ప్రధాన వార్తలు
అర్జున్కు 13వ స్థానం
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి నలుగురు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం పోటీపడ్డారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.చివరిదైన 13వ రౌండ్ గేమ్లో అర్జున్ 55 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేశ్ 6.5 పాయింట్లతో 9వ స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 11వ స్థానంలో, అరవింద్ 4.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. 9 పాయింట్లతో నొదిర్బెక్ విజేతగా అవతరించాడు.
దేవిక ధమాకా
బ్యాంకాక్: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్ స్టార్ షట్లర్ దేవిక సిహాగ్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్లాండ్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో దేవిక చాంపియన్గా అవతరించింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల దేవిక కెరీర్లో ఇదే తొలి సూపర్–300 టైటిల్ కావడం విశేషం. ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్ వరల్డ్ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక తొలి గేమ్ను 21–8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్లో 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్ వె మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో దేవికకు టైటిల్ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 19 వేలు) ప్రైజ్మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత థాయ్లాండ్ సూపర్–300 టైటిల్ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టైటిల్తో ప్రపంచ 63వ ర్యాంకర్ దేవిక మంగళవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–40లో చోటు సంపాదిస్తుంది. ‘చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో ఇదే తొలి సూపర్–300 లెవెల్ టైటిల్. ఈ సీజన్లో మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్లాండ్ ఓపెన్లో అన్ని మ్యాచ్లు బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెక్స్లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది.
విష్ణువర్ధన్ ఖాతాలో 48వ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు, లండన్ ఒలింపిక్స్లో పోటీపడ్డ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ తన కెరీర్లో 48వ డబుల్స్ టైటిల్ను సాధించాడు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో తెలంగాణకే చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 25 ఏళ్ల సాయికార్తీక్ రెడ్డికిది 11వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్–సాయికార్తీక్ ద్వయం 6–1, 6–4తో ఇషాక్ ఇక్బాల్–దేవ్ జావియా (భారత్) జంటపై గెలిచింది. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో విష్ణు–సాయికార్తీక్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తొలి సర్వీస్లో 23 పాయింట్లు, రెండో సర్వీస్లో 9 పాయింట్లు స్కోరు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా, ప్రత్యర్థుల సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. తొలి రౌండ్లో విష్ణు–సాయికార్తీక్ 6–3, 6–4తో నైషిక్ రెడ్డి గణగామ–మాచెర్ల తీర్థ శశాంక్ (భారత్)లపై, క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–5తో అర్జున్–కహీర్ (భారత్)లపై, సెమీఫైనల్లో 5–7, 7–6 (7/4), 10–8తో ఆదిత్య–అథర్వ (భారత్)లపై విజయం సాధించారు. 38 ఏళ్ల విష్ణు వేర్వేరు భాగస్వాములతో కలిసి 2008లో 1... 2009లో 6... 2010లో 3 ... 2011లో 5... 2012లో 1... 2013లో 1... 2014లో 3... 2015లో 4... 2016లో 5... 2017లో 10... 2018లో 2... 2021లో 1... 2023లో 3... 2024లో 2... 2026లో 1 డబుల్స్ టైటిల్ గెలిచాడు.
అల్కరాజ్ కొత్త చరిత్ర
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్ చరిత్రలో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ కొత్త రికార్డు నెలకొల్పాడు. టెన్నిస్లోని నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీల టైటిల్స్ను సాధించిన అతిపిన్న వస్కుడిగా (22 ఏళ్ల 272 రోజులు) అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం ముగిసిన ఆ్రస్టేలియన్ ఓపెన్ టోర్నీలో ఈ స్పెయిన్ స్టార్ తొలిసారి విజేతగా అవతరించాడు. 10 సార్లు చాంపియన్, 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం జొకోవిచ్తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 2–6, 6–2, 6–3, 7–5తో గెలుపొందాడు. విజేత అల్కరాజ్కు 41,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 26 కోట్ల 55 లక్షలు), రన్నరప్ జొకోవిచ్కు 21,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 13 కోట్ల 75 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. అల్కరాజ్ కెరీర్లో ఇది ఏడో గ్రాండ్స్లామ్ టైటిల్. ఇప్పటికే అతను ఫ్రెంచ్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025)లను రెండుసార్లు చొప్పున గెలిచాడు. తాజా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్తో అల్కరాజ్ ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న అతిపిన్న వయసు్కడిగా గుర్తింపు పొందాడు. వరాల్గా డాన్ బడ్జ్ (అమెరికా; 22 ఏళ్ల 363 రోజులు; 1938లో) పేరిట ఉన్న రికార్డును.... ఓపెన్ శకం (1968) మొదలయ్యాక నాదల్ (స్పెయిన్; 24 ఏళ్ల 88 రోజులు; 2010లో) పేరిట ఉన్న రికార్డులను ఈ స్పెయిన్ స్టార్ సవరించాడు. తాజా ఓటమితో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ (25) నెగ్గిన ఏకైక ప్లేయర్గా రికార్డు నెలకొల్పాలని ఆశించిన జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. తొలి సెట్ కోల్పోయినా... ఆ్రస్టేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన 10 సార్లూ విజేతగా నిలిచిన జొకోవిచ్కు తుది పోరులో తొలి సారి ఓటమి ఎదురైంది. సెమీస్లో డిఫెండింగ్ చాంపియన్ సినెర్ (ఇటలీ)పై ఐదు సెట్ల పోరులో గెలిచిన జొకోవిచ్ తొలి సెట్ను గెలిచి ఫైనల్లో శుభారంభం చేశాడు. అయితే 38 ఏళ్ల జొకోవిచ్తో పోలిస్తే ఎక్కువ ఫిట్గా ఉన్న అల్కరాజ్ రెండో సెట్ నుంచి తన అసలు ఆటతీరును ప్రదర్శించాడు. రెండో సెట్లో రెండుసార్లు... మూడో సెట్లో రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి అతను ఈ రెండు సెట్లు గెలిచాడు. నాలుగో సెట్లోని 12వ గేమ్లో జొకోవిచ్ సర్వీస్ను బ్రేక్ చేసిన అల్కరాజ్ సెట్తోపాటు విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 9 పురుషుల టెన్నిస్లో ‘కెరీర్ గ్రాండ్స్లామ్’ పూర్తి చేసుకున్న 9వ ప్లేయర్ అల్కరాజ్. ఈ జాబితాలో ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్; 1935లో), డాన్ బడ్జ్ (అమెరికా; 1938లో), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా; 1962లో), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1964లో), అగస్సీ (అమెరికా; 1999లో), ఫెడరర్ (స్విట్జర్లాండ్; 2009లో), నాదల్ (స్పెయిన్; 2010లో), జొకోవిచ్ (సెర్బియా; 2016లో) ఉన్నారు.
‘ఎలిమినేటర్’కు ఢిల్లీ క్యాపిటల్స్
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘ఎలిమినేటర్’ పోరుకు అర్హత పొందింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో జెమీమా రోడ్రిగ్స్ సారథ్యంలోని ఢిల్లీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై నెగ్గింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీప్తి శర్మ (24; 4 ఫోర్లు, 1సిక్స్), సిమ్రన్ షేక్ (22; 3 ఫోర్లు), శిఖా పాండే (23; 3 ఫోర్లు) రెండు పదులు స్కోర్లు చేశారు. మరిజాన్ కాప్ 3, హెన్రీ, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. వోల్వార్డ్ (47; 7 ఫోర్లు) రాణించింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మంగళవారం జరిగే గుజరాత్తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. ఇప్పటికే బెంగళూరు నేరుగా ఫైనల్ చేరింది. చివరి లీగ్ మ్యాచ్లో యూపీ వారియర్స్పై విజయం
పాక్ను చిత్తుగా ఓడించిన భారత్
అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించింది.బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు ఖిలన్ పటేల్ (9.2-1-35-3), ఆయుశ్ మాత్రే (8-0-21-3), కనిష్క్ చౌహాన్ (10-1-30-1), విహాన్ మల్హాత్రా (4-0-15-1) చెలరేగడంతో పాక్కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబ్రిష్ (5-0-26-1), హెనిల్ పటేల్ (5-0-30-1) కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖాన్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హమ్జా జహూర్ (42), కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ (38) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీస్కు అర్హత సాధించాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్త్లు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ తలపడతాయి.
పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై–వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే, పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచకప్ మ్యాచ్ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెలువడింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్-పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా కలిచి వేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏరకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్-పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులకే కాదు, వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ, ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.కాగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇటీవలికాలంలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో మొదలైంది. ఈ కారణంగా బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. ఇందుకు ప్రతిగా బంగ్లాదేశ్ భారత్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్లు ఆడమని భీష్మించుకు కూర్చుంది. వేదికలను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ససేమిరా అంది. ఈ విషయంలో పాక్ బంగ్లాదేశ్కు మొదటి నుంచి వంత పాడుతూ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. కాగా, ప్రపంచకప్లో పాక్ తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనున్న విషయం తెలిసిందే. భారత్-పాక్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే షెడ్యూలై ఉండింది.
మూడో టీ20లోనూ ఆసీస్ను చిత్తు చేసిన పాక్
టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.రాణించిన బాబర్, సైమ్పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.తిప్పేసిన నవాజ్అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు. ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది.
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది.
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పడిక్కల్ విధ్వంసకర శతకం
కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ దేశవాలీ క్రికెట్లో అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పడిక్కల్ ఉగ్రరూపం దాల్చాడు. 40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గానూ వ్యవహరించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సహా మ్యాచ్ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఛేదనలో పడిక్కల్కు మయాంక్ అగర్వాల్ (53), శ్రేయస్ గోపాల్ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్ విధ్వంసకర శతకంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అన్మోల్జీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. సుఖ్దీప్, ఎమన్జోత్ చహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉదమ్ సహారన్ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సహారన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. అన్మోల్ప్రీత్ (44), అభిజీత్ (33), హర్ప్రీత్ బ్రార్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్ షెట్టి 2, విధ్యాదర్ పాటిల్, మొహిసిన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (77), కేఎల్ రాహుల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్ అగర్వాల్ (32), విధ్యాదర్ పాటిల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ 4, సుఖ్దీప్ 3, అన్మోల్ 2, చహల్ ఓ వికెట్ తీశారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్ (81), చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్ (44) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.
క్రమశిక్షణ తప్పినందుకే...
న్యూఢిల్లీ: ప్రొ లీగ్ టోర్నీ కోసం గురువారం 33 మంద...
చరిత్ర పుటల్లో చోటు కోసం...
మెల్బోర్న్: ఒక్క విజయం సాధిస్తే... సెర్బియా దిగ్...
ఆస్ట్రేలియన్ ఓపెన్లో సంచలనం.. 37 ఏళ్ల రికార్డు బద్దలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026లో సంచలనం నమోదైంది. మిక్స...
ఆసీస్ దిగ్గజం కన్నుమూత
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ హాకీ ప్లేయర్ మైకేల...
టీ20 ప్రపంచకప్కు మరో రెండు జట్లు
ఈ ఏడాది ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగనున్న...
పాకిస్తాన్తో కీలక మ్యాచ్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్
అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి ...
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగింపు.. బంగ్లాదేశ్ కీలక అడుగు
టీ20 ప్రపంచకప్ నుంచి తొలగించబడిన తర్వాత బంగ్లదేశ్...
భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంటున్న వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే
భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్య...
క్రీడలు
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
వీడియోలు
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
