిల్ వెంకుగౌడ్ పాల్గొన్నారు. -
గుడిబండ వద్ద ‘డ్రై పోర్ట్’
అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని గుడిబండ సమీపంలో డ్రై పోర్ట్(రోడ్డు మార్గం ద్వారా ఓడరేవుకు అనుసంధానించబడిన ఇన్ల్యాండ్ టెర్మినల్) నిర్మాణానికి అధికారులతో కలిసి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. గుడిబండ శివారులోని సర్వే నంబర్ 118లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ, లాజిస్టిక్స్ డైరెక్టర్ అపర్ణ, ఇతర అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. డ్రై పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేశారు. ఇటీవల దేవరకద్ర వద్ద ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయగా.. తాజాగా గుడిబండ వద్ద డ్రై పోర్ట్ నిర్మా ణం కోసం స్థల పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి పేర్కొన్నా రు. దేవరకద్ర నియోజకవర్గంలో 68 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబును కోరడంతో పాటు డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు చెప్పారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి డ్రై పోర్ట్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించడానికి అధికారులను గుడిబండకు పంపినట్లు తెలిపారు. హైదరాబాద్, కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు సులభమైన కనెక్టివిటీ ఉండటం కూడా డ్రై పోర్ట్ నిర్మాణానికి కలిసి వస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పినకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పరిశ్రమలను ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, నాయకులు శ్రీహరి, విజయమోహన్రెడ్డి, జగదీశ్వర్, దశరథ్రెడ్డి, తిరుపతయ్య, శేఖర్రెడ్డి, బోయిని చంద్రశేఖర్, శకుంతల, సత్యనారాయరెడ్డి, రాజశేఖర్రెడ్డి, సయ్యద్షఫి, వేగనాథ్ ఉన్నారు. అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎంఆర్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
నారాయణపేట: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఐడీఎస్పీ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డా.శివబాలాజీ రెడ్డి వైద్యులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం జేడీ మాట్లాడుతూ.. మలేరియా, డెంగీ, డయేరియా, చికున్గున్యా వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.జయచంద్రమోహన్ మర్యాద పూర్వకంగా కలిసి కార్యక్రమాల నిర్వహణ తీరును తెలియజేశారు. ఆయన వెంట జిల్లా సబ్ యూనిట్ అధికారి అశోక్ కుమార్, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు నరసింహారావు, సూపర్వైజర్ తబితారాణి తదితరులు ఉన్నారు. -
భవిత కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
నారాయణపేట: భవిత కేంద్రాల్లో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంఖ్య, విద్యా బోధన నిర్వహణ తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యాబోధన పరికరాలతో పాటు పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు రవాణా ఛార్జీల చెల్లింపులపై ఆరా తీశారు. కేంద్రంలో వాష్ బేసిన్, మరుగుదొడ్లు లేకపోవండపై అసహనం వ్యక్తం చేశారు. పక్కనే మరుగుదొడ్లు ఉన్నాయని.. వాటికి నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా మారాయని ఎంఈఓ బాలాజీ కలెక్టర్కు తెలియజేశారు. స్పందించిన కలెక్టర్.. ఒక్కరోజులో మరుగుదొడ్లకు నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం ఎమ్మార్సీ భవనాన్ని పరిశీలించారు. చదువుతో పాటు కరాటే నేర్పించాలి మరికల్: కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు చదువుతో పాటు కరాటే వంటి యుద్ధవిద్య నేర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మరికల్ మండలం పస్పులలోని కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎస్ఓ రాజ్యలక్ష్మికి సూచించారు. అడిగి తెలుసుకున్నారు. ఏమైన వసతులు అవసరముంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ గోవిందరాజులు, తహసీల్దార్ రాంకోటి, ఎంపీడీఓ కొండన్న ఉన్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి
నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, భూ నిర్వాసితుల సంఘం కన్వీనర్ మశ్చేందర్ రిలే దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి విలువ రూ. 60లక్షల నుంచి రూ. 90లక్షలు ఉండగా.. ఎత్తిపోతల పథకంలో ముంపునకు గురవుతున్న భూములకు కేవలం రూ. 14లక్షలు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంలో భూములను కోల్పోతున్న రైతులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్, వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
నారాయణపేట: ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆపరేషన్ ముస్కాన్పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పని ప్రదేశాల్లో బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. బాలలను పనుల్లో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో మొత్తం 38 కేసులు నమోదు కాగా.. వాటిలో 12 మేజర్, 3 ఎఫ్ఐఆర్ అయ్యాయని, ఐదు పెండింగ్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆరుగురు విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించినట్లు వివరించారు. ● లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. జీపీఓ లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీలో 150 మంది పరీక్షలు రాస్తారన్నారు. సీసీ నిఘాలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద నెలకొల్పే డిస్ట్రిక్ట్ డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత గల సంస్థల (ఎన్జీఓలు) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు ఈ–అనుధాన్ (http://grants& msje.gov.in/ngo& login) పోర్టల్లో ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. -
ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయొద్దు
నారాయణపేట క్రైం: పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో డీఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ అధికారుల సమన్వయంతో కృషి చేయాలన్నారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా రశీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తిస్తూ భరోసా, భద్రత కల్పించాలని తెలిపారు. -
నీటిని పంపింగ్ చేస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్లో గ్రిడ్ను రన్ చేసేందుకు ఎస్ఎఫ్సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తు తం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం. – రహీముద్దీన్, ఎస్ఈ ఇరిగేషన్ శాఖ రెండు పంటలకు నీరివ్వాలి.. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను. – కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల ● -
నాణ్యతకు దిక్సూచి బీఐఎస్
నారాయణపేట: వస్తువుల కొనుగోలు విషయంలో భారత ప్రామాణిక సంస్థ నాణ్యతకు దిక్సూచి అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ శాఖలైన ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ తదితర శాఖలు ఒకే రకమైన నాణ్యత ఉన్న వస్తువులను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోనూ అవే ప్రమాణాలు పాటించాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ పైపులు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహారం, పాల ఉత్పత్తులు నాణ్యతగా ఉండాలన్నారు. బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ తన్నీరు రాకేశ్ మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వస్తువులు కంప్యూటర్స్, ప్రింటర్స్, ఏసీ, కూలర్స్, ఫ్యాన్ల విషయంలో విధిగా ఐఎస్ఐ ప్రమాణాలు ఉన్న వాటిని కొనుగోలు చేయడం ద్వారా విద్యుత్ ఆదా చేయవచ్చన్నారు. బంగారం కొనేటప్పుడు హల్మార్క్ ఉందా? లేదా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శైలేష్ కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, డీపీఓ సుధాకర్రెడ్డి, డీఐఈఓ సుదర్శన్, డీపీఆర్ఓ ఎంఏ రషీద్, వైద్యాధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు. -
ధరలు తగ్గించాలి..
రెండు ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నా. ఏటా పెట్టుబడి కింద రూ. 5వేల అదనపు భారం పెరుగుతూనే ఉంది. ఇందుకు ప్రతి ఏడాది ఎరువుల, కూలీల ధరల పెంపే కారణం. కానీ రైతు పండించిన పంటకు మాత్రం ఒకే ధర ఉంటుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నాం. పెంచిన ఎరువుల ధరలను తగ్గిస్తే కొంతమేర పెట్టుబడి తగ్గే అవకాశం ఉంది. లేదంటే పంటసాగుకు పెట్టిన పెట్టుబబడులు రాని పరిస్థితి వస్తుంది. – గొల్ల రాములు, రైతు, మరికల్ సేంద్రియ వ్యవసాయంతో మేలు పెరిగిన ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఫర్టిలైజర్ ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవడం మంచింది. ఈ ఎరువుల వల్ల భవిష్యత్లో భూ సారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు సాగుచేసే పంటలకు సేంద్రియ ఎరువులను వినియోగించడంతో భూ సారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. – జాన్సుధాకార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
ఎరువు.. బరువు!
మరికల్: రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. 28–28–0, డీఏపీ, యూరియా మినహా మిగతా వాటి ధరలు రూ. 50 నుంచి రూ. 330 వరకు పెంచి రైతులపై ఎనలేని భారాన్ని మోపాయి. ఏటేటా పెరుగుతున్న ధరల కారణంగా రైతులకు పంటసాగు భారంగా మారుతోంది. జిల్లాలో వానాకాలం సాగుచేసే వివిధ రకాల పంటలకు 70కి పైగా మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతుండగా.. పెరుగుతున్న ధరలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ఇదిలా ఉంటే, యూరియా, డీఏపీ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఈ రెండింటి అమ్మకాలకు ఆయా కంపెనీలు లింకు ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. లేకపోతే యూరియా, డీఏపీలను విక్రయించబోమని జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రైవేటు ఎరువుల డీలర్లు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. నానో యూరియాపై అనాసక్తి.. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల సాగు చేపడితే మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం యూరియా స్థానంలో నానో యూరియాను ద్రవరూపంలో తీసుకొచ్చింది. ధర తక్కువగా ఉండే నానో ఎరువుల వినియోగంతో రైతులకు పెట్టుబడుల భారం తగ్గి.. దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయశాఖ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. రైతులు మాత్రం ఆసక్తి చూపలేకపోతున్నారు. ప్రస్తుతం వాడుతున్న సాధారణ యూరియాను పంటకు చల్లడం ద్వారా కేవలం 30 శాతం మాత్రమే పంటకు వెళ్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే నానో యూరియా 80 శాతం పంటకు వెళ్తుందని చెబుతున్నారు. అర లీటర్ డబ్బాలో లభించే నానో యూరియా 45 కిలోల బస్తాతో సమానం. రాయితీ పోను యూరియా బస్తా ధర రూ. 266 ఉండగా, నానో యూరియా రూ. 240కే లభిస్తుంది. యూరియా తర్వాత రసాయన నానో డీఏపీని అందుబాటులోకి తెచ్చారు. ఒక బస్తా డీఏపీ 500 మిల్లీ లీటర్ల నానో డీఏపీతో సమానం. బస్తా డీఏపీ ధర రూ. 1,350 ఉండగా.. నానో డీఏపీ రూ. 600కే లభిస్తుంది. అయితే నానో ఎరువుల వినియోగంతో కలిగే లాభాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎరువులుయూరియా, డీఏపీ మినహా అన్ని రకాల ఎరువుల రేట్లు పెంపు ఏటేటా పెరుగుతున్న ధరలతో రైతులకు పెట్టుబడి భారం నానో ఎరువుల వినియోగంపై అవగాహన కరువు జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు అంచనా -
ఎత్తిపోతలకు గ్రహణం
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర ● తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం ● ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్సాగర్లోఒక పంపుతోనే నీటి పంపింగ్ ● బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూ ఏజెన్సీల కొర్రీ ● వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది. రెండు మోటార్లతో నెట్టెంపాడు.. జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ● నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. ఒక్క మోటారుతో కోయిల్సాగర్.. మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు. -
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
నారాయణపేట: వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ను సద్వినియోగం చేసుకోవాలి చదువుకు దూరమైన వారికి ఓపెన్ స్కూల్ వరంలా ంటిదని.. మధ్యలో చదువు మానేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలిసి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. వ్యాపార రంగాల్లో ఉన్నవారితో పాటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సీ, ఇంటర్ విద్య పూర్తిచేసేందుకు సువర్ణావకాశమని అన్నారు. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందిన వారికి సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తారన్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ఫీజు రాయితీ ఉంటుందన్నారు. అదే విధంగా ఉల్లాస్ నవభారత సాక్షారత కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం విధానాలతో అక్షరాస్యత కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బడి మానేసిన వారిని గుర్తించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్ కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డీఈఓ గోవిందరాజులు, జిల్లా టాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏఎంఓ విద్యాసాగర్, ఎంఈఓ బాలాజీ, డీఎస్ఓ భానుప్రకాశ్ పాల్గొన్నారు. -
డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న సెమిస్టర్– 2, 4, 6కు సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ఎన్నికల్లో సత్తా చాటాలి: డీకే అరుణ మిడ్జిల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సోమవారం మిడ్జిల్లో తన ఎంపీ నిధులతో నూతనంగా నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం ఎంవీఎస్ గార్డెన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో కాంగ్రెస్ తమ పథకాలు అని చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని, దీనిపై కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, జనార్దన్రెడ్డి, రాజేశ్వర్, తిరుపతి, నరేష్నాయక్, లాలు, రవిందర్ పాల్గొన్నారు. 18న సీఎం పర్యటన పెంట్లవెల్లి: నాగర్కర్నూల్ జిల్లాలో ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో 22 ఎకరాలలో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. కాగా.. సోమవారం నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హెలీప్యాడ్, సభావేదిక, పార్కింగ్ వంటి స్థలాలను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. సమయం లేనందున అధికారులు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మూడు రోజుల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయా లని ఆదేశించారు. అసంపూర్తి పనులు మరింత ముమ్మరం చేయాలని జిల్లాస్థాయి అధికారుల కు సూచించారు. మంగళవారం మంత్రి జూ పల్లి కృష్ణారావు స్థల పరిశీలన చేస్తారని, ఆలో గా పనులు కొలిక్కి వచ్చేలా చూడాలన్నారు. సభావేదిక ఏర్పాట్లు, ఇతర పనుల్లో ఎలాంటి అలసత్యం వహించరాదని చెప్పారు. 17న జాబ్ మేళా వనపర్తి: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో వనపర్తిలోని పీఎంకేకేలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి పది, ఐఐటీ, ఏదైనా డిగ్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ అనంతరం వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని.. ఆసక్తిగల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిరు. వివరాలకు 99485 68830, 91753 05435, 77990 73053 నంబర్లను సంప్రదించాలన్నారు. కొనసాగుతున్న నీటి విడుదల మదనాపురం: రామన్పాడు జలాశయం నుంచి సోమవారం సాగునీటి సరఫరా కొనసాగుతుందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టులో 1,019 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 873 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని తరలించినట్లు వివరించారు. -
కాలుష్యపు కోరల్లో కృష్ణమ్మ
కృష్ణానదిలో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు జీవనది కృష్ణమ్మ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు వంద కి.మీ. మేర పారుతూ.. కోట్లాది మందికి తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. అలాగే లెక్కకు మించి వన్యప్రాణులు, మత్స్య సంపదకు జీవనాధారమైంది. ఇంతటి ప్రాముఖ్యత గల కృష్ణానది క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. ఎగువనున్న కొన్ని పరిశ్రమల నుంచి కాలుష్యపు నీటిని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణానదిలోకి వదిలేస్తున్నారు. ఫలితంగా కృష్ణాజలాలు పచ్చరంగులోకి మారుతూ విషపూరితమవుతున్నాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లో లేకపోగా.. ఇతరత్రా అధికార యంత్రాంగం తమ పరిధిలో లేదంటూ చేతులు దులుపుకొంటోంది. కొల్లాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా కృష్ణానది దిగువకు ప్రవహిస్తుంటుంది. అయితే కృష్ణానది తీరం వెంట పలు రసాయన, ఔషధ, ఆల్కహాల్ పరిశ్రమలు నెలకొల్పారు. వాటి వ్యర్థాలను నది తీరంలోకి వదిలిపెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. అలాగే నది తీర గ్రామాల్లోని చెత్తాచెదారాన్ని కూడా తీరం ఒడ్డునే పారబోస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వరద జలాలు వదిలిపెట్టినప్పుడు కలుషితాలన్నీ నీటిలో కలిసి దిగువకు ప్రవహిస్తున్నాయి. కృష్ణానదికి ఉపనదులుగా ఉన్న తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ వంటి నదుల నుంచి కూడా కాలుష్య కారకాలు వచ్చి కృష్ణానదిలో కలుస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గ సరిహద్దులోనే ఆయా నదులు సంగమం అవుతుంటాయి. కాలుష్య కారకాల వల్ల జటప్రోల్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సంగమేశ్వరం, సోమశిల, అమరగిరి పరిసర ప్రాంతాల్లో నది నీళ్లు పచ్చగా మారుతున్నాయి. గత మూడేళ్లుగా నీళ్లు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తీర ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ఇలా నీటిపై పచ్చని రంగులో తెట్టెలు దర్శనమిస్తున్నాయి. నీటిమట్టం తగ్గేకొద్దీ కలుషిత నీరు అంతా దిగువకు ప్రవహిస్తూ పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్– రంగారెడ్డి జిల్లాలకు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీం నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కృష్ణానది నీటినే వినియోగిస్తున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే కృష్ణానీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. కాలుష్య కాటుకు గురవుతున్న నీటిని సక్రమంగా శుద్ధి చేయకుంటే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, మత్స్యసంపద వృద్ధికి ఇబ్బందికరంగా నీటి కాలుష్యం మారకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా.. శుద్ధి చేసిన నీటినే.. మిషన్ భగీరథ స్కీంకు కృష్ణానది నుంచి ఎత్తిపోసే నీటినే వినియోగిస్తున్నాం. ఈ నీళ్లను రెగ్యులర్గా ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. మట్టి, చెత్త ఏమున్నా ఫిల్టరింగ్లో వెళ్లిపోతుంది. ఆరోగ్యానికి హాని కలిగించని ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి. నీటి ఫిల్టరింగ్ను రెగ్యులర్గా పర్యవేక్షిస్తాం. నది నీటి కాలుష్యాన్ని పర్యవేక్షించే బాధ్యత మా శాఖ పరిధిలో లేదు. – అంజాద్పాష, డీఈఈ, మిషన్ భగీరథ పలు ప్రాంతాల్లో ఆకుపచ్చ రంగులోకి నది నీరు మూడేళ్లుగా అధికమవుతున్న నీటి కాలుష్యం వరదలతో దిగువకు పారుతున్న కలుషిత జలాలు దరిదాపుల్లో కానరాని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మా దృష్టికి రాలేదు.. కృష్ణానదిలో కాలుష్య కారకాలు కలుస్తున్నాయనే విషయం మా దృష్టికి రాలేదు. ఇది మా పరిధిలోని అంశం కాదు. కాలుష్య నివారణ బోర్డుకు సంబంధించిన అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్ ఆకుపచ్చగా మారుతున్నాయి.. కృష్ణానదిలో నీళ్లు మూడేళ్లుగా పచ్చగా మారుతున్నాయి. ఇవి పై నుంచి వస్తున్నాయి. వరద వచ్చినప్పుడు నీళ్లపై ఆకుపచ్చ రంగులో తెట్టెలు ఉంటున్నాయి. నీళ్లు తగ్గే సమయంలో అధికంగా కనిపిస్తాయి. ఈ ఏడాది కూడా కొన్నిచోట్ల ఈ నీటి తెట్టెలు కనిపించాయి. ఈ విషయం ఇక్కడికి వచ్చే అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – బాలరాజు, మంచాలకట్ట, పెంట్లవెల్లి మండలం -
బడుల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అహర్నిషలు కృషి చేస్తూ రూ.వేల కోట్లు మంజూరు చేస్తోందని.. వార్షిక పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోవడం ఏమిటని ఉపాధ్యాయులపై మంత్రి వాకిటి శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.25 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అదేవిధంగా సింగంపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణితో మాట్లాడి గతేడాది పది ఫలితాల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారని అడిగారు. ఇందుకు ఆమె స్పందిస్తూ మొత్తం 80 మంది విద్యార్థులకుగాను 36 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించకపోతే ఏం బోధిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయులను నియమించినా.. చదువు చెప్పడంలో ఎందుకు నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని తనవంతుగా రూ.26 లక్షలు వెచ్చించి క్యూఆర్ కోడ్ కలిగిన పాఠ్య పుస్తకాలను నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశామని, ఆశించిన ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోయారని ఎంఈఓ, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. పాఠశాలకు వచ్చిన ప్రతిసారి విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన వసతులు కల్పిస్తున్నామని, ఇంకా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. వచ్చే ఏడాది వంద శాతం ఫలితాలు ఇవ్వకపోతే నిధులు ఇవ్వమని చెప్పారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వం బడుల బలోపేతంతో పాటు అంగన్వాడీలకు పక్కా భవనాలను నిర్మించి ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలుచేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని తెలిపారు. ప్రహరీ నిర్మాణానికి హామీ.. మండలంలోని తూక్యానాయక్తండా ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. చుట్టుపక్కల ఉన్న పంటపొలాల నుంచి విషపు పురుగులు వస్తున్నాయని ప్రధానోపాధ్యాయుడు అనిల్కుమార్రెడ్డి మంత్రికి విన్నవించారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ పీఆర్ అధికారులకు నివేదిక పంపిస్తే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జ్ కలెక్టర్ యాదయ్య, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్ఖాన్, మహేందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మహంకాళి విష్ణు, తిరుమల్లేష్, ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, ఎంపీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అడిగినన్నీ ఇస్తున్నా.. ఆశించిన ఫలితాలు రాకపోతే ఎలా? మంత్రి వాకిటి శ్రీహరి -
మత్స్య సంపదకూ ముప్పే..
నీటి కాలుష్యంతోపాటు గుర్రపు డెక్క కూడా కృష్ణానదిలో విస్తరిస్తోంది. ఎగువ నుంచి కిందకి నీళ్లు వచ్చినప్పుడు తీరప్రాంతాల్లోని చెత్తాచెదారంతోపాటు గుర్రపు డెక్క కూడా వస్తోంది. ఇది శ్రీశైలం డ్యాం వరకు నిదానంగా చేరుతోంది. కాలుష్యం, గుర్రపుడెక్క కారణంగా నదిలోని మత్స్య సంపదకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే అలివి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదు. కాలుష్యం కూడా దీనికి తోడైతే మత్స్యకారుల జీవనోపాధికి ఇక్కట్లు తప్పవు. కృష్ణానదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్క -
ఉత్సాహంగా నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి నెట్బాల్ పురుష, మహిళా జట్ల సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించారు. 5 విభాగాల్లో ఎంపికలకు గాను 94 మంది పురుషులు, 64 మంది మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రం నమక్కల్లో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 17వ సౌత్జోన్ నేషనల్ నెట్బాల్, 18, 19 తేదీల్లో జరిగే 2వ ఫాస్ట్5 సౌత్జోన్ నెట్బాల్ చాంపియన్షిప్, 19, 20 తేదీల్లో జరిగే మొదటి సౌత్జోన్ నేషనల్ మిక్స్డ్ పోటీలు, హర్వానా రాష్ట్రం పల్వాల్లో వచ్చేనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే 4వ ఫాస్ట్5 సీనియర్ నేషనల్ నెట్బాల్, 2వ సీనియర్ నేషనల్ మిక్స్డ్ నెట్బాల్ చాంపియన్షిప్లలో పాల్గొనే పురుషుల, మహిళా జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ ఆప్ తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి టోర్నమెంట్ల్లో రాష్ట్ర జట్లు మెరుగైన ప్రతిభకనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు రాంమోహన్గౌడ్, ఖాజాఖాన్, సయ్యద్ అంజద్అలీ, సీనియర్ క్రీడాకారులు అక్రం, ముంతాజ్, షరీఫ్ పాల్గొన్నారు. ఐదు విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక -
కెప్టెన్గా రాణించిన అనిత
నారాయణపేట జిల్లా కోస్గి మండలం హన్మాన్పల్లికి చెందిన అనిత ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ లీగ్లో రెడ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించి చాంపియన్గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించారు. రెండు మ్యాచుల్లో 59 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. వనపర్తిలోని గిరిజన సొసైటీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆల్రౌండర్గా రాణిస్తోంది. ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021లో హెచ్సీఏ మహిళా జట్టుకు ఎంపికై సూరత్లో జరిగిన టోర్నీలో ఆడింది. బెంగళూర్లో జరిగిన టీ–20 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరపున పాల్గొంది. హెచ్సీఏ టోర్నీల్లో రాణించి భారత జట్టుకు ఎంపికకవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది అనిత. -
అంతా సిద్ధం
వనమహోత్సవం..●మొక్కలు నాటేందుకు సిద్ధం అటవీశాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లాలోని మిగతా 19 శాఖలతో కలుపుకొని 15.40 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధం చేసి ఉంచాం. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – ప్రసాద్రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి, నారాయణపేట నారాయణపేట: జిల్లాలో వనమహోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో ప్రారంభించేందుకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్దేశంతో డీఆర్డీఓ మొగులప్ప, అటవీశాఖ జిల్లా అధికారి ప్రసాద్రెడ్డి, 21 శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జూన్ మొదటి వారం నుంచే మొక్కలు నాటడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ఏడాది 15.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.35 లక్షల మొక్కలు నాటించారు. నిర్ధేశించిన లక్ష్యంలో 9 శాతం పూర్తయింది. డిపార్ట్మెంట్ల వారీగా మొక్కల లక్ష్యం జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 96,750 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. టీఎస్ఆర్టీసీకి 1000, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 43,200, హార్టికల్చర్ అండ్ సెరి కల్చర్ 1.22లక్షలు, టీజీఎస్పీడీసీఎల్కు 500, మైన్స్ అండ్ జీయాలజీకి 600, హెల్త్ డిపార్ట్మెంట్కు 500, ఐసీడీఎస్కు 500, పశుసంవర్ధకశాఖకు 100, మార్కెటింగ్కు 300, పోలీస్ శాఖకు 300, ట్రాన్స్ఫోర్ట్ 500, సివిల్సప్లయ్కు 300, బీసీ వెల్ఫేర్ 300, ఎకై ్సజ్శాఖకు 25,300, ఆర్అండ్బీకి 3 వేలు, ట్రైబల్వేల్ఫేర్కు 500, అగ్రికల్చర్కు 86,100, ఇరిగేషన్శాఖకు 500, జిల్లా విద్యాశాఖకు 500, డీఆర్డీఓకు 8.66లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు టార్గెట్ ఇలా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 705 సైట్లలో 5.54లక్షల మొక్కలు, 280 జీపీల్లో ఇంటింటా 3.22 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కేటగిరీలా వారీగా బండ్ప్లాంటేషన్ 6 వేలు, హర్టికల్చర్ 27,300, సంస్థాగత, కమ్యూటీ ప్లాంటేషన్ 2,49,750, ట్యాంక్బండ్ 25,300, ట్యాంక్బండ్ ఈత 23,500, ఈత ప్లాంటేషన్ 14 వేలు, ఈత ఇన్ సోసైటీ ల్యాండ్స్ 5 వేలు, మల్బరీబుస్15 వేలు, రోడ్సైడ్ ప్లాంటేషన్ 99,300, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ 62,481, కెనాల్ బండ్ 25,600, బయో పెన్సింగ్లో 1500 మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. నిరాడంబరంగా ప్రారంభం నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం ఫర్ణికారెడ్డి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందువరుసలో హర్టికల్చర్ అండ్ సెరీకల్చర్ గ్రామీణాభివృద్ధి శాఖకు 8.66 లక్షల మొక్కలు కేటాయించగా గాను 24 వేల మొక్కలు నాటి 2.78 శాతం పూర్తి చేశారు. అటవీశాఖ 43,200 మొక్కలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 280 మొక్కలు మాత్రమే నాటారు. హర్టికల్చర్ అండ్ సెరి కల్చర్ లక్ష్యం 1,22,600 మొక్కలకు గాను 98,700 మొక్కలు నాటి 80 శాతానికి చేరుకున్నారు. ఎకై ్సజ్శాఖ 720, మున్సిపాలిటీల్లో 290 మొక్కలను అడపదడపా నాటేశారు. వ్యవసాయశాఖ ఈ ఏడాది 86,100 లక్ష్యం కాగా ఇంత వరకు ఒక్క మొక్క నాటలేదు. జిల్లాలో .. భూ విస్తీర్ణం 2,33,644 హెక్టర్లు ఫారెస్ట్ ఏరియా 462 హెక్టర్లు ఫారెస్టు శాతం 3.621 శాతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లక్ష్యం 0.432 లక్షలు డీఆర్డీఏ లక్ష్యం 8.671 లక్షలు ఇతర శాఖలు 6.303 లక్షలు289 నర్సరీలు.. 81 రకాలు మొక్కలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 280, ఫారెస్టు ఆధ్వర్యంలో 6 నర్సరీల్లో 20,15,841 మొక్కలు అందుబాటులో ఉండగా అందులో మీటర్ పైన పొడవు ఉన్న మొక్కలు 3,32,240,, మీటర్లోపు 9,77,601, పెంచుతున్న మొక్కలు 7,06,000 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో నర్సరీలు అందుబాటులో మొక్కలు డిపార్ట్మెంట్ నర్సరీలు మొక్కల పొడవు మీటర్ పైన మీటర్లోపు పెంపుదల ఫారెస్ట్ 06 2,10,900 36,290 1,74,610 –– డీఆర్డీఏ 280 16,99,941 2,49,950 7,49,991 70,000 మున్సిపాలిటీలు 03 1,05,000 46,000 58,000 6,000 మొత్తం 289 20,15,841 3,32,240 9,77,601 70,600 మొక్కల లక్ష్యం 15.40 లక్షలు తవ్విన గుంతలు 1,96,342 నాటిన మొక్కలు 1.35 లక్షలు మంత్రి వాకిటి శ్రీహరితో అధికారికంగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు -
‘పార్టీ కాదు.. పేదరికం చూసి ఇళ్లు ఇస్తాం’
మక్తల్/కృష్ణా/ఊట్కూర్/మాగనూర్: పార్టీని చూసి కాదు.. పేదరికాన్ని చూసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని పశుసంవర్ధక, క్రీడల యువజన, మత్స్యసహకార, డెయిరీ పాడి పరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని కేశవనగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మక్తల్లో దోబీ ఘాట్ వద్ద రోడ్డ్యాంను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి కృషి శ్రీపడమటి అంజనేయస్వామి ఆలయ అబివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం ఆలయ ధర్మకర్తగా ప్రాణేష్కుమార్ ప్రమాణ స్వీకారం చేపట్టగా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అందజేసి ప్రాణేష్కుమార్కు మంత్రి నియామకపత్రం అందించారు. ● సంగంబండ రిజర్వాయర్ వద్ద చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని మంత్రితో పాటు స్టేట్ ఫిషరీస్ స్టేట్ డైరెక్టర్ నిఖిల్ పరిశీలించారు. ● ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి కొత్తపల్లికి రూ.1.90 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు, రూ. 20లక్షలతో నిర్మించే అవులోనిపల్లిలో గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి భూమిపూజ చేపట్టారు. బిజ్వార్ నుంచి పెద్దపోర్ల గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్లో ఫార్మేషన్ రోడ్డు పనులు చేపట్టాలని ఎంపీడీఓ ధనుంజయగౌడ్కు ఆదేశించారు. బిజ్వారంలో రైతు రుణమాఫీ జాబితా ఏర్పాటు చేయకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ● కృష్ణా మండలంలోని గుర్జాల్ గ్రామానికి రూ.2.60 కోట్లతో ఏర్పాటు చేసే బీటీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ● మాగనూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పెగడబండ వరకు గ్రామ సమీపం వరకు రూ.3.80 కోట్లతో 4 కిలోమీటర్ల బీటీరోడ్డు నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శంకర్నాయక్, తహసీల్దార్లు చింత రవి, సతీష్కుమార్, పీఆర్ ఈఈ హీర్యానాయక్, ఏఈ అజయ్రెడ్డి, ఈఓ సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, గణేష్కుమార్, ఆనంద్గౌడ్, సూర్యప్రకాశ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
బ్యాటింగ్లో ‘ప్రతీక’ ప్రతిభ
మహహ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన ప్రతీక తాండూరులో తొమ్మిదో తరగతి చదువుతోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్లో పాల్గొని ప్రతిభచాటింది. వికెట్ కీపర్గా, బ్యాటింగ్లో రాణిస్తోంది. హైదరాబాద్లోని కేఎస్ఎం క్లబ్లో రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న ప్రతీక గత ఏడాది అండర్–15 టోర్నీలో హెచ్సీఏ జట్టు తరఫున తమిళనాడు, ఆంధ్ర జట్లతో మ్యాచ్లు ఆడింది. మొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో వుమెన్ క్రికెట్ లీగ్ నిర్వహించడం సంతోషంగా ఉందని, క్రికెట్లో ప్రతిభ కనబరిచి భారత జట్టు ఆడాలన్నదే తన లక్ష్యమంటోంది ప్రతీక. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో శనివారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ దళపతి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కంటి తుడుపు చర్యగా కాకుండా చట్టబద్ధతతో కూడిన 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ల ద్వారా బీసీలకు ఒరిగెదేమీ లేదని, గతంలో కేరళ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని చేసిన ప్రయత్నాన్ని కోర్టులు అడ్డుకున్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రిజర్వేషన్లు పెంపును వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళితే ఎన్నికలు ఆగిపోతాయన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదన్నారు. రిజర్వేషన్లు అమలు కాకముందే బీసీ సంక్షేమ శాఖ మంత్రి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల కుర్మయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు గణేష్, వెంకటప్ప, గజలప్ప, రమేష్, నర్సింహులు, వెంకటయ్య, లక్ష్మప్ప, శ్రీనివాస్, రాము పాల్గొన్నారు. -
ఆల్రౌండర్గా రాణిస్తున్న అబ్దుల్ రాఫే
మహబూబ్నగర్కి చెందిన అబ్దుల్ రాఫే బ్యాటింగ్తో పాటు కీపర్గా రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఇంట్రా డిస్టిక్ట్ అండర్–19 వన్డే క్రికెట్లో బ్యాటింగ్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గద్వాలపై అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. నారాయణపేటపై 127 బంతుల్లో 3 సిక్స్లు, 25 ఫోర్లతో 165 పరుగులు చేశాడు. లీగ్లో 495 పరుగులు చేసి బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 2023లో టుడే లీగ్లో రెండు సెంచరీలు, మూడు అర్థసెంచరీలు చేశాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో పీయూ తరఫున ఆడి రాణించాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టమని, టీమిండియాకు ఆడాలన్నదే తన కల అని పే అంటున్నాడు అబ్దుల్ రాఫే. -
‘శత’క్కొట్టిన కేతన్కుమార్
జడ్చర్లకు చెందిన కేతన్కుమార్ యాదవ్ బ్యాటింగ్లో సంచలనం సృష్టించాడు. రెండేళ్లుగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న కేతన్ అండర్–23 లీగ్లో మూడు సెంచరీలు కొట్టి 474 పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్గా నిలిచాడు. వనపర్తితో జరిగిన టూ డే లీగ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకొట్టి 221 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 113, రెండో ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. మహబూబ్నగర్పై మరో సెంచరీ (101 పరుగులు) చేశాడు. రంజీ జట్టులో చోటు దక్కించుకోవడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు కేతన్కుమార్. -
బెస్ట్ బౌలర్గా దివ్యరాథోడ్
వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మామిడిమాడకు చెందిన దివ్యరాథోడ్ ఇటీవల ఇంట్రా డిస్ట్రిక్ట్ వుమెన్ క్రికెట్ లీగ్లో బెస్ట్ బౌలర్గా ఎంపికై ంది. రెండు లీగ్ మ్యాచుల్లో 7 వికెట్లు తీసి ప్రతిభచాటింది. వనపర్తిలోని గిరిజన గురుకులంలో చదువుతున్న దివ్యరాథోడ్ కోచ్ మన్నాన్ వద్ద రెండేళ్లగా క్రికెట్లో శిక్షణ తీసుకుంటోంది. గత ఏడాది ఖమ్మంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 రాష్ట్రస్థాయి, హరియాణాలో జరిగిన జాతీయస్థాయి మహిళా క్రికెట్ టోర్నీలో ఆడింది. ఫాస్ట్బౌలర్గా గుర్తింపు పొంది జాతీయ మహిళా జట్టుకు ఎంపికవుతానని అంటోంది దివ్యరాథోడ్. -
క్రికెట్లో మెరుపులు
బ్యాట్ పడితే సిక్స్.. బంతి విసిరితే బౌల్డ్ మహబూబ్నగర్కు చెందిన ముఖితుద్దీన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 టూ డే లీగ్లో బంతిని గింగిరాలు తిరిగేలా బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించారు. తన స్పిన్ మాయాజాలంతో టోర్నీలో అత్యధికంగా 34 వికెట్లు తీశా డు. రెండు ఇన్నింగ్స్లలో వనపర్తి, నారాయణపేట జట్లపై 10 చొప్పు న వికెట్లు, జడ్చర్లపై 5, గద్వాలపై 5, నాగర్కర్నూల్పై 4 వికెట్లు తీసి రాణించాడు. గతంలో పలుసార్లు హెచ్సీఏ టోర్నీల్లో ఎండీసీఏ తరఫున ఆడి ప్రతిభ చాటాడు. 2024లో వరంగల్లో జరిగిన హెచ్సీఏ అండర్–19 టోర్నీలో 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్గా నిలిచాడు. ఈ ఏడాది చైన్నెలో జరిగిన ఆలిండియా యూనివర్సిటీ క్రికెట్ టోర్నీలో నాలుగు ఇన్నింగ్స్లో 8 వికెట్లు తీశాడు. గతేడాది త్రీ డే లీగ్లో 8 వికెట్లు తీశాడు. భవిష్యత్లో రంజీ, భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్నాడు ముఖితుద్దీన్. ● ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైనం ● సత్తా చాటుతున్న మహిళా క్రికెటర్లు ● అద్భుతంగా రాణిస్తున్న పాలమూరు యువ క్రీడాకారులు పాలమూరు క్రికెట్లో యువతరం సత్తా చాటుతోంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు సైతం దూసుకుపోతున్నారు. బ్యాట్తో పరుగుల వరద పారించడంతో పాటు వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సహకారంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో మెరుపులు మెరిపించి..భవిష్యత్కు భరోసా నింపుకొన్నారు. పురుషుల అండర్–23 టూ డే లీగ్, అండర్–19 లీగ్, మహిళా క్రికెట్ లీగ్తో పాటు పలు కీలక పోటీల్లో రాణిస్తున్నారు. బ్యాట్, బాల్లో మెరుపులు మెరిపిస్తున్న వర్ధమాన క్రీడాకారులపై ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రీడలు బంతితో తిప్పేసిన ముఖితుద్దీన్ -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట క్రైం: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని డీఎస్పీ లింగయ్య సిబ్బందికి సూచించారు. కోస్గి సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు డీఎస్పీ ఎన్. లింగయ్య తన కార్యాలయంలో పెండింగ్ కేసులపై శనివారం సమీక్ష నిర్వహించారు. నేరాల నివారణకు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. విచారణలో ఉన్న కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సీఐ, ఎస్ఐల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, ప్రతి కేసులో బాధ్యతాయుతమైన విచారణ ఉండాలన్నారు. పూర్తి పారదర్శకంగా కేసుల విచారణ చేపట్టడంతో పాటు కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, సమూలంగా నిర్మూలించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి 60 రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారికి పూర్తి విచారణ, స్టేషన్ నిర్వహణ తెలిసి ఉండాలని, ప్రతిరోజు కేసులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సామాజిక అంశాలైన సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో కోస్గి సీఐ సైదులు, ఎస్ఐలు విజయ్కుమార్, బాలరాజు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. -
జిల్లావ్యాప్తంగా తనిఖీలు..
బాలబాలికలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలో పోలీస్శాఖ, కార్మికశాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో గత పదిరోజులుగా దాడులు నిర్వహిస్తున్నాం. పిల్లలను పనిలో పెట్టుకుంటే అట్టి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించాం. – మహేష్కుమార్, కార్మికశాఖ జిల్లా అధికారి కఠిన చర్యలు తప్పవు జిల్లాలో జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ మేరకు ప్రత్యేక బృందాల ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం వరుసగా దాడులు నిర్వహించి బాలకార్మికులను చేరదీసి వీరిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ దాడుల్లో ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవు. బాలలను పనిలో పెట్టుకున్న వారి సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – యోగేష్గౌతమ్, ఎస్పీ ● -
బాల్యానికి భరోసా..
నర్వ: బడికి వెళ్లి పాఠాలు వినాల్సిన చిన్నారులు.. తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీలు.. పొలాలు.. పరిశ్రమల్లో పనిచేసేందుకు లేదా.. గొర్రెలు మేస్తూ కాపరులుగా మారి వివిధ పనుల్లో చేరి బందీ అవుతున్నారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏటా జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్.. జులై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్లను నిర్వహించి బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండు నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి విముక్తికి కృషిచేస్తుంది. జిల్లాలో గత 11 రోజులుగా ఆపరేషన్ ముస్కాన్ ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది బాలకార్మికులను గుర్తించగా వీరిలో 8 మంది బాలికలు, 22 మంది బాలురు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాలకార్మికుల విముక్తి కోసం.. బాలకార్మికుల విముక్తి కోసం పోలీస్ శాఖ ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఆపరేషన్ స్మైల్ పూర్తిచేసి జులై 1 నుంచి ముస్కాన్ను ప్రారంభించారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశానిర్దేశంతో ఈ నెల 1 నుంచి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైంది. బాలకార్మికులను గుర్తించే పనిలో అధికార బృందాలు నిమగ్నమయ్యాయి. డీఎస్పీ లింగయ్య అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆపరేషన్ ముస్కాన్ను పకడ్భందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్లో 66 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. ఇందులో 47 మంది బాలురు, 19 మంది బాలికలను గుర్తించగా అందులో 18 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన బాలకార్మికులు ఉన్నారు. మొత్తం 2 కేసులు నమోదు చేసి 13 మంది బాలలను పనిలో పెట్టుకున్న యజమానులకు రూ.74 వేలు జరిమానా విధించారు. బాలకార్మికులుగా ఉన్న పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. గత ఏడాది కంటే ముస్కాన్ కార్యక్రమంలో ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగేంచేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలు.. బాలకార్మికులను గుర్తించి వీరిని విముక్తి కల్పించేందుకు నిర్వహించే దాడుల్లో ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుల్లు కలిసి ఒక బృందంగా ఏర్పాటై దాడులు నిర్వహిస్తారు. వీరితో పాటు కార్మికశాఖ, చైల్డ్లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, చైల్డెవెల్ఫేర్ కమిటీలు, బాలరక్ష భవన్, సఖీ, చైల్డ్ లైన్, ఐసీడీసీ సీడీపీఓ, ఆధార్ సిబ్బందితో పాటు, అధికారుల సమన్వయంతో బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులను వీరు గుర్తించి పనులు చేస్తున్న పని ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న చిన్నారులను చేరదీసి, ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. పిల్లలను బలవంతంగా పనిచేయించుకుంటున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పలు శాఖల సమన్వయంతో కార్మికశాఖ, విద్యాశాఖ, సీ్త్రశిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్, సఖీ, కార్మికశాఖ, బాలరక్షక భవన్, విద్యా శాఖల సమన్వయంతో వ్యవహరించి బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. బాలకార్మిక నిషేధ చట్టం–1986 ప్రకారం ప్రమాదకర పనుల్లో, పరిశ్రమల్లో, 14 ఏళ్ల వయస్సు లోపు బాలబాలికలతో పనిచేయించకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే యజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పైగా జరిమానాలు విధిస్తారు. 31 వరకు జిల్లాలో ‘ఆపరేషన్ ముస్కాన్’ బాల కార్మికులను వెట్టి నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యం ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు 2019 నుంచి 2025 జనవరి వరకు 964 మంది బాల కార్మికుల గుర్తింపు -
వైద్యులు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి
నాగర్కర్నూల్/ కల్వకుర్తి/ కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యులు మెరుగైన సేవలు అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం ప్రారంభం, జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన, నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో రూ.2 కోట్లతో మంజూరైన ప్రాథమిక అరోగ్య కేంద్రానికి, కల్వకుర్తి పట్టణంలో వంద పడకల ఆస్పత్రి భవనం శంకుస్థాపన, వెల్దండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ ద్వారా అందించే రూ.7.13 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆస్పత్రుల్లోఅధునాతన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మహిళా సాధికారత దిశగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రెండు ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు రూ.50 లక్షలు మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రిక్ బస్సును ఏర్పాటు చేస్తానన్నారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువవద్దని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు. వైద్య విద్యార్థుల కల నేటితో నెరవేరిందన్నారు. వైద్యులు రోగులకు మందులతో పాటు రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియపరచాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, డీసీహెచ్ఎస్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. రూ.140 కోట్లతో రోడ్ల అభివృద్ధి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వనపర్తి, జడ్చర్ల రోడ్డు, మహబూబ్నగర్–మన్ననూరు రోడ్డు విస్తరణకు రూ.140 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వనపర్తి నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్ నుంచి మున్ననూర్ వరకు ప్రధాన రహదారికి మరి కొన్ని రోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు తన చారిటీ ట్రస్టు ద్వారా కృషిచేస్తానన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సిబ్బందిమెరుగైన సేవలు అందించాలి ట్రామా కేర్ సెంటర్, జిల్లాకు ఓ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు -
కార్మికుల భద్రతకు భరోసా
కోస్గి: మున్సిపాలిటీల పరిధిలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జాతీయ యాంత్రీక పారిశుద్ధ్య పర్వావరణ వ్యవస్థ (నమస్తే) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని కేవలం గ్రేటర్ సిటీలు, నగరపాలికలు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన కార్మికులను గుర్తించి యాప్లో నమోదు చేస్తున్నారు. మరుగు దొడ్ల వ్యర్థాలు తొలగించే పాకీ పనివారు, సెప్టిక్ ట్యాంకులు, మురుగు కాలువలు, మ్యాన్ హోల్స్ శుభ్రపరిచే కార్మికులు, చెత్త ఏరుకొనే ప్రమాదకరస్థితిని ఎదుర్కొంటున్న కార్మికులకు భద్రత, పునరావాసం కోసం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. కార్మికులకు వరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకం కార్మికులకు ఓ వరంగా మారనుంది. పారిశుద్ధ్య కార్మికుల భద్రతతో పాటు గౌరవం, సురక్షితమైన వాతావరణంలో పని చేసుకోవడమే కాకుండా ఈ పథకం కింద గుర్తించిన కార్మికులకు ప్రత్యేక పరికరాలు అందించడం, పునరావాసం కల్పించడం, ఆధునిక, సురక్షిత పద్ధతుల్లో వారికి శిక్షణ ఇవ్వడం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ మేరకు గుర్తించిన కార్మికులకు ఆరోగ్య కిట్లు అందించడంతో పాటు సాధ్యమైనంత మేరకు యంత్రాలను వినియోగించేలా చర్యలు చేపడతారు. ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. చెత్త సేకరించే వారికి సైతం.. సాధారణంగా పట్టణాల్లో చెత్త సేకరణ ద్వారా ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరు డంప్ యార్డులు, ఇతర చెత్త నిల్వ ప్రదేశాల్లో చెత్తను సేకరించి అమ్ముకోవడం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చెత్త సేకరించే కార్మికులు సైతం తమ వివరాలను అధికారులకు అందించి నమస్తే యాప్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న కార్మికులకు భవష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేకంగా పించన్తోపాటు ఆర్దిక చేయుతనిచ్చి ఆదుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని నారాయణపేటలో ఐదుగురు, మక్తల్లో ఐదుగురు, కోస్గిలో 12 మంది కార్మికులను గుర్తించి నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీలో ఇంకా కార్మికుల గుర్తింపు ప్రక్రియ మొదలు కాలేదు. పథకం అమలు తీరు ఇలా.. ఆయా వృత్తుల్లో గుర్తించిన కార్మికులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తుంది. పారిశుద్ధ్య వృత్తికి సంబంధించిన వాహనాల కొనుగోలుకు సబ్సిడీ అందజేస్తారు. కార్మికుల పిల్లలు చదువుకునేందుకు ఆర్థికసాయం చేస్తారు. కార్మిక కుటుంబాలకు పునరావాసం కల్పిస్తూ ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. ‘నమస్తే’ పథకానికి కేంద్రం శ్రీకారం మున్సిపాలిటీల పరిధిలో అమలు కార్మికుల వివరాలు యాప్లో నమోదు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ప్రక్రియ -
ఓటరు నమోదు బాధ్యతాయుతంగా చేపట్టాలి
కోస్గి రూరల్: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల ఓటరు నమోదును బాధ్యతాయుతంగా చేపట్టాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బీఎల్ఓలకు శిక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 1 తేదీ నుంచి ఓటరు నమోదు ప్రారంభమైందని, కొత్త ఓటరు నమోదు, మార్పు చేర్పులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్పు చేసుకోవడం, ఎపిక్ కార్డు జనరేషన్, ఫొటో మార్పిడి, పేర్లు సవరించడం, చనిపోయిన వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. 1200 వందల ఓట్లకు పైబడిన ప్రాంతాలు 6 ఉన్నాయని అక్కడ నూతనంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసిల్దార్ బక్క శ్రీనివాసులు టైనర్లు రవికుమార్, హక్ తదితరులు ఉన్నారు. -
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యం
నారాయణపేట రూరల్/దామరగిద్ద: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం దామరగిద్దలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఇల్లు లేని పేదలందరికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని, విడతల వారీగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో బాల్రెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అధ్యక్షుడు ఈదప్ప, శ్రీనివాస్, ఖాజా, అంజప్ప, రఘు. వెంకట్రామరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో విధిగా మొక్కలను నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి విజయ్ కాలనీ అంతర్గత రహదారుల పక్కన శుక్రవారం మొక్కలు నాటి నీరు పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవాలని, అందుకు చెట్లు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సీజన్ కొనాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. యువత, మహిళలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి మొక్కల ప్రాముఖ్యతను తెలియచేయాలన్నారు. అంతకుముందు కాలనీ మహిళా బృందం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ శివారెడ్డి, మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ్ బట్టడ్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి
నారాయణపేట: అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక షిర్డీ సాయి మందిరంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొమ్మిదేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న 1985–87 ఇంటర్మీడియట్ బ్యాచ్కు చెందిన స్నేహ మిత్ర మండలి సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సందర్శించి.. రక్తదాతలకు అభినందనలు తెలిపారు. శిబిరంలో 74 యూనిట్ల రక్తం సేకరించినట్లు స్నేహ మిత్ర మండలి సభ్యులు డి.మదన్మోహన్రెడ్డి, డా.బాలాజీ సింగాడే తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, డి.మల్లేష్, బిల్డర్ వెంకట్రాములు, గుత్తి రమేశ్, సైదప్ప, గోపాలకృష్ణ, జగన్నాథ్, విజయ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. నవంబర్లోగా పనులు పూర్తిచేయాలి.. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్లోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రం సమీపంలో రూ. 5కోట్లతో చేపట్టిన జెడ్ఎంఎస్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణం ఇంకా పిల్లర్ల దశలోనే ఉండటంతో అసహనం వ్యక్తంచేశారు. భవన నిర్మాణంపై పర్యవేక్షణ పెంచాలని డీఆర్డీఓ మొగులప్ప, పంచాయతీరాజ్ ఈఈ హీర్యానాయక్కు సూచించారు. అదే విధంగా హ్యాండ్లూమ్ భవన నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పీఆర్ డీఈ విలోక్ ఉన్నారు. -
ముగ్గురు పిల్లలుకావాలనుకుంటున్నాం..
గత మే నెల 14న మాకు వివాహమైంది. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తాను. నా భార్య డిగ్రీ చదువుతోంది. ప్రతి ఇంట్లో ఒక్కరే పిల్లలు ఉంటున్నారు. ఈ విషయమై మేము ముగ్గురు పిల్లలను కనాలని భవిష్యత్ ప్లాన్ చేసుకున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కావాలనుకున్నాం. ఒక్కొక్కరికి మధ్య కొంత వయస్సు గ్యాప్తో పిల్లలను కనాలని భావిస్తున్నాం. – రాజేష్, మనుశ్రీ, కానాయపల్లి గ్రామం, కొత్తకోట మండలం భవిష్యత్కు ప్రణాళిక.. నాకు ఏడాది కిందట రాయచూరు జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహమైంది. ఇద్దరం ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మేం రెండేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా, కుటుంబం జీవన వ్యయం కూడా పెరిగింది. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండటంతో వచ్చిన డబ్బులను ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని జాగ్రత్త పడితేనే భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి సులభం అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నా భార్య నేను కలిసి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు వద్దకున్నాం. – రమేష్, జయలక్ష్మి, గద్వాల పట్టణం స్థిరపడిన తర్వాతే పిల్లలు.. మాకు ఇటీవలే వివాహమైంది. అయితే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి వ్యాపారంలో స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలన్న ఆలోచనతో ఉన్నాం. ఒకరిద్దరు సంతానం ఉంటే సరిపోతుందని భావిస్తున్నాం. మౌలి క సదుపాయాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర అవకాశాలు పెరుగుతున్న జనాభాతో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకరిద్దరి సంతానం ఉంటే వారి పర్యవేక్షణ సులభతరం అవుతుంది. – నరేష్, స్వప్న, నవాబుపేట -
వృద్ధిరేటు తగ్గుముఖం
సాక్షి, నాగర్కర్నూల్/నారాయణపేట: ఏటా జనా భా వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. దశాబ్దకాలంగా శిశుజననాలు తగ్గుతుండగా, వయో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. శిశువుల రేటు కన్నా వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతున్న కారణంగా భవిష్యత్లో ‘ఇతరులపై ఆధారపడే వారి నిష్పత్తి’ పెరుగుతోంది. దీంతో యువ జనాభా తగ్గుముఖం పడుతుండటం, వృద్ధుల జనా భా ఎక్కువగా ఉండటం వల్ల యువతపైనే సామాజిక, ఆర్థిక బాధ్యతలు పెరుగుతున్నాయి. 1991 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, సా మాజిక మార్పులు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛి న్నం, న్యూక్లియర్ కుటుంబాలకు ప్రాధాన్యం పెరగడం, ఎక్కువ మంది సంతానం ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయన్న కారణంతో జననాల వృద్ధిరేటు గణనీయంగా పడిపోతోంది. 1951 నుంచి 2011 వరకు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన జనాభా లెక్కల ఆధారంగా జనాభా వృద్ధిరేటు, మారుతున్న ట్రెండ్స్ను బట్టి పరిస్థితి అర్థమవుతోంది. సీ్త్ర, పురుష నిష్పత్తిలో పెరుగుతున్న అంతరం ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉండాల్సిన సీ్త్రల నిష్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆడ పిల్లల జననాలపై వివక్ష, అబార్షన్లు తదితర కారణాలతో మొత్తం జనాభాలో సీ్త్రల నిష్పత్తి తగ్గుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 7,45,101 మంది పురుషులకు 7,41,676 మంది మాత్రమే సీ్త్రలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 4,37,986 మంది పురుషులు ఉంటే 4,23,780 మంది సీ్త్రలు ఉన్నారు. గద్వాల జిల్లాలో 3,09,274 మంది పురుషులు ఉండగా, 3,00,716 మంది సీ్త్రలు, వనపర్తి జిల్లాలో 2,94,833 మంది పురుషులు ఉంటే 2,82,925 మంది సీ్త్రలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ జనాభా.. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్ జిల్లాలోనే ఎక్కువశాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జిల్లాలో 89.81 శాతం మంది గ్రామీణులు కాగా, 10.19 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. గద్వాల జిల్లాలో 89.64 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుండగా, 10.36 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 84.03 శాతం గ్రామాల్లో, 15.97 శాతం పట్టణాల్లో ఉంటున్నారు. మహబూబ్నగర్ (నారాయణపేటతో కలిపి) జిల్లాలో 79.27 శాతం గ్రామీణ జనాభా ఉండగా, 20.73 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 1991 నుంచి భారీగా తగ్గుదల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1951 నుంచి చేపట్టిన జనాభా లెక్కలను పరిశీలిస్తే ప్రతి దశాబ్దానికి కనీసం 9 శాతం నుంచి 26 శాతం వరకు జనాభా వృద్ధిరేటులో పెరుగుదల కనిపించింది. అయితే 1991 నుంచి కుటుంబ నియంత్రణ పకడ్బందీగా అమలు, సామాజికంగా మార్పులు, ప్రజల ఆలోచనల్లో మార్పుల కారణంగా జనాభా వృద్ధి భారీగా తగ్గింది. 1951 నుంచి 1961 వరకు 9.92 శాతం వృద్ధి కనిపించగా, 1971 నాటికి ఏకంగా 21.46 శాతం జనాభా వృద్ధి నమోదైంది. 1981 నాటికి 26.53 శాతం, 1991లో 25.87 శాతం జనాభా వృద్ధి చెందింది. అయితే 1991 లో 25.87 శాతం నుంచి 2001 నాటికి జనాభా వృద్ధి 14.20 శాతానికి పడిపోయింది. అక్కడి నుంచి 2011 నాటికి 15.34 శాతానికే పరిమితమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటేటా తగ్గుతున్న జననాలు పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య 1991 నుంచి జనాభా వృద్ధిరేటులో భారీగా తగ్గుదల భవిష్యత్పై ఆందోళన, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సంతానాన్ని తగ్గించుకుంటున్న వైనం -
ట్రాన్స్కో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కోస్గి: విద్యుత్ కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరుపై సమగ్ర ఆధారాలతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ట్రాన్స్కో అధికారుల లీలలు’ కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై ట్రాన్స్కో ఎస్ఈ వెంకటరమణ స్పందిస్తూ.. అధికారుల మధ్య సమన్వయ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి, కలెక్టర్కు నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. కాగా సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్ స్వయంగా పర్యటిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశిస్తుండగా.. స్థానిక అధికారులు మాత్రం ఇష్టారీతిగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశం -
గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
నారాయణపేట క్రైం: మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీంలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారన్నారు. ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు సరికొత్త పంథాలను ప్రయోగిస్తున్నారన్నారు. మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతో నట్టేట ముంచుతున్నారని తెలిపారు. మల్టీ లెవల్ కంపెనీల పేరుతో నిర్వహించే గొలుసుకట్టు వ్యాపారాలను నమ్మవద్దని ఎస్పీ సూచించారు. మల్టీలెవల్ వ్యాపారం ముసుగులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. గొలుసుకట్టు మార్కెటింగ్లో ముందుగా చేరిన వారికి మాత్రమే లాభాలు వస్తాయని.. ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందేనని తెలిపారు. ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరూ వెళ్లొద్దని.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అబద్ధపు ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింక్లు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దన్నారు. ఆర్థిక మోసాలపై సైబర్ క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య మరికల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని జెడ్పీ సీఈఓ శైలేల్కుమార్ అన్నారు. మరికల్ బాలుర ఉన్న త పాఠశాలలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వాష్రూం, వంటగదితో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై విద్యార్థులతో ఆరా తీశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన సహఫంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నాగరత్నమ్మ పాల్గొన్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వండి నారాయణపేట: పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని భూ నిర్వాసిత రైతుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు జి.వెంకట్రామారెడ్డి, కన్వీనర్ మశ్చందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన భూ నిర్వాసితుల స మావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం వ్య వసాయ భూముల ధర ఎకరా రూ. 30లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుందన్నారు. అయితే ప్రభుత్వం రూ. 13లక్షలు లేదా రూ. 14లక్షలు ఇస్తామనడం ఆమోధయోగ్యం కాదన్నారు. మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులకు పరిహారం నిర్ణయించాలని కోరారు. లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలన్నా రు. సమావేశంలో భూ నిర్వాసితుల సంఘం నాయకులు గోపాల్, అంజిలయ్య, మహేశ్ కుమార్, ధర్మరాజు, లక్ష్మీకాంత్, కేశవ్, నారాయణ, నర్సింహులుగౌడ్, సంతోష్ ఉన్నారు. -
పెరుగుతున్న జనాభాతో అనర్థాలు
బాదేపల్లిలోని శ్రీవెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్న అమరవాది ప్రభు, విజేత దంపతులు చిరు వ్యాపారంతో జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి 12 ఏళ్లు గడుస్తుండగా తల్లిదండ్రులతో కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల వయస్సు గల ఓ పాప ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్న ఆలోచనతో ఒకరిద్దరు సంతానం చాలని భావిస్తున్నారు. వీరినే ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశానికి సరైన విధంగా తయారు చేసే పరిస్థితి ఉంటుందన్నారు. అధిక జనాభాతో దేశంలో క్రమశిక్షణ లోపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు
నారాయణపేట: జిల్లాలోని మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులకు హైదరాబాద్ శిల్పారామంలోని ఇందిరా మహిళాశక్తి బజార్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి.. ఆర్థిక స్వావలంబనకు తో డ్పాటు అందిస్తామని ప్రత్యేకాధికారిణి సౌజన్య అన్నారు. గురువారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తన బృందంతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళ లు తయారుచేసిన వెదురు ఉత్పత్తులు, ఎర్రకోట, బంకమట్టి ఆభరణాలు, చిక్కిళ్లు, లడ్డూలు, ఇ తర స్వీట్స్, నారాయణపేట కాటన్ చీరలు, దోతీలు, చట్నీలు, నూనెలు, పల్లీ, నువ్వులు, కొ బ్బెర పట్టీలు, సబ్బులు, అగర్బత్తీలు, షాంపు లు, కలంకారి వస్త్రాలు, తాటి ఆకుల వస్తువులు, జూట్ బ్యాగ్లు, కారంపొడి, జొన్నరొట్టెలు తదితర వాటిని పరిశీలించారు. శిల్పారామంలో ఏ ర్పాటుచేసిన మహిళాశక్తి బజార్ను పరిశీలించి.. తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, కార్యదర్శి సుజాత, కోశాధికారి అంజమ్మ, డీపీఎంలు గోవిందు, మాసన్న, జయన్న, సీసీలు భీమయ్య, శ్రీనివాస్, కతాల్, గొల్ల రాము, అకౌంటెంట్ మహేశ్వరి పాల్గొన్నారు. -
సమాజానికి మంచి..
బాదేపల్లిలోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన నరేష్, వీణ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆస్తులు ఉన్నా అధిక సంతానం అనర్థానికి దారి తీస్తుందన్నది వీరి అభిప్రాయం. ఇద్దరికి చక్కటి విద్యను అందించగలిగితే వారు ఉన్నత స్థాయికి ఎదగడంతోపాటు సమాజానికి మంచి చేస్తారని భావిస్తున్నారు. అధిక జనాభా వలన మౌలిక సదుపాయాల కల్పన, పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడి తప్పుతుందని, పాలనాపరమైన సమస్యలు ఎదురవుతాయని, సరైన సేవలు, సౌకర్యాలు అందక ఆందోళనలు చోటు చేసుకునే పరిస్థితులు దాపురిస్తాయని పేర్కొంటున్నారు. -
చిన్నారుల్లో పోషకాహార లోపం
మక్తల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు ఖర్చు పెట్టి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నా చిన్నారుల్లో పోషక లోపం, పెరుగుదల మందగించినట్లు జాతీయ ఆరోగ్య సర్వేల్లో తేలింది. దీంతో మక్తల్, మద్దూర్, నారాయణపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలా చిన్నారుల ఎత్తు, బరువును కొలిచి ఆన్లైన్లో నమోదు చేయాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక కార్డులు ఇవ్వనున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో నెలకొకసారి సీ్త్ర, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ వివరాలపై చర్చిస్తున్నారు. అతి తక్కువ బరువు ఉన్న చిన్నారులను ఆస్పత్రుల్లో ఉన్న పోషణ సలహ కేంద్రాలకు పంపించి, వారికి అవసరమైన మందులు అందిస్తున్నారు. 704 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 704 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. వాటిలో మేజర్ అంగన్వాడీలు 649 కాగా మినీ కేంద్రాలు 55 ఉన్నాయి. వాటిలో 639 మంది టీచర్లు, 599 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 33,214, మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,025 మందికి నిత్యం పోషకాహారం అందిస్తున్నారు. దీంతో పాటు ప్రతి నెలా వైద్య సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు అందిస్తున్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ చేయిస్తాం జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్లో భాగంగా చిన్నారుల బరువు, ఎత్తు కొలతలు చేయిస్తున్నాం. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తాం. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. పోషకలోపం ఉన్న చిన్నారుల వివరాల కార్డును తల్లిదండ్రులకు అందజేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే పోషకాహారాన్ని చిన్నారులకు క్రమం తప్పకుండా అందిస్తున్నాం. – సరోజిని మట్ట, సీడీపీఓ మక్తల్ ప్రాజెక్టు వెల్లడించిన జాతీయ ఆరోగ్య శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో సర్వే జిల్లావ్యాప్తంగా 3 ఐసీడీఎస్ ప్రాజెక్టులు