breaking news
Narayanpet
-
ఆన్లైన్ నమోదులో వేగం పెంచాలి
నారాయణపేట రూరల్/మరికల్: ఓటర్ల నుంచి పూరించిన ఎన్యూమరేషన్ పత్రాలను సేకరించి, వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం నారాయణపేట మండలంలోని చిన్నజట్రం, కొల్లంపల్లి, లింగంపల్లి, మరికల్ మండల కేంద్రంతో పాటు అప్పంపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్ల పనితీరు, జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్ని ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు.. అందులో ఎన్ని పత్రాలు తిరిగి తీసుకున్నారు.. ఇంకా ఎన్ని తీసుకోవాల్సి ఉందనే వివరాలను ఆయా బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను నింపి బీఎల్ఓలకు తిరిగి ఇస్తేనే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని, ఇవ్వకపోతే జాబితాలో పేరు ఉండదు అని ఆమె స్పష్టం చేశారు. చనిపోయిన ఓటర్ల పేర్లు, డబుల్ ఓట్లు తొలగించాలన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు అమరేంద్ర కృష్ణ, రాంకోటి, ఎంపీడీఓ పృథ్వీరాజ్, సిబ్బంది వెంకటప్ప, జ్యోతి, సూపర్వైజర్లు ఆంజనేయులు గౌడ్, బాలాజీ, కార్యదర్శులు సుజాత, ఎండీ ఖదీర్, విజయ్, సర్పంచులు జ్యోతి నాగేష్, మణెమ్మ బాలప్ప, భాగ్య జగన్, బిఎల్ఓలు పాల్గొన్నారు. -
డ్యూటీ మీట్లో నారాయణపేట పోలీసుల సత్తా
నారాయణపేట: జోగుళాంబ జోన్–7 పోలీస్ డ్యూ టీ మీట్లో నారాయణపేట జిల్లా పోలీసు అధికారు లు, సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాన్ని మరో సారి చాటిచెప్పారు. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహించిన జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో వివిధ సాంకేతిక, దర్యాప్తు, ప్రత్యేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులను కై వసం చేసుకున్నారు. ఈ విజయాలతో నారాయణపేట జిల్లా పోలీసు శాఖ జోన్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. వృత్తిపరమైన శిక్షణ, అంకితభావం, సేవా తత్పరతకు నిదర్శనంగా అధికారులు, సిబ్బంది పలు విభాగాల్లో పోటీపడి ఆకట్టుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్–క్రిమినల్ లాస్ కృష్ణా ఎస్ఐ ఎస్ఎం నవీద్ (ద్వితీయ స్థానం), ఫొటోగ్రఫీలో పీసీ సి.వెంకట్రాములు (పీఆర్ఓ) ప్రథమ స్థానం, వీడియోగ్రఫీలో పీసీ బి.నరేష్ (ప్రథమ స్థానం), ట్రాకింగ్లో పోలీస్ జాగిలం ‘రుద్ర’, హ్యాండ్లర్లు రవి, నరేందర్ (ద్వితీయ స్థానం), బాంబు డిస్పోజల్ టీమ్–రూం సెర్చ్లో డి.లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు (ప్రథమ స్థానం) బాంబు డిస్పోజల్–యాక్సిస్ కంట్రోల్లో డి.లక్ష్మీకాంత్రెడ్డి, ఆంజనేయులు (ద్వితీయ స్థానం)లో నిలిచారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జోనల్ స్థాయిలో కనబరిచిన ప్రతిభను రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లోనూ కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది సాధించిన విజయాలు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని, పోలీసు శాఖలో ఉన్న వృత్తి నైపుణ్యం, నిరంతర శిక్షణకు ఇవి నిదర్శనమని డ్యూటీ మీట్ ఇన్చార్జి, మరికల్ సీఐ భగవంత్రెడ్డి పేర్కొన్నారు. -
పవర్ పాలిట్రిక్స్!
గద్వాల విద్యుత్ శాఖలో హైటెన్షన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వా ల జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బదిలీల లొల్లి తారస్థాయికి చేరింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక్క రోజు ముందు జిల్లా స్థాయిలో చేసిన బదిలీలు వివాదాస్పదంగా మారా యి. విద్యుత్ సంస్థలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరో వైపు ఎస్ఈ సీటు ఆరు రోజులుగా ఖాళీగా ఉండడం.. కనీసం ఇన్చార్జిగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. గద్వాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి జూన్ 30వ తేదీన హైదరాబాద్కు బదిలీ కాగా.. ఈ నెల ఒకటో తేదీన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఎస్ఈ బదిలీ ఉత్తర్వుల కంటే కంటే ఒక రోజు ముందే డిస్పాచ్లతో ఇద్దరు జేఏఓలు, ఒక లైన్మన్, ఒక ఆర్టీజన్కు బదిలీ చేసినట్లు.. ఈ నెల 2వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆర్టీజన్ ఫీల్డ్లో పని చేయాల్సి ఉంటుంది. కానీ సిస్టం వర్క్ వస్తదనే కారణంతో ఎస్ఈ కార్యాలయంలో చేస్తున్నారు. తాజాగా మళ్లీ స్టోర్ రూమ్కు బదిలీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 6 రోజులుగా కుర్చీ ఖాళీ.. గత నెల 30న గద్వాల ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి బదిలీపై వెళ్లారు. అయన స్థానంలో వేణుగోపాల్ పదోన్నతిపై ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన జాయిన్ కాలేదు. ఈ క్రమంలో సీఈ ఇన్చార్జిగా వ్యవహరించడం ఆనవాయితీ. లేదంటే కనీసం అక్కడున్న డీఈకి తాత్కాలికంగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకపోవడం.. ఆరు రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీగా ఉండడం.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పలు సమస్యలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. పట్టించుకోని సీఈ.. హైదరాబాద్కు ఉద్యోగులు ఎస్ఈ లేనిపక్షంలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) సర్కిల్ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. బదిలీలపై గందరగోళం, ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ అధికారి కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్కు వెళ్లారు. అయితే సీఎం మీటింగ్ ఉందంటూ దాటేస్తూ సీఈ కలవలేదని సమాచారం. దీంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేసేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ అధికారే కారణమా? గద్వాల సర్కిల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న బదిలీలకు సర్కిల్లోని అకౌంట్ సెక్షన్లో ఉన్న ఓ సీనియర్ అధికారి కారణమనే చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. గతంలో గద్వాల డివిజన్ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిణి సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ఆ డివిజన్ డీఈ ఫిర్యాదు చేస్తే.. సదరు సీనియర్ అధికారి తన పలుకుబడితో ఎస్ఈ ద్వారా తన సెక్షన్కు బదిలీ చేయించారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన బదిలీల్లో ఆ సీనియర్ అధికారి హస్తమే ఉన్నట్లు సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారికి భవిష్యత్లో ఇబ్బంది రాకుండా ఎస్ఈ ద్వారా వ్యూహాత్మకంగా బదిలీ చేయించినట్లు వినికిడి. ఇద్దరు జేఏఓలను ఒకే కార్యాలయంలో ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్కు మార్చడం కొసమెరుపు. ఇటీవల సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి బదిలీ ఒక్కరోజు ముందు తేదీతో జిల్లాస్థాయిలో నలుగురికి ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు రిలీవ్ అయిన తర్వాత వెలుగులోకి.. బ్యాన్ ఉండగా చేపట్టడంపై విమర్శలు నిబంధనలకు విరుద్ధంగా వివక్షతో వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ఆగ్రహం 3 రోజులుగా ఆందోళనలతో గందరగోళం.. పట్టించుకోని సీఈ 6 రోజులుగా ఎస్ఈ కుర్చీ ఖాళీ.. ఇన్చార్జిని ఇవ్వకపోవడంపై అనుమానాలు -
3 రోజులుగా ఆందోళనలు..
ఎస్ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. ధర్నాలు, బైఠాయింపుల వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎస్ఈ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని బదిలీలు చేశారని.. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఆరోగ్య కారణాలు చూపడమే ఇందుకు నిదర్శనమని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. -
పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
మక్తల్: పట్టణంలోని శ్రీపడమటి ఆంజనేమస్వామి ఆలయం వద్ద నిర్మిస్తున్న రాజగోపురం పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మత్య్సశాఖ, క్రీడల, యువజన శాఖల మంత్రి వాకి టి శ్రీహరి అన్నారు. మంగళవారం పడమటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి రా జగోపురం నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 60 లక్షలతో పనులకు టెండర్ పూర్తైనా.. పనులు ఎందుకు ఆలస్యం అయ్యాయని ఇంజినీర్, కాంట్రాక్టర్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ లో నిర్వహించే ఉత్సవాల వరకు రాజగోపురం పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల వనరులు ఉన్నాయని, అందరి తోడ్పా టు అవసరమన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రాణేశ్చారి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేశ్కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు భరోసా @ రూ.271 కోట్లు
2.02 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి నారాయణపేట: రైతు భరోసా పథకం అమలులో నారాయణపేట జిల్లా కీలక మైలురాయిని చేరుకుంది. జిల్లాలోని 251 గ్రామాల పరిధిలో 2,02,136 మంది అర్హులైన రైతులకు రూ.271.57 కోట్ల రైతు భరోసా నిధులు మంజూరు చేశారు. ఇందులో 1,88,493 మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఏఈ ఓలు నవీకరించగా వారికి సంబంధించిన రూ. 262.15 కోట్ల రైతు భరోసా చెల్లింపులకు మార్గం సుగమమైంది. కాగా ఇప్పటి వరకు 1,82,199 మంది రైతులకు సంబంధించిన రూ.259.09 కోట్ల బిల్లులు ట్రెజరీకి చేరాయి. మిగిలిన వారికి సంబంధించిన ఈ కేవైసీ, బ్యాంక్ ఖాతాలో తప్పులు తదితర కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. రైతులు ఏఈఓలను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మక్తల్ మండలానికి అత్యధికంగా రూ.39.44 కోట్లు 1.88 లక్షల ఖాతాల నవీకరణ 152 డీబీటీ చెల్లింపులు పెండింగ్ విడతల వారీగా చెల్లింపు -
రూ.189.91 కోట్లు జమ
జిల్లాలో 1.67 లక్షల మంది రైతులకు పెట్టుబడి సా యం కింద ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఇప్పటికే రూ.189.91 కోట్లు చెల్లించాం. మిగిలిన రైతులకు కూడా విడతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తాం. రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. – సక్రియా నాయక్, డీఏఓ, నారాయణపేట ●అర్హులైన రైతుల ఖాతాల్లో విడతల వారీగా రైతు భరోసా పథకం కింద నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 1,67,678 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.189.91 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 152 మంది రైతులకు సంబంధించిన రూ.16. 93 లక్షల డీబీటీ చెల్లింపులు విఫలం కాగా.. అత్యధికంగా నర్వ మండలంలో 23 మందికి చెందిన రూ.2.84 లక్షలు నిలిచిపోయాయి. బ్యాంకు ఖాతాల ధృవీకరణ, ఈ–కేవైసీ, ఆధార్ అనుసంధానం పూర్తిచేసుకున్న రైతులకు ప్రాధాన్యంగా చెల్లింపులు కొనసాగుతున్నాయి. మక్తల్ మండలంలో అత్యధికంగా 20,039 మంది రైతుల ఖాతాల్లో రూ.25.61 కోట్లు జమయ్యాయి. -
మెడికల్ కళాశాల సీట్ల పెంపు
పాలమూరు: పాలమూరు మెడికల్ కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసీ మంగళవారం అనుమతులు ఇచ్చింది. 2016– 17 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఆ తర్వాత ఎదిర శివారులో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల శాశ్వత భవనం నిర్మించారు. 2019లో 150 సీట్ల నుంచి 175 సీట్లకు పెంచగా ప్రస్తుతం కళాశాలలో 825 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2026– 27 నుంచే పెరిగిన సీట్లు ఏర్పాటుకు అనుమతి కల్పించారు. దీంతో పాలమూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. ● 2016 నుంచి 2026 వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆరు బ్యాచ్లు బయటకు వెళ్లాయి. అదేవిధంగా 34 పీజీ సీట్లు మంజూరు కాగా 34 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీఎస్సీ సైన్స్లో 70 సీట్లు, డీఎంఎల్టీలో 30 సీట్లు, డయాలసిస్లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి కళాశాల.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఏర్పాటైన పాలమూరు మెడికల్ కళాశాలలో ఒక్కో విభాగం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట జనరల్ ఆస్పత్రిలో వెనుక భాగంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహణ సాగింది. గత 11 ఏళ్ల కాలంలో మెడికల్ కళాశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా ఉస్మానియా, గాంధీ తర్వాత పాలమూరు కళాశాల మూడో స్థానంలో ఉండటం విశేషం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పాత కలెక్టరేట్ స్థానంలో గత ప్రభుత్వం వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు వసతుల కల్పన కోసం మొత్తం రూ.270 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు నాలుగు బ్లాక్లు పూర్తి కాగా.. ఈ–బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో 25 సీట్లకు అనుమతి ఇచ్చిన ఎన్ఎంసీ మొత్తం 200లకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అదనంగా వచ్చిన వాటితో పేద విద్యార్థులకు మేలు -
కోటదిబ్బకు ‘జాతీయ’ హోదా
సాక్షి, న్యూఢిల్లీ/నాయుడుపేట టౌన్: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, చారిత్రిక వైభవానికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గుర్తింపునిచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని గొట్టిప్రోలు (కోటదిబ్బ) గ్రామంలోని పురాతన దిబ్బ, తవ్వకాల్లో బయటపడిన అపురూప అవశేషాలను జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతత్వ ప్రాంతం (ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్)గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర సాంస్కృతికశాఖ (భారత పురాతత్వశాఖ–ఏఎస్ఐ) రాజపత్రం (గెజిట్ నోటిఫికేషన్) విడుదల చేసింది.1958 నాటి పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం ప్రకారం ఈ చారిత్రిక భూభాగాన్ని జాతీయ సంపదగా కేంద్రం నోటిఫై చేసింది. కోటదిబ్బ ప్రాంతానికి జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే అడుగు వేసింది. 2026 జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేస్తూ, ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలియజేయడానికి రెండునెలల గడువు ఇచ్చింది. దీనిపై ఆలయ సమీపంలోను నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. గడువు ముగిసేసరికి ప్రజల నుంచి అభ్యంతరాలు, వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదు.దీంతో కేంద్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ జనరల్ యదుబీర్సింగ్ రావత్ ఆదేశాల మేరకు జూలై 2న తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ గెజిట్ ప్రకారం గొట్టిప్రోలు గ్రామంలోని సర్వే నంబరు 235 (4.28 ఎకరాలు), సర్వే నంబరు 131/1 (19.94 ఎకరాలు)లోని మొత్తం 24.22 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షిత పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ గెజిట్ ప్రకటనతో కోటదిబ్బ పరిసర ప్రాంతాలు పూర్తిగా భారత పురాతత్వశాఖ (ఏఎస్ఐ) ఆధీనంలోకి వెళ్లనున్నాయి. చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ఈ పురాతన దిబ్బ పరిధిలో అక్రమ తవ్వకాలు, ప్రైవేట్ నిర్మాణాలు జరగకుండా కఠినమైన చట్టాలు అమలు కానున్నాయి. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ మరిన్ని విస్తృతమైన పురాతత్వ పరిశోధనలు, తవ్వకాలు జరిపేందుకు ఈ నోటిఫికేషన్ ఎంతో కీలకం కానుంది.శాతవాహనుల వాణిజ్య కేంద్రంగొట్టిప్రోలు గ్రామ సమీపంలో రహదారి పక్కనే ఉన్న కోటదిబ్బ ప్రాంతం రెండువేల సంవత్సరాల కిందట శాతవాహనుల కాలంలో వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 2020 నుంచి ఈ ప్రాంతంలో తిరుపతి పురావస్తుశాఖ అధికారులు చేసిన తవ్వకాల్లో విగ్రహాలు, బావులు, కోటగోడ, అంతర్భాగంలో ఉండే డ్రైనేజీ వ్యవస్థ, పలు పనిముట్లు బయటపడ్డాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల అభ్యంతరాలతో నాలుగేళ్ల కిందట పురావస్తుశాఖ అధికారులు అక్కడ తవ్వకాలను నిలిపేశారు. ఇప్పుడు గొట్టిప్రోలు కోటదిబ్బ ప్రాంతాన్ని కేంద్ర పురావస్తుశాఖ స్వాధీనం చేసుకోవడంతో మరింత చరిత్ర వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.పాలంపేట శివాలయానికీ గుర్తింపుసాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గౌరవాన్ని కల్పించింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని చారిత్రక శివాలయానికి ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతన స్మారక చిహ్నం’గా అధికారిక ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ (భారత పురాతత్వ శాఖ –ఏఎస్ఐ) సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1958 నాటి పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం ప్రకారం ఈ ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటించింది. -
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతీక ప్రజావాణి.. అధికారులు బాధ్యతగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ప్రియాంకతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించాలని, పెండింగ్లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 31 వినతులు రాగా.. అందులో చేనేతకు సంబంధించి 1, బ్యాంకు సమస్యలపై ఒకటి, భారత్మాల రోడ్డు సమస్యలపై 3, డీపీఓకు 2, డీఈఓకు 1, భూ సమస్యలపై 20, సర్వే కోసం ఒకటి, ఇరిగేషన్ సమస్యలపై రెండు ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరి నాట్లు వేయడానికి యూరియా, డీఏపీ కొనడానికి దుకాణానికి వెళ్లాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇవ్వాలని అడిగితే స్టాక్ లేదన్నారు. కొద్దిసేపటి తర్వాత రూ.300 ఇస్తే యూరియా ఉందన్నారు. అంతేగాక ఫలానా పురుగుమందు, విత్తనాలు కొంటేనే ఎరువులు ఇస్తామని చెప్పారు. అవసరం లేకపోయినా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. డీఏపీ బస్తాపై ప్రభుత్వ ధర రూ.1,350 ఉండగా రూ.1800 కంటే ఎక్కువ అడిగారు. రైతుల ఇబ్బందులను అవకాశంగా మార్చుకొని కొందరు వ్యాపారులు లాభాలు చూస్తున్నారు. – వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు, భారతీయ కిసాన్మోర్చా జీవితమంతా కష్టపడి ఐదు ఎకరాలకుపైగా భూమి సంపాదించాం. వృద్ధాప్యంలో పిల్లలే ఆధారం అనుకొని నలుగురు కుమారుల పేర్లపై పట్టా చేశాం. ఏటా ఖర్చులకు డబ్బులిస్తామని, చూసుకుంటామని మాట ఇచ్చారు. భూమి వారి పేరున మారాక ఎవరూ పట్టించుకోవడం లేదు. తిండి కూడా సరిగా పెట్టడం లేదు. అనారోగ్యం పాలైనా.. అడిగేవారు లేరు. పట్టా చేసిన భూమిని తిరిగి మా పేరుపై మార్చాలని కలెక్టర్కు విన్నవించాం. – కుర్వ వెంకటయ్య దంపతులు, పాతర్చేడ్, నర్వ మండలం 15 నెలలుగా వేతనాలు లేవు.. కుటుంబాన్ని పోషించలేక విధులకు వెళ్లలేకపోతున్నాం. 2025, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల జీతం కూడా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, అప్పులు అన్నీ పెరిగాయి. చివరకు ఉద్యోగానికి వెళ్లడానికి అయ్యే బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. అందుకే జూన్ 1 నుంచి విధులకు హాజరుకాలేకపోతున్నాం. పలుమార్లు అధికారులకు సమస్య చెప్పినా పరిష్కారం కాలేదు. – 104 సిబ్బంది గతంలో మేము కలెక్టర్ దగ్గర సింగారం గ్రామపంచాయతీ పరిధి కౌరంపల్లి శివారులో ప్లాట్లు కొనుగోలు చేశాం. హద్దు రాళ్లను తొలగించడంతో ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. హైకోర్టులో కేసు నడుస్తుండగా స్టే ఆర్డర్ కూడా వచ్చింది. అయినప్పటికీ కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జిల్లా సర్వేయర్తో కొలిపించి సరిహద్దు రాళ్లు పాతించి ప్లాట్లను గుర్తించి అప్పగించాలి. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా పరిష్కారం కాలేదు. -
సమష్టి కృషితోనే విజయాలు సాధ్యం
● మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ నారాయణపేట రూరల్: పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకర్తలు శ్రమించిన తీరును ఆదర్శంగా తీసుకొని పార్టీ శ్రేణులు సమష్టి కృషితో రాబోవు ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగురవేయాలని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని, ప్రజల కష్టాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు అవకాశం లేదని.. కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తోందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్రెడ్డి పాలనను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిబద్ధతతో పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వెన్ను తడతాయని.. సర్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు బూత్స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సహకరించి నిజమైన ఓటర్లను నమోదు చేయించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, లక్ష్మి, కొండయ్య, శ్రీనివాసులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు, ఐమాస్ట్ లైట్లు ప్రారంభం.. మండలంలోని బోయిన్పల్లి, అప్పక్పల్లి, కొల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైట్లు, సీసీ రోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి డబ్బులు వెచ్చించడం లేదని, కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. రైతులకు రాయితీపై ఎరువులు, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని.. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో మోదీ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ను అభినందించిన ఎంపీ.. మండలంలోని బోయిన్పల్లి సర్పంచ్ వెంకటేష్ తన గౌరవ వేతనాన్ని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయించారు. ఆ డబ్బులతో కంప్యూటర్ కొనుగోలు చేసి డీకే అరుణ చేతులమీదుగా పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిస్వార్ధంగా సేవ చేయడం అభినందనీయమని.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. మండల అధ్యక్షురాలు జ్యోతి, మాజీ అధ్యక్షుడు సాయిబన్న, మానియమ్మ, భజరంగ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
అపార్.. అంతంతే..!
జిల్లాలో మందకొడిగా సాగుతున్న నమోదు నారాయణపేట రూరల్: జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో ప్రతి విద్యార్థికి అపార్ (అటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థికి 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయిస్తున్నారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో 2023, అక్టోబర్ 18న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆది నుంచి అవాంతరాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా.. ఆధార్లోని సమాచారం, విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లోని వివరాలతో సరిపోలక సాంకేతిక చిక్కులు తలెత్తడంతో గతేడాది చివరి వరకు సైతం పూర్తి కాలేదు. వివిధ సమస్యలతో నిర్ణీత సమయంలో నమోదు ప్రక్రియ పూర్తికావడం లేదన్న వాదన వినిపిస్తుంది. టాప్లో మరికల్.. చివరిలో గుండుమాల్... మరికల్ మండలంలో 81 శాతం అపార్ పూర్తిచేసి మొదటి స్థానంలో నిలువగా.. 67 శాతంతో గుండుమాల్ చివరి స్థానంలో నిలిచింది. విద్యాశాఖ అధికారులు, సీఆర్పీలు రోజువారీగా పాఠశాలలపై ఒత్తిడి తెస్తున్నా.. సాంకేతిక కారణాల దృష్ట్యా అపార్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కావడంతో నూతనంగా చేరే విద్యార్థులకు సైతం అపార్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ● ‘నారాయణపేట మండలం కోటకొండకు చెందిన విద్యార్థి పుట్టిన తేది యూడైస్లో ఒక విధంగా, ఆధార్లో మరో విధంగా ఉండటంతో అపార్ పునరుద్ధరణ పూర్తి కాలేదు. ● కొల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థిని ఇంటి పేరు యూడైస్లో ఉండగా.. ఆధార్లో లేకపోవడంతో వివరాలు సరిపోలక అపార్ జనరేట్ కావడం లేదు. జిల్లాలో చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది.’ ఇవీ సమస్యలు.. ముఖ్యంగా ఆధార్లోని విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలో అడ్మిషన్ రిజిస్టర్లో ఉన్న వివరాలతో సరిపోలక అపార్ జనరేట్ కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో ఆధార్ను సరిచూసుకొని వారి అడ్మిషన్ రికార్డుల్లో వివరాలు సరిచేసి అపార్ నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పదోతరగతి పూర్తయి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు ఈ వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా విద్యార్థులు తప్పకుండా ఆధార్కార్డులోని వివరాలను సరి చేసుకోవాల్సి ఉండటం.. స్థానికంగా ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉంచకపోవడంతో హైదరాబాద్కు పరుగులు పెడుతున్నారు. ఇదీ పరిస్థితి.. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో విద్యార్థుల సమగ్ర వివరాలు నమోదు చేసేందుకు పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఉంటాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అపార్ కార్డులను మంజూరు చేయనున్నారు. ఇందులోని గుర్తింపు సంఖ్య ఆధార్కార్డు తరహాలో శాశ్వతంగా అందుబాటులోకి ఉంటుంది. విద్యార్హతలు, గ్రేడ్లు, మార్కులు, సాధించిన ప్రగతి, ఉపకార వేతనాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల సమాచారం, కుటుంబ సభ్యుల వివరాలు పొందుపరుస్తారు. ఉన్నత విద్య ప్రవేశాలు, పోటీ పరీక్షలకు ఈ డిజిటల్ పత్రాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. భవిష్యత్లో ఒరిజినల్ పత్రాలు లేవనే దిగులు లేకుండా ఈ ప్రక్రియ దోహదపడనుంది. ఇంత ప్రాధాన్యత ఉన్న అపార్కు తల్లిదండ్రుల అంగీకారాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల జనన ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం, ఆధార్కార్డులో పుట్టిన తేదీలు తప్పుగా నమోదుకావడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లలో 75 శాతం మాత్రమే పూర్తి ఆధార్ వివరాలు సరిపోలక తీవ్ర జాప్యం విద్యాసంస్థల్లో తప్పని అవాంతరాలు కొత్త విద్యా సంవత్సరంలోనూ నామమాత్రంగా ప్రక్రియ -
కృష్ణమ్మా.. కరుణించుమా!
నదితీర ప్రాంతాల్లో ప్రశ్నార్థకంగా వానాకాలం వరి సాగు నారున్నా.. నాటు వేయలేని స్థితి.. వరినారు పోసి నెల గడిచింది. ఈపాటికే నాటు వేయాల్సి ఉన్నా.. నదిలో నీరు పారక వేయలేకపోతున్నా. 15 రోజులు దాటాక నాటు వేస్తే దిగుబడి తగ్గుతుంది. సరైన సమయంలో నాట్లు వేస్తేనే అధిక దిగుబడి పొందవచ్చు. – కుంబరి చంద్రప్ప, రైతు. మురహర్దొడ్డి ఆశలు వదులుకున్నాం.. ఈ ఏడాది వరి పంటపై ఆశలు వదులుకున్నాం. ఇదివరకే నాట్లు వేసుకోవాలి.. కానీ నీరందక వేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న నారుమడులు కూడా నీరందక ఎండిపోతున్నాయి. మరోమారు నారుపోసి నాట్లు వేసే అవకాశం ఉండదు. – దేవేంద్రప్ప, రైతు, కుసుమర్తి కృష్ణా: ఓ పక్క కృష్ణానది.. మరోపక్క పెద్ద వాగు ఉండటంతో ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా మండలం కోనసీమను తలపించేది. 15 ఏళ్లుగా కృష్ణా, భీమా నదుల నుంచి పుష్కలంగా సాగునీరు లభించి పంటల సాగుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ప్రస్తుతం వర్షాకాలం సగం గడిచినా ఆయా నదుల్లో నీరు పారక ఎక్కడ కూడా వరి సాగు చేపట్టకపోవడంతో పోలాలన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు నీరు లేక మూతబడుతున్నాయి. నదిలో ఉన్న నీటిని కాల్వలు తవ్వి ముందస్తుగా నారుమడులు వేసుకున్నారు. నెలలోపు నాట్లు వేయాల్సి ఉండగా.. 45 రోజులు అవుతున్నా నదిలో నీటిజాడ కనిపించపోవడంతో నారుమడులు ఎండుముఖం పడుతున్నాయి. మరోపక్క పెద్ద వాగుపై సంగంబండ ప్రాజెక్టు నిర్మించడంతో వర్షపు నీరు పారడం లేదు. గతంలో కర్ణాటకలో ఎక్కడో వర్షం కురిసినా కూడ వాగుకు పారి పొలాలకు సాగునీరు అందేది. ప్రస్తుతం ప్రాజెక్టులోనే నీరు లేకపోవడంతో దిగువకు చుక్క నీరు రావడం లేదు. వాగు తీరంలోని గ్రామాల్లో ఉన్న బోరుబావుల్లో నీరు రావడం లేదని, కనీసం నారుమడులకు కూడా అందని పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. గతంలో కేవలం ఎండకాలంలోనే ఇలాంటి పరిస్థితులు ఉండేవని.. ప్రస్తుతం వర్షకాలంలోనూ పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సాగు సమయం దాటిపోతోందని.. సకాలంలో వరి నాట్లు వేయకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా వారంలో నదిలో నీరు పారకపోతే పంటల సాగు ప్రశ్నార్థకం కానుందని అంటున్నారు. నీరు లేక వెలవెలబోతున్న కృష్ణానది మూతబడిన ఎత్తిపోతలు ఎండుతున్న నారుమడులు రెండునెలలుగా ఎదురుచూపులు ముగుస్తున్న సమయం.. ఆందోళనలో అన్నదాతలు -
బీసీ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి
నూతన కార్యవర్గం ఎన్నిక.. బీసీ జాగృతిసేన నారాయణపేట నియోజకవర్గ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీకాంత్, ప్రధానకార్యదర్శిగా ప్రసాద్తోపాటు మరికొందరు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. వీరికి నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కురుమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, నాయకులు హర్షవర్ధన్, శివానంద్, ఆంజనేయులు, లాలప్ప, చందు, సంతోష్ పాల్గొన్నారు. నారాయణపేట రూరల్: వెనకబాటుకు గురవుతున్న బీసీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు బి.కృష్ణయాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించి విద్యార్థులతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీ బాలుర కళాశాలకు వసతిగృహాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, నాణ్యమైన భోజనం, తాగునీరు అందక అనారోగ్యం బారిన పడిన ఘటనలు చాలా ఉన్నాయని వివరించారు. మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ పూర్తిస్థాయిలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు శిక్షణ, వసతి, అభ్యసన సామగ్రి అందించాలని, ప్రతి హాస్టల్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
ప్రైవేటుకు గడ్డుకాలమే
●ఆశించిన స్థాయిలో లేదు.. ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే.. పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటా రూ.10 కోట్లు.. యూనివర్సిటీకి పీజీతోపాటు యూజీ విద్యార్థులు కూడా పూర్తిస్థాయిలో కళాశాలల్లో సీట్లు పొందితేనే ఆదాయం సమకూరుతుంది. ఉన్న సీట్లలో ప్రతిఏటా తగ్గుదల రావడంతో యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ కళాశాలలు మూతబడుతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా అప్లియేషన్, ఇతర పరీక్షలు, సప్లిమెంటరీ ఇలా అనేక రకాల ఫీజులు సమకూరుతాయి. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలు మూతబడితే యూనివర్సిటీకి సమకూరే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉంటే యూనివర్సిటీ పరిధిలో 4 అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. ఇప్పటికే 3,049 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరినా ఆయా ఫీజులు మొత్తం వాటికి మాత్రమే చెందగా.. యూనివర్సిటీకి అరకొర ఆదాయం వస్తుంది. మొత్తంగా అటానమస్ కళాశాలలు పెరగడం, ప్రైవేటు కళాశాలలు తగ్గడంతో యూనివర్సిటీ ప్రతిఏటా రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాలమూరు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి 38 ప్రైవేటు కళాశాలల్లో.. పీయూ పరిధిలో మొత్తం ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలు 38 ఉంటే వాటిలో 13,580 సీట్ల సామర్థ్యంలో వివిధ కోర్సులను యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా వీటిలో కేవలం భర్తీ అయ్యింది 2,394 సీట్లు (17.64 శాతం) మాత్రమే. నాలుగు అటానమస్ కళాశాలలో 5,040 సీట్లు ఉండగా రిపోర్టు చేసిన విద్యార్థులు 3,049 (60.50 శాతం) మంది. వీటితోపాటు 22 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 10,200 సీట్లు ఉండగా 3,090 మంది (30.29 శాతం) రిపోర్టు చేశారు. ఇలా తక్కువ ఉన్న అటానమస్ కళాశాలల్లో కూడా 3 వేలకు పైగా సీట్లు భర్తీ అయితే.. ఏకంగా 38 కళాశాలలు ఉన్న ప్రైవేటులో మాత్రం తక్కువ సీట్లు కావడంతో చాలా కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయాలి
గద్వాలన్యూటౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు ఆలూరు ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్లపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నదుల్లో నీరు ఉండి, వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. ఆర్డీఎస్, జూరాల, పాలమూరు–రంగారెడ్డి, కోయిల్సాగర్ ప్రాజెక్టుల ద్వార నిర్ణయించిన మేరకు సాగునీరు అందించకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వరద జలాల పేరుతో 2005లో చేపట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను సత్వరం పూర్తి చేయడంతో పాటు వీటికి నికరజలాలు సాధించాలన్నారు. జస్టిస్ బచావత్, రాజారావు కమిటీలతో నికర జలాల కేటాయింపులున్న ఆర్డీఎస్, జూరాల, భీమా–1, 2, కోయిల్సాగర్ పథకాలకు నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. చంద్రసాగర్–అమ్రాబాద్ ఎత్తిపోతల, వెల్టూరు, గొందిమల్ల బ్యారేజ్, జూరాల–గట్టు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు వినోద్కుమార్, సుభాన్, వాల్మీకి, డా.ప్రేమ్కుమార్, నాగన్న, కృష్ణ ఉన్నారు. -
నాడు వైభవం.. నేడు నిర్లక్ష్యం
కొల్లాపూర్: జిల్లాలోని పలు దేవాలయాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. భవిష్యత్ తరాలకు చరిత్రను తెలియజెప్పే శాసనాలను సైతం ఈ ప్రాంతంలో గుర్తించారు. కానీ వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించడంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. చారిత్రక ఆలయాలు, పురాతన దేవతామూర్తుల విగ్రహాలు, శిలాశాసనాల రక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నా.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వివిధ కారణాలతో నిమ్మకునీరెత్తినట్లు ఉంటోంది. ప్రాభవం కోల్పోతున్న జటప్రోల్.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోల్ సమీపంలో కృష్ణానదీ తీరాన కొన్ని శతాబ్దాల క్రితం సురభి రాజవంశస్థులు అద్భుతమైన శిల్పకళతో మధనగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించారు. రాజుల పాలనలో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నెల రోజులపాటు ఆలయం వద్ద జాతర సాగేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఆలయం నీటిలో మునిగిపోయింది. తర్వాతి కాలంలో ఆలయాన్ని జటప్రోల్లో పునర్నిర్మించారు. కొన్నేళ్లపాటు పూజలు యధాతథంగా సాగాయి. కాలక్రమంలో ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నా.. సరైన ప్రచారం లేకపోవడంతో తగిన గుర్తింపు లభించడం లేదు. జటప్రోల్లోనే ఉన్న అగస్తేశ్వర ఆలయం, 19 మూకగుడుల నిర్వహణను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆదరణ లేక.. జిల్లాలోని పలు ఆలయాలకు చారిత్రక ప్రాశస్థ్యమున్నప్పటికీ సరైన ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. మంచాలకట్ట వద్ద కృష్ణానదీ తీరాన శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థాలయంలో దేవతామూర్తులు నిత్య దూపదీపాలకు నోచుకోవడం లేదు. అమరగిరి సమీపంలో కృష్ణా తీరంలోనే మునులు ప్రతిష్ఠించిన మల్లయ్యస్వామి గుడి పరిస్థితి కూడా ఇంతే. పెద్దకొత్తపల్లి మండలం దేవల్తిర్మలాపూర్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి రెండో తిరుపతిగా ఒకప్పుడు పేరుండేది. క్రమంగా ఆ గుడి ప్రాభవం కోల్పోతోంది. పెంట్లవెల్లిలోని శివాలయం, చిన్నంబావి మండలం బెక్కెం సమీపంలోని సూర్యదేవాలయం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ శివాలయం, నందీశ్వరాలయం, బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్లోని ఆలయాలకు సరైన ఆదరణ లభించడం లేదు. చారిత్రక శాసనాలు, విగ్రహాల పరిస్థితి అంతే.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్లో 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శిలాశాసనం ఉంది. దీన్ని పట్టించుకునే వారే లేరు. కొల్లాపూర్లోని ఆర్ఐడీ కళాశాల సమీపంతో పాటు పలు ప్రాంతాల్లో సురభి రాజులకు సంబంధించిన శాసనాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన దేవతామూర్తుల విగ్రహాలు పూజలకు నోచుకోవడం లేదు. సోమశిలలో పురాతన విగ్రహాలను మ్యూజియంలో ఉంచారు. కొన్ని చెట్ల కిందే ఉన్నాయి. అయితే వాటి విశిష్టతను తెలియజెప్పే వారు లేరు. జిల్లావ్యాప్తంగా పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు చాలా చోట్ల రక్షణ లేకుండా ఉన్నాయి. జిల్లాలో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలకు రక్షణ కరువు దశాబ్దాలుగా నిరాధరణకు గురవుతున్న వైనం చారిత్రక ఆలయాల సంరక్షణ సైతం పట్టని యంత్రాంగం టూరిజం సర్క్యూట్ నిధులు మంజూరై ఏడాదైనా కానరాని పురోగతి -
వాడీవేడిగా పుర కౌన్సిల్ సమావేశం
నారాయణపేట: స్థానిక పుర కౌన్సిల్ సమావేశం శనివారం వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణల మధ్య కొనసాగింది. చైర్పర్సనన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు, కౌన్సిల్ సమావేశాలకు మీడియా ప్రవేశం, వార్డుల అభివృద్ధికి నిధులు, పారిశుద్ధ్య సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో సమావేశం వాడివేడీగా సాగింది. చివరకు మీడియాకు అనుమతి కల్పించకపోవడం, వార్డుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు సమావేశాన్ని వాకౌట్ చేశారు. అనంతరం బీజేపీ సభ్యులతోనే చైర్పర్సనన్ కొండ శ్వేత అధ్యక్షతన సమావేశం కొనసాగింది. మీడియా ప్రవేశంపై తొలి నుంచే వివాదం.. సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మీడియాను కౌన్సిల్ సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమావేశంలో మీడియాకు ప్రవేశం లేదని కమిషనర్ శంకర్ స్పష్టం చేయడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే చైర్పర్సన్ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు వెచ్చించడాన్ని కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కౌన్సిలర్లతో చర్చించకుండా బిల్లును తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజల అవసరాల కంటే చాంబర్కు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. చెత్త తరలింపు ఆటోల మరమ్మతు, పారిశుద్ధ్య కార్మికుల సౌకర్యాల కల్పనకు నిధులు లేవంటూ చాంబర్ ఆధునికీకరణకు రూ.22 లక్షలు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. అవే నిధులతో వార్డుల్లో డ్రైనేజీలు, తాగునీటి పైప్లైనన్ లీకేజీలు తదితర సమస్యలు పరిష్కరించవచ్చని సూచించారు. అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మాటల యుద్ధం అభివృద్ధి పనులకు నిధుల్లేవు... చైర్పర్సన్ చాంబర్కు రూ.22 లక్షలా? మీడియాకు ప్రవేశం కల్పించాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం వాకౌట్ -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
నారాయణపేట రూరల్: పాఠశాల విద్య పూర్తిచేసి కళాశాలలకు వచ్చిన విద్యార్థులు తప్పుడు స్నేహాలతో చెడు అలవాట్లకు బానిస కావొద్దని సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాగింగ్పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వయసు చాలా సున్నితమైందని, ఎక్కువ సమయం చదువుకునేందుకు కేటాయించాలని, మిగతా సమయంలో క్రీడలు, సాంస్కృతిక అంశాలపై దృష్టి సారించాలన్నారు. ర్యాగింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు అవకాశం లేకుండా అధ్యాపకులు బోధించే విషయాలపై శ్రద్ధ చూపాలని కోరారు. ర్యాగింగ్తో విద్యార్థులు మానసికంగా కుంగిపోతారని, అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్కు పాల్పడితే జైలుశిక్ష ఉంటుందని, దీంతో జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్కు గురైతే వెంటనే కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐఈఓ సుదర్శన్రావు, న్యాయవాది లక్ష్మీపతిగౌడ్, అధ్యాపకులు రఘువీర్, దత్తాత్రేయ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. బాలసదనం, వృద్ధాశ్రమం తనిఖీ.. నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ శనివారం పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి, ఆహారం, రికార్డుల నిర్వహణ, హాజరుపట్టికలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంతమంది వృద్ధులు, చిన్నారులు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం సిద్ధం చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. కార్యాలయ ఉత్తర్వుల ప్రకారమే అడ్మిషన్లు చేపడుతున్నారా, సంబంధిత వ్యక్తులకే పిల్లలు, వృద్దులను అప్పగిస్తున్నారా అనే అంశాలపై ఆరా తీశారు. వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్యం, అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
సమయానికి.. పూర్తయ్యేనా.. సర్!
● ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం ● 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ● ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఏళ్ల క్రితం వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. తిరిగి ఇవ్వడంలో జాప్యం బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలిచ్చి వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
10న తేజస్ స్టార్టప్ వర్క్షాప్
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 10న తేజస్ స్టార్టప్ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.రామలింగేశ్వర్గౌడ్ శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ పరిశ్రమలశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కొనసాగే వర్క్షాప్ను యువత, విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లపై ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్క్షాప్లో స్టార్టప్ ఏర్పాటు విధానం, వ్యాపార ఆలోచనల పరిశీలన (ఐడియా వ్యాలిడేషన్), మెంటర్షిప్, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, నిధుల సమీకరణ (ఫండింగ్), నెట్వర్కింగ్ తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు గూగుల్ ఫాంలో నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సెల్నంబర్ 62819 94436 సంప్రదించాలని సూచించారు. -
భూ నష్ట పరిహారం పెంచాలి
కోస్గి రూరల్: నారాయణపేట రేడియల్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని ఆర్డీఓ రమేష్ను పలువురు రైతులు కోరారు. శనివారం మండలంలోని తోగాపూర్ ఆంజనేయస్వామి ఆలయం, నాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో భూ సేకరణ నాలుగో గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. తోగాపూర్లో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, నాచారం గ్రామంలో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాల భూమి కోల్పోతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఉన్న కాస్త భూమిని కోల్పోతున్నామని, భూమికి బదులు భూమి ఇవ్వాలని అదనపు కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన అలా ఇవ్వడం కుదరదని తేల్చి తెలిపారు. రైతులు ఇచ్చిన అనుమతి పత్రాల మేరకు నష్టపరిహారం పెంపు విషయాన్ని కలెక్టర్కు నివేదిస్తానని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బాధితులకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసులు, డీటీ బాలరాజు, ఆర్ఐ సుభాష్, సీనియర్ అసిస్టెంట్ భీమమ్మ, సర్పంచ్లు రేణుకు, శ్రీనివాస్, జీపీఓలు సత్యనారాయణ, అంజప్ప పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం
నారాయణపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల భూమి, భుక్తి, విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేశారని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన త్యాగం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని, యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాజేందర్గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కొణిజేటి రోశయ్యకు నివాళి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోశయ్యకు ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉందని, పరిపాలనలో చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ ఖలీల్, డిప్యూటీ కలెక్టర్ రాజేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తన రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పత్తి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి అన్నారు. మండలంలోని జాజాపూర్ రైతువేదికలో మహిళా రైతులు శంకరమ్మ, సాయమ్మ, కళావతితో పాటు మరికొందరు రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ పథకంలో భాగంగా మండలానికి నూజివీడు, ప్రవర్ధన్, రాశి కంపెనీలకు చెందిన 800 విత్తన ప్యాకెట్లు వచ్చాయని.. ప్యాకెట్ ధర రూ.901 ఉండగా, రాయితీ రూ.900 పోను రైతు రూపాయి మాత్రమే చెల్లించాలన్నారు. పథకంలో బయో ఫెర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్, న్యూట్రియన్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుందని, ఈ పథకం ఐదేళ్ల వరకు అ మలులో ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసా య విస్తరణ అధికారులు ప్రకాష్, అనిల్కుమార్, రాజేష్, అంజమ్మ, తార, రైతులు, నాయకులు పాల్గొన్నారు. వేద సాగు పద్ధతి పాటించాలి.. మరికల్: రైతులు వేద సాగు పద్ధతిని అవలంబించడంతో విత్తనాల వినియోగం తగ్గుతుందని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక రైతువేదికలో జాతీయ ఆహార భద్రత పథకం కింద ఆర్ఎన్ఆర్ రకం వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేద సాగు విధానంతో రైతులకు నీటి ఆదా, సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నయ్య, ఏఓ రహమాన్, సూర్యమోహన్రెడ్డి, వీరన్న, ఏఈఓ పరశురాం, ఆనంద్, హర్షవర్ధన్రెడ్డి, హరీశ్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఓటుహక్కు తొలగించొద్దు
ఆత్మకూర్/నర్వ: సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, మక్తల్ నియోజకవర్గ ఈఆర్ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్ పురపాలికలోని ఖానాపూర్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్ తహసీల్దార్ జేకే మోహన్, సూపర్వైజర్ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత తదితరులు ఉన్నారు. -
బాల్యానికి భరోసా..
జిల్లాలో ప్రారంభమైన 12వ విడత ఆపరేషన్ ముస్కాన్ ● బాలకార్మిక వ్యవస్థ రూపుమాపేందుకే.. ● నెలరోజుల పాటు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు ● మూడురోజుల్లో 9 మంది చిన్నారుల చేరదీత నర్వ: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం అన్నిశాఖల సమన్వయంతో ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. బాల్యానికి భరోసా కల్పించేందుకు ఏడాదిలో రెండునెలల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బాలకార్మికుల విముక్తికి కృషి చేస్తోంది. ఈ కొత్త ఏడాది జనవరిలో జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహించి 71 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడంతో పాటు 31 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆపరేషన్ ముస్కాన్ను ప్రారంభించి ఇప్పటికే 9 మంది బాలబాలికలకు విముక్తి కల్పించారు. గతేడాది కంటే ఎక్కువ మంది చిన్నారులకు విముక్తి కలిగించేందుకు దాడులను ముమ్మరం చేసేందుకు పోలీసు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. పలుశాఖల సమన్వయంతో.. పోలీసు, కార్మిక, విద్య, సీ్త్ర, శిశుసంక్షేమశాఖ, చైల్డ్లైన్, సఖి, బాలరక్షక భవన్ సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్క ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి దాడులు నిర్వహిస్తారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు పనులు చేస్తున్న ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తున్నారు. వారిని చేరదీసి ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో వారు వదిలేసిన తరగతుల్లో చేర్పిస్తున్నారు. వీరితో పాటు తప్పిపోయిన పిల్లలు, అనాథలను గుర్తించి ఆయా కేంద్రాల్లో చేర్పిస్తారు. పిల్లలతో బలవంతంగా పనులు చేయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ‘బడికి వెళ్లాల్సిన వయస్సు, ఆటలాడుకోవాల్సిన ప్రాయం వారిది.. కాని తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తున్నారు. పాఠశాలల్లో పాఠాలు వినాల్సిన వీరు ఇటుక బట్టీలు, పొలాల్లో కూలీ పనులు, గొర్రెలకాపరులుగా, పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. ఇటుక బట్టీలు, పరిశ్రమల యజమానులు, వ్యాపారస్తులు పిల్లలతో పనులు చేయిస్తున్నారు. చదువుకునే వయసులో పనులు చేస్తూ బాలకార్మికులుగా మారుతున్నారు.’ బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా దాడులు నిర్వహిస్తాం. బాలలను చేరదీసి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల బాలబాలికలు ఉంటే వారిని సొంత రాష్ట్రాలకు పంపిస్తాం. బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. బాలకార్మికుల సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – డా. వినీత్, ఎస్పీ కేసులు నమోదు చేస్తాం.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా బాలకార్మికుల విముక్తి కోసం మూడు రోజులుగా దాడులు ముమ్మరం చేస్తున్నాం. అనాథ బాలలు, బిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన పిల్లలను చేరదీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంతోపాటు వివిధ పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇతర పనులు చేస్తున్న 14 ఏళ్లలోపు బాలలతో పనులు చేయిస్తే కేసులు నమోదు చేస్తాం. – బాసిత్, కార్మికశాఖ జిల్లా అధికారి -
వందనాలు ‘మిడ్జిల్’..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 2006లో ఆయన మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి తొలి అడుగు వేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రి హోదాలో వందన సభ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలైన తన రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన మిడ్జిల్, ఊర్కొండ మండలాలకు చెందిన ఆనాటి ఆత్మీయులతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలలో రేవంత్రెడ్డి పర్యటన అటు రాజకీయంగా, ఇటు భావోద్వేగ పరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 150 మంది ఆత్మీయులతో భేటీ.. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రయాణంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ‘పాలమూరులోని నల్లమలలో పుట్టిన ఈ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిని అయ్యానంటే మీ ఆశీర్వాద ఫలితమే. మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం దక్కింది. ఈ నేల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది’ అంటూ ఉమ్మడి పాలమూరులో పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆయన వెల్లడించారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడిన మిడ్జిల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న సమయంలో తనతో కలిసి తిరిగిన ఆనాటి పెద్దలు, నాయకులు, అనుచరులతో ఊర్కొండ ఆలయ ఆవరణలో మమేకం కానున్నారు. ఈ మేరకు మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లోని 150 మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఒక్కో టేబుల్ దగ్గర ఐదుగురు కుర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం ఒక్కో టేబుల్ వద్దకు వెళ్లి వారిని పలకరించి, యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మండలానికి వస్తుండడంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలోని కాలనీలకు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తండాలు, గ్రామాలకు బీటీ రోడ్లతో పాటు ఊర్కొండ ఆలయ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. నేడు సీఎం రేవంత్రెడ్డి కృతజ్ఞత సభ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పర్యటన ఊర్కొండపేటలోని హనుమాన్ ఆలయంలో పూజలు ప్రజాప్రతినిధిగా తొలి అడుగు వేసిన నేలలో ఆత్మీయులతో భేటీ -
నేరాల ఛేదనలో జాగిలాలదే కీలక పాత్ర
నారాయణపేట: నేరాల ఛేదనలో కీలకపాత్ర పోషిస్తున్న పోలీసు జాగిలాల నిర్వహణపై ఎస్పీ డా. వినీత్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకేంద్రంలోని పత్తిబజార్లో ఉన్న జిల్లా పోలీస్ డాగ్ కెన్నెల్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కెన్నెల్లో ఉన్న రూప (ఎక్స్ప్లోజివ్), రుద్ర (ట్రాకర్), విక్కీ (నార్కోటిక్స్), లక్కీ (ఎక్స్ప్లోజివ్) ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాల ఆరోగ్య పరిస్థితి, ఆహార నిర్వహణ, వసతి, పరిశుభ్రత, శిక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. ఆరోగ్యం, శిక్షణ, శుభ్రతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనలో నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్లను మరింత సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి జాగిలం వద్ద దాని పేరు, ప్రత్యేక నైపుణ్యం, జిల్లా, రాష్ట్రస్థాయిలో సాధించిన విజయాలు, అవార్డులు, సేవల వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ జాగిలాలు శాఖకు అమూల్యమైన ఆస్తి అని పేర్కొన్నారు. హత్యలు, దొంగతనాలు, పేలుడు పదార్థాల గుర్తింపు, నార్కోటిక్స్ కేసులు, అదృశ్యమైన వ్యక్తుల ఆచూకీ గుర్తింపు వంటి క్లిష్టమైన కేసుల్లో జాగిలాలు నేరాల ఛేదనను వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. జాగిలాలకు రోజూ నిర్దేశిత డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన ఆహారం, శుభ్రమైన తాగునీరు, సమయానికి వైద్య పరీక్షలు, అవసరమైన టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ డాగ్ కెన్నెల్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్, ఎస్బీ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఆర్ ఎస్సై శివశంకర్ తదితరులు ఉన్నారు. -
లక్ష్య సాధనలో జాప్యానికి తావులేదు
● గుడిసెల సర్వే పకడ్బందీగా చేపట్టాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని.. జాప్యానికి తావు లేదని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో హౌసింగ్, డీఆర్డీఏ (సెర్ఫ్), పంచాయతీరాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొని పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు వారాల్లో ఇందిరమ్మ ఇళ్లు, వీఓ భవనాల నిర్మాణాల్లో స్పష్టమైన పురోగతి చూపించాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలన్నారు. 767 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, లబ్ధిదారులు చేపట్టకపోవడానికి గల కారణాలను రాతపూర్వకంగా తీసుకొని అవసరమైతే అర్హత రద్దు చేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హౌసింగ్ ఏఈలకు అప్పగించిన లక్ష్యాలను రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గుడిసెల లెక్కింపు సర్వే త్వరగా పూర్తి చేయాలని.. గుడిసెల్లో జీవించే వారినే ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించాలని చెప్పారు. పంచాయతీరాజ్శాఖపై సమీక్షిస్తూ జిల్లాకు గతంలో మంజూరైన 39 వీఓ భవనాల్లో ఒక్కటి కూడా పూర్తిగాకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు. తాజాగా మరో 180 వీఓ భవనాలు మంజూరైన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో నిర్మాణాలు వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో స్థల సేకరణ పూర్తిచేసి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. నిధుల మంజూరుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని అధికారులకు భరోసా ఇచ్చారు. మహిళా సంఘాలకు మంజూరైన గిడ్డంగుల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఉపాధి కూలీల సంఖ్య పెంచి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్హెచ్జీ గ్రూపులు, బ్యాంకు లింకేజీలు, శ్రీనిధి రికవరీలు, సూక్ష్మ వ్యాపారాలు, పాఠశాల యూనిఫాం కుట్టు పనులు, కిశోర బాలికల సంఘాలు, యూడీఐడీ సర్టిఫికెట్ల జారీ వంటి అంశాలపై కూడా కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఇన్చార్జ్ డీఎల్పీఓ ఉదయ్కుమార్, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పీఆర్ ఏఈలు, డీపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు. -
వేతనాల సంబురం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. ● పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. 1వ తేదీనే చెల్లింపులు.. పీయూలో గతం నుంచే ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కొనసాగుతున్నాయి. సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, గార్డెనింగ్ తదితర సిబ్బందికి ఏజెన్సీల నుంచి వేతనాలు అందిస్తున్నారు. ప్రభుత్వం గతనెల రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారికి తప్పకుండా 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని సూచించడంతో పీయూ అధికారులు సైతం అలాగే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు చెప్పారు. కాగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్లు, లైబ్రేరియన్, అసిస్టెంట్ ఇంజినీర్, టైపిస్ట్ కం క్లర్క్, వీసీ పీఏ, రిజిస్ట్రార్ పీఏ, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్స్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ కం ప్లంబర్, గేమ్ బాయ్స్, స్టాఫ్ నర్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, సూపర్వైజర్, ప్లంబర్లకు రూ.19,500 ఉండాలి. హౌస్కీపింగ్ శానిటేషన్, హెల్పర్స్, గార్డెనింగ్, స్కావెంజర్, కేర్ టేకర్, కుక్, సెక్యూరిటీ గార్డు, బుక్ కీపర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేటర్, ల్యాబ్ అటెండర్లకు రూ.15,600 ఇవ్వాల్సి ఉంది. కంప్యూటర్ ప్రోగ్రామర్కు రూ.22,500 వేతనం ఇస్తున్నారు. ఎట్టకేలకు పీయూ నాన్టీచింగ్ సిబ్బందికి జీతాల పెంపు ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు వేతనాలు పెంచాం. గత కొన్నేళ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేసిన సిబ్బందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. జీఓ ఆధారంగా క్యాడర్ల వారిగా వేతనాలు పెరిగాయి. దీంతో యూనివర్సిటీలో పనిచేస్తున్న చాలామంది మెజార్టీ సిబ్బందికి న్యాయం జరుగుతుంది. సిబ్బంది ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూస్తాం. – శ్రీనివాస్, వీసీ, పీయూ -
సువర్ణావకాశం!
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● చదువుకు దూరమైన వారికి ప్రయోజనం ● జిల్లాలో 17 అధ్యయన కేంద్రాలు ● ప్రారంభమైన ప్రవేశాలు.. ఆగస్టు 29 వరకు గడువు –8లో uచదువు మధ్యలో మానేసిన ప్రతి విద్యార్థిని సా ర్వత్రిక పాఠశాలల్లో చేర్పించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే నిరక్షరాస్యులను గుర్తించాం. అందరి సహకారంతో నిరక్షరాస్యులైన వయోజనులకు టెన్త్ పరీక్షలు రాయించేందుకు కృషి చేస్తున్నాం. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటి వద్దే ఉండి సెలవులో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. – శ్రీనివాస్, టాస్ కోఆర్డినేటర్, నారాయణపేట నారాయణపేట రూరల్: వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పదో తరగతి, ఇంటర్ విద్య అభ్యసించే అవకాశం కల్పించింది. 2008 నుంచి పదో తరగతి, 2009 నుంచి ఇంటర్లో అడ్మిషన్లు కల్పిస్తుండటంతో ఎంతో మంది ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకొని ఉపాధి మార్గాలు పొందుతున్నా రు. వయసుతో సంబంధం లేకుండా చదువుకునేందుకు ఓపెన్ స్కూల్ మంచి వేదికగా నిలుస్తోంది. ఎంతో ప్రయోజనకరం.. విద్యార్హత లేక ఎంతో మంది ఉపాధికి నోచుకోకపోవడంతో పాటు ఉద్యోగాలు సాధించిన వారు పదోన్నతికి దూరమవుతున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ పూర్తిచేసి.. ఆ తర్వాత డిగ్రీ, పీజీ సైతం చేసేందుకు ఆస్కారం ఉంది. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలతో పాటు పదోన్నతులు సైతం పొందవచ్చు. ఇందులో చదువుకునే అభ్యాసకులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఆదివారం, రెండవ శనివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో 30 రోజులకు మించకుండా తరగతులు ఉంటాయి. రెగ్యులర్ విద్యతో సమానమైన బోధన లభిస్తుంది. జిల్లాలో వందలాది మంది రెగ్యులర్ విద్య కంటే సార్వత్రిక విద్యకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆగస్టు 29 వరకు గడువు.. ప్రస్తుత విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల కోసం జూన్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 28 వరకు అపరాధ రుసుం లేకుండా, ఆగస్టు 29 వరకు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవ కేంద్రాల్లో రూ.150 చెల్లించి, సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టెన్త్కు రూ. 1,400, ఇంటర్కు రూ.1,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఫీజులో రూ. 300 రాయితీ ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో అందజేస్తే సీటు కేటాయిస్తారు. -
ఎఫ్ఆర్ఎస్ హాజరుపై నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు విషయంలో నిర్లక్ష్యం వీడాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ పాఠశాలలో బుధవారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అవకాశం మేరకు జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను తెరిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. విద్యార్థుల నమోదుకు సంబంధించి యూడైస్ ప్లస్లో పూర్తిగా వెనకబడి ఉందని.. వారం రోజుల్లో పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ప్యానెల్ తనిఖీ బృందాల నియామకంలో ఆలస్యం లేకుండా వెంటనే పూర్తిచేసి.. పాఠశాలలకు పంపించాలన్నారు. భవిత కేంద్రాల్లోని పిల్లల సమగ్ర అభివృద్ధికి అడుగులు పడాలన్నారు. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన టీచర్లు, ఆయాల నియామకం ప్రక్రియను త్వరగా పూర్తిచేసి.. అడ్మిషన్ల సంఖ్య మరింత పెంచాలని తెలిపారు. నియామకాలపై ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేయాలన్నారు. కాగా, మోడల్ స్కూల్ ప్రవేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెంటనే విద్యార్థుల చేరికపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచించారు. కేజీబీవీ కళాశాలలో సీట్ల భర్తీని వేగవంతం చేయాలన్నారు. అనంతరం కోటకొండకు నూతనంగా మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతి ఏర్పాట్లను ఆర్జేడీ పరిశీలించారు. డ్రోన్ ద్వారా వీడియోలు, సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నారు. కాగా, తొలిసారిగా నారాయణపేటకు వచ్చిన ఆర్జేడీని జిల్లా విద్యాశాఖ తరఫున శాలువాతో సత్కరించారు. జిల్లాలో టీచర్ల కొరత కారణంగా విద్యార్థులు నష్టం వాటిల్లుతుందని.. తాత్కాలికంగా వలంటీర్లను నియమించాలని తపస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి, శ్రీనివాస్, తపస్ నాయకులు షేర్ కృష్ణారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : ఎస్పీ
నారాయణపేట: జిల్లా ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యా ప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి.. బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయ న ఆదేశించారు. నేరస్థులపై చట్టపరమైన చర్యల్లో రాజీ పడొద్దని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని.. పోలీస్స్టేషన్ పరిధిలో తరచుగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు, వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి.. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించాలని చెప్పారు. పోలీస్స్టేషన్లలో సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ.. రోజూ రోల్కాల్ నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలపై విస్తృత ప్రచా రం నిర్వహించడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను నిరంతరం పర్యవేక్షించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నా రు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజుల్ హక్, డీఎస్పీలు మహేశ్, లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, భగవంత్రెడ్డి, కార్యాలయ సూపరింటెండెంట్ శ్యాంసుందర్ రాజు ఉన్నారు. -
గుడిసెల సర్వే పరిశీలించిన విజిలెన్స్
మద్దూరు(కోస్గి):ఇందిరమ్మ ఇళ్ల పథకం అమ లులో భాగంగా మద్దూరు మండలం ఖాజిపూర్లో చేపట్టిన గుడిసెల సర్వేను బుధవారం రాష్ట్ర విజిలెన్స్ బృందం పరిశీలించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికచేసే లబ్ధిదారుల గుడిసెలను ఈఈ బలరాం, పీడీ శంకర్, డీవైఈఈ హరికృష్ణ సందర్శించి.. గుర్తించిన లబ్ధిదారుల నివాస పరిస్థితులు, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా క్షేత్రస్థాయిలో సర్వే పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఏఈ శాంతకుమార్, ఎంపీడీఓ భార్గవరాం, పంచాయతీ కార్యదర్శి షాజిల్, సర్పంచ్ సాయప్ప ఉన్నారు. మీటర్ రీడింగ్ సులభతరం నారాయణపేట: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (డిస్కమ్) మీటర్ రీడింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ.. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నూతన విధానంపై స్పాట్ బిల్లర్లు, మీటర్ రీడర్లకు డీఈటీ రాజునాయక్, ఏఈ మహేశ్గౌడ్ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందుగా డేటా డౌన్లోడ్ చేసిన తర్వాత కొత్త ఆప్షన్లో ఈఆర్ఓ కోడ్ నమోదు చేయాలన్నారు. అనంతరం సెక్షన్ కోడ్, స్ట్రక్చర్ కోడ్, డీటీఆర్ కోడ్లను ఎంట్రీ చేయడం ద్వారా ఫీడర్ మ్యాపింగ్, స్ట్రక్చర్ మ్యాపింగ్ పూర్తవుతాయని తెలిపారు. అనంతరం యాప్లోని ఎడిట్ ఆప్షన్ ద్వారా వినియోగదారుల తాజా ఫోన్ నంబర్లను నమోదుచేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంతో బిల్లుల పెండింగ్ బకాయిల సమాచారం నేరుగా వినియోగదారుల ఫోన్లకు చేరడంతో పాటు బిల్లుల వసూళ్లు వేగవంతం అవుతాయని వారు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా సంబంధిత పోలీసు అధికారుల అనుమతి పొందాలని సూచించారు. జోగుళాంబ సన్నిధిలో శృంగేరి పీఠాధిపతి అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన జోగుళాంబదేవి ఆలయాన్ని బుధవారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతిస్వామి సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ ఈఓ దీప్తిరెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలయంలో శ్రీవిధుశేఖర భారతిస్వామి పూజలు నిర్వహించి.. మంగళహారతి సమర్పించారు. ఇదిలా ఉంటే.. శ్రీ చక్రయంత్ర ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రెండోరోజు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. గురువారం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతిస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
ఎగువన కొత్త పథకాలు..
తెలంగాణ వాటాలో 5 నుంచి 6 టీఎంసీలకు మించి ఏనాడూ వాడుకోలేదు. కర్ణాటకలో కేవలం దీని కింద 5,880 ఎకరాలు ఉన్నా.. అక్రమంగా నీటిని వాడుకుంటూ 15 వేల ఎకరాల దాకా సాగుచేస్తున్నారు. కాగా.. కర్ణాటకలో ఆర్డీఎస్పై అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అనధికారికంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించారు. తాజాగా ఆర్టీఎస్ హెడ్వర్క్ వద్ద తాగునీటి అవసరాల కోసమని 100 మీటర్ల దూరంలో ఎగువన 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. దీంతో నడిగడ్డ రైతుల్లో ఆందోళన నెలకొంది. -
రాజోళి ‘బండ’..!
ప్రశ్నార్థకంగా ఆర్డీఎస్ భవితవ్యం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కర్ణాటక, ఏపీ, తెలంగాణ.. ఈ మూడు రాష్ట్రాలతో ముడిపడిన రాజోళి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తుంగభద్రపై నిర్మించిన ఈ పథకం ద్వారా తెలంగాణలోని నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకపోగా.. ప్రస్తు తం దీని భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ని జాం కాలం నాటి ఈ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఆనకట్ట, కాల్వలు అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరాయి. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఈ నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు రాష్ట్రంలోని నడిగడ్డ రైతులకు శాపంగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల దీనగాధపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రాజెక్ట్ నేపథ్యం.. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మాన్వి తాలుకాలో తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్ 1958లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 143 కిలోమీటర్ల పొడవున (కర్ణాటకలో 43 కి.మీ.లు, తెలంగాణలోని గద్వాల జిల్లాలో 100 కి.మీ.లు) కాల్వ నిర్మించారు. ఆర్డీఎస్కు మొత్తం 17.1 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. ఇందులో కర్ణాటకకు 1.2 టీఎంసీలు.. తెలంగాణకు 15.9 టీఎంసీలు. తుంగభద్ర నది నుంచి 10 టీఎంసీలు, తుంగభద్ర డ్యాం నుంచి 7.1 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంది. ఒకటి నుంచి 12 డిస్ట్రిబ్యూటరీలు కర్ణాటకలో.. 13 నుంచి 42 వరకు నడిగడ్డ ప్రాంతంలో ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట పొడవు 850 మీటర్లు. తెలంగాణకు వచ్చే కాల్వ ఎడమవైపు ఉండగా.. కుడి వైపున ఏపీ సరిహద్దు ఉంటుంది. 2006లో ఆధునికీకరణ ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఏళ్ల తరబడి ఏపీ, తెలంగాణ రైతుల మధ్య వివాదం కొనసాగింది. 2001లో ఇరు ప్రాంతాల రైతులు దాడులకు దిగడంతో ఆర్టీఎస్ శాశ్వత పరిష్కారం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టా రు. ఆనకట్ట వద్ద వివాదాలకు కారణంగా ఉన్న స్లూయిస్ను మూసివేయించారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆర్టీఎస్ ఆధునికీకరణకు రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటకకు అందజేశారు. అయితే నాలుగు ప్యాకేజీల్లో నూ అరకొర పనులు చేసి అక్కడి ప్రభుత్వం చేతులు దులుపుకోగా..ఆ తర్వాత ఆధునికీకరణ అటకెక్కింది. ఏడు దశాబ్దాల క్రితం గచ్చుతో నిర్మించిన ఆర్టీఎస్ ఆనకట్ట బలహీనపడింది. ఏళ్ల తరబడి పూడిక తీయకపోవడంతో ఇసుక, బురద పేరుకుపోయింది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ తెలంగాణలోని సింధనూరు నుంచి ప్రారంభం కానుండగా.. ఇక్కడి నుంచి కాల్వల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. 45 వేల ఎకరాలకే సాగు నీరు ఆర్డీఎస్ కింద అలంపూర్ నియోజకవర్గంలో 87, 500 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా.. 45 వేల ఎకరాలకే అందుతోంది. యాసంగిలో నీళ్లు రా క క్రాప్ హాలిడే ప్రకటించడం ఏటా పరిపాటిగా మా రింది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టింది. 2018లో నీటి పంపింగ్ ప్రారంభమైంది. మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండగా.. 5.5 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్క మోటారు ద్వారానే వ రద వచ్చినప్పుడు తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా డిస్ట్రిబ్యూటరీ 23, 24 నుంచి డిస్టిబ్యూటరీ 35 వరకు తడులు ఇవ్వగలుగుతున్నారు. కానీ ఆ తర్వాత నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ 40 వరకు నీరందడం లేదు. దీనికింద మల్లమ్మకుంట, జూలకల్లు, వల్లూరు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు అతీగతి లేదు. అటకెక్కిన ఆధునికీకరణ.. అధ్వానంగా ఆనకట్ట, కాల్వలు కర్ణాటకలో మోటార్లతో యథేచ్ఛగా నీటి చౌర్యం జల విద్యుత్ ప్రాజెక్ట్లకు విచ్చలవిడిగా నీటి వినియోగం అక్రమంగా కురిడి ఎత్తిపోతల పథకం నిర్మాణం నడిగడ్డకు పొంచి ఉన్న ముప్పు.. రైతుల్లో ఆందోళన ఇతర రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా జరిగే పనులను సాకుగా చూపి రైతులను మభ్యపెట్టొద్దు. కర్ణాటకలో జరుగుతున్న కొ న్ని ప్యాకేజీ పనులు ఇప్ప ట్లో పూర్తి అయ్యేలా లేవు. దాని కోసం ఎదురుచూడటం వృథా. ప్రస్తుతం వర్షాలు లేకపోయినప్పటికీ, తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా విడుదల అవుతున్న నీటితో ఆయకట్టుకు జీవం ఉంది. రిజర్వాయర్ నిర్మించి ఉంటే నీటి నిల్వ ఉంచుకుని మరో నెలరోజులు పాటు అందించుకునేవాళ్లం. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలి. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ -
పంటల మార్పిడిపై అవగాహన కల్పించండి
● ఏఓలు, ఏఈఓల పనితీరులో మార్పు రావాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట:జిల్లాలో పంటల మార్పి డిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని.. ఈ ప్రక్రియలో ఏఈఓలు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయశాఖ వార్షిక కార్యాచరణపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రైతులు సాగుకు సిద్ధమయ్యే దశలోనే పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. అదే విధంగా భూసార పరీక్షల నిమిత్తం మట్టి నమూనాల సేకరణ, ఫార్మర్ రిజిస్ట్రీ, ఎరువులు, విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సూచించారు. ఏఓలు, ఏఈఓల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీఏఓను ఆదేశించిన కలెక్టర్.. ఇకపై వారి హాజరు, క్షేత్ర పర్యటనలు, పనితీరుపై నెలకోసారి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పనితీరులో మార్పు కనిపించని అధికారుల నుంచి సంజాయిషీ కోరాలని స్పష్టంచేశారు. ఆయిల్పామ్ సాగు కేవలం ఉద్యానశాఖ బాధ్యత మాత్రమే కాదని.. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉద్యానశాఖతో సమన్వయం చేసుకుని జిల్లా లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం సాయిల్ హెల్త్ కార్డుల నవీకరణ పురోగతిని అధికారులతో తెలుసుకున్నారు. సమావేశంలో డీఏఓ సక్రియా నాయ క్, ఏడీఏ నగేశ్కుమార్ ఉన్నారు. వందశాతం ఫలితాలు సాధించాలి.. నర్వ: యాస్పిరేషన్ బ్లాక్లో సూచికల ప్రకారం వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రి యాంక అన్నారు. నర్వ మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు రూపొందించిన రిమోట్ ఎలక్ట్రికల్ కారు, త్రీడి ప్రింటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రదర్శనలను ఆమె తిలకించారు. విద్యార్థులు కలెక్టర్ పేరును త్రీడి ప్రింటర్తో ముద్రించి బహుమతిగా అందించగా.. అభినందనలు తెలిపారు. అనంతరం రాయికోడ్లో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అదే విధంగా కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, యాస్పిరేషన్ బ్లాక్ కోఆర్డినేటర్ బాలాజీ, సర్పంచులు హన్మంతురెడ్డి, లింగమ్మ, శశికళ ఉన్నారు. -
ప్రోత్సాహానికి పడిగాపులు
జిల్లాలో రూ.115.86 కోట్ల వరి బోనస్ పెండింగ్ ● రెండేళ్లుగా అన్నదాతల ఎదురుచూపులు ● గతేడాది 1.40 లక్షల మె.ట. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు ● ఈ ఏడాది 90,859 మెట్రిక్ టన్నులు –8లో uగతేడాది యాసంగిలో సన్నరకం వరి ధాన్యం విక్రయించగా రూ.20 వేల బోనస్ రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా యాసంగి ధాన్యానికి మరో రూ.25 వేల బోనస్ మొత్తం కలిపి రూ.45 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు. వెంటనే చెల్లించి ఆదుకోవాలి. – నర్సింహులు, రైతు, మరికల్ బోనస్ డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. రైతులు ఆందోళన చెందొద్దు. రెండేళ్లకు సంబంధించిన బోనస్ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – బాలరాజు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి నారాయణపేట: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ హామీ నమ్మి రెండేళ్లుగా యాసంగిలో సైతం రైతులు సాగు చేసి విక్రయించారు. 2025 యాసంగిలో రూ.460 కోట్లు, 2026 యాసంగి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల ఖాతాలో జమచేసినా బోనస్ మాత్రం నేటికీ చెల్లించడం లేదు. గతేడాది యాసంగికి రూ.70.44 కోట్లు, ఈ ఏడాది యాసంగికి రూ.45.42 కోట్లు మొత్తం రూ.115.86 కోట్ల బోనస్ బకాయిలు పేరుకుపోవడంతో ఎప్పుడు చెల్లిస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో.. ఈ ఏడాది యాసంగిలోనూ జిల్లా రైతులు 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. సన్నరకం 1,81,998 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 62,815 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసింది. జిల్లావ్యాప్తంగా 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 22,769 మంది రైతుల నుంచి 1,53,076 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. అందులో 62,216 మె.ట. దొడ్డు రకం, 90,859 మె.ట. సన్నరకం వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి ధాన్యం డబ్బులు రూ.365 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. 2026 యాసంగి సన్నరకం వరిధాన్యానికి సంబంధించి రూ.45.42 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోవడంతోనే రైతులకు బోనస్ చెల్లింపుల్లో ఆలస్యమవుతోందనేది బహిరంగ రహస్యమే. వానాకాలం సీజన్ ప్రారంభమై నెలరోజులు అవుతోంది. పంటల సాగు కోసం పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నమంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బోనస్ బ్యాంకు ఖాతాలో జమకాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు కేశవరెడ్డి. మాగనూర్ మండలం వర్కూర్ గ్రామం. ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పడంతోనే సాగు చేశా. ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయి.. కాని బోనస్ మాత్రం నేటికీ జమ కావడం లేదు. రెండేళ్ల బకాయిలు రూ.1.72 లక్షలు రావాల్సి ఉంది. ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లిస్తే అప్పులు కొంతైనా తీరేవి. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్!
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోజుకు వందల సంఖ్యలో జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్లు.. మంగళవారం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే జరిగాయి. మక్తల్, అలంపూర్, ఆత్మకూర్, కొల్లాపూర్, అచ్చంపేట రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో ఆదాయం అందించే కార్యాలయాల్లో లావాదేవీలు జరగక వెలవెలబోయాయి. ఒక్కసారిగా అన్ని కార్యాలయాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయిస్తుండటంతో ప్లాట్లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త స్లాట్ బుకింగ్లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ వంటి కీలక ఆన్లైన్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రతిరోజూ 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 550 నుంచి 650 మధ్య రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మంగళవారం 74 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. స్పష్టత కరువు.. ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని సాక్షులతో కలిసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకున్న క్రయ, విక్రయదారులకు పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరింపబడతాయనే అంశంపై ఇంకా అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. జూన్ 26 నుంచి 28 వరకు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసేందుకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. కానీ సోమవారం సైతం కార్యాలయాల్లో తిరిగి మళ్లీ అదే సమస్యలు ఉత్పన్నం కావడంతో రిజిస్ట్రేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరచుగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల ఆదాయం అందించే కార్యాలయాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తడంతో క్రయ, విక్రయదారులు విస్తుపోతున్నారు. నారాయణపేట 11 వనపర్తి 3 మహబూబ్నగర్ 8 జడ్చర్ల 8 నాగర్కర్నూల్ 17 కల్వకుర్తి 18 గద్వాల 9 మక్తల్, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, ఆత్మకూర్ – 0 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ మొరాయింపు పదుల సంఖ్యల్లో మాత్రమే దస్తావేజులు క్రయ, విక్రయదారుల తీవ్ర ఇబ్బందులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమే. కానీ సర్వర్లలో నెలకొన్న సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు మరింత సులువుగా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండటంతోనే కొంత అంతరాయం ఏర్పడింది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. – డి.ఫణిందర్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం జరిగిన రిజిస్ట్రేషన్లు ఇలా.. -
అంకితభావంతో వైద్యసేవలు అందించాలి
మరికల్: ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు అంకితభావంతో వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డా. రవీందర్నాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని తీలేరులో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, మరికల్ పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్స్పోలియో కార్య క్రమ అమలు, ఇంటింటి సర్వే, సీజనల్ వ్యాఽ దుల నివారణకు చేపట్టిన చర్యలను వైద్యుల తో ఆరా తీశారు. అలాగే మరికల్ పీహెచ్సీలో రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ, ప్రసూతి గది, ప్రయోగశాలతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. వైద్యులు అందుబాటులో ఉండి రోజులకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. మరికల్ పీహెచ్సీలో రోగులకు అందు తున్న వైద్యసేవలపై సంతృప్తి వ్యక్తం చేసి వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సిద్దప్ప, ప్రోగ్రామ్ అధికారి సాయి రాం, డా. రాఘవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బాలకార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం
నారాయణపేట: జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్న్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం నుంచి 31వ తేదీ వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లలోపు చిన్నారులతో పనులు చేయించడం చట్టవిరుద్ధ మని స్పష్టం చేశారు. బాలకార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, అవసరమైతే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలించే చర్యలు చేపడతామని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే నేరాన్ని పునరావృతం చేసే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం పిల్లలను పనులకు పంపించి వారి భవిష్యత్ను దెబ్బ తీయవద్దని తల్లిదండ్రులను కోరారు. చదువు మాన్పించి పిల్లలను పనులకు పంపుతున్న తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు, బలవంతంగా పని చేయిస్తున్న చిన్నారులు, భిక్షాటన చేస్తున్న పిల్లలు, ఆశ్రయం అవసరమైన బాలలు లేదా తప్పిపోయిన వీధి బాలలు కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ నంబర్ 1098, డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు మహేష్, నల్లపు లింగయ్య, ఆపరేషన్ ముస్కాన్ బృందం ఎస్ఐ బాలరాజు, డా. లక్ష్మీకాంత్, డీసీపీఓ కరిష్మా, ఎన్జీఓ ప్రతినిధి నరేష్, లేబర్ ఆఫీసర్ బాసిత్, ఎంఈఓ బాలాజీ, చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధి నర్సింహ, సోషల్ వర్కర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన చేనేత ఉత్పత్తులపై దృష్టి
నారాయణపేట: మార్కెట్ అవసరాలు, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన చేనేత ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాల్లో సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్సలెన్న్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పురోగతిపై జరిగిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. వీవర్లు, మాస్టర్ వీవర్లు ఎదుర్కొంటున్న ముడి సరుకుల కొరత, మార్కెటింగ్ సమస్యలు, ఉపాధి అవకాశాలు, డిజైన్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తుల విక్రయాలను విస్తరించేందుకు రాష్ట్ర, జాతీయస్థాయి హ్యాండ్లూమ్ ఎక్స్పోలు, ప్రదర్శనలు, ఇతర మార్కెటింగ్ వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీవర్ల సమస్యలను కలెక్టర్ శ్రద్ధగా విని పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు హ్యాండ్లూమ్ డైరెక్టర్ ద్వారక, జిల్లా హ్యాండ్లూమ్ అధికారి రాజేష్, డీఆర్డీఓ వెంకట్రాములు తదితరులు ప్రభుత్వ పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ అవకాశాలపై వీవర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో చేనేతశాఖ అధికారులు, వీవర్లు, మాస్టర్ వీవర్లు తదితరులు పాల్గొన్నారు. ఊట్కూర్: మండలంలోని నిడుగుర్తి రైతువేధికలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం’ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక రైతులతో కలిసి వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, సర్పంచ్ రాములు, ఏఓ గణేశ్రెడ్డి, ఏఏఓ ప్రశాంతి, తిప్రాస్పల్లి, బాపూర్, పెద్దజట్రం, లక్ష్మీపల్లి, మొగ్దుంపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో స్టేడియం నిర్మాణం
నారాయణపేట (మక్తల్): మక్తల్లో రూ.25 కోట్లతో ఆధునిక వసతులతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఇన్డోర్, ఔట్డోర్ పనులకు సంబంధించి పలు మార్పుచేర్పులు చేయించాలని అధికారులను ఆదేశించారు. పురుషులు, మహిళా క్రీడాకారులకు వేర్వేరు గదులు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కళాశాల భవనం పెచ్చులూడి విద్యార్థులపై పడి గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి ఇతర భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 16 వార్డుల్లో సీసీ రోడ్డు పనులను పరిశీలించి నాణ్యత పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో వంతెనల నిర్మాణానికి రూ.50 కోట్లకుపైగా మంజూరు చేసినట్లు చెప్పారు. గ్రామాలు అభివృద్ధి దిశలో పయనించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట వైస్ చైర్మన్ గణేష్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్, కట్ట సురేష్, హన్మంతు, డీవైఎస్ఓ వెంకటేష్, ఉపేందర్ పాల్గొన్నారు. -
చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు
నారాయణపేట: బాలసదనం, వృద్ధాశ్రమాల్లో ఉన్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జూని యర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయిమనోజ్ సూ చించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బారంబావి ప్రాంతంలో ఉన్న బాలసదనం,వృద్ధాశ్రమా న్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక, రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించి వృద్ధులు, చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న సౌక ర్యాలపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా పరిశీలించి రోజూ తాజా కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో ఆహారం తయారు చేయాలని, తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి ఆదేశించారు. కార్యాలయ ఆదేశాల మేరకే ప్రవేశాలు జరుగుతున్నాయా.. సంబంధిత వ్యక్తులకే చిన్నారులు, వృద్ధులను అప్పగిస్తున్నారా అనే విషయాలను పరిశీలించారు. మందులు, టాబ్లెట్లు, సిరప్ల గడువు తేదీలను పరిశీలించి గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సూచించారు. అనంతరం వృద్ధులు, చిన్నారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, ఇతర అవసరాలను తెలుసుకున్నారు. బిస్కెట్లు పంపిణీ చేసి బంధువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెడ్రూమ్లు, వాష్రూమ్లు ఎల్లప్పు డూ శుభ్రంగా ఉంచాలని, లైట్లు, ఫ్యాన్లు పనిచేసేలా చూడాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకొని రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. -
విత్తనశుద్ధితో తెగుళ్ల నివారణ
మరికల్: విత్తనశుద్ధితో పంటలకు తెగుళ్ల శాతం తగ్గించవచ్చని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయ్శంకర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విత్తనశుద్ధి, సురక్షిత పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో, పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం విత్తనశుద్ధి చేయడం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ విధానంతో నేల ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం, రైతులు పాల్గొన్నారు. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి కొత్తపల్లి: బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. మంగళవారం కొత్తపల్లి, మద్దూరులో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్టాడారు. బీఎల్వోలు ఐదురోజులుగా ప్రతి ఇల్లూ తిరుగుతూ ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారని.. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని నమోదు చేయించాలని, ఒక్కరికి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండేలా బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, వంచర్ల గోపాల్, పుర కౌన్సిలర్లు దినేష్ కుమార్, నర్సింహులు, అంజయ్య, రాంరెడ్డి, రాజురెడ్డి, గోపాల్ నాయక్, వెంకటేష్, సుల్తాన్, పలు గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి ఊట్కూర్: వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలని తెలిపారు. ఆయన వెంట ఏఓ గణేష్రెడ్డి తదితరులు ఉన్నారు. -
ప్రజలకు పారదర్శక సేవలు అందాలి
ఊట్కూర్: ప్రజలకు పోలీసుశాఖపై న మ్మకం, భద్రత, భరోసా పెంచేలా సి బ్బంది పారదర్శక సేవలు అందించాల ని ఎస్పీ డా. వినిత్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం స్థానిక పోలీస్స్టేషన్కు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రాంలాల్, ఎస్ఐ రమేశ్ పూ ల మొక్కలు అందజేసి స్వాగతం పలికా రు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్స్టేషన్లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసుల పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. సీసీటీఎన్ఎస్ వ్యవస్థలో కేసుల నమోదు, నిర్వహణ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచి విధిగా తనిఖీలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలన్నారు. ప్రతి గ్రామ పోలీసు అధికారి తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 ఫిర్యాదులకు వేగంగా స్పందించి మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం సిబ్బందితో కలిసి ఆవరణలో మొక్కలు నాటారు. -
నల్లమలలో వేట!
ప్రజల సహకారం అవసరం.. అటవీ సంరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరం. అడవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలి. కృష్ణానది తీరం వెంట బోటు పెట్రోలింగ్ చేస్తున్నాం. మన్ననూర్, లింగాల, కొల్లాపూర్లో సర్వేలెన్స్ టవర్స్ ఏర్పాటుచేశాం. సిస్టమ్ ద్వారా లైవ్లో పరిశీలించి మానిటరింగ్ చేపడుతాం. కెమెరా ట్రాప్ ద్వారా అటవీ జంతువుల కదలికలను పరిశీలిస్తున్నాం. వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – రేవంత్చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి అచ్చంపేట: నల్లమలలో వేటగాళ్ల దాడులకు వన్యప్రాణులు బలవుతున్నాయి. అడవిలో నీరు దొరక్క బయటకొస్తున్న వాటిని కొందరు వేటాడి చంపేస్తున్నారు. మరికొందరు ఉచ్చులు బిగించి మరీ ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా అటవీ సంపదకు నిలయంగా ఉన్న అనేక అరుదైన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల అమ్రాబాద్ అభయారణ్యంలోకి మారణాయుధాలతో ప్రవేశించిన వేటగాళ్లను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నలుగురిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. 2024–25 సంవత్సరంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన 1,076 ఉచ్చులను హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఆధ్వర్యంలో తొలగించారు. దీన్ని బట్టి నల్లమలలో వేట ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక నిఘా ఉన్నా.. నల్లమల అటవీ ప్రాంతంలో కెమెరా ట్రాప్లు, ప్రత్యేక నిఘా బృందాలున్నా వన్యప్రాణుల వేట మాత్రం ఆగడం లేదు. అభయారణ్యంలో నిత్యం ఏదో ఒకచోట వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వేటాడిన వన్యప్రాణుల మాంసంతో పచ్చళ్లు తయారుచేసి.. రహస్య మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏటా 15 నుంచి 20 వరకు వన్యప్రాణుల వేటపైనే అటవీశాఖ కేసులు నమోదు చేస్తోంది. నీటి కోసం వచ్చి.. ఉచ్చులో చిక్కి అటవీ ప్రాంతంలో ట్యాంకర్లు వెళ్లే ప్రాంతంలోనే నీటి వసతిని ఏర్పాటుచేశారు. కోర్ ఏరియాలో నీటి వసతి లేకపోవడంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు అడవి నుంచి బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో దారితప్పి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దు గ్రామాలైన సిద్ధాపూర్, మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మీపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు ఉడిమిళ్ల, మద్దిమడుగు, తిర్మలాపూర్ (బీకే) తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో ఉండే బోరుబావుల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో కొద్దిపాటి నీరు ఉంది. వన్యప్రాణులు అక్కడికి అధికంగా వస్తుంటాయి. ఏటీఆర్లో వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు నిత్యం ఏదో ఒకచోట వేటాడుతున్న వైనం కెమెరా ట్రాప్ల్లో చిక్కుతున్న వేటగాళ్లు నీటి కోసం బయటికొచ్చి బలవుతున్న వన్యప్రాణులు -
గోడు వినండి.. సమస్య పరిష్కరించండి
● జిల్లా ప్రజావాణికి వినతుల వెల్లువ నారాయణపేట: గోడు వినండి.. సమస్యలు పరిష్కరించండి... అంటూ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఫిర్యాదుదారులు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి కలెక్టర్ సీహెచ్ ప్రి యాంకను స్వయంగా కలిసి వినతులు అందజేశా రు. మొత్తం 23 మంది వినతులు అందజేయగా కలెక్టర్ స్వీకరించి పరిశీలించి వారితో మాట్లాడి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లా డుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును అ త్యంత ప్రాధాన్యతగా తీసుకొని పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
కోస్గి రూరల్: లబ్ధిదారులకు భరోసా కల్పించి మొదటి విడత గ్రామాలకు ఇచ్చిన లక్ష్యం మేర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. సోమవారం గుండుమాల్ రైతువేధికలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూర్ మండలాల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛభారత్పై శ్రద్ధ వహించాలని.. ఎస్బీఎం నిధులు రూ.3 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్నారు. ప్రతి మండలానికి రెండు కమ్యూనిటీ మరుగు దొడ్లు మంజూరయ్యాయని.. నిర్మాణాలు చేపట్టాలని,జనావాసం ఎక్కువ గా ఉన్న ప్రదేశాల్లో రూ.5 లక్షలతో కాంప్లెక్స్లను నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్పీఓ ఉదయ్కుమార్, ఎంపీడీఓ లు శ్రీధర్, వేణుగోపాల్రెడ్డి, కొండన్న, భార్గవరాం, హౌసింగ్ ఏఈ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జలం.. కలుషితం!
పరీక్షలు చేయకుండానే గ్రామాల్లో నీటి సరఫరా ● వర్షాకాలం.. ముంచుకొస్తున్న ముప్పు ● అటకెక్కిన పరీక్షల కిట్లు ● స్పందించని అధికారులు –8లో uమరికల్: గ్రామాల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజీలు, పైపులైన్ల లీకేజీలతో తాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. జిల్లాలోని పలు మండల్లాలో కలుషిత నీరు సరఫరా అవుతున్న విషయా న్ని ఇటీవల సంబంధిత అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. అరకొరగా సరఫరా చేస్తున్న నీరైనా స్వచ్ఛంగా లేకపోవడంతో ప్రజలు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు. కొళాయిల ద్వారా వచ్చే నీటి ని పరీక్షించేందుకు క్లోరింగ్ కిట్లు ఉపయోగపడుతా యి. ఇందుకుగాను సంబంధితశాఖ అధికారులు అన్ని పంచాయతీలకు గతంలో కిట్లు అందజేసింది. వీటిన్ని శిక్షణ పొందిన సిబ్బందితో సక్రమంగా నీటి పరీక్షలు చేయిస్తే శుద్ధమైన నీటిని సరఫరా చేయ వచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 280 గ్రామాలు.. జిల్లావ్యాప్తంగా 280 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామంలో క్లోరింగ్ కిట్లు ఉండాలి. కానీ వీటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. వర్షాకాలం ప్రారంభంలో గ్రామాల్లోని ప్రజా కొళాయిలు, సోర్సు బోర్లు, బావుల దగ్గర క్లోరింగ్ కిట్లతో నీటి పరీక్షలు చేసిన తర్వాతే సరఫరా చేయాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ఒక్కరోజు కూడా సిబ్బంది పరీక్షలు చేసిన దాఖా లాలు లేవు. ఒకవేళ చేసినా అవి మూడుసార్ల కంటే ఎక్కువగా పని చేయడం లేదు. అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో కిట్లు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో మూలనపడేశారు. శుద్ధమైన నీటినే ప్రజలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో తాగునీటి పరీక్ష కిట్లను పంచాయతీలకు అందజేసినా.. ఫలితం లేకపోవడంతో కలుషిత నీటినే తాగాల్సిన దుస్థితి నెలకొంది. క్లోరింగ్ కిట్లను ఏటా పంచాయతీలకు అందజేస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నా.. వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణాలు వినిపిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో తప్పనిసరిగా క్లోరింగ్ కిట్లతో నీటి పరీక్షలు చేయాలి. పైపులైన్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిలో క్లోరిన్ శాతం ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి గతంలో ప్రభుత్వం కిట్లను అందజేసింది. ప్రస్తుతం కిట్లు అందుబాటులో లేకుంటే గ్రామపంచాయతీ నిధులతో కొనుగోలు చేసుకోవాలి. ఇప్పటికే ప్రతి పంచాయతీలో ఒకరిని గుర్తించి నీటి పరీక్షలు చేసే విధానంపై శిక్షణ ఇప్పించాం. – రంగారావు, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్, నారాయణపేట రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి గ్రామాలకు నీటి పరీక్షల కిట్లను అందజేస్తోంది. అంతేగాకుండా గ్రామపంచాయతీలోని తాగునీటి సరఫరా సిబ్బందికి పరీక్షల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వీటిని వినియోగిస్తేనే సార్థకత చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కిట్లను అందజేసినా ఎక్కడకూడా పరీక్షించిన దాఖలాలు కనిపించడం లేదు. బోరు నుంచి వచ్చే నీటితో పాటు ప్రభుత్వం సరఫరా చేస్తున్న భగీరథ నీటిని తరచూ పరీక్షించి తాగడానికి పనికొస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం బారినపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు కిట్ల వినియోగంపై శిక్షణ ఇవ్వని పంచాయతీ తాగునీటి సిబ్బందికి వెంటనే శిక్షణ అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భూసార పరీక్షలు అందని ద్రాక్షే
నర్వ: రైతులు తమ పొలాల్లోని మట్టి పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లాలో ఉన్న అతి తక్కువ భూసార పరీక్ష కేంద్రాలతో అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మినీ భూసార పరీక్షా కేంద్రాలను గతంలో మంజూరు చేసింది. ఈ కేంద్రాల్లో ఆయా గ్రామాల్లో సేకరించిన మట్టి నమూనాలను అక్కడే పరీక్షించి రైతులకు భూ సార పరీక్ష పత్రాలు అందజేయాలని ఆదేశించింది. జిల్లాలోని 77 క్లస్టర్లలో.. 2018లో జిల్లా వ్యవసాయశాఖ ద్వారా ఏఈఓల క్లస్టర్ల వారీగా 77 మినీ భూసార పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మట్టి పరీక్షల నిమిత్తం వినియోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయక నేటికీ ఏర్పాటుకు నోచుకోలేదు. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించేందుకు కిట్లున్న కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేక జడ్చర్ల ల్యాబ్కు పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదని రైతులు చెబుతున్నారు. అటకెక్కిన కిట్లు.. ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రైతుల పొలాల నుంచి మట్టిని సేకరించి కొన్నాళ్ల పాటు సజావుగా పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను రైతులకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోపు భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు భాగానే ఉన్నా.. గత కొన్నేళ్లుగా భూసార పరీక్షల ఊసే లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పాత పద్ధతిలో సాగు.. రైతులకు నష్టాలు 2018లో మంజూరు.. ఒక్కో కేంద్రానికి రూ.1.30 లక్షలు మంజూరు ప్రారంభం ఘనం.. ఆపై సేవలు కనం నిర్వహణ లేక నిరుపయోగంగా మారిన వైనం -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలియోకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాల్సిందేనని పేర్కొన్నారు. జిల్లా లక్ష్యాన్ని సాధించేలా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య, ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వే బృందాలు, వ్యాక్సిన్ నిల్వలు, పంపిణీ ఏర్పాట్లను ప్రోగ్రామ్ అధికారిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఒక్క చిన్నారి కూడా తప్పిపోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జిల్లా యంత్రాంగం.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. గ్రామాలు, తండాలు, దూర ప్రాంతాలు, ఇటుక బట్టీలు, వలస కార్మికుల కాలనీలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేందుకు 416 బృందాలు పనిచేశాయి. ఉదయం నుంచే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగనన్వాడీ టీచర్లు, వైద్యసిబ్బంది, పర్యవేక్షకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేశారు. కొందరు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కేంద్రాలకు తీసుకొచ్చారు. అత్యధికంగా కోస్గి మండలంలో 8,369 మంది చిన్నారులకు, మద్దూర్లో 8,039, గుండుమాల్ 7 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా.. అత్యల్పంగా ఊట్కూర్లో 2,024 మంది చిన్నారులకు వేశారు. జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, ఆర్ఎంఓ డా. బాలాజీ, పోలియో ప్రోగ్రామ్ అధికారి డా. సాయిరాం, కౌన్సిలర్లు ప్రభాకర్, రాజేష్ ఘట్ పాల్గొన్నారు. మండలం చిన్నారుల సంఖ్య దామరగిద్ద 5,153 ధన్వాడ 3,095 గుండుమల్ 7,000 కోస్గి 8,369 కోటకొండ 5,966 మద్దూర్ 8,039 మాగనూరు 5,533 మరికల్ 3,120 నారాయణపేట 4,231 నర్వ 4,097 పులిమామిడి 2,842 ఊట్కూర్ 2,024 మండలాల వారీగా పోలియో చుక్కలు వేసిన చిన్నారులు -
సైబర్ మాయలో పడొద్దు : ఎస్పీ
నారాయణపేట: తక్కువ సమయంలో భారీ లాభాలు.. ఇంట్లో నుంచే ఉద్యోగం.. సులభంగా రుణం.. లక్కీ డ్రాలో రూ.కోట్ల బహుమతి.. వంటి ఆశాజనక ప్రకటనలతో సైబర్ మోసగాళ్లు వల వేస్తుంటారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బంగారం, స్థలాలు, ఆన్లైనన్ వ్యాపారాలు, లక్కీడ్రాలు, విదేశీ ఉద్యోగాల పేరిట మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని డబ్బులు అడగడం, ఫేక్ ప్రొఫైళ్లతో స్నేహం చేసి ఆర్థిక సాయం కోరడం, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెప్పి ఖాతాలోని నగదు దోచుకోవడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, లింకులు, మెస్సేజ్లు, యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల్లో నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ముందస్తు డబ్బులు వసూలు చేసే మోసాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలను మాత్రమే సంప్రదించాలని, ముందుగానే డబ్బులు అడిగే సంస్థలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా చీటింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించినా, మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. చీటింగ్, సైబర్ నేరాలకు పాల్పడే వారిపై జిల్లా పోలీస్శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. -
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి
కోస్గి రూరల్: బీఎల్ఏలు అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండే విధంగా పర్యవేక్షించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన యువతీ యవకులను ఓటర్లుగా నమోదు చేయించాలని, ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి బీఎల్వోలకు అందజేసే సమయంలో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని.. ఎన్యూమరేషన్ ఫారాల్లోని తప్పొప్పులను సరి చేయించాలని సూచించారు. కార్యక్రమంలో కోస్గి పుర ఇన్చార్జ్ వెంకటనర్సింహులు, నరేందర్రెడ్డి, సాయిలు, వెంకటయ్య, శ్యాసం రామకృష్ణ, కిష్టయ్య, నీలప్ప, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆర్థిక చేయూత నారాయణపేట: తల్లిదండ్రులు లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందేమోనని ఆందోళన చెందుతున్న ఇద్దరు అనాథ బాలికలకు మీ భవిష్యత్కు మేమున్నామంటూ అండగా నిలిచారు నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. అనాథ బాలిక పద్మశ్రీకి గతేడాది బీటెక్ విద్య కోసం అవసరమైన రూ.1.10 లక్షల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆమె చదువు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకున్నారు. తాజాగా ధన్వాడ మండలానికి చెందిన అనాథ బాలిక ఝాన్సీరాణి బీటెక్లో సీటు సాధించగా అడ్మిషన్, ప్రాసెసింగ్ ఫీజుకు అవసరమైన రూ.10,100 వెంటనే అందజేశారు. అంతేగాకుండా ఆమె చదువు పూర్తయ్యే వరకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన బాలికలను సొంత పిల్లల్లా భావించి వారి ఉన్నత విద్యకు అండగా నిలవడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఉత్సాహంగా ఫుట్బాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంటుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి 50 మంది క్రీడాకారిణులు హాజరుకాగా 25 మందిని ప్రాబబుల్స్కు ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు రోజులపాటు క్యాంప్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు కేఎస్ నాగేశ్వర్, నందకిషోర్, కోచ్లు రాములు, నరేష్, రాజ్కుమార్, ప్రేమ్, ప్రకాశ్ పాల్గొన్నారు. -
రైతువేదికలో ఏర్పాటు చేయాలి..
గతంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాలు సేకరించారు. ఇప్పటి వరకు పరీక్షల ఫలితాల కార్డులను అందించలేదు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతువేదికల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఆయా గ్రామాల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఫలితంగా పంటల సాగులో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. – మారుతి, రైతు, నాగిరెడ్డిపల్లి ఉన్నతాధికారులకు విన్నవిస్తాం.. రైతులు ప్రతి మూడేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. దీంతో 2018లో ఏఈఓల క్లస్టర్ల వారీగా నాటి ప్రభుత్వం మినీ కేంద్రాలను మంజూరు చేసింది. ఆయా కేంద్రాలకు రసాయనాలు, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా నిలిచిపోయింది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులు జడ్చర్ల ల్యాబ్లో నామినల్ ఫీజు చెల్లించి భూసార పరీక్షలు చేయించుకోవచ్చు. – నాగేష్, ఏడీఏ, మక్తల్ ● -
ట్రామా ‘కేర్’ కలేనా?
● గోల్డెన్ అవర్లో వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు 600కి.మీ.మేర జాతీయ రహదారుల విస్తరణ ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సకు అవస్థ ● వైద్యారోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చినా.. ముందుకు కదలని వైనం మహబూబ్నగర్ క్రైం: జాతీయ రహదారుల విస్తరణతో వాహనాల వేగం పెరుగుతోంది.. కానీ అదే వేగంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడాల్సిన శ్రీగోల్డెన్ అవర్’ (తొలి గంట)లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం అందకపోవడంతో రోజురోజుకూ మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక థర్డ్ లెవల్ ట్రామా కేర్ యూనిట్ను అందుబాటులోకి తీసుకువస్తామని ఏప్రిల్ 10న జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. రెండున్నరేళ్లలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 4,231 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 2,109 మంది మృత్యవాతపడ్డారని నివేదికలు చెబుతున్నాయి. 13 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఉమ్మడి జిల్లా మీదుగా 44, 167, 167ఏ, 765 నంబర్ జాతీయ రహదారులు ఉన్నాయి. దాదాపు 600 కి.మీ.మేర విస్తరించి ఉంది. కనీసం 12 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, అధికారులు హడావుడి చేయడం మినహా దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు కనిపించడం లేదు. అత్యవసర చికిత్స అందకపోవడంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం, గోల్డెన్ అవర్లో చికిత్స అందకపోవడం, జనరల్ ఆస్పత్రిలో సరైన వసతులు లేక ప్రాణనష్టం సంభవిస్తోంది. ఎన్హెచ్–44పై 2013లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా బాలానగర్–రాజాపూర్ మధ్యలో, జానంపేట, కొత్తకోట, పెబ్బేర్, ఎర్రవల్లి, అలంపూర్ ఎక్స్రోడ్ దగ్గర ట్రామా కేర్ భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేసిన ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ● ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే పరికరాలు, సౌకర్యాలు, వైద్యులు కూడా అందుబాటులో లేరు. అత్యవసరంలో స్కానింగ్ చేయడానికి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక అత్యవసర వైద్య సేవల కోసం నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్లలో మూడేళ్ల క్రితం 50 పడకలతో క్రిటికల్ కేర్ యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక్క నాగర్కర్నూల్ మినహా మిగతావి పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కోస్గి, వనపర్తి, పెబ్బేరు, గద్వాల, మక్తల్, కొత్తకోట, తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మహబూబ్నగర్, హైదరాబాద్ లేదా కర్నూలుకు తరలించాల్సి వస్తుంది. ప్రయాణానికి కనీసం 2 నుంచి 4 గంటల సమయం పడుతుండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ప్రభుత్వం జిల్లాలో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించిన ప్రకారం జిల్లాలో అనువైన స్థలాలు ఎంపిక చేశాం. జానంపేటలో పాత పీహెచ్సీ భవనం తొలగించి దాని స్థానంలో 30 పడకలతో ట్రామా కేర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. బాలానగర్ వద్ద హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి జిల్లాలో మొదటి రెండు ట్రామా కేర్ సెంటర్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. అలంపూర్ చౌరస్తా వరకు మరో నాలుగు ట్రామా కేర్ సెంటర్లు వచ్చే అవకాశం ఉంది. – డాక్టర్ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ -
జూలై 4న మిడ్జిల్కుసీఎం రేవంత్రెడ్డి
జడ్చర్ల/మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ స్థలంలో బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్ద్యాప గోపాల్రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్ స్థలం, పార్కింగ్తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్, ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. -
చేనేత.. ఎన్నిక
చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాం. సోమవారం ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రిటర్నింగ్ అధికారులను నియమించి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేపడతాం. – ఇందిర, ఏడీ, చేనేత జౌళిశాఖ, జోగుళాంబ గద్వాల అమరచింత: చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూలై 10 నాటికి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రకటన జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. ఈ నెల 12న 50 మంది సభ్యులున్న సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన సంఘాలకు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు ఓటరు జాబితాను చేనేత జౌళిశాఖ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేని సభ్యులకు మాత్రమే పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుందని ప్రకటించడంతో ఆశావహులు సంఘాలు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించి ఓటు హక్కును కాపాడుకున్నారు. 50 మంది సభ్యులున్న చేనేత సంఘాల్లో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకొని అందులో నుంచే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం పూర్తయింది. వందమంది కంటే అధికంగా సభ్యులున్న సంఘాలకు జూలై 10న ఓటింగ్ విధానంలో ఎన్నిక ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013, ఫిబ్రవరిలో చివరిసారి జరిగాయి. 2018లోనే ఆయా సంఘాల కాల పరిమితి ముగియగా.. తిరిగి ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాటు 16 పర్యాయాలు పాత పాలకవర్గాల పదవీ కాలన్ని పొడిగిస్తూ వచ్చింది. చివరిసారి గతేడాది మార్చి 9 నుంచి మే నెల 10 వరకు పొడిగించారు. జిల్లాలోని పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 చేనేత సహకార సంఘాలు ఉండగా.. తుది జాబితా ప్రకారం 8,727 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లాలోని వెంకటాయపల్లి, రాజాపూర్, పెద్ద ఆదిరాల, ఎదిర సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 40 సంఘాలకు ఎన్నికలు జరగనుండగా.. జూలై 2 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై 10న ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ పత్రాలను రెండురంగుల్లో ముద్రించనున్నారు. మహిళా రిజర్వ్ స్థానాలకు లేత గులాబీ, ఓపెన్ కేటగిరీకి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. ● జూన్ 29న నోటిఫికేషన్ జారీ ● జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్ల స్వీకరణ ● జూలై 5న పరిశీలన ● జూలై 6న ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ● జూలై 10న ఉదయం పోలింగ్.. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జిల్లాల వారీగా ఇలా జిల్లా సంఘాలు ఓటర్లు జో.గద్వాల 16 4,116 నారాయణపేట 12 739 వనపర్తి 8 2,014 నాగర్కర్నూల్ 3 96 మహబూబ్నగర్ 1 146 ఎన్నికల షెడ్యూల్.. నేడు వెలువడనున్న ప్రకటన పూర్తయిన ఓటరు జాబితా 50 మంది సభ్యులున్న సంఘాలకు ముగిసిన ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 44 చేనేత సహకార సంఘాలు -
కెమెరాలతో నిఘా..
నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను అమర్చి నిఘా పెంచారు. ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని చోట రేడియో ఫ్రీక్వెన్సీతో 360 డిగ్రీల పరిధిలో 24 గంటల పాటు సర్వే లెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రేడియో ఫ్రీక్వేన్సీ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్కు దృశ్యాలను అందుబాటులోకి వచ్చే వెసులుబాటు ఉండటంతో పర్యవేక్షణ మరింత పెరిగింది. అదే విధంగా వాకీటాకీలు పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశారు. 10 రేంజ్లు, 30 బేస్ క్యాంపుల పరిధిలో ఒక డ్రోన్, 350 కెమెరా ట్రాప్లతో పులుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. -
అజిత్రెడ్డికి మరో కీలక పదవి
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిధిలోని ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన బి.అజిత్రెడ్డికి మరో కీలకపదవి దక్కింది. గడిచిన రెండున్నర సంవత్సరాలుగా సీఎం రేవంత్రెడ్డి పేషీలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన ఆయనకు తాజా బదిలీల్లో ఇన్వెస్ తెలంగాణ సీఈఓ బాధ్యతలు ఇవ్వగా, శనివారం ప్రభుత్వం మరో జీఓ 920ని విడుదల చేస్తూ.. కీలకమైన హైదరాబాద్ మెట్రోరైల్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా(ఎఫ్ఏసీ)గా నియమించింది. ఐఐటీ మద్రాస్ నుంచి డిగ్రీ పట్టా పొందిన అజిత్రెడ్డి 2012 సివిల్ సర్వీస్కు ఎంపికై రక్షణ శాఖలో డెహ్రాడూన్, చైన్నె, ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరులలో పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత నమ్ముకస్తుడిగా వ్యవహరిస్తున్న అజిత్రెడ్డికి కీలకమైన మెట్రో బాధ్యతలు అప్పగించటంపై ఉమ్మడి జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. -
జూలై 5 వరకు అవకాశం..
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. జూలై 5 వరకు కంది, పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. ఆశించిన మేర వరా్షాలు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు విత్తడం ప్రారంభించాలి. సరిపడా తేమ లేకుండా తొందరపడి విత్తనాలు వేయొద్దు. భూమిలో తగినంత తేమ వచ్చిన తర్వాతే సాగు పనులు చేపట్టాలి. వరి సాగు చేయాలనుకునే రైతులు ప్రస్తుతం నారుమడులు (నార్లు) పోసుకోవచ్చు. తగిన వర్షపాతం నమోదైన తర్వాత ప్రధాన పొలాల్లో నాట్లు వేయాలి. వాతావరణ పరిస్థితులు గమనిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. – సక్రియానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
నిండు జీవితానికి రెండు చుక్కలు
నేడు పల్స్ పోలియో ● జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాలు.. 53,666 మంది చిన్నారులు ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నారాయణపేట: పోలియో రహిత సమాజ నిర్మాణానికిగాను ఆదివారం పల్స్పోలియో కార్యక్రమ నిర్వహణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 447 కేంద్రాల్లో 53,666 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం 72 వేల డోసులను అందుబాటులో ఉంచగా.. 1,880 మంది వైద్యసిబ్బందిని విధుల్లో నియమించారు. వీరిలో వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొననున్నారు. ప్రయాణాల్లో ఉండే చిన్నారులకు కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా 12 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లాపరిధిలోని 5 ప్రధాన బస్టాండ్లలో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే చిన్నారులకు కూడా చుక్కలు వేయనున్నారు. ● కార్యక్రమ పర్యవేక్షణకు జిల్లాను 40 రూట్లుగా విభజించి ప్రతి రూట్కు 45 మంది సూపర్వైజర్లను నియమించారు. వ్యాక్సిన్ నిల్వలు, బూత్ల నిర్వహణ, లక్ష్యసాధన తదితర అంశాలను వీరు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. ఆదివారం బూత్లలో చుక్కలు వేయించని చిన్నారులను గుర్తించి తర్వాతి రోజుల్లో ఇంటింటికీ వెళ్లి అందించేందుకు కూడా చర్యలు చేపట్టనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మండలాల వారీగా ఐదేళ్లలోపు చిన్నారులు మండలం చిన్నారుల సంఖ్య నారాయణపేట 8,921 గుండుమాల్ 7,562 మద్దూరు 6,835 మక్తల్ 6,669 దామరగిద్ద 5,379 మాగనూరు 5,040 ఊట్కూర్ 4,622 నర్వ 3,664 ధన్వాడ 2,190 మరికల్ 2,784 -
పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
నారాయణపేట: జిల్లా ప్రజలకు అత్యాధునిక పాలనా సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం సింగారం మలుపు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ చాంబర్లు, సమావేశ మందిరం సందర్శించి నిర్మాణ నాణ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిటికీలు, తలుపుల బిగింపు, వైరింగ్, శానిటరీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మీటింగ్ హాల్లో ప్రొజెక్టర్, సౌండ్ సిస్టం, ఇంటీరియర్ డిజైన్ను ఇతర జిల్లాల కలెక్టరేట్లను అధ్యయనం చేసి ఉత్తమ నమూనాలను అమలు చేయాలని చెప్పారు. భవనం వెనుక భాగంలో ప్రత్యేక రహదారి, గేటు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవనం వెలుపల హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో హెలీప్యాడ్ ఏర్పాటు సాధ్యం కాదని అధికారులు వివరించడంతో ఆ ప్రాంతాన్ని వాహనాల పార్కింగ్కు వినియోగించాలని నిర్ణయించారు. పార్కింగ్ షెడ్పై మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వెనుక రూ.5 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా సమాఖ్య భవనం పనులను పరిశీలించారు. అక్కడ హెలీప్యాడ్ ఏర్పాటుకు అవకాశం పరిశీలించాలని, భవన ఆవరణలో ఓ వైపు రహదారి, మిగతా ప్రాంతంలో పచ్చదనం పెంపొందించేలా అభివృద్ధి చేయాలని డీఆర్డీఓ వెంకట్రాములుకు సూచించారు. ఆమె వెంట ఆర్అండ్బీ ఈఈ వెంకటరమణ, డీఈ రాములు, పీఆర్ ఈఈ అశోక్కుమార్, ఆయా శాఖల ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వేగంగా పంపిణీ చేయాలి.. ఊట్కూర్: జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్వోలు, రెవెన్యూ అఽధికారులు వేగంగా పంపిణీ చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కార్గిల్ చౌరస్తా, గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి బీఎల్వోలతో కలిసి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వచ్చే బీఎల్వోలకు సహకరించి పత్రాలు పూరించి ఇవ్వాలని కోరారు. ఆమె వెంట తహసీల్దార్ అశోక్కుమార్, ఎంఈఓ మాధవి, డీపీఆర్వో రషీద్, ఆర్ఐ కృష్ణారెడ్డి, కోరం శివరాజ్రెడ్డి, వెంకటేశ్వరమ్మ, సునీత తదితరులు ఉన్నారు. -
భక్తిశ్రద్ధలతో మొహర్రం
డోలారోహణ కార్యక్రమానికి తరలివచ్చిన జనంపీర్ల వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఊట్కూర్లో ఊరేగుతున్న హసేన్, హుసేన్ పీర్లు ఊట్కూర్: మతసామరస్యానికి ప్రతీకై న మొహర్రంను పట్టణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక పెద్దపీర్ల మసీద్లో హసేన్, హుసేన్ పీర్లను పది రోజుల కిందట ప్రతిష్టించారు. నవమి సవారి సందర్భంగా తెల్లవారుజామున పీర్లను గ్రామ పురవీధుల్లో ఊరేగించి ఉదయం 9 గంటలకు తిరిగి మసీద్కు తీసుకొచ్చారు. దశమి సవారి సందర్భంగా తిరిగి సాయంత్రం సవారి ప్రారంభమై గ్రామంలో ఊరేగిస్తూ నిమజ్జనానికి పెద్దచెరువుకు తీసుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు బొడ్డెమ్మలు, యువకులు డప్పులు కొడుతూ అలయ్ ఆడారు. కొందరు మేకలు, గొర్రెలతో కుందూర్లు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొహర్రం సందర్భంగా చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. ముంబై, పూణె, సోలాపూర్, బెంగళూర్, హైదరాబాద్ తదితర పట్టణాల నుంచి అధికమంది తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కనులపండుగగా డోలారోహణం.. మొహర్రంలో భాగంగా దేవినగర్లో అనాదిగా వస్తున్న డోలారోహణ కార్యక్రమం కనులపండుగా నిర్వహిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో ఆరెకటిక కులానికి చెందిన శిశువును వేయగా హసేన్, హుసేన్ పీర్లు ఊయలను ఊపి బాలుడికి నామకరణం చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొని చప్పట్లు కొట్టి శిశువును దీవించారు. ఆరెకటికె కుటుంబాలకు చెందిన మగ శిశువుకు నామకరణం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. మొక్కులు తీర్చుకున్న మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హసేన్, హుసేన్ పీర్లకు దట్టీలు, చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మసీద్ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. నాయకులు లక్ష్మారెడ్డి, సుధాకర్రెడ్డి, కోరం శివరాజ్రెడ్డి, ఆనంద్, తరుణ్, మోనప్ప, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగంపై ప్రభుత్వం చిన్నచూపు
అమరచింత: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కొరవడి విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ పాఠశాల, కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగదితో పాటు తరగతి గదులు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు అదేవిధంగా జూనియర్ కళాశాలలో మొత్తం 400 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నట్లు ఆయన తెలిపారు. హిందీ ఉపాధ్యాయురాలు లేరని, తాగునీరు, స్నానాలకు నీటివసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. శుద్ధజల యంత్రం మరమ్మతుకు గురికావడంతో బోరునీటినే తాగుతున్నారని.. మంచాలు లేకపోవడంతో కిందనే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని.. అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. బడులతో పాటు గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కస్తూర్బాల్లో మౌలిక వసతులు సైతం కల్పించలేని దీన స్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటం శోచనీయమన్నారు. సరిపడా తరగతి గదులతో పాటు ఉపాధ్యాయులను నియమించలేని దుస్థితి ఉందని తెలిపారు. సీఆర్టీలకు కనీస వేతనం నెలకు రూ.25 వేలు చెల్లించకపోవడం, విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా స్కావెంజర్లను నియమించకపోవడంతో బాలికలే తమ తరగతి గదులను శుభ్రం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ల్యాబ్లను ఏర్పాటు చేయడం లేదని, క్రీడాసామగ్రి సమకూర్చి పీఈటీలను నియమించి విద్యతో పాటు క్రీడా నైపుణ్యాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా, గురుకులాలను సందర్శించే కార్యక్రమం చేపట్టామని.. సమస్యలు తెలుసుకొని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి విన్నవిస్తామని చెప్పారు. ఆయా సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, మహిమూద్, జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రాఘవేంద్ర, కౌన్సిలర్ డీసీ మాధవి, పాంరెడ్డిపల్లి ఉపసర్పంచ్ వెన్నెల, చంటి, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
రైతు సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక భగత్సింగ్ భవన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 30వ తేదీ వరకు మండల అధికారులు, కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీ విత్తనాలు, పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు, పెరుగుతున్న పెట్టుబడితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని రద్దు చేసి అవసరమైనంత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ఎరువుల ధరలను నియంత్రించి రైతులకు అందుబాటు ధరలో సరఫరా చేయాలని కోరారు. రైతులు పండించిన అన్నిరకాల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కొనుగోళ్లపై పరిమితులు విధించవద్దని డిమాండ్ చేశారు. పంట మార్పిడీని ప్రోత్సహించాలంటే అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు కొనుగోలు హామీ ఇవ్వాలని, అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించించారు. సమావేశంలో నాయకులు చెన్నారెడ్డి, నారాయణ, తాయప్ప, మల్లేష్, కనకప్ప, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పలుచోట్ల వర్షం
● నారాయణపేటలో అత్యధికంగా 16.8 మి.మీ. వర్షపాతం నమోదు నారాయణపేట: జిల్లాలో గురువారం పలుచోట్ల చిరు జల్లులు, తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లావ్యాప్తంగా 35.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లా సగటు వర్షపాతం 2.72 మిల్లీమీటర్లు నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే నారాయణపేటలో అత్యధికంగా 16.8 మి.మీ, కృష్ణాలో 10.8 మి.మీ., గుండుమల్లో 3.0 మి.మీ., ధన్వాడలో 2.4 మి.మీ., ఊట్కూర్లో 2.0 మి.మీ., మాగనూర్లో 0.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు దామరగిద్ద, మక్తల్, నర్వ, మరికల్, మద్దూర్, కోస్గి, కొత్తపల్లి మండలాల్లో వర్షం కురవలేదు. సర్పై అపోహలు వద్దు: కలెక్టర్ నారాయణపేట రూరల్: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్నామని.. ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మండలంలోని జాజాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామానికి చెందిన బసుదె కిష్టప్ప ఇంటికెళ్లి స్వయంగా ఫారాలు అందజేశారు. అంతేగాకుండా ఫారాలను ఎలా నింపాలో యజమానికి అర్థమయ్యేలా వివరించారు. నింపిన ఫారాలను రెండు, మూడురోజుల్లో తిరిగి బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. రెండురోజుల్లో ఫారాల పంపిణీ పూర్తి చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. ఫారాలు ఇచ్చేటప్పుడే ఓటర్ల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం బసుదె కిష్టప్ప ఇంట్లో మగ్గంపై నేత కార్మికులు నేస్తున్న నారాయణపేట కాటన్ చీరలను ఆమె ఆసక్తిగా తిలకించారు. చీర నేసే మొత్తం ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న చీరలను పరిశీలించి మూడింటిని కొనుగోలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగీత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రెండ్రోజులకే నిలిచిన నీటి పంపింగ్ మరికల్: జూరాల నుంచి కోయిల్సాగర్కు నీటి పంపింగ్ రెండురోజులకే నిలిచిపోయింది. గత వారం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి చిన్నచింతకుంట మండలం ఉంద్యాల స్టేజీ–1 దగ్గర జూరాల నీటి పంపింగ్ను ప్రారంభించి రెండురోజుల పాటు పర్ధీపూర్ చెరువుకు సరఫరా చేశారు. పర్ధీపూర్ చెరువు నిండి కోయిల్సాగర్కు నీళ్లు రావాలి. ఆ చెరువు నిండటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ఎల్నినో ప్రభావంతో ఎగువన కూడా భారీ వర్షాలు కురువకపోవడంతో జూరాలకు వరద రావడం లేదు. దీంతో జూరాలలో నీరు అందకపోవడంతో రెండురోజులు మాత్రమే నీటిపంపింగ్ చేసి నిలిపివేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురిస్తే తప్పా ఈ ఏడాది కోయిల్సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం కోయిల్సాగర్లో పది అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. గతేడాది ఇదివరకే నీటిపంపింగ్ ప్రారంభించారు. రేపు జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: నిజామాబాద్ జిల్లాలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు జరగనున్న సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికను ఈనెల 28వ తేదీన ఉదయం 8 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్స్టేడియంలో నిర్వహిస్తునట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో పాల్గొనే బాలికలు ఒరిజినల్ ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9396439663 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
మత్తుకు బానిసైతే భవిష్యత్ అంధకారం
నారాయణపేట: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని, యువత యాంటీ డ్రగ్ సోల్జర్స్గా పని చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి సత్యనారాయణచౌరస్తా వరకు కొనసాగింది. అక్కడే మానవహారంగా ఏర్పడి డ్రగ్స్కు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, స్నేహితులు, ఎంజాయ్ పేరుతో సమయాన్ని వృథా చేస్తే కష్టకాలంలో ఎవరూ అండగా ఉండరని చెప్పారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేవి టెరర్రిస్టుల కంటే ప్రమాదకరమైనవన్నారు. యువత అధికంగా ఉన్న భారతదేశాన్ని బలహీనపర్చేందుకు డ్రగ్స్ను ఆయుధంగా ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు అవసరం లేదని.. యువతను వ్యసనాలకు బానిస చేస్తే చాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే విద్య, ఉద్యోగం, జీవితం పూర్తిగా దెబ్బతింటుందని, అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నాయని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి యువకుడు యాంటీ నార్కోటిక్ డ్రగ్ వారియర్గా మారాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఎకై ్సజ్ సీఐ అశోక్కుమార్, ఆర్ఐ విజయభాస్కర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, కృష్ణచైతన్య, ఎకై ్సజ్ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు.. 11 ఏళ్లకు తల్లిదండ్రుల చెంతకు
ఊట్కూర్: తప్పిపోయిన ఓ మానసిక దివ్యాంగుడు 11 ఏళ్ల తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరిన ఘటన మండలంలోని తిప్రాస్పల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుర్వ భీమప్ప, ఎల్లమ్మకు ముగ్గురు మగ పిల్లలు. చిన్నవాడైన హన్మంతు (13) బుద్ధిమాంద్యంతో ఇంటి దగ్గర ఉండేవాడు. 11 ఏళ్ల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడి ఆచూకీ కోసం ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం చైన్నెలోని ‘మనసు‘ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సర్పంచ్ విజయలక్ష్మి నర్సింహకు ఫోన్ చేసి గ్రామానికి చెందిన ఓ మా మానసిక దివ్యాంగుడు తమ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నారని వాట్సప్లో ఫొటో పంపారు. కుటుంబ సభ్యులు గుర్తించడంతో గ్రామస్తులతో కలిసి చైన్నెకి వెళ్లారు. యువకుడు తల్లిదండ్రులను గుర్తించడంతో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వారికి అప్పగించారు. 2015, సెప్టెంబర్ 29న తమిళనాడులోని చెంగల్పట్టు రైల్వేస్టేషన్లో 13 ఏళ్ల హన్మంతు తిరుగుతుండగా.. స్వచ్ఛంద సంస్థ వారు గమనించి చైన్నెలోని ఆశ్రమంలో చేర్పించి చికిత్స అందించారు. నాలుగు రోజుల కిందట తన గ్రామం తిప్రాస్పల్లి, మక్తల్ అని చెప్పడంతో సంస్థ సభ్యులు గూగుల్ సాయంతో సర్పంచ్కు సమాచారం అందించారు. 11 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు చేరడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మొహర్రంకు పటిష్ట బందోబస్తు
నారాయణపేట/ఊట్కూర్: మొహర్రంను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ కోరారు. గురువారం ఆయన డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్తో కలిసి ఊట్కూర్ పోలీస్స్టేషన్లో బందోబస్తు విధులకు హాజరైన 164 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పీర్ల ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక పికెట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, మొబైల్, ఫుట్ పెట్రోలింగ్తో పాటు సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలోనే అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులు జరగకుండా ప్రత్యేక బృందాలను మొహరించినట్లు చెప్పారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టే, ఇతరులకు ఇబ్బందులు కలిగించే పోస్టులు, సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఆర్ఐ నర్సింహ, ఎస్ఐలు రమేష్, శివశంకర్, రేవతి, గాయత్రి పాల్గొన్నారు. -
సంక్షేమం.. కాగితాలకే పరిమితం కావొద్దు
● రొటీన్ పాలనకు స్వస్తి పలకండి ● ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయండి ● జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన నారాయణపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కేవలం ఒక ప్రత్యేక కార్యక్రమం కాదని.. ప్రజల సమస్యలను నేరుగా గుర్తించి పరిష్కరించే ఫలితాల ఆధారిత పరిపాలన విధానమని రాష్ట్ర కార్మిక, ఉపాఽ ది శిక్షణ, కర్మాగారాలశాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి లబ్ధిదారుడి ఇంటి గుమ్మం వరకు చేరేలా అధికారులు పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పాలనకు అసలైన ప్రమాణమని పేర్కొన్నారు. అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారి తమ రోజువారీ విధులకు మాత్రమే పరిమితం కాకుండా.. ఇతర జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జిల్లాలో అమలు చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు గరిష్ట ప్రయోజనం కలిగించాలని కోరారు. ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలి.. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలని, ఆహార భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎనీమియా నిర్మూలనకు చర్యలు చేపట్టాలని, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు అమలు చేయాలని కోరారు. సంప్రదాయ పంటలతో పాటు పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందున విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో పాటు అన్ని శాఖల అధికారులను అభినందించారు. ఇదే పనితీరును భవిష్యత్లో కూడా కొనసాగించాలని కోరారు. -
‘సర్’పై అపోహలు వద్దు: కలెక్టర్
నారాయణపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అపోహలకు తావివ్వొద్దని.. అర్హులైన ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో భాగస్వామి కావాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ఎస్ఐఆర్–2026 కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన 2కే రన్ను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణ చౌరస్తా వరకు సాగింది. అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొని ఓటరు చైతన్య సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ఉద్దేశం ఓటర్ల పేర్లు తొలగించడం కాదని, మృతిచెందిన, డబుల్ నమోదులను తొలగించి ఓటరు జాబితాను మరింత కచ్చితంగా, ప్రామాణికంగా రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే నెల 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని.. బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఓటర్లు ఆ ఫారాలను పూర్తిచేసి తిరిగి సమర్పించడంతో తమ పేరు ఓటరు జాబితాలో కొనసాగుతున్నట్లు నిర్ధారించుకోవాలని సూచించారు. నెలరోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. 2కే రన్లో పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఎస్పీ నల్లపు లింగయ్య, కలెక్టరేట్ ఏవో అనిల్, డీవైఎస్ఓ వెంకటేష్శెట్టి, డీపీఆర్వో రషీద్, సీఐ శివశంకర్, తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, వివిధ శాఖల అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు సహకారమేది?
జిల్లావ్యాప్తంగా 45 ఏఈఓ పోస్టులు ఖాళీ ● మొత్తం 77 క్లస్టర్లు.. 32 మంది విధుల్లో... ● ఒక్కొక్కరికి 6 నుంచి 8 గ్రామాలు అదనం ● పని ఒత్తిడికి గురవుతున్న అధికారులు–8లో uమరికల్: వానాకాలం పంటల సాగు ప్రారంభమైంది. మేలైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పలు రకాల ప్రభుత్వ పథకాలను అన్నదాతలకు చేరువ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారుల పాత్ర ఎంతో కీలకం. జిల్లాలోని పలుచోట్ల ఆయా పోస్టులు ఖాళీగా ఉండటంతో రైతులకు సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. అన్నదాతలు, ప్రభుత్వానికి వారధిగా నిలిచే ఏఈఓలను పూర్తిస్థాయిలో నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో మొత్తం 77 క్లస్టర్లు ఉండగా.. కేవలం 32 మంది ఏఈఓలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా క్లస్టర్లలో లేకపోవటంతో పలురకాల సేవలు రైతులకు సకాలంలో అందడం లేదు. జిల్లాలో ఇలా.. జిల్లా సాగు విస్తీర్ణం 4.34 లక్షల ఎకరాలు ఉండగా.. 1.92 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో ఏటా 4లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు వివిధ రకా ల పంటలు సాగు చేస్తున్నారు. రైతులకు వానాకాలం, యాసంగి సీజన్లో పంటల సాగుపై సలహా లు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం 5 వేల ఎక రాలకు ఓ క్లస్టర్గా విభజించి జిల్లావ్యాప్తంగా 77 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతువేదికలు నిర్మించింది. కాగా జిల్లాలో ప్రస్తుతం 32 మంది ఏఈఓలు మా త్రమే విధులు నిర్వర్తిస్తుండగా.. 45 ఖాళీలున్నాయి. ఆయా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఒక్కో ఏఈఓకు 6 నుంచి 8 గ్రామాల చొప్పున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో వారు తమ విధులకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. యూరియా యాప్, పంటలు పండిన సమయంలో 8 గ్రామాల రైతులు ఒక్కసారిగా రావడంతో తాకిడిని తట్టుకోలేక ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఏఈఓల విధులు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫర్టిలైజర్ యాప్ విడుదల చేసింది. రైతులు పట్టాదారు పాసు పుస్తకాలను ఏఈఓల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్థానికంగా ఏఈఓ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కూడా రైతులు తప్పనిసరిగా చేయించుకోవాలి. క్రాప్ బుకింగ్కు సైతం విస్తరణాధికారి లేకుంటే ఇబ్బందే. మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు చేతికొచ్చిన తర్వాత మార్క్ఫెడ్, ఐకేపీ, సహకార సంఘాలు, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా ఉండాలి. భారత పత్తి సంస్థ(సీసీఐ) కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా రైతుల వివరాలు ఆన్లైన్ చేసి ఉండాలి. రైతుభరోసా దరఖాస్తులు ఆలస్యమైనా, దరఖాస్తు చేయలేకపోయినా ఆ కుటుంబం ప్రభుత్వం అందించే రూ.5 లక్షల బీమా సాయం కోల్పోతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుభరోసా నిధుల విడుదలలో ఇబ్బందులు పరిష్కరించే బాధ్యత ఏఈఓలపైనే ఉంది. -
వడివడిగా గుడ్డెందొడ్డి
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది సుమారు 93 కిలోమీటర్ల మేర పారుతుంది.. కృష్ణాబేసిన్ పరిధిలోనే 9 లక్షల ఎకరాల ఆయకట్టుతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేశారు. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ పెద్దన్నగా ఉన్న జూరాల ప్రాజెక్టు జలాశయం నుంచి నీటిని తరలిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అయితే ఇదే ప్రాజెక్టుల కింద రబీ సీజన్లో నీటికష్టాలు తలెత్తుతున్నాయి. పెద్దన్నగా చెప్పుకొనే జూరాల జలాశయం నీరులేక అడుగంటిపోవడమే ప్రధాన కారణం. దీంతో ఏటా తాగునీటి అవసరాలకు సైతం పైనున్న కర్ణాటకను ప్రాధేయపడాల్సి వస్తుంది. ఈ క్రమంలో నీటి కష్టాలను అధిగమించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. జూరాల జలాశయానికి సమీపంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం జలాశయం 1.5 టీఎంసీలు కాగా.. దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు సర్వే ప్రక్రియ పూర్తయి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రబీలోనే కష్టాలు.. వానాకాలంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పారుతున్నప్పటికీ రబీ సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతాయి. ఇటీవల కాలంలో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంది. జూరాల ఎడమ కాల్వ పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించగా.. కుడి కాల్వ పరిధిలో ఆయకట్టు సగానికి కుదించేయడం చూస్తే సాగునీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై.. కృష్ణాబేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం ఏటా సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ప్రాజెక్టులకు వరద నీటిని ఎత్తిపోస్తూ నింపుతున్నప్పటికీ మరోవైపు వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతుంది. వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నా.. మరోవైపు రబీ సీజన్లో ప్రాజెక్టులలో నీరులేక వెలవెలబోతూ ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు, వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు పూర్తి చేశారు. రివర్స్ పంపింగ్ విధానం.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుతం సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా దీనిని 15 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయించారు. అలాగే జూరాలకు వరదల సమయంలో రోజు అర టీఎంసీ ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజుల పాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తి పోస్తుండడంతో కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంతో గుడ్డెందొడ్డి జలాశయం నుంచి జూరాల జలయశంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తే సాగునీటి కష్టాలు తొలగనున్నాయి. రూ.6 వేల కోట్లతో.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ను 1,400 ఎకరాలలో నిర్మించగా.. 15 టీఎంసీలకు పెంచే క్రమంలో అదనంగా సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ రిజర్వాయర్ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు నూతనంగా నిర్మించే రిజర్వాయర్ను విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్ ఆనకట్ట నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్కు నింపిన నీటిని తిరిగి జూరాలకు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్ విద్యుత్ ప్రాజెక్టులో టర్బైన్స్ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండటం రాష్ట్రంలోనే తొలిసారి. ఉమ్మడి జిల్లాలో.. కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా కింద 2 లక్షలు, కల్వకుర్తి కింద 3.65 లక్షలు, కోయిల్సాగర్ కింద 30 వేలు, జూరాల కింద 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికింద ప్రతిఏటా వానాకాలంలో సుమారు 6.50 – 7 లక్షల ఎకరాలు వరకు సాగవుతుంది. తొలగనున్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల నీటి కష్టాలు 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంపు వరద సమయంలో రోజుకు అర టీఎంసీ ఎత్తిపోసేలా చర్యలు రబీ సీజన్లో రివర్స్ పంపింగ్ విధానంలో జూరాల జలాశయంలోకి ఎత్తిపోత సర్వే పనులు పూర్తి.. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్ నివేదిక -
విద్యతోనే వికసిత్ భారత్ సాధ్యం
నారాయణపేట రూరల్/ధన్వాడ: సంపూర్ణ విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం ఆమె నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.40.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్ ప్రారంభించారు. అలాగే ధన్వాడలో ఎస్సీ విద్యార్థుల వసతిగృహాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పక్కనే ఉన్న సింగిల్విండో గోదాం విద్యార్థులకు అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్ నారాయణపేటకు తరలించడం నిలిపివేయాలని.. ఇక్కడే అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని అధికారుల కు సూచించారు. అనంతరం కిష్టాపూర్లో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభు త్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని.. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కోటకొండ పాఠశాల జిల్లాలో అత్యధిక విద్యార్థులున్న పీఎం శ్రీ పాఠశాలగా.. మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉత్తమ విద్యను పొందేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతోనే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం దేశం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కోటకొండలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రాములుగౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు శ్రీనివాస్, యాదయ్యశెట్టి, సంగీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, పార్టీ మాజీ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, ధన్వాడ, కిష్టాపూర్లో జరిగిన కార్యక్రమంలో సర్పంచులు జ్యోతి కొండయ్య, తహసీల్దార్ సింధూజ, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాకం సురేందర్, రతంగ్పాండురెడ్డి, రామచంద్రయ్య, శివరాజు పాల్గొన్నారు. -
‘చెత్త’స్టాండ్..!
‘మొత్తం 18 ప్లాట్ఫాంలు కలిగి.. ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్ర డిపోలతో కలిపి కనీసం 250 బస్సులు.. సుమారు 60 వేల మంది నిత్యం రాకపోకలు సాగించే మహబూబ్నగర్ కొత్త బస్టాండ్ చెత్త ప్రాంగణంగా మారింది. పెద్ద నాలా నుంచి వచ్చే దుర్వాసన, ఆరుబయటే మూత్రవిసర్జన, ఆవరణలో పందుల సంచారం, హోటల్ నుంచి వచ్చే వ్యర్థజలాలతో కూడిన కాల్వ, ఎక్కడికక్కడే పేరుకున్న చెత్తాచెదారంతో బస్టాండులోకి వెళ్లే వారు ముక్కు మూసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా బస్సులు వచ్చే వరకు ప్రాంగణంలో కూర్చోవాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. దుర్గంద భరితమైన వాసన మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.’ – మహబూబ్నగర్ మున్సిపాలిటీ కొత్త బస్టాండు ప్రాంగణం, డిపో మధ్యలో నుంచి పెద్దనాలా (మురుగు కాల్వ) వెళ్తోంది. ఈ కాల్వ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు, సీసాలతో ఎప్పుడూ నిండిపోయి కనిపిస్తుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది చుట్టుపు చూపులా వచ్చి అప్పుడప్పుడు చెత్తాచెదారం తొలగిస్తుంటారు. అందులోనే జీవనం సాగించే పందులు.. అప్పుడప్పుడు ప్రాంగణంలో సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు బస్టాండు ఎన్హెచ్–167కు 5 అడుగుల కిందికి ఉండటంతో వర్షాకాలంలో ప్రాంగణమంతా వరదతోపాటు మురుగు ఏరులై పారుతుంది. భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పెద్దనాలా పొంగి పొర్లుతుండటంతో డిపోలోకి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముందుకు కదలని మురుగు.. వాస్తవానికి బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో ఆవరణ, గ్యారేజీ పరిసరాలను నిత్యం శుభ్రం చేయడానికి ఆర్టీసీకి చెందిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారని అధికారులు చెబుతున్నా.. చాలా వరకు పరిసరాలన్నీ అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదిన్నర క్రితం నిర్మించిన కొత్త షాపింగ్ కాంప్లెక్స్ సెల్లార్ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. మరోవైపు ఇక్కడి హోటల్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు మురుగు కాల్వలో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధభరితంగా మారడంతో ప్రయాణికులు ముక్కు మూసుకుని లోపలికి వస్తూ పోవాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మూత్రశాలలు రెండుచోట్ల ఉన్నా కొందరు పెద్ద నాలా వద్దే మూత్రవిసర్జన చేస్తుండటం గమనార్హం. రోజూ సేకరించే చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ఆర్టీసీ కాంట్రాక్ట్ సిబ్బంది ఇక్కడ ఓ మూలన ఉన్న పెద్ద డస్ట్బిన్లో వేసేస్తున్నారు. అది నిండిపోయి ఆరుబయట పడినా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లడంలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాలమూరు బస్టాండులోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే.. ప్రాంగణంలో ఎక్కడబడితే అక్కడే చెత్తాచెదారం దర్శనం కంపుకొడుతున్న బహిరంగ మూత్రశాలలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన పెద్దనాలా పట్టించుకోని ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు -
పేదలకు నాణ్యమైన వైద్యసేవలు
నారాయణపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు ఎలాంటి లోటు లేకుండా అందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మండలంలోని అప్పక్పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి అందుతున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముుుందుగా యూడీఐడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నమోదు ప్రక్రియ, రోజువారీ సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. ఆడియాలజీ, ఆప్తమాలజీ, ఈఎన్టీ విభాగాలతో పాటు సౌండ్ ప్రూఫ్ గదిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులతో సమావేశమై మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలు, మందుల లభ్యత, ఆర్థిక అవసరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కొరత ఉన్న విభాగాలను గుర్తించి వీలైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘సంకల్ప్’పై ప్రత్యేక దృష్టి.. శిశు మరణాల నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆస్పత్రి డైరెక్టర్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. సంపత్కుమార్సింగ్, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్కు కలెక్టర్ సూచించారు. మాత, శిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు, చికిత్స సకాలంలో అందేలా వైద్యులు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయా లని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసి సంతప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీఓ వెంకట్రాములు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డా. మల్లికార్జున్, ఆర్ఎంఓ డా. బాలాజీ, వివిధ విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శుభ్రం చేయిస్తున్నాం..
ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంతోపాటు డిపో పరిసరాలను ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. పెద్దనాలాతోనే అసలు సమస్య తలెత్తుతోంది. దీనిని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బందిది. వారంలో రెండుసార్లు వచ్చి ఒకచోట చెత్తాచెదారంతోపాటు పెద్ద కాల్వలోని ప్లాస్టిక్ వ్యర్థాలను పోగుచేసి వెళ్లిపోతున్నారు. దీంతో తిరిగి అందులోనే గాలికి కొట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు డంపింగ్కు తరలించాలని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. – అశోక్కుమార్, డీఎం, మహబూబ్నగర్ అపరిశుభ్ర వాతావరణమే.. నేను ఓ ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తాను. నిత్యం ఆర్టీసీ బస్సులలోనే రాకపోకలు సాగిస్తుంటాను. కొత్త బస్టాండులోకి వెళ్లగానే అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. ప్లాట్ఫాం వరకు దుర్గంధం మధ్య అలాగే వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం ఉండటంతో ఇబ్బందిగా ఉంటుంది. బస్సు వచ్చే వరకు అక్కడ ఉన్నంత సేపు దుర్వాసన భరించాల్సిందే. ఆర్టీసీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, పాతపాలమూరు, మహబూబ్నగర్ ● -
సర్వం.. సిద్ధం!
నేటినుంచి ఓటరు జాబితా ఇంటింటి సమగ్ర సవరణ ● ఇప్పటికే బూత్ లెవల్ అధికారులకు శిక్షణ పూర్తి ● జూలై 24 వరకు ప్రక్రియ ముగించేలా కసరత్తు ● 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురణ –8లో uనారాయణపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమానికి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఈ ప్రక్రియ గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టింది. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు(ఏఈఆర్ఓ), బూత్లెవల్ అధికారులు (బీఎల్ఓ)లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి సన్నాహక సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేసింది. బుధవారం మండలాల వారీగా చివరగా బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చి గురువారం నుంచి ఇంటింటికి వెళ్లేలా సన్నద్ధం చేశారు. బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి 2002, 2025 ఓటర్ల జాబితాను పోల్చి చనిపోయిన, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి స్థానికంగా నివసిస్తున్న అర్హుల పేర్లను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ● నారాయణపేట నియోజకవర్గానికి ఆర్డీఓ రమేష్, మక్తల్ నియోజకవర్గానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఈఆర్వోలుగా, 13 మండలాలకు తహసీల్దార్లు ఏఈఆర్ఓలుగా పర్యవేక్షించనున్నారు. 554 పోలింగ్ కేంద్రాలకు 554 మంది బీఎల్వోలను నియమించారు. మూడు విడతల్లో గృహ సందర్శనలు నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారు, వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువచోట్ల పేర్లు ఉన్న వారి వివరాలను సేకరిస్తారు. జిల్లాలో ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ 86.88 శాతం పూర్తయింది. మొత్తం 4,95,574 మంది ఓటర్లలో 4,24,175 మంది వివరాలు మ్యాపింగ్ కాగా.. 71,399 మంది ఓటర్ల వివరాలు మరోసారి ధ్రువీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రత్యక్షంగా వివరాలు సేకరించనున్నారు. 2002 ప్రకారం ఓటర్ల వివరాలు నియోజకవర్గం పోలింగ్కేంద్రాలు మహిళలు పురుషులు ఇతరులు మక్తల్ 196 97,698 93,148 1 నారాయణపేట 187 95,980 89,084 1 జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేశాం. ప్రతి దశను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. ఎలాంటి లోపాలు, ఫిర్యాదులకు తావు లేకుండా అవసరమైన చర్యలు చేపడతాం.అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్ల తొలగింపులో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తాం. – సీహెచ్ ప్రియాంక, కలెక్టర్ మండలం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు నారాయణపేట నియోజకవర్గం కోయిల్కొండ 61 27,322 28,270 2 దామరగిద్ద 53 22,359 23,335 – నారాయణపేట 90 41,501 43,502 1 ధన్వాడ 39 15,266 15,597 1 మరికల్ 27 12,083 12,534 – మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ 51 22,934 23,834 – మాగనూర్ 25 9,877 10,331 – కృష్ణా 29 10,889 11,550 – మక్తల్ 74 33,683 35,107 1 అమరచింత 26 11.247 11,833 – ఆత్మకూర్ 35 15,557 15,942 1 నర్వ 31 14,099 14,988 – మదనాపురం 4 981 1,041 – మరికల్ 9 4,301 4,605 – -
విద్యావ్యవస్థను విధ్వంసం చేస్తున్న కేంద్రం
నారాయణపేట: దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విద్యావ్యవస్థ విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వ్యవస్థగా కాకుండా.. వారిని తిరస్కరించే ‘రిజెక్షన్ సిస్టమ్’గా మారిందని కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్న్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను పరీక్షల యంత్రాలుగా మార్చుతుంటే.. కాంగ్రెస్పార్టీ విద్యార్థుల కలలను సాకారం చేసే విద్యావ్యవస్థ కోసం పోరాడుతోందని తెలిపారు. వైద్య విద్య చదవాలనే లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు నీట్ రాస్తున్నప్పటికీ.. కొద్దిమందికే సీట్లు దక్కుతున్నాయని పేర్కొన్నారు. ఇది విద్యార్థుల సామర్థ్యాన్ని కొలిచే వ్యవస్థ కాకుండా అవకాశాలను పరిమితం చేసే వ్యవస్థగా మారిందన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటన దేశ విద్యావ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించలేదన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగంలో చారిత్రాక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. కులం, మతం, ఆర్థిక అసమానతలకు అతీతంగా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సైనన్స్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్రూమ్స్, లైబ్రరీలు, క్రీడా వసతులతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలు కూడా అత్యుత్తమ విద్యను పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకునేందుకు త్వరలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాటిని రాష్ట్ర, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. విద్యార్థులు నిరాశకు గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ సలీం, జిల్లా అధికార ప్రతినిధులు వకీల్ సంతోష్కుమార్, జనార్దన్రెడ్డి, మండల, పట్ట ణ అధ్యక్షులు కోట్ల రవీందర్రెడ్డి, వెంకటే ష్గౌడ్, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు మహిమూద్ ఖురేషి, సీనియర్ నాయకులు ఎండీ గౌస్, సుధాకర్, సరాఫ్ నాగరాజు, అమీరుద్దీన్, మనోజ్ పాల్గొన్నారు. -
నేడు జిల్లాకేంద్రంలో 2కే రన్
నారాయణపేట: ప్రత్యేక సవరణ కార్యక్రమం–2026లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు జిల్లాకేంద్రంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సీహెచ్ ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యంపై ప్రజల్లో విస్త్రత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన భోజనం అందించాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డీఆర్డీఓ వెంకట్రాములు ఆదేశించారు. బుధవారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం చేయాలని, కూరగాయలను శుభ్రంగా కడిగి వండాలన్నారు. వారానికి మూడు గుడ్లు తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంతకుముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం, విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, ఏపీఎం నారాయణ, ప్రధానోపాధ్యాయులు భారతి, భానుప్రకాష్, నిర్మల, నర్సింహులు, శిరీష తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యం నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల అభివృద్ధే తన లక్ష్యమని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్లో జరిగిన జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో అధ్యక్షుడిగా మక్తల్ మండలంలోని మంతన్గోడు సర్పంచ్ రాజేందర్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతామన్నారు. అనేక గ్రామపంచాయతీల వారీగా సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా ‘భరోసా’ సేవలు
నారాయణపేట: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, లైంగిక దాడులు తదితర నేరాల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాధితులు ఒకేచోట వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాసం పొందేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. బాధితులను వేర్వేరు శాఖలకు పంపకుండా సంబంధిత అధికారులు భరోసా కేంద్రానికే వచ్చి సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల మధ్య సమాచార మార్పిడి కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ప్రతి నెల సమీక్ష నిర్వహించి బాధితులకు న్యాయం అందించడంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పరిహారం, కేసుల పురోగతిపై చర్చించాలని సూచించారు. పోలీసు, మహిళా, శిశు సంక్షేమ, వైద్య, ఆరోగ్య, జిల్లా న్యాయసేవల సంస్థ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్లైన్, కౌన్సెలర్లు తదితర భాగస్వామ్య సంస్థలు సమష్టిగా పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని పేర్కొన్నారు. చిన్నారుల కేసుల్లో అత్యంత సున్నితంగా వ్యవహరించాలని, బాధితుల పునరావాసం, విద్య, వైద్య సాయం, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భరోసా కేంద్రం సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు బాల్య వివాహాల నియంత్రణకు ముందస్తు ప్రచారం చేపట్టాలని, సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్ శ్యామల, పోలీసు అధికారులు, చైల్డ్లైన్ ప్రతినిధులు, భరోసా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విత్తన మేళాను వినియోగించుకోవాలి
నారాయణపేట: నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని జాజాపూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను సర్పంచ్ సంగీతతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 60 రైతువేదికల్లో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు విత్తన మేళాలు కొనసాగుతాయన్నారు. వానాకాలం సీజన్కు అవసరమైన విత్తనాలను రైతులకు ఒకేచోట అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో జిల్లాలో రైతువేదికల వద్ద విత్తనమేళాలు ఏర్పాటు చేశామన్నారు. వరితో పాటు ఉద్యాన పంటల సాగుపైనా రైతులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో సీతాఫలం, మామిడి వంటి తోటల సాగుకు అనుకూలంగా ఉంటుందని సూచించారు. అంతర్ పంటలు, ఆయిల్పాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అనంతరం యూరియా ఆన్లైన్ యాప్ను కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, ఏఓ బాలదినకర్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను విజయవంతం చేయాలి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి బీఎల్ఓలు, సూపర్వైజర్లకు సర్ అవగాహ న కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు సవరణ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో బూత్ స్థాయి అధికారులదే కీలక బాధ్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, ఆర్డీఓ రమేష్, కలెక్టరేట్ ఏఓ అనిల్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తొలి విడతలో 60 కేంద్రాల్లో ప్రారంభం జూన్ 23 నుంచి 30 వరకు నిర్వహణ జాజాపూర్లో విత్తన మేళా ప్రారంభించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక -
‘మిగులు’తో సర్దుబాటు..!
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లకు డిప్యూటేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సబ్జెక్ట్లకు సంబంధించి ఉపాధ్యాయుల కొరతను అధిగమించేలా సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ఆయా స్కూళ్లలో మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను కొరత ఉన్న చోట్ల సర్దుబాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది 20 నాటికి ప్రభుత్వ బడుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య.. 2021లో జారీ చేసిన జీఓ నంబర్ 25 ఆధారంగా సర్దుబాటు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవలం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్ల (చైర్మన్లు) అనుమతితో మాత్రమే డిప్యూటేషన్ల తంతు చేపట్టనున్నారు. సుమారు 650 మందికి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. ఇందులో 1.90 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటివరకు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతపడిన సర్కారు పాఠశాలలు 135 ఉన్నాయి. సర్దుబాటులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 650 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. జూనియర్లను సర్దుబాటుపై బదిలీ చేయాలని.. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ విరమణకు దగ్గర ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పలు సబ్జెక్ట్ టీచర్ల కొరతే అసలు సమస్య.. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, బదిలీలు, పదోన్నతుల మూలంగా చాలా హైస్కూళ్లలో పలు సబ్జెక్ట్లను బోధించే ఉ పాధ్యాయుల కొరత వేధిస్త్తోంది. ప్రాథమిక (ప్రైమరీ) పాఠశాలల్లో అన్ని సబ్జెక్ట్లను ఒకే ఉపాధ్యాయుడు బోధించే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఉన్న త (హైస్కూల్) పాఠశాలల స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం 130 పా థమిక పాఠశాలలు మూతపడగా.. ఆయా ఉపాధ్యాయులను అవసరం ఉన్న చోట హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. అయితే ఇంగ్లిష్, హిందీ, తెలు గు వంటి లాంగ్వేజెస్ బోధించే ఉపాధ్యాయుల కొర త పీడిస్తోంది. దీంతో చాలా పాఠశాలల్లో అనివార్యంగా ఆయా సబ్జెక్ట్లను బోధిస్తున్న టీచర్లతోపా టు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా రెగ్యులర్ నియామకాలు చేపట్టకపోవడంతో అధిక సంఖ్యలో ఖాళీలు ఏర్పడగా.. హైస్కూళ్లలో సమస్యగా మారింది. గత డిప్యూటేషన్లలో గందరగోళం.. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పించారు. 550 మందికిపైగా డిప్యూటేషన్లు ఇవ్వగా.. దాదాపు 60 మంది ఆర్డర్లు వచ్చినప్పటికీ బదిలీ కాలేదు. మిగిలింది 490 మంది ఉపాధ్యాయులు కాగా.. పలు పాఠశాలల్లో కొందరికి ఓరల్ డిప్యూటేషన్లు ఇచ్చారు. మరోవైపు డిప్యూటేషన్ వేసినా విద్యాసంవత్సరం పూర్తి అయ్యే (ఏప్రిల్ 23) నాటికి వారు గతంలో ఒరిజినల్ పోస్టింగ్ ఇచ్చిన పాఠశాలకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. కొందరు వెనక్కి వెళ్లకపోవడంతో పలు పోస్టులకు సంబంధించి విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. శాశ్వత పరిష్కారం చూపించాలి.. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం.. కొన్నింటిలో తగ్గడం వంటి కారణాల చేత సర్దుబాటు చేయడం తప్పని సరిగా మారింది. అయితే ప్రతి సంవత్సరం సర్దుబాటు చేస్తున్న పలు పాఠశాలలు మూతబడుతున్నాయని, హైస్కూల్ స్థాయిలో సబ్జెక్ట్లు బోధించే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని.. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. జోగుళాంబ గద్వాల 10 నాగర్కర్నూల్ 0 ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకే అవకాశం.. జిల్లా పరిధిలో కలెక్టర్ల అనుమతితో మాత్రమే తాత్కాలిక బదిలీ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలు ఈసారి ఒక్కటీ తెరుచుకోనట్లే.. ఉమ్మడి జిల్లాలో ప్రశ్నార్థకంగా 135 స్కూళ్ల భవితవ్యం ఉమ్మడి జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం డిప్యూటేషన్పై వేరే పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు ఈ విద్యాసంవత్సరంలో తిరిగి ఆయా స్కూళ్లకు రాలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. బడిబాట కార్యక్రమం నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. ఆయా ఉపాధ్యాయులు, ఎంఈఓలు దృష్టి పెట్టకపోవడంతో 135 పాఠశాలల్లో ఒక్కటి కూడా తిరిగి తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్ల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
నేరాల నియంత్రణకు కఠిన చర్యలు
నారాయణపేట: జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య ఆదేశించారు. నారాయణపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులతో మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో నేర నియంత్రణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు నుంచి చార్జ్షీట్ దాఖలు వరకు ప్రతి దశలో నాణ్యత, పారదర్శకత, సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి స్టేషన్ నిర్వహణతో పాటు దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను ప్రతిరోజూ ఆన్లైన్లో నమోదు చేసి, పెండింగ్ కేసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక సమీక్ష అండర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా గ్రేవ్, నాన్–గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఒక్కో అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఆలస్యం జరుగుతోంది? ఏ కేసుల్లో ఆధారాలు సేకరించాల్సి ఉంది? ఏ కేసులు త్వరగా పూర్తి చేయవచ్చు? వంటి అంశాలపై అధికారులతో చర్చించి స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు. దర్యాప్తే కీలకం కేసుల్లో శిక్షల శాతం పెరగాలంటే దర్యాప్తులో స్పష్టత అత్యంత కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు. కేసు ప్రారంభ దశలోనే స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి, ఘటన స్థల పరిశీలన, శాసీ్త్రయ ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాల భద్రత వంటి అంశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. దర్యాప్తు మొత్తం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం సాగాలన్నారు. 60 రోజుల్లో చార్జ్షీట్ పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదయ్యే కేసులు, ఇతర గ్రేవ్ నేరాల్లో ఎలాంటి జాప్యం లేకుండా 60 రోజుల్లోపు చార్జ్షీట్లు దాఖలు చేయాలని డీఎస్పీ స్పష్టం చేశారు. దీని ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అక్రమాలపై ఉక్కుపాదం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, గంజాయి, గుట్కా విక్రయాలు, పేకాట, సైబర్ నేరాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. ఇలాంటి నేరాల్లో ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేసి, ఇంటెలిజెన్స్ ఆధారంగా దాడులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సతీష్రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దుబాటుకు ఆదేశాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది సర్దుబాటులో వెళ్లిన ఉపాధ్యాయులు అక్కడే ఉండాలని ఆదేశిస్తూ, జరిగిన అడ్మిషన్ల ఆధారంగా మిగులు (సర్ప్లస్) ఉన్న ఉపాధ్యాయులను బదిలీలు చేయాలని సూచించింది. ఈనెల చివరి వరకు పలువురు ఉపాధ్యాయులు రిటైర్డ్ కానున్న నేపథ్యంలో.. ఆ తర్వాత సర్దుబాటు చేయాలని యోచిస్తున్నాం. – విజయకుమారి, డీఈఓ మహబూబ్నగర్ ప్రభుత్వం సర్దుబాటు చేయడం అంటే విద్యార్థులు లేని పాఠశాలలను మూసివేయడమే. ఆ పాఠశాలలను మూసి వేయకుండా చర్యలు తీసుకోవాలి. కేవలం ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే బదిలీలు చేయాలి. సర్దుబాటులో పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా బదిలీలు చేస్తే ఉపాధ్యాయులు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. – మదన్మోహన్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● -
కమలంలో కలవరం
నేతలంతా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా..–8లో uనారాయణపేట: జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు మరో సారి తెరపైకి వచ్చాయి. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటుండడంతో పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తుంది. ఈ నెల 21న నిర్వహించిన మేథావుల సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీకి సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. సమావేశానికి వస్తున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్వయంగా ఆరా తీయగా.. ‘నాకు సమాచారం లేదు‘ అని ఎంపీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎంపీని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా? తెరవెనుక ఈ వ్యవహారాన్ని నడిపించింది ఎవరు? అనే ప్రశ్నలు కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్ర అధ్యక్షుడు హాజరైన సమావేశానికి స్థానిక ఎంపీకి సమాచారం అందించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం సమన్వయ లోపం మాత్రమే కాదని అంతకు మించి ఎత్తుగడలు చోటుచేసుకున్నాయని పలువులు చర్చించుకుంటున్నారు. ఆధిపత్య పోరు.. బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మేథావుల సమావేశానికి ఎంపీ గైర్హాజరు, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల తర్వాత పెరిగిన అసంతృప్తి, కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభన పార్టీలో చోటు చేసుకున్న విభేదాలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోకపోతే జిల్లాలో బీజేపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలోనూ.. మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక అంశం కూడా పార్టీకి తలనొప్పిగా మారిందని సమాచారం. ఎవరికీ అవకాశం ఇవ్వాలన్న దానిపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. స్థానిక నాయకత్వం ఒక పేరును ప్రతిపాదిస్తే.. మరో వర్గం ఇంకో పేరును ముందుకు తెస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు వచ్చే సమయంలో అగ్ర నాయకులు తలోదారి చూసుకోవడం సరైంది కాదంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ అన్ని ఎమ్మెల్యే స్థానాలను కై వసం చేసుకోగా.. బీఆర్ఎస్ కూడా పునర్వ్యవస్థీకరణలో ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ అంతర్గత విభేదాలు మరింత పెరిగితే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకే లాభం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేటలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో క్యాడర్ ఎవరిని అనుసరించాలో తెలియక ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఫాలో అయితే ఎవరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని భయపడి కార్యకర్తలు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థి పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీ వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాలో బీజేపీని దెబ్బతీసేలా దూకుడు పెంచుతున్నాయి. సరైన మార్గనిర్ధేశం లేకపోవడంతో పార్టీ శ్రేణులు కనీస వాటిని ఖండించలేని స్థితిలో ఉన్నారని.. ఇది ఇలాగే కొనసాగితే 2028 ఎన్నికల్లోనూ జిల్లాలో బీజేపీకి భంగపాటు తప్పదని చర్చ జరుగుతోంది. మేధావుల సమావేశానికి ఎంపీ గైర్హాజరుతో గందరగోళం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తర్వాత అసంతృప్తి జ్వాల మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు ఆందోళనలో పార్టీ శ్రేణులు -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
నారాయణపేట రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో మంగళవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాల్లో తరగతులను బహిష్కరించగా, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, బడ్జెట్ కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు బడుల మూసివేతపై సీఎం రేవంత్రెడ్డి తన నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోవాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో వెంటనే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీష్, ఇంతియాజ్, చరణ్ రెడ్డి, శివ, తరుణ్, రవి, ఉదయ్, అభి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కో–ఆప్షన్’ కలేనా..!
నేటికీ పూర్తికాని నియామకాలు ● ఉమ్మడి జిల్లాలో 5,013 మందికి అవకాశం.. ఆదేశాల కోసం నిరీక్షణ ● గ్రామపంచాయతీల్లో ఖాళీగా సలహాదారుల కుర్చీలు ● పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఒకటి.. అమలవుతున్నది మరోటి ప్రతి గ్రామపంచాయతీకి ముగ్గురు చొప్పున కో–ఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే ఎన్నికల ప్రక్రియ చేపడతాం. – వెంకట్రాములు, డీపీఓ, నారాయణపేట నారాయణపేట/మరికల్: గ్రామపంచాయతీ పాలనలో అనుభవజ్ఞులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణా పంచాయతీరాజ్ చట్టం–2018లో పొందుపర్చిన కో–ఆప్షనన్ సభ్యుల నియామక ప్రక్రియ ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు. పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,671 గ్రామపంచాయతీలకు నియమించాల్సిన 5,013 మంది కో–ఆప్షనన్ సభ్యుల ఎన్నిక నిలిచిపోయింది. గ్రామాభివృద్ధికి సలహాదారులుగా ఉండాల్సిన వ్యవస్థ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామపాలనలో ప్రజల అనుభవాన్ని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కో–ఆప్షనన్ సభ్యుల వ్యవస్థ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి ఆరునెలలు గడిచినా కో–ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం మౌనం పాటిస్తుండటంతో వేలాది మంది ఆశావహుల నిరీక్షణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. గడువు దాటి నాలుగు నెలలు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ఆలస్యం కేవలం పదవుల నియామకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు.. గ్రామ పాలనలో అనుభవజ్ఞులు, సామాజిక కార్యకర్తలు, దాతలు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని కోల్పోవడమేనని స్థానిక సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులను పాలనలో భాగం చేయడంతో అభివృద్ధి ప్రణాళికలకు నాణ్యత పెరగాలనేది దీని ఉద్దేశం. ప్రతి గ్రామపంచాయతీలో ముగ్గురికి.. పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవజ్ఞుడైన సీనియర్ సిటిజనన్, గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామసమాఖ్య అధ్యక్షురాలు, గ్రామాభివృద్ధికి దోహదపడిన ఎన్ఆర్ఐ, దాత లేదా స్థలం ఇచ్చిన వ్యక్తి. వీరికి వార్డు సభ్యులతో సమాన ప్రొటోకాల్, సమావేశాల్లో పాల్గొనే హక్కు ఉంటుంది. అయితే తీర్మానాలపై ఓటు హక్కు ఉండదు. ఎందుకు కీలకం..? గ్రామాల్లో చాలామంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఇంజినీర్లు, బ్యాంకు ఉద్యోగులు, వ్యవసాయ నిపుణులు ఉన్నారు. వారి అనుభవాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని రూపొందించారు. గ్రామాల్లో నిధుల వినియోగం, చెరువుల పునరుద్ధరణ, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యరంగాల్లో అనుభవజ్ఞుల సూచనలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నియామకాలు జరగకపోవడంతో ఆ అవకాశం వృథా అవుతోంది. మరికల్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎన్నికల తర్వాత కో–ఆప్షనన్ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు గ్రామ పెద్దలు, పదవీ విరమణ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. గ్రామాభివృద్ధిలో తమ అనుభవాన్ని వినియోగించుకునే అవకాశం వస్తుందని భావించిన వారు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. గ్రామపంచాయతీల్లో కో–ఆప్షనన్ సభ్యుల ఎంపిక అధికార, ప్రతిపక్ష వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. గ్రామస్థాయిలో సామాజిక సమతుల్యత, రాజకీయ సమీకరణలు, స్థానిక ప్రభావాలు కూడా ఈ ఎంపికల్లో కీలకంగా మారుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
● మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగడం లేదని, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అచ్చంపేటలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, సర్, సభ్యత్వ నమోదు ప్రత్యేక కార్యక్రమంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలోనూ కొడంగల్లో రేవంత్రెడ్డిని చిత్తుగా ఓడించామని, రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి రాజకీయంలోనే కొనసాగుతున్నారన్నారు. నల్లమల బిడ్డను అని చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో నీచమైన పనులు చేస్తున్నాడని, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఆయన ఎనుముల రేవంత్రెడ్డి కాకుండా.. ఎగబెట్టే రేవంత్రెడ్డిగా మారాడన్నారు. రైతులనే కాదు దేవుళ్లకు సైతం ద్రోహం చేశాడని విమర్శించాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని, అక్రమ కేసులు నమోదు చేయించి మానసికంగా వేధిస్తున్నాడని మండిపడ్డారు. ఎస్బీఐని నిషేధించి రాష్ట్రంలో కొండల్రెడ్డి బ్యాంకు పెట్టేలా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఇస్తానని రైతులను మోసం చేశాడన్నారు. రైతులకు రైతుబంధు కింద సీఎం రేవంత్రెడ్డి రూ.29,358 కోట్లు బకాయి పడ్డారని, చిల్లర చేష్టలు చేస్తూ నల్లమల ప్రతిష్టను తగ్గిస్తున్నాడని అన్నారు. మాటల్లోనే రైతు ప్రభుత్వం కనిపిస్తుందని, చేతల్లో లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే కేసీఆర్ కొనసాగించారని, ప్రస్తుత సీఎం పథకానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. స్కాముల ప్రభుత్వంగా మారిందని, తుగ్లక్ పాలనను తలపిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి సర్ ప్రోగ్రాంలో చాకచక్యంగా, జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న హరీశ్రావు, వేదికపై ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రిజనార్దన్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ -
అభివృద్ధిని చూసి ఓర్వలేక అబద్ధాలు
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎంగా రేవంత్రెడ్డి కావడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, నల్లమల ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని, నల్లమల పౌరుషం, శౌర్యం రేవంత్రెడ్డి సొంతం అని మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో పది లక్షల ఇళ్లు ఇవ్వలేక పోయిందని, కేవలం వాళ్ల దృష్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలనే ఆలోచనలో మాత్రమే ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీలు సీఎం రేవంత్రెడ్డిని వ్యక్తిగత హననానికి పాల్పడేలా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అబద్ధానికి ఆరడుగుల అర్థం హరీశ్రావు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కాంగ్రెస్, బీజేపీలకు కనబడడం లేదని, మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కక్కటీ నెరవేర్చుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి.. నెలకు రూ.4వేల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది, కేసీఆర్ పాలనలో అభివృద్ధి కంటే అప్పులే పెరిగాయన్నారు. కేటీఆర్, హరీశ్రావులు కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకుంటున్నారని..రెండేళ్లలో రికార్డుస్థాయిలో పంటలు దిగుబడి వచ్చాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
ఓటరు జాబితా కచ్చితత్వమే లక్ష్యం
● 25 నుంచి ఇంటింటి సర్వే.. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: ఓటరు జాబితాల కచ్చితత్వం కోసం చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు బూత్స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు ధ్రువీకరిస్తారని తెలిపారు. జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించివాటి పరిష్కారం అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు, ఫారం–6 అందజేస్తారని, వాటిని పూర్తిగా నింపి తిరిగి అందజేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని.. ఇవ్వని వారి పేర్లు ఉండవని స్పష్టం చేశారు. ఆర్వోలు, ఏఆర్వోలకు శిక్షణ పూర్తికావస్తుందని, మంగళవారం మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీవోల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల బూత్స్థాయి ఏజెంట్లకు (బీఎల్ఏలు) కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు తమ బీఎల్ఏలకు పార్టీ గుర్తింపు కార్డులు అందజేయాలని, బీఎల్వోలతో సమన్వయం చేసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేయాలని కోరారు. ఇకపై ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని... ప్రజల సౌకర్యార్థం హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు మ్యాపింగ్, అన్న్మ్యాపింగ్ డేటాను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ అనంతరం ఆన్మ్యాపింగ్ కేసులపై విచారణ చేపట్టి అవసరమైన నోటీసులు జారీ చేస్తామని వివరించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని.. రెండు చోట్ల ఓటరుగా నమోదైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజ్యలక్ష్మి, సి–సెక్షన్ అధికారి జయసుధ, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సలీం, బీజేపీ నాయకుడు రఘువీర్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్రెడ్డి, అబ్దుల్ సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, సీపీఐ నాయకుడు కెంచె నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆగం చేస్తున్న ప్రభుత్వాలు
కొత్తపల్లి: ఎరువుల ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ లేక రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని భూనీడులో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఒకరోజు రైతు నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నదాతలు వ్యవసాయం పండుగలా చేసుకొనేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు ఒక్కో బస్తాపై రూ.750 నుంచి రూ.900 వరకు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే రైతులకు సకాలంలో సన్నరకం వరికి బోనస్, పెట్టుబడి సాయం అందించడం లేదన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు అభివృద్ధి పేరుతో కమీషన్లు దండుకొని సొంత ఆస్తులను పెంచుకొంటున్నారని ఆరోపించారు. ఉమ్మడి మద్దూరు మండలంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్పార్టీకి చెందిన వ్యక్తులు కమీషన్లు తీసుకొని మంజూరు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా రైతుభరోసా, బోనస్ సకాలంలో విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఎరువులపై పెంచిన ధరలు తగ్గించాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక వదిలిపెట్టేది లేదని.. అవసరమైతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్రెడ్డి, వంచర్ల గోపాల్, కౌన్సిలర్లు దినేష్కుమార్, నర్సింహులు, శివకుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు మహిపాల్, చికిని అంజయ్య, విఠల్, రాజురెడ్డి, రాంరెడ్డి, శివారెడ్డి, వెంకటేష్, ఎంపీటీసీ మాజీ సభ్యులు రాజు, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నో బ్యాగ్డే అమలేది?
జిల్లాలో విస్మరించిన అధికారులు, నిర్వాహకులు నారాయణపేట రూరల్: పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచుల భారం నుంచి నెలలో ఒక్కరోజైనా విముక్తి కల్పిస్తూ.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేసేందుకు ప్రభుత్వం నో బ్యాగ్ డేను గత విద్యాసంవత్సరం అమలులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల నాలుగో శనివారం పాఠశాల విద్యార్థులు పుస్తకాలు లేకుండా పాఠశాలకు వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించింది. ఒకటి నుంచి పదోతరగతి వరకున్న విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు 28 రకాల కార్యకలాపాలు సూచిస్తూ అందులో ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఆటలు, పిల్లలకు కథలు చెప్పడం, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి, క్షేత్రస్థాయి పర్యటనలు, చిత్రలేఖనం, చారిత్రాత్మక ప్రదేశాలు, పంచాయతీ కార్యాలయాలు, మ్యూజియం సందర్శన, మాదిరి ఎన్నికలు, నమూనా శాసనసభ, కృత్రిమ మేధా వంటి వాటికి చోటు కల్పించింది. ప్రారంభంలో జిల్ల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు నిర్వహించినా తర్వాత అమలును విస్మరించారు. నో బ్యాక్ డే అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. సంచి రహిత రోజును చిన్నచూపుగా చూడటం ఆందోళన కలిగిస్తుంది. పాఠశాలల వారీగా వివరాలు.. అమలు చేయాలి.. ప్రభుత్వం రూపొందించిన నో బ్యాగ్ డే కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నెలలో ఒకరోజు పిల్లలకు తప్పకుండా బ్యాగ్ నుంచి విముక్తి కల్పించాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తే వారు ఉల్లాసంగా గడపడంతో వారిలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. – నరేష్, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన నో బ్యాగ్ డేను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విధిగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలకు పాఠ్యాంశేతర కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిస్తాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి విద్యార్థులకు దొరకని ఆటవిడుపు కాగితాలకే పరిమితమైన వైనం ఈ ఏడాదైనా ప్రాధాన్యత లభించేనా..? -
చెరువుల్లో దళారుల పాగా
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. మార్కెటింగ్ కష్టాలు, అందని ఉచిత చేపవిత్తనా లు, బయట మార్కెట్లలో చేప విత్తనాల ధరల పెంపుతో నిస్సహాయ స్థితిలో దళారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. మత్స్యకారుల అవసరాలను ఆసరా చేసుకొని దళారులు చెరువుల్లో పాగా వేస్తున్నారు. వేలం పాటల్లో చెరువులు దక్కించుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క చేపల మార్కెట్ కూడా లేకపోవడంతో అమ్ముకోలేని దీనస్థితిలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల లేమితో రోడ్లపై చేపల విక్రయాలు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తే మత్స్య శాఖ మంత్రిగా ఉన్నా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. స్టోరేజీ, మార్కెట్లు ఏవి? జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలను అమ్ముకునేందుకు మార్కెట్లు, నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెటింగ్ కష్టాలను ఎదుర్కోలేని మత్స్యకారులు దళారులను ఆశ్రయించి చెరువులను వేలం ద్వారా విక్రయించడం జిల్లాలోని చాలా గ్రామాల్లో కనిపిస్తుంది. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో గతంలో ఉన్న చేపల మార్కెట్లను తొలగించి.. వాటి స్థానంలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నా.. అవేమీ అందుబాటులోకి రాలేదు. అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ సమీపంలో చేపల మార్కెట్కు ప్రభుత్వం 5 గుంటల భూమిని గతంలోనే కేటాయించగా.. నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ స్థలం అనువైనదిగా లేకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆయా పట్టణాల్లో చౌరస్తాలు, పలు కూడళ్లలో మత్స్యకారులు చేపల విక్రయాలు చేస్తున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు పంపిణీ చేయాల్సిన చేప విత్తనాలు 1.92 కోట్లు మొత్తం సభ్యులు 13,066 కోయిల్సాగర్ ప్రాజెక్టుతోపాటు చెరువులు, కుంటలు 910 242 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మొత్తం సభ్యులు 817 22 పంపిణీ చేసిన చేప విత్తనాలు 66,925 జిల్లా పరిధిలో ఇలా.. మత్స్యకారుల బలహీనతను ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా వ్యాపారం కొందరు అధికారుల సహకారంతో వేలం ద్వారా చెరువుల లీజు జిల్లాలో మార్కెట్లు లేకపోవడమూ శాపంగా మారిన వైనం తీవ్రంగా నష్టపోతున్న అర్హులైన మత్స్యకారులు మరోవైపు చేప విత్తనాల పంపిణీలోనూ లక్ష్యాన్ని కుదిస్తున్న ప్రభుత్వం ఇబ్బందులు వాస్తవమే.. జిల్లాలో చేపల విక్రయానికి ఇబ్బందులున్నది వాస్తవమే. మహబూబ్నగర్, జడ్చర్ల పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాల నిర్మాణం కొనసాగుతోంది. వాటి నిర్మాణం పూర్తయ్యాక చేపల మార్కెట్కు కొంత భాగం కేటాయిస్తారు. భూత్పూర్ మున్సిపాలిటీలో చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. సరైన స్థలం లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచాయి. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – రాధారోహిణి, జిల్లా మత్స్యశాఖ అధికారి -
ప్రశాంతంగా నీట్
● జిల్లాలోని 13 కేంద్రాల్లో 3,862 మంది హాజరు ● పరీక్ష సరళిని పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులందరికీ మహబూబ్నగర్లోనే కేంద్రాలు ఏర్పాటు చేయగా.. చాలామంది విద్యార్థులు ఉదయం 9 గంటల వరకే చేరుకున్నారు. మొత్తం 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఇందులో 3,862 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 4,291 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 429 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల వద్ద విద్యార్థులు ధరించిన ఆభరణాలను తొలగించిన తర్వాత అనుమతించారు. పోలీస్శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను కేంద్రాల వద్దకు తమ వాహనాలపై విద్యార్థులను చేర్చారు. నగరంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. భద్రతా చర్యలు, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్పీ జానకి పాలమూరు యూనివర్సిటీ, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల,ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : ఎస్పీ
నారాయణపేట: భారత్ ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని.. యోగాతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎస్పీ డా. వినీత్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శిక్షకుడు కుమ్మరి నర్సింహులు యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ప్రదర్శించి ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగాను జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకున్నారని తెలిపారు. రోజూ యోగాసనాలు, ప్రాణాయామం చేయడంతో శారీరక దృఢత్వంతో పాటు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. సిబ్బంది ప్రజల భద్రతకు రేయింబవళ్లు పనిచేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారని.. యోగా, ధ్యానం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు. రోజూ కొంత సమయాన్ని యోగ సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులను మరింత సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎన్.లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాంలాల్, భగవంత్రెడ్డి, ఆర్ఐ విజయభాస్కర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, విక్రమ్, రమేష్, విజయ్ భాస్కర్, సునీత, శివశంకర్, శిరీష, పేట సర్కిల్ పోలీసు సిబ్బంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం : బీఆర్ఎస్
మరికల్: ఇళ్లు ఖాళీ చేయాలని ఇచ్చిన కోర్టు నోటీసులకు ఎవరూ అధైర్యపడొద్దని.. మీకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంధర్రెడ్డి బాధితులకు భరోసానిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని గజలమ్మగడ్డ కాలనీలో ఆయన పర్యటించి బాధితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. విక్రయించిన స్థలాలకు 42 ఏళ్ల తర్వాత తాము వారసులమంటూ నోటీసులిస్తే ఏం కాదన్నారు. మండల కేంద్రంలో 75 శాతం ఇళ్లు వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్నవేనని.. వాటికి గ్రామపంచాయతీ అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నారని.. ఇప్పుడు వచ్చి కోర్టు నోటీసులు ఇప్పించి కేసులు నమోదు చేస్తామంటే ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం ఏ కోర్టుకు వెళ్లినా న్యాయం మీ దిక్కు ఉందని, మీరే గెలుస్తారని భరోసానిచ్చారు. నోటీసులు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇంత వరకు రైతు భరోసా తీసుకున్నట్లు తెలిసిందని.. వారి మీద చీటింగ్ కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ఆపదొస్తే వెంట ఉండి న్యాయం కోసం పోరాడుతానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ రవి, పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, కృష్ణారెడ్డి, శేఖర్, రామస్వామి, కర్లి కృష్ణయ్య, మతిన్, అనంత్రెడ్డి, నర్సింహులు, రఘు తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రిసీతక్క పర్యటన కందనూలు: రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సోమవారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు జిల్లాలోని తాడూరు మండలం సిర్సవాడ గ్రామానికి చేరుకోనున్నారు. అక్కడ దుండుభీ వాగుపై రూ.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ ప్రణాళికలు పరిశీలించనున్నారు. అలాగే తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్సాహంగా నెట్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ అమెచ్యూర్ నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి సీనియర్ ఫాస్ట్–5 పురుష, మహిళా నెట్బాల్ ఎంపికలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి సయ్యద్ అంజద్అలీ తెలిపారు. ఈ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 మందికిపైగా క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఎంపికయ్యే జట్లు పుదుచ్చేరిలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగే సీనియర్ ఫాస్ట్–5 జాతీయ స్థాయి నెట్బాల్ చాంపియన్ షిప్లో పాల్గొంటాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు హబీబ్ఖాన్, మహ్మద్ ఖాజా అక్రముద్దీన్ పాల్గొన్నారు. జూరాలకు నిలిచిన ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో పూర్తిగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో 15 రోజులుగా స్వల్పంగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం పూర్తి గా తగ్గింది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులతో పంపింగ్ చేస్తుండగా.. ఒక పంపును నిలిపేసి కేవలం ఒక పంపు ద్వారా నీటి పంపింగ్ చేస్తున్నట్లు పీజేపీ అధికారులు పేర్కొన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 749 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 41 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 569 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2 ద్వారా 873 క్యూసెక్కులు, ఇతర అవసరాలకు 537 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 740 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2,951 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 3.061 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
కేంద్ర పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలి
● బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు ప్రజలను మోసం చేశాయి ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నారాయణపేట: ప్రధాని మోదీ 12 ఏళ్లలో సాధించిన విజయాలను గడప గడపకు తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళన్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు దేశంలో అనేక భారీ అవినీతి కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. కాంగ్రెస్ పాలనలో రూ.వేల కోట్ల ప్రజాధనం దోచుకున్నారని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత్లో రేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తలెత్తలేదన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా కోట్లాది మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చారని.. 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందిస్తున్నారని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నేడు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, నంబర్–1 స్థానంలో నిలిచే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. దేశ భద్రతలో రాజీ లేకుండా ప్రతి ఉగ్రదాడికి సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి చర్యల ద్వారా గట్టి సమాధానం ఇస్తోందని పేర్కొన్నారు. 12 ఏళ్లులో తెలంగాణకు రూ.13 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం అందించిందని.. రాష్ట్రాలకు పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచి సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, కోచ్ ఫ్యాక్టరీ, రహదారులు, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు తదితర అనేక రంగాల్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ మద్దతునిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని, బీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. స్థానిక పుర కౌన్సిల్లో బీజేపీ ప్రతినిధిని గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనకు బీజేపీకి ఘనమైన మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ కూడా మత రాజకీయాలతో శాశ్వతంగా మనుగడ సాగించలేదన్నారు. సదస్సులో పుర చైర్పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ, కొండయ్య, రతంగ్ పాండురెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు అమర్ దీక్షిత్, శ్రీనివాసులు, రఘురామయ్యగౌడ్, లక్ష్మీ శ్యాంసుందర్, బలరాంరెడ్డి, భాస్కర్, ప్రజాప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. -
రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్
నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, యూరియా ధరలు పెరగడమే కాకుండా సకాలంలో అందడం లేదన్నారు. రైతు బీమా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయని.. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో రూ. 2.50లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటిని ఎక్కడ వినియోగించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 30న విడుదల చేయనున్న రైతుభరోసా నిధులు ఈ వానాకాలానికి సంబంధించినవా.. లేక గత యాసంగి బకాయిలా? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని ఇచ్చి.. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయాలంటూ బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు భరత్, నారాయణమ్మ, బీఆర్ఎస్ నాయకులు విజయ్ సాగర్, వేపూరి రాములు, వెంకట్రెడ్డి, సుభాష్, తిరుపతయ్య, చెన్నారెడ్డి, నర్సప్ప, గురునాథ్గౌడ్, సురేందర్రెడ్డి ఉన్నారు. చదువుతోపాటు యోగా అవసరం దామరగిద్ద: ప్రతి విద్యార్థికి చదువుతోపాటు యోగా అవసరమని.. దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శనివారం మండలంలోని క్యాతన్పల్లి ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన.. విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను వివరించారు. ఆదివారం ప్రతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు. యోగాతో శారీరక, మానసిక వికాసంతో పాటు ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలను అందజేశారు. డీఈఓ వెంట జీహెచ్ఎం సత్యనారాయణ, యాదయ్యశెట్టి, సీఆర్పీ రాములు ఉన్నారు. -
ఆ మహిళ బండారమంతా బ్లాక్ ‘మెయిల్స్’లో..
● మూడేళ్ల కిందటే ముగిసిన కేసుకు ఇప్పుడు బెయిల్ ఎలా.. ● డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి నారాయణపేట: తనపై గతంలో నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని.. దర్యాప్తు సంస్థలు వాటిని కొట్టివేసినా రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తెస్తున్నారని డీసీసీ మాజీ అధ్యక్షుడు, నారాయణపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుంభం శివకుమార్రెడ్డి ఆరోపించారు. సదరు మహిళ తనకు చేస్తున్న మెయిల్స్ను బ్లాక్ చేశానని.. అవన్నీ స్పామ్ మెసేజ్లోకి వెళ్తున్నాయని.. ఈ నెల 6న తనకు పంపిన మెయిల్స్తో పాటు పూర్తిస్థాయిలో సదరు మహిళను విచారిస్తే ఆమె బండారమంతా బయటపడుతుందన్నారు. అదే విధంగా మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో అనేది తేలిపోతుందని పేర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేటలో తనపై గతంలో ఉన్న కేసుకు సంబంధించిన పలు పత్రాలను మీడియా ఎదుట ఉంచుతూ తన వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్నది న్యాయపోరాటం కాదని, బ్లాక్మెయిల్ రాజకీయమని ఆరోపించారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ప్రక్రియను దెబ్బతీసే ఉద్దేశంతోనే తన పేరును వివాదంలోకి లాగారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత స్పెన్సర్లాల్ తెలంగాణకు వచ్చి తనపై ఆరోపణలు చేసిన సదరు మహిళతో మాట్లాడి వెళ్లారని.. ఆ తర్వాతే తాను రూ. 10కోట్ల పరువునష్టం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, చిట్టెం అభిజయ్రెడ్డి పేర్లను కూడా ప్రైవేట్ పిటిషనన్లో చేర్చడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. పార్టీకి అన్ని విషయాలు తెలుసని.. ఎలాంటి తప్పు చేయలేదనే నమ్మకంతోనే తనపై చర్యలు తీసుకోలేదన్నారు. మూడేళ్ల క్రితమే ముగిసిపోయిన కేసుకు ఇప్పుడు బెయిల్ తీసుకున్నానని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ, న్యాయస్థానాలపై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. తనపై నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే ఆ మహిళకు సంబంధించిన అన్ని విషయాలను ఆధారాలతో సహా ప్రజల ముందుకు తీసుకొస్తానని కేఎస్ఆర్ హెచ్చరించారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు, సోషల్ మీడియా ప్రచారాలు, కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తాను తప్పుచేసి ఉంటే ప్రజల ముందుకు వచ్చేవాడిని కాదని వ్యాఖ్యానించారు. తాను పొలిటికల్గా ఓడిపోయి ఉండొచ్చని.. కానీ ప్రజలకు సేవచేసే విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ఇంజినీర్గా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేశానన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కథనాలు ప్రసారం చేస్తే సహించబోనని ఆయన హెచ్చరించారు. -
వెలకట్టలేనిది..
నాన్న త్యాగం ‘‘తండ్రిని అయ్యాకే నాన్న అంటే ఏంటో తెలిసింది. రాత్రిళ్లు నిద్రలేక పిల్లల కోసం ఎదురుచూడటం.. వాళ్ల చిన్న చిరునవ్వు కోసం రోజంతా అలసటను మర్చిపోవడం.. ప్రతి అడుగులో వారి భవిష్యత్ గురించే ఆలోచించడం.. ఇవన్నీ అనుభవించిన తర్వాతే నా తండ్రి చేసిన త్యాగాల విలువ పూర్తిగా అర్థమైంది. పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు, ధైర్యం, మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే ప్రతి తండ్రి నిజమైన విజయం.’’ అని నారాయణపేట ఎస్పీ డా.వినీత్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పోలీసు అధికారిగా బాధ్యతలు, తండ్రిగా భావోద్వేగాలు, కుటుంబ బంధాల విలువ, నేటి సమాజంలో తల్లిదండ్రుల పాత్రపై ఆయన హృదయాన్ని తాకేలా వివరించారు. ఆయన మాటల్లోనే.. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా పిల్లల జీవితంలో భాగమయ్యాయి. వాటిని పూర్తిగా దూరం చేయడం సాధ్యం కాదు. కానీ వాటి వినియోగంపై తల్లిదండ్రులు నిరంతరం అవగాహన కల్పించాలి. పిల్లలతో రోజూ మాట్లాడాలి. భయపెట్టడం కాదు.. నమ్మకం కల్పించాలి. సమస్య వచ్చినప్పుడు ముందుగా తల్లిదండ్రులకే చెప్పే వాతావరణం ఉండాలి. – నారాయణపేట భూములను అమ్మి మమ్మల్ని చదివించారు నాన్న నేర్పిన విలువలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి పిల్లలకు ఆస్తులు కాదు.. మంచి వ్యక్తిత్వం ఇవ్వడమే నిజమైన విజయం ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ డా.వినీత్ -
లోక్అదాలత్లో 5,300 కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు నారాయణపేట: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో 5,300 కేసులను కక్షిదారుల పరస్పర అంగీకారంతో పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఐదు ప్రత్యేక బెంచ్లు ఏర్పాటుచేసి.. జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. నారాయణపేట, మక్తల్, కోస్గి కోర్టుల పరిధిలోని వివిధ రకాల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించి.. కక్షిదారులకు అవార్డులు అందజేశారు. ఈ కేసుల పరిష్కారంతో ప్రభుత్వానికి రూ.44,57,474 ఆదాయం సమకూరిందని జిల్లా జడ్జి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి వింధ్య నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి బి.సాయిమనోజ్, అదనపు జూనియర్ సివిల్జడ్జి కె.అవినాష్, మక్తల్ జూనియర్ సివిల్జడ్జి సుష్మిత, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, నారాయణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, న్యాయవాదులు సీతారామారావు, నందు నామాజీ, పి.సతీశ్కుమార్, కె.నవీన్గౌడ్ పాల్గొన్నారు. -
యూరియా యాప్ సద్వినియోగం చేసుకోవాలి
మాగనూర్: రైతులు యాప్ ద్వారా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునే సౌకర్యం వ్యవసాయశాఖ కల్పించిందని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ కోరారు. శుక్రవారం మాగనూరు మండలం మాగనూర్, కొత్తపల్లి, కృష్ణా మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అవసరాలకు సరిపడా అన్నిరకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో యూరియాను బుక్ చేసుకొని పంటలకు అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు. అలాగే రైతులకు బిల్లు లేదా రసీదు అందజేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్ ఉన్నారు. ఏబీవీపీ నాయకుల ధర్నా నారాయణపేట ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలు మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సరికాదని.. వెంబడే ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ నగర్ కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నారాయణపేటశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం కొమ్ము కాస్తోందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తాననడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్ఛలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని కోరారు. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులతో పాటు ఉపాధ్యాయ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని.. విద్యార్థులకు యూనిఫామ్స్ త్వరగా అందించాలని సూచించారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో తక్షణమే అల్పాహార పథకం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఇంతియాజ్, శివ, వినయ్, చరణ్, వివేకానంద, తరుణ్, ఓంకార్, విష్ణు, అభి తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యపై అవగాహన నారాయణపేట (కోస్గి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన డిజిటల్ విద్య, సాంకేతికతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో అన్నా–అక్కా మెంటర్షిప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అంశాలపై పాలమూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాస్టర్ ట్రైనర్ గౌరీప్రసాద్ అవగాహన కల్పించారు. విద్యారంగంలో ఏఐ ప్రాధాన్యం, డిజిటల్ బోధన సాధనాల వినియోగం, ఆధునిక తరగతిగది బోధన పద్ధతులను వివరించారు. సాంకెతిక పరిజ్ఞానం విద్యారంగంలో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు దోహదపడుతాయని తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు ప్రవీణ, రాజశేఖర్, ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు. ధాన్యం @ రూ.2,708 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,708, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటాకు గరిష్టంగా రూ.2086, కనిష్టంగా రూ.1,710 చొప్పున పలికాయి. -
‘ఎస్ఐఆర్’పై అప్రమత్తంగా ఉండాలి
రాహుల్ జన్మదిన వేడుకలకు హాజరు.. పట్టణంలో కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాహుల్గాంధీ జన్మదిన వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రూ.36 లక్షలతో నిర్మించే షెడ్డు పనులకు భూమి పూజ చేశారు. అలాగే మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి సొంతంగా ఇప్పించిన 2 కంప్యూటర్లను ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బందికి మంత్రి అందజేశారు. అదేవిధంగా డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉత్తమ మార్కు లు సాధించిన విద్యార్థులను సన్మానించారు. మక్తల్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఈ నెల 25 నుంచి జులై 24 వరకు కొనసాగుతుందని.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 7 మండలాల కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయనతో పాటు కాంగ్రెస్పార్టీ జిల్లా పరిశీలకుడు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు అందించే ఎన్యూమరేషన్ ఫారాలు అర్హులైన ప్రతి ఓటరుకు చేరేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో 80 వేల మంది ఓటర్లు ఉన్నారని.. ఓటు చోరీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాళ్లో లక్షాలది మంది ఓట్లు తొలగించి టీఎంసీని అధికారంలోకి రాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. మన రాష్ట్రంలోనూ లక్షలాది ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారికి చేరేలా కృషి చేయాలని సూచించారు. ఫారం సమర్పించకపోతే జులై 30న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు తొలగిపోయే ప్రమాదం ఉందని.. గ్రామాల్లో అర్హులైన పేర్లు నమోదు చేయించాలన్నారు. వచ్చే నెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శిస్తారని.. అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు సీకరిస్తారని, అంతలోపే ఓటు హక్కు కాపాడుకోనేందుకు వీలవుతుందని వివరించారు. అనంతరం ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్వాకిటి మానస, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్కుమార్, పట్టణ అధ్యక్షుడు రవికుమార్, వాకిటి హన్మంతు, గోవర్ధన్, ఓబులేష్, రవికుమార్, ఆనంద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
విద్యా ప్రమాణాల మెరుగే లక్ష్యం
నారాయణపేట: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని.. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్యకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా సమీక్షకు ఆమె హాజరై ఎఫ్ఎల్ఎన్, బడిబాట, విద్యార్థుల నమోదు, డిజిటల్ లెర్నింగ్, అపార్, యూ డైస్, వైఓసీ, ఎఫ్ఆర్ఎస్ హాజరు, మధ్యాహ్న భోజన పథకం, పాఠ్య పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై చర్చించి మాట్లాడారు. ప్రతి పాఠశాలలో వెనకబడిని విద్యార్థులను గుర్తించి రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 1, 2 తరగతుల విద్యార్థులు చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు సాధించేలా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించి హాజరును నిర్ధారించాలని ఆదేశించారు. శనివారం జరిగే తల్లిదండ్రుల సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర, డిస్ట్రిక్ట్ మానిటరింగ్ ర్యాంకింగ్లో జిల్లా 21వ స్థానంలో ఉందని.. మెరుగైన పనితీరుతో జాతీయ ఫర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇన్డెక్స్ (పీజీఐ)లో ఉత్తమ స్థానం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖాన్ అకాడమీ, తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్, దీక్షావేదిక వంటి డిజిటల్ విద్యా వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులకు అవసరమైన ప్రత్యేక శిక్షణలు నిర్వహించాలని అకాడమిక్ మానిటరింగ్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు నమోదులో ధన్వాడ, మాగనూర్ మండలాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని.. హాజరు నమోదు చేయని 40 మంది ఉపాధ్యాయులపై వెంటనే నివే దిక సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్బుక్స్ సకాలంలో అందించి ఆన్లైన్లో నమోదు చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ అమలును నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి డా. ఎం.గోవిందరాజు, అకాడమిక్ మానిటరింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీ.. ఊట్కూర్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలు, శ్రీరాంనగర్ ప్రాథమిక, తిప్రాస్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలను కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తిప్రాస్పల్లి పాఠశాలలో లైబ్రరీ, మధ్యాహ్న భోజనానికి వినియోగించే నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. మెనూ పాటించకపోవడంపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాంనగర్ పాఠశాలలో బియ్యంలో పురుగులను గుర్తించి బస్తాలను తిప్పి పంపించి వేరే బియ్యాన్ని తెప్పించుకోవాలని హెచ్ఎంకు సూచించారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని సర్పంచ్ రేణుక భరత్ కలెక్టర్ దృష్టికి తీసుకరాగా.. పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను పంపించాలని ఎంపీడీఓ కిశోర్కుమార్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీఓ కిశోర్కుమార్, ఉప సర్పంచ్ రమేశ్, ఆర్ఐ కృష్ణారెడ్డి ప్రధానోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. -
హరిత సన్నద్ధం
జిల్లాలోని వన నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు ● జిల్లా లక్ష్యం 13.76 లక్షలు ● ఉపాధి కూలీలతో గుంతల తవ్వకం ● విజయవంతం చేసేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రణాళిక ● వరుణుడి కరుణ కోసం అధికారుల ఎదురుచూపులు నర్వ: రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన నర్సరీల్లో మొక్కలు పెంచి వీటిని నిర్దేశిత ప్రాంతాల్లో నాటేందుకు వివిధ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది వన మహోత్సవానికిగాను లక్ష్యాన్ని ఖరారు చేసి వన నర్సరీల్లో షేడ్నెట్లను ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షిస్తున్నారు. నర్సరీల నిర్వహణ, గుంతల తవ్వకం, మొక్కల సరఫరాపై అధికారుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. పంచాయతీరాజ్, ఉపాధిహామీ అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించేలా ఉన్నతాధికారులు కార్యాచరణ చేపట్టారు. ఎంపీడీఓ, ఏపీఓ, ఎంపీఓలు, ఎంపీపీలు, గ్రామస్థాయిలో కార్యదర్శులు, ఉపాధిహామీ మేటీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సిబ్బందికి సూచనలిచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. మండలం మొక్కల లక్ష్యం మద్దూర్ 1,51,530 మక్తల్ 1,15,400 దామరగిద్ద 88,200 ఊట్కూర్ 86,216 నారాయణపేట 82,154 ధన్వాడ 58,200 నర్వ 55,800 మరికల్ 50,000 కొత్తపల్లి 47,000 మాగనూర్ 47,000 కోస్గి 42,300 గుండుమాల్ 38,500 కృష్ణా 38,200 మండలాల వారీగా లక్ష్యం.. నిరంతర పర్యవేక్షణ.. -
మార్పు సరికాదు..
సీఎం సొంత జిల్లాలో ఉన్న పీయూకు జాతీయ సెమినార్ నిర్వహించే అవకాశం వస్తే దాన్ని హైదరాబాద్కు మార్చడం శోచనీయం. యూనివర్సిటీలోనే సెమినార్ నిర్వహించాలి. సీఎం వస్తే యూనివర్సిటీలో సమస్యలను చూసి నిధులు ఇస్తారని అందరూ భావిస్తున్నారు. బీఆర్ఎస్వీ ఆందోళనలు, జాబ్ క్యాలెండర్ నిరసనలకు భయపడే జాతీయ సెమినార్ను కన్హా శాంతివనంకు మార్చారు. యూనివర్సిటీకి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – భరత్బాబు, బీఆర్ఎస్వీ పీయూ అధ్యక్షుడు యూనివర్సిటీకే రావాలి.. యూనివర్సిటీలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్నామని, దీనికి సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారని అధికారులు మొదట తెలిపారు. దీంతో సీఎం సొంత జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి వస్తే.. ఇక్కడ సమస్యలను పరిశీలించి నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ, సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడం బాధాకరం. సీఎం యూనివర్సిటీకే రావాలి.. ఇక్కడే సెమినార్ నిర్వహించాలి. అధిక నిధులు యూనివర్సిటీకి కేటాయించాలి. – తాయప్ప, బీసీ సంఘం పీయూ అధ్యక్షుడు ● -
వేదిక మార్చేశారు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సదుద్దేశంతో 2008లో అప్పటి సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలమూరు యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ.. దినదినాభివృద్ధి చెందుతూ.. ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే పీయూకు కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం కింద ఏకంగా రూ.100 కోట్లు ప్రకటించడంతో నేపథ్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సెమినార్ను పీయూలో నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానిస్తున్నామని గతంలో యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పీయూకు వచ్చే మొదటి సీఎం, ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి వస్తే.. ఎంతో మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అధికారులు సెమినార్ వేదికను హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలోకి మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఓయూకు వెళ్లిన సీఎం వసతుల అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించారని.. సొంత జిల్లాలోని పీయూకు కూడా వస్తే కనీసం రూ.200 కోట్లు అయినా కేటాయిస్తారనుకున్న వారి ఆశలు నిరాశగా మారాయి. సీఎం సారూ.. ఇటు చూడండి పీయూ నిర్వహించే జాతీయ సెమినార్లో సీఎం రేవంత్రెడ్డి పాల్గొనున్న నేపథ్యంలో యూనివర్సిటీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పీయూలో విద్యార్థుల కోసం శాశ్వత ఆస్పత్రి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ముఖ్యంగా పీయూలో రెగ్యులర్ ప్రాతిపదికన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడంతో రీసెర్చిలో తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పీజీ సెంటర్లలో, విద్యార్థులకు తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి పీయూలో మరిన్ని కొత్త కళాశాలలు, కొత్త కోర్సులు ప్రవేశపెట్టి జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కనీసం రూ.200 కోట్లు కేటాయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గోస చూస్తారనుకుంటే.. 15 కమిటీల ఏర్పాటు.. దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయి సెమినార్ నిర్వహిస్తున్న మొదటి యూనివర్సిటీ పీయూ కానుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సహా రాష్ట్ర మంత్రులు, వివిధ సెంట్రల్, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సంబంధించిన వీసీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్, ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా పలువురు విద్యార్థులు పారిశ్రామికవేత్తలు, రీసెర్చ్స్కాలర్స్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మొత్తం 15 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో వీసీ శ్రీనివాస్ ప్యాట్రన్గా, రిజిస్ట్రార్ రమేష్బాబు కన్వీనర్గా, కంట్రోలర్ ప్రవీణ, వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. వీరితో పాటు బ్రోచర్ల రూపకల్పన, ఆహ్వాన పత్రాలు, అకడమిక్ సెషన్లు, ప్రతినిధుల వసతి, రవాణా, భోజనం, సాంకేతిక సమాచారం, ఆర్థిక వ్యవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల కోసం మొత్తం 15 మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశారు. పీయూలో జాతీయ సెమినార్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మొదట్లో యూనివర్సిటీలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం హాజరవుతారని వెల్లడి అనూహ్యంగా కన్హా శాంతివనంకు మారిన సెమినార్ నిర్వహణ వేదిక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు, జిల్లావాసులు పునరాలోచించాలి.. గతంలో ప్రభుత్వాలు యూనివర్సిటీని పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీయూ నిర్వహించే నేషనల్ సెమినార్ను హైదరాబాద్ శివారుకు మార్చడంలో అధికారుల ఉద్దేశం ఏమిటి. ఇక్కడే సెమినార్ నిర్వహిస్తే యూనివర్సిటీకి సొంత జిల్లాలో సీఎం ఎక్కువ నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వేదిక మార్పుపై పునరాలోచించాలి. – రవికిషోర్, పీయూ ఏబీవీపీ సెక్రెటరీ వసతులు లేకనే.. పీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో హైదరాబాద్లో సమీపంలోని కన్హా శాంతివనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు సీఎం హాజరుకానున్నారు. యూనివర్సిటీలో సెమినార్ నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో హాళ్లు, అతిథులకు హోటళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో సెమినార్ వేదికను మార్చాం. యూనివర్సిటీకి ప్రభుత్వం ఏమైనా ఇస్తే అక్కడ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వేదిక మార్పులో ఎలాంటి దురుద్దేశం లేదు. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ -
భారత్మాల పనుల అడ్డగింత
మరికల్: రోడ్డు విస్తీర్ణంలో ప్లాట్లు కోల్పోయిన తమకు నష్ట పరిహారం చెల్లించి పనులు చేసుకోవాలని గురువారం భారత్మాల నిర్వాసితులు పనులు అడ్డుకున్నారు. గురువారం పట్టణ శివారులోని సర్వేనంబర్ 669, 672లో చెట్ల తొలగింపు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితులు చెట్లను తొలగిస్తున్న పొక్లెయిన్ను అడ్డుకొని అధికారులు తమకు నష్ట పరిహారం ఇచ్చే వరకు పనులు చేసేది లేదని తిప్పి పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిహారం కోసం ఏళ్ల తరబడి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో బాధితులు నరేష్, పద్మమ్మ, అనిత, రాజు, బాలమ్మ, కుర్మన్న, రత్నాచారి, శంకరప్ప, రేణుక, హన్మంత్రెడ్డి, అనిత, బుడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. విధేయులకే కీలక పదవులు: కాంగ్రెస్ నారాయణపేట: కష్టకాలంలో అండగా నిలిచి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలకే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని డీసీసీ మాజీ అధ్యక్షుడు, నారాయణపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అంకితభావంతో పనిచేసే నాయకత్వానికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అరెస్టులు, కేసులు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ పార్టీని వీడలేదని, అలాంటి విధేయులను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని వేగంగా అమలు చేస్తోందని, రైతుల సమ్మతితోనే భూ సేకరణ చేపట్టి ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యంగా పరిష్కరిస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే యువ నాయకులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. త్వరలోనే పార్టీకి కట్టుబడి పనిచేసిన మరికొందరు నాయకులు, కార్యకర్తలకు వివిధ పదవులు ఇస్తామని, రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నాయకత్వంలో అన్నిరంగాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంత్కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణు, డా. గీత విశ్వనాథ్, దామరగిద్ద మండల అధ్యక్షుడు బర్ల ఆనంద్కుమార్, నరేష్ బాల్రెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదుల విధుల బహిష్కరణ నారాయణపేట ఎడ్యుకేషన్: మహబూబ్నగర్లో న్యాయవాది వి.నరేందర్నాయక్పై పోలీసులు అక్రమ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. గురువారం కోర్టు ఎదుట నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొచ్చినప్పటికీ మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ న్యాయవాదిపై అక్రమ కేసు నమోదు చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. త్వరగా అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్గౌడ్, ఉపాధ్యక్షుడు నందూనామాజీ, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట: జిల్లాను బాల్య వివాహాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెనన్స్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీ డా. వినీత్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నా భవిష్యత్తు–నా సంకల్పం నినాదంతో జిల్లాలో గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, మహిళా చట్టాల సమర్థ అమలుతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆడపిల్లలు చదువు పూర్తి చేసుకొని చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాతే వివాహం చేసుకునేలా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. జిల్లాపై ఉన్న బాల్య వివాహాల ముద్రను అందరి భాగస్వామ్యంతో చెరిపివేయవచ్చని పేర్కొన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి కమిటీలపై ఉందని, సమాచారం దాచినా లేదా ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇకపై జిల్లాలోని ప్రతి గ్రామంలో బాల్య వివాహాల నిరోధక చట్టంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు రుజువైతే సంబంధిత క్షేత్రస్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అడ్డుకున్న సర్పంచులకు రాష్ట్రస్థాయి ఉత్తమ సర్పంచి అవార్డు అందించేలా కృషి చేస్తానని ప్రకటించారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా నేటికీ కేసులు నమోదు కావడం ఆందోళనకరమన్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. డ్రాప్అవుట్ బాలికలను తిరిగి పాఠశాలల్లో చేర్పించి ఈ దురాచారాన్ని నిర్మూలించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఓ వెంకట్రాములు, ఆర్డీఓ రమేష్, డీడబ్ల్యూఓ రాజేందర్గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్కుమార్, డీసీపీఓ కరిష్మా తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ప్రారంభం జిల్లాకేంద్రం సమీపంలోని సింగారం మలుపు వద్ద కొత్తగా నిర్మించిన ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని గురువారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఎక్లాస్పూర్ ఎకో పార్క్లో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాస్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో 88 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఎక్లాస్పూర్ ఎకో పార్క్ జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. వనమహోత్సవం సందర్భంగా ప్రారంభించిన జంగిల్ సఫారీ వాహనం ద్వారా సందర్శకులు అడవి అందాలను ఆస్వాదించడంతో పాటు అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ శివ్ ఆశిష్సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి గణేష్, ఎఫ్ఆర్ఓ కమలోద్దీన్, ప్రత్యేక అధికారులు, బీట్ అధికారులు, సింగారం సర్పంచ్ నాగిరెడ్డి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సర్.. ఉన్నారా.. లేరా?
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఒక ఓటరు 2002 జాబితాలో ఉన్న ఈపీఐసీ నంబర్తో ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేర్లతో సర్–2026లో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏకంగా 9,16,059 మంది ఓటర్లకు సంబంధించిన 2002లో ఓటరు జాబితాలో వివరాలు అందుబాటులో లేవు. దీంతో వీరంతా 2002లో ఎక్కడ ఓటర్లుగా ఉన్నారనే దానిపై అన్వేషిస్తున్నారు. ఇందుకోసం మండలాల్లో స్పెషల్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వారికి సంబంధించిన 2002 ఓటరు జాబితా ఈపీఐసీ నంబర్ కోసం వెతుకుతున్నారు. గతంలో 2002లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరగగా..24 ఏళ్ల తర్వాత మళ్లీ నిర్వహిస్తున్నారు. అప్పటి జాబితాను పరిగణలోకి తీసుకుని సవరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ప్రస్తుతం మొత్తం 27,39,12 లక్షల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 21,95,269 మంది ఓటర్లకు సంబంధించిన ఈపీఐసీ నంబర్లు 2002 ఓటరు జాబితాలోని ఈపీఐసీ నంబర్తో మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ జరిగిన ఓటర్లలో ఏకంగా 9,16,059 మంది పేర్లు/ తల్లిదండ్రుల పేర్లు/ బంధుత్వం/ చిరునామా ఇతర వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం రూపొందించిన సాఫ్ట్వేర్ గుర్తించింది. దీంతో 2002 నాటి వివరాలు లభించక బీఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. సర్లో భాగంగా జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 మధ్య వారికి స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆయా అనుమానాల నివృత్తికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను ఆధారాలుగా చూపాలని కోరే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్యలో వారితోపాటు రాష్ట్రంలోని ఓటర్లందరికీ రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిని నింపాక ఒక ప్రతిని వెనక్కి తీసుకోనున్నారు. స్థానిక బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈప్రక్రియ నిర్వహిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటన తర్వాత మ్యాపింగ్లో వ్యత్యాసాలున్న గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్దేశిత గడువులో విచారణకు హాజరు కావాలని కోరనున్నారు. అక్షర దోషాలున్నా.. సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తేడాలున్నా పట్టేసి అనుమానాస్పద జాబితాలో చేరుస్తోంది. 2002 జాబితాకు ఇప్పటి జాబితాకు పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదై ఉండటం (ఉదాహరణ తండ్రికి బదులు భర్త) తండ్రికి బిడ్డకు మధ్య వయసులో అసాధారణ తేడాలుండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తప్పుడు మ్యాపింగ్ చేయడం వంటి లోపాలను సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఇలాంటి కారణాలతోనే ఉమ్మడి జిల్లాలో 9,16,059 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. మరో అవకాశం.. అర్హులైన వారిని కూడా ఈసారి ఓటరు జాబితాలో చేర్చుతారు. 18 ఏళ్ల నిండిన వారు ఎన్యుమరేషన్ ఫాం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 12 నాటికి ఓటర్లుగా నమోదైన వారికే ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయనుండగా.. జాబితాలో పేరు లేని వారికి సైతం ఓటరుగా నమోదు చేసుకోవడానికి సర్ ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. వీరికోసం బీఎల్ఓలు ఫారం–6తోపాటు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను ఈఆర్వోలు పరిశీలించి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పిస్తారు. 2002 జాబితా ఈపీఐసీ నంబర్లతో ప్రస్తుత ఓటర్ల మ్యాపింగ్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 80.15 శాతం పూర్తయిన ప్రక్రియ 9,16,059 మంది అనమానాస్పద ఓటర్ల వివరాల కోసం ఆరా ఎస్ఐఆర్–26లో నోటీసులు జారీ చేసి ఆధారాలు చూపాలని కోరే అవకాశం అప్పటి ఈపీఐసీ నంబర్లు లభించక బీఎల్ఓల ఇక్కట్లు -
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ధన్వాడ: ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసి నిల్వలు, రికార్డులు, గోదాములను తనిఖీ చేశారు. అనంతరం పాతపల్లి నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం లేకపోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చన్నారు. కావున రైతులు రెండు, మూడు రోజుల్లో 50 మి.మీ. నుంచి 75 మి.మీ. వర్షపాతం కురిసి భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాతే వర్షాధార విత్తనాలు విత్తాలని సూచించారు. భూమిలో తగినంత తేమ లేకుండా విత్తనాలు విత్తితే సరిగా మొలకెత్తవని.. ఫలితంగా తిరిగి విత్తాల్సి రావడంతో రైతులు నష్టపోతారని తెలిపారు. స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము.. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కంది, జొన్న, సజ్జ, నువ్వుల పంటలు సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల సాగుకు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఏఓ నవీన్కుమార్ ఉన్నారు. -
విధిగా మెనూ పాటించాలి : జిల్లా విద్యాధికారి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కోటకొండలో ఉన్న పీఎంశ్రీ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి బోధనపై ఆరా తీశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న మైదానంలో విద్యార్థులను పలకరించి భవిష్యత్లో క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని కోరారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరకంగా ధృడంగా ఉంటారన్నారు. ఆయన వెంట ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, పీఈటీ రమణ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావాలి
నారాయణపేట: జిల్లాలో డయేరియా నిర్మూలన, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్ర మోహన్, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. సాయిరాం ఆయా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. డయేరియా నివారణలో భాగంగా జూన్న్ 28 నుంచి 30 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలతో బాధపడే పిల్లలకు వెంటనే ఓఆర్ఎస్, జింక్ చికిత్స అందిస్తామని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న 53,667 మంది చిన్నారులకు పల్స్పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 72 వేల వ్యాక్సిన్న్ డోసులు జిల్లాకు అందాయని చెప్పారు. జూనన్ 28న పోలియో బూత్లలో చుక్కలు వేయగా.. 29, 30 తేదీల్లో మిగిలిన పిల్లలకు ఇంటింటికి వెళ్లి వేస్తామని వివరించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు వయస్సున్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాగే ప్రతి పోలియో బూత్లో ఓఆర్ఎస్ కార్నర్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సిద్ధప్ప, ప్రోగ్రాం అధికారులు సత్యప్రకాశ్, బిక్షపతి, జీఎంసీ ప్రిన్సిపాల్ డా. సంపత్కుమార్ సింగ్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్రావు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్న్ అధ్యక్షుడు సుదర్శన్్రెడ్డి, అబ్దుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. కోస్గి రూరల్: స్థానిక పురపాలికలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ, కడా ప్రత్యేక నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి పరిశీలించారు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి కాల్వలు, ప్రధాన అనుసంధాన రహదారులు, అంతర్గత సీసీ రహదారులు, నీటి సరఫరా వ్యవస్థ, సైన్స్ మ్యూజియం, డంపింగ్యార్డ్ ప్రధాన అనుసంధాన రోడ్లు, శంభుని ఆలయం తదితర అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శంభుని ఆలయం వద్ద నిర్మిస్తున్న కల్వర్టు, ఆలయం చుట్టూ ఉన్న భూమి కబ్జాకి గురైందని.. సర్వే చేయించాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ కలెక్టర్ను కోరగా సర్వేకు తహసీల్దార్ బక్క శ్రీనివాస్ను ఆదేశించారు. కోస్గి మండలంలోని నాచారం, తోగాపూర్ నుంచి వెళ్లే రేడియల్ రోడ్ మ్యాప్ను పరిశీలించారు. అనంతరం కోస్గిలోని సామాజిక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, ల్యాబ్, లేబర్రూంను పరిశీలించారు. ఆమెవెంట హౌసింగ్ పీడీ శంకర్ నాయక్, పుర కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీధర్ ఉన్నారు. -
చదువుకు ‘స్వస్తి’ !
అరకొర ‘వసతి’..● సామర్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులకు వసతి కల్పన ● మరో 6 సంక్షేమ హాస్టళ్ల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ● కొల్లాపూర్లోని 2 నాన్ వర్కింగ్ హాస్టళ్ల తరలింపునకు యత్నం ● ఆదిలోనే ఆగిన ప్రక్రియ.. ఏడాదిగా ఫైల్ పెండింగ్లోనే.. ఎంవీఎస్ ప్రాంగణంలోని ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ బీలో విద్యార్థులు దేవరకద్రలో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలు లేవు. సంక్షేమ హాస్టళ్లు లేవు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాతే డిగ్రీ కళాశాలకు అనుమతులు వచ్చాయి. ఆ వెంటనే సంక్షేమ హాస్టల్ కోసం ప్రతిపాదనలు పంపాను. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో పది, 15 రోజుల్లో కల సాకారమయ్యే అవకాశం ఉంది. – జి.మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతి కోసం విద్యార్థుల నుంచి ప్రతి ఏటా అధిక మొత్తంలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో ఎస్సీ, బీసీ వసతి గృహాలు అదనంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత కలెక్టర్ విజయేందిర హయాంలోనే పంపడం జరిగింది. అనుమతులు రావాల్సి ఉంది. – సునీత, డీడీ, ఎస్సీ సంక్షేమశాఖ ప్రస్తుతం 3 వేల మందికే.. మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల వసతి గృహాలు ఆరు, బీసీ హాస్టళ్లు ఐదు, గిరిజన హాస్టళ్లు మూడు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది వసతి పొందుతున్నారు. లెక్క ప్రకారం ఆయా హాస్టళ్లలో మొత్తంగా 2 వేల మందికి సరిపోను సౌకర్యాలు ఉండగా.. స్థాయికి మించి మరో వెయ్యి మందికి పైగా వసతి కల్పిస్తున్నారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ విద్యార్థులు అధిక శాతం మంది వివిధ విద్యా సంస్థల్లో సీట్లు వచ్చినప్పటికీ.. ప్రభుత్వ హాస్టళ్లలో వసతి పొందలేకపోతున్నారు. అదనంగా 10 హాస్టళ్లు అవసరం.. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి వందకు పైగా కళాశాలల స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా సుమారు 25 వేల నుంచి 28 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో కేవలం మూడు వేల మందికే ప్రభుత్వ వసతి గృహాల్లో చోటు దక్కుతోంది. అంతకుముందు ఏడాది 2,500 మందికి వసతి కల్పించగా.. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గత సంవత్సరం మరో 500 మందికి అవకాశం ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా మరో 10 వేల మంది వరకు ప్రభుత్వ హాస్టళ్లలో వసతి కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మరో పది సంక్షేమ హాస్టళ్ల అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితం.. సంక్షేమ కళాశాలల హాస్టళ్లకు పేద విద్యార్థుల నుంచి డిమాండ్ పెరగడంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వసతి గృహాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మొత్తం ఆరు ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల కోసం వారు ప్రపోజల్స్ పంపినట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో అధికారులు పరిశీలించి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని రెండు నాన్ వర్కింగ్ హాస్టళ్ల (విద్యార్థులు లేరు)ను మహబూబ్నగర్కి తరలించేలా ప్రయత్నించారు. ఈ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకి ఏర్పడగా.. ప్రభుత్వ హాస్టళ్ల ఏర్పాటు ఏడాదిగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ విద్యాసంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. మహబూబ్నగర్లో ఒక్కొక్కటిగా అన్ని రకాల టెక్నికల్, నాన్ టెక్నికల్, న్యాయ, వైద్య విద్యా సంస్థలు వెలియడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం విద్యాహబ్గా మారింది. దీంతో నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి విద్యార్థులు మహబూబ్నగర్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కోర్సుల్లో కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరుగుతండడంతో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వ కళాశాలల్లో అనుబంధంగా వసతి గృహాలు లేకపోవడం, ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో అధిక సంఖ్యలో పేద విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ కళాశాలల హాస్టళ్లలో వసతికి మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి ఐదు, బీసీ రెండు, గిరిజన రెండు, మైనార్టీ వసతి గృహాలు ఒకటి మాత్రమే ఉన్నాయి. ఇవి సరిపోకపోవడంతో పలువురు పేద విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో నెలనెలా ఫీజులు కడుతూ.. చివరకు వచ్చే సరికి ఆర్థిక భారం కావడంతో చదువుకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం మహబూబ్నగర్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెస్పిరేటరీ కోర్సులో చేరాను. కళాశాలకు అనుబంధంగా వసతి లేకపోవడంతో ఎస్సీ వసతి గృహంలో దరఖాస్తు చేసుకున్నా. కానీ సీట్ల కొరతతో నాకు అవకాశం రాలేదు. నా కుటుంబానికి ఆర్థిక భారమైనా విధిలేని పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ హాస్టల్లో నెలకు రూ.3,500 కడుతూ విద్యనభ్యసిస్తున్నా. ఇంకా మూడేళ్లు చదవాల్సి ఉంది. ఈ సంవత్సరమైనా ప్రభుత్వ వసతి గృహాల సంఖ్య పెంచితే మాలాంటి పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. – సాయిరాం, రెస్పిరేటరీ విద్యార్థిని, నాగర్కర్నూల్ -
పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. వివిధ గ్రామాల నుంచి దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా.. వ్యాపారులు వేలం వేసి ధరలు నిర్ణయించారు. వేలంలో క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.2,110, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు లభించాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,100, కనిష్టంగా రూ.600 వరకు విక్రయించారు. మార్కెట్లో కేవలం ఉల్లి వ్యాపా రం మాత్రమే కొనసాగింది. మార్కెట్లో అమ్మకానికి వచ్చిన ఉల్లి -
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
నారాయణపేట: కాంగ్రెస్పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీవీఆర్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, అసెంబ్లీ ని యోజకవర్గ ఇన్న్చార్జ్లు తిరుపతిరెడ్డి, కుంభం శివకుమార్రెడ్డి సూచనతో కార్యవర్గాన్ని రూపొందించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న సీనియర్ నాయకులు, యువత, మహిళ లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత స్థానం కల్పించినట్లు పేర్కొన్నారు. నూతన కమిటీలో ఆరుగురు జిల్లా ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులు, 20 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారి, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఏడుగురు జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిపి మొత్తం 49 మందిని నియమించినట్లు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం కమిటీ ప్ర ధాన లక్ష్యమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యని అభివర్ణించారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నెల 24 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మహ్మద్ సలీం, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, శంకర్, పళ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
పాఠశాలల్లో పనికిరాని పాత్రలు తీసివేయాలి. మిగిలిన వాటిని వేడి నీటితో శుభ్రం చేయాలి. వంట గదులు స్వచ్ఛంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. గదులతో పాటు గోడలు, పైకప్పు బూజు, ఇతర చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. సిబ్బంది తప్పకుండా చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కు ధరించి వంట చేయాలి. ప్రభుత్వం రూపొందించిన పట్టిక ప్రకారం భోజనాన్ని సిద్ధం చేయాలి. నాణ్యత లోపించకుండా చూసుకోవాలి. ఆహార కమిటీలను నియమించి పర్యవేక్షణ పెంచాల్సి ఉంటుంది. పోషకాహార లోపంతో ఎంతో మంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, పలు పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోనుంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించనున్నారు. -
మధ్యాహ్న భోజనం.. మరింత నాణ్యత
వంట ఏజెన్సీ కార్మికులు, ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ● పోషకాహారం అందించే దిశగా అడుగులు ● స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన ● గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు –8లో uమరికల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది జరిగిన తప్పులను సవరించి కొత్త విద్యా సంవత్సరంలో నాణ్యత ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించేలా.. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా వంట ఏజెన్సీ కార్మికులకు, ఒక కాంప్లెక్స్ ఉపాధ్యాయుడికి జిల్లాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో మండలానికి ఇద్దరికి శిక్షణ పూర్తికాగా.. మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నారు. మార్గదర్శకాలు జారీ.. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ఏటా మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. కోడిగుడ్లు, ఆకుకూరలు, పోషకాలతో కూడిన కిచిడీ, రాగిజావ వంటివి అందిస్తున్నారు. ఈ నెల 15న పాఠశాలలు పునః ప్రారంభం కాగా.. అప్పటికే వంట పాత్రలు, గదులు శుభ్రం చేయడంతో పాటు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించకుండా ఉండేందుకు హెచ్ఎంలు, వంట ఏజెన్సీల మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాం. జిల్లాలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పాఠశాలల ప్రారంభానికి ముందే వంట పాత్రలు కూడా శుభ్రం చేయించాం. – యాదయ్య శెట్టి, మధ్యాహ్న భోజన ఇన్చార్జ్, నారాయణపేట -
జూరాలకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ధరూరు/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 1,999 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు పంపులను రన్ చేసి.. రిజర్వాయర్లను నింపుతున్నట్లు పేర్కొన్నారు. నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులతో కలిపి మొత్తం 2,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.791 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. ● సుంకేసుల డ్యాం వద్ద రెండు గేట్లను ఎత్తారు. ఉదయం ఎగువ నుంచి 7,650 క్యూసెక్కులు ఇన్ఫ్లో రాగా.. ఒక గేటును ఒక మీటర్ మేర, మరో గేటును అర మీటర్ మేర తెరిచి 6,759 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. -
‘డైవర్షన్’లోనే రాజోళి బండ
● ఆర్డీఎస్ సమస్యకు లభించని శాశ్వత పరిష్కారం ● నేటికీ అసంపూర్తిగానే ప్యాకేజీ–1, 2 పనులు ● ఏళ్ల తరబడి తేలని నడిగడ్డ రైతుల నీటివాటా ● తాజాగా హెడ్వర్క్స్ను సందర్శించిన కేఆర్ఎంబీ చైర్మన్ ● 30 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించాలని రైతుల వినతి గద్వాల: కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన రాజోళి బండ డైవర్షన్ పథకాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ మంగళవారం సందర్శించారు. హెడ్వర్క్స్ వద్ద నిర్మించిన ఆనకట్ట, స్లూయిస్, ప్రధాన కాల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు చైర్మన్ను కలిశారు. గడిచిన ఐదు దశాబ్దాలుగా ఆర్డీఎస్ పరిధిలో అలంపూర్కు జరుగుతున్న అన్యాయాన్ని సవివరంగా వివరించారు. అలాగే హెడ్వర్క్స్ వద్ద రెండు దశాబ్దాల కిందట చేపట్టిన ప్యాకేజీ–1, 2 పనులు పెండింగ్లో కొనసాగుతున్న వైనాన్ని చైర్మన్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ పరిధిలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడిన జలాశయం, అదేవిధంగా రాజోళి మండల పరిధిలో నిర్మించతలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్ను పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ఇదీ ఆర్డీఎస్ నేపథ్యం.. నిజాం హయాంలో అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్ణాటకలోని రాజోళి వద్ద హెడ్వర్క్స్ నిర్మాణం చేపట్టారు. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసిన తర్వాత ఆర్డీఎస్కు నీటి కష్టాలు మొదలయ్యాయి. మనకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటా పూర్తిస్థాయిలో దక్కడం లేదు. దీనికి హెడ్వర్క్స్ నిర్మాణం, మనవైపు నీరు రావాల్సిన ప్రధానకాల్వ మొత్తం కర్ణాటక పరిధిలో ఉండటమే ఇందుకు కారణం. ఫలితంగా నీటివాటా కేటాయింపుల అన్యాయం జరుగుతోంది. ప్రధానంగా ఆర్డీఎస్ ఆనకట్ట స్లూయిస్ నిర్మాణాలు ఏపీకి సమీపంలో ఉన్నాయి. దీంతో మనకు రావాల్సిన నీటివాటాను ఏపీ రైతులు తరలించుకువెళ్లడంతో ఆర్డీఎస్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం చూపెడుతూ అిప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్లూయిస్ రంద్రాలను మూసివేయడంతోపాటు ఆనకట్ట, ప్రధాన కాల్వల మరమ్మతుకు నిధులు మంజూరు చేశారు. దీంతో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న తరుణంలో మాజీ సీఎం వైఎస్సార్ అకాల మరణంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆనకట్ట వద్ద రెండు ప్యాకేజీ పనులు నేటికీ అసంపూర్తిగానే కొనసాగుతుండగా.. మిగిలిన పనులు సైతం తూతూమంత్రంగా చేపట్టారు. దీంతో సుమారు ఐదు దశాబ్దాలుగా కేవలం 50వేల లోపు ఆయకట్టుకే సాగునీరు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ● తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్డీఎస్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజోళి వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టారు. వరద సమయంలో తుంగభద్ర నది నీటిని తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నేరుగా ఆర్డీఎస్ ప్రధాన కాల్వలకు ఎత్తిపోసి 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. అయితే వానాకాలంలో వరద ఉన్న సమయంలో మాత్రమే సాగునీరు అందుతుండగా.. మిగిలిన రబీ సీజన్లో క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్తో కూడిన అధికారుల బృందం మంగళవారం కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ హెడ్వర్క్స్ను సందర్శించింది. ఆనకట్ట, స్లూయిస్ నిర్మాణాలు, ప్యాకేజీ–1, 2 పరిధిలో అసంపూర్తి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆయకట్టుదారులతో కలిసి కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాన్షు బిశ్వాస్ను కలిసి.. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయాలను క్షుణ్ణంగా వివరించారు. ఆర్డీఎస్కు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలంటే హెడ్వర్క్స్ ప్రాంతంలో 30 టీఎంసీల రిజర్వాయర్, అలాగే రాజోళి వద్ద మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాలు పూర్తిచేయాలని చైర్మన్కు విన్నవించారు. ‘‘ఆర్డీఎస్కు ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా అన్యాయం జరిగింది. దీనిపై తాను రైతులతో కలిసి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం చూపాలంటే 30 టీఎంసీల హెడ్వర్క్స్ వద్ద రిజర్వాయర్, మల్లమ్మకుంట రిజర్వాయర్, సుమారు 75 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టను పునర్నిర్మించాలని కోరగా.. సానుకూలంగా స్పందించారు.’’ అని సీతారామిరెడ్డి పేర్కొన్నారు. -
ఆ మాట వింటే.. ఫీజులు ఎగరాల్సిందే!
●ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఫీజుల విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన ప్రతిసారి కంటితుడుపు చర్యలు తీసుకొని వదిలేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తు వీడి ప్రైవేటు పాఠశాల అక్రమ వసూళ్లున అడ్డుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ, సంఘం రాష్ట్ర నాయకుడు చర్యలు తీసుకుంటాం.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో ఎలాంటి స్టేషనరీ, యూనిఫాంలు అమ్మకూడదు. వీటితోపాటు పుస్తకాలను కేవలం ఎమ్మార్పీకే అమ్మాలి. అలాగే పాఠశాల సమయంలో సిలబస్ మాత్రమే బోధించాలి. ఐఐటీ, నీట్ వంటివి చెప్పడానికి వీల్లేదు. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సామాజిక సేవతో నిర్వహించాల్సిన ప్రైవేటు పాఠశాలలు కొందరు వ్యాపారంగా మార్చడంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. ఉమ్మడి జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలల్లో.. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా.. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఫీజులు, ఇతర ఖర్చులు అమాంతం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఒకపక్క ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పుస్తకాలకు మంగళం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలను అమ్మడం వల్ల దానిపై ఉన్న నిర్దిష్ట ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. వీటిని కొనుగోలు చేస్తే కేవలం రూ.600 లోపు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ, ఇక్కడ 70 శాతం పాఠశాలలు ఐదో తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడం లేదు. వివిధ ప్రైవేటు పబ్లికేషన్లు ప్రచురించిన పుస్తకాలనే తీసుకోవాలని సూచిస్తూ.. వాటికి ఎడాపెడా ధరలు నిర్ణయించి బహిరంగంగా విక్రయించడం గమనార్హం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు అసలు పాఠ్యపుస్తకాలు, సిలబస్ను ప్రభుత్వం నిర్ణయించలేదు. అయినప్పటికీ ప్రైవేటు సంస్థలు సిలబస్ రూపొందించి ప్రత్యేకంగా పుస్తకాలను విక్రయించడం కొసమెరుపు. వీటిని కొన్ని పాఠశాలలు అక్కడే డంప్ చేసి అమ్ముతుండగా.. మరికొన్ని పాఠశాలలు సమీపంలోని బుక్ సెంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. అధిక ఫీజులు ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, టై, బెల్టులు కొనడం మరో ఎత్తుగా మారింది. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంల చొప్పున రూ.2,500ల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. టై, బెల్టులు, ఇతర నోట్ పుస్తకాలు కూడా చాలా పాఠశాలల్లోనే విక్రయించడం కొసమెరుపు. ఐఐటీ, నీట్కు అదనం.. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలలోని అంశాలు కాకుండా సంబంధం లేని ఐఐటీ, నీట్ బోధిస్తామని.. రూ.10–20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో స్టడీ మెటీరియల్కు అదనపు ఫీజులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐఐటీ, నీట్ బోధించేందుకు వారంలో రెండు, మూడు రోజులు ఉదయం, లేదా సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పీఈటీ తరగతులను ఎత్తివేసి వాటికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇష్టానుసారంగా ఫీజుల వసూళ్లు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతికి రూ.35 వేల నుంచి 50 వేల వరకు.. స్కూల్స్థాయిలో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరిట అదనం టై, బెల్టు, పుస్తకాలు, యూనిఫాం,బూట్ల పేరిట నిలువు దోపిడీ పాఠశాలల్లోనే విక్రయిస్తున్నాపట్టింపులేని విద్యాధికారులు -
ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి
నారాయణపేట రూరల్: విద్యా ర్థులు ఇష్టపడి చదివి జీవిత లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు. మంగళవారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఇష్టంతో చదవాలని, బట్టి పట్టే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. లెక్కలు సులువుగా ఎలా చేయాలో విద్యార్థులకు చేసి చూపించారు. పదోతరగతి పునాది లాంటిదని.. రాబోయే పదేళ్లలో ఎలా ఉండాలో నోట్ బుక్లో రాసుకొని రోజూ దానిని చూస్తూ తగిన ప్రణాళికతో సాధన చేయాలన్నారు. పదోతరగతిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉండటం సంతోషంగా ఉందని.. అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్రం కావాలన్నారు. టాపర్కు ప్రత్యేక బహుమతి.. ఈ విద్యా సంవత్సరం పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లాస్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని, జాజాపూర్ పాఠశాల నుంచి కూడా ట్రిపుల్ ఐటీకి విద్యార్థులు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. పదోతరగతి ఫలితాల్లో టాపర్గా నిలిచిన వారికి తన తరఫున ప్రత్యేక బహుమతి ఇస్తానని కలెక్టర్ ప్రకటించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందించారు. పాఠశాల ప్రయోగశాల, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఎంఈఓ బాలాజీ, జీహెచ్ఎం భారతి, డీఎస్ఓ భానుప్రకాష్, తపస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ఉపాధ్యాయులు మధుసూదన్రావు ఉన్నారు. -
నకిలీ విత్తనాలతో జాగ్రత్త
నారాయణపేట: సరైన సమయం, నాణ్యమైన విత్తనం, ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తే వ్యవసాయంలో ఆశించిన దిగుబడి సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లాలోని పలువురు రైతులు అడిగిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు. వానాకాలం పంటల సాగులో రైతులు ఆచీతూచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నాయని తొందరపడి విత్తనాలు వేయొద్దని.. నేలలో తగినంత తేమ నిల్వ ఉన్న తర్వాతే నాటాలని సూచించారు. విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, సేంద్రియ సాగు, రసాయన ఎరువుల సమతుల్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ● ప్రశ్న: సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేయాలి? – మహేష్, మందిపల్లి (మాగనూర్) ● డీఏఓ: సేంద్రియ సాగు అంటే కేవలం రసాయన ఎరువులు వినియోగించకుండా చేయడం మాత్రమే కాదు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను వినియోగించి పంటలు సాగు చేయడం. పశువు ల ఎరువు, వర్మీ కంపోస్ట్, జీవామృతం, ఘన జీవామృతం, ఆకుపచ్చ ఎరువులను వినియోగించాలి. ● ప్రశ్న: సేంద్రియ ఎరువులు ఏ విధంగా వినియోగించాలి? – నర్సింహ, మాగనూర్ ● డీఏఓ: సేంద్రియ ఎరువులు భూమిలో కలిసేలా దుక్కి సమయంలో వేయాలి. ఎకరాకు 2 నుంచి 4 టన్నుల వరకు బాగా కుళ్లిన పశువుల ఎరువును వేయడం మంచిది. పిల్లిపెసర, జీనుగ విత్తనాలు వేసి 45 రోజుల తర్వాత భూమిలో కలిసేలా కలియదున్నాలి. వర్మీ కంపోస్ట్ను మొక్కల ఎదుగుదల దశలో వినియోగించవచ్చు. ● ప్రశ్న: నకిలీ పత్తి విత్తనాలు గుర్తించడం ఎలా? – చంద్రశేఖర్, భూనేడ్ ● డీఏఓ: ప్రస్తుతం మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాల బెడద అధికంగా ఉంది. రైతులు గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. ప్యాకెట్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్చేసి బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, గడువు తేదీ, ధ్రువీకరణ ట్యాగ్ పరిశీలించాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకొని భద్రపర్చుకోవాలి. ● ప్రశ్న: విత్తన శుద్ధి ఏ విధంగా చేయాలి? – నర్సింహులు, దామరగిద్ద ●డీఏఓ: విత్తన శుద్ధి అనేది పంటల ఆరోగ్యానికి తొలి రక్షణ కవచం. శిలీంధ్రాలు, బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులను నివారించేందుకు విత్తే ముందు ట్రైకోడెర్మా లేదా వ్యవసాయశాఖ సూచించిన శిలీంధ్రనాశక మందులతో శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన విత్తనాలను నీడలో ఆరబెట్టి వెంటనే విత్తాలి. ● ప్రశ్న: అధిక వర్షాలు కురిస్తే ఏం చేయాలి? – రాజు, మరికల్ ● డీఏఓ: పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే కాల్వలు ఏర్పాటు చేయాలి. పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటల్లో నీరు నిల్వ ఉంటే వేరుకుళ్లు, తెగుళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వర్షం తగ్గిన తర్వాత అవసరమైతే సూక్ష్మపోషకాలు, శిలీంధ్రనాశక మందులు వినియోగించాలి. ● ప్రశ్న: వానాకాలం సాగుకు అనువైన సన్నరకాల వరి వంగడాలు ఏవి? – శంకర్, ధన్వాడ ● డీఏఓ: విత్తనం మంచిదైతే పంట దిగుబడి అధికంగా వస్తుంది. నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలి. తెలంగాణ సోనా 15048, కాటన్న్దొర సన్నాలు కేఎన్ఎం 118, బీపీటీ–5204 (సాంబా మసూరి), వరంగల్ మసూరి జేఎల్ఎం–102, ఎంటీయూ–1010, ఎంటీయూ–1061, ఎంటీయూ–1273 రకాలు వేసుకోవచ్చు. ● ప్రశ్న: కంది పంటకు అనువైన విత్తన రకాలు? – వీరేష్, ఊట్కూర్ ● డీఏఓ: వర్షాధార ప్రాంతాలు, ఎర్ర, నల్ల నేలల్లో కంది ప్రధాన పంటగా సాగు చేస్తారు. రైతులు తమ ప్రాంతానికి అనుకూలమైన, ధ్రువీకరించిన రకాలను ఎంచుకోవాలి. ఆశ–87119, పీఆర్జీ–176, పీఆర్జీ–158, డబ్ల్యూఆర్జీ–65, ఎల్ఆర్జీ–41, టీఎస్–3ఆర్, టీఎస్–480 కంది విత్తనాలు వేసుకోవచ్చు. ప్రశ్న: బీటీ–3 పత్తి విత్తనాలు గుర్తించడం ఏలా? – వెంకటయ్య, రైతు, మరికల్ డీఏఓ: బీటీ–3 పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. విత్తన ప్యాకెట్పై ‘ఆఎ–ఐఐఐ‘, ‘ఆఖీ–3‘, ‘హెర్బిసైడ్ టాలరెంట్ (ఏఖీ) కాటన్‘ వంటి పదాలు ఉంటే అనుమానించాలి. ప్రభుత్వం అనుమతించిన బీటీ–2 విత్తనాలకే అధికారిక ట్యాగ్లు, ధ్రువీకరణ వివరాలు ఉంటాయి. బీటీ–3 విత్తనాలు సాగు చేస్తే పంట నాణ్యత, దిగుబడి ఉండదు. ‘సాక్షి’ ఫోన్–ఇన్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ అదును చూసి విత్తు విత్తాలి శాసీ్త్రయ సాగుతో అధిక దిగుబడులు నాసిరకం, బీటీ–3 పత్తి విత్తనాలతో అప్రమత్తంగా ఉండాలి ప్రశ్న: డీఏపీ దొరకకపోతే ఎలాంటి ఎరువులు వాడాలి? – సురేష్, దామరగిద్ద డీఏఓ: డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల వినియోగం పంట, నేల సారం, నేల పరీక్ష ఫలితాల ఆధారంగా నిర్ణయించాలి. సాధారణంగా రైతులు ఎకరాకు 40 కిలోల నుంచి 60 కిలోల డీఏపీ లేదా పంటకు సిఫారసు చేసిన మోతాదులో కాంప్లెక్స్ ఎరువులు (20:20:0:13, 28:28:0, 24:24:0 ) వినియోగించాలి. డీఏపీ ద్వారా మొక్కలకు నత్రజని, భాస్వరం లభిస్తాయి. అదే పోషకాలను ఇతర కాంప్లెక్స్ ఎరువుల ద్వారా కూడా అందించవచ్చు. కాబట్టి డీఏపీ లేకపోయినా పంట ఎదుగుదలపై పెద్దగా ప్రభావం ఉండదు. -
తల్లిదండ్రులను వేధిస్తే చర్యలు
నారాయణపేట: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, ఆస్తులు రాయించుకున్న తర్వా త వారిని వేధించడం, ఇంటి నుంచి వెళ్లగొట్టడం, పోషణ బాధ్యతలు నిర్వర్తించకపోవడం ఘటనలు జరిగితే బాధితులు కోర్టును ఆశ్రయించవచ్చని సీనియర్ సివిల్ న్యాయమూర్తి వింధ్యానాయక్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధా న న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టు ఆవరణ లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలస్తంభమని, నేటి సమాజంలో ఆ విలువలు క్రమంగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయాన్ని టీవీలు, మొబైల్ ఫోన్లకు కేటాయిస్తూ వృద్ధులను ఒంటరిగా వదిలేస్తున్నారన్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేర్చడంతో తమ బాధ్యత ముగిసిందని భావిస్తున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. వారి మనోభావాలను గౌర వించి ప్రే మాభిమానాలు, ఆప్యాయత, భరోసా కల్పించాల ని సూచించారు. తల్లిదండ్రుల సంరక్షణ, పోష ణ చట్టం–2007 ప్రకారం వృద్ధులు తమ ఆస్తులను తిరిగి పొందే హక్కు కలిగి ఉంటారని స్పష్టం చేశా రు. వృద్ధులకు న్యాయపరమైన సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా టోల్ఫ్రీ నంబర్ 15100 ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, సీనియర్ న్యాయవాది రఘువీర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, న్యాయవాదులు, జాగృతి కమిటీ సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది, పోలీసులు, వయోవృద్ధులు, మహిళలు, కక్షిదారులు పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే కొడంగల్ ఎత్తిపోతల పథకం
● కొడంగల్ ప్రజలకై నా వందశాతం హామీలు అమలుచేయాలి ● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి రూరల్: పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.5,000 కోట్ల నిధులను కేటాయిస్తే కొడంగల్ నియోజకవర్గంలోని 1.50లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు సాధించవచ్చని, అలా చేయుకండా కమీషన్ల కోసమే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. సోమవారం కోస్గిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, దళితబంధు రూ.12 లక్షలు, రైతు భరోసా రూ.15 వేలు, వందశాతం రుణమాఫీలను కనీసం ఓటేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలకై న వందశాతం పూర్తి చేసి చూపించాలన్నారు. జూరాల ప్రాజెక్టులో నీరు లేదనే క్రాప్ హలిడే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదే జూరాల నుంచి కొడంగల్ ప్రజలకు సాగునీరు అందిస్తానని చెప్పి ప్రజలను మరోమారు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2034 వరకు సీఎం నేనే అంటూ ప్రగల్బాలు పలకడం మానుకోవాలని, రాబోయే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగల్ డిపాజిట్ రాదని, సీఎంగా రేవంత్ దిగిపోవడం ఖాయమన్నారు. కోస్గి మున్సిపాలిటీలో అండర్ డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పనులలో జాప్యం చేస్తున్నారని అన్నారు. నాయకులు వెంకట్నర్సిములు, జనార్దన్రెడ్డి, నీలప్ప, సాయిలు, నరేందర్రెడ్డి, వెంకట్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. -
తొలిరోజు 16 శాతమే..
అమావాస్య కారణంగా తగ్గిన విద్యార్థుల హాజరు ● వినూత్నంగా స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ● జిల్లావ్యాప్తంగా 214 ప్రవేశాలు ● పాఠశాలల్లో పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ –8లో uమండలం మొత్తం హాజరైనవారు నారాయణపేట 6,112 811 మక్తల్ 5,903 774 దామరగిద్ద 4,252 454 ఉట్కూర్ 4,162 1,448 మద్దూర్ 3,811 516 కోస్గి 3,326 1,251 ధన్వాడ 3,168 354 కృష్ణా 2,527 276 నర్వ 2,446 286 మాగనూర్ 2,334 249 మరికల్ 2,279 112 గుండుమాల్ 1,516 246 కొత్తపల్లి 1,298 167 నారాయణపేట రూరల్: వేసవి సెలవుల విరామం తర్వాత ప్రభుత్వ, పైవ్రేట్ పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. తొలిరోజు అమావాస్య కారణంగా చాలామంది విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించేందుకు ఆసక్తి చూపలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 43,134 మంది విద్యార్థులకు గాను సోమవారం కేవలం 6,944 మంది విద్యార్థులు రాగా.. 16 శాతం హాజరు నమోదైంది. జూన్ 12వ తేదీనే పాఠశాలలు తెరవాల్సి ఉండగా.. రెండో శనివారం, ఆదివారం రావడంతో ప్రభుత్వం 15 వ తేదీకి వాయిదా వేసి జులై రెండో శనివారం పనిదినంగా ప్రకటించింఇ. అయితే జిల్లాలోని కొ న్ని ప్రైవేట్ పాఠశాలలు అమావాస్య, మంగళవా రం సెంటిమెంట్తో మొదటి పనిదినాన్ని 16, 17న పునః ప్రారంభ తేదీలుగా ప్రకటించుకున్నాయి. ● మొదటిరోజు జిల్లావ్యాప్తంగా 1వ తరగతిలో 96 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వారిలో 85 మంది అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన వా రే. మిగిలిన 11 మంది చిన్నారులు నేరుగా పాఠశాల కు వచ్చిన వారున్నారు. 37 మంది 6వ తరగతి లో, 13 మంది 8వ తరగతిలో, 16 మంది 9వ తరగతిలో చేరారు. మిగతా తరగతుల్లో 52 మంది ప్రవేశాలు పొందారు. మొత్తం 214 మంది విద్యార్థుల్లో 65 మంది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ పాఠశాలల్లో చేరారు. ప్రీ ప్రైమరీ తరగతులు.. రెగ్యులర్ పాఠశాలలతో పాటు ప్రీ ప్రైమరీ తర గతులను సోమవారం ప్రారంభించారు. గతేడాది ప్రారంభమైన 12 చోట్ల పాత ఇన్స్ట్రక్టర్లు, ఆయాలు విధులు నిర్వర్తిస్తుండగా.. ఈ ఏడాది మంజూరైన 44 పాఠశాలల్లో మాత్రం ప్రధానోపాధ్యాయులు ఆ బాధ్యతను తీసుకున్నారు. ఇన్స్ట్రక్టర్ల, ఆయాల నియామకానికి ఈ నెల 8 వరకు దరఖాస్తు గడువు ఉండగా.. ఇన్స్ట్రక్టర్లకు 600, ఆయా పోస్టుకు 130 మంది దరఖాస్తులు వచ్చాయి. నియామక ప్రక్రియ కలెక్టర్ చేయాల్సి ఉండగా.. మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. అందని యూనిఫామ్స్.. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్య, రాత పుస్తకాలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు పంపిణీ చేశారు. ప్రాథమిక తరగతులకు సంబంధించి వర్క్బుక్స్ పూర్తిస్థాయిలో రాకపోవడంతో పంపిణీ చేయలేదు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు ముద్రించిన వర్క్బుక్స్ జిల్లా స్టాక్ పాయింట్కు చేరకపోవడంతో వాటి పంపిణీ జరగలేదు. కోర్టు కేసుతో పాటు యూనిఫామ్ రంగు మార్చడంతో కుట్టేందుకు వస్త్రం రావడం ఆలస్యమవుతున్నందున పాత దుస్తులతోనే కొత్త తరగతుల్లో అడుగుపెట్టారు. విద్యార్థుల కిట్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీకి సిద్ధం చేస్తున్నందున జిల్లా నుంచి 108 మందికి సంబంధించిన పుస్తకాలు, నోట్బుక్స్ను ప్యాక్ చేసి హైదరాబాద్కు పంపించారు. పాఠశాలల ముస్తాబు.. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరించి తరగతులు ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలల్లో రంగులు వేసి ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని పాఠశాలల్లో మొదటిరోజు వచ్చిన విద్యార్థులపై పూలుజల్లుతూ స్వాగతం పలికారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పూలు అందించారు. మరికొన్ని చోట్ల సెల్ఫీ పా యింట్లు ఏర్పాటుచేసి పిల్లల ఫొటోలు దింపి వారి తల్లిదండ్రులకు వాట్సప్లో పంపించారు. చిన్నారులకు బెలూన్స్ అందించి సందడి చేశారు. -
సీఎం చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ
కోస్గి రూరల్: గుండుమాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయం ప్రారంభం, నాభి శిల విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాన్ని సీఎం రేవంత్రెడ్డి సోమవారం తన నివాసంలో ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గిలోని పార్టీ కార్యాలయంలో అవిష్కరించారు. ఈ నెల 16 న అగ్ని ప్రతిష్ఠాపనం, నవగ్రహలు, 17న విగ్రహాలకు మహోన్నవనం, ధాన్యాదివాసం, 18న విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ చేపట్టనున్నారు. గుండుమల్ ఉప సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్రావు, జాజిం వెంకటేష్, అంజియాదవ్ ఉన్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి నారాయణపేట: ప్రజలకు పారదర్శక, బాధ్యతాయుత సేవలు అందిస్తూ పోలీస్శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. ఇటీవల దామరగిద్ద, కోస్గి పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన నరేష్, పురుషోత్తం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. విధులను అంకితభావంతో నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు సత్వరం పరిష్కరించేలా పని చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, నేరాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చురుగ్గా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు నారాయణపేట: భారత రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రముఖ న్యాయవాది రఘువీర్యాదవ్కు రెడ్క్రాస్ సభ్యత్వాన్ని అందజేసి మాట్లాడారు. జిల్లాలోని అన్నిశాఖల అధికారులు, ఉద్యోగులు రెడ్క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైఫరీత్యాలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రెడ్క్రాస్ అందిస్తున్న సేవలు సమాజానికి ఎంతో ఉపయోగకరమన్నారు. జిల్లాలో రెడ్క్రాస్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్క్రాస్లో సభ్యులుగా చేరి సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ సెమిస్టర్లలో చదువుతున్న విద్యార్థుల డిగ్రీ ఫలితాలను వీసీ జీఎన్ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. డిగ్రీ రెండో సెమిస్టర్లో 36.24 శాతం మంది ఉత్తీర్ణతను సాధించగా, నాలుగో సెమిస్టర్లో 44.09, ఐదో సెమిస్టర్లో 66.97, ఆరో సెమిస్టర్లో 60.83 మంది ఉత్తీర్ణతను పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను పీయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అనురాధారెడ్డి, అరుంధతిరెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి
నారాయణపేట: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి శాశ్వత భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలల సమీపంలోని రహదారుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, జంక్షన్ల వద్ద హెచ్చరిక బోర్డులు, కల్వర్టుల వద్ద రేడియం స్టిక్కర్లు అంటించాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, డ్రైవ్ స్లో సూచికలు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్థానిక బస్టాండ్ వద్ద పండ్ల బండ్లతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పంపల్లి సమీపంలోని ఇరుకై న కల్వర్టుల వద్ద ప్రమాద అవకాశాలు అధికంగా ఉన్నందున ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కోస్గి బస్టాండ్ వద్ద జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశాలు ప్రతి నెల నిర్వహించి ప్రమాదాల నివారణ చర్యల పురోగతిని సమీక్షించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు పోషల్ రాజేష్, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్ర మోహన్, ఆర్అండ్బీ ఈఈ వెంకట్రాములు, నేషనల్ హైవే డిప్యూటీ ఈఈ మహ్మద్ సుభాన్, ఆర్టీఓ మున్ని తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి ప్రజావాణికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అర్జీదారుల వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరికి వివరించి అర్జీలు సమర్పించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. అలాగే ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు హాస్టళ్లలో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. జిల్లాలోని వీఐపీల జాబితా సిద్ధం చేయడంతో పాటు హౌసింగ్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. -
భూసేకరణలో చలనం
గద్వాల: ఉమ్మడి పాలమూరులో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల పరిధిలో చేపట్టాల్సిన భూ సేకరణపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన పెండింగ్ పనులు పూర్తిచేయాలంటే భూ సేకరణ కీలకమని తెలిసినా నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నిలదీశారు. ముఖ్యంగా గద్వాల జిల్లాలో భూసేకరణ సాగదీతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆర్అండ్ఆర్ కమిషనర్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణను 45 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం నిర్ధేశించారు. దీంతో ఇంతకాలం స్తబ్ధుగా ఉన్న అధికారుల్లో చలనం మొదలైంది. ● నడిగడ్డలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు కింద 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తయితే పూర్తిస్థాయి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ● 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. దీని కింద కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం ఉంది. ఈ భూమిని సేకరించాల్సిన ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవడంతో పనులకు అడ్డంకిగా మారింది. ● 7,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా గరిష్టంగా ఖరీఫ్ సీజన్లో 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందించడం లేదు. దీంతో రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. రిజర్వాయర్ కోసం 567 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. దాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం కింద రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా భూ సేకరణ ప్రక్రియే ప్రధాన అడ్డంకిగా మారింది. క్షేత్రస్థాయి పర్యటనతో.. సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ఉమ్మడి జిల్లాలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ క్రమంలోనే జలయజ్ఞం కింద చేపట్టిన ఆయా ప్రాజెక్టులు తుది దశలో ఉన్నప్పటికీ మిగిలిన పనులు పూర్తిచేయాలంటే వాటి కింద భూసేకరణ అడ్డంకిగా మారడంపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులలో నెలకొన్న భూ సేకరణ ప్రక్రియ జాప్యంపై అధికారులను క్లాస్ తీసుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసి పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నెట్టెంపాడు, గట్టు, ఆర్డీఎస్ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణను ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి 45 రోజుల్లో పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ పరిధిలో రైతులు పరిహారం డబ్బులు ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు రైతులు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే నెట్టెంపాడు పరిధిలో 200 ఎకరాలకుపైగా భూమి సేకరణ పూర్తయింది. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 45 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రిజ్వాన్బాషా షేక్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ప్రక్రియ ఆలస్యంపై సీఎం ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పరిధిలో 1,002, ఆర్డీఎస్ పరిధిలో 567 ఎకరాలు ప్రత్యేక టీంలతో 45 రోజుల్లో పూర్తి చేసేలా అధికారుల కసరత్తు ఆర్అండ్ఆర్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి
● బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ● మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్లో సమీక్ష సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కాంగ్రెస్ ప్రభు త్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యా యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు. చివరలో మిగిలిన పాలమూరు ప్రాజెక్టు పనులు చేపట్టకుండా.. రైతులకు సాగునీరు అందించకుండా ద్రోహం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా సమీక్షించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల తీరుపై నేతల వద్ద ఆరా తీశారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణ, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఒక్కరూ గుర్తించారని, ఆ పార్టీ అన్నివర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని జిల్లా నాయకులు కేటీఆర్కు వివరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ల వారీగా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని.. ఆ దిశగా కలిసికట్టుగా.. పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోగనున్న బడిగంట
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం –8లో u●నారాయణపేట రూరల్: నెలన్నర సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు ఆట పాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుండటంతో సోమవారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. వాస్తవానికి ఈ నెల 12న తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం 15కి వాయిదా వేసి జులై రెండో శనివారం పనిదినంగా ప్రకటించింది. ఓ పక్క సరైన సౌకర్యాలు లేకపోగా మరోపక్క ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న మాటలు హామీలకే పరిమతమవుతున్నాయి. కొత్త ఏడాది.. పాత సమస్యలు.. నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. సమస్యలు మాత్రం పాతవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. జిల్లాలోని కొన్ని పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం అందడంలేదు. దీనికితోడు స్వచ్ఛ విద్యాలయ పేరుతో నిర్మించిన మూత్రశాలలు వృథాగా ఉన్నాయి. చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేక ఒకేచోట బోధన సాగిస్తున్నారు. కొన్నిచోట్ల భవనాలు శిఽథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తిగాక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత.. ఉపాధ్యాయ పదోన్నతులతో చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఇక బదిలీలతో పట్టణాలకు సమీపంలోకి ఉపాధ్యాయులు రావడంతో మారుమూల ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. మరికొన్ని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇప్పటి వరకు వలంటీర్ల ఊసే లేకపోవవడంతో పరిస్థితి అగమ్యగోచరమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇక గతంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన రవాణా భత్యం సైతం పెండింగ్లో ఉంది. పాఠశాల శుభ్రతకు గతేడాది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కావెంజర్లను తీసుకున్నారు. ఈ ఏడాది వారిని కొనసాగించాలనే ఉత్తర్వులు ఇంకా రాలేదు. నాలుగు మండలాల్లో అల్పాహారం.. రెండేళ్లుగా మధ్యాహ్న భోజనం విషయంలో జరిగిన సమస్యలను అధిగమించడానికి ఈసారి ముందస్తుగా వంట ఏజెన్సీ నిర్వాహకులు, టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. జిల్లాలో కడా పరిధిలో వచ్చే మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లోని 123 పాఠశాలల్లో మొదటి విడతగా ఉదయం వేళలో అల్పాహారం అందించనున్నారు. వారంలో మూడురోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావా అదనంగా ఇస్తారు. త్వరలో మిగతా మండలాలల్లోని పాఠశాలలకు విస్తరించనున్నారు. కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం పుస్తకాలు, నోట్బుక్స్ సిద్ధం.. యూనిఫామ్స్ జాడ లేదు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు శిక్షణ పూర్తి కడా పరిధిలోని 123 పాఠశాలల్లో అల్పాహారం -
శ్రీశైలం దారిలో..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం దిశగా అడుగులు ● రూ.18,500 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ● తాజాగా ప్రధాని మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● కారిడార్ నిర్మాణంతో బ్రాహ్మణపల్లి– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మధ్య రవాణా సౌకర్యం మెరుగు ● ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి డీపీఆర్ పూర్తయింది.. ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్మించే కారిడార్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) పూర్తయింది. కేంద్రం జాతీయ వన్యప్రాణి సంరక్షణ బోర్డు అనుమతుల కోసం నివేదిక పంపాం. బోర్డు అనుమతులు వస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అనుమతుల కోసం ఎంపీల బృందం కేంద్ర మంత్రి నితీన్ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేయగా సానుకూలంగా స్పందించారు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు అచ్చంపేట: శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలంటే నల్లమల ఘాట్ రోడ్డు ఒక్కటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. దీనికితోడు ఘాట్ రోడ్డులో రాత్రిళ్లు ప్రయాణం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉండగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విన్నవించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పూర్తయితే బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– శ్రీశైలం, పెద్దదోర్నాల– శ్రీశైలం మార్గాల మధ్య దూరం తగ్గి.. రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి.. తెలంగాణ వైపు బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు 45.35 కి.మీ., ఏపీలోని పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41.39 కి.మీ.,తో కలిపి మొత్తం 86.74 కి.మీ. ఎత్తైన కారిడార్ నిర్మించనున్నారు. శ్రీశైలం ఆలయ సమీపం నుంచి వెళ్లేలా మార్పులతో కూడిన డీపీఆర్ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. ఇందుకు రూ.18,500 కోట్ల నిధులు అవసరం కాగా.. కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 2న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పూర్తయింది. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈగలపెంట– సున్నిపెంటల (లింగాలగట్టు) మధ్య తెలంగాణ– ఏపీలను అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై రూ.300 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతుల కోసం.. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనం కోసం భారత వన్యప్రాణి సంస్థ సహాయం తీసుకుంటున్నారు. వారి నివేదిక ఆధారంగా జాతీయ వన్యప్రాణి మండలి అనుమతులు పొంది.. త్వరలోనే పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు వస్తే.. కారిడార్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. నల్లమల అభయారణ్యం ప్రాంతం కావడంతో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 32 అడుగుల ఎత్తులో కారిడార్ నిర్మించనున్నారు. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం నిత్యం వెయ్యికిపైగా వాహనాలు వస్తుంటాయి. శని, ఆది, సోమవారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. గత ఏప్రిల్ 24న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ రహదారి మీదుగా శ్రీశైలం వెళ్తూ.. వాహనదారులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూశారు. ఈ క్రమంలోనే ఎలివేటెడ్ కారిడార్ మంజూరుకు సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. ఈ మార్గంలో అనేక మూల మలుపులు, ఘాట్ రోడ్డు ఉండటంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీశైలం దైవ దర్శనం కోసం వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 7న కృష్ణగిరి (ఈగలపెంట) సమీపంలో మలుపు వద్ద ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు రోడ్డు పక్కనున్న గోతిలో కూరుకుపోవడంతో 10 కి.మీ., మేర వాహనాలు నిలిచిపోయాయి. అటవీశాఖ సహకారంతో హైటికోస్ స్వచ్ఛంద సంస్థ శ్రీశైలం ప్రధాన రహదారిలో 2024 జూలై నుంచి 2025 జూన్ మధ్యకాలంలో ప్రమాదాలపై సర్వే నిర్వహించింది. ఏడాదిలో 51 రకాలకు చెందిన 456 వన్యప్రాణులు మృతిచెందినట్లు తేలింది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కారిడార్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. భూ సేకరణే కీలకం.. ఎలివేటెడ్ కారిడార్ స్తంభాల ఆధారంగా నిర్మించడం వల్ల అటవీ భూమి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. నల్లమలలో కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కీలకంగా మారింది. బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట, పాతాళగంగ వరకు 147.31 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా.. 128.63 హెక్టార్ల భూమి అటవీశాఖ పరిధిలోనే ఉంది. 18.68 హెక్టార్ల భూమి మాత్రమే పట్టాదారుల నుంచి సేకరించాల్సి ఉంది. -
దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కొత్తపల్లి (మద్దూరు): దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. ఆదివారం మద్దూరులోని మహిళా సమాఖ్య కార్యాలయంలో దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్, దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయనతో పాటు పట్టణ నాయకుడు జనార్దన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులందరికి స్కూటీలు, ట్రై సైకిళ్లు, వీల్చైర్లు తదితర ఉపకరణాలు అందేవిధంగా చూస్తామని, అవసరమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. యూడీఐడీ కార్డు అవసరం ఉన్న వారికి సంబంధిత జిల్లా అధికారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. వికలత్వం శరీరానికి కాని చేసే పనిలో కాదని.. దివ్యాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలని జనార్దన్ అన్నారు. కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకుడు మధుబాబు, జిల్లా నాయకులు తెలుగు వెంకటేష్, నరేందర్ గజలప్ప, సాయిబన్న, మున్నూర్ వెంకటయ్య, తోక రాములు, కమిట్మెంట్ కో–ఆర్డినేటర్ దస్తయ్య పాల్గొన్నారు. -
ఇబ్బందులను అధిగమిస్తాం..
కొత్త విద్యా సంవత్సరం సోమ వారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతుంది. గతంలో వివిధ పాఠశాలల్లో ప్రారంభమైన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. మౌలిక సౌకర్యాలైన తాగునీరు కల్పించి టాయిలెట్స్ వినియోగంలోకి తెస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖాళీల స్థానంలో తగిన చర్యలు తీసుకుంటాం. పాఠ్య, రాత పుస్తకాలు మొదటిరోజే అందిస్తాం. యూనిఫామ్స్ ఆలస్యం కానుంది. నాలుగు మండలాల్లో అల్పాహారం ప్రారంభం కానుంది. – గోవిందరాజు, జిల్లా విద్యాధికారి -
మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నారాయణపేట రూరల్: దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నితిన్ నందకర్ సూచించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి బీజేవైఎం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల సుదీర్ఘ పాలనలో మహిళలు, యువత, వృద్ధులు అన్నివర్గాల వారికి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. దేశ రక్షణ విషయంలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొ చ్చి కులమతాలు, పార్టీలకతీతంగా మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, పట్టణ అధ్యక్షుడు మణిశంకర్, నాయకులు ప్రవీణ్, చంద్రశేఖర్రెడ్డి, మోహన్, కార్తికేయ, ప్రకాష్, మణి, శివ, అంజి, రాజేష్, నవీన్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి ఊట్కూర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృథ్వి హెచ్చరించారు. మండలంలోని బిజ్వార్లో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. చివరి రోజు ఆయన ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. శిక్షణా తరగతుల్లో వి ద్యార్థి ఉద్యమాల చరిత్ర, భారత విద్యావ్యవ స్థ, విద్యార్థుల సమస్యలు, ప్రజాస్వామ్య హక్కు లు, సామాజిక మార్పులో విద్యార్థుల పాత్ర తదితర అంశాలపై వివిధ రంగాల ప్ర ము ఖులతో అవగాహన కల్పించామన్నారు. విద్యార్థులు సమాజంపై బాధ్యతతో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్ర భుత్వం రెండున్నరేళ్ల పాలనలో విద్యారంగ స మస్యలను పరిష్కరించడంతో విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లేదని వేలాది పాఠ శాలలను మూసివేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రైవే ట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు ల భారం పెరిగిందని.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇ బ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఫీజు రియింబర్స్మెంట్ను వి డుదల చేయాలని, పాఠశాలల్లో మౌలిక వస తులు కల్పించి, ఉపాధ్యాయుల కొరత తీర్చా లని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనిల్, నర్సింహారావు, దీక్షిత్, అజయ్, గణేశ్, సురేశ్, అనూష, రమ పాల్గొన్నారు. -
చదవడం.. రాయడం.. లెక్కగట్టడం
ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ నారాయణపేట రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) విద్యార్థులకు అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసి (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసుకునే పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగు సబ్జెక్టులకు.. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, గణితంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గణితం, తెలుగు, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థుల కోసం కృత్రిమ మేధా ఆధారిత ఏఎక్స్ఎల్ సహాయక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వారానికి రెండుసార్లు ప్రతిసారి 20 నిమిషాల పాటు ప్రత్యేక అభ్యాసన సెషన్లు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, పాఠశాలస్థాయిలో ఎఫ్ఎల్ఎన్ సెల్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన టీచర్ అండ్ బుక్స్, మైక్రో కంపిటెన్సీలు, బోధనా ప్రణాళికలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల అభ్యాసన పురోగతిని అంచనా వేయడానికి ఈ ఏడాది జులై 1 నుంచి 10 వరకు బేస్లైన్ టెస్ట్, నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు మిడిల్ లైన్ టెస్ట్, అదేవిధంగా 2027, మార్చి ఏడు నుంచి 17వ తేదీ వరకు ఫైనల్ లైన్ టెస్ట్ ద్వారా అంచనాలు నిర్ణయిస్తారు. పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలి.. ప్రతి ఎఫ్ఎల్ఎన్ పాఠం అనంతరం విద్యార్థులు వర్క్ షీట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని ఉపాధ్యాయులు వెంటనే మూల్యాంకనం చేసి అవసరమైన విద్యాసాయాన్ని అందించాలి. మల్టీ లెవెల్ తరగతుల్లో టీచర్ సపోర్ట్ గ్రూపులు, పీర్ సపోర్ట్ గ్రూపుల ద్వారా పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అదనపు శిక్షణ.. విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. రోజు పాఠశాల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గణితంలో అదనపు శిక్షణ ఇవ్వనున్నారు. డీఈఓ, ఎంఈఓలతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకాడమిక్ మానిటరింగ్ బృందాలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షణ చేయనున్నాయి. ప్రతి నెలా సమీక్షలు.. ప్రతి నెల 20వ తేదీన పాఠశాల స్థాయిలో, 27న మండలస్థాయిలో, 28న జిల్లాస్థాయిలో, 29న రాష్ట్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక పాఠశాలలో అదనంగా రోజు కనీసం 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించనున్నారు. 3వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థి ప్రాథమిక పఠన, రచన, గణిత సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ భావిస్తోంది. మద్దూరు మండలం భీంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ పిల్లల సర్వే (ఫైల్) జిల్లాలో ఇలా.. జిల్లాలో ఎఫ్ఎల్ఎం కార్యక్రమాన్ని పకడ్బందీగానిర్వహించి విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. ప్రాథమిక తరగతుల విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో చదవడం, రాయడం, గణితంలో సంఖ్యాజ్ఞానం పెంపొందించి మూడుసార్లు పరీక్షలు నిర్వహిస్తాం. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత సాయం అందిస్తాం. పర్యవేక్షణ కమిటీల ద్వారా నివేదికలు తీసుకుంటాం. – గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ఎస్ఎల్ఎన్ నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు చిన్నారుల అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి నెలవారీ సమీక్షలతో పర్యవేక్షణ -
అభివృద్ధి, సంక్షేమమే మోదీ ధ్యేయం
నారాయణపేట రూరల్: ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత స్వార్థం లేకుండా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 12 ఏళ్లుగా భారత ప్రధానిగా పనిచేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ప్రజల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం అనే సూత్రంతో నేడు ప్రపంచ నేతగా ఎదిగారని కొనియాడారు. శనివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల్లో అనేక స్కాములు జరిగాయని, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలతో సహా మీడియా కూడా తప్పుబట్టని స్వచ్ఛమైన పాలన మోదీ అందిస్తున్నారని తెలిపారు. దేశరక్షణకు ప్రాధాన్యమిస్తూ స్వదేశీ పరిజ్ఞానంతో మిస్సైల్స్ వరకు ఉత్పత్తి చేసి సత్తా చాటారన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ తీసుకొచ్చిన సడక్ యోజన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ రోజుకు దేశవ్యాప్తంగా 35 కిలోమీటర్ల హైవే నిర్మాణ పనులు సాగుతున్నాయని వివరించారు. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపారన్నారు. ఉచిత పథకాలు అమలు చేయకుండా రాయితీలిస్తూ ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నారని చెప్పారు. కేవలం అధికారం కోసం ఉచిత హామీలిస్తూ ఖజానా ఖాళీ చేశారని ఇండియా కూటమి పార్టీలను విమర్శించారు. కోవిడ్ సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రజలను కాపాడుతూ ప్రపంచ దేశాలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు. అనంతరం మోదీ చేసిన పనులకు సంబంధించి ముద్రించిన పుస్తకాలు విడుదల చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, రతంగ్పాండురెడ్డి, కొండయ్య, శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ప్రధానకార్యదర్శి లక్ష్మి, రఘురామయ్యగౌడ్, కెంచె శ్రీనివాస్ మంజుల, కిరణ్, పార్టీ జిల్లా, పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
విలీనానికి ఉన్నత స్థాయి కమిటీ
● 3 అంశాలపై కేబినెట్ సబ్ కమిటీప్రత్యేక దృష్టి ● మహబూబ్నగర్ ఆర్ఎం సంతోష్కుమార్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రభుత్వంలో టీజీఆర్టీసీ విలీనం చేసేందుకు గాను ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత ఏప్రిల్లో కార్మికుల సమ్మె అనంతరం వివిధ డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో 2021 వేతన సవరణను ఈనెల నుంచే అమలు చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ.. గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు, తదుపరి విలీన ప్రక్రియ ఉన్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రతి కార్మికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే అన్ని డిపోలలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన కార్మిక సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియలో ప్రత్యక్ష భాగస్వాములుగా చేస్తారన్నారు. వారి సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మిగతా డిమాండ్లపై కార్మిక సంఘాలతో టీజీఆర్టీసీ ఈడీల కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించడమే ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్నారు. ఎప్పటిలాగే సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు, కార్మికులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
మాకు న్యాయం చేయాలి..
మావి ఇనాం భూములు. 73 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నాం. వీటిపైనే ఆధారపడి మా కుటుంబాలు బతుకుతున్నాయి. 2012లో దేవాదాయ భూమిగా మార్చారంటూ నష్టపరిహారం ఇవ్వట్లేదు. మా మాటలను లెక్కచేయకుండా మా పొలంలో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. మాకు పరిహారం అందే వరకూ మా పొలంలో పనులు చేయొద్దని ఆర్డీఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. మాకు న్యాయం చేయాలి. – వైజునాధ్, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట పరిహారమిచ్చిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి.. కానుకుర్తి రిజర్వాయర్ ని ర్మాణంలో భాగంగా సర్వే నంబర్ 361, 383 381 382,387లో మొత్తం 10.6 ఎకరాల సాగు భూమిని కోల్పోయా. చివరగా ఉన్న మా భూముల్లో పనులు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ఈ వానాకాలం నారు పోసుకునేందుకు సిద్ధం చేస్తున్నా. పక్క గ్రామంలో ఈ సారి పంట వేయొద్దని చాటింపు వేశారట. మాకై తే ఎవ రూ చెప్పలేదు. పరిహారం పూర్తి స్థాయిలో అందజేసిన తర్వాతే భూమి స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు సాగు చేస్తాం. – ప్రకాష్ రెడ్డి, కానుకుర్తి, దామరగిద్ద, నారాయణపేట -
ఆర్థిక చేయూత..!
మహిళా సంఘాలకు రూ.304.37 కోట్లు ● 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రుణ లక్ష్యం ఖరారు ● రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు ● డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ●మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏటా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ఏడాది కూడా రుణ లక్ష్యం విధించి వందశాతం చేరుకునేలా దిశా నిర్దేశం చేశాం. గతేడాది జిల్లాలో వందశాతం రుణ లక్ష్యం చేరుకున్నాం. రుణ లక్ష్యంలో వెనకబడ్డ మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమయాత్తం చేస్తాం. – ఎన్.వెంకట్రాములు, డీఆర్డీఓ నర్వ: గ్రామీణ మహిళల సంఘటితానికి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.263.17 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు అదనంగా సీ్త్రనిధి రుణాలు రూ.41.20 కోట్లు కలిపి మొత్తం రూ.304.37 కోట్ల రుణాలు మంజూరుచేసి మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను సర్కారు ఏటా అందజేస్తోంది. నిర్దేశించిన రుణ లక్ష్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికే అధిగమించడానికి ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 8,094 సంఘాలు.. జిల్లాలో ప్రస్తుతం 8,094 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఆయా గ్రూపు సభ్యులు చేపట్టే వ్యాపారం మేరకు రూ.లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. చాలామంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న రుణాల రికవరీ శాతం సక్రమంగా ఉన్న కారణంగా ఈ ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగానే రుణాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే కాకుండా మహిళలు వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. వారు ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నా రో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా తీసుకునే రుణాలకు బృందం సభ్యులు పూచికత్తుగా ఉంటారు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తే మేలు.. మహిళా సంఘాలకు మంజూరు చేసిన రుణాల వడ్డీని ప్రభుత్వం ప్రతి నెలా విధిగా చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ వడ్డీ డబ్బులు సక్రమంగా రాకపోవడంతో మహిళలే చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు వారి ఖాతాల్లో జమ చేస్తోంది. గతేడాది వడ్డీ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వడ్డీ డబ్బులు ప్రతి నెలా చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. స్వయం సహాయక సంఘాల్లో 18 ఏళ్లు నిండి వివాహం అయిన వారిని మాత్రమే చేర్చుకుంటారు. అవివాహితులు, ప్రభుత్వ ఉద్యో గులు, ఉద్యోగుల భార్యలకు ఇందులో చోటు ఉండదు. దారిద్రరేఖకు దిగువన ఉన్న మహిళలకే ప్రథమ ప్రాధా న్యం ఉంటుంది. జిల్లాలో 2025–26 (గతేడాది) ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు ఇచ్చిన వార్షిక రుణ లక్ష్యాన్ని (బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి) దాదాపు అన్ని మండలాలు పూర్తిచేయగా... కోస్గి (54.15 శాతం), కృష్ణా (54.62), దామరగిద్ద (63.89), నారాయణపేట మున్సిపాలిటీలు (64.27 శాతం) బాగా వెనకబడ్డాయని అధికారులు పేర్కొన్నారు. -
కుల విద్వేషాన్ని రూపుమాపాలి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట: జిల్లాలో కులం అనే విద్వేషాన్ని రూపుమాపి ఎస్సీ, ఎస్టీ కేసులు లేకుండా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ తెగల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధ్యక్షతన జరిగిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఆయన మఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. కులం విషయంలో అవమానపడ్డ వ్యక్తిగా తాను కుల విధ్వేషాలను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని మంజూరు చేయిస్తామన్నారు. విద్యావ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలోని అన్ని తండాలకు బీటీరోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రతి తండాకు 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ రమేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు క్రాంతికుమార్, జనార్దన్, అశోక్, శంకర్, కిష్ణానాయక్ పాల్గొన్నారు. ఆగస్టు వరకు సిద్ధం చేయాలి.. జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం పనులు త్వరగా పూర్తిచేసి ఆగస్టు వరకు సిద్ధం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి, కలెక్టర్ ఛాంబర్ను చూసి పలు సూచనలు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని కోరారు. పంద్రాగస్టు వరకు వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. -
సమీకృత మార్కెట్ను వినియోగించుకోవాలి
నారాయణపేట: జిల్లా ప్రజలు సమీకృత మార్కెట్యార్డును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. శుక్రవారం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ (సమీకృత మార్కెట్) యార్డును ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమీకృత మార్కెట్యార్డులో వివిధ రకాల సేంద్రియ కూరగాయలతో పాటు పండ్లు, ఆహార ధాన్యాలు, మహిళా సంఘాలు ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. సేంద్రియ కూరగాయలు, ధాన్యాల కోసమే నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డును వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్ సముదాయంలో ఆయా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఏడీఏ సక్రియానాయక్, జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, పుర కమిషనర్ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ మంజుల, సత్యయాదయ్, సత్యమ్మ, భరత్, అరుంధతి, బండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులున్నా.. నత్తనడకే!
ముందుకుసాగని ఎత్తిపోతల మరమ్మతులు ● సరళాసాగర్ ప్రధాన పైప్లైన్.. ‘అమరచింత’ సెక్షన్ పైపులఏర్పాటులో ఆలస్యం ● మొదలైన వానాకాలం పంటల సాగు ● పనులు పూర్తయితేనే ఆయకట్టుకు నీటి విడుదల రైల్వే పనులతోనే ఆలస్యం.. రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్లైన్ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. – వరప్రసాద్, ఏఈ, రామన్పాడ్ జలాశయం అగ్రిమెంట్ పూర్తి కాలేదు.. అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ, ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్ ప్రధాన పైప్లైన్, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్ పైప్లైన్ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్ పైప్ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. -
సరళాసాగర్లో ఇలా..
సరళాసాగర్ జలాశయం కింద 9 గ్రామాల పరిధిలో 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి నారు పోసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. మదనాపురం సమీపంలోని ఊకచెట్టు వాగు వద్ద రెండో రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండగా రామన్పాడు వెనుక జలాల నుంచి సరళాసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రధాన పైప్లైన్ను తొలగించాల్సి వచ్చింది. దీంతో సరళాసాగర్ ప్రాజెక్టుకు సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పైప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో పాటు రూ.49.50 లక్షలు మంజూరు చేశారు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ పైప్లైన్ ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు పనులు వేగవంతం చేసినా మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సమయం దాటిపోతే ఈ ఏడాది వానాకాలం పంటలకు నీరందడం కష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నటికో..?!
● రెండేళ్లుగా ప్రారంభం కోసం ఎదురుచూపులు ● అందుబాటులోకి వస్తే పర్యాటకులకు మధురానుభూతి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో పార్కు ఏర్పాటు కొల్లాపూర్: కొల్లాపూర్ నుంచి సోమశిలకు వెళ్లే దారిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎకో పార్కు ప్రారంభం రెండేళ్లుగా పెండింగ్లో పడుతూ వస్తోంది. అడవులపై అవగాహన, జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి అందాల గురించి ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో దీనిని నిర్మించారు. అమ్రాబాద్ వ్యూ పాయింట్ తరహాలో ఎత్తైన కొండపై నుంచి నల్లమల అందాలు, కృష్ణానది ప్రవాహం తిలకించేలా ఇక్కడ వ్యూ పాయింట్ నిర్మించారు. పను లు పూర్తయ్యాయని అటవీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. రూ.1.50 కోట్లతో నిర్మాణం.. కొల్లాపూర్ నుంచి సోమశిల వెళ్లే దారిలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఐదేళ్ల క్రితం పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.1.50 కోట్లను హరిత, టీకేహెచ్ఎస్ ద్వారా కేటాయించి పనులు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. రెండేళ్ల కిందటే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పార్కు నుంచి వ్యూ పాయింట్కు వెళ్లే రోడ్డు కోతకు గురికావడంతో ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. తర్వాతి కాలంలో రోడ్డుకు మరమ్మతు చేసినా.. పార్కు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. షార్ట్ఫిల్మ్లకు వేదికగా.. పార్కు నుంచి అటవీ ప్రాంతం లోపల ఎత్తైన ప్రాంతంలో వ్యూపాయింట్ నిర్మించారు. పార్కు నుంచి వ్యూపాయింట్కు వెళ్లేందుకు వీలుగా కిలోమీటర్ మేర మట్టి రోడ్డు ఏర్పాటుచేశారు. రోడ్డుకు ఇరువైపులా ట్రెంచ్, కంచె నిర్మించారు. వ్యూ పాయింట్ వద్దకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు రెండు ప్రత్యే క వాహనాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. పార్కు నిర్వహణను ప ర్యవేక్షించేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశా రు. అధికారికంగా పార్కు ప్రారంభం కానప్పటికీ.. అనధికారికంగా పర్యాటకులు వ్యూ పాయింట్ వర కు వెళ్లేందుకు ఇటీవల కాలంలో అనుమతులు ఇస్తున్నారు. పార్కు ప్రారంభమైతే షార్ట్ఫిల్మ్ షూటింగ్లకు వ్యూపాయింట్ వేదికగా మారే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ – సోమశిల దారిలో నిర్మించిన అటవీ పార్కు త్వరలో ప్రారంభిస్తాం.. ఎకో పార్కులో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. వ్యూ పాయింట్ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. మట్టి రోడ్డు కోతలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పర్యాటకుల తాకిడిని బట్టి వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడతాం. వచ్చే నెలలో పార్కును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. – వాణికుమారి, ఫారెస్టు రేంజర్, కొల్లాపూర్ -
చట్టాలపై అవగాహన అవసరం
నారాయణపేట రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్వీఎస్ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలలు, మహిళలు చట్టాల గురించి తెలుసుకోవాలని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ రవాణా తదితర వాటిపై టోల్ఫ్రీ నంబర్ 1098కు గాని, స్థానిక పోలీసులకుగాని సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శేషమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇజ్రాయిల్లో ఉద్యోగాల కు దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇజ్రాయిల్ దేశంలో సంరక్షకుడు ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ కార్యాలయంలో కానీ, 94400 52081, 94400 51763 నంబర్లకు సంప్రదించాలన్నారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్ఎం జగన్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్టీసీ మహబూబ్నగర్ డిప్యూటీ ఆర్ఎం (మెయింటెనెన్స్) గా జగన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇటీవల హైదరాబాద్లోని వర్క్షాపు నుంచి ఇక్కడికి బదిలీ అయిన విష యం విదితమే. అనంతరం ఆర్ఎం సంతోష్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ధాన్యం @ రూ.2,926 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,926, కనిష్టంగా రూ.1,741 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,051, కనిష్టంగా రూ.1,651, వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,956, కనిష్టంగా రూ.4,611, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,950, కనిష్టంగా రూ.6,640 ధరలు పలికాయి. -
సేవలు విస్తరిస్తాం..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూనివర్సిటీ సేవలను విస్తరించి.. జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలో పీజీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం లభించింది. ప్రభుత్వం నుంచి జీఓ వస్తే ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు వనపర్తి పీజీ కళాశాల హాస్టళ్ల నిర్మాణం కోసం 5 గుంటల భూమిని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. – జీఎన్ శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పీయూ ● -
ధాన్యం పంచాయితీ.. రాజధానికి
వనపర్తి: జిల్లాలో గడిచిన పదేళ్లలో వరి సాగు, ఉత్పత్తి రికార్డుస్థాయిలో పెరగగా.. అంతేస్థాయిలో ధాన్యం నిల్వల మాయం, కేటాయింపుల్లో లోపాలు, రవాణా కాంట్రాక్టర్ల అక్రమాలు సైతం పెరిగాయి. కొంతకాలంలో జిల్లా నుంచి టాస్క్ఫోర్స్ అధికారులకు తరుచూ వెళ్తున్న ఫిర్యాదులతో వరుస దాడులు చేస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగు చూడటం గమనార్హం. కొన్ని మిల్లుల్లో రూ.కోట్ల విలువజేసే ధాన్యం కాగితాల్లో కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాయం చేస్తూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. ● 2025, నవంబర్ 13న పెద్దమందడి మోజర్ల సమీపంలోని రెండు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా.. సుమారు రూ.12.50 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించి మిగతా ధాన్యాన్ని సీజ్ చేశారు. గత నెల 22న తిరిగి అవే మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేసి సీజ్ చేసిన మిగులు ధాన్యం నిల్వలను పరిశీలిస్తే సుమారు రూ.9 కోట్ల విలువజేసే ధాన్యం అక్కడ లేకపోవడం విస్మయానికి గురిచేసింది. సీజ్ చేసిన ధాన్యం ఎలా మాయమవుతుందనే విషయంపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం, రూ.కోట్ల విలువజేసే ధాన్యం సంరక్షించాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు వెల్లడించడానికి విముఖత చూపిస్తున్నారు. ● కొత్తకోట మండలం నాచాంపేట శివారులోని ఓ కొత్త మిల్లుకు గత సీజన్లో రూ.6.50 కోట్ల వరి ధాన్యం అధికారులు కేటాయించారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 9న టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. సుమారు రూ.2.50 కోట్ల విలువైన ధాన్యం మాయమైంది. ఇది చూసిన జిల్లా ఉన్నతాధికారులతో పాటు టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో కొందరు అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క.. రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటూ బియ్యం అడిగినప్పుడు రీసైక్లింగ్ పద్ధతిన సీఎస్సీకి అప్పగిస్తూ ఒక ప్రణాళికతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. అధికారులపై ఫిర్యాదుల వెల్లువ.. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులపై మొదటి నుంచి ఫిర్యాదు చేస్తున్న బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వరుస టాస్క్ఫోర్స్ దాడులు జరిగిన మిల్లుల్లో వరి ధాన్యం నిల్వలు మాయం కావడంపై బుధవారం రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా అవినీతి బాగోతం రాజధాని చేరినట్లయింది. ఈ విషయంపై వారు స్పందించి సమగ్ర విచారణ చేస్తారా? లేక జిల్లా అధికారుల మాదిరిగానే నిమ్మకుంటారనే విషయంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. రైస్మిల్లులపై వరుస టాస్క్ఫోర్స్ దాడులు కనిపించని రూ.కోట్ల విలువజేసే వరి ధాన్యం తూతూమంత్రంగా వనపర్తి అధికారుల చర్యలు చేసేది లేక రాష్ట్రస్థాయిఉన్నతాధికారులకు ఫిర్యాదులు


