Narayanpet
-
నేతన్నలను ఆదుకుంటాం
అమరచింత: పట్టణంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో వస్త్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న నేత కార్మికులతో పాటు కుట్టు శిక్షణలో నైపుణ్యం పొందిన మహిళలకు నాబార్డు తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీజీఎం ఉదయభాస్కర్ తెలిపారు. పట్టణంలోని చేనేత ఉత్పత్తుల కంపెనీని నాబార్డు సీజీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన శుక్రవారం సందర్శించి రోలింగ్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేతన్నలు తయారు చేసిన చీరలు రోలింగ్ కోసం గద్వాలకు తీసుకెళ్లకుండా ఇక్కడే చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. మహిళలు కుట్టు శిక్షణ పొందడమే గాకుండా పలు రకాల డిజైన్ల వస్త్రాలను కుట్టడంలో మెళకువలు నేర్చుకున్నారని చేనేత ఉత్పత్తుల సంఘం కంపెనీ సీఈఓ మహంకాళి శేఖర్ వివరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ తయారు చేస్తున్న వస్త్రాలు జాతీయ, అంతర్జాతీయస్థాయితో పాటు ఆన్లైన్ మార్కెటింగ్కు కావాల్సిన మద్దతునిస్తామని హామీనిచ్చారు. అనంతరం మగ్గాలపై జరీ చీరలు తయారు చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి ఆదాయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తాము సైతం కంపెనీ యజమానులమని.. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి లాభాలు సమానంగా చేరుతాయని కార్మికులు వివరించారు. కార్యక్రమంలో నాబార్డు డీజీఎం దీప్తి సునీల్, డీడీఎం మనోహర్రెడ్డి, ఆర్డీఎస్ సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, కంపెనీ డైరెక్టర్లు పబ్బతి వెంకటస్వామి, అశోక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
నారాయణపేట: బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డీసీసీ సమావేశానికి చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్గా లీడ్ బ్యాంక్ మేనేజర్ వ్యవహరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ నుంచి ఏజీఎం శ్రావ్య, నాబార్డ్ నుంచి డీడీఎం షణ్ముఖచారి, ఎస్బీఐ ఏజీఎం రాంమూర్తి, టిజిబి రిజినల్ మేనేజర్ సత్యనారాయణ, యుబిఐ నుంచి శ్రీనివాసమూర్తి , వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగునిర్ణయాలు తీసుకున్నారని ఎల్డిఎం విజయ్కుమార్ తెలిపారు. అంతకుముందు వార్షిక ప్రణాళిక సంబంధించిన 2024–25 మార్చి 25తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.2514.18 కోట్లతో వృద్ధి, వార్షిక ప్రణాళికలో ఇది 76.93 శాతమని, మే సెగ్మెంట్ సంబంధించి రూ.153.92 కోట్లతో 61.04 శాతం ప్రగతి, ప్రాధాన్యత రంగానికి రూ.2,070 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్డీఎం పేర్కొన్నారు. వార్షిక రుణప్రణాళిక 2025–26 గాను రూ.4204.49 కోట్ల రుణ లక్ష్యంతో ఏసీపీ 2025–26 పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఇందులో రైతులకు పంట రుణాలు రూ.2,195.07, వ్యవసాయ ఇతర మౌలిక సదుపాయలకు రూ.1,275.87 కోట్లు మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.3,470.93 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రూ.148 కోట్లు, చిన్న తరహా పరిశ్రమలకు రూ.162.30 కోట్లు మంజూరు చేయాలని నిర్ధేశించారు. నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలి జిల్లాలో ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహిస్తూ టీజీ పాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను నిబంధనల మేరకు నిర్ధేశిత గడువులోగా ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాల్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈ నెల 28న ఉన్నందున కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖ వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసంతో ఉపాధి రాజీవ్ యువ వికాసం ద్వారా అనేక మంది ఉపాధి పొందుతారని కలెక్టర్ అన్నారు. శుక్రవారం రాజీవ్ యువ వికాసం పథకం పర్చేజ్ కమిటీ ఫర్ ఆల్ కార్పొరేషన్స్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాజీవ్ వికాసం దరఖాస్తుదారులకి ఫైనాన్షియల్ అసిస్టెంట్, గ్రౌండింగ్ తదితర వాటిపై సమీక్షించారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిఎస్సి కార్పోరేషన్ అబ్దుల్ ఖలీల్, ఎల్డీఎం విజయ్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో హైదరాబాద్, మహబూబ్నగర్ క్రికెట్ అసోషియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత క్రికెట్ సమ్మర్ క్యాంప్లో పాల్గొని మాట్లాడారు. క్రీడా రంగంలో రాణించడం వల్ల భవిష్యత్లో ఉద్యోగ కల్పనలో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అదే విధంగా శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొని భవిష్యత్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా విద్యా శాఖ ఏఎంఓ నాగార్జున రెడ్డి, ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, క్రికెట్ కోచ్ అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు. కళలకు జీవం నారాయణపేట రూరల్: సాంప్రదాయ శాసీ్త్రయ కళలకు జీవం పోస్తున్నది బాలకేంద్రాలే అని, చిన్నారులు తమకు నచ్చిన కళల్లో శిక్షణ తీసుకోవాలని డీఈఓ గోవిందరాజు అన్నారు. శుక్రవారం బాలకేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ ఎలా ఇస్తున్నారంటూ విద్యార్థులను ఆరా తీశారు. చిన్నారులు చక్కటి కళలను నేర్చుకునేందుకు సహకరిస్తున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఓ నాగార్జున్ రెడ్డి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, సంగ నర్సింహులు, వసంత్ కుమార్, జ్ఞానామృత రమణ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు44 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో గురువారం కొనసాగిన ఇంటర్ సప్లిమెంటరీ రెండో రోజు పరీక్షకు మొత్తం 44మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు జనరల్ విభాగంలో మొత్తం 780 మంది విద్యార్థులకు గానూ 742 మంది విద్యార్థులు హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 53 మందికి 52 మంది హాజరయ్యారు. అలాగే, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 79 మందికిగాను 74 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరయ్యారని డీఐఈఓ సుదర్శన్రావ్ తెలిపారు. క్రీడా అకాడమీప్రవేశాలకు ఎంపికలు నారాయనపేట ఎడ్యుకేషన్: రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా, వసతి గృహల్లో 2025–2026 సంవత్సరానికిగానూ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసులు, క్రీడాల శాఖాధికారి వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హులైన క్రీడాకారులు జూన్ 12, 13న రెండు రోజుల పాటు మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహిస్తారని, ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని తెలిపారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,281 జడ్చర్ల/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2281, కనిష్టంగా రూ.1,501 ధరలు లభించాయి. ఆముదాలు రూ.6,066, చింతగింజలు రూ.3,457, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,701, కనిష్టంగా రూ.1,629, ఆన్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,159, కనిష్టంగా రూ.1,609, వేరుశనగ గరిష్టంగా రూ.5,326, కనిష్టంగా రూ.4,431 ధరలు లభించాయి. నవాబ్పేట మార్కెట్కు శుక్రవారం 11వేల బస్తాల ధాన్యం వచ్చింది. సీడ్ (1010) ధాన్యం రూ.1967 ధర పలకగా.. ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.1944 ధర లభించింది. జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. దేశ సమైక్యత కోసమే జైసంవిధాన్ యాత్ర పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్రావు, చిన్నయ్య, ఎల్లయ్య కృష్ణయ్య పాల్గొన్నారు. -
బాలికా విద్యకు భరోసా
మరో మూడు కేజీబీవీలు ఇంటర్కు అప్గ్రేడ్ మరికల్: విద్యార్థినుల విద్యాభ్యున్నతి కోసం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు/ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన అందించేవారు. ఇంటర్ విద్య అందుబాటులో లేకపోవడంతో పలువురు చదువు మధ్యలోనే ఆపేసిన సందర్భాలున్నాయి. దీన్ని అధిగమించేందుకు వాటిలో పలు కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. తద్వారా ఇప్పటికే జిల్లాలో 8 అందుబాటులో ఉండగా ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలు అప్గ్రేడ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వాటి సంఖ్య 11కు చేరుకుంది. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైన వారితోపాటు అనాథలైన విద్యార్థినులకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రత్యేక కోర్సులు జిల్లాలోని 11 కేజీబీవీల్లో 8 కేజీబీవీలో ఇప్పటి వరకు ఇంటర్ కోర్సులు ఉండేవి. 2025–26 విద్యా సంవత్సరానికి మరికల్, మాగనూర్, కోస్గి కస్తూర్బాల్లో ఇంటర్ తరగతులు నిర్వహించనున్నారు. ఈ మూడు కేజీబీవీలను ఇంటర్కు ఆప్గ్రేడ్ కావడంతో మరికల్ కేజీబీవీలో బైపీసీ, అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్, కోస్గి కస్తుర్బాలో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ(ఎప్), మాగనూర్ కేజీబీవీలో బైపీసీ, ఎంఎల్టీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ విద్య సంవత్సరం నుంచే పాత కేజీబీవీలతో పాటు కొత్తగా ఏర్పడిన మరికల్, మాగనూర్, కోస్గి మండలాల్లో ఇంటర్ కళాశాలల ప్రారంభానికి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రూప్లో 40 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. జూన్లో ఇంటర్ ప్రవేశాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అధిక శాతం అనాథ, పేద బాలికలు వీటిలో చదువుకునే అవకాశం కల్పిస్తారు. నిరుపేదలు.. తల్లి, తండ్రిని కోల్పోయిన వారు.. అనాథలైన విద్యార్థినులకు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లు అండగా నిలుస్తున్నాయి. చదువుతో పాటు వసతి కల్పించడంతో చాలా మంది ఇందులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు పదో తరగతి పూర్తయ్యాక.. ఇంటర్ చదువులకు కుటుంబసభ్యులు ఒప్పుకోక, వేరే ప్రాంతాలకు పంపించలేక చాలా మంది చదువులు మధ్యలోనే ఆపివేసేవారు. మరికొందరికి చిన్నతనంలోనే వివాహాలు చేసేవారు. ఈక్రమంలో ప్రభుత్వం కేజీబీవీలను ఇంటర్కు అప్గ్రేడ్ చేయడంతో ఎంతో మంది విద్యార్థినులకు ఉన్నత చదువులకు భరోసాగా నిలవనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఈ ఏడాది ఇంటర్ విద్యార్థినులు సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 11 కు చేరిన ఇంటర్ విద్యాలయాలు ఈ ఏడాది ఇంటర్లో 84 శాతంఉత్తీర్ణతతో విద్యార్థినుల రాణింపు చదువుతోపాటు వసతి కల్పించడంతోచేరికకు ఆసక్తి ఎంతో ప్రయోజనం ఈ ఏడాది మరో మూడు కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది విద్యార్థినులకు ఎంతో ప్రయోజనం. కొత్తగా కంప్యూటర్ సైన్స్ కోర్సులను తీసుకురావడం హర్షణీయం. ఇంటర్ ప్రవేశాలకు వచ్చిన దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తాం. – నర్మద, జీసీడీఓ, నారాయణపేట -
మెరుగైన విద్యాబోధన..
జిల్లాలో 13 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అన్నింటిలో పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగతుండగా.. ముందుగా నారాయణపేట, ధన్వాడ, మక్తల్, దామరగిద్ద, ఊట్కూర్ కస్తూర్బాలలో ఇంటర్ తరగతులు నిర్వహిస్తు వస్తున్నారు. అనంతరం నర్వ, మద్దూరు, కృష్ణా కేజీబీవీలను అప్గ్రేడ్ చేశారు. ఈ విద్యాలయాల్లో వసతితోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ప్రస్తుతం మైనారిటీ, జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ గిరిజన కళాశాలలు ఉన్నప్పటికీ ఆయా కేటగిరీల వారికి అత్యధిక శాతం సీట్లు కేటాయిస్తోంది. దీంతో పేద వారికి, అనాథలకు సీట్లు లభించే పరిస్థితి లేకపోవడంతో కస్తూర్బాలోనే ఇంటర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రతిభ కనబర్చారు. తాజాగా మరికల్, కోస్గి, మాగనూర్ కేజీబీవీలను ఇంటర్ తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఆప్గ్రేడ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. -
సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం
మక్తల్/నర్వ: సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నర్వలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అబ్జర్వర్లు సంధ్యారెడ్డి, వేణుగౌడ్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన పార్టీ కార్యవర్గాలను, మండల కార్యవర్గాలను పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యవర్గాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించాలని, పార్టీ సూచనల మేరకు ఎన్నిక నిర్వహించి కార్యవర్గాలను పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగిరేలా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కొత్తకోట సిద్దార్థారెడ్డి, పోలీస్ జగన్మోహన్రెడ్డి, జగదభిరామ్రెడ్డి, చెన్నయ్యసాగర్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శరణప్ప, వివేకవర్దన్రెడ్డి, రాధమ్మ, రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రోగులకు ఉచిత భోజనం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా భోజనం అందజేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం ఆయన మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజనాన్ని అందించి ప్రారంభించారు. అంతకు ముందు మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వమించారు. కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ అధ్యక్షుల నియామకం కొరకు అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించారు. -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో రోడ్లు, కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డీపీఓ గ్రామ పంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పాత ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ సంబంధించి పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సీపీఓ ఇరిగేషన్ వారు రిపోర్టు పంపాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ గతేడాది మద్దూర్, మరికల్లో వర్షాలు అధికంగా కురవడం వల్ల అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
జీపీఓ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: ఈ నెల 25న జరిగే గ్రామ పాలన ఆఫీసర్ (జీపీఓ) పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగే జీపీఓ పరీక్షలో 109 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. నారాయణపేటలోని శ్రీవేద సరస్వతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినట్లు అభ్యర్థులు హాల్ టికెట్లపై హెచ్ఓడీ అటెస్ట్ చేయించాలన్నారు. అలాగే ఐడి ఫ్రూఫ్ తీసుకొని పరీక్షకు హాజరుకావాలని హెల్ప్లైన్ నంబర్ 9154283913 ఉంటుందని తెలిపారు. ఈ పరీక్ష కేంద్రాలలో ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తారని, ఆర్డీఓ పర్యవేక్షిస్తారని తెలిపారు. డీఈఓ సీసీ కెమెరాలు.. అభ్యర్థుల హాజరు, గుర్తింపు విధులను నోడల్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీఎంహెచ్ఓ పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీటీఓ హరిప్రసాద్, ఏఓ జయసుధ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆహార నియమాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: అసంక్రమిక వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. పౌష్టికాహారం, సరైన నిద్ర తప్పనిసరిగా అవసరమని డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్ అన్నారు. మండలంలోని అప్పక్పల్లి సమీపంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఎన్సీడీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవనశైలిలో మార్పుతో పాటు ఆహార నియమాలు పాటించకపోవడంతోనే అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లు ఉండాలని, ప్రతిరోజు కొంత సమయం యోగా, మెడిటేషన్కు కేటాయించాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలను పాటించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన ఎన్సీడీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్దుల్ వాసే కార్యక్రమ లక్ష్యాలు, హైపర్ టెన్షన్, డయాబెటిస్, బెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్, అసంక్రమిక వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను రోగులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శైలజ, సత్య ప్రకాశ్ రెడ్డి, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ
నారాయణపేట: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో భాగ్యరెడ్డివర్మ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత సమాజోద్దరణ, అంటరానితనం, మహిళల బాలికల విద్య కోసం ఎంతో కృషి చేశారని, జోగినీ వ్యవస్థ తొలగించడానికి పాటుపడ్డారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్, ఏఓ జయసుధ, అధికారులు ఉమాపతి, అబ్దుల్ ఖలీల్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. దళిత వైతాళికుడు.. దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డివర్మ అని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి పునాది వేశాడని కొనియాడారు. ఏఎస్పీ రియాజ్హుల్ హక్, ఆర్ఎస్ఐలు శివశంకర్, మద్దయ్య పాల్గొన్నారు. -
శరవేగంగా పాలమూరు..!
పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్యాకేజీ–1, 5 , 8లో భాగంగా పంప్ హౌస్లలో మోటార్ల బిగింపు పూర్తయింది. నార్లాపూర్లో నాలుగు, ఏదుల, వట్టెంలో ఐదు చొప్పున మోటార్లు ఏర్పాటు చేశారు. నార్లాపూర్లో మరో రెండు మోటార్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ రెండు మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా.. మిగతా వాటి పనులు జరుగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు వట్టెం పంప్ హౌస్ నీట మునగగా.. అప్పటి వరకు ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లు దెబ్బతిన్నాయి. వీటిని మరమ్మతు చేయడంతోపాటు మరో మోటారు ఏర్పాటు చేశారు. మొత్తంగా నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు జలాశయాల వరకు నీటిని ఎత్తిపోసేలా.. ఆ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసేలా అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఉదండాపూర్లో జఠిలంగా పరిహారం.. పాలమూరులో భాగంగా చేపట్టిన కరివెన రిజర్వాయర్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే కాల్వకు కీలకమైన వయాడక్ట్ ఏర్పాటులో భూసేకరణ సమస్యగా మారినట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఎకరాల భూ సమస్య కోర్టులో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇది ఓ కొలిక్కి వస్తే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు అంటే ఈ ఏడాది డిసెంబర్ వరకు అటు ఇటుగా కరివెన జలాశయాన్ని నీటితో నింపి.. పంటలకు సాగు నీరందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. పరిహారం రూ.800 కోట్లు అవసరం ఉండగా.. ఇందులో రూ.72 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న వారు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ పూర్తికి ప్రభుత్వం 2027 మార్చి వరకు గడువు నిర్దేశించినట్లు సమాచారం. రిజర్వాయర్లో నీరు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ డెడ్లైన్.. డిసెంబర్ మిగతా పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి డెడ్లైన్.. కృష్ణా పరివాహకంలోని ప్రాజెక్ట్ల స్థితిగతులపై ఇటీవల జలసౌధలో పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ను ఉదండాపూర్ జలాశయం వరకు మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని..18 నెలల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లోపు మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం.. వచ్చే ఏడాది జూన్లోపు కోయిల్సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పనులు పూర్తి చేయించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. డిసెంబర్లో సాగు నీరందిస్తాం.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్పై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నిధుల సమస్య లేదని.. పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న పనులను ముమ్మరం చేశాం. డిసెంబర్లోపు నార్లాపూర్ నుంచి కరివెన వరకు పనులు పూర్తి చేస్తాం. నాలుగు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 48.94 టీఎంసీలు కాగా.. అన్నింటినీ నీటితో నింపుతాం. వీటి పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిసెంబర్ నుంచే సాగు నీరందించే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచాం. – విజయభాస్కర్ రెడ్డి, సీఈ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 4 రిజర్వాయర్లు పూర్తి.. 14 మోటార్లు సిద్ధం -
నెలాఖరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
మద్దూరు: భూ భారతి చట్టం కింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిలో వచ్చిన దరకాస్తుల పరిశీలనపై ఆర్డీఓ రాంచందర్నాయక్తో కలిసి సమీక్షించారు. తిరస్కరించిన దరఖాస్తులపై ఖచ్చితమైన స్పష్టత ఉండాలని, ఎందుకు తిరస్కరించామనే కారణాన్ని రైతులకు చెప్పాలని సూచించారు. ఈ నెలాఖరునాటికి వంద శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యలకు చట్ట ప్రకారం పరిష్కారం చూపే బాధ్యత అధికారలదేనని స్పష్టం చేశారు. విరాసత్ దరఖాస్తుల పరిష్కారానికి నిబంధలను అనుసరించాలని, పైలెట్ మండలంలో అధికారులు భూ సమస్యలకు చూపించే పరిష్కారాలే మళ్లీ కొత్తగా ఎంపిక చేసే ఒక్కో ఫైలెట్ మండలాల్లో వర్తింప చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఒకటి రెండు సార్లు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
విషాదం నింపిన ప్రమాదం
గద్వాల క్రైం: కుటుంబసభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అయితే అప్పటి వరకు బాలుడు ప్రవీణ్.. తల్లిదండ్రులు, తోబుట్టువులతో స్వరాష్ట్రానికి వెళ్తున్నానంటూ ఆనందంతో గడిపాడు. సంతోషంగా సాగుతున్న వారి ప్రయాణంలో ఒక్కసారిగా జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కారులో చిక్కుకొని కుటుంబసభ్యులు కళ్లముందే మృతి చెందడంతో ప్రవీణ్ అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు భాస్కర్ (41), అతని తల్లిదండ్రుల స్వగ్రామం మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామం కాగా, బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గద్వాలకు వలస వచ్చారు. పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తెలుగు భాస్కర్ బీటెక్ పూర్తి చేసిన అనంతరం కెనరా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. మేనమామ కూతురు పవిత్ర (38)ను వివాహం చేసుకొని గద్వాలలోనే కొన్నేళ్లు క్యాషియర్గా జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే 2022 సంవత్సరంలో పదోన్నతి పొందడంతో కుటుంబసభ్యులతో కలిసి మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి మండలంలోని కెనరా బ్యాంకులో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్కు బదిలీ కావడంతో బుధవారం కుటుంబసభ్యులతో కలిసి కారులో బయల్దేరాడు. ఈక్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు భాస్కర్, అతని భార్య పవిత్ర, కుమార్తె జ్యోత్స్న (9), అభిరాం (7)తో పాటు కారు డ్రైవర్ (41)మృతిచెందగా..మరో కుమారుడు ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలియడంతో అటు గద్వాల, మల్దెందొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకకు బయలు దేరారు. కొన్ని నిమిషాల ముందు వరకు కుటుంబసభ్యులతో సంతోషంగా కారులో బయలుదేరిన ప్రవీణ్... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అమ్మానాన్నతో పాటు అక్క, తమ్ముడిని కోల్పోయి అనాథగా మారాడు. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గద్వాల వాసులు మృతి మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారే తల్లిదండ్రులు, తోబుట్టువులను కోల్పోయి అనాథగా మారిన బాలుడు గద్వాలలోని బీసీ కాలనీలో విషాదఛాయలు -
నిలిచిన ‘సీయూఈటీ’
షార్ట్సర్క్యూట్ కారణంగా పనిచేయని కంప్యూటర్లు వర్షంలో తడుచుకుంటూ వచ్చాం.. రాత్రి 2 గంటలకు గద్వాల నుంచి బయలుదేరి, ఉదయం 6 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాం. షార్ట్ సర్క్యూట్తో పరీక్ష నిలిచిపోతే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ పోతే మేమేం చేయాలని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు పరీక్ష కేంద్రం ఎందుకు పెట్టుకోవాలి. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి మా పిల్లలకు న్యాయం చేయాలి. – సునీత, విద్యార్థిని తల్లి, గద్వాల పరీక్ష జరగలేదు. సీయూఈటీ పరీక్ష రాసేందుకు రాత్రి బయలుదేరి మద్దూరు నుంచి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక షార్ట్ సర్క్యూట్తో కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో పరీక్ష రాయకుండా వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి. – మహేశ్కుమార్, విద్యార్థి, మద్దూరు ● మహబూబ్నగర్ ‘ఫాతిమా’ స్కూల్ కేంద్రంలో పరీక్షకు దూరమైన 180 మంది విద్యార్థులు ● న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) స్థాయిలో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు) నిర్వహిస్తోంది. వివిధ గ్రూపుల విద్యార్థులు ఈ నెల 13 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 180 మంది విద్యార్థులు బుధవారం ఉదయం సెషన్ 9 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉదయం వర్షం కారణంగా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఉన్న ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కంప్యూటర్లు సైతం ఆఫ్ అయ్యాయి. గంట తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా.. మళ్లీ 10 నిమిషాల్లోనే మరోసారి షార్ట్ సర్క్యూట్తో సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 180 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో వారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా కొనసాగిన పరీక్ష దేశవ్యాప్తంగా 60కి పైగా సెంట్రల్ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు ఆన్లైన్లో ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి రూ.950 చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం దేశవ్యాప్తంగా పరీక్ష కొనసాగగా.. ఒక్క మహబూబ్నగర్లోని ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రంలో మాత్రం జరగలేదు. పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం కూడా బయటికి వచ్చాక.. మరోసారి పరీక్ష ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఫాతిమా విద్యాలయ ప్రిన్సిపాల్ థెరిస్సా మాదను స్పందిస్తూ.. పరీక్ష నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి) సమాచారం ఇచ్చామని.. మరోసారి పరీక్ష నిర్వహించే విధంగా ఎన్టీఏ చర్యలు తీసుకుంటుందని చెప్పినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఏపీ ఎంసెట్ వదులకున్నా.. పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటసేపు వరకు పునరుద్ధరించలేదు. అప్పటికే సమయం కూడా ముగిసింది. అనంతరం పరీక్ష నిర్వాహకులు వచ్చి పరీక్షకు మరోసారి ఎన్టీఏ వారు సమాచారం ఇస్తారు.. అప్పడు వచ్చి పరీక్ష రాయాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసి ఇక్కడ మాత్రం నిర్వహించలేదు. ఏపీ ఎంసెట్ వదులుకుని ఈ పరీక్షకు వచ్చాను. న్యాయం చేయాలి. – సాయివర్షిణి, విద్యార్థి, మరికల్ మరో అవకాశం ఇవ్వాలి.. సీయూఈటీ పరీక్ష రాయడానికి మరికల్ నుంచి వచ్చాను. కొన్ని రోజులుగా పరీక్ష కోసం సిద్ధమయ్యాను. తీరా పరీక్షకు వస్తే విద్యుత్ సరఫరా నిలిచిపోయి కంప్యూటర్లు పనిచేయలేదు. ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహిస్తుందా.. లేక రీషెడ్యూల్ చేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి. – రామకృష్ణ, విద్యార్థి, మరికల్ -
క్రీడారంగ అభివృద్ధికి కృషి
నర్వ/మక్తల్: ఔత్సాహిక క్రీడాకారుల ఇబ్బందులు తీర్చేందుకే జాండ్రగుట్ట వద్ద క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటీ శ్రీహరి అన్నారు. బుధవారం సాయంత్రం నర్వ జాండ్ర గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల, క్రీడామైదానానికి అనుమతి పత్రాన్ని వారు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ. 60 లక్షల నిధులు క్రీడామైదానం ఏర్పాటు కోసం కేటాయిస్తున్నట్లు శివసేనారెడ్డి ప్రకటించి ఇందుకు సంబందించిన పత్రాన్ని అందించారు. ఎమ్మెల్యే తన నిధుల నుంచి రూ. 45 లక్షలు క్రీడామైదానం అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. త్వరలో క్రీడామైదానం పనులు చేపట్టి పూర్తి చేసి క్రీడాకారులు ఆటలు ఆడే విధంగా తయారు చేస్తామని అన్నారు. దీంతో పాటు జూనియర్ కళాశాలను ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్పోర్ట్స్ చైర్మన్ను, ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ● ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని శివసేనారెడ్డి, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్లోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రూ.5.30 కోట్లతో మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. మారుమూల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. -
నేడు జిల్లాకు మృతదేహాలు..
ఈ ప్రమాదంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అయిన తర్వాత మృతదేహాలు ఇవ్వనున్నారు. అయితే అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం గద్వాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు. ఇదిలాఉండగా, తెలుగు భాస్కర్ చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని, బంధువుల సాయంతో బీటెక్ పూర్తి చేసి ఎంతో కష్టపడి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడని బంధువులు, కాలనీవాసులు గుర్తు చేశారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కి, భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలిచివేస్తుందని.. వారి కుమారుడు ప్రవీణ్ ఆలనా పాలన చూసేది ఎవరంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
నదీతీరంలోని రైతులు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా: భీమా నది తీరంలోని రైతులు తమ పొలాలకు నీరు పారించేందుకు నదిలోకి దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, మొసళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం మండలంలోని కుసమర్తిలోని భీమానది పరిసరాలను ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి ఎస్పీ పరిశీలించారు. గత శనివారం భీమా నదిలో నీటి పంపును సరిచేయుటకు అందులోకి దిగిన రైతు తిప్పన్నపై మొసలి దాడి చేసి నీటిలోకి ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి గజ ఈతగాళ్లు, పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అతని కోసం నదిలో ఎంత గాలించినా ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం నదిలో గాలింపు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్పీ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడుతూ.. నది పరిసరాల్లో మొసలి తిరుగుతుందని, ఇంకెంత మందిపై దాడి చేస్తుందోనని, అటుగా వెళ్లలేకపోతున్నామని భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో మొసలిని పట్టుకొని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే, 15 రోజులపాటు పోలీసు సిబ్బంది నదీ పరిసరాలను పర్యవేక్షిస్తారని, ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మక్తల్ సీఐ రాంలాల్,ఎ స్ఐ ఎండీ నవీద్, ఏఎస్ఐ సురేంద్రబాబు ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు నారాయణపేట: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎస్పీ యోగేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో 29 వరకు పరీక్షలు కొనసాగనున్నాయని, ఆయా పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఎవరూ గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీ, ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు మూసివేయాలని, పరీక్ష కొనసాగే సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ఎల్బీ పరీక్షలఫలితాలు విడుదల మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సెమిస్టర్–1, 3కి సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. సెమిస్టర్–1లో 74 శాతం ఉత్తీర్ణత కాగా, 3వ సెమిస్టర్లో 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పీయూ వెబ్సైట్లో పొందుపరిచ్చినట్లు వీసీ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ పాల్గొన్నారు. 430 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో రెండు సెషన్లలో కలిపి 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 4వ సెమిస్టర్కు సంబంధించి మొత్తం 8,924 మంది విద్యార్థులకు హాజరుకావాల్సి ఉండగా 8,524 మంది హాజరై 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో సెమిస్టర్–5 బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించి 299 మందికి 266 మంది హాజరయ్యారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా కవిత మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ఆర్ఎంగా జె.కవిత నియమితులయ్యారు. ఈమె ప్రస్తు తం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ వర్క్షాప్లో మేనేజర్గా పని చేస్తున్నారు. ఇక ఖమ్మం డిప్యూటీ ఆర్ఎంగా పనిచేస్తూ గత నెలలో ఇక్కడికి బదిలీపై వచ్చిన భవానీప్రసాద్ ఉమ్మడి ఆదిలాబాద్కు ఆర్ఎంగా వెళ్లారు. -
భరోసా కొందరికే..!
కోస్గి: రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం కొందరికే భరోసా ఇవ్వడంతో అర్హతలుండి సాయం అందని రైతులకు నేటికి ఎదురుచూపులు తప్పడం లేదు. వానాకాలం సీజన్ సైతం వస్తున్నా నేటికీ 40 శాతం మంది రైతులకు రైతు భరోసా అందకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రెండు విడతల్లో రూ.12వేల చొప్పున రైతు భరోసా సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించలేకపోతుంది. రూ.93 కోట్లు పెండింగ్.. జిల్లాలో 13 మండలాల పరిధిలోని 4.59 లక్షల ఎకరాల సాగు భూముల్లో ఇప్పటి వరకు కేవలం 60 శాతం భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 40 శాతం భూములకు సంబందించి నేటికి డబ్బులు పెండింగ్లోనే ఉన్నాయి. జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు అర్హులుగా ఉండగా వారిలో ఇప్పటి వరకు 1.42 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అందింది. ఇంకా 33000 మంది రైతులకు రూ.93 కోట్లు అందాల్సి ఉంది. రైతుల అయోమయం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తుంది. గతంలో పంటల సాగుకు ముందే సాయం అందేది. ప్రస్తుతం పంటలు ఇంటికి వచ్చాక సాయం అందిస్తున్నారు. గత సీజన్కు సంబందించిన నిధులు పూర్తిస్థాయిలో అందక పోగా వానాకాలం సీజన్ పనులు సైతం ప్రారంభ దశలో ఉన్నాయి. కొందరు రైతులు తమ పొలాలను దుక్కులు చేసుకొని వానాకాలం పంటలకు సిద్ధం చేస్తున్నారు. గత సీజన్కు సంబంధించిన రైతు భరోసా నేటికి అందకపోవడంతోపాటు వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలు తీరుపై రైతులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం వెంటనే గత సీజన్కు సంబందించిన డబ్బులు రైతులకు అందించడంతోపాటు వానాకాలం సీజన్లోనైన పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం భూములవిస్తీర్ణం (ఎకరాల్లో) 4.59 లక్షలుమిగిలిన రైతులు 33,000 మందిరూ. 240.42 కోట్లుజిల్లా వివరాలిలా.. నేటికి పూర్తికాని రైతు భరోసా పంపిణీ పథకం ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తికాని ప్రక్రియ 4 ఎకరాల వరకు ఉన్న రైతులకే అందిన సాయం 33 వేల మందికి తప్పని ఎదురుచూపులు ఇప్పటివరకు పంపిణీ చేసింది రూ. 147.41 కోట్లు -
విద్యాబోధనలో సాంకేతికత జోడించాలి: డీఈఓ
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యాబోధనలో సాంకేతికత జోడించాలని డీఈఓ గోవిందరాజులు ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. డీఈఓ గోవిందరాజులు, శిక్షణ తరగతుల పరిశీలకుడు జీరాజుద్దీన్ ఆధ్వర్యంలో 141 మంది తెలుగు, 143 మంది హిందీ, 168 మంది భౌతికశాస్త్రం, 127 మంది జీవశాస్త్రం, 56 మంది సాంఘిక శాస్త్రం, 50 మంది ఆంగ్లం, 54 మంది గణిత ఉపాధ్యాయులతో పాటు 63 మంది హెచ్ఎంలు, 68 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయు లు ప్రేరణాత్మకంగా ఉండటం, విద్యార్థులకు సులభ పద్ధతుల్లో బోధించడం, సృజనాత్మకత వెలికితీయడం, విద్యా సామర్థ్యాలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇస్తున్నట్లు డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్ర కుమార్, ఏఎంఓ విద్యాసాగర్, ఎండీఎం ఇన్చార్జి యాదయ్య శెట్టి, డీఎస్ఓ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు వీడాలి
నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వీడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బాలరాం, ఏఐయూపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. కార్మికులకు నష్టం కలిగించే నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర హక్కులను హరించడం దారుణమన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రూపొందించిన నాలు గు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలన్నా రు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, పెన్షన్ తదితర చట్టబద్ధమైన సౌకర్యలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న కార్మిక సంఘా లు, సంయుక్త కిషాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను అనివార్య కారణాలతో జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. టీయూసీఐ జిల్లా కార్యదర్శి నర్సింహ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కార్మిక, ప్రజా సంఘాల నాయకులు వెంకట్రాములు, కృష్ణయ్య, నారాయణ, బాలకృష్ణ, కెంచ నారాయణ, కేశవులు, సౌభాగ్య, నాగేంద్రమ్మ, గౌసియా, వైశాలి, జ్యోతి పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.7,577 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్యార్డులో మంగళవారం పెసర క్వింటాల్ గరిష్టంగా రూ. 7,577, కనిష్టంగా రూ. 5,559 ధర పలికింది. హంసధాన్యం గరిష్టంగా రూ. 1,550, కనిష్టంగా రూ. 1,401, సోనాధాన్యం గరిష్టంగా రూ. 2,079, కనిష్టంగా రూ. 1,360, ఎర్ర కందులు రూ. 5,609, తెల్ల కందులు రూ. 6,939 ధరలు వచ్చాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,234 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు మంగళవారం వ్యవసాయ పంట దిగుబడులు పోటెత్తాయి. యార్డుకు 7,070 క్వింటాళ్ల పంట ఉత్పత్తులు విక్రయానికి వచ్చాయి. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,234, కనిష్టంగా రూ. 1,422 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,065, కనిష్టంగా రూ.5,990, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,709, కనిష్టంగా రూ.1,600, ఆర్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,601, వేరుశనగ రూ.4,312 ధరలు లభించాయి. ఇద్దరు ఎస్ఐల బదిలీ మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు స్థానచలనం కల్పిస్తూ జోగులాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. కోయిలకొండ ఎస్ఐగా పని చేస్తున్న భాస్కర్రెడ్డిని వీఆర్ వనపర్తికి బదిలీ చేయగా, వీఆర్ వనపర్తిలో ఉన్న కె.తిరుపాజీని కోయిల్కొండ ఎస్ఐగా బదిలీ చేశారు. రేపు జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8 ప్రైవేట్ కంపెనీల్లో 450 ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాల కోసం 99485 68830, 89193 80410 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
రాష్ట్రావతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపై ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 2న నిర్వహించే రాష్ట్రావతరణ దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలను డీఈఓ ఆధ్వర్యంలో నిర్వహించాలని.. మైక్ ఇతర సదుపాయాలను డీపీఆర్ఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలన్నారు. వైద్యం, ఫైర్ ఇతర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ.. జూన్ 2న జిల్లా పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమన్వయంతో విధులు నిర్వర్తించాలి బక్రీద్ పండుగ వేళ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని కలెక్టరేట్లో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంతు సంక్షేమ నియమాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీ సమీక్షించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గొర్రెలు, మేకలను స్లాటర్ హౌస్ల్లోనే వధించాలని.. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వధించరాదని సూచించారు. వాటికి తప్పనిసరిగా పశువైద్యాధికారిచే ధ్రువపత్రం పొందాలన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి శాంతిభద్రల సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశువులకు తగిన షెల్టర్ కల్పిస్తూ.. వాటికి పశుగ్రాసం, నీటి వసతి అందుబాటులో ఉండాలని తెలిపారు. పశువుల సంతలలో నిబంధనలకు అనుగుణంగా, పశు సంరక్షణ చట్టానికి లోబడి క్రయవిక్రయాలు జరిగేలా చూడాలన్నారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలన్నారు. మసీదు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, జిల్లా మైనార్టీ అధికారి రషీద్ తదితరులు ఉన్నారు. -
రుణపరిమితి పెంపు..
అన్నదాతలకు అందనున్న అదనపు సహాయం నర్వ: వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేట రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు సహకార అపెక్స్ బ్యాంక్ 2025–26 ఆర్థిక సంవత్సరం రుణపరిమితిని పెంచింది. ఈ మేరకు వ్యవసాయ దారులకు అందించే వివిధ రకాల పంట రుణాలు 10 శాతం అధికంగా అందనున్నాయి. దాదాపుగా 122 రకాలైన పంటలతో పాటుగా పాడి, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, చేపల పెంపకం యూనిట్లకు రుణాలు అందించనున్నారు. గతంలో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు పంట పెట్టుబడికి ఏమాత్రం సరిపోక రైతులు ప్రైవేటులో అప్పులు చేసేవారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రుణపరిమితిని పెంచడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు ఆర్థిక చేదోడు దక్కేనా..? సాగునీటి కల్పన, వ్యవసాయ యాంత్రీకరణ, పాడి పరిశ్రమ, ఎద్దులు, ఎడ్లబండ్లు, భూముల అభివృద్ధి విత్తనోత్పత్తి, సేంద్రియ సాగు రుణాలు చాలా వరకు రైతులకు అందడం లేదు. జిల్లాలో గడిచిన వానాకాలం, యాసంగి సీజన్లలో పంట రుణాలు, అనుబంధ రుణాల మంజూరులో 67శాతం వరకు మాత్రమే లక్ష్యాన్ని చేరగలిగారు. వ్యవసాయ అనుబంధ టర్మ్ రుణాలను సైతం 30 శాతంలోపే రైతులకు అందాయి. 2025–26 సంవత్సరం రూ. 4204.49 కోట్ల రుణ ప్రణాళికను నాబార్డు ఖరారు చేయగా.. పంట రుణాలు, వ్యవసాయ అనుంబంధ రుణాలు వందశాతం రైతులకు అందించాలని లక్ష్యంగా ఉంది. బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు అందిస్తేనే రైతులకు ఆర్థిక చేదోడుగా ఉంటుంది. బ్యాంకర్లు పంట రుణ పరిమితిని పెంచి ఇవ్వడంతో పాటు సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు నిర్దేశిత మొత్తం కంటే 30 శాతం వరకు కూడా రుణాన్ని అధికంగా పెంచి ఇచ్చే వీలుంది. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లోని 252 రెవెన్యూ గ్రామాల పరిధిలో 1.45 లక్షల మంది రైతులు ఉండగా.. 4,37,865 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. వాణిజ్య పంట అయిన పత్తిని గతేడాది 1.71 లక్షల ఎకరాల్లో సాగుచేయగా.. ఈ ఏడాది 1.75 లక్షల ఎకరాల్లో సాగు అంచనాను వ్యవసాయశాఖ ప్రణాళికలో పేర్కొంది. ఆ తర్వాత వరి, కందులు, ఇతర పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం రుణపరిమితి ఖరారు 122 రకాల పంటలకు 10శాతంఅధికంగా రుణాలు జిల్లాలో 1.45 లక్షల మంది రైతులకుచేకూరనున్న ప్రయోజనం -
డీపీఆర్ రూపొందించారు..
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి త్వరలోనే నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇప్పటికే డీపీఆర్ రూపొందించారు. మహేశ్వరం గేటు నుంచి డిండి వరకు సర్వే పనులు కొనసాగుతున్నాయి. మూడు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. అలాగే మన్ననూర్– శ్రీశైలం మార్గంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎలివేటేడ్ కారిడార్ను ప్రతిపాదించారు. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. – మల్లురవి, ఎంపీ, నాగర్కర్నూల్ ● -
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మొత్తం 27 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిని పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పోలీస్ ప్రజావాణికి 9 అర్జీలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 9 అర్జీలు అందాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా ఆయా సీఐ, ఎస్ఐలకు ఫోన్లో సూచించారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ అధికారుల సమన్వయంతో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, ఎలాంటి ఆవేశాలకు లోనుకారదని సూచించారు. -
బాల్య వివాహాలు పూర్తిస్థాయిలో నివారించాలి
నారాయణపేట: అన్ని శాఖల ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిస్థాయిలో నివారించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నివారణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, మండలాల వారిగా సమావేశాలు నిర్వహింపజేసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని, తహసీల్దార్లు, సీడీపీఓలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలన్నారు. ఇకపై జరిగే పెళ్లిళ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 2025లో 24 బాల్య వివాహాలను అపామని చైల్డ్హెల్ప్లైన్ జిల్లా సమన్వయకర్త నర్సింహులు తెలిపారు. అంతకుముందు అడిషల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ శాఖ పరంగా బాల్య వివాహల నివారణకు చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వివరించారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, ఆర్డీఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, సిడబ్ల్యూసి చైర్మన్ అశోక్కుమార్ పాల్గొన్నారు. నిబంధనల మేరకు అనుమతులు జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్, ల్యాబ్ల ఏర్పాటు అనుమతి కోసం 21 దరఖాస్తులు రాగా.. నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్, వైద్యశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ధ్రువపత్రాలు, స్టాంపింగ్, ఫైర్సెఫ్టీ, బయోమెడికల్, నోటరీ, బిల్డింగ్ కండిషన్ అన్ని నిబంధనలను పాటించి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. -
బీసీ రిజర్వేషన్లు పెంచాలి
నారాయణపేట రూరల్: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి బీసీలకు అనుకూలంగా మాట్లాడుతూనే నామినేటెడ్ పోస్టులలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంలో బీసీలకు చోటు కల్పించకుండా దగా చేశారని దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు కుర్మయ్య, గణేష్, అశోక్, నరేష్, లక్ష్మన్న, గజలప్ప, వెంకటప్ప, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఖాతాదారులకు న్యాయం చేస్తాం మాగనూర్: మాగనూర్ మండల కేంద్రంలోని పోస్టాఫీస్లో పనిచేసే బీపీఎం ధనుంజయ్ అవినీతిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఖాతాదారులకు న్యాయం చేస్తామని విచారణ అధికారి, జిల్లా తపాలా ఇన్స్పెక్టర్ జుబేర్ అన్నారు. సోమవారం జిల్లా తపాలా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రత్యూష, ఉమకాంతు మండల కేంద్రంలో ఇంటింటి విచారణ చేపట్టారు. ఖాతాదారుల నుంచి రాతపూర్వకంగా అన్ని వివరాలు సేకరించారు. వారి నగదును వడ్డీతో సహా చెల్లిస్తామని ఖాతాదారులకు హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, సుకన్య సమృద్ధి యోజన కింద మధ్య తరగతికి చెందిన ఎంతో మంది నెల నెల మాగనూర్ పోస్టాఫీస్లో నగదు చెల్లించేవారు. ఈక్రమంలో అదే పోస్టాఫీస్లో బీపీఎంగా పనిచేసే ధనుంజయ్ చేతివాటం ప్రదర్శించి ఎంతోమంది ఇచ్చిన డబ్బును పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేయకుండా తన జేబు నింపుకొ న్నాడు. ఇటీవల ఈ విషయం బయటకు రాగా.. ఖాతాదారులు పోస్టాఫీసు ఎదుట గ తంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తా జాగా క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు. ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్టికెట్తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు సంబంధించి మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. పెసర క్వింటాల్ రూ.7,359 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.7,359, కనిష్టంగా రూ.6,069 ధర పలికింది. అలాగే, వేరుశనగ గరిష్టంగా రూ.4,119, కనిష్టంగా రూ.3,319, జొన్నలు గరిష్టంగా రూ.3,801, కనిష్టంగా రూ.3,611, వడ్లు హంస గరిష్టంగా రూ.1,750, కనిష్టంగా రూ.1,351, వడ్లు సోన గరిష్టంగా రూ.2,076, కనిష్టంగా రూ.1,639, తెల్ల కందులు గరిష్టం, కనిష్టంగా రూ.6,859 ధర పలికాయి. -
నిరుద్యోగులకు ఉపాధి
నారాయణపేట/నారాయణపేట రూరల్: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్ సర్వేయర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు.. భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిజాం పాలనలోని సర్వే వివరాలే కోలమానం జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది. 50 రోజులపాటు శిక్షణ ఇంటర్లో గణితం ఓ సబ్జెక్టుగా ఉండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), బీటెక్ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ కోర్సులు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మీసేవ ద్వారా ఓసీలు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు ఎస్సీ, ఎస్టీలు రూ.2,500 చెల్లించారు. వీరిలో నుంచి నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేసి 50 రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. థియరీ, టిప్పన్, ప్లాటింగ్, ఫీల్డ్ వర్క్ తదితర మూడు విభాగాల్లో శిక్షణ తీసుకొని తదుపరి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ సర్టిఫికెట్ అందజేస్తారు. భవిష్యత్లో భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకున్న బాధితులు సర్వేకు సంబంధించిన సమస్య పరిష్కారానికి, నక్ష వేయించుకోవడానికి ఈ ధ్రువపత్రం కలిగిన వారు ఇచ్చేవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సర్వేయర్ల కొరత తీరనుంది భూ భారతి చట్టం అమలు నేపథ్యంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ ఇవ్వనుంది. ఎంపికై న సర్వేయర్లతో ప్రైవేట్ భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించునున్నారు. భూ కొలతలకు వారిని వినియోగించుకోనున్నారు. – గిరిధర్, జిల్లా సర్వే అధికారి, నారాయణపేట ‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు.. లైసెన్సుడ్ సర్వేయర్ శిక్షణ పొందేందుకు అర్హులకు అవకాశం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు -
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్ను వినియోగిస్తూ అదనపు విద్యుత్ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు. ● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు ● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది ● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం ● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు. సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి -
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి బయలుదేరుతారు. 3 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
పాలమూరులో తిరంగా ర్యాలీ
పాలమూరు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. జిల్లా ప్రధాన స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్టవర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాజీ సైనికులు, బీజేపీ నేతలు, యువకులతో కలిసి జాతీయ జెండాలు చేతిలో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ సైనికల్లో ధైర్యం నింపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదుల స్థావ రాలపై దాడులు చేసి పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపించామని చెప్పారు. -
గోడు వినేదెవరు..?
గోపాలమిత్రలకు వేతనాలు అందక ఇబ్బందులు ● తొమ్మిది నెలలుగా ఇదే దుస్థితి ● ఉమ్మడి మహబూబ్నగర్లో మొత్తం 214 మంది గోపాలమిత్రలుమరికల్: మారుమూల పల్లెలు.. పశువైద్యశాలలు అందుబాటులో లేని పల్లెల్లో పాడి రైతుల ఇంటి ముంగిట్లో అత్యవసర సేవలు అందిస్తూ.. పశువులకు సంబంధించిన సీజనల్ వ్యాధులపై వాటి యజమానులను అప్రమత్తం చేస్తూ.. పశువులకు అత్యవసర చికిత్సలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు గోపాలమిత్రలు. ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారింది. తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యం గ్రామాలను తిరుగుతూ క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలందించడంతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రలు భాగస్వామ్యం అవుతున్నారు. కానీ వీరి గోడు మాత్రం ఎవరూ వినడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 214 మంది గోపాలమిత్రలు ఉన్నారు. వీరంతా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా నెట్టుకొస్తున్నారు. పశువైద్యంలో కీలకపాత్ర వ్యవసాయ అనుబంధంగా పాడి రంగంలో మేలు జాతి ఆవులు, గేదెల పునరుత్పత్తి, పాల ఉత్పత్తి, ఉత్పాదక పెంపు లక్ష్యంగా గోపాలమిత్ర వ్యవస్థ ఏర్పాటైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 2.50 లక్షలకు పైగా పశువులు ఉండగా 214 మంది గోపాలమిత్రలు సేవలు అందిస్తున్నారు. పశువులకు కృతిమ గర్భధారణ చేయడంతోపాటు మేకలు, గొర్రెలకు వీరు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. అలాగే పశువులకు టీకాలు, నట్టలు, గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడంలో గోపాలమిత్రల పాత్ర కీలకం. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.11,050 చెల్లిస్తున్నారు. బడ్జెట్ రావాల్సి ఉంది గోపాల్మిత్రలకు సంబంధించి 9 నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. బడ్జెట్ విడుదల కాగానే వారి ఖాతాల్లో వేతనాలు జమ చేస్తాం. – మధుసూదన్గౌడ్, జేడీ, మహబూబ్నగర్ లక్ష్యాన్ని చేరుకోలేదంటూ.. పశువుల సంఖ్య మేరకు గోపాలమిత్రలకు కృతిమ గర్భధారణ లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఒక్కో గోపాలమిత్ర నెలకు 100 పశువులకు కృతిమ గర్భధారణ చేయాలి. కానీ గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాడి రైతులు సహజ గర్భధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వీరు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇదే కారణం చూపుతూ అధికారులు గోపాలమిత్రల వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా వచ్చే వేతనాల్లో.. కోత విధించడంతో మేం ఎలా బతికేది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నెల నెల వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు. ఈ విషయంపై పలువురు గోపాలమిత్రలు తమ ఇబ్బందులను మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా వేతనాలు విడుదల చేసేలా చూడాలని కోరుతున్నారు. -
Telangana: రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
కృష్ణా: తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కూసుమర్తి గ్రామీ సమీపంలోని భీమా నదిలో శనివారం మధ్యాహ్నం మొసలి ఒక రైతుపై దాడి చేసి నీటి మడుగులోకి లాక్కెళ్లింది.వివరాలివి.. కూసుమూర్తికి చెందిన రైతు జింకల తిప్పన్న(55), శివప్ప గౌడకలిసి తిప్పన్న వరి నారుమడి పోవడానికి .. తన పొలం పక్కన ఉన్న భీమా నదిలో మోటారు బిగించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటి మడుగులో మోటార్ వద్ద చెత్త ఉండటంతో.. దానిని తొలగించడానికి నీటిలోకి వెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మొసలి తప్పణ్ణపై దాడి చేసింది.ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు వచ్చి రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మొసలి తిప్పణ్ణను పూర్తిగా నీటిలోకి లాక్కెళ్లింది. ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: వేసవి నేపథ్యంలో బాలకేంద్రం ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిసి తీసేందుకు బాల కేంద్రం ఉపయోగపడుతుందని, వేసవి సెలవులను వృథా చేయకుండా చదువుకు సమానంగా కళలు నేర్చుకోవాలన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వివిధ కళా అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. భరతనాట్యం, సితార్, డ్రమ్స్, కీబోర్డ్, రిథమ్ ప్యాడ్, గాత్రం తదితర అంశాల్లో 41 రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు, ఆసక్తి కలిగిన చిన్నారులు వెంటనే అడ్మిషన్ పొందాలని కోరారు. -
గన్నీ బ్యాగుల కొరత తీర్చండి
మాగనూర్: వరికోతలు పూర్తయి నెలరోజులు గడుస్తున్నా.. నేటికీ సరిపడా గన్నీ బ్యాగులు అందించడం లేదని మండలంలోని నేరడగం రైతులు కలెక్టర్ సిక్తా పట్నాయక్ని కలిసి విన్నవించారు. ఆమె ఆదేశాల మేరకు శనివారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈక్రమంలో రైతులు మాట్లాడుతూ.. పంట వేసిన తర్వాత అధికారులు సర్వే చేశారని, వచ్చే దిగుబడికి ఎన్ని సంచులు అవసరం అవుతాయో వారికి తెలియదా నిలదీశారు. గన్నీ బ్యాగుల సరఫరాలో వారి నిర్లక్ష్యం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామానికి సరఫరా చేసిన గన్నీ బ్యాగుల వివరాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతానికి 20 వేల గన్నీ బ్యాగులు గ్రామానికి వచ్చాయని, ఆదివారం వరకు మరో 70 వేల వరకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం సైదులు, డీఏఓ జాన్సుధాకర్, ఎంపీడీవో రహ్మతుద్ధీన్, ఇంచార్జీ తహసీల్ధార్ సురేష్కుమా తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’ దరఖాస్తులపై విచారణ చేపట్టాలి
మద్దూరు: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేకాధికారి యాదగిరి, ఆర్డీఓ రాంచందర్నాయక్తో కలిసి సమీక్షించారు. తిరస్కరిస్తున్న దరఖాస్తులపై ఖచ్చితమైన స్పష్టత ఉండాలని, వాటిని ఎందుకు తిరస్కరించామనే కారణాన్ని రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెలాఖరు నాటికి వంద శాతం దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నారు. చట్టం ప్రకారం భూ సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులదేనని, విరాసత్ దరఖాస్తుల పరిష్కారం నిబంధలను అనుసరించాలన్నారు. పైలెట్ మండలంలో భూ సమస్యలకు అధికారులు చూపించే పరిష్కారాలే.. కొత్తగా ఎంపిక చేసే ఫైలెట్ మండలాల్లో వర్తింపచేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకటికి రెండు సార్లు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేష్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
నారాయణపేట: ప్రజల అంచనాలకు అనుగుణంగా అధికారులు సమర్థవంతంగా పనిచేసి అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఆదేశించారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. ముందుగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డితో కలిసి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరోవైపు అవసరమైన పనులను కొనసాగించి బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగడం ద్వారా ఏ ప్రాంతమైన, జిల్లా, రాష్ట్రమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం సొంత జిల్లా అయిన పేటలో చేయాల్సింది చాలా ఉందని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా చేసిన అభివృద్ధి కంటికి కనబడాలి, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. ‘భూ భారతి’ని పకడ్బందీగా అమలు చేయాలి భూ భారతి చట్టాన్ని పకడ్బందీగాగా అమలు చేయాలని, రైతుల నుంచి ఎలాంటి నిరాశ ఎదురు కావొద్దని, చట్టం ప్రకారం ఏది చేస్తారో ఏది ఏయారో రైతులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోని పైలెట్ మండలాల్లో భూ సమస్యలకు చూపించిన పరిష్కారం అన్ని మండలాలకు వర్తిస్తుందని, రాష్ట్రమంతటా అమలు చేసేందుకు దిక్సూచి అని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేయాలని, నిధుల సమస్య లేదన్నారు. జిల్లా నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగిరం చేయాలని, ఆ పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. అనంతరం పదో తరగతి ఫలితాలు మరింత మెరుగవ్వాలని, ఎఫ్ఎల్ఎన్ మంచి కార్యక్రమం అని, ఢిల్లీ, రాజస్థాన్ పాఠశాలలో విద్యా బోధనను పరిశీలిస్తే మనం ఏంచేయాలో తెలుస్తుందన్నారు. కడా అభివృద్ధి పనులపై శాఖల వారీగా చర్చించి వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా సమీక్షలో పంటల సాగు, సన్న బియ్యం పథకం, యువ వికాసం తదితర పథకాల ప్రగతిపై ఆరా తీశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలి భూ భారతి పైలెట్ మండలాలేరాష్ట్రానికి దిక్సూచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు -
7 బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన
రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని, భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, మ్యూటేషన్ అమలు కాలేదన్న, తదితర సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ తహసీల్దార్, ఎంఆర్ఐ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, వీఆర్ఏలతో కూడిన 7 బృందాలను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఏర్పాటు చేశారు. గ్రామాలకు వెళ్లి దరఖాస్తుదారులు, ఇతర అభ్యంతరాలు వచ్యిన వారికి పిలిపించి క్షేత్ర స్థాయి పరిశీలన ప్రారంభించారు. 421 దరఖాస్తుల పరిశీలన కోసం ఈ బృందాలు గ్రామాల్లో ప్రతి రోజూ సమగ్రమైన విచారణ చేపట్టి సమస్య పరిష్కారానికి నివేదికలు అధికారులకు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 43 దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ముగిసింది. ఇందులో కూడా 197 దరఖాస్తులు క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులు అమోదించగా అందులో 220 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల చివరికి వరకు రెవెన్యూ సదస్సులు ద్వార వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులు అన్ని కసరత్తులు చేస్తున్నారు. ప్రతి నిత్యం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయిలో మానిటరింట్ జరుగుతుంది. -
వడివడిగా ‘భూ భారతి’
మద్దూరు: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మద్దూరు మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 19 రెవెన్యూ గ్రామాలలో కలిపి 1341 దరకాస్తులు వచ్చాయి. వాటి పరిష్కారం కోసం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తహసీల్దార్ స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కారం చూపి ప్రొసీడింగ్ తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భూ భారతి చట్టం అమలు కోసం ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలంలో ఏప్రిల్ 17 నుంచి 28 వరకు 19 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చిన ఽమద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుల పరీశీలన కార్యక్రమం, సమస్యకు సంబంధించిన పాత రికార్డుల పరిశీలన, అనంతరం రైతులకు నోటీసులు అందజేయడం, సమస్య పరిష్కారానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషన్ కలెక్టర్లు బెన్ షాలాం, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్నాయక్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. ఇందుకోసం 4 టీంలు పనిచేస్తున్నాయి. 722 దరఖాస్తుల పరిశీలన.. 436 పరిష్కారం రెవెన్యూ సదస్సులు ద్వార వచ్చిన దరఖాస్తులో ఇప్పటి వరకు 722 దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి వాటిలో 436 సమస్యలను పరిష్కారం కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. 201 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా ఎస్టెన్స్ కరెక్షన్, విరాసత్ తదితరాలు ఉన్నట్లు తెలిపారు. సర్వే కరెక్షన్ వచ్చిన 51 దరఖాస్తులో తహసీల్దార్ స్థాయి అధికారి, సర్వేయర్ క్షేత్రస్థాయిలో వెళ్లి 39 సమస్యలను పరిష్కరించారు. 151 పీఓబీ, అసైన్డ్ ల్యాండ్ సమస్యలపై 151 దరఖాస్తులు రాగా వాటిలో 143 సమస్యలను పరిష్కరించారు. అలాగే ఇప్పటి వరకు 1862 మందికి వచ్చిన దరఖాస్తులపై నోటీసులు అందజేసి, అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం భూ భారతి చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటించి రికార్డుల పరంగా క్షుణ్ణంగా పరిశీలన పూర్తయింది. రైతులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, కొన్ని సమస్యలను పరిష్కరించాం. ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి 7 బృందాలను అడిషనల్ కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు గ్రామాలకు వెళ్లాయి. ఈ నెల చివరి వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులంటిని పరిష్కరిస్తాం. – జయరాములు, ఇన్చార్జ్ తహసీల్దార్, మద్దూరు భూ సమస్యల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక దృష్టి పైలెట్ మండలం ‘మద్దూరు’లో 19 రెవెన్యూ సదస్సులు రైతుల నుంచి 1,341 దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో మొదలైన విచారణ ఇప్పటికీ 493 సమస్యల పరిష్కారం -
చెరువు నీటిని వృథా చేస్తే చర్యలు
మాగనూర్: మాగనూర్ గ్రామ పెద్ద చెరువును ఇరిగేషన్ డీఈ సురేష్ పరిశీలించారు. మాగనూర్ పెద్ద చెరువు నుంచి కొందరు సాగునీరు వృథాగా వదులుతున్నారని గత రెండు రోజుల క్రితం గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందిందని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఏఈ భానుచందర్ చెరువును పరిశీలించారని, అయినా కూడా మరోసారి చెరువు నుంచి నీటి విడుదల చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. వారిని పోలీస్టేషన్కు పిలిపించి హెచ్చరించడంతోపాటు మరోసారి ఇలా చేస్తే స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. స్వయంగా తూములను బంద్ చేయించారు. ఇదిలాఉండగా, డీఈ సందర్శన నేపథ్యంలో గ్రామస్తులు చెరువుకు సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నేడు డయల్ యువర్ డీఎం నారాయణపేట రూరల్: జిల్లా పరిధిలోని నారాయణపేట, కోస్గి ఆర్టీసీ డిపోలో పరిధిలో గల గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రయాణికులకు అందుతున్న రవాణా సేవలను మరింత మెరుగుపరిచేందుకు సూచనలు, సలహాలు, ఫిర్యాదుల స్వీకరణకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. జిల్లాలోని ప్రయాణికులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెల్ నం.7382826293కి కాల్ చేసి తమ సమస్యలు తెలియచేయాలని కోరారు. పెసర క్వింటాల్ రూ.7,322 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.7,322, కనిష్టంగా రూ.7,272 ధర పలికింది. అలాగే, అలసందలు గరిష్టం, కనిష్టంగా రూ.5,325, వడ్లు హంస గరిష్టంగా రూ.1,834, కనిష్టంగా రూ.1,765, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,055, కనిష్టంగా రూ.1,429, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,869, కనిష్టంగా రూ.5,009 ధర పలికాయి. ● దేవరకద్ర: మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,059, కనిష్టంగా రూ.1969గా ధరలు నమోదయ్యాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,811, ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,950గా ఒకే ధర లభించింది. సీజన్ తగ్గడంతో మార్కెట్కు దాదాపు 200 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డీబార్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం ఉదయం సెమిస్టర్–6 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 47 పరీక్ష కేంద్రాల్లో 9,333 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 8,946 మంది హాజరయ్యారు. 385 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెమిస్టర్–2కు సంబంధించి 9,842 మంది విద్యార్థులు 9,250 హాజరై 592 మంది గైర్హాజరయ్యారు. కాగా. తొలిరోజు ఇద్దరు విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ డీబార్ అయ్యారని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ తెలిపారు. -
కమిటీలతో సంస్థాగతంగా బలోపేతం
నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్య రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన నారాయణపేట మండలం, టౌన్, దామరగిద్ద మండలాల కొత్తగా కమిటీ ఏర్పాటుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్టీ పదవుల నియామకం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశ్యంతో ప్రతి మండలం నుంచి మండల అధ్యక్ష పదవి కోసం పదవిని ఆశించే ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని, అందులో అర్హులైన వారిని ఎంపిక చేసి అధిష్టానానికి పంపడం జరుగుతుందన్నారు. అర్హతల ఆధారంగా అధిష్టానం మండల అధ్యక్షుల ఎంపిక చేస్తుందని, పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. గ్రామ, వార్డు అధ్యక్షులు ఎంపిక సైతం ఉంటుందని ఆశవాహులు దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు. పార్టీ పదవులు దక్కని వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీ పదవులు పొందిన వారు అందరిని కలుపుకొని పోయి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలన్నారు. అనంతరం అధ్యక్ష పదవికి పోటీ పడే అశవాహులనుంచి దరఖాస్తులను స్వీకరించారు. శివారెడ్డి, ఎండి సలీం, సుధాకర్, గౌస్, బండి వేణుగోపాల్, గందెచంద్రకాంత్, నర్సింహరెడ్డి, ఈదప్ప, రాజేశ్ పాల్గొన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సెమిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్టర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రాయనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేశాం.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: మహిళలు, యువతులు, చిన్నారులను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని షీటీం పోలీసులు అన్నారు. బుధవారం నారాయణపేట మండలం, కోటకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సమ్మర్ క్యాంప్లోని విద్యార్థులకు షీ టీం సభ్యులు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, అందరూ సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిలలను, విద్యార్థులను శారీరకంగా, మానసికంగా ఎవరైనా వేధించిన ధైర్యంగా షీ టీమ్ పోలీస్ల నెంబర్ 8712670398 కి సమాచారం అందించాలని, వేధించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళా సైబర్ మెసానికి గురైతే 1930 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో షీ టీమ్ పోలీసులు జ్యోతి, కవిత, ఉపాద్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
నారాయణపేట: ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయుడు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకొని తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభతర బోధనా విధానాలు అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలపై సాధారణ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అన్ని సౌలభ్యాలను అందించేందుకు నిబద్దతతో పనిచేయాలన్నారు. ఉర్ధూ మాద్యమ ఉపాధ్యాయులతో కలెక్టర్ ముచ్చటించారు. గతంలో అమలుపరిచిన రోహిణి (వెలుగు..అభ్యసమిత్ర) వర్క్ పుస్తకాలను జిల్లా వ్యాప్తంగా మరో మారు అమలుపరిస్తే విద్యార్థుల సామర్థ్యాలు తప్పనిసరిగా మెరగవుతాయని ఉపాధ్యాయులు సూచించారు. దీనికి కలెక్టర్ను పూర్తిగా సహకరిస్తానని తప్పనిసరిగా అటువంటి వర్క్ బుక్లను వెంటనే వినియోగంలోకి తెచ్చేలా, ప్రింట్ డిస్ట్రిబ్యూట్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమాలు శాఖపరమైన పనితీరు మెరుగుపరచుకోవడంతో పాటు విద్యార్థుల అవగాహన నేర్చుకునే సామర్థ్యాలను మరింత సులభతరం చేసేలా బోధన విధా నాలు నేర్చుకునేందుకు ఉపయోగపడతాయన్నారు. శిక్షణకు గైర్హాజర్ అయిన వారిని వెంటనే హజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ తగు చర్యలు చేపట్టమని డీఈఓను ఆదేశించారు. కలెక్టర్తో పాటు డీఈఓ గోవిందరాజులు, కోర్సు కో ఆర్డినేటర్ మహ్మద్ సిరాజుద్దీన్, ఎఎంఓ విద్యాసాగర్లు ఉన్నారు.నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించాలి నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. మెడికల్ కళాశాల ఆవరణలో రూ.26 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నర్సింగ్ కళాశాల కోసం స్థలాన్ని, అలాగే రూ.24 కోట్లతో నిర్మించే ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్ ) సెంటర్ స్థలాన్ని పరిశీలించారు. ఎంసిహెచ్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని టీజీఎంఎస్ఐడీసీఈఈ రాజేందర్ను ఆదేశించారు. అనంతరం మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు భోజనం సరిగ్గా ఉండటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. వంట ఏజెన్సీ వారితో మాట్లాడి నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్కు సూచించారు. ఇదిలాఉండగా, సీఎం రేవంత్రెడ్డి ఫిబ్రవరి 21న అప్పక్పల్లిలో భూమి పూజ చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి నిర్మాణ పనులను వేగంగా చేయించాలని ఇంటి యజమానిని, హౌసింగ్ పిడి శంకర్ను ఆదేశించారు. అలాగే సింగారం చౌరస్తాలో జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ను కలెక్టర్ పరిశీలించి ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలించారు. కలెక్టర్తో పాటు డీఆర్డీఓ మొగులప్ప, డిజిఎంఎస్ఐడిసిడీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయి మురారి, ఎంపిడిఓ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ ముందుచూపు
●సమయానికి పుస్తకాలు అందిస్తాం గతంలో రెండు భాషల్లో ముద్రణకు ఆలస్యం కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అలాంటి సమస్య లేకుండా ముందస్తుగా జిల్లా గోదాంకు 60శాతం పుస్తకాలు వచ్చాయి. మరో పక్షం రోజుల్లో మిగితా పుస్తకాలు రానున్నాయి. జూన్ 1లోపు ఎమ్మార్సీలు, క్లస్టర్ పాయింట్కు పంపి అక్కడి నుంచి స్కూళ్లకు అందిస్తాం. రాత పుస్తకాలు సైతం త్వరలో రానున్నాయి. – గోవిందరాజులు, డీఈఓ నారాయణపేట రూరల్: ఏటా విద్యా సంవత్సరం ప్రారంభమై ఆర్నెళ్లు గడిచినా.. పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో విఫలమవుతూ వచ్చిన విద్యాశాఖ అధికారులు గతేడాది నుంచి అలాంటి పొరపాట్లకు తావివ్వడంలేదు. పాఠశాలలు తెరిచిన తొలిరోజే చిన్నారులకు పాఠ్యపుస్తకాలను చేతిలో పెట్టాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. గతంలో ఆంగ్ల మాద్యమ పుస్తకాల కొరత ఎంతో ఇబ్బందికి గురిచేసింది. ఈ విద్యా సంవత్సరంలో దానిని సైతం అధిగమించడానికి కృషి చేస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అవసరమైన పుస్తకాల సంఖ్యను ముందుగానే గుర్తించి అందుకు తగ్గట్లు 10శాతం ఎక్కువ చొప్పున గత విద్యా సంవత్సరం మధ్యలోనే ముద్రణ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని స్టాక్ పాయింట్కు సగానికిపైగా పుస్తకాలు డంప్ చేశారు. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు జిల్లాలో తెలుగు మాద్యమంతో పాటు ఇంగ్లిష్, ఊర్దూ, కన్నడ మీడియం పాఠశాలలు ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా పాఠశాలలకు సరిగ్గా పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా గోదాంలో డంప్ చేసిన వాటిని ఎమ్మార్సీలు, క్లస్టర్ పాయింట్లకు వాటిని జూన్ 1లోగా చేరుస్తారు. అక్కడి నుంచి సంబంధిత హెచ్ఎంలు వారివారి పాఠశాలల సంఖ్య ఆధారంగా పాఠ్యపుస్తకాలను తీసుకుని వెళ్తారు. గతంలో ఆంగ్ల మాద్యమంలోని పాఠశాలలకు రెండు భాషల్లో పుస్తకాలను ముద్రించి పంపిణీ చేశారు. దీంతో ముద్రణ ఆలస్యం కావడంతో పాత పుస్తకాలతో సర్దుకున్నారు. ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా పుస్తకాల పంపిణీకి సిద్ధం చేశారు. రాత పుస్తకాలు సైతం.. ఈ విద్యా సంవత్సరం నూతనంగా పాఠ్యపుస్తలతో పాటు రాత పుస్తకాలను (నోట్స్)ను అందిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి ముద్రణ సైతం ప్రారంభమైంది. పేపర్ రేట్లు అమాంతం పెరగడంతో బీద, మధ్య తరగతి కుటుంబాలు వారి పిల్లలకు నోట్స్ కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కొత్తగా శ్రీకారం చుట్టారు. జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి వాటిని సైతం సిద్ధం చేసి అందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. గత రెండేళ్లుగా 6 నుంచి 10వ తరగతి వారికి అందిస్తే ఈ ఏడాది ప్రాథమిక తరగతులకు సైతం ఇవ్వనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధం ఇప్పటికే 60శాతం మేర స్టాక్ పాయింట్కు చేరిన వైనం అన్ని తరగతులకు రాత పుస్తకాల పంపిణీకి శ్రీకారం 60శాతం పుస్తకాలు గోదాంలో.. జిల్లా వ్యాప్తంగా 513 ప్రభుత్వ, 11 కేజీబీవీ, 6 గురుకుల, మూడు ఎయిడేడ్ పాఠశాలల్లో కలిపి 72,493 విద్యార్థులు ఉన్నారు. వీరికి 3,46,459 పుస్తకాలు అవసరమని అధికారులు నివేదిక అందించారు. అయితే వాటిలో 6,396 పాత పుస్తకాలు ఉండగా 2,30,090 పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని సింగార్బేస్ స్కూల్ గోదాంలో నిల్వ చేశారు. ఇప్పటి వరకు జిల్లాకు 60శాతం పుస్తకాలు అందినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. -
పిల్లలమర్రి ముస్తాబు
రేపు ప్రపంచ సుందరీమణుల రాక వివరాలు 8లో u● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాట్లు ● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు, బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మందితో పోలీసుల పకడ్బందీ బందోబస్తు మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఏర్పాట్లు ఇలా.. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
కోస్గి: రైతులు వ్యవసాయంలో రసాయన ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు.మంగళవారం గుండుమాల్ రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా పలువురు శాస్త్రవేత్తలు హాజరై రైతులకు అధునాతన వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను సమగ్రంగా వివరించారు. రైతులు మూస పద్ధతులను పాటించకుండా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుంటూ అధునాతన వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. నూతన వంగడాలు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంతో భూసారం పెంపుదల వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విధిగా పంట మార్పిడి విధానం అవలంభించి భూసారాన్ని పెంచుకోవచ్చని, ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలతో పంట పొలాల్ని సారవంతం చేసుకోవాలన్నారు. విత్తన కొనుగోలులో జాగ్రత్త: డీఏఓ జాన్ సుధాకర్ రానున్న వానాకాలం సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఏఓ జాన్ సుధాకర్ సూచించారు. రైతులు నకిలీ విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ శాఖ ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేయడంతోపాటు విత్తనాలు వేసుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగమైన పాడి పరిశ్రమపై దృష్టి సారించి అదనపు ఆదాయం పొందవచ్చునని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ పరిమళ్ కుమార్, డాక్టర్ జేడీ సరిత, ఉద్యావవన శాఖ అధికారి హర్షవర్దన్, ఏఓలు రేష్మారెడ్డి, రామకృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
నారాయణపేట రూరల్/కోస్గి రూరల్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో మూడు, కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1386 మంది విద్యార్థులకుగాను 1303 మంది హాజరయ్యారు. మిగతా 79 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240కి 224మంది, సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 511కి 486మంది, బ్రిలియంట్ స్కూల్లో 240కి 223మంది, కోస్గి ఇంజినీరింగ్ కళాశాలలో 240కి 228, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 151కి 142మంది హాజరయ్యారు. మొత్తం 94.2శాతం హాజరు శాతం నమోదైంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 10 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన ఉండటంతో పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించగా జిల్లా కో ఆర్టినేటర్గా శ్రీనివాసులు వ్యవహరించారు. ఇక సాంకేతిక విద్యామండలి నుంచి స్పెషల్ ఆఫీసర్, కోస్గి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు నిరంతంర పర్యవేక్షించారు. పరీక్ష పూర్తయిన తరువాత బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లును వాహనాలలో తరలించారు. 6 నిమిషాలు ఆలస్యం.. అనుమతి నిరాకరణ ఇదిలాఉండగా, కోస్గి మండలంలోని హన్మన్పల్లి గ్రామానికి చెందిన స్వాతి ఉదయం 11.06 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోగా.. నిర్వాహకులు ఆమెను అనుమతించలేదు. సమయానికి బస్సు లేకపోవడంతో ఆటోలో రావాల్సి వచ్చిందని, ప్రయాణికులతో నిండిన తర్వాతే ఆటో కోస్గికి వచ్చిందని, దీంతో ఆలస్యమైందని సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత బతిమిలాడినా అనుమతించలేదు. దీంతో గేటు వద్దే విద్యార్థి రోదిస్తూ ఉండగా.. పోలీసులు నచ్చజెప్పారు. 79 మంది విద్యార్థులు గైర్హాజరు -
భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నారాయణపేట/మద్దూరు: భూ భారతి పైలెట్ ప్రాజెక్టులో భాగమైన మద్దూరులో రైతుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను ఈ నెల 18 వరకు పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ రెవెన్యూ అధికారులను అదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి మద్దూరులోని నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తతో చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం పంపిణీ, చిన్నారుల సంఖ్య తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. 15న రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు మండలంలో పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. హన్మనాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించవచ్చని, ఈ అంగన్వాడీలో చిన్నారులకు అడుకోవడానికి పరికరాలను ఏర్పాటు చేయాలని పీఆర్ అధికారులకు సూచించారు. అనంతరం మద్దూరు తహసీల్దార్ కార్యలయంలో భూ భారతి కార్యక్రమంపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులకు ఎన్ని పరిష్కరించారని, మిగితావాటిని కూడా వెంటనే పూర్తి చేయాలని అదేశించారు. కార్యక్రమంలో పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్, తహసీల్దార్ జయరాములు, తదితరులు పాల్గొన్నారు. ఆరు నెలల్లో ‘కలెక్టరేట్’ పూర్తి చేయాలి జిల్లా కేంద్రంలోని సింగారం మలుపు దారి వద్ద రూ.56 కోట్లతో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి.. మ్యాప్ ప్రకారం ఇప్పటి వరకు ఏ పనులు ఏఏ దశల్లో కొనసాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆరు నెలల్లోగా కలెక్టరేట్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజేందర్ డీఈ రాములు, ఏఈలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నర్వ ‘ఏబీపీ’పై సమీక్ష నారాయణపేట: ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం(ఏబీపీ) నర్వ మండలంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్.. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. పోషకాహారం, ఆరోగ్యం, విద్య రంగంలో కార్యాచరణ ప్రణాళిక/ప్రాజెక్టు ప్రతిపాదన తయారీ ఎంత వరకు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. ప్రతి రంగంలో ఫలితాల ఆధారిత, అత్యంత అవసరమైన ప్రతిపాదనను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సించిత్ గంగ్వార్ ప్రతి రంగానికి బడ్జెట్ కేటాయింపుపై వివరాలను వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ, పోషకాహార రంగానికి దాదాపు రూ.కోటి, మిగిలిన రూ.15 నుంచి 20 లక్షల బడ్జెట్ను ఆరోగ్యం, విద్యా రంగానికి కేటాయించాలని తెలిపారు. బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, కేజీబీవీలో మౌళిక సదుపాయల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ఆరోగ్య రంగంలో వైద్య పరికరాల సేకరణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన వివరించారు. సమీక్షలో డీఆర్డీఓ మొగులప్ప, అధికారులు మోహన్, గోవిందురాజులు, బిక్షపతి, నర్వ ఆస్పరేషన్ బ్లాక్ ఇంచార్జీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
నారాయణపేట: రానున్న వానాకాలం సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ సమన్వయంతో నాసీరకం ఎరువులు, నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలని, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందని తెలిపారు. విత్తన వ్యాపార డీలర్లు బాధ్యతగా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని, పీడీ యాక్ట్ తప్పదని పేర్కొన్నారు. జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉండడంతో నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందని, ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పిండంతో నకిలీ విత్తనాలు నివారించాలని సూచించారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్న వారిపై నిఘా ఉంచాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే అనుమానిత బ్రోకర్లు, డీలర్ల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్చేసి పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. అలసందలు క్వింటాల్ రూ. 5,216 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్కు గరిష్టంగా రూ.5,216, కనిష్టంగా రూ.4,212 ధర పలికాయి. అలాగే, వడ్లు హంస గరిష్టంగా రూ.1,939, కనిష్టంగా రూ.1,736, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,529, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,575, కనిష్టంగా రూ.6,029, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.5 వేలు ధర పలికాయి. ఆర్ఎన్ఆర్ ధర రూ. 2084 దేవరకద్ర: మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ క్వింటాల్కు గరిష్టంగా రూ.2,084, కనిష్టంగా రూ.2,049, ఆముదాలు క్వింటాల్కు రూ.5,850 ఒకే ధర లభించింది. సీజన్ తగ్గడంతో మార్కెట్కు దాదాపు 300 బస్తాల ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. మన్యంకొండలోవైభవంగా వసంతోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ఉత్సాహంగా సబ్ జూనియర్ నెట్బాల్ సెలక్షన్స్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో మంగళవారం సబ్ జూనియర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు సంబంధించి వేర్వురుగా బాల, బాలికల నెట్బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జనగాంలో ఈనెల 15 నుంచి 18 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ నెట్బాల్ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లా జట్లు ప్రతిభచాటాలని కోరారు. కార్యక్రమంలో ఖాజాఖాన్, అంజద్అలీ, షరీఫ్, షకీల్, అక్రం, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
పరిశీలన కొనసాగుతోంది..
రాజీవ్యువ వికాసం కింద వచ్చిన మొత్తం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులతోపాటు బ్యాంకు అధికారులు సమగ్రంగా దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారు. బ్యాంకుల పరిశీలన పూర్తయిన తర్వాత ఆమోదం పొందిన వాటిని జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తాం. – ఖాజా నిజాం అలీ, బీసీ సంక్షేమ శాఖాధికారి, నాగర్కర్నూల్ అర్హులకు అందించాలి.. రాజీవ్ యువవికాసం కింద ఫొటోస్టూడియో ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం జీవనోపాధికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించి సకాలంలో సబ్సిడీ రుణాలను అందజేయాలి. – రాజశేఖర్, మన్ననూర్, అమ్రాబాద్ మండలం● -
జిల్లా కేంద్రాలు సేకరించిన రావాల్సిన సన్నరకం ధాన్యం బోనస్ (క్వింటాళ్లు) (రూ.కోట్లు) నారాయణపేట 101 86,369 4.31 మహబూబ్నగర్ 193 59,785 2.98 వనపర్తి 255 53,998 2.69 నాగర్కర్నూల్ 231 15,321 0.76 జో. గద్వాల 75 12,542 0.62
జిల్లాల వారీగా ధాన్యం సేకరణ ఇలా.. పెరిగిన సన్నాల సాగు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. అయితే ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్లోనూ రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 1.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో ఏకంగా 86,369 మెట్రిక్ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇప్పటి వరకు దొడ్డు రకం కంటే.. సన్నాలే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కనీస మద్ధతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమయ్యేందుకు కనీసం వారం రోజులు పడుతుండగా, రూ.500 చొప్పున ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు 15 రోజులు దాటినా పడటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్ డబ్బులు ఖాతాల్లో జమచేయాలని వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పడంతోనే.. నేను ఈ యాసంగిలో 8 ఎకరాలల్లో 415 బస్తాలు వరి ధాన్యం పండించాం. అందుకుగాను రూ.3.80 లక్షలకుపైగా నగదు వచ్చింది. నాయకులు, అధికారులు ముందుగా రైతులకు ధాన్యం డబ్బులతో పాటుగా బోనస్ రూ. 500 వేస్తానని అన్నారు. బోనస్ వస్తుందనే ఆశతోనే నేను నా ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాను. కానీ, నేటికీ బోనస్ అందలేదు. – బవకోళ మారెప్ప, రైతు, మాగనూర్, నారాయణపేట జిల్లా ఎదురుచూస్తున్నాం.. నేను మాగనూర్ గ్రామ శివారులో 11 ఎకరాల్లో వరి సాగు చేశాను. 288 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పది రోజుల క్రితం నేను మాగనూర్ పీఏసీఎస్ కేంద్రంలో ధాన్యం విక్రయించాను. క్వింటాల్కు రూ. 500 బోనస్ చొప్పున మొత్తం రూ.1.44 లక్షలు బోనస్ రావాలి. ఇన్ని రోజులు గడుస్తున్నా బోనస్ డబ్బులు రాలేదు. బోనస్ డబ్బుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం. – అంజప్ప, రైతు, మాగనూర్, నారాయణపేట జిల్లా ● -
15 రోజులు గడిచినా..
వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూశాక నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పడుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులైనా బోనస్ డబ్బులు మాత్రం పడటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ అమలు చేస్తుందా.. లేదా.. అని అయోమయానికి గురవుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో తప్పిదాలకు తావివ్వొద్దు
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. వడ్ల నాణ్యత, తేమ శాతం తదితర వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి తప్పిదాలు జరిగిన నిర్వహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్వైజర్ లక్ష్మణ్, నిర్వహకులు ఉన్నారు. ఉపాధ్యాయులందరూ శిక్షణకు హాజరుకావాలి నారాయణపేట ఎడ్యుకేషన్: ఈ నెల 20 నుంచి నిర్వహించనున్న ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని, ఈమేరకు సంబంధిత ప్రధానాపోధ్యాయులు, ఎంఈఓలు సహకరించాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. సోమవారం జిల్లా రిసోర్స్ పర్సన్లతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్స్ అయిన గణితం, సాంఘిక శాస్త్ర, ఆంగ్లం, ఎస్జీటీ ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ మండల ఆర్పీలకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఈ నెల 13 నుంచి 17 వరకు స్పెల్–1ను, ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్పెల్–2 ను నిర్వహించనున్నట్లు వివరించారు. శిక్షణ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు కొనసాగుతందని, శిక్షణ పొందే ఉపాధ్యాయులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం ఉంటుందని, టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా ఆన్లైన్ హాజరు నమోదు చేయాలని తెలిపారు. 687 మంది ఉపాధ్యాయులకు, 26 మంది డీఆర్పీల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు శిక్షణ కొనసాగనుందని, శిక్షణకు గైర్హాజర్ అయిన వారిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సిరాజుద్దీన్, మహబూబ్నగర్ డైట్ లెక్చరర్ పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి
నారాయణపేట: సామాన్యులపై భారం మోపి సంపన్నులకు వరాలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ మే 20న జాతీయ సమ్మె నిర్వహిస్తున్నట్లు సిఐటీయు జిల్లా కార్యదర్శి బాల్రామ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విలేకరుల నమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి, కొన్నింటిని రద్దుచేసి యాజమానులకు అనుకూలంగా తీసుకువస్తున్న నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సంపదను బడ కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా ఆమ్మేస్తున్న విధానాన్ని నిరసిస్తూ సమ్మె జరుగనుందన్నారు. 45వ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల మేరకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నభోజన కార్మికులు, క్షేత్ర సమయకులు, విఓఏలు, ఆర్పిలు తదితర స్కీమ్ వర్కర్లందర్నీ కార్మికులుగా గుర్తించాలని కార్మిచట్టాలను వర్తింప చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు నరహరి, కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్, కాశప్ప, నరసింహ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
గంట ముందు నుంచే అనుమతి మూడేళ్ల పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశం కోసం మంగళవారం పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో వ్యాప్తంగా 1382మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. నారాయణపేటలో 3 కేంద్రాలు, కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు జరగనుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోం. హాల్టికెట్పైనా ఫొటో ప్రింట్ కాని వారు పాస్పోర్ట్ సైజ్ ఫొటో అతికించుకొని గెజిటేడ్ సంతకం చేసుకొని రావాలి. పరీక్ష కేంద్రంలోకి స్మార్ట్ ఫోన్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. – డాక్టర్ ఎం.శ్రీనివాసులు, జిల్లా సమన్వయకర్త ●● జిల్లాలో హాజరుకానున్న 1,382మంది విద్యార్థులు ● పేటలో మూడు.. కోస్గిలో రెండు పరీక్ష కేంద్రాలు నారాయణపేట రూరల్/నారాయణపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, మూడు సంవత్సరాల ఇంజినీంరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్, వెటర్నరీ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం నిర్వహించే మంగళవారం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పాలిసెట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంతో పాటు కోస్గిలో పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమజ్ఞమయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్ఓ, డీఎస్డీసీఓ, మున్సిపల్ కమీషనర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్లతో కమిటీ ఏర్పాటు చేసి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఐదు కేంద్రాలు జిల్లా కేంద్రంతో పాటు కోస్గిలో జరిగే పాలిసెట్ పరీక్షకు 1382మంది అభ్యర్థులకు గాను ఐదు పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో పాటు అవసరమైన ఇన్విజిలేటర్ల నియామకం చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 240 మంది, బ్రిలియంట్ స్కూల్లో 240, సిఎన్ఆర్ డిగ్రీ కళాశాల 511 మందితో కలిపి 991 మంది, కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 151, పాల్టెక్నిక్ కళాశాలలో 240మందిని కేటాయించారు. అక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్, మూత్రశాలలు, తాగునీరు సౌకర్యంతో పాటు గాలి, వెలుతురు వచ్చే విధంగా ఉండే గదులను ఎంపిక చేశారు. ఇవి తప్పనిసరి పరీక్షకు అభ్యర్థులు తప్పకుండా హాల్టికెట్తో పాటు ఆధార్కార్డు, పాస్ఫొటో తీసుకుని హాజరు కావాలి. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ప్రతి అభ్యర్థి హెచ్బి పెన్సిల్, బ్లూ, బ్లాక్ పెన్ వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. కోస్గిలో.. కోస్గి రూరల్: కోస్గిలో మంగళవారం జరగనున్న పాలిటెక్నిక్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో 151 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం అలస్యం అయినా పరీక్షకు అనుమతించమన్నారు. -
బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం
15 రోజుల క్రితం 145 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. నాలుగు రోజుల్లో బోనస్ కాకుండా మిగితా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. మరో వారంలో బోనస్ కూడా పడుతుందన్నారు. కానీ 15 రోజులైన బోనస్ రాకోపోవడంతో బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. బోనస్ కింద రూ.74 వేలు రావాల్సింది. – వెంకట్రెడ్డి, రైతు, కన్మనూర్, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా అధికారులు సైతం తెలియదంటున్నారు 50 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. ధాన్యం వేసి 25 రోజులు అవుతుంది. ఇంత వరకు బోనస్కు సంబందించి రూ.25 వేలు రావాల్సింది. బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తారని అధికారులను సంప్రదిస్తే.. తమకు తెలియదని సమాధానమిచ్చారు. అసలు బోనస్ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – చెన్నప్ప, రైతు, కన్మనూర్, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా ఒకట్రెండు రోజుల్లో బోనస్ డబ్బులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల నుంచి 59,785 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో రూ.8.88 కోట్లు బోనస్ డబ్బులు కూడా జమ చేస్తాం. మద్దతు ధరతో ప్రతిఒక్క గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ చేస్తాం. – రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ, మహబూబ్నగర్ ● -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 28 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు వన్నివిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పకప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోలీస్ గ్రీవెన్స్కు 11 అర్జీలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణిలో మొత్తం 11 అర్జీలు అందాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి వెంటనే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించి వారికి సరైన న్యాయం అందించి భరోసా భద్రత కల్పించాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. -
వసతుల్లేక.. అవస్థలు
కొనుగోలు కేంద్రాల వద్ద ఎండలకు తల్లడిల్లుతున్న రైతులు మరికల్: ఓ వైపు ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండడం.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ నీడ.. తాగేందుకు నీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎండలు, ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. యాసంగి కోతలు ముమ్మరం కావడంతో భారీగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కనీస వసతులైన నీడ, తాగునీరు, ఇతర వసతులు కల్పన ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ధాన్యం సేకరణలో ఆలస్యంపై జిల్లాలో పలు చోట్ల రైతులు రోడ్డెక్కుతున్నారు. యాసంగిలో అధిక శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో అధికారులు సైతం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇప్పటి జిల్లా వ్యాప్తంగా కొన్ని మిల్లుల ధాన్యం టార్గెట్ పూర్తి కావడం జరిగింది. కేంద్రాల వద్ద కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో రైతన్నలు మండుటెండలకు విలవిల్లాడుతున్నారు. హడలెత్తిస్తున్న ఎండలు.. జిల్లాలో సహకార, గ్రామీణాభివృద్ధి డీసీఎంఎస్, మార్కెటింగ్ శాఖలు ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. అయితే, ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో నిబంధనల పేరిట కొందరు కొర్రీలు విధిస్తున్నారు. దీంతో రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. రేయింబవళ్లు కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. చాలాచోట్ల నామమాత్రంగా తడికెలతో పందిరి ఏర్పాటుచేసినా.. అవి ఏమాత్రం సరిపోవడంలేదు. విధిలేక చెట్ల నీడలో తల దాచుకుంటున్నారు. అటు తాగేందుకు నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. జిల్లా వైద్యాధికారి సమన్వయంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను కేంద్రాల్లో నిల్వ చేయాలనే ఆదేశాలిచ్చినా.. పాటించడం లేదు. ఇదిలాఉండగా, వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనే పలువురు అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. మరోపక్క సమయానికి లారీలు కూడా రాకపోవడంతో ధాన్యం ఆరబెట్టిన రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. ‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, అకాల వర్షాలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి..’ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ముందు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇచ్చిన ఆదేశాలు ఇవి. కానీ జిల్లాలో ఇవి ఎక్కడ అమలు కావడం లేదు. టెంట్లు లేవు.. తీలేర్ కొనుగోలు కేంద్రం దగర టెంటు వేసిన మూడు రోజులకే ఈదురు గాలులకు కూలిపోయింది. తిరిగి దాని మళ్లీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండలకు తాళలేక చెట్ల నీడ కింద సేద తీర్చుకుంటున్నాం. అలాగే తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో లేవు. వడదెబ్బ తగిలితే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నాం. – కృష్ణారెడ్డి, రైతు, పెద్దచింతకుంట నీళ్ల బాటిళ్లు కొనుగోలు చేస్తున్నాం అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీటి వసతి కల్పించకపోవడంతో నీళ్ల బాటిళ్లను కొనుగోలు చేసి తాగుతున్నాం. కనీస వసతులు కల్పించాలని అధికారులను అడిగితే.. నిధులు మంజూరు కాలేదు, తాము ఏం చేయాలేమని చేతులు ఎత్తేస్తున్నారు. కేంద్రాల దగర వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలి. – వెంకటయ్య, రైతు, రాకొండ చర్యలు చేపడతాం జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల దగర నిబంధనాల ప్రకారం కనీస వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. కానీ అక్కడక్కడ టెంట్లు గాలివానలకు కూలిపోయాయి. ఎండల ప్రభావం పెరుగుతుండటంతో తాగునీటి వసతి కల్పిస్తాం. – సైదులు, సివిల్ సప్లయ్ జిల్లా అధికారి కానరాని టెంట్లు.. తాగునీరు వెంటాడుతున్న అకాల వర్షాలు.. జిల్లాలోని 102 కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి -
జమిలి ఎన్నికలతో తగ్గనున్న ఆర్థికభారం
కోస్గి రూరల్: భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలో భాగంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకేఎన్నిక అంశంపై ప్రజల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిందని వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్ర స్టిరింగ్ కమిటి సభ్యులు కొల్లి మాధవి, ఆధ్యాత్మికవేత్త భాస్కరయోగి అన్నారు. శనివారం పట్టణంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు ఇప్పటివి కావని దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పలు సార్లు ఒకే సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆర్థికభారం తగ్గుతుందని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు వేగంగా పూర్తి అవుతాయన్నారు. 29 రాష్ట్రాలలో పలు మార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధికి ఆటంకటం కలుగుతుందన్నారు. అధికారుల సమయం వృథా అవుతుందని, ఎన్నికల ఖర్చులు భారీగా పెరుగుతాయని గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి రాంనాథ్కోవింద్ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకేఎన్నికపై కమిటి వేశారని అన్నారు. నీతి అయోగ్ కూడా జమిలి ఎన్నికలకు పలు సూచనలు చేసిందన్నారు. కార్యక్రమంలోజిల్లా స్టిరింగ్ కమిటి బస్వరాజ్ ,మండల కన్వినర్ సుదర్శన్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వాహనాలను కండీషన్లో ఉంచుకోవాలి
నారాయణపేట: జిల్లా పోలీస్ స్టేషన్లలో పెట్రోల్ కార్ విధులు నిర్వర్తించే వాహన డ్రైవర్లు వాహనాలను కండీషన్లో ఉంచుకోవాలని ఎంటీఓ ఆర్ఎస్ఐ శివశంకర్ సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయ ఆవరణలోని ట్రైనింగ్ సెంటర్లో జిల్లాలోని పోలీస్ మోటార్ వాహన డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి పెట్రోలింగ్ చేసే సమయంలో తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్విరామంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరస్థులపై నిఘా ఉంచాలని, ముందస్తు నేరాలు జరగకుండా సైరన్ వేసుకుంటూ పెట్రోలింగ్ నిర్వహించాలని తెలిపారు. వాహనాలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మెకానిజంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనాన్ని ప్రతిరోజు శుభ్రపరస్తూ కండిషన్లో ఉంచుకోవాలని సమయానికి అయిల్ సర్విసింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సమయంలో పైఅధికారులకు వాహనాన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాలోని పోలీసు మోటారు వాహన డ్రైవర్లు, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మా.. నీకు వందనం
నారాయణపేటవాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. ● అమ్మ మాట.. బంగారు బాట.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్నగర్లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్కర్నూల్ నేడు మాతృ దినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్నగర్ తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. అమ్మ లేకుంటే నేను లేను తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ -
బీజేపీని సంస్థాతంగా బలోపేతం చేయాలి
నారాయణపేట: బీజేపిని సంస్థాగతంగా బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ.శ్రీనివాసులు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతం బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో వివరించి పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా బూత్స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. పార్టీలోని అన్ని శ్రేణులు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులను చేసియ పార్టీకి ఓటు వేసే దిశగా చైతన్యం చేయాలని సూచించారు. ప్రస్తుతం తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్తో యుద్దాన్ని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొంటున్నరన్నారు. సహోసోపేత నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల దేశ ప్రజలు మోదీ అభినందించారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు నాగూరావు నామాజీ, కొండయ్య, అట్లూరి రామకృష్ణ, నాయకులు పున్నం చంద్ లాహోటి, సాయిబన్న, పోషల్ వినోద్, శ్రీనివాసులు, రఘురామయ్యగౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆదివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
పల్లెల స్వచ్ఛతకు నిధులు
●స్వచ్ఛత వైపు అడుగులు.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపేట్టేలా ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించాం. ఇందుకోసం రూ.1,043.74 లక్షలను స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ కేటాయించింది. ఈ ప్రణాళికలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాం. అలాగే జిల్లాలో మిగిలిన 79 గ్రామాలను ఓడీఎఫ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – మొగులయ్య, డీఆర్డీఓ స్వచ్ఛభారత్ మిషన్ కింద.. జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించాం. అలాగే 7 మండలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆదేశాలు వచ్చాయి. – మాలిక్, జిల్లా మేనేజర్, ఎస్బీఎం నర్వ: పల్లెల స్వచ్ఛతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి పంచాయతీలో స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ కింద వివిధ పనులు చేపట్టాలని సూచించింది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.1,043.74 లక్షలు కేటాయించి ఆగస్టు 15 వరకు నిర్దేశించిన గ్రామాల్లో లక్ష్యం మేర పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు సంబంధించి పల్లెల్లో ఈ నెల 15 వరకు అంచనాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. 2025–26 వార్షిక ప్రణాళికతో.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణాభివృద్ధిశాఖ, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. గతంలో జిల్లాలోని 197 గ్రామాలను ఓడీఎఫ్గా ప్రకటించగా.. మిగిలిన 79 గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేసి బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు జిల్లాలోని మద్దూరు, మరికల్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు నెలకొల్పేందుకు రూ.1.28 కోట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే స్థలాల పరిశీలన కూడా అధికారులు పూర్తిచేశారు. దీంతోపాటు వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణాలు ఒక్కో యూనిట్కు రూ.14 వేల చొప్పున 248 యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకుగాను జిల్లాలో ఏడు మండలాలను ఎంపిక చేయగా.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారు. దామరగిద్ద మండలం క్యాతన్పల్లి, ధన్వాడ, కోస్గి మండలం అమ్లికుంట, మద్దూర్, మక్తల్ మండలం మంథన్గోడ్, నారాయణపేట మండలం కొటకొండ, నర్వలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో యూనిట్కు రూ.2.10 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. ఎస్బీఎం, పంచాయతీ నిధులతో.. సామూహిక మరుగుదొడ్డి సాధారణ రకం నిర్మాణానికి రూ.3 లక్షలు ఖర్చవుతుండగా.. ఇందులో ఎస్బీఎం రూ.2.10 లక్షలు కేటాయిస్తుండగా, మిగిలిన డబ్బులను గ్రామపంచాయతీ లేదా సీఎస్ఆర్ నిధుల నుంచి వెచ్చిస్తారు. ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు షట్టర్ నిర్మాణానికిగాను రూ.5 లక్షలు కేటాయిస్తుండగా.. ఇందులో ఎస్బీఎం రూ.3 లక్షలు, జీపీ ఫండ్స్ నుంచి రూ.2 లక్షలు వెచ్చించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. యూనిట్ల వారీగా నిధుల కేటాయింపు ఇలా.. కోటకొండలో నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు యూనిట్ లక్ష్యం మంజూరైన నిధులు (రూ.లక్షల్లో..) వ్యక్తిగత మరుగుదొడ్లు 4,443 533.16 సామూహిక మరుగుదొడ్లు 448 27.00 వ్యక్తిగత ఇంకుడు గుంతలు 3,472 225.70 సామూహిక ఇంకుడు గుంతలు 219 257.88 స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ కింద జిల్లాకు రూ.1,043.74 లక్షలు మంజూరు 2 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటు 7 మండలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం పరిశీలన.. స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి.. స్వచ్ఛభారత్ మిషన్కు సంబంధించిన పనుల వివరాలను ఆయా పంచాయతీల్లో తెలియజేస్తారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ సామూహిక ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు అవసరమో పరిశీలించి స్థలాలు ఎంపిక చేస్తారు. దీంతోపాటు జిల్లాలో ఓడీఎఫ్ కాని గ్రామాలను ఎంపిక చేసి వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలకు ఆసక్తి చూపే వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే పంచాయతీల్లో సామూహిక పారిశుద్ధ్య సమూహాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, సామూహిక ఇంకుడుగుంతలు, కంపోస్టు షెడ్లు వంటివి నిర్మించనున్నారు. -
ప్రతి విద్యార్థికి ప్రత్యేక మెడికల్ ఐడీ
నారాయణపేట: ఆర్బీఎస్కే వైద్యబృందాల ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి వీలు కలుగుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్క్రీనింగ్, ట్రీట్మెంట్, రెఫరల్ మెరుగునకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య సమాచారానికి ప్రత్యేక మెడికల్ ఐడీ ఉండాలని సూచించారు. వైద్య, విద్యశాఖలు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య సమాచారం మరింత స్పష్టంగా ఉండేలా వెబ్పోర్టల్లో తగిన మార్పులు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్ఓ డా.జయచంద్ర మోహన్, కో–ఆర్డినేటర్ డా. శైలజ, ఎస్ఓ సాగర్, డా. మోనేష్, సూపర్వైజర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ ప్రేమలు
ఆన్లైన్ వేదికలు.. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ● మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు ‘నాగర్కర్నూల్ జిల్లాలోని మైనర్ బాలికకు ఓ యువకుడు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా చాటింగ్ చేసిన తర్వాత తరచుగా కలుసుకునేవాళ్లు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆ బాలిక మైనర్గా ఉండగానే వివాహం జరిపించారు. ఆన్లైన్ పరిచయాలు ప్రేమగా మారుతుండటం, మైనర్ ప్రేమల నేపథ్యంలో మైనర్ వివాహాలు చోటుచేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి.’ -
అంధ విద్యార్థులకు ప్రవేశాలు
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారితశాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్లో కొనసాగుతున్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ రాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు వయస్సు ఉండి 40 శాతం అంధత్వం కలిగిన ధ్రువపత్రాలున్న విద్యార్థులు అర్హులని.. వారి వారి వయసు ఆధారంగా పాఠశాల, కళాశాలలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత వసతి, ఒక్కొక్కరికి నాలుగు జతల దుస్తులతో పాటు అన్ని వసతులు సమకూరుస్తామని చెప్పారు. మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్లో ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాల/కళాశాలలో స్వయంగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 96182 43794 సంప్రదించాలని సూచించారు. స్లాట్ బుకింగ్తోనే ప్లాట్ల రిజిస్ట్రేషన్ నారాయణపేట: రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 12 నుంచి స్లాట్ బుకింగ్ విధానంలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ రాంజీ తెలిపారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఇందుకు సంబంధించిన బ్యానర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిరోజు 48 స్లాట్ల బుకింగ్ ఉంటుందని.. registration.telangana.gov.in వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు కృష్ణయ్యగౌడ్, పవన్కుమార్రెడ్డి, ఆపరేటర్ విజయ్కుమార్, సిబ్బంది, డాక్యుమెంటర్ రైటర్లు పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక దిగుబడులు మద్దూరు: పంట మార్పిడితో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై నేల ఆరోగ్యం, సాగునీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పంటమార్పిడి, అంతర పంటలు, మొక్కల పెంపకం, సాగులో మెళకువల గురించి రైతులకు అవగాహన కల్పించారు. పచ్చి రొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ తయారీ, వినియోగం గురించి శాస్త్రవేత్తలు వివరించారు. భూసార పరీక్షల ప్రాముఖ్యత, సరైన విధానంలో ఎరువుల వాడకం, విత్తనాలు, ఎరువుల ఎంపిక గురించి తెలియజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, ఏఓ రామకృష్ణ, ఉద్యాన అధికారి హర్షవర్ధన్, పశు వైద్యాధికారి డా. సబిత, ఏఈఓలు శ్రావణ్, శ్వేత, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. జొన్న క్వింటా రూ.3,525 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవారం జొన్నలు క్వింటా రూ.3,525 ధర పలికాయి. అలాగే వరి ధాన్యం (హంస) గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,550, సోనా రకం రూ.2,155– రూ.1,439, పెసర రూ.5,212, ఎర్ర కంది రూ.4,209 ధరలు లభించాయి. ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా రూ.2,127 దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,127, కనిష్టంగా రూ.1,719 నమోదయ్యాయి. హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.1,815, కనిష్టంగా రూ.1,601గా ధరలు లభించాయి. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. నారాయణపేట మార్కెట్లో జొన్నలు క్వింటాల్కు రూ.3,525, ధాన్యం హంసరకం గరిష్టంగా రూ.1,826, కనిష్టంగా రూ.1,550, పెసర రూ.5,212, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,155, కనిష్టంగా రూ.1,439, ఎర్ర కందులు రూ.4,209 పలికాయి. -
సరిహద్దు చెక్పోస్ట్ తనిఖీ చేసిన ఎస్పీ
నారాయణపేట రూరల్: మండలంలోని జలాల్పూర్ శివారులో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే వానాకాలం సీజన్లో కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా అడ్డుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచామని.. వరి ధాన్యం వాహనాల వే బిల్లులు పరిశీలించి అనుమతించాలని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని, వ్యాపారస్తులపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆర్టీసీలో కండక్టర్ల బదిలీలు స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని పది ఆర్టీసీ (రీజియన్) డిపోల్లో పనిచేస్తున్న 89 మంది కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి 80 మంది అభ్యర్థులకు కండక్టర్లుగా వివిధ డిపోల్లో పోస్టింగులు ఇచ్చామని, అలాగే 89 మంది రెగ్యులర్ కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బ దిలీలు చేశామని ఆర్ఎం తెలిపారు. ఎంతోకా లంగా ఎదురుచూస్తున్న తమ బదిలీలను చేపట్టినందుకు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశా రు. ఆర్ఎంకు వారు కృతజ్ఞతలు పేర్కొన్నారు. -
ఆస్పత్రి పనుల్లో వేగం పెంచాలి
మాగనూర్ (మక్తల్): నియోజకవర్గ కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 150 పడకల ఆస్పత్రి పనులను శుక్రవారం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతంలో నిర్మితమవుతున్న 150 పడకల ఆస్పత్రి భవనాన్ని నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పనుల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పనులు చేయించాలని.. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్కుమార్, డైరెక్టర్లు పసుల రంజిత్రెడ్డి, సాలంబిన్ ఉమర్ బస్రవి, అంజి, కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్కుమార్, కోళ్ల వెంకటేష్, బోయ రవికుమార్, కావలి తాయప్ప, బోయ వెంకటేష్, సీఎస్ మూర్తి, కట్టా వెంకటేష్, వాకిటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలి
మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపికై న మద్దూరు మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. గురువారం మద్దూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన 1,341 దరఖాస్తుల పరిశీలనపై సమీక్ష నిర్వహించారు. క్షేత్ర పరిశీలన, ప్రొసీడింగ్స్, ల్యాండ్ సర్వే ఎంత వరకు వచ్చిందని భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరిని అడిగి తెలసుకున్నారు. దాదాపు 75 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యిందని కలెక్టర్కు తెలియజేయగా.. సర్వే పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలను చట్ట ప్రకారం పరిష్కారం చూపే బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు. ప్రతి సమస్యను ఒకటికి రెండు సార్లు చూసి క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆర్డీఓ రాంచందర్నాయక్, కొత్తపల్లి, కోస్గి, గుండుమాల్ తహసీల్దార్లు జయరాములు, బక్క శ్రీనివాస్, దయాకర్రెడ్డి పాల్గొన్నారు. -
రెన్యువల్కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పె రుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో వ్యవసా యం చేద్దామంటే వా టిని మేపేందుకు మేత లేదు. ఎకరా పంట సాగుకు రూ.25 వేల పెట్టు బడి అయితే అందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – సబావత్ పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా -
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
నారాయణపేట: దేశ వ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి , సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎమ్) రాష్ట్ర కన్వీనర్ టి సాగర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మిక,కర్షక సదస్సులో వారు మాట్లాడారు. మే 8 నుంచి 15 వరకు జీపుజాతాలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని, మే 16 నుంచి 19 సదస్సులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. కార్మికులు స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను వమ్ము చేస్తూ కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా 5 కార్మిక కోడ్లు రూపొందించబడినవని, కార్మికులకు 45వ లేబర్ సదస్సు సిఫారస్ మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గతంలో రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కించి కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని, ఇది రైతులకు చట్టపరంగా దొరకాలని, దీని కి అనుగుణంగా వ్యవసాయోత్పత్తుల సేకరణ కొనసాగాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలన్ని మాఫీ చేసి రుణ విమోచన చట్టం చేయాలని, ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని విద్యార్థి, యువజన, మహిళ, ఆదివాసి, గిరిజన, మైనార్టీ, సామాజిక సంఘాలతో పాటు మేధావులు, విద్యావంతులు, రాజకీయ పార్టీలు ఈ సమ్మె గ్రామీణ బందుకు సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక, కర్ష క సంఘం నాయకులు వెంకట్రామిరెడ్డి, బాల్రాం,గోపాల్, అశోక్, అంజిలయ్యగౌడ్ పాల్గొన్నారు. -
‘జంగంరెడ్డిపల్లి’ సర్వే పనులు ప్రారంభం
నర్వ: ఆరు గ్రామాల రైతుల చిరకాల వాంచ జంగంరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు సర్వే పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ సర్వేను చేపట్టినట్లు ఇరిగేషన్ ఈఈ ప్రతాప్సింగ్ తెలిపారు. ఆరు గ్రామాల రైతాంగానికి సుమారు 7వేల ఎకరాల నుంచి 10వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరీ సర్వే పనులను పూర్తిచేసి డీపీఆర్ తయారు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వే పనులను వేగవంతం చేయనున్నామన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పాథర్చేడ్, ఉందేకోడ్, జంగరెడ్డిపల్లి, బుడ్డగానితండా, గాజులయ్యతండా, కన్మనూర్ గ్రామాల రైతుల ఆయకట్టుకు సాగునీరు అందేలా ఈ సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. ఇదిలాఉండగా, త్వరగా సర్వే పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్ కోరారు. ఈ సర్వేలో డీఈ ఖాజమైనోద్దీన్, ఏఈ సయ్యద్, నాయకులు జగన్మోహన్ రెడ్డి, క్రిష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బస్ షెల్టర్ నిర్మించాలి..
దేవరకద్రలో ప్రయాణికులు నిలువ నీడ లేక ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఓబీ ప్రారంభం తర్వాత బస్సుల రాకపోకలు లేక బస్టాండ్ మూతబడింది. దీంతో ఆర్ఓబీకి రెండు వైపులా నిలబడి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా రెండు వైపులా బస్ షెల్టర్లు నిర్మించాలి. – సాంబశివుడు, ప్రజా సంఘం నాయకుడు, దేవరకద్ర వ్యాపారాలు జరుగతలేవు.. దేవరకద్ర రెండుగా విడిపోయినప్పటి నుంచి వ్యాపారాలు జరగడం లేఉద. గతంలో ఇతర గ్రామాల ప్రజలు గేటు దాటి వచ్చేవారు. ఇప్పుడు గేటు దాటడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ప్రజలు పాత బస్టాండ్ వైపు రావడం లేదు. వచ్చిన వారంతా అటు నుంచి అటే వెళ్లిపోతున్నారు. దీంతో తమ వ్యాపారాలు సరిగా నడవడం లేదు. వెంటనే ఆర్యూబీ నిర్మాణం చేపడితే సమస్య తీరి పట్టణం మళ్లీ ఒక్కటిగా మారుతుంది. – కిషోర్, కిరాణం వ్యాపారి, దేవరకద్ర● -
‘పత్రికా స్వేచ్ఛను కాలరాస్తే సహించం’
నారాయణపేట/నారాయణపేట రూరల్: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఏపీ పోలీసులు వ్యవహరించడం సరికాదని సీనియర్ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తు గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ పార్క్ దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఏపీ పోలీసుల తీరును ఖండిస్తూ నినాదాలు చేసి తహసీల్దార్ అమరేందర్ కృష్ణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఎలాంటి నోటీసు లేకుండా విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. పోలీసుల అనుసరించిన విధానాన్ని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు ఉన్నత న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లాలని తీర్మానించారు. వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్న కారణంగా జర్నలిస్టులను భయపెట్టి అదుపులో పెట్టుకోవాలన్న ఏకై క లక్ష్యంతో ఏపీ పోలీసులు తనిఖీలు చేశారని, అన్ని యూనియన్లు ఈ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జర్నలిస్టులపై మొదలైన పోలీస్ వేధింపులను తక్షణమే ఆపకపోతే జాతీయ స్థాయిలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆనంద్కుమార్ గౌడ్, రాజేష్ కుమార్, నవీన్ కుమార్, అనంతరాములు, లొట్టి శీను, రఘు, యాదన్న, రాజశేఖర్, వెంకట రాములు, రాజేష్, సంతోష్, శ్రీధ తదితరులు పాల్గొన్నారు. -
అన్నీ.. అవరోధాలే
ఆర్ఓబీ నిర్మాణంతో రెండుగా చీలిన దేవరకద్ర పట్టణం దేవరకద్ర: రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది దేవరకద్ర పట్టణ పరిస్థితి.. ఒకప్పుడు రైలు గేటు పడటంతో ట్రాఫిక్ స్తంభించి ఇక్కట్లు పడాల్సి వస్తుందని ఆర్ఓబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మిస్తే.. ఇప్పుడు ఏకంగా మొత్తం దేవరకద్ర పట్టణమే రెండుగా చీలిపోయిన దుస్థితి దాపురించింది. ఆర్వోబీ ప్రారంభమై ట్రాఫిక్ సమస్య తీరిందనే సంతోషం ఒక్క రోజు కూడా దక్కలేదు. అధికారులు గేటును పూర్తిగా మూసి వేసి ఇనుప స్తంభాలను అడ్డంగా బిగించారు. దీంతో దేవరకద్ర ప్రజల కష్టాలు అప్పటి నుంచి మొదలై ఇప్పటికీ తీరని సమస్యగా మారింది. ఇటు పాత బస్టాండ్, అటు కొత్త బస్టాండ్కు మధ్యలో మూసిన గేటు ఉండడంతో పట్టణం రెండుగా చీలిపోయింది. గేటు మూసేయడం వల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా.. రోడ్డుకు రెండువైపులా ఉన్న వ్యాపార కేంద్రాలన్నీ దాదాపుగా మూతబడటంతో కొందరు వ్యాపారులు ప్రత్యామ్నాయంగా రాయిచూర్ రోడ్డుకు షాపులను తరలించారు. కార్యాలయాలు ఒకవైపు.. దేవరకద్రలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ పాత పట్టణంలోనే ఉన్నాయి. ఆయా కార్యాలయాలకు వచ్చే ప్రజలు నిత్యం గేటును దాటుకుని రావాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనదారులు మూసిన గేటు వద్దనే వాహనాలు నిలిపి నడిచి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. పాత పట్టణంలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, ప్రభుత్వ దవాఖానా, పోలీస్స్టేషన్, పశువైద్యశాల, ఎస్టీఓ, పీఆర్, మిషన్ భగీరథ తదితర కార్యాలయాలతోపాటు పశువుల సంత, కూరగాయల సంత పాత బస్టాండ్ వైపే ఉన్నాయి. మార్కెట్ కార్యాలయం, హోల్సేల్ వ్యాపారాలు, విద్యుత్ కార్యాలయం, బ్యాంకులు అన్ని కొత్త బస్టాండ్ వైపు ఉన్నాయి. దేవరకద్ర పట్టణం ఇలా రెండుగా చీలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్యూబీ పూర్తయితేనే.. దేవరకద్రకు కొత్తగా ఆర్యూబీ మంజూరైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. గత వారం ఎంపీ డీకే అరుణ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరకద్రతోపాటు కౌకుంట్లకు ఆర్యూబీలు మంజూరయ్యాయని చెప్పారు. అయితే పనులు వెంటనే ప్రారంభించి కనీసం బస్సుల రాకపోకలు సాగించే విధంగా ఆర్యూబీ నిర్మిస్తే కొంత వరకై నా పట్టణం ఒక్కటిగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బస్టాండ్లోకి బస్సులు వస్తే ప్రయాణికుల ఇబ్బందులు తొలగడంతోపాటు వ్యాపారాలు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. బస్సులు రాకపోవడంతో.. దేవరకద్ర మీదుగా నిత్యం దాదాపు 400 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రాయిచూర్, నారాయణపేట, మక్తల్, ఆత్మకూర్ వంటి పట్టణాలతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ మార్గంలోనే బస్సులు తిరుగుతాయి. ఆయా బస్సుల రాకపోకలతో నిత్యం కళకళలాడే బస్టాండ్ ఇప్పుడు అటు వైపు రాకపోవడంతో వెలవెలబోతోంది. దీంతో ప్రయాణికులంతా ఆర్ఓబీకి రెండు వైపులా చివరలో రోడ్డు పక్కన నిలబడి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. చిన్నపిల్లలు, బ్యాగులతో మహిళలు, వృద్ధులు ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారులు ఈ విషయంలో స్పందించి ఆర్ఓబీకి రెండువైపులా తాత్కాలికంగా నిలబడటానికి బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పదుల సంఖ్యలో మూతబడిన వ్యాపార కేంద్రాలు రోడ్డుపైనే ఆగుతున్న బస్సులు రాకపోకలు లేక వెలవెలబోతున్న బస్టాండ్ ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
అన్నదాతలపై ఆర్థిక భారం
అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు.అందించే పరికరాలు ఇవే..రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.ఏడేళ్ల తర్వాత..వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలా యి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.ఖర్చులు, సమయం ఆదా..కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారప డుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదు పరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమో దం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒకరకంగా మంజూరు మరో రకంగాఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. -
అంగన్వాడీలకుమహర్దశ
కేంద్రాలపై పక్కా నిఘా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత ఉన్న 5జీ నెట్వర్క్తో కూడిన రూ.20 వేల విలువైన ట్యాబ్లను టీచర్లకు అందించాలని నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు సంబందించి సమగ్ర వివరాలు రోజు వారిగా నమోదు చేయడానికి, చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఆన్లైన్లో నమోదు చేయడానికి ఎంతో ఉపయోగపడనున్నాయి. నూతన ట్యాబ్లు వినియోగించి ప్రభుత్వం సరఫరా చేసే సరుకులు పక్కదారి పట్టకుండా కేంద్రాలపై పక్కా నిఘా ఏర్పాటు చేయనున్నారు. కోస్గి: గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పూర్వప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 2025–26 విద్యా సంవత్సరంలోనే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మాణంతోపాటు అన్ని కేంద్రాల్లో చిన్నారులకు మౌళిక వసతులు క ల్పించాలని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా టీచర్లకు 5జీ నెట్వర్క్తో ఉన్న ట్యాబ్లు అందించాలని మాతాశిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అరకొర వసతుల మధ్య అద్దె భవనాలలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు మహర్ధశ పట్టనుంది. పక్కా భవనాలు, మౌళిక వసతుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించడంతోపాటు ఒక్కో కేంద్రంలో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోనే భవన నిర్మాణాలతోపాటు మౌళిక వసతుల ఏర్పాటు పూర్తి చేయాలని శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నారాయణపేట, మద్దూర్, మక్తల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 649 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 55 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 422 కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులున్న అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మారనున్న రూపురేఖలు జిల్లాలో 90 శాతం అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు లేకుండానే కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 704 అంగన్వాడీ కేంద్రాలున్నప్పటికి 422 కేంద్రాలకు సొంత భవనాలు లేకుండా అరకొర వసతులున్న భవనాల్లో కొనసాగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్లు లేకపోవడంతో చిన్నారులను ఆరుబయటకు తీసుకెళ్తున్న దుస్థితి. ఇళ్ల మధ్య కేంద్రాలున్న చోట కాలనీవాసులకు అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు మధ్య వాగ్వాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ నూతన భవనాలు నిర్మించడంతోపాటు మౌళిక వసతులు కల్పించనుండటంతో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారతాయని టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలు 55సొంత భవనాలు లేని కేంద్రాలు 422జిల్లా వివరాలిలా.. ఐసీడీఎస్ ప్రాజెకులు నారాయణపేట, మక్తల్, మద్దూర్సొంత భవనాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ టీచర్లకు 5జీ నెట్వర్క్తో కొత్త ట్యాబ్లు జిల్లాలో 422 కేంద్రాలకు సొంత భవనాలు కరువు అంగన్వాడీ కేంద్రాలు 649 -
‘ఉపాధి’ లక్ష్యాలను పూర్తి చేయాలి
నారాయణపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూర్తి చేయాలని దేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ అమలుపై జిల్లాలోని ఎంపీడీఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎవరి పరిధిలో వారికి ఇచ్చిన లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయకున్నా కనీసం 75 శాతమైనా చేయాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మద్దూర్, కోస్గి, నర్వ, ఊట్కూర్, నారాయణపేట,మద్దూర్, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా మండలాలకు నిర్ధేశించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. మిగతా జిల్లాలో పోలిస్తే జిల్లా లక్ష్యాల పరంగా వెనకబడి ఉందని స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సమీక్షా సమావేశంలో మళ్లీ ఇదే తరహా అసంపూర్తి లక్ష్యాల వివరాలు ఉండరాదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. -
‘మోదీతోనే దేశ రక్షణ సాధ్యం’
నారాయణపేట రూరల్: దేశ రక్షణ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎవరితో యుద్ధానికి ఇష్టపడదని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించే విధంగా చర్యలు ఉంటాయని ఆపరేషన్ ఆఫ్ సింధూర్ నిరూపించిందన్నారు. 1993 బొంబాయి బాంబు దాడుల నుంచి, 2001 పార్లమెంట్పై దాడి, 2005 ఢిల్లీ వరుస పేలుళ్లు, 2006 ముంబాయిలో రైలు దాడి, 2008లో బాంబే హోటల్, రైల్వే స్టేషన్లో పేలుళ్లు, 2016 జమ్మూలో ఆర్మీ జవాన్లపై దాడులు, 2019 పుల్వామా దాడి తాజాగా పహల్గాం దాడులకు సంబంధించి దేశం ఎంతో నష్టపోయిందన్నారు. పాక్ చర్యలకు ప్రతీకారంగా ఆపరేషన్ ఆఫ్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై చేపట్టిన దాడులు దేశం మొత్తం గర్విస్తుందని అన్నారు. ఇకముందు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయం కలిగే విధంగా దాడులు జరిగాయన్నారు. ఇకనైనా టెర్రరిస్టులను బహిష్కరించి ప్రపంచ శాంతికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోనూ పార్టీలకతీతంగా మోడీ చేసిన చర్యలకు అండగా నిలవాలని సూచించారు. అనంతరం నాయకులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకొన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సత్య యాదవ్, పట్టణ అధ్యక్షులు వినోద్, నాయకులు కృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు. -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పటిష్ట చర్యలు నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్కు చెల్లించే రుసుములు ఇలా.. ద్విచక్రవాహనం 320-360 కార్లు 590-700కమర్షియల్ వాహనాలు 600-800 త్రిచక్రవాహనాలు 350-450 2018 డిసెంబర్ 31వ తేదీకి ముందు వాహనాల వివరాలిలా.. జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబూబ్నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433 వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424 నాగర్కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342 గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218 నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149 2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబ్బ్నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163 వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01 నాగర్కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78 గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44 నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44 పాత వాహనాలకు హై సెక్యూరిటీ పాత వాహనాలకు అమర్చుకోవాలి పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం. – చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్పోర్టు అధికారి, నాగర్కర్నూల్ మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్ఐఏఎం.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ 2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు నకిలీ నంబర్ ప్లేట్ల కట్టడి.. రహదారి భద్రతే లక్ష్యం -
మత్తు పదార్థాలనిర్మూలనకు చర్యలు
మాగనూర్(మక్తల్): గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు డీఎస్సీ ఎన్.లింగయ్య తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని పలు ప్రదేశాల్లో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముఖ్యంగా కిరాణషాపులు, పాన్షాప్లు, అనుమానంగా ఉన్న పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్సి బలరాం, నరేందర్ పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి ధన్వాడ: ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంపులను యువత, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. బుధవారం ధన్వాడ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని డీఈఓ తనిఖీ చేశారు. విద్యార్థుల ఆటలను వీక్షించారు. శిక్షణలో పాల్గొన్న వారికి పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఊం నరసింహచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతు ఫార్మర్ ఐడీ కలిగి ఉండాలి ఊట్కూరు: ప్రతి రైతు ఫార్మర్ ఐడి కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ అన్నారు. బుధవారం ఊట్కూరులోని రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్కార్డుతో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు ఆధార్ ఐడి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చెయ్యాలనే సంకల్పంతో ఫార్మర్ ఐడీని చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయ అధికారులను సంప్రదించి ఫార్మర్ ఐడిని తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి గణేష్రెడ్డి, ఏఏఓ చరన్, స్వరూప, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలమర్రిలో ఏర్పాట్లు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని విదేశీ పర్యాటకుల బృందం సందర్శించనుంది. దీంతో ఈనెల 2 నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ప్రాంతం మొత్తం ఎక్కడా చెత్తాచెదారం లేకుండా సుమారు 25 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అలాగే 500 చదరపు గజాల విస్తీర్ణంలో లాన్ (కార్పెట్ గ్రాస్) ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాకర వాతావరణం ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిని బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. మరోవైపు మెట్టుగడ్డ (ఎన్హెచ్–167) నుంచి మొదలుకొని పిల్లలమర్రి వరకు గల విశాలమైన రోడ్డుకు ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. వీటి మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను సైతం తొలగిస్తున్నారు. -
ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు
నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం -
300 టన్నులకు పైగా..
నాగర్కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ ● -
నాణ్యమైన విద్య అందిస్తాం..
2025–26 విద్యాసంవత్సరానికి పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భవనాల నిర్మాణం చివరిదశలో ఉంది. సిబ్బంది నియామకంపై ప్రభుత్వానికి లేఖ రాశాం. న్యాయ విద్యలో మూడు (ఎల్ఎల్బీలో రెండు సెక్షన్లు, ఎల్ఎల్ఎం).. ఇంజినీరింగ్లో మూడు కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తాం. విద్యార్థులకు అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్, వైస్ఛాన్స్లర్, పీయూ పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలి.. యూనివర్సిటీలో లా, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఉమ్మడి పాలమూ రు జిల్లా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. ఏర్పాటు చేయనున్న కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలి. ఇబ్బందుల్లేకుండా పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి. – వంశీ, పీయూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ● -
నూనె గింజల ఉత్పత్తి పెంచాలి: కలెక్టర్
నారాయణపేట: జిల్లాలో నూనె గింజల ఉత్ప త్తి పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (ఎన్ఎంఈఓ) అమలుపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో డిమాండ్ మేరకు నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ మేరకు జిల్లాలో నూనె గింజల సాగును ప్రోత్సహించా లని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే మద్దూర్, దామరగిద్ద, మక్తల్ మండలాల్లో రైతు ఉత్పత్తిదారులు సంఘాల (ఎఫ్పీఓ) సహకారంతో సుమారు 1500 హెక్టార్లలో వేరుశనగ సాగును ప్రోత్సహిస్తున్నట్లు డీఏఓ తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, ఉత్పాదకత పెంపునకు శిక్షణ కార్యక్రమాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ నిర్వహించనున్నట్లు వివరించారు. అదే విధంగా మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు కోసం ఉద్యానశాఖ సహకారం అవసరమన్నారు. అయిల్ ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మద్దతు ఇవ్వాలని డీఏఓ విజ్ఞప్తి చేశారు. ఆయా ప్రతిపాదనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అవసరమైన సహాయాన్ని జిల్లా యంత్రాంగం అందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎల్డీఎం విజయ్కుమార్, ఇరిగేషన్ ఈఈ బ్రహ్మానందారెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఉన్నారు. బ్యాంకర్ల పాత్ర కీలకం నారాయణపేట: రాజీవ్ యువవికాసం పథకం అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్ అన్నారు. మంగళవారం నారాయణపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎల్డీఎం, డీబీసీడీఓ, డీఎండబ్ల్యూఎంసీ, ఎంపీడీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకం మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల అర్హతను ధ్రువీకరించే డాక్యుమెంటేషన్ను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. తాత్కాలికంగా అర్హతగల అభ్య ర్థుల జాబితాను వారంలోగా సిద్ధం చేయాలన్నారు. తదుపరి ప్రక్రియను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకోండి నారాయణపేట: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక రంగాల పనితీరును మెరుగు పరిచేందుకు గాను జిల్లా పరిశ్రమల కేంద్రంలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు www.nimsme. gov.in వెబ్సైట్ లేదా 99661 71253 నంబర్ను సంప్రదించాలని సూచించారు. సోనా క్వింటాల్ రూ.2,158 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసా య మార్కెట్యార్డులో మంగళవారం వడ్లు సోనా క్వింటాల్ గరిష్టంగా రూ. 2,158, కనిష్టంగా రూ. 1,355 ధర పలికింది. పెసర క్వింటాల్ రూ. 6,219, హంసధాన్యం గరిష్టంగా రూ. 1,935, కనిష్టంగా రూ. 1,729, అలసందలు రూ. 5,052, తెల్లకందులు రూ. 6,032 ధరలు వచ్చాయి. జీజీహెచ్లోకివెల్నెస్ సెంటర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాత డీఎంహెచ్ఓ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న వెల్నెస్ సెంటర్ను త్వరలో జీజీహెచ్ ఆవరణకు తరలించనున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వివిధ గదులను డీఎంహెచ్ఓ డా.కృష్ణ, సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్తో పాటు సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పరిశీలించారు. చివరకు ఈ ఆస్పత్రి వెనుక భాగంలోని రెండు పెద్ద గదులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఆర్ ఎంఓ జరీనా, ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, రాజసింహు డు, వెంకట్, సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిల్గౌడ్ పాల్గొన్నారు. -
చివరి దశలో భవనాల నిర్మాణం..
పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మితమవుతున్న సైంటిఫిక్ రీసెర్చ్ భవనంలో కొంత భాగాన్ని ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించనున్నారు. అదేవిధంగా నిర్మితమవుతున్న ఎంఈడీ కళాశాల భవనం మొదటి అంతస్తులో లా కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా భవనాల పనులు చివరి దశలో ఉన్నాయి. వీటితో పాటు ఆయా విభాగాల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులు సుమారు 300 మందికి హాస్టల్ వసతి కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కొత్తగా హాస్టల్ భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా వసతికల్పించేలా ముందుకు సాగుతున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఇదివరకే వేర్వేరుగా నిర్మించిన హాస్టల్ భవనాల్లోనే లా, ఇంజినీరింగ్లో ప్రవేశం పొందే వారిని సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. -
ఉపాధి కూలీలకు వసతులు కల్పించండి
ఆత్మకూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని పిన్నంచర్లలో మంగళవారం జరుగుతున్న ఉపాధి పనులను ఆమె పరిశీలించారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం సేకరించాలని ఐకేపీ సిబ్బందిని డీఆర్డీఓ ఆదేశించారు. పిన్నంచర్లలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరామ్రెడ్డి, ఏపీఓ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్వై సొమ్ము స్వాహా
మాగనూర్: జిల్లాలోని మాగనూర్ పోస్టాఫీసులో అవినీతి బాగోతం బయటపడింది. సుకన్య సమృద్ధియోజన ఖాతాదారుల సొమ్ము రూ.లక్షల్లో పక్కదారి పట్టింది. ఆడపిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చమటోడ్చి సంపాదించి జమ చేసుకున్న సొమ్మును బీపీఎం ధనుంజయ్ అప్పన్నంగా కాజేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మాగనూర్ పోస్టాఫీసులో మొత్తం 760 ఖాతాలు ఉండగా.. అందులో ఎస్బీ 36, ఆర్డీ ఖాతాలు 552, సుకన్య సమృద్ధియోజన ఖాతాలు 172 ఉన్నాయి. వీరంతా కొన్నేళ్లుగా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ వస్తున్నారు. అయితే సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి 57 ఖాతాల్లో నిధుల గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ఖాతాదారుల పాస్పుస్తకాల్లో స్టాంఫ్ వేసి నిధులు జమ చేసినట్లు ఉండగా.. అధికారికంగా ఖాతాలో మాత్రం డబ్బులు జమ కాలేదు. పాస్పుస్తకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఖాతాదారులు పొదుపు చేయడం లేదు. బయటపడింది ఇలా.. మాగనూర్కు చెందిన సుకన్య సమృద్ధియోజన ఖాతాదారులు తొమ్మిదేళ్లుగా బీపీఎం ధనుంజయ్కు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే వారి సొమ్ము బీపీఎం పోస్టల్ ఖాతాలో జమ చేయకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఖాతాదారుల పాస్పుస్తకంలో మాత్రం నగదు జమ చేసినట్లు స్టాంఫ్ వేసి ఇవ్వడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే గత జనవరి నుంచి అతడు గ్రామంలో పోస్టుకార్డుల పంపిణీ, ఇతర కార్యకలాపాలు నిర్వర్తించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు ఖాతాదారులు పోస్టాఫీసులో సంప్రదించారు. ఈ క్రమంలో వారు కట్టిన సుకన్య సమృద్ధియోజన డబ్బులు ఖాతాలో జమ కాలేదని గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. అప్పటికే బీపీఎం రూ. 6లక్షలకు పైగా డబ్బులు సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు గుర్తించారు. వీటితో పాటు గ్రామంలోని కొందరు వ్యక్తుల నుంచి మరో రూ. 15 లక్షలకు పైగా డబ్బులు అప్పు రూపంలో తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా బీపీఎం గ్రామాన్ని వదిలేసి పోవడంతో మోసపోయామని తెలుసుకున్న ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. మంగళవారం పోస్టాఫీసు వద్ద ఆందోళనకు దిగారు. బాఽ దితులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సదరు బీపీఎంను సస్పెన్షన్ చేసి విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాగనూర్ పోస్టాఫీసులో బీపీఎం చేతివాటం రూ.లక్షలు పక్కదారి ఆందోళనలో సుకన్య సమృద్ధియోజన ఖాతాదారులు విచారణ చేపట్టిన అధికారులు -
మామిడి రైతు కుదేలు
కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నాగర్కర్నూల్ 34,712 మహబూబ్నగర్ 9,275 జోగుళాంబ గద్వాల 5,124 నారాయణపేట 3,604 జిల్లాల వారీగా మామిడి తోటల ఎకరాల సాగు ఇలా.. వనపర్తి 16,050 అకాల వర్షాలు,ఈదురుగాలులతో తీవ్రనష్టం మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించక పంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశా
సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా భవిష్యత్లో మేలు చేకూరుతుందనే ఆలోచనతో నా ఇద్దరు కూతుర్ల పేర్లపై ఇప్పటి వరకు రూ. 1.80లక్షలు డిపాజిట్ చేశాను. బీపీఎం పాస్పుస్తకంపై స్టాంఫ్ వేసి ఇస్తుండటంతో ఎలాంటి అనుమానం రాలేదు. చివరకు మోసపోయానని తెలిసి అధికారులను సంప్రదిస్తే సరైన స్పందన లేదు. – వాకిటి శ్రీనివాసులు, బాధితుడు న్యాయం చేయాలి.. మాది నిరుపేద కుటుంబం. నేను నా కూతురు మంజుల పేరుపై సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఐదేళ్ల నుంచి ప్రతినెలా రూ.2వేలు కట్టుకుంటూ వచ్చాను. నాకు కనీసం పాస్పుస్తకం కూడా ఇవ్వకుండా బీపీఎం మోసం చేశాడు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. – శ్యామలప్ప, బాధితుడు, మాగనూర్ ప్రతినెలా రూ.3వేలు చెల్లించా.. భవిష్యత్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని ముందుజాగ్రత్తగా ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధియోజన పథకం కింద డబ్బులు కడుతున్నా. మూడేళ్లుగా ప్రతినెలా రూ.3వేల చొప్పున కట్టుకుంటూ వచ్చాను. ఈ మోసంతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నమ్మకం పోయింది. – నర్సింగమ్మ, బాధితురాలు, మాగనూర్ విచారిస్తున్నాం.. మాగనూర్ బీపీఎం ధనుంజయ్ సుకన్య సమృద్ధియోజన ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి.. వారి ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించడం వాస్తవం. ఇప్పటికే బీపీఎంను సస్పెన్షన్ చేసి విచారణ చేపట్టాం. ఖాతాదారులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరికీ న్యాయం చేస్తాం. – ప్రశాంతి, ఎంఓ, తపాలాశాఖ ● -
నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 68,765 ఎకరాల్లో మామిడి తోటలు సాగు అవుతున్నాయి. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనే అత్యధికంగా 25 వేల ఎకరాలకు పైగా తోటలు ఉన్నాయి. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి పంట నష్టం జరిగింది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా కల్వకుర్తి, బిజినేపల్లి మండలాల్లో భారీగా చెట్లు నెలకొరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో 82 మంది రైతులకు సంబంధించి 272 ఎకరాల్లో చెట్లు నేలకొరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాలపై సమాచారం సేకరించలేదు. వాస్తవంగా పంట నష్టం భారీస్థాయిలో జరిగింది. కానీ, మామిడి పంటనష్టం అంచనా వేసేటప్పుడు అధికారులు నేలరాలిన కాయలను పరిగణలోకి తీసుకోరు. చెట్లు నెలకొరిగితేనే లెక్కలోకి తీసుకుంటారు. ఈ రకమైన సాంకేతిక సమస్యల కారణంగా మామిడి పంటనష్టంపై పూర్తిస్థాయి నివేదిక అధికారులు రూపొందించలేకపోతున్నారు. -
లక్ష్యానికి మించి..!
కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం తీసుకువస్తున్న రైతులు నారాయణపేట: బయటి మార్కెట్లో ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుండడం.. అకాల వర్షాలు, గాలివానల భయం వెంటాడుతుండడం.. మొత్తంగా జిల్లాలో అనుకున్న దానికంటే అధికంగా రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. రైతులు ఒక్కసారిగా ధాన్యం తీసుకువస్తుండడంతో మిల్లులు, గోడౌన్లలో ధాన్యం దింపుకొనేందుకు స్థలం లేకుండాపోయింది. దీంతో తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని రైతులు.. స్థలం లేదు మేం దింపుకోం అంటూ మిల్లు యజమానులు తేల్చి చెబుతుండడంతో ఇటీవల పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 43 మిల్లులు.. 1.12 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం జిల్లాలోని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల కేపాసిటీ 1.12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. కాగా ఈ సారి ధాన్యమంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువస్తుండడంతో కెపాసిటీ ఉన్న దాన్ని పెంచి డబుల్ టైమ్ కెపాసిటీగా ధాన్యాన్ని కేటాయిస్తు వస్తున్నారు. దీంతో మిల్లర్లు తమ గోడాన్తో పాటు బహిరంగ ప్రదేశంలో ధాన్యం బస్తాలను పెర్చుతూ నిల్వ చేస్తున్నారు. దీంతో ఊట్కూర్, మాగనూర్, క్రిష్ణ మండలాల్లోని రైస్ మిల్లుల కెపాసిటీ ఇప్పటికి డబుల్ కెపాసిటీ సైతం ముగిసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా మిల్లులో సైతం ధాన్యాన్ని సీఎంఆర్ చేసేందుకు సమయం పడుతుండడంతో మిల్లర్లు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. గాలి, దూలి వానలతో పరేషాన్లో రైతులు యాసంగిలో వేసిన వరి పంట చేతికి వస్తున్న సమయంలో గాలి, దూలి వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉగాది కంటే ముందు కోతలు చేసిన రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజులుగా కోతలు అధిక మొత్తంలో చేపట్టడంతో ఒక్కసారిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుంది. ఓ వైపు కల్లాలు లేకపోవడం.. రోడ్లపై ఆరబెట్టుకోవడం.. ఆకాల వర్షాలతో ఎక్కడ ధాన్యం తడిసిపోతుందంటూ రైతులు వాపోతున్నారు. లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు యాసంగిలో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా సివిల్ సప్లయ్ అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్దం చేసింది. కాగా ఇప్పటి వరకు 97 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 8,401 మంది రైతులతో 6,98,237 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో దొడ్డు రకం 1,55,651 క్వింటాళ్లు, సన్నరకాలు 5,42,585 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. 6,45,243 క్వింటాళ్లు ఇప్పటికే రైస్మిల్లులకు చేరుకున్నాయి. మరికల్లోని రాయచూర్ రోడ్డులోని మిల్లు వద్ద బారులు తీరిన వాహనాలు ఒక్కో రైస్మిల్లుకు రెట్టింపు స్థాయిలో ధాన్యం కేటాయింపులు ఇప్పటికే ధాన్యంతో నిండిన మిల్లులు, గోడౌన్లు అకాల వర్షాలు, గాలివానల భయంతో త్వరగా ధాన్యం విక్రయానికిరైతుల మొగ్గు స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు -
పారా బాయిల్డ్లో భారీ అగ్నిప్రమాదం
వనపర్తి: పెబ్బేరు శివారులోని సాయిగోపాల్ పారా బాయిల్డ్ మిల్లులో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి–44కు సమీపంలోని మిల్లులో సాయంత్రం ఎవరూ లేని సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి.. గన్నీ బ్యాగులు, ధాన్యం బస్తాలు, మర ఆడించిన బియ్యం పెద్దమొత్తంలో దహనమైనట్లు మిల్లు యజమాని తెలిపారు. మిల్లులో పనిచేసేవారు టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగగా.. గమనించిన వారు వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతోపాటు కొత్తకోట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినా.. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన -
చివరి గింజ వరకు కొంటాం..
జిల్లాలోని రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలుచేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. అకాల వర్షాలు వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ధాన్యం వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నాలకు రూ. 500 బోనాస్ వస్తుంది. – సైదులు, సివిల్ సప్లయ్ డీఎం రైతులంటే అలుసా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎన్నో కష్టాలకు ఓర్చి మిల్లుకు తీసుకువస్తే ధాన్యం దించుకోలేమంటున్నారు. రైతులు పడే కష్టాలు అధికారులకు ఎలా తెలుస్తాయి. మిల్లుల దగ్గర రోజుల తరబడి ఉంటే ఆర్థమవుతుంది. తాము తెచ్చిన ధాన్యం బస్తాలను దించుకునేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు. – బసప్ప, రైతు కన్మనూర్ 150 బస్తాలు తెచ్చా.. ట్రాక్టర్ను అద్దెకు తీసుకొని 150 బస్తాలను లోడ్ చేసి గుడేబల్లూర్ సమీపంలోని మిల్లుకు తీసుకువచ్చా. రెండు రోజులైనా ఖాళీ చేయడం లేదు. నాతో పాటు మిగతా రైతుల పరిస్థితి ఇదే. లేబర్ చార్జీలు సైతం వసూలుచేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం. – శ్రీధర్, రైతు వడ్వాట్ ధాన్యం దించుకోవడంలేదు ధాన్యం బస్తాలతో ట్రాక్టర్ను వరుసలో పెట్టి నాలుగు రోజులు అవుతుంది. టోకెన్లు ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత తమ మిల్లుకు ఇచ్చిన టార్గెట్ అయిపోయిందంటూ ధాన్యం బస్తాలను దించుకోమని చెప్పడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదు. విధిలేక ఆందోళనకు దిగితే.. అధికారులు అక్కడికి చేరుకొని ధాన్యం బస్తాలను దించుకునేలా ఆదేశించారు. రోజుల తరబడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – బచ్చప్ప, రైతు, ఉందేకోడు -
స్పందన అంతంతే..
ఈ నెల 3తో ముగిసిన ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు పెద్దగా స్పందన రాలేదు. అనధికార లేఔట్లలోని స్థలాను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువు ముగిసినా.. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. మూడుసార్లు గడువు పెంచినా ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 21 పురపాలికల్లో కలిపి కేవలం రూ.67.33కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ ఏడాది మార్చి 31లోగా చెల్లించే వారికి మొత్తం ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30 వరకు, మళ్లీ ఈనెల 3వ తేదీ వరకు ఇలా మూడుసార్లు పెంచింది. పురపాలికల వారీగా ఆదాయం ఇలా.. ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 32,005 దరఖాస్తులు రాగా.. వీటిలో ఎల్ఆర్ఎస్కు అర్హత కలిగిన 22,183కి ఫీజు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఇందులో 7,424 మంది దరఖాస్తుదారులు రూ.18.08 కోట్లు చెల్లించగా..ఇప్పటివరకు 2,910 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. జడ్చర్ల పరిధిలో 17,935 దరఖాస్తులు రాగా.. అర్హత కలిగిన 11,071కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,933 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 847కి మాత్రమే ప్రొసీడింగ్స్ అందాయి. భూత్పూర్లో 6,341 దరఖాస్తుల్లో 4,703కి ఫీజు చెల్లించాల్సి ఉంంది. 1,375 మంది దరఖాస్తుదారులు రూ.2.67 కోట్లు చెల్లించగా.. 651కి ప్రొసీడింగ్స్ అందాయి. దేవరకద్ర పరిధిలో 6,765 దరఖాస్తులకు 6,699కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 1,036 మంది రూ.1.69 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 29,450 దరఖాస్తులు రాగా.. 25,827కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 5,214 మంది దరఖాస్తుదారులు రూ.6.40 కోట్లు చెల్లించారు. 2,766 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. పెబ్బేరులో 7,432 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 6,484 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,561 మంది రూ.1.88 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 417 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కొత్తకోటలో 7,740 దరఖాస్తులు రాగా 7,318కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,355 మంది రూ.1.60 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు 63 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ఆత్మకూరులో 3,827 దరఖాస్తులకు 3,150కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 822 మంది రూ.98 లక్షలు చెల్లించగా..623 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అమరచింతలో 619 దరఖాస్తుల్లో 333కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 164 మంది రూ.56 లక్షలు చెల్లించారు. ఇప్పటివరకు 121 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 16,266 దరఖాస్తులు రాగా 10,782 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. 2,895 మంది రూ.4.78 కోట్లు చెల్లించగా..1,728 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కల్వకుర్తిలో 11,643 దరఖాస్తులు రాగా 9,491 కి ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,160 మంది రూ.4.85 కోట్లు చెల్లించారు. 1,088 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. కొల్లాపూర్లో 4,654 దరఖాస్తులకు 3,718కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 713 మంది రూ.1.23 కోట్లు చెల్లించారు. 264 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అచ్చంపేటలో 12,291 దరఖాస్తులకు 10,765కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,871 మంది రూ.2.72 కోట్లు చెల్లించారు.106 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. ● నారాయణపేట మున్సిపాలిటీలో 7,154 దరఖాస్తులలో 2,036కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,639 మంది రూ.4.19 కోట్లు చెల్లించారు. 772 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మక్తల్లో 10,616 దరఖాస్తులకు 9,063కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,288 మంది రూ.2.44 కోట్లు చెల్లించారు.599 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. కోస్గి పరిధిలో 4,168 దరఖాస్తులు రాగా 1,987కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 965 మంది రూ.1.94 కోట్లు చెల్లించారు. 135 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. మద్దూరులో 1,493 దరఖాస్తులు రాగా 1,232 కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 322 మంది రూ.34 లక్షలు చెల్లించారు. 234 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. ● గద్వాల పట్టణ పరిధిలో 14,607 దరఖాస్తులు రాగా 4,000కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,844 మంది రూ.2.96 కోట్లు చెల్లించారు. 927 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అయిజలో 10,166 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 5,244కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 1,155 మంది రూ.1.47 కోట్లు చెల్లించారు. 689 మందికే ప్రొసీడింగ్స్ అందాయి. అలంపూర్లో 431 దరఖాస్తులే రాగా 366కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 122 మంది కేవలం రూ.16 లక్షలే చెల్లించారు. 64 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. వడ్డేపల్లిలో 1,967 దరఖాస్తులు రాగా 1,787కి ఫీజు చెల్లించాల్సి ఉండగా 378 మంది రూ.73 లక్షలు చెల్లించారు.304 మందికి ప్రొసీడింగ్స్ అందాయి. మూడుసార్లు గడువు పెంచినా నెరవేరని ప్రభుత్వ లక్ష్యం ఉమ్మడి జిల్లాలో రూ.67.33 కోట్ల ఆదాయం అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్కు రూ.18.08 కోట్లు.. అలంపూర్ మున్సిపాలిటీకి రూ.16 లక్షలు మాత్రమే.. -
సమర్థవంతంగా వేసవి శిబిరాలు
నారాయణపేట: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవి శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ జిల్లాలో నిర్వహిస్తున్న 50 వేసవి శిబిరాల నిర్వహణ తీరుపై అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, లీడ్బ్యాంక్ మేనేజర్ విజయ్కుమార్, మహిళా సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 15 రోజులు పాటు కొనసాగే శిక్షణలో రోజువారి అంశాలను ప్రాధాన్యత క్రమంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి నలుగురు వలంటర్లను నియమించుకొని వంద మంది విద్యార్థులు విధిగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే అన్నారు. ప్రతి రోజు ప్రధానోపాధ్యాయుడితో పాటు సీనియర్ ఉపాధ్యాయులు క్యాంపును సందర్శించి ఆంగ్లం, గణితం, సైన్స్ ఎక్స్పైర్ మెంట్లను నిర్వహించుటకు తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరమైన సందర్భంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోచ్చని సూచిస్తూ కేజీబీవీలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంపును మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్, అకడామిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్, జీసీడీఓ నర్మద పాల్గొన్నారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి ప్రజావాణిలో ఫిర్యాదుదారులు విన్నవించే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. మొత్తం 32 ఫిర్యాదులు రాగా అత్యధికంగా భూ సమస్యలు ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ రాంచందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 11 అర్జీలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 11 అర్జీలు అందాయి. వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం అందేలా చూడాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ జిల్లాలో ఆయా ఎస్ఐలను ఫోన్లో ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని, స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని సూచించారు. భూసేకరణవేగవంతం చేయాలి నారాయణపేట: నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పనులను భూసేకరణ కార్యాలయ అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఏఏ సర్వే నంబర్లలో ఎన్ని ఎకరాలను సేకరించాలనే విషయమై ఆరా తీశారు. సర్వే నంబర్లతో పాటు భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలతో తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయా చెరువుల కింద సేకరించాల్సిన భూమి సర్వే నంబర్లతో నివేదికతో పాటు షెడ్యుల్ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్యాకేజీ 1,2 కింద పంప్హౌస్, పైప్లైన్ల ఏర్పాటుకు కోసం భూసేకరణ పూర్తి అయిందని, ప్యాకేజీ 1 కింద పేరపళ్ల జాయమ్మ చెరువు పరిధిలో 219 ఎకరాలను సేకరించాల్సి ఉందని ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్ బేన్షాలం, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీధర్, ఈఈలు బ్రహ్మనందరెడ్డి, ఉదయశంకర్, ఏడి సర్వే ల్యాండ్ గిరిధర్, ఎస్డీసీ కార్యాలయ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
ప్రజాసేవకే అంకితం
నారాయణపేట రూరల్: నా జీవితం ప్రజాసేవకే అంకితమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఎంపీ జన్మదిన వేడకలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ హాజరై కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై అభిమానంతో ప్రజల ప్రాణాలు కాపాడే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమేనని అన్నారు. అంతకుముందు ఎంపీని గజమాల, శాలువాలతో నాగురావు నామాజీ, రతాంగ్ పాండురెడ్డి, విఎస్.విజయ్ కుమార్, లక్ష్మీకాంత్రెడ్డి, గోవర్ధన్ గౌడ్, పున్నం చంద్ లాహోటి, పడాకుల శ్రీనివాసులు, నందు నామాజీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
భగత్సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: బ్రిటీష్ సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయాలని.. అందుకు పోరాటమే మార్గమని భావించి వారిని గడగడలాడించిన విప్లవ ఉద్యమ శిఖరం భగత్సింగ్ అని.. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని పీవైఎల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. మక్తల్లో సోమవారం నిర్వహించే భగత్సింగ్ విగ్రహావిష్కరణ సభకు సంబంధించి వాల్పోస్టర్లను ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశభక్తిని చాటి చెప్పి దేశంలో సీ్త్ర పురుషులు సమానత్వంగా ఉండాలని నినాదించిన గొప్ప వ్యక్తి భగత్సింగ్ అని అన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో విద్యార్థులు,యువకులు, మహిళలు, విద్యావేత్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి నారాయణ, టీయుసిఐ జిల్లా కార్యదర్శి నరసింహా, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.నరసింహా, పీఓడబ్యూ జిల్లా కార్యదర్శి సౌజన్య బాలు, వెంకటేష్ పాల్గొన్నారు. కోస్గి బస్టాండ్లో తనిఖీలు కోస్గి రూరల్: దొంగతనాలు, నేరాల కట్టడే లక్ష్యంగా కోస్గి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆదివారం కోస్గి బస్టాండ్లో ఎస్ఐ బాల్రాజు పలువురు అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. కొంత మంది వ్యక్తులు రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని, అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే బస్టాండ్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రయాణికులు సైతం బస్సులు ఎక్కే సమయంలో, ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు పరచాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటం రాజు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలోని సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అడ్వయిజరీ కమిటీ నియమించి కార్మికుల కోసమే నిధులు వెచ్చించాలని, కనీస పింఛను నెలకు రూ.9 వేలు పెంచాలన్నారు. అలాగే ఈనెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొనాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోనెల రాములు, వరద గాలన్న మాట్లాడుతూ భవన నిర్మాణానికి ఉపయోగించే సిమెంటు, స్టీలు, పెయింట్, ఇతర సామగ్రి ధరలు తగ్గించాలన్నారు. -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నంది వడ్డెమాన్గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
ధాన్యం తరలింపులో గందరగోళం
మద్దూరు: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలను అధికారులు ఏర్పాటుచేయకపోవడం.. అకాల వర్షాలతో ఎక్కడ ధాన్యం తడుస్తుందోనని ఆందోళన చెందిన రైతులు నేరుగా ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించడం.. మిల్లుల్లో స్థలం లేదని, కోటా అయిపోయిందంటూ మిల్లర్లు ధాన్యం అన్లోడ్కు నిరాకరించడం.. మొత్తంగా ధాన్యం తరలింపు గందరగోళంగా మారింది. మద్దూరు మండలంలో 15 ఐకేపీ కేంద్రాలు, పీఏసీఎస్ ద్వార ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ధాన్యం తరలింపులో మాత్రం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అకాల వర్షాలు కురుస్తుండడంతో పంటను త్వరగా విక్రయించుకోవాలన్న రైతుల అత్రుతకు తోడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సకాలంలో లారీలను అధికారులు తరలించకపోవడంతో ఈ సమస్య నెలకొంది. ఒకే మిల్లుకు 60కి పైగా ట్రాక్టర్లలో ధాన్యం.. ఆదివా మద్దూరులోని పద్మావతి రైస్మిల్లుకు దాదాపు 60పైగా ట్రాక్టర్లలో రైతులు ధాన్యాన్ని తీసుకువెళ్లారు. దీంతో మిల్లులో స్థలం లేదని, కొన్ని మాత్రమే ఇక్కడ దించుకోవడం కుదురుతుందని రైస్ మిల్లు యజమాని రైతులకు సూచించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్, సీపీఎం, రైతు సంఘాల నాయకలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం దించుకోవాల్సిందే అని, ఎన్నాళ్లు ఇలా ఎదురుచూడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆనంద్కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో 20 ట్రాక్టర్లు పద్మావతి రైస్మిల్లులో, మరో 20 ట్రాక్టర్లు లక్ష్మి వెంకటేశ్వర రైస్మిల్లుకు తరలించారు. మిగిలిన 38 ట్రాక్టర్లను కూడా ఇతర రైస్మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. నేరుగా ట్రాక్టర్లపై ధాన్యాన్ని మిల్లులకు తరలించిన రైతులు ధాన్యం దించేందుకు మిల్లర్ నిరాకరణ రైతులు, బీఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకుల ఆందోళన -
రైతులకు ‘గుర్తింపు’
రైతులు విధిగా నమోదు చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఈ నెల 5 నుంచి ఫార్మర్ ఐడీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర పథకాలు అందాలంటే ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రం ఈ కార్డుతో సంబంధం లేకుండా యధావిధిగా కొనసాగుతాయి. ఈ గుర్తింపు కార్డు రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాల ఆధారంగా జారీ చేస్తాం. ఫార్మర్ ఐడీ ఏ రకమైన చట్టబద్ద యాజమాన్య హక్కు కల్పించదనే విషయాన్ని రైతులు గుర్తించి వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ● నేటి నుంచే నమోదు ప్రక్రియ ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశం ● గుర్తింపు కార్డుతో ఆధార్, పట్టాపాసు బుక్కు, ఫోన్ నంబర్ అనుసంధానం ● కేంద్ర వ్యవసాయ పథకాలకు కీలకంగా మారునున్న ‘ఫార్మర్ ఐడీ’ ● భూమి రకం, పంట సాగు వివరాలు నమోదు 14 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు -
విధి విధానాలు ఇలా..
కోస్గి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డుతో గుర్తింపు ఇచ్చినట్లుగానే వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనికోడ్) కేటాయించి ఫార్మర్ ఐడీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 5 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూమి ఉన్న ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన సమగ్ర వివరాలతో ఈ ఫార్మర్ ఐడీలు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సిద్ధమైంది. ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులకు(ఏఈఓలకు) శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం నేటి నుంచి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించింది. ఫార్మర్ ఐడీ రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది రైతు ఆధార్ కార్డుతో లింక్ చేసి 14 అంకెల ఐడీని జారీ చేస్తారు. ఈ కార్డులో రైతు పేరు, ఆధార్ నంబర్, ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబర్, భూమి పట్టాపాస్ బుక్ వివరాలు, భూమి రకం(ఎర్ర నేల, నల్ల నేల, తరి, మెట్ట పొలం), సర్వే నంబర్లు, సాగు చేసే పంటల వివరాలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా రైతు సాగుకు సంబంధించిన పంట వివరాల చిట్టా మొత్తం ఒక్కక్లిక్తో ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. ఇందుకు గాను రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పట్టాపాస్ బుక్, ఆధార్తో లింక్ చేసిన ఫోన్ నంబర్ను మండల వ్యవసాయ శాఖ అధికారులకు గాని, ఆయా గ్రామా ల ఏఈఓలకు గాని అందజేయాల్సి ఉంటుంది. -
రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్చాన్స్లర్తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలి
నారాయణపేట రూరల్: జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని బోయిన్పల్లి, అప్పకపల్లి గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ విజ్ఞాన సదస్సును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.సురేష్, డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతి గౌడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సెల్ నాగేశ్వరి పాల్గొని న్యాయ విజ్ఞాన సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని, ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. ప్రజలందరు సమానమేనని ఉన్నవాళ్లు, పేదవాళ్లు అని తేడా లేదని, పేదరిక నిర్ములనా, సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా మరియు ప్రజలు చైతన్యంగా ఉంటేనే అన్ని హక్కులు సాధ్యమవుతాయని వివరించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్యారా పేదలకు ఉచిత న్యాయాన్ని పొందవచ్చు అని, మహిళలకు రక్షణ చట్టం ఉందని అన్నారు. వేధింపులకు గురైతే బాధితులకు సఖి, భరోసా సెంటర్లు అండగా ఉంటాయని అన్నారు. అలాగే, న్యాయ సలహాల కోసం 15100 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యను చెప్తే ఈ సంస్థలో పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో పంచాయత్ సెక్రటరీలు ఎండి జావిద్, విజయకుమార్, పార లీగల్ వాలంటీర్, రూపిక, యాదమ్మ, లక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
రోడ్లపైనే తిష్ట..!
బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం తాగుతున్న మందుబాబులు ● వైన్షాపుల వద్ద అనధికార సిట్టింగులు ● జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు.. దాబాలు ● సామాన్యులు, మహిళలకు ఇబ్బందులు నారాయణపేట: జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో వైన్షాపులు.. పర్మిట్ రూంలు.. బహిరంగ ప్రదేశాలు.. రోడ్లపక్కన.. ఇలా ఎక్కడపడితే అక్కడ మందుబాబులు సిట్టింగులు వేస్తూ సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. నిబంధనల మేరకు వైన్షాపు పక్కనే ఉండే పర్మిట్ రూంల్లోనే నిల్చొని మద్యం సేవించాల్సి ఉండగా వైన్షాపుల ముందు రోడ్లపైకి వచ్చి బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాలు, ఇళ్ల సమీపంలో ఉన్న వైన్షాపుల వద్ద మద్యం కొనుగోలు చేసి.. ఆ సమీపంలోనే మద్యం తాగుతూ మత్తులో నానా హంగామా సృష్టిస్తున్నారు. సాయంత్రం అయ్యిందంటే చాలు మహిళలు, చిన్నారులు అటుగా వెళ్లేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. వైన్షాపులు అన్నీ ప్రధాన రోడ్ల పక్కనే ఉండడంతో వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపి యథేచ్ఛగా పర్మిట్ రూంలో మద్యం తాగుతూ గంటల కొద్ది సేద తీరుతున్నారు. దీంతో ఆ రోడ్డు మార్గాన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో వైన్స్లు, దాబాలు, బెల్టుషాపులను ‘సాక్షి’ విజిట్ చేయగా..పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది జిల్లా కేంద్రంలోని వీరాసావర్కార్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి. ఓ సినిమా థియేటర్ పక్కన ఉన్న వైన్షాపు ఇది. ఆ వైన్ షాపునకు పర్మిట్ రూం ఉన్నా సాయంత్రం కాగానే మద్యం ప్రియులు ఎదురుగా ఉన్న ఆస్పత్రి ముందు కట్టాలపై కూర్చోవడం.. గ్రౌండ్లోకి వెళ్తూ బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. కొందరైతే మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు. థియేటర్కి.. బ్యాంకుకు.. ఎదురుగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాలన్నా జనం జంకే పరిస్థితి నెలకొంది. -
మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా
నారాయణపేట: కల్తీకల్లుకు వినియోగించే అల్ఫాజోలం, మరేదైనా మత్తు పదార్థాలు దొరికితే అవి ఎక్కచి నుంచి సరఫరా అవుతుందో నిఘా పెట్టాలని, కల్లు కంపౌండ్లను తరచుగా తనిఖీ చేయాలని ఆర్డీఓ రాంచందర్ నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిషేధంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మాదకద్రావ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని, గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గతంతో పోలిస్తే డ్రగ్స్ కేసులు చాలావరకు తగ్గాయని వివరించారు. టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్పై నిఘా పెట్టారని అన్నారు. అయితే, కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా అబ్కారీ శాఖ అధికారలు మాదక ద్రవ్యాల నిషేధంపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్డీఓ సూచించారు. ఇకపై జరిగే యాంటీ నార్కోటిక్ సమావేశాలకు ఆయా శాఖల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిషేధంపై నిర్వహించిన కార్యక్రమాల నివేదికను తయారు చేసి తీసుకురావాలని ఆదేశించారు. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి డ్రగ్స్ నిషేధానికి శాఖల వారిగా తీసుకున్న చర్యలను గ్రూప్లో షేర్ చేయాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ నిషేదం పై అవగాహన కల్పించేందుకు ముద్రించిన వాల్పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్టీఓ మేఘా గాంధీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ వినయ్కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలతోనే రాష్ట్రంలో అభివృద్ధి
కొత్తపల్లి: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని, కేంద్ర పథకాలు, నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో తిరుమలనాథస్వామి గుట్ట ఆలయ ప్రాంగణంలో నిర్మించే భవనానికి ఎంపీ భూమి పూజ నిర్వహించారు. అలాగే, అల్లీపూర్లో హైమాస్ట్ లైట్లను ప్రారంబించారు. నాగురావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, అనంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పడాకుల శ్రీను, డోకూర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని పలు ప్రదేశాలలో ఎస్పీ యోగేష్కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు నార్కోటిక్స్ స్నైపర్ జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా జరగకుండా పగడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా కిరాణా, కొరియర్, పాన్షాప్లలో తనిఖీలు నిర్వహించారు. ఎవరైన గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేస్తే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా నూతన జడ్జి బోయ శ్రీనివాసులును శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోర్టు కార్యాలయంలో కలిసి పూలమొక్క అందజేశారు. విద్యార్థులకు అభినందనలు.. నర్వ: పీఎంశ్రీ పథకానికి ఎంపికై న మండలంలోని పాథర్చేడ్ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 550 మార్కులు సాధించిన పాఠశాలకు చెందిన విద్యార్థిని అమృతను శాలువాతో పాటు ప్రశంసాపత్రాన్ని కలెక్టర్, డీఈఓ గోవిందురాజులు అందించారు. పాఠశాలలో వంద శాతం ఫలితాలను సాధించేలా కృషి చేసిన హెచ్ఎం కృష్ణయ్యను అభినందించారు. -
అందరి సహకారంతోనే..
ఉపాధ్యాయుల బోధన, ప్రత్యేక తరగతులు, తక్కువ సమయంలో క్లిష్టమైన సబ్జెక్టులలో రాణించేలా ఇచ్చిన స్టడీ మెటీరియల్ ఎంతో సహాయపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు బోధన అందరి సహకారంతో నేను 555 మార్కులు సాధించగలిగాను. – చంద్రకళ (555), కేజీబీవీ, నర్వ అర్థమయ్యేలా బోధించారు కొన్ని అంశాలు ఎంత చదివినా అర్థమయ్యేది కాదు. ప్రత్యేక తరగతుల్లో ఉపాధ్యాయులు చిత్రాలు చూపుతూ.. వివరంగా సులభంగా అర్థమయ్యేలా బోధించారు. ఎమ్మెల్యే అందించిన పదో తరగతి స్టడీ మెటీరియల్ మాకు ఎంతో సహాయకారిణిగా మారింది. వార్షిక పరీక్షలంటే గతంలో కొంత భయం ఉండేది. ఉపాధ్యాయుల సూచన, ప్రతిరోజు పాఠశాలలో నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలతో భయం పోయింది. – కె.అమృత (555), పాథర్చేడ్ ఉన్నత పాఠశాల ●ఉన్నత స్థాయికి చేరాలనే.. సర్కారు బడుల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందాలన్నదే మా తపన. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్టడీ మెటీరియల్ రూపకల్పనకు శ్రీకారం చుట్టాం. నిపుణులు, ఉపాధ్యాయుల ఆలోచనతో దీనిని తయారు చేయించి ఉచితంగా ఇచ్చాం. అలాగే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. విద్యార్థులు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్లో విద్యార్థుల చదువు కోసం మరింత కృషి చేస్తాం. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్ -
నిర్లక్ష్యం వహించారు..
కేంద్ర ప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకం కింద రూ.30 కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో పనులు పూర్తిచేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. చాలావరకు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు నిధులు కట్టబెట్టారు. మండలంలో కోల్డ్ స్టోరేజీలు, వృద్ధాశ్రమం, డంపింగ్ యార్డు తదితర నిర్మాణాలు ప్రారంభించలేదు. – పరశురాముడు, బీజేపీ అధ్యక్షుడు, పెద్దకొత్తపల్లి మండలంకాంట్రాక్టర్ల వల్లే.. పెద్దకొత్తపల్లి మండలంలో రూర్బన్ మిషన్ కింద మంజూరైన నిధులను చాలా వరకు వినియోగించుకున్నాం. గ్రామ పంచాయతీ భవనాలు, సీసీరోడ్లు, పార్కులను అభివృద్ధి చేశాం. కొన్ని పనులు కాంట్రాక్టర్ల జాప్యం వల్ల పూర్తికాలేదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేయించాం. – చిన్న ఓబులేసు, డీఆర్డీఓ, నాగర్కర్నూల్ అనుకూలంగా లేక ఇబ్బంది పడుతున్నాం.. పశువైద్య కేంద్రం నిర్వహణకు అనువైన స్థలం ఏది లేకపోవడంతో పక్కనే ఖాళీగా ఉన్న అంగన్వాడీ భవనంలోకి మార్చారు. అక్కడే ట్రేవిస్ అమర్చి పశువులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇది రోడ్డుపై ఉండడం వల్ల చికిత్స అందించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కువ మొత్తంలో వస్తే పశువులకు చికిత్సలు చేయడం కష్టం. ఐదారు గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడికే వస్తారు. పక్కా భవన నిర్మాణం ఐదారేళ్లుగా లెంటల్ లెవల్లోనే ఆగిపోయింది. దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు – దండె కృష్ణయ్య, వెన్నాచేడ్ ● -
కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు
మద్దూరు: బేకరీలు, స్వీట్ షాపులు, హోటళ్లలో కాలం చెల్లిన, కలుషిత ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం మద్దూరులోరి బేకరీలు, స్వీట్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. షాప్ యజమానులు ట్రేడ్ లైసెన్సులు తప్పని సరిగా తీసుకోవాలని, అలాగే ప్లాస్టిక్ కవర్లు వాడరాదని ఆదేశించారు. ఆలయ భూముల వేలం మరోసారి వాయిదా అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాల భూముల కౌలు వేలం పాట మరోసారి వాయిదా పడినట్లు ఆలయ ఈఓ పురేందర్కుమార్ తెలిపారు. శుక్రవారం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ భూముల కౌలు వేలం నిర్వహించారు. గత నెల 21వ తేదీన ఆలయాలకు సంబందించిన అన్ని భూములకు బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. వాటిలో 6 సర్వే నెంబర్లకు చెందిన భూముల కౌలు వేలం ధర రాకపోవడంతో అధికారులు వాయిదా వేశారు. రెండో సారి మిగిలిన భూముల బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. కర్నూల్ జిల్లా కల్లూరు శివారులోని 346/1, 346/3 సర్వే నెంబర్లలలోని 15.18 ఎకరాల భూమికి ఇద్దరు వ్యక్తులు డిపాజిట్ చెల్లించినట్లు ఈఓ పేర్కొన్నారు. కానీ వేలం షరతుల ప్రకారం కనీసం ముగ్గురు డిపాజిట్ చెల్లించాల్సి ఉండటంతో వేలం వాయిదా వేసినట్లు తెలిపారు. అదేవిధంగా మిగిలిన 5 సర్వే నెంబర్ల భూముల కౌలు వేలానికి రైతులు రాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నెల 16న మరోసారి వేలం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: త్వరలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, సీఏ చార్టెడ్ అకౌంట్కు సంబంధించి ప్రవేశపరీక్షలు ఒకేసారి ఉన్న నేపథ్యంలో వెంటనే డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 6 నుంచి 17వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని, అదే సమయంలో సీఏ పరీక్ష ఉంటే విద్యార్థులు ఇబ్బంది అవుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, రవితేజ, శశికుమార్, విజయ్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన దిగుబడులు జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయమార్కెట్కు శుక్రవారం వ్యవసాయ పంట దిగుబడులు పోటెత్తాయి. దాదాపు 20 వేల బస్తాలకు పైగా పంట ఉత్పత్తులు విక్రయానికి వచ్చాయి. ఇందులో అత్యధికంగా 7 వేల క్వింటాళ్ల ధాన్యంతో పాటు 3,913 క్వింటాళ్ల మొక్కజొన్న యార్డుకు వచ్చింది. దీంతో యార్డు షెడ్లు, ఆవరణ రైతులతో కిటకిటలాడింది. మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.1,439 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు గరిష్టంగా రూ.6,075, కనిష్టంగా రూ.5,757, జొన్నలు గరిష్టంగా రూ.3,887, కనిష్టంగా రూ.3,027, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.2,006, కనిష్టంగా రూ.1,997, ఆన్ఎన్ఆర్ రకం గరిష్టంగా రూ.2,249, కనిష్టంగా రూ.1,800, వేరుశనగ గరిష్టంగా రూ.5,471, కనిష్టంగా రూ.4,747, కందులు రూ.6,449, పెబ్బర్లు రూ.4,827 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,143, కనిష్టంగా రూ.1,763గా ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,829 ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు 1,500 బస్తాల ధాన్యం వచ్చింది. -
ఉన్నత స్థాయికి చేరుకోవాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు అదే క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. ఆమెతోపాటు అడిషనల్ కలెక్టర్ గంగ్వార్, డీఈఓ గోవిందరాజులు, మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రషీద్ శాలువాతో సత్కరించారు. పదిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు విశ్లేషించుకోవాలని, సప్లిమెంటరీ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు ఇప్పటి నుంచి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్ ఖాన్, మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.త్వరలోనే వనపర్తికి ఈఎస్ఐ ఆస్పత్రివనపర్తి టౌన్: కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పుర కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాది మందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమన్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతి బెనిఫిట్ను అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు విజయ చందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, లైట్, హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభంవనపర్తి విద్యావిభాగం: ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య గురువారం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేశారని డీఐఈఓ ఎర్ర అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశం పొందడానికి మొదటి విడత ప్రక్రియ మే 1 నుంచి ప్రారంభం కాగా జూన్ 30న ముగుస్తుందన్నారు. జూన్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభమవుతాయని, అదే రోజు నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారన్నారు. కళాశాలలో చేరే విద్యార్థులు ఇంటర్నెట్ మెమోతో అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు.కులగణన నిర్ణయం చారిత్రాత్మకంపాలమూరు: దేశ ప్రగతికి కులగణన పునాదివంటిదని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణనతో పాటు జనగణనను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. కులగణన గురించి ఆలోచించలేదని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు వద్దని చెప్పినా ముస్లింలను కూడా బీసీల కింద గుర్తించి కులగణన లక్ష్యాన్ని తారుమారు చేసిందని విమర్శించారు. దేశం మరింత అభివృద్ధి పథంలో నడిచేందుకు ఈ కులగణన కీలకమైనదని వ్యాఖ్యానించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు, మాజీ కౌన్సిలర్ చెన్నవీరయ్య, నంబి రాజు, నాగరాజు, పిల్లి సూర్యనారాయణ, కౌకుంట్ల ఆంజనేయులు, సుదర్శన్గౌడ్, మనోహర్ పాల్గొన్నారు. -
భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
మద్దూరు: భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చట్టం ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. రెవె న్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరకాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేసి, విరాసత్, హద్దు సమస్యలు, అసైన్డ్, పేరు మార్పిడి, అన్నదమ్ముల బాగ పరిష్కా రం లాంటి సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారుల బృందం కొత్త చట్టం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కలెక్టర్ సూచించారు. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం మద్దూరు, కోస్గి, మరికల్, నారాయణపేట ఆర్డీఓ కార్యాలయ తహసీల్దార్ల బృందం దరఖాస్తుల వారీగా పేపర్ వర్క్తో పాటు సమస్యలను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలు ఎంత వరకు వచ్చాయని ఆర్డీఓ రాంచందర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, తహసీల్దార్ అనిల్కుమార్, టీడీ వాసుదేవరావ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఏళ్లుగా.. అచేతనంగా!
చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం గద్వాల: గద్వాల చేనేతకు దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు ఉన్నాయి.. అంతటి ప్రాశ్యస్తం ఉన్న చేనేతను గడచిన దశాబ్దంన్నర కాలంగా పాలకులు, అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ గద్వాల చేనేత అంతరించిపోయేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. 2008లో చేనేత పార్కును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరీ చేశారు. అనంతరం వచ్చిన ప్రభుత్వ పెద్దలు దానిని గాలికొదిలేయడంతో 17ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా గద్వాలకు చేనేత పార్కు పరిస్థితి మారింది. 2009లో గ్లోబల్ లయన్స్కేషన్ (జీఐ) గుర్తింపు సైతం సాధించుకున్న గద్వాల చేనేత కాలక్రమంలో మసకబారే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గద్వాల చీరల పేరిట బెంగుళూరు, పూణే వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున పవర్లూం యంత్రాలతో తయారు చేసిన నకిలీ గద్వాల చీరలను మార్కెట్లో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో ఒరిజినల్ గద్వాల చేనేత చీరలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. చేనేతకు ఊతమిచ్చేందుకు.. గద్వాల చేనేతకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకున్న 2008లో అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గద్వాలకు చేనేత పార్కును మంజూరీ చేశారు. అంతేకాకుండా పార్కు ఏర్పాటుకు అవసరమైన స్థలం, నిధులు సైతం కేటాయించారు. గద్వాల మండలం పూడూరు శివారులోని సర్వే నంబర్ 368లో 50 ఎకరాల స్థలం, ఈ స్థలం అభివృద్ధి కోసం రూ.50లక్షల నిధులను మంజూరీ చేశారు. ఆ తర్వాత కాలంలో పార్కు స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు విడుదల చేసిన రూ.50 లక్షల నిధులలో రూ.11లక్షలు ఖర్చు పెట్టినట్లు అధికారులు కాకిలెక్కలు చూపెడుతున్నారు. ఇందులో చేనేత పార్కుకు కేటాయించిన స్థలం చుట్టూ హద్దులు పెడుతూ దిమ్మెలు కట్టినట్లు, స్థలరక్షణకు ఓ సెక్యూరిటీ గార్డును నియమించినట్లు ఇందుకోసం రూ.8.50లక్షలు ఖర్చు అయినట్లు చెబుతుండగా, ఫొటోగ్రఫీ సర్వే చేసేందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు కాగితాలపై కాకిలెక్కలు చూపెట్టి మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు 2018 శాసన సభ ఎన్నికలకు ముందు చేనేత పార్కు స్థలానికి మరోసారి శంకుస్థాపన చేశారు. రూ.14కోట్లతో గద్వాల చేనేత పార్కును పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత పార్కు అభివృద్ధి గురించి పూర్తిగా మర్చిపోయారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్కు అభివృద్ధి గురించి ఊసే ఎత్తడం లేదు. నిధులున్నా పట్టించుకోని అధికారులు రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల కాకిలెక్కలు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం -
శిక్షణ శిబిరాల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు ప్రతిభను చాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 6వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి శిబిరాలను గురువారం జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందజేసి వారిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని కోరారు. డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్ ప్రాంతాల్లో 21 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, జగన్మోహన్గౌడ్ పాల్గొన్నారు. -
పాలమూరే మా ప్రాధాన్యం
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పనులను ఏడాదిలోనే వంద శాతం పూర్తిచేస్తామని, రెండేళ్లలో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను సైతం పూర్తి చేసి.. ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు నీటిని అందిస్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, తూడి మేగారెడ్డితో కలిసి గురువారం పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన పంప్హౌస్లు, రిజర్వాయర్లు, పనుల పురోగతిని పరిశీలించారు. 40 వేల క్యూసెక్కులు తరలిస్తేనే.. పాలమూరులో భాగంగా నార్లాపూర్ వద్ద చేపట్టిన పంప్హౌస్, మోటార్లు, విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కృష్ణాతీరంలోని కోతిగుండు వద్ద ఏర్పాటు చేసిన ఇన్టేక్, అప్రోచ్ కెనాల్, హెడ్రెగ్యులేటరీ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించి సమీక్షించారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల వైపు వెళ్లే అప్రోచ్ కెనాల్ 6.5 కి.మీ., వద్ద పెండింగ్లో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. భూ సేకరణ, కోర్టు కేసుల నేపథ్యంలో అక్కడ కాల్వ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆరు నెలల్లోగా పెండింగ్ పనులు పూర్తిచేయాలని, అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగమైన ఏదుల పంప్హౌస్లోని మోటార్లను పరిశీలించారు. మోటార్ల రిపేరు త్వరగా పూర్తిచేయాలని, పూర్తిస్థాయి సామర్థ్యం 5 మోటార్లను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం 40 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తేనే ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అనంతరం పాలమూరు– రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్, పంప్హౌస్ పనులను, వట్టెం పంప్హౌస్ను సందర్శించారు. సొరంగం లోపల గతంలో నీట మునిగిన వట్టెం పంప్హౌస్ను అధికారులు పునరుద్ధరించారు. ఇప్పటి వరకు నాలుగు మోటార్లను బిగించగా, మరో మోటారు బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు నెలల్లోగా మోటార్ల బిగింపు, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట ప్రాజెక్టుల సలహాదారు పెంటారెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్, డీఈ డీఈ సత్యనారాయణ, తహసీల్దార్ విజయ్కుమార్, మాజీ ఎంపీపీ రాంమోహన్రావు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2027 మార్చి కల్లా.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను సైతం 2027 మార్చికల్లా పూర్తిచేసి ఉదండాపూర్ వరకు నీటిని అందిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఏదుల వద్ద పంప్హౌస్లో ప్రస్తుతం రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని, పూర్తిస్థాయిలో ఐదు మోటార్లతో నీటి ఎత్తిపోతలకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మోటార్ల మరమ్మతు మూడు నెలల్లోగా పూర్తిచేసి వచ్చే వానాకాలంలో ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పెండింగ్ పనులు, భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామన్నారు. పాలమూరు– రంగారెడ్డి కింద గతంలో కేసీఆర్ ఒక్క మోటారు ఆన్ చేసి హడావుడి చేశారని, అది తాత్కాలికంగా చేసిన ఏర్పాటేనని విమర్శించారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సరఫరా, పవర్ స్టేషన్ ఏర్పాటు కోసం ఇప్పటికే రూ.262 కోట్లు మంజూరు చేశామని, ఈ నెలాఖరులోగా పవర్స్టేషన్ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులపెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తాం ఏడాదిలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వందశాతం.. రెండేళ్లలోనే పాలమూరు– రంగారెడ్డి ద్వారా ఉదండాపూర్కు నీళ్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు
నారాయణపేట: సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మహాత్మా బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ పూలమాల వేశారు. అలాగే సరాఫ్ బజార్ బసవేశ్వర స్వామి ఆలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమాజంలో సీ్త్ర పురుషులు ఇద్దరికి సమాన హక్కుల కోసం కృషి చేశాడని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వేల్ఫేర్ అధికారి అబ్దుల్ ఖలీల్, డిపీఆర్ఓ రషీద్, అగ్రికల్చర్ అధికారి జాన్ సుధాకర్, ఆర్విఎల్ఎల్బి జిల్లా అధ్యక్షుడు అవుటి రవికుమార్, కె.మల్లికార్జున్, గందె రవికాంత్, అరకంచి రవికుమార్, నాగభూషన్, కన్నా జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయుడు.. కృష్ణా: మహాత్మా బసవేశ్వరుడు 18వ శతాబ్ధంలోనే కులమతాలకు అతీతంగా సమసమాజాన్ని నిర్మించి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడని నేరడగం పీఠాధిపతి పంచమ సిద్దలింగమహాస్వామి అన్నారు. బుధవారం మండలంలోని హిందుపూర్లోని బసవేశ్వర విగ్రహానికి బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్యతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడారు. బసవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బసవ చరిత్ర మొదటిసారి తెలుగులోనే వ్రాయడం జరిగిందని, ఆ తరువాత కన్నడకు అనువాదం చేశారని గుర్తుచేశారు. అన్నికులాలవారికి, సీ్త్ర, పురుషులకు సమప్రాధాన్యతను ఇచ్చిన వీరశైవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశాడని అన్నారు. అదే విధంగా టైరోడ్డు, చేగుంట, ఐనాపూర్ గ్రామాల్లో బసవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అఖిల పక్షాల నాయకులు,వీరశైవులు పాల్గొన్నారు. -
భూభారతితో రైతులకు న్యాయం
చిన్నచింతకుంట: భూ భారతి చట్టంతో ప్రతి పేద రైతుకు న్యాయం జరుగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి జాతర మైదానంలో చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల రైతులకు భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదలకు ఉపయోగపడేలా చట్టాలను అమలులోకి తీసుకొచ్చిందన్నారు. అందుకే రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా పేద రైతులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.ఈ చట్టం ప్రతి రైతు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ముందుగా నాలుగు మండలాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ కింద తీసుకుంటామన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేవరకద్రలో సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం, కొత్తగా ఏర్పడిన మండలాల్లో రెవెన్యూ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ విజయేందరి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో భూభారతి చట్టంపై సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ధరణి చట్టం ద్వారా పరిష్కారం కాని భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయిలోనే ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అందుకు సీఎం రేవంత్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట మైనార్టీ పైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్ర ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
‘చిన్నోనిపల్లి’ లింక్కు నో..
ఈ వివాదం నడుస్తున్న క్రమంలో ఆర్డీఎస్ కెనాల్కు చిన్నోనిపల్లి రిజర్వాయర్కు లింక్ చేసే ప్రతిపాదనలను ఎంపీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణానీటిపై ఆధారపడి గట్టు మండలంలో చిన్నోనిపల్లె రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. తుంగభద్ర నీటి ఆధారంగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడే కాకుండా వర్షపు నీటితో కూడా ఆధారపడి నిర్మించే ఈ రిజర్వాయర్లో నీరు నిల్వ చేసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు లేని సమయంలోనూ ఆర్డీఎస్ కెనాల్ ద్వారా వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్,రాజోళి మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందే అవకాశం ఉంటుందని.. చిన్నోనిపల్లి ద్వారా ఇది సాధ్యం కాదని.. తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. -
వచ్చే నెల మొదటి వారంలోగా.. భూ సమస్యలన్నీ పరిష్కరించాలి
నారాయణపేట: ప్రభుత్వం కొత్తగా రూపొందించిన భూ భారతి చట్టం అమలుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న మద్దూరు మండలంలో భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను వచ్చే నెల మొదటి వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మద్దూరు మండలంలోని 17 రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల భూ సమస్యలపై అందిన దరఖాస్తులపై మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ గ్రామాల వారీగా అందిన దరఖాస్తులపై కలెక్టర్ ఆరా తీయగా.. మొత్తం 1,341 భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని మద్దూరు తహసీల్దార్ మహేశ్గౌడ్ వివరించారు. అందులో ఎక్కువగా డేటా మార్పు, విరాసత్, అసైన్ భూముల సమస్యలు ఉన్నాయన్నారు. అన్ని దరఖాస్తులను సదస్సుల్లో రైతులు నేరుగా సమర్పించారని.. ప్రస్తుతం ఆయా దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసి.. పేపర్ వర్క్ పూర్తి చేయనున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు మండలాలను ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. అందులో సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను కొత్త చట్టం ద్వారా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్య తీవ్రత మేర ఏ అధికారి స్థాయిలో పరిష్కారానికి అవకాశం ఉంటుందనే ఆంశంపై అదనపు కలెక్టర్ బేన్షాలంతో కలెక్టర్ చర్చించారు. దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్కు సహకారంగా మూడు బృందాలను ఏర్పాటుచేయాలని కలెక్టర్ సూచించారు. పైలెట్ ప్రాజెక్టు మండలంలో చూపిన భూ సమస్యల పరిష్కారాలే జూన్ 2వ తేదీ తర్వాత నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలకు వర్తిస్తాయన్నారు. అందుకే ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని జాగ్రత్తగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్ నాయక్, భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, సర్వే ల్యాండ్ ఏడీ గిరిధర్, మద్దూరు, కొత్తపల్లి, కోస్గి తహసీల్దార్లు మహేశ్గౌడ్, జయరాములు, బక్క శ్రీనివాస్, డీటీ వసుదేవరావు తదితరులు ఉన్నారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టుపైకలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష -
స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి..
ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, రైతు, గూడెబల్లూరు, మాగనూర్ మండలం రైతులను ప్రోత్సహిస్తున్నాం.. జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట ● -
‘మల్లమ్మకుంట’పై నీలినీడలు..!
రాజోళిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్).. దశాబ్దాల కాలంగా నీటి వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ, కర్ణాటక మధ్య నీటి వాటాల స్థిరీకరణతోపాటు తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపుల్లో వివక్షపై జగడాలు కొనసాగాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇదే కీలకాంశంగా మారగా.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సైతం మునుపటి పరిస్థితులే నెలకొన్నాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల సమస్యగా మారింది. ఇది ఒకవైపు కాగా.. మరోవైపు తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా వెనుకబడిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యం మాటలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించాల్సిన రిజర్వాయర్లపై ఏళ్ల తరబడి సందిగ్ధత వీడకపోవడం.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటి కారణాలు అనిశ్చితికి కారణమవుతున్నాయి. సరైన ప్రణాళిక లేమి.. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం వెరసి మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ రిజర్వాయర్కు గ్రీన్సిగ్నల్.. అంతలోనే.. రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్టాపిక్గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పేరుకే 87,500 ఎకరాలు.. నిజాం కాలంలో కర్ణాటక పరిధిలోని రాజోళిబండ సమీపంలో తుంగభద్రపై ఆనకట్ట నిర్మించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి నడిగడ్డ ప్రాంతంలో 87,500 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఆనకట్ట ఎడమవైపున 143 కిలోమీటర్ల కాల్వ (ఆర్డీఎస్ కెనాల్) నిర్మాణం పూర్తి చేశారు. అయితే 20 ఏళ్లుగా ఏనాడూ పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందలేదు. పంటలు సాగుచేయడం.. నీరందక అవి ఎండిపోవడం.. రైతులు నష్టాల పాలవడం పరిపాటిగా మారింది. కనీసం 30 వేల ఎకరాలకు నీరు అందడం లేదని రైతులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఆర్డీఎస్ ఆయకట్టును పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్తో పాటు ఇటిక్యాల మండలం వల్లూరు, వడ్డేపల్లి మండలం జూలకల్, తనగల వద్ద మల్లమ్మకుంట వద్ద మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ఫేస్–1, 2 పనులకు జీఓ 429 జారీ చేసింది. 9.6 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టి.. తనగల సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23 వద్ద డెలివరీ సిస్టమ్ ద్వారా తుంగభద్రలోని నీటిని తోడి ఆర్డీఎస్ కెనాల్కు మళ్లించేందుకు శ్రీకారం చుట్టింది. ఏడాది లోపే తుమ్మిళ్ల లిఫ్ట్ను రూ.190 కోట్లతో ఏర్పాటు చేసి.. కెనాల్కు నీటిని పంపింగ్ చేశారు. కానీ రిజర్వాయర్ల నిర్మాణం అటకెక్కింది. రిజర్వాయర్ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలెక్టర్కు నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి లేఖతో దుమారం అలంపూర్ పరిధిలోని ఆయకట్టు రైతుల్లో ఆందోళన చిన్నోనిపల్లి, ఆర్డీఎస్కు లింక్ అంటూ తెరపైకి కొత్త ప్రతిపాదనలు వ్యతిరేకిస్తున్న అన్నదాతలు.. కాంగ్రెస్లో భిన్నస్వరాలు -
ఆయిల్పాం కష్టాలు తీరేనా?
ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ ● గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. ● స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లో సాగు నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్పాం గెలలను తరలించాల్సి వస్తోంది. లాభసాటిగా ధరలు.. ఈ ఏడాది ఆయిల్పాం ధర పెరిగింది. గతేడాది టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. చిగురిస్తున్న ఆశలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడి.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 25వేలకు పైగా ఎకరాల్లో పంట కోతలు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 ట న్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వా లలో 300, మహబూబ్నగర్ జిల్లాలో 260 ట న్నుల దిగుబడి రాగా.. నాగర్కర్నూల్ జిల్లా లో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. పరిశ్రమలు ఉంటేనేప్రయోజనం పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. -
రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. తొలిరోజు ప్రశాంతంగా ఎప్సెట్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఎప్సెట్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం అగ్రికల్చర్– ఫార్మసీకి సంబంధించి రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఫాతిమావిద్యాలయం, జేపీఎన్సీలలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేయగా, ఉదయం 280, మధ్యాహ్నం 265 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామన్పాడులో 1,015 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో మంగళవారం నీటిమట్టం సముద్ర మట్టానికి ఎగువన 1,021 అడుగు లకుగాను 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసె క్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. మొక్కజొన్న @ రూ.2,266 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి యార్డుకు మంగళవారం పంట దిగుబడులు పోటెత్తాయి. 4,600 క్వింటాళ్ల మొక్కజొన్న, 5,050 క్వింటాళ్ల ధాన్యం విక్రమానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,266, కనిష్టంగా రూ.1,501, వేరుశనగ గరిష్టంగా రూ.5,641, కనిష్టంగా రూ.4,329, జొన్నలు గరిష్టంగా రూ.2,627, కనిష్టంగా రూ.2,227, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,931, కనిష్టంగా రూ.1,802, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,801, పెబ్బర్లు రూ.4,404 ధరలు లభించాయి. ● దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,141, కనిష్టంగా రూ.1,879, హంస గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,800గా ధరలు నమోదయ్యాయి. -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
నారాయణపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారాణి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరజాన్ సూచన మేరకు పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెల 20వ తేదీలోగా కమిటీల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కులాల వారీగా అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇదివరకు నామినెటేడ్ పద్ధతిలో పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందని.. ఇప్పుడు పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కష్టపడిన వారిని గుర్తిస్తూ.. నేరుగా పదవులకు పోటీచేసే విధంగా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. పార్టీ కోసం పూర్తి సమయం కేటాయించి.. పార్టీ బాధ్యతలు నిర్వర్తించే సత్తా ఉన్న వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ పదవులు దక్కని వారికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత మండల, పట్టణ అధ్యక్షులు పదేళ్లుగా కష్టపడి పనిచేశారని, వారి కృషి ఫలితంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టవద్దని కోరారు. కష్టపడిన వారికి మళ్లీ అవకాశం కల్పించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రను ప్రతి గ్రామంలో చేపట్టి.. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడులను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, పార్టీ నాయకులు బాలకృష్ణారెడ్డి, కొత్తకోట సిద్దార్థరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రసన్నరెడ్డి, ఎండీ సలీం, నరహరి, వీరన్న, సూర్యమోహన్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, నర్సింహ, రవికుమార్, యఘ్నేశ్వర్రెడ్డి, చంద్రకాంత్గౌడ్, బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, గందె చంద్రకాంత్ తదితరులు ఉన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతంచేసేందుకు కొత్త కమిటీలు టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్, సంధ్యారాణి -
భూ భారతిపై విస్తృత చర్చ అవసరం
మాగనూర్/కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా చట్టంపై అవగహన కలిగి సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం మాగనూర్, కృష్ణాలో నిర్వహించిన మాగనూర్ భూభారతి అవగహన సదస్సుకు వారు హాజరయ్యారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సదస్సును ప్రారంభించారు. చట్టం విధి విధానాలపై అధికారులు రైతులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి చట్టంలో లేని అనేక నిబంధనలను 1971 రెవెన్యూ చట్టంలోని మంచి ఆంశాలను తీసుకుని రైతులకు లబ్ధి చేకూర్చేలా భూభారతి చట్టాన్ని రూపొందించారన్నారు. భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడాయన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ సమస్యలు ఏవి ఉన్నా జూన్ 2 నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి అక్కడ వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని, వాటిని 30 రోజుల్లో వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కొత్త చట్టంతో రైతుల పాలిట వరం : ఎమ్మెల్యే భూ భారతి చట్టం రైతుల పాలిట వరం అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో అనేక అవస్థలు పడ్డ రైతులకు భూభారతితో మేలు చేకూరనుందని వెల్లడించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని, భూ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూధార్ కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం కింది స్థాయి అధికారుల వద్ద తప్పు జరగితే పైస్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కూమార్, ఆర్డీఓ రాంచందర్, తహసీల్దార్లు సురేష్కుమార్, వెంకటేష్, ఎంపీడీఓలు జానయ్య, రహ్మతుద్దీన్ పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి ఆదివారం మాగనూర్ మండల వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ఆకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి షరుతులు లేకుండా కోనుగులు చేయాలని మండల రైతులు జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ముఖ్యంగా మండలంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, రైతులకు లారీలు రావాలంటే రూ.5 వేల వరకు లంచం ఇవ్వాల్సిందేనని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు 7 లక్షల టన్నులు జరిగాయని, మిగిలిన 8 లక్షల గన్నీ బ్యాగులు ఏమయ్యాయని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంపై సత్వరమే ఎంకై ్వరి చేస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు. మాహబూబ్నగర్, గద్వాల జిల్లాల నుండి మరో 4 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు తీసువస్తామని, లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. తడిసిన ధాన్యంను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతామని తెలిపారు. -
10 రోజులుగా తిరుగుతున్నా..
12 ట్రాక్టర్ల ధాన్యం ఆరబెట్టి పది రోజులవుతుంది. ఆ రోజు నుంచి సంచుల కోసం తీలేర్ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాను. ఇంకా సంచులు రాలేదు.. వస్తే ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. సకాలంలో సంచులు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంది. మళ్లీ ఆరబెట్టి రాశులుగా పోసి కవర్లు కప్పి ఉంచాం. త్వరగా సంచులు ఇచ్చి ధాన్యం తరలించేందుకు అధికారులు చొరవ చూపాలి. – దూలప్ప, రైతు, రాకొండ అధికారుల పొరపాటు వల్లే.. పంట కోత వేయక ముందే రాజకీయ బ లం ఉన్నా రైతులకు ముందే సంచులు ఇ వ్వడం వల్ల తమలాంటి ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు దొరకడం లేదు. రోజుల తరబడి సంచుల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాం. ఆరిన ధాన్యం పరిశీలించిన తర్వాతనే సంచులు ఇవ్వాలి. కానీ అధికారులు చేసే పొరపట్ల వల్ల ఇతర రైతులకు నష్టం జరుగుతుంది. – శ్రీనివాసులు, రైతు, పెద్దచింతకుంట 25 లక్షల బ్యాగులు పంపిణీ చేశాం.. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 25 లక్షల గన్నీ బ్యాగులను అందజేశాం. అయితే రైతులు పంటలు కోత వేయక ముందే సంచులు తీసుకెళ్లడం వల్ల ఇతర రైతులకు సంచులు దొరకడం లేదు. ఆ పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం. రెండు రోజుల్లో మరో 5 లక్షల గన్నీ బ్యాగులను తెప్పించి రైతులకు కొరత లేకుండా చూస్తాం. – సైదులు, జిల్లా సివిల్ సప్లయ్ డీఎం ● -
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకుసమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
గన్నీబ్యాగుల కోసం రాస్తారోకో
● రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ ● కార్యాలయం నుంచి నేరుగా రహదారిపైకి చేరిన రైతులు మక్తల్: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గన్నీబ్యాగులు దొరకక రైతులు ప్రతిరోజు కార్యాలయం చుట్టు తిరిగే పరిస్థితి ఏర్పడింది. సోమవారం దాదాపు 40 వేల బ్యాగులు వచ్చాయని రైతులకు సమాచారం తెలియడంతో టోకన్లు ఇచ్చి రైతులు సింగిల్ విండో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. గన్నీ బ్యాగులు తమకు సరిపోవడం లేదని, ఏకంగా రైతులు అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకొని అక్కడ రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో మక్తల్ సీఐ రాంలాల్, మక్తల్ ఎస్ఐ–2 ఆచారి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అధికారులు చెప్పడంతో రాస్తారోకో విరమించారు. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ కింద ఆయకట్టు సాగు పెరిగి ధాన్యం పండించడంతో గన్నీ బ్యాగులు కరువయ్యాయి. కొనుగోల కేంద్రాలకు వెళ్లాలంటే బ్యాగుల కొరత అధికంగా ఉండంతో ఎండలో ఆరబోసిన వరిధాన్యం వర్షంలో తడిసి ముద్దాయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అధికారులు పర్యటించి రైతులకు టోకన్ ఇవ్వడం జరుగుతుందని, దాని ప్రకారం గన్నీ బ్యాగులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం కురిసిన వర్షాలకు వరిధాన్యం తడిసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి కార్యాలయం చుట్టు తిరుగున్నా, తమ సమస్యలు ఎవరూ పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
గన్నీ బ్యాగుల కొరత.. రైతుల కలత
తీలేర్ కొనుగోలు కేంద్రం వద్ద సంచుల కొరత కారణంగా ఆరుబయట ఉంచిన ధాన్యం రాశులు మరికల్: యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో గన్నీ బ్యాగుల కొరత త్రీవంగా వేధిస్తోంది. దీంతో పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం నింపడం కోసం సంచులు లేక అవస్థలు పడుతున్నారు. మరోపక్క నిత్యం సంచుల కోసం రైతులు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది యాసంగి వరి ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారింది. పలు కేంద్రాల్లో రైతులు గన్నీ బ్యాగుల కొరత ఉండగా మరికొన్ని కేంద్రాల్లో సంచులకు నింపిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదు. వీటికి తోడు రైస్ మిల్లుల వద్ద కూడా కూలీల కొరత ఉండటం వల్ల ధాన్యం అన్లోడ్ చేయడం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో 1.50 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గాను 35 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా ప్రస్తుతానికి 25 లక్షల సంచులను అధికారులు రైతులకు అందజేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాలు, రోడ్ల వెంట ధాన్యం ఆరబోయగా.. ఏ నిమిషంలో వర్షం పడుతుందో, ఎక్కడ ధాన్యం తడిసిపోతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా గన్నీ బ్యాగులు అందించి ఉంటే ఇప్పటికే ధాన్యం విక్రయించేవారమని, ఇకనైనా జిల్లా అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. కారణం ఇదేనా.. జిల్లాలో ఏర్పాటు చేసిన 102 కొనుగోలు కేంద్రాలకు దశల వారీగా అధికారులు గన్నీ బ్యాగులను అందజేశారు. ఇప్పటి వరకు 25 లక్షల సంచులను రైతులకు చేరవేశారు. అయితే కొందరు రైతులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పంటలను కోత కోయకముందే ముందు జాగ్రత్తగా టోకెన్లు రాయించుకొని సంచులను తీసుకెళ్లారు. దీంతో రోజుల తరబడి ధాన్యం ఆరబెట్టిన రైతులకు మాత్రం సంచులు దొరకడం లేదు. ఆరిన ధాన్యం రాశులను పొలాలు, కొనుగోలు కేంద్రాల వద్దనే నిల్వ చేసుకున్నారు. ఒక్కో రైతు పది రోజుల నుంచి సంచుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంచుల కోసం వెళ్లిన ప్రతిసారి ఇప్పుడు, అప్పుడంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటలను కోత వేయకముందే సంచులు తీసుకెళ్లడంతో ధాన్యం ఆరబెట్టిన రైతులకు సంచులు కొరత ఏర్పడటానికి కారణమైందని అధికారులు చెబుతున్నారు. అరకొర బ్యాగులతో ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోతున్న ధాన్యం రాశులు సంచులు, లారీల కోసం రైతులఎదురుచూపులు 35 లక్షలకు.. వచ్చినవి 25 లక్షలే.. -
ట్రైనీ కలెక్టర్గా ప్రణయ్కుమార్
నారాయణపేట: జిల్లా ట్రైనీ కలెక్టర్గా 2024 తెలంగాణ ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కొయ్యాడ ప్రణయ్ కుమార్ను ప్రభుత్వం కేటాయించింది. ఈమేరకు ఆయన సోమవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు చేపట్టారు. జిల్లాపై అవగాహన కలిగి అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సూచించారు. ‘ప్రజావాణి’కి34 ఫిర్యాదులు నారాయణపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 34 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ బెంషాలం వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్ఆర్ఎస్’ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి నారాయణపేట: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రకటించిన 25శాతం ఫీజు రాయితీని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాయితీ గడువు ఈ నెల ఈనెల 30 వరకు ఉంటుందని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ గడువుకు మళ్లీ పొడగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. బాల్య వివాహాలను అరికట్టాలి నారాయణపేట: జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 30న బసవ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే బసవ జయంతి రోజున ఎక్కువగా వివాహాలు జరుగుతాయని, ఇదే సమయంలో బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉందని, బాల్య వివాహాలు జరగకుండా అధికారులు నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైన బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ నెల 30 న ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే హెల్ప్ లైన్ 1098 కి కాల్ చేయాలని ప్రజలను కోరారు. పెసర క్వింటాల్ రూ.7,651 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పెసర క్వింటాల్కు గరిష్టంగా రూ.7,651, కనిష్టంగా రూ.6,225 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,555, కనిష్టంగా రూ.3,425, వడ్లు హంస క్వింటాల్కు గరిష్టంగా రూ.1,771, కనిష్టంగా రూ.1,610, వడ్లు సోనా గరిష్టంగా రూ.2,186, కనిష్టంగా రూ.1,455, ఎర్ర కందులు గరిష్టంగా రూ.6,919, కనిష్టంగా రూ.6,829, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.7,019 ధర పలికాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,261 జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,261, కనిష్టంగా రూ.1,469 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,789, కనిష్టంగా రూ.4,121, ఆముదాలు గరిష్టంగా రూ.6,110, కనిష్టంగా రూ.4,600, జొన్నలు గరిష్టంగా రూ.4,107, కనిష్టంగా రూ.2,001, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,015, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,803 పలికాయి. ఆర్ఎన్ఆర్ రూ.2,201 దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి. -
రజతోత్సవ సభతో రాజకీయాల్లో పెనుమార్పు
నారాయణపేట: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు జై బీఆర్ఎస్.. జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలో వరంగల్కు నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక వాహనాలలో గులాబీ దండు కదిలిందన్నారు. 10 లక్షల మందితో జరిగే రజతోత్సవ మహాసభపై యావత్ ప్రపంచం ఇంత పెద్ద ఎత్తున ఎలా చేస్తారని ఎదురుచూస్తున్నరన్నారు. తెలంగాణను కదిలించే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తారని అన్నారు. అనంతరం నియోజకవర్గం నుంచే 30 బస్సులు, 155 వాహనాలలో 3300 మంది వరంగల్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ మాజీ వైస్చైర్మన్లు కన్నాజగదీశ్, చెన్నారెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వేపూరి రాములు, విజయ్సాగర్, నాయకులు ప్రతాప్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు -
సాంకేతిక వ్యవస్థపైఅవగాహన కలిగి ఉండాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో తయారుచేసిన సిసిటిఎన్ ఎస్ 2.0 వెర్షన్ పై ప్రతి ఒక్కరు అవగాహన ఉండాలన్నారు. పెండింగ్ కేసులను తగ్గించేందుకు అధికారులు సమర్థవంతంగా కోర్టు డ్యూటీ అధికారులతో, న్యాయ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. పోక్సో ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని, వేసవికాలంలో చాలామంది సొంతూళ్లకు వెళ్తుంటారని, పెట్రోల్ కార్ మొబైల్స్, బ్లూ కోట్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించి నేరాలు జరగకుండా కాలనీలో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, 2025లో 9 కేసులలో నేరస్తులకు శిక్ష పడ్డాయని (కన్వేషన్స్) అందులో నాలుగు కేసులలో నేరస్తులకు యావజ్జీవ శిక్ష పడడం జరిగిందని ఆ కేసుల్లో కృషి చేసిన వారిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, రామ్లాల్, రాజేందర్రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ నారాయణపేట: జిల్లా నూతన జడ్జి బోయ శ్రీనివాసులును శనివారం ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ ఎన్ లింగయ్య పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలెండర్ నంబర్, కేసు ట్రయల్స్ లోక్ అదాలత్ నిర్వహణ, కేసులలో నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాలపై చర్చించారు. కోర్టు అధికారులు పోలీసులు సమన్వయంతో పనిచేసి త్వరగా కేసుల పరిష్కారం చూపాలని జడ్జి సూచించారు. వారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల బాలప్ప ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలి ● ఎంపీ డీకే అరుణ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల సమయంలో అధ్యాపకులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అధ్యాపకులకు ఎంపీ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రారంభం నుంచి పనిచేస్తున్న అధ్యాపకులకు వెంటనే న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పే అధ్యాపకులకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించడం దారణమైన విషయమన్నారు. సెట్, నెట్, పీహెచ్డీ ఉన్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరి క్రమబద్ధీకరణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే యూజీసీతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. భూమయ్య, శ్రీధర్రెడ్డి, వేణు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
రికార్డుల నిర్వహణపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం
ధన్వాడ: గన్నీ బ్యాగులు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు కానీ రికార్డు ప్రకారం ఇంక మీ వద్ద 50వేల బ్యాగులు ఉండాలి.. ఎక్కడ ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపడితే ఇలాంటి పొరపాట్లు జరగవు కదా అని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులపై అడిషనల్ కలెక్టర్ బేన్ షేలం ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత ఉందని తెలియడంతో శనివారం ధన్వాడ సింగిల్విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులతో వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 73వేల గన్నీ బ్యాగులు వచ్చాయని, 80వేల క్వింటాళ్ల ధాన్యం సేకరించామని తెలిపారు. దీంతో 80వేల క్వింటాళ్లకు 20వేల బ్యాగులు సరిపోతాయని, మిగతా బ్యాగులు ఎక్కడ ఉన్నాయి, ఇలా తప్పుడు లెక్కలు రాస్తూ, ఇష్టానుసారంగా వ్యవహిరిస్తే రైతులు ఇబ్బందులు పడరా అని ప్రశ్నించారు. అనంతరం గోటూర్లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారం రోజులుగా లారీలు రాకపోవడంతో ఎదురుచూస్తున్నామని రైతులు తెలపగా.. వెంటనే లారీలను ఏర్పాటు చేయాలని సివిల్ సప్లె అధికారులకు సూచించారు. -
నిబంధనల మేరకే ఇసుక రవాణా
నారాయణపేట: జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో టీజీఎండిసి ద్వారా నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. మాగనూర్ మండలం అడవి సత్యవార్కు చెందిన నలుగురు రైతులు, వర్కూర్కు చెందిన మరో రైతు తమ పట్టా భూముల నుంచి ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో ఇతర శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇసుక తొలగించేందుకు అనుమతులు ఇవ్వవచ్చని తెలపగా.. కలెక్టర్ అంగీకరించారు. ఇసుక తరలించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రీచ్ల నుంచి రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా పెట్టాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అధికారులు పాల్గొన్నారు. భూ భారతితో శాశ్వత పరిష్కారం కొత్తపల్లి: ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలకు నూతన భూ భారతి చట్టంతో పరిష్కారం లబిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కొత్తపల్లిలో ఏర్పాటుచేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కొత్త చట్టం ద్వారా అధిక శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని, వారసత్వంగా వచ్చే భూముల బదలాయింపు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయని తెలిపారు. 2014 కంటే ముందుగా సాదా కాగితాలపై కొన్న భూములు, ప్లాట్లు భూ భారతిలో పరిష్కారం అవుతాయని, ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక సిద్దం చేయాలని తహసిల్దార్ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్,తహసీల్దార్ జయరాములు పాల్గొన్నారు. అర్హులనే ఎంపిక చేయాలి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను మాత్రమే ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరకాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. దరకాస్తుదారుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిస్థితిని పరిశీలించారు. -
చలో వరంగల్..
విశేష స్పందన ఆర్టీసీ లాజిస్టిక్ (కార్గో) చేపట్టిన రాములోరి తలంబ్రాలకు విశేష స్పందన లభించింది. వాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వివరాలు IIలో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు పర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ‘పాలమూరు’ ప్రధానాస్త్రంగా.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ తర్వాత కేసీఆర్ పాలమూరులో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అస్త్రంగా ఆయన పోరు బాటకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేయకపోవడం.. వెసులుబాటు ఉన్నా, నీటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి
మరికల్: ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని మాజీ ఎంపీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మరికల్లో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే మహాసభలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి సభా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1850 ఎకరాల పేదలకు సంబందించిన భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నా స్పందన లేదన్నారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నారాయణపేట – కొడంగల్ లిప్టు ఇరిగేషన్ కోసం పాదయాత్ర చేసిన ఘనత తమదేన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13వేల ఎకరాలను సాగు చేస్తున్న పేద రైతుల తరపున పోరాటలు చేసి వారికి న్యాయం చేస్తామన్నారు. అలాగే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేసి ఏడాదిలో 200 పని దినాలను పెంచాలన్నారు. అలాగే రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో కేవలం రెండింటిని అమలు చేసి మిగితా వాటిని గాలికి వదిలేసిందని, భూ సమస్యలను పరిష్కరించకుంటే త్వరలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. గోపాల్, వెంకట్రామారెడ్డి, జాన్వెస్లీ, నాగయ్య, బీంరాజ్, వెంకట్రాములు, భూపాల్, వెంకట్ పాల్గొన్నారు. -
ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజల పరుగులు
స్టేషన్ మహబూబ్నగర్/నారాయణపేట టౌన్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీంతో భరించలేని ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు ఉన్నోళ్లు కూలర్లు, కూలర్లు వాడుతున్న వారు ఏసీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాగా కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. ఇవే కాకుండా పళ్ల రసాలు, జ్యూస్లు, ఐస్క్రీమ్ పార్లర్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ఫ్రిజ్లకు గిరాకీ వేసవిలో ఇంట్లో అడుగుపెట్టే చల్లని నేస్తం ఫ్రిజ్. కూల్వాటర్తో పాటు వేసవిలో తిండిపదార్థాలు చెడిపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇన్వెర్టర్లపైనా నడిచే ఫ్రిజ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.12,500 నుంచి రూ.30 వేల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, డబుల్, త్రిపుల్ డోర్ ఫ్రిజ్లు కొనుగోలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేసిక్ మోడళ్ల ఫ్రిజ్లు తీసుకుంటుండటంతో వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 వరకు ఫ్రిజ్ల షాపులు ఉండగా ఈ వేసవి సీజన్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ● ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ల హవా నడిచింది. ఇప్పుడు కూలర్లు, ఏసీల గాలి వీస్తోంది. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఇళ్లకే పరిమితమైన కూలర్లు ఇప్పుడు తక్కువ ధర, చిన్న సైజుల్లోనూ లభిస్తుండడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లోకల్మేడ్ కాకుండా బ్రాండెడ్ కూలర్లు సైతంలో మార్కెట్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవిలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర వీటి వ్యాపారం నడుస్తుంది. ఏసీలు, ఫ్రిజ్ల కొనుగోళ్లతో షాపుల్లో రద్దీ పండ్ల జ్యూస్లు, లస్సీ, ఐస్క్రీమ్లకు భలే గిరాకీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో సీజనల్ వ్యాపారం -
నోటీసులు ఇస్తున్నాం
పేట – కొడంగల్ ప్రాజెక్టు కింద భూముల పెగ్ సర్వే పూర్తి అయింది. రైతులకు నోటీసులను అందజేస్తున్నాం. అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలిస్తున్నాం. రీ సర్వే కోరిన చోట సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను పంపించి సర్వే చేయిస్తున్నాం. రైతులు అందరూ సహకరించి నోటీసులు తీసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు భూ నష్టపరిహారం వస్తుంది. – చింత రవికుమార్, తహసీల్దార్, ఊట్కూర్ ఎకరాకు రూ.60 లక్షలు ఇవ్వాలి బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ. 60 లక్షలు పలుకుతుంది. ఆ ప్రకారం తమకు భూ నష్టపరిహరం ఇవ్వాలి. తనకున్న నాలగు ఎకరాల భూమి ఈ ప్రాజెక్టులో పోతుంది. ప్రభుత్వం ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎలా. భూమి పోతే భూమి అయినా చూపించాలి. ఈ కాలంలో భూమి పోతే భూమి సంపాదించుకోవడం చాలా కష్టం. – దాసరి కనకదాసు, రైతు, బాపూర్ గ్రామం, ఊట్కూర్ మండలం ఇంటికో ఉద్యోగం.. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయే రైతులకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎకరానికి నష్టపరిహారం బహిరంగా మార్కెట్లో ఉన్న విలువ ప్రకారం ఇవ్వాలి. – నర్సింహులు గౌడ్, రైతు బాపూర్, ఊట్కూర్ మండలం స్పష్టత ఇవ్వడంలేదు.. భూములు కోల్పోతున్న రైతులకు ఎంత పరిహారం ఇస్తారనేది ఎవరూ స్పష్టత ఇవ్వడంలేదు. అన్ని భూములకు ఒకే ధర ఇస్తామంటే నష్టపోతాం. ఎకరానికి రూ.60 లక్షలు ఇవ్వాలి. – ఎం.సురేందర్రెడ్డి, రైతు, ఊట్కూర్ ● -
ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు
జడ్చర్ల టౌన్: పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తప్పదని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని, అది ఎంతో దూరం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి జడ్చర్ల ప్రేమ్రంగా గార్డెన్లో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్, వక్ఫ్బోర్డు చట్టంపై ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేశాక కశ్మీర్ను మరో స్విట్జర్లాండ్గా భావించి పర్యాటక రంగం ఊపందుకుందన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దేశ, విదేశాల నుంచి పర్యాటలకు వస్తుంటే చూస్తూ తట్టుకోలేక పాకిస్తానీయులు ఉగ్రవాదులతో దాడులు చేయించిందన్నారు. భారతీయులంతా పార్టీలకు అతీతంగా దేశం కోసం భద్రత, రక్షణ కోసం ఉగ్రదాడులను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల వ్యయ ప్రయాసాలు తగ్గి అభివృద్ధిపై దృష్టిసారించే ఆస్కారం ఉంటుందన్నారు. వక్ఫ్బోర్డు చట్టం వల్ల పేద ముస్లింలకు ఎంతో లాభం కలగనుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మేధావులు ఉమ్మెంతల మహేశ్వర్, జగ్పాల్రెడ్డి పాల్గొన్నారు. -
భూ భారతితో భూ సమస్యల పరిష్కారం
కోస్గి రూరల్/మద్దూరు: ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు నూతన భూ భారతి చట్టంతో పరిష్కారం లబిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కోస్గి, మద్దూరులో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఎర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న సమస్యలను తొలగించి రైతు సంఘాలు, రెవెన్యూ అధికారులు, మేధావులతో చర్చలు జరిపి ప్రభుత్వం నూతన చట్టం భూ భారతిని తీసుకువచ్చిందన్నారు. ధరణి పోర్టల్లోని 32 అంశాలను తొలగించి 11 అంశాలతో భూ భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డును అందజేయనున్నామని అన్నారు. కింది స్థాయి అధికారులు పొరపాట్లు చేస్తే నన్యాయం కోసం పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, 99శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని, 30 రోజుల్లో మ్యుటేషన్లు పరిష్కారం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్,ి తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, భాస్కరస్వామి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు భింరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం తహసీల్దార్ స్థాయిలోని సమస్యలను మోకా మీదనే పరిష్కరించాలని తహసీల్దార్ మహేష్గౌడ్కు కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం మద్దూరు మండలంలోని దమ్గాన్పూర్, నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులను వేగవంతం చేయాలని, సదస్సుల్లో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఏ సమస్యలపై ఎక్కువగా వచ్చాయని ఆరా తీశారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, తదితర ఆంశాలపై మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి ప్రత్యేకాధికారి యాదగిరి, అడిషన్ కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఆర్డీఓ రాంచందర్నాయక్, భూ భారతి కోసం నియమించిన తహసీల్దార్, ఆర్ఐ, ఇతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మద్దూరు మండలంలో తలెత్తిన సమస్యలను వారి పరిష్కారం కోసం చేస్తున్న కసరత్తుపై అధికారులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. -
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు వద్దు
నారాయణపేట: జిల్లా పరిధిలో సామాజిక మాద్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టవద్దని, ఒకవేళ అలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేస్ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని షేర్ చేసిన చర్యలు తప్పవని తెలిపారు. ఫెస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న, తమకు తెలియని వీడియోలు, ఫొటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయబడుతాయని పేర్కొన్నారు. పోలీసులు 24/7 సోషల్ మీడియా యాప్లు, పోస్టులు పరిశీలిస్తుంటారని, ఏ పోస్టులు అయినా ఫార్వర్డ్ చేసే ముందు గమనించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్కు డీడబ్ల్యూఓ బాధ్యతలు నారాయణపేట: డీడబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న జయను బాధ్యతల నుంచి తప్పించి డీడబ్ల్యూఓ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు అప్పగించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.7,477 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,477 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,926, కనిష్టంగా రూ.3,505, అలసందలు గరిష్టంగా రూ.6,305, కనిష్టంగా రూ.6,055, వడ్లు హంస గరిష్టంగా రూ.1,756, కనిష్టంగా రూ.1,525, వడ్లు సోనా గరిష్టంగా రూ.2.220, కనిష్టంగా రూ.1,350, కందులు ఎర్రవి గరిష్ట, కనిష్టంగా రూ.6,869 ధర పలికాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,275 జడ్చర్ల/ దేవరకద్ర: పట్టణంలోని బాదేపల్లి మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,275, కనిష్టంగా రూ.1,402 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.5,913, కనిష్టంగా రూ.4,041, ఆముదాలు గరిష్టంగా రూ.6,137, కనిష్టంగా రూ.6,100, జొన్నలు సరాసరిగా రూ.1,817, ధాన్యం హంస గరిష్టంగా రూ.2,011, కనిష్టంగా రూ.1,809, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,809, రాగులు రూ.2,157 చొప్పున పలికాయి. ఆర్ఎన్ఆర్ ధర రూ.2,236 దేవరకద్ర మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,236, కనిష్టంగా రూ.1,809 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,749, కనిష్టంగా రూ.1,629, ఆముదాలు గరిష్టంగా రూ.6,006 వచ్చాయి. సీజన్ కావడంతో మార్కెట్కు దాదాపు 2 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. నేడు మార్కెట్ బంద్ ఉగ్రదాడులను నిరసిస్తూ బాదేపల్లి మార్కెట్ వ్యాపార సంఘం ఆధ్వర్యంలో శనివారం క్రయవిక్రయాలను నిర్వహించడంలేదు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
● కృష్ణాతీరంలోనిసంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్నఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి వ్యయ ప్రయాసలతో కష్టాలు పడుతున్న భక్తులు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమేసంగమేశ్వరుడి దర్శనం కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయంసాక్షి, నాగర్కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
డీజీపీఎస్ పరికరం ఏమైంది ?
భూ సర్వే చేయడానికి అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించాలని గత కలెక్టర్ కోయ శ్రీహర్ష తన గ్రాంట్ నుంచి డీజీపీఎస్ పరికరాన్ని కొనుగోలు చేయించి గతేడాది మార్చి 15న జిల్లా సర్వేయర్ల అధికారుల బృందానికి అప్పగించారు. కానీ పేట – కొడంగల్ ప్రాజెక్టు సర్వేలో ఇరిగేషన్ అధికారులు డీజీపీఎస్ పరికరాన్ని వాడితే.. సర్వేయర్లు బృందం జీపీఎస్ పరికరంతో సర్వే చేపట్టారు. దీంతో ఇరిగేషన్, సర్వేయర్లు చేపట్టిన సర్వేలో లెక్కలు తేడా ఉందని, హద్దులు సరిగ్గా చూయించలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అసలు ఆ పరికరాన్ని ప్రభుత్వ భూముల సర్వేలో అక్కడక్కడ వినియోగిస్తూ.. ప్రైవేట్ సర్వేలకు ఎక్కువగా వినియోగిస్తున్నరని తెలుస్తోంది. దీనిపై కలెక్టర్ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలాఉండగా, భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహరం సీఎం ఇలాఖాలో ఎంత వస్తుందో.. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గంలో రైతులకు అంతే వస్తుందని ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి భరోసానిస్తున్నారు.