ప్రధాన వార్తలు
అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?: టీమిండియా మాజీ స్టార్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను తిప్పలు పెడుతూ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటి వరకు లీగ్ దశలో భారత్ తరఫున నాలుగింటికి నాలుగు మ్యాచ్లూ ఆడాడు వరుణ్ చక్రవర్తి.అమెరికా, నమీబియా, పాకిస్తాన్.. తాజాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో కలిపి మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి.. 5.17 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అమెరికా బౌలర్ షాడ్లే వాన్ షాల్విక్ (13 వికెట్లు) తర్వాత.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీరును విమర్శించాడు. వరుణ్ చక్రవర్తి సేవలను సరిగ్గా వాడుకోవడంలో సూర్య విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు.‘‘వరుణ్ చక్రవర్తిని తన బౌలింగ్ కోటా ఎందుకు పూర్తి చేయనివ్వడం లేదు?.. అతడికి తగినన్ని ఓవర్లు ఇవ్వడమే లేదు. అమెరికాతో మ్యాచ్లో మాత్రమే వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయగలిగాడు.అప్పుడు సూర్య ఐదుగురు బౌలర్లను మాత్రమే ఉపయోగించాడు కాబట్టి వరుణ్కు ఆ అవకాశం దక్కింది. బౌలర్ అయిన వరుణ్ చక్రవర్తి విషయంలో వ్యవహరించినట్లే జట్టులోని ఏ బ్యాటర్ విషయంలోనైనా వ్యవహరించగలరా?ఓ బ్యాటర్ బాగా ఆడుతూ 50-60 పరుగులు సాధించిన తర్వాత.. ‘ఇక చాలు వెళ్లిపో’ అని చెప్పగలరా?.. అస్సలు అలా చేయలేరు కదా!.. ఓ బ్యాటర్ 60 బంతులు ఆడగా లేనిది.. ఓ బౌలర్ 24 బంతులు బౌల్ చేయకూడదా?నెదర్లాండ్స్తో మ్యాచ్లో అతడి చేతికి మరోసారి బంతి ఇచ్చి ఉంటే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసేవాడు. కానీ అతడిని మీరే ఆపారు’’ అని ఆకాశ్ చోప్రా.. సూర్యకుమార్ తీరును విమర్శించాడు. కాగా నెదర్లాండ్స్తో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అతడి ప్రదర్శన వల్లే భారత్ 17 పరుగుల తేడాతో గట్టెక్కగలిగింది.
ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్
టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి టాపర్గా తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, నమీబియా, పాకిస్తాన్లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్, వన్డౌన్లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సూపర్-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.ప్రధానంగా రెండు సమస్యలుటాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్-8లో వెస్టిండీస్, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్పాకిస్తాన్ కూడా గత మ్యాచ్లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి.అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.కాగా ఆఫ్ స్పిన్నర్లు బంతిని టర్న్ చేసే క్రమంలో మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్-8లో భారత్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడుతుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్
అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే: పాంటింగ్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన కంగారూలు.. పసికూన జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితంగా కనీసం లీగ్ దశ దాటకుంటానే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ బృందంపై ఇంటా బయటా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్.. టీ20 వరల్డ్కప్ జట్టులో భాగమైన ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మాక్సీ పని అయిపోయిందని.. ఇకపై అతడు ఆసీస్ టీ20 జట్టులో ఉండబోడని జోస్యం చెప్పాడు.అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లేముఖ్యంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో మాక్సీ పాల్గొనే అవకాశాలు శూన్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. నాకైతే అతడి కెరీర్ చరమాంకానికి చేరుకుందని అనిపిస్తోంది. అతడు కచ్చితంగా ఒలింపిక్స్ జట్టులో మాత్రం ఉండడు’’ అని పాంటింగ్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు.దారుణంగా విఫలంఅయితే, కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రవిస్ హెడ్ మాత్రం తప్పక ఒలింపిక్స్లో ఆడతారని పాంటింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్ ఆల్రౌండర్. టీ20 వరల్డ్కప్-2026 టోర్నీలో మాక్సీ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 62 పరుగులే చేశాడు.ఇక గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా తొలుత ఐర్లాండ్పై గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. లీగ్ దశలో మిగిలిన నామమాత్రపు మ్యాచ్లో ఒమన్తో శుక్రవారం ఆసీస్ తలపడుతుంది. ఇందుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదిక. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలైంది. మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2028 టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నేరుగా ఈ మెగా టోర్నీకి అర్హత సాధించినట్లు తెలిపింది.అదే విధంగా.. బంగ్లాదేశ్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటుందని ఐసీసీ పరోక్షంగా స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్కప్ 2026 ఎడిషన్ మొదలైన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇరవై జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు గ్రూపుల నుంచి టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే... గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8లో అడుగుపెట్టాయి. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి జింబాబ్వే అనూహ్య రీతిలో అర్హత సాధించింది.ఈ నేపథ్యంలో.. నిబంధనల ప్రకారం టీ20 ప్రపంచకప్-2026 ఎడిషన్లో సూపర్-8 చేరిన జట్లన్నీ ఆటోమేటిక్గా 2028 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఈసారి విఫలమైనా.. 2028 టోర్నీకి ఆతిథ్య దేశంగా ఉన్నందున ఆ జట్టు కూడా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్, అఫ్గన్, ఐర్లాండ్ కూడా నేరుగాతద్వారా మొత్తంగా ఇప్పటికే తొమ్మిది జట్లు 2028 టోర్నీకి అర్హత సాధించగా.. ర్యాంకింగ్స్ ఆధారంగా మిగిలిన జట్లను చేర్చే క్రమంలో టాప్-12లో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఐర్లాండ్ కూడా తమ బెర్తును ఖరారు చేసుకున్నాయి. తదుపరి పెద్దగా టీ20 సిరీస్లు లేనందున ఈ ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి.. ఈ మూడు జట్లు అర్హత సాధించినట్లు ఐసీసీ పేర్కొంది. ఇక ఈ పన్నెండు పోను మిగిలిన ఎనిమిది బెర్తులను రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.కాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, యూఎస్ఏ, యూఏఈ, నేపాల్, కెనడా, ఒమన్ టాప్-20లో కొనసాగుతున్నాయి.ఈసారి వేటు పడిందిలా!టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ పోటీపడాల్సింది. అయితే, టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్లో తమకు భద్రత లేదని.. తమకు కూడా పాక్ మాదిరి శ్రీలంకనే తటస్థ వేదికగా ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ బంగ్లా వాదనలో నిజం లేదని కొట్టిపారేసింది. టోర్నీలో కొనసాగాలనుకుంటే షెడ్యూల్ ప్రకారం భారత్లో ఆడాలని సూచించింది.అయితే, తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా సిద్ధమే కానీ.. భారత్లో ఆడమని బంగ్లా బోర్డు ఐసీసీకి తెలిపింది. దీంతో బంగ్లాదేశ్ను తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలవగా.. బంగ్లాదేశ్పై ఎటువంటి కఠిన చర్యలు చేపట్టమని ఐసీసీ హామీ ఇచ్చింది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను తప్పించగా.. బంగ్లా వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు భారత్ రాకూడదని నిర్ణయించుకుంది.చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
నువ్వు సూపర్: పాక్ ఓపెనర్పై ఇర్ఫాన్ పఠాన్ సెటైర్లు
పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఆట తీరును భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. నమీబియాతో మ్యాచ్లో ఫర్హాన్ సెంచరీ మార్కు అందుకున్న తీరు తనకు అంతగా నచ్చలేదని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆఫ్రికా పసికూన నమీబియా జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.3 వికెట్లు కోల్పోయి 199 పరుగులుతద్వారా ఈ టోర్నీలో మూడో గెలుపుతో పాకిస్తాన్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచి ‘సూపర్–8’ దశకు చేరుకుంది. కొలంబో వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.సింగిల్ తీసిఈ మ్యాచ్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు బాది అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ బౌలింగ్లో రెండో బంతికి సింగిల్ తీసి ఫర్హాన్ శతక మార్కు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరిదైన ఆరో బంతిని ఎదుర్కొని పరుగులేమీ తీయలేకపోయాడు.Huge six from Farhan and a brilliant catch in the stands! 🚀🙌The opener is shifting gears to set up a massive total for Pakistan.ICC Men’s #T20WorldCup | #PAKvNAM | LIVE NOW ➡️https://t.co/tEqcKQXZLa pic.twitter.com/ydvDhSHCt0— Star Sports (@StarSportsIndia) February 18, 2026సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ఈ నేపథ్యంలో కామెంటేటర్, టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫర్హాన్ను విమర్శించాడు. కాస్త ధైర్యంగా షాట్లు బాది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు సెంచరీ చేశాడని ఒప్పుకంటాను. కానీ సింగిల్ తీసి వంద పరుగుల మార్కు అందుకుంటాడా?.. ఇదేమీ అంత బాగా లేదు.నువ్వు సెంచరీ పూర్తి చేసుకుంటే సంతోషంగా ఉంటావా? లేదంటే పాకిస్తాన్ 199 పరుగుల వద్దే ఆగిపోతే ఆనందంగా ఉంటావా? ఆఖరి ఓవర్లో సెంచరీ కోసం డిఫెన్సివ్ షాట్ ఆడావు!ఇక చివరి బంతినైతే ఏకంగా అలా వదిలేశావు. సూపర్ నువ్వు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్స్లు బాదిన షాదాబ్ ఖాన్ ఫర్హాన్ కంటే బెటర్ అంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 17.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. ఫలితంగా 102 పరుగుల తేడాతో గెలిచి సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 WC 2026: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
T20 WC: ‘డకౌట్ల’ అభిషేక్ శర్మ.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయి.. లీగ్ దశను అవమానకర రీతిలో ముగించాడు.గ్రూప్-ఎలో భాగంగా అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ (Abhishek Sharma).. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. తాజాగా నెదర్లాండ్స్తో బుధవారం నాటి మ్యాచ్లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేశాడు.ఎనిమిది బంతులు మాత్రమేకెరీర్లో తొలిసారి వరల్డ్కప్ టోర్నీ ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఇప్పటికి మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుని మొత్తంగా ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అభిషేక్ ఇలా లీగ్ దశలో.. అది కూడా అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా సింగిల్ కూడా తీయలేకపోయాడు. తద్వారా చెత్త రికార్డుతో అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.తెలివిగా ఆడుఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్ ముందుగా ఒత్తిడి నుంచి బయటపడాలని సూచించాడు. తనకున్న ట్యాగ్లను మరచిపోయి స్వేచ్ఛగా ఆడినప్పుడే అనుకున్న ఫలితం రాబట్టగలడని అభిప్రాయపడ్డాడు. తొందరపడకుండా తెలివిగా షాట్లు ఆడాలని సూచించాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అంచనాల భారం అతడిపై ఒత్తిడిని పెంచుతోంది అనుకుంటున్నా!... అతడు మంచి బ్యాటర్. ఆట మొదలుపెట్టాడంటే తనదైన శైలిలో దూసుకుపోగలడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ముందుగా సింగిల్ తీయాలిసిక్స్ హిట్టర్ అని పేరున్న అభిషేక్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్ అతడు. అదే అతడిని ఒత్తిడిలోకి నెట్టేస్తుందేమో!.. ఏదేమైనా అభిషేక్ కాస్త ఓపికగా ఉండాలి. మొదటి బంతి నుంచే బౌండరీ, సిక్సర్ బాదాలని అనుకోవడం సరికాదు.ఆ ఫీలింగ్ నుంచి బయటపడుముందుగా సింగిల్ తీయాలి. స్మార్ట్గా ఆడాలి. ముఖ్యంగా తన కాళ్లను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలో అతడు అవుటైన విధానం అత్యంత సాధారణమైనది. అతడి షాట్ సెలక్షన్ను బట్టి ఎవరైనా ముందే పసిగట్టగలరు. ‘200కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేసే ఆటగాడిగానే నన్ను చూస్తారు’ అన్న భావన నుంచి బయటకు రావాలి.మెదడు నుంచి అలాంటి ఆలోచనను తీసివేయాలి. నీ సహజశైలిలో ఆడు.. అప్పుడు తప్పక భారీ స్కోరు సాధించగలవు’’ అని సునిల్ గావస్కర్ అభిషేక్ శర్మకు కీలక సూచనలు చేశాడు. కాగా గ్రూప్-ఎలో భాగంగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్లను ఓడించిన టీమిండియా.. ఆఖరిగా నెదర్లాండ్స్పై గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించింది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. ఇరవై జట్లతో మొదలైన ఈ ఐసీసీ ఈవెంట్లో ఆస్ట్రేలియా మినహా అగ్రశ్రేణి జట్లన్నీ సూపర్-8కు చేరుకున్నాయి.సూపర్-8 చేరిన జట్లు ఇవేగ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్... గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్కప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన టీ20 ప్రపంచకప్ పదో ఎడిషన్ లీగ్ దశ గురువారంతో ముగియనుంది.ఎవరు ఎవరితో ఢీ?అయితే, అంతకంటే ముందే అంటే బుధవారమే పాకిస్తాన్ నమీబియాపై గెలవడంతో సూపర్-8 బెర్తులు ఖరారైపోయాయి. గ్రూప్ దశలో నామమాత్రపు మ్యాచ్లలో వెస్టిండీస్- ఇటలీ.. శ్రీలంక- జింబాబ్వే.. అఫ్గనిస్తాన్- కెనడా గురువారం తలపడతాయి. మరి సూపర్-8 దశలో ఏ జట్టుకు ఏ జట్టుతో పోటీ? షెడ్యూల్, వేదికలు.. తదితర వివరాలు తెలుసుకుందామా?8️⃣ TEAMS 4️⃣ SEMI-FINAL SPOTSThe race intensifies and the stakes are higher than ever as we enter the Super 8 phase! 🤩 🔥Which four teams will move one step closer to their World Cup dream? Drop your predictions 👇ICC Men's #T20WorldCup SUPER 8 👉 Starts SAT, 21st FEB pic.twitter.com/wsgnCWEXmx— Star Sports (@StarSportsIndia) February 19, 2026
మరో విజయం లక్ష్యంగా... నేడు రెండో టి20లో ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’
కాన్బెర్రా: ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుపై తొలి టి20లో నెగ్గిన భారత జట్టు... మరో విజయం లక్ష్యంగా నేడు జరిగే రెండో టి20లో బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1:45 నుంచి జరిగే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సిడ్నీలో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా 133 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. ఫలితం రావడానికి అవసరమైన కనీస ఐదు ఓవర్లు పూర్తి కావడంతో... ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్లో కనబరిచిన జోరును పునరావృతం చేసి సిరీస్లో 2–0తో ముందంజ వేయాలని హర్మన్ బృందం భావిస్తోంది.
జమ్మూకశ్మీర్ కొత్త చరిత్ర
కల్యాణి (పశ్చిమ బెంగాల్): సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. రంజీ ట్రోఫీలో అడుగు పెట్టిన 67 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. రెండుసార్లు చాంపియన్ బెంగాల్ జట్టుతో నాలుగు రోజుల్లో ముగిసిన సెమీఫైనల్లో పారస్ డోగ్రా సారథ్యంలోని జమ్మూకశ్మీర్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. బెంగాల్ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 43/2తో నాలుగో రోజు జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. 21.4 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 83పరుగులు సాధించి జమ్మూకశ్మీర్ విజయఢంకా మోగించింది. శుభమ్ పుందిర్ (27), పారస్ డోగ్రా (9) పెవిలియన్ చేరుకున్నా... వన్షజ్ శర్మ (83 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అబ్దుల్ సమద్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు) జమ్మూకశ్మీర్ జట్టును విజయతీరాలకు చేర్చారు. తొమ్మిది వికెట్లు తీయడంతోపాటు 42 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్ ఆటగాడు ఆకిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారంతోపాటు రూ. 50 వేలు ప్రైజ్మనీ దక్కింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు... జమ్మూకశ్మీర్ 302 పరుగులు చేశాయి. బెంగాల్ రెండో ఇన్నింగ్స్లో 99 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ విజేత జట్టుతో ఈనెల 24 నుంచి హుబ్లీ వేదికగా జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టు తలపడుతుంది. 802 పరుగుల ఆధిక్యంలో కర్ణాటక లక్నోలో ఉత్తరాఖండ్ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కర్ణాటక జట్టు 802 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోరు 149/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్ జట్టు 88.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్ పాటిల్, విజయ్కుమార్ వైశాఖ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 503 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన కర్ణాటక ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్లో 63.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 299 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రవిచంద్రన్ స్మరణ్ (127; 12 ఫోర్లు, 3 సిక్స్లు) రెండో ఇన్నింగ్స్లోనూ శతకం సాధించడం విశేషం. కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 3 ఫోర్లు, 5 సిక్స్లు), కృతిక్ కృష్ణ (52; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కర్ణాటక జట్టు ఫైనల్ చేరుకుంటుంది.
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ రుతుజా భోస్లే దుబాయ్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. బుధవారం జరిగిన డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రుతుజా (భారత్)–పీంగ్టార్న్ ప్లిపుయెచ్ (థాయ్లాండ్) ద్వయం 3–6, 6–7 (4/7)తో నాలుగో సీడ్ అనా డానిలినా (కజకిస్తాన్)–అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి రౌండ్లో రుతుజా–ప్లిపుయెచ్ 7–5, 6–2తో ఇరి హొజుమి (జపాన్)–ఫాంగ్ సియెన్ వు (చైనీస్ తైపీ)లపై గెలిచారు. ఈ విజయంతో సానియా మీర్జా (2022లో సిన్సినాటి ఓపెన్) తర్వాత డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోర్నీలో మ్యాచ్ గెలిచిన రెండో భారత ప్లేయర్గా రుతుజా గుర్తింపు పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన రుతుజా–ప్లిపుయెచ్లకు 17,200 డాలర్ల (రూ. 15 లక్షల 60 వేలు) ప్రైజ్మనీతోపాటు 120 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
T20 WC: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ?
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో లీగ్ దశ తుది అ...
మరో విజయం లక్ష్యంగా... నేడు రెండో టి20లో ఆస్ట్రేలియాతో భారత్ ‘ఢీ’
కాన్బెర్రా: ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఆస్ట్రే...
జమ్మూకశ్మీర్ కొత్త చరిత్ర
కల్యాణి (పశ్చిమ బెంగాల్): సుదీర్ఘ నిరీక్షణ ముగిసి...
టీమిండియా అదుర్స్.. అజేయంగా... అగ్రస్థానంతో
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో లీగ్ దశను భారత జ...
క్రీడలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
వీడియోలు
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
