Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lucknow Super Giants to beat Royal Challengers Bengaluru by 9 runs1
బ్యాటింగ్‌లో మార్ష్‌ బౌలింగ్‌లో ప్రిన్స్‌

మ్యాచ్‌లో ఓడితే ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో మైదానంలోకి దిగిన లక్నో తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటింది. చక్కటి ఆటతో బెంగళూరును చిత్తు చేసింది. మార్ష్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు...ప్రిన్స్‌ పదునైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని కట్టడి చేయగలిగింది. పాటీదార్, డేవిడ్‌ దూకుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ను గెలిపించడానికి సరిపోలేదు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఈ గెలుపు దక్కడం విశేషం. లక్నో: ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కాస్త ఊరట లభించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ సమష్టి ప్రదర్శన కనబర్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 9 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటకు పదే పదే అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్ (56 బంతుల్లో 111; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన రెండో సెంచరీని నమోదు చేయగా...నికోలస్‌ పూరన్‌ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (10 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడిపోయింది. రజత్‌ పాటీదార్‌ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు. పంత్‌ జోరు... లక్నో ఓపెనర్‌ మార్ష్ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగా, సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అర్షిన్‌ కులకర్ణి (17) తడబడ్డాడు. ఏకపక్షంగా మార్ష్ బౌండరీల జోరు సాగింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్ష్...కృనాల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. ఆ తర్వాత సలామ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో పాటు హాజల్‌వుడ్‌ ఓవర్లో కూడా మార్ష్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 68 పరుగులకు చేరగా, 20 బంతుల్లోనే మార్ష్ అర్ధసెంచరీ పూర్తయింది. అర్షిన్‌ వెనుదిరిగిన తర్వాత పూరన్‌ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మరో వైపు షెఫర్డ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన మార్ష్ 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను సెంచరీ అందుకునే సమయానికి జట్టు స్కోరు 139 పరుగులు అంటే మార్ష్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. మార్ష్, పూరన్‌ తక్కువ వ్యవధిలో అవుటైనా...పంత్‌ మెరుపులతో స్కోరు 200 దాటింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను...సలామ్‌ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 4, 6తో ముగించాడు. కోహ్లి డకౌట్‌... ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. బెతెల్‌ (4) వైఫల్యం కొనసాగగా...ప్రిన్స్‌ వేసిన అద్భుత బంతికి విరాట్‌ కోహ్లి (0) డకౌటయ్యాడు. 2023 సీజన్‌ తర్వాత కోహ్లి డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఈ దశలో పాటీదార్‌ సిక్సర్లతో చెలరేగిపోగా, పడిక్కల్‌ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 53 బంతుల్లోనే 95 పరుగులు జోడించడంతో బెంగళూరుకు విజయావకాశాలు కనిపించాయి. అయితే ఎనిమిది పరుగుల తేడాతో వీరిద్దరితో పాటు జితేశ్‌ (1) కూడా అవుట్‌ కావడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో డేవిడ్‌ దూకుడైన ఆటతో టీమ్‌లో ఆశలు రేగాయి. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్‌ను షహబాజ్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీకి గెలుపు కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) బెతెల్‌ (బి) హాజల్‌వుడ్‌ 111; అర్షిన్‌ (సి) పాటీదార్‌ (బి) కృనాల్‌ 17; పూరన్‌ (సి) కృనాల్‌ (బి) సలామ్‌ 38; పంత్‌ (నాటౌట్‌) 32; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–95, 2–165, 3–194. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–34–0, హాజల్‌వుడ్‌ 4–0–49–1, కృనాల్‌ 4–0–31–1, సలామ్‌ 4–0–53–1, సుయాశ్‌ 2–0–21–0, షెఫర్డ్‌ 1–0–16–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెతెల్‌ (సి) ప్రిన్స్‌ (బి) షమీ 4; కోహ్లి (బి) ప్రిన్స్‌ 0; పడిక్కల్‌ (సి) అండ్‌ (బి) ప్రిన్స్‌ 34; పాటీదార్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షహబాజ్‌ 61; జితేశ్‌ (సి) పంత్‌ (బి) ప్రిన్స్‌ 1; డేవిడ్‌ (సి) రాఠీ (బి) షహబాజ్‌ 40; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 28; షెఫర్డ్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–104, 4–106, 5–112, 6–167. బౌలింగ్‌: షమీ 4–0–33–1, ప్రిన్స్‌ 4–0–33–3, మయాంక్‌ 4–0– 50–0, రాఠీ 4–0–50–0, షహబాజ్‌ 3–0–33–2.

IPL 2026: Lucknow Super Giats Beat Royal Challengers Bangalore By 9 Runs2
ఆర్సీబీ ఓట‌మి.. వ‌రుస ఓట‌ముల‌కు ల‌క్నో చెక్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వ‌రుస ఓట‌ముల‌కు పుల్‌స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ ప‌టీదార్ (61) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, ప‌డిక్క‌ల్ (34) ప‌ర్వాదలేద‌నిపించాడు. ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ మూడు వికెట్ల‌తో మెర‌వ‌గా, ష‌మీ, షాబాజ్ అహ్మ‌ద్‌లు చెరొక వికెట్ తీశారు.అంత‌క‌ముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. కాగా ల‌క్నో ఆరు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత గెలుపును అందుకోవ‌డం విశేషం.

Suryakumar Yadav and wife Devisha Shetty welcome baby girl3
కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌.. తండ్రిగా ‍ప్రమోషన్‌!

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సూర్యకుమార్‌ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్‌ తెలిపారు. ‘ కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

Mitchell Marsh 1st Cricketer Hits-Fastest Century-For-LSG In IPL History4
తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. త‌ద్వారా ల‌క్నో త‌ర‌ఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ బాదిన తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. రొమారియో షెప‌ర్డ్ వేసిన యార్క‌ర్ బంతిని బౌండ‌రీ త‌ర‌లించ‌డం ద్వారా ఐపీఎల్‌లో రెండో సెంచ‌రీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచ‌రీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. అయితే గ‌తంలో ల‌క్నో త‌ర‌ఫున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ రిష‌బ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శ‌త‌కం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచ‌రీతో ఆ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఓవ‌రాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచ‌రీ. తొలి సెంచ‌రీ కూడా ల‌క్నో త‌ర‌ఫునే సాధించాడు. గ‌తేడాది సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 ప‌రుగులు సాధించాడు. ఇక ల‌క్నో త‌ర‌ఫున రెండు సెంచ‌రీలు సాధించిన రెండో ఆట‌గాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్‌, స్టోయినిస్‌, పంత్‌లు త‌లా ఒక సెంచ‌రీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

Ex-Cricketer Allegations-Players Not Happy With Coach Gambhir5
‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై భార‌త మాజీ క్రికెట‌ర్ అతుల్ వ‌స్స‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. గంభీర్ దూకుడు స్వ‌భావం, అత‌డి కఠిన వైఖ‌రితో జ‌ట్టులోని కొంతమంది ఆట‌గాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వ‌స్స‌న్ ఆ ఆటగాళ్ల పేర్ల‌ను వెల్ల‌డించడానికి నిరాక‌రించాడు. అతుల్ వ‌స్స‌న్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్న‌ప్ప‌టి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జ‌ర‌గాలి, ఇంకేమీ చేయ‌కూడ‌దు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. మొద‌టి నుంచి గంభీర్ స్వ‌భావం అలాగే ఉంటుంది. ధ‌నిక కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ గంభీర్ ఆట‌లో మంచి టెక్నిక్ ఉండ‌డంతో పాటు మంచి తెలివిమంతుడు. అయితే అత‌నికి ఉండే ఈగో వేరే లెవెల్‌లో ఉంటుంది. అదెలా అంటే అత‌ను ఏదైనా అనుకుంటే అవ‌త‌లి వ్య‌క్తుల కూడా త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్‌లో అలాగే కొనసాగడం ఆట‌గాళ్ల‌తో గొడ‌వ‌లు ప‌డేలా చేసింది. అందుకే ఐపీఎల్‌లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి ప‌ట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత‌మంది ఆట‌గాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. వారి పేర్లు చెప్ప‌డం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్ర‌వ‌ర్త‌న‌తో క‌చ్చితంగా సంతోషంగా లేర‌ని చెప్ప‌గ‌ల‌ను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!

Bhuvneshwar Kumar becomes First Pacer to play 200 IPL games6
భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్‌గా!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో సూప‌ర్ ఫామ్ క‌న‌బ‌రుస్తున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) స్టార్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ల‌క్నోతో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో మ్యాచ్ భువ‌నేశ్వ‌ర్‌కు 200వ మ్యాచ్ కావ‌డం విశేషం. ఐపీఎల్లో ఈ ఘ‌న‌త సాధించిన తొలి పేస‌ర్‌గా భువ‌నేశ్వ‌ర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భార‌త ఆట‌గాళ్లే కావ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 199 మ్యాచ్‌ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్‌లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్‌లు, ఎస్‌ఆర్‌హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్‌లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్‌లు ఆడాడు.అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్‌లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్‌లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్‌లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్‌లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్‌లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్‌లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్‌లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్‌లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్‌లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్‌లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్‌లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్‌లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్‌.. పంజాబ్ జట్టుకు శిక్ష త‌ప్ప‌దా?

IPL2026: Lucknow Super Giants Vs Royal Challengers Bangalore-Match Live-Update7
IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం

గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది.టిమ్ డేవిడ్ ఔట్‌.. ఆరో వికెట్ డౌన్‌ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావ‌డంతో ఆర్సీబీ 158 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్‌సీబీ విజ‌యానికి 21 బంతుల్లో 55 ప‌రుగులు అవ‌స‌రం.ఒకే ఓవ‌ర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్‌ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో బౌలింగ్‌కు వ‌చ్చిన ప్రిన్స్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. ఓవ‌ర్ తొలి బంతికి ప‌డిక్క‌ల్ (34)ను పెవిలియ‌న్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 ప‌రుగుల వ‌ద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజ‌యానికి 48 బంతుల్లో 106 ప‌రుగులు అవ‌స‌రం.ప‌టీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ213 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ ఆర్సీబీ 10 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీదార్ (60) అర్థ‌సెంచ‌రీ సాధించ‌గా, ప‌డిక్క‌ల్ 34 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.7 ఓవ‌ర్ల‌లో ఆర్సీబీ 60/2ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆర్సీబీ 2 వికెట్ల న‌ష్టానికి 60 ప‌రుగులు చేసింది. ప‌డిక్క‌ల్ (26), ప‌టీదార్ (25) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ210 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో కోహ్లీ డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అంత‌క‌ముందు ఓపెన‌ర్ జాక‌బ్ బెథెల్ 4 ప‌రుగులు చేసి ష‌మీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 2 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.ఆర్సీబీ టార్గెట్ 213 ప‌రుగులుఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌కు ప‌లుమార్లు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో ఆట‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించి ఆర్‌సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్‌ టార్గెట్‌ నిర్దేశించింది.రెండో వికెట్ కోల్పోయిన లక్నో111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో బెతెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.లక్నో, ఆర్సీబీ మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.మిచెల్ మార్ష్ సెంచ‌రీ.. ల‌క్నో 139/1ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శ‌త‌కం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నాయి. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 145 ప‌రుగులు చేసింది. పూర‌న్ 14 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నోవ‌ర్షం అంత‌రాయం త‌ర్వాత మొద‌లైన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన అర్షిన్ కుల‌క‌ర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ప‌టీదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం ల‌క్నో 11 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 109 ప‌రుగులు చేసింది. వరుణుడి అడ్డంకి ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్‌ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్‌ మార్ష్‌ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్‌ మార్ష్‌ 76, అర్షిన్‌ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచుతున్న మిచెల్ మార్ష్‌ల‌క్నో ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 56 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లలో లక్నో 39/04 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 39 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కుల‌కర్ణి (8) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయంల‌క్నో, ఆర్సీబీ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించింది. వ‌ర్షం ప‌డే స‌మ‌యానికి ల‌క్నో 1.3 ఓవ‌ర్లలో వికెట్లు న‌ష్ట‌పోకుండా 12 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కుల‌కర్ణి (4) ప‌రుగుల‌తో ఆడుతున్నారు.టాస్‌ నెగ్గిన ఆర్సీబీటాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జ‌ట్టు ఎలాంటి మార్పు లేకుండా బ‌రిలోకి దిగుతోంది. మ‌రోవైపు ల‌క్నో జ‌ట్టు మాత్రం మూడు మార్పుల‌తో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కుల‌క‌ర్ణి, మ‌నిర‌మ‌న్ స్థానంలో షాబాజ్ అహ్మ‌ద్, మోసిన్‌ ఖాన్‌ స్థానంలో దిగ్వేష్‌ రాఠీ జ‌ట్టులోకి వ‌చ్చారు.ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్‌లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్‌ జె యింట్స్‌పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.తుది జట్లు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్‌వుడ్.లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt— IndianPremierLeague (@IPL) May 7, 2026

Yuzvendra Chahal Caught Vaping In Flight New Controversy Hits IPL 20268
దొరికిపోయిన చాహల్‌.. పంజాబ్ జట్టుకు శిక్ష త‌ప్ప‌దా?

టీమిండియా క్రికెట‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ త‌న చ‌ర్య‌తో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు మొత్తాన్ని చిక్కుల్లో ప‌డేసేలా క‌నిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్ర‌యాణం చేస్తున్న విమానంలో చాహ‌ల్..వేప్‌( ఈ-సిగ‌రేట్) తాగిన వీడియో ఫుటేజీ బ‌య‌టికి వ‌చ్చింది. వీడియోలో చాహ‌ల్ వేప్‌ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు అహ్మ‌దాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు విమాన ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. పంజాబ్ స‌హ‌చ‌ర క్రికెట‌ర్ అర్ష‌దీప్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్లాగ్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే అస‌లు వ్లాగ్‌లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించిన‌ట్లు ఇన్‌స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. అస‌లు వీడియోలో చాహ‌ల్ ఒక్క‌డే కాకుండా అత‌డి ప‌క్క‌న ఉన్న శ‌శాంక్ సింగ్‌, ఇత‌ర పంజాబ్ ప్లేయ‌ర్లు కూడా ఈ-సిగ‌రేట్ తాగే అవ‌కాశం లేక‌పోలేద‌ని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్ర‌యాణంలో సిగ‌రేట్ (ఈ-సిగ‌రెట్ అయినా) తాగ‌డం నిషేధం. సిగ‌రేట్ పొగ వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగేందుకు ఆస్కార‌ముంది. చాహ‌ల్ ప్ర‌వ‌ర్త‌న విమాన భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను ఉల్లంఘిస్తుంది. ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌లోనే పంజాబ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ డ్రెస్సింగ్రూమ్‌లో వేప్‌ను ఉప‌యోగిస్తూ ప‌ట్టుబ‌డ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెల‌కొంది. అయితే బీసీసీఐ మాత్రం ప‌రాగ్‌ను మంద‌లిస్తూ అత‌ని మ్యాచ్ ఫీజులో 25 శాతం జ‌రిమానాతో స‌రిపెట్టింది. కానీ ఈసారి చాహ‌ల్ వేప్ ఉప‌యోగించిన‌ట్లు తేలితే మాత్రం అత‌డితో పాటు పంజాబ్ జ‌ట్టు మొత్తానికి శిక్ష ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఎందుకంటే చాహల్‌తో పాటు పంజాబ్‌ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.చాహల్‌ చర్య నిజమని తేలితే ఐపీఎల్‌ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహ‌ల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం కానీ ఇంకా స్పందించ‌లేదు. అయితే ఈ వీడియో న‌కిలీదా లేక నిజమైన‌దా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇక పంజాబ్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిన పంజాబ్‌ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్‌ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 236 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పంజాబ్‌ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings⁠ players were around him. 👀This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026చదవండి: క‌మిన్స్‌కు ​‍క్రికెట్‌ ఆస్ట్రేలియా భారీ ఆఫ‌ర్‌!

Reports-Pat Cummins Set To Receive Rs 113 Crore Deal-Mega IPL Offer9
క‌మిన్స్‌కు ​‍క్రికెట్‌ ఆస్ట్రేలియా భారీ ఆఫ‌ర్‌!

ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌ను ప్రైవేటు లీగ్‌లు ఆడ‌కుండా జ‌ట్టుతోనే ఎక్కువ‌గా అట్టిపెట్టుకోవాల‌ని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అత‌డికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించ‌నుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌కు క‌మిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియ‌న్ డాల‌ర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఆడ‌డం మానేసి గ్లోబ‌ల్ టీ20 లీగ్‌ల్లో త‌మ‌కు ప్రాతినిధ్యం వ‌హించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ క‌మిన్స్‌కు 10 మిలియ‌న్ ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్‌బాష్‌, ఐపీఎల్‌, ఎంఎల్‌సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్‌ను ఇతర లీగ్‌ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది.ఇదే విష‌య‌మై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్‌ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్‌, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్‌లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పాట్‌ కమిన్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్‌కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్‌ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్‌లో భాగంగా బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్‌ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌పై విజయంతో ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

IPL 2026: Under Pat Cummins Captaincy Sunrisers Hyderabad Became Ultimate title Favorite10
సన్‌రైజర్స్‌ను ఆపడం కష్టమే..!

ఐపీఎల్‌ 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో అన్ని జట్లకంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. సెకెండ్‌ బెస్ట్‌ రన్‌రేట్‌తో (0.737) 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ప్రత్యర్దులు గుజరాత్‌, సీఎస్‌కే, ఆర్సీబీ. ఈ మూడు మ్యాచ్‌లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌ వేదికలుగా జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ప్రయాణం తొలుత అంత సాఫీగా సాగలేదు. మొదటి 4 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఢీలాగా ఉండింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది. అయితే ఐదో మ్యాచ్‌ నుంచి తాత్కాలిక కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయపథంలో నడిపించసాగాడు. ఇషాన్‌ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన సన్‌రైజర్స్‌.. ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించి గాడిలో పడింది.అయితే సన్‌రైజర్స్‌కు అసలు బ్రేక్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తిరిగొచ్చిన తర్వాతే వచ్చింది. అప్పటిదాకా బౌలింగ్‌లో బలహీనంగా ఉండిన సన్‌రైజర్స్‌ కమిన్స్‌ రాకతో ఒక్కసారిగా బలపడినట్లైంది. కమిన్స్‌ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్లకు మార్గదర్శంగా నిలిచాడు. అప్పటికే సత్తా చాటుతున్న ఎషాన్‌ మలింగ కమిన్స్‌ సలహాలతో మరింత రెచ్చిపోసాగాడు. దేశీయ యువ పేసర్లు సాకిబ్‌ హుసేన్‌, ఫ్రఫుల్‌ హింగే కమిన్స్‌ మార్గదర్శకత్వంలో రాటుదేలారు. ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ సైతం కమిన్స్‌ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు. ఈ ఐదురుగు నిలకడగా రాణిస్తుండటంతో సన్‌రైజర్స్‌ ప్రస్తుత ఎడిషన్‌లో అత్యంత ప్రమాదకర పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌గా మారిపోయింది. వీరికి స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌ కూడా జతకలవడంతో సన్‌రైజర్స్‌ అత్యంత పటిష్టమైన బౌలింగ్‌ విభాగంగా తయారైంది.సీజన్‌ ప్రారంభంలో బ్యాటింగ్‌ అత్యంత పటిష్టంగా ఉన్నా, బౌలింగ్‌ విభాగం సరిగ్గా లేకపోవడం వల్లనే సన్‌రైజర్స్‌ అపజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు బౌలింగ్‌ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్‌రైజర్స్‌ తిరుగులేని జట్టుగా మారిపోయింది. కమిన్స్‌ వచ్చాక సన్‌రైజర్స్‌ నాలుగింట మూడు విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్‌ రేసులో అందరికంటే ముందుకొచ్చింది.ఆరెంజ్‌ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్‌ ఖాయం. మొత్తంగా కమిన్స్‌ రాక సన్‌రైజర్స్‌లో కాకను మరింత పెంచింది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జట్టులో అందరూ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టాపార్డర్‌ అంతా నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం టాప్‌-4 లీడింగ్‌ రన్‌ స్కోరర్లలో ముగ్గురు (క్లాసెన్‌, అభిషేక్‌, ఇషాన్‌) సన్‌రైజర్సే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్ది బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారారు. బౌలింగ్‌లో ఎషాన్‌ మలింగ చెలరేగిపోతున్నారు. ఇతనికి కమిన్స్‌ జతకలిశాడు. కమిన్స్‌ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నటి పంజాబ్‌ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్‌ శిబిరంలో మరో అన్‌ సంగ్‌ హీరో కూడా ఉన్నాడు. అతడే నితీశ్‌ కుమార్‌ రెడ్డి. నితీశ్‌ ఈ సీజన్‌లో చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.సీజన్‌ ప్రారంభంలో దారుణంగా విఫలమైన ట్రవిస్‌ హెడ్‌ కీలక దశలో ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్‌కు అదనంగా కలిసొస్తున్న అంశం. హెడ్‌ గత మూడు మ్యాచ్‌ల్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇలా ఒకరు కాకపోతే ఒకరు బాధ్యతలను భుజాన వేసుకుంటుండంతో సన్‌రైజర్స్‌ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఇది కొనసాగితే ఆ జట్టుకు మరో టైటిల్‌ ఖాయం.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement