ప్రధాన వార్తలు
‘హ్యాట్రిక్’పై రాజస్తాన్ గురి
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టింది. నేడు జరిగే పోరులో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్తో రియాన్ పరాగ్ బృందం తలపడనుంది. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై చివరి వరకు పోరాడి గెలిచిన రాయల్స్... అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో పటిష్టంగా కనిపిస్తోంది. 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, కెపె్టన్ రియాన్ పరాగ్, హెట్మైర్, రవీంద్ర జడేజాతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్లో ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జడేజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సీజన్ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్లో ఉండగా... తిలక్ వర్మ, రూథర్ఫోర్డ్, నమన్ ధీర్ రాణించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్కు దూరమైన కెపె్టన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, కార్బిన్ బాష్, మయాంక్ మార్కండే బౌలింగ్ భారం మోయనున్నారు. ఐపీఎల్లో ముంబై, రాజస్తాన్ జట్ల మధ్య 31 మ్యాచ్లు జరిగాయి. 16 మ్యాచ్ల్లో ముంబై, 14 మ్యాచ్ల్లో రాజస్తాన్ గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. రాజస్తాన్పై ముంబై అత్యధిక స్కోరు 214 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 92. ముంబై ఇండియన్స్పై రాజస్తాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 90 పరుగులుగా ఉంది.
వరుణుడి ఖాతాలో...
కోల్కతా: ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య సోమవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే వర్షం ముంచెత్తింది. మైదానం మొత్తాన్ని కవర్స్తో కప్పినా... ఎంతకూ వరుణుడు తెరిపినివ్వకపోవడంతో ఆట సాధ్యపడలేదు. పలుమార్లు పిచ్ను పరిశీలించిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్ధ ఉన్న ఈడెన్ గార్డెన్స్లో కటాఫ్ సమయానికి ముందే వరుణుడు శాంతించాడు. అయితే బౌండరీకి దగ్గర నీరు ఎక్కువగా నిలిచింది. దాంతో ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయానికల్లా మైదానం సిద్ధమయ్యే పరిస్థితి కనిపించలేదు. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి కాగా... ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గతేడాది కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. సొంతగడ్డపై టాస్ గెలిచిన కోల్కతా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా... వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 3.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరాన్ గ్రీన్ (4) విఫలం కాగా... కెప్టెన్ అజింక్య రహానే (8 నాటౌట్), అంగ్క్రిష్ రఘువంశీ (7) అజేయంగా నిలిచారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో పంజాబ్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ ఈ ఇద్దరినీ కీపర్ క్యాచ్ల ద్వారా వెనక్కి పంపాడు.
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో సామ్సన్, బుమ్రా
దుబాయ్: టీమిండియా ఓపెనర్ సంజూ సామ్సన్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యారు. గత నెలలో జరిగిన టి20 ప్రపంచకప్లో ప్రదర్శనకుగానూ ఐసీసీ వీరిద్దరి పేర్లను నామినేట్ చేసింది. వరల్డ్కప్ చివరి మూడు మ్యాచ్ల్లో అర్ధశతకాలతో భారత్ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవడంలో సామ్సన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్తో కీలక మ్యాచ్లో 97 పరుగులు చేసిన సంజూ... సెమీఫైనల్లో ఇంగ్లండ్పై, ఫైనల్లో న్యూజిలాండ్పై 87 పరుగుల చొప్పున చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సైతం గెలుచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో 7 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టిన బుమ్రా జట్టుకు అవసరమైనప్పుడల్లా ‘బ్రేక్ త్రూ’ అందించాడు. ఈ ఇద్దరితో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్ కానర్ ఎస్టెర్హుజెయిన్ సైతం రేసులో ఉన్నాడు. 2021 జనవరిలో ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ అవార్డును ఇప్పటి వరకు పది మంది భారత క్రికెటర్లు (పంత్, అశ్విన్, భువనేశ్వర్, కోహ్లి, యశస్వి జైస్వాల్, సిరాజ్, అభిషేక్ శర్మ–ఒక్కోసారి... శ్రేయస్ అయ్యర్–2 సార్లు, బుమ్రా–2 సార్లు, శుబ్మన్ గిల్–4 సార్లు) గెల్చుకున్నారు.
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో సోమవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ (51 కేజీలు), టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు), పూజా రాణి (85 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. భారత్కే చెందిన ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి (70 కేజీలు) సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో నిఖత్ 0–5తో వు యు (చైనా) చేతిలో ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్లోనూ వు యు చేతిలోనే నిఖత్ ఓటమి పాలైంది.లవ్లీనా 0–5తో అజీజా జొకిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, అంకుశిత 0–3తో నియెన్ చిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, పూజా రాణి 0–5తో నాదెజ్దా రియాబెట్స్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. ఇతర సెమీఫైనల్స్లో ప్రీతి 5–0తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎజి ఇమ్ (దక్షిణ కొరియా)పై, అరుంధతి 4–1తో ఒయ్షా తొయ్రోవా (ఉజ్బెకిస్తాన్)పై, ప్రియ 5–0తో నమున్ మోన్ఖోర్ (మంగోలియా)పై గెలుపొందారు
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఒక పతకం ఖరారైంది. మరో రెండు పతకాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ లలిత్ (55 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నేడు జరిగే స్వర్ణ–రజత పతక బౌట్లో ఇఖ్తియోర్ బొతిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. అంతకుముందు లలిత్ క్వార్టర్ ఫైనల్లో 9–8తో మిజుకి అరాకి (జపాన్)పై, సెమీఫైనల్లో 11–3తో హువోయింగ్ షి (చైనా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్కే చెందిన అమన్ (77 కేజీలు), సునీల్కుమార్ (87 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి నేడు కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. జోగిందర్ రాఠి (130 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో, సన్నీ కుమార్ (63 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్లో నిష్క్రమించారు. జోగిందర్, సన్నీ కుమార్లను ఓడించిన రెజ్లర్లు ఫైనల్కు చేరుకోవడంలో విఫలం కావడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం కూడా చేజారింది. నేడు జరిగే ఐదు వెయిట్ కేటగిరీల్లో సాహిన్ (60 కేజీలు), సచిన్ (67 కేజీలు), అనిల్ (72 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు), నితేశ్ (87 కేజీలు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పతకావకాశాలపై దెబ్బ పడింది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ నుంచి భారత రెండు డబుల్స్ స్టార్స్ జోడీలు వైదొలిగాయి. గాయం కారణంగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ఈ టోర్నీకి దూరమయ్యారు. సాత్విక్ భుజం గాయం నుంచి ఇంకా కోలుకోలేదని... అందుకే ఈ టోర్నీలో ఆడటంలేదని భారత డబుల్స్ కోచ్ టాన్ కిమ్ హెర్ తెలిపాడు. డబుల్స్లో పతకం ఆశలు ఆవిరి కావడంతో ఇక అందరి దృష్టి సింగిల్స్ స్టార్స్ లక్ష్య సేన్, పీవీ సింధులపై ఉంది. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్... మహిళల సింగిల్స్లో సింధు, మాళవిక, ఉన్నతి హుడా, తన్వీ శర్మ బరిలో ఉన్నారు. 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్లో పసిడి పతకం గెలిచిన తర్వాత భారత్కు సింగిల్స్లో మరో స్వర్ణ పతకం లభించలేదు.
కేకేఆర్-పంజాబ్ మ్యాచ్ వర్షార్పణం
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. దీంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 3.4 ఓవర్ వద్ద ఆట నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కేకేఆర్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తొలుత తేలికపాటి వర్షం పడడంతో తగ్గముఖం పడుతుందని అభిమానులు భావించారు. కానీ తర్వాత నెమ్మదిగా వర్షం తీవ్రత పెరిగింది. దాదాపు రెండు గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే అప్పటికే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో పాటు కట్-ఆఫ్ టైమ్ కూడా దగ్గరపడడం కాణంగా అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(5) అగ్రస్థానానికి చేరుకుంది. కేకేఆర్ ఖాతాలో తొలిపాయింట్ వచ్చి చేరింది.
ముంబై ఇండియన్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం(ఏప్రిల్ 7) గువహటి వేదికగా రాజస్తాన్ రాయల్స్లో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు ముంబై అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు అనారోగ్యం కారణంగా దూరమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి కోలుకున్నాడు.దీంతో రాజస్తాన్తో మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ధ్రువీకరించారు. "హార్దిక్ పాండ్యాకు ఎటువంటి గాయం కాలేదు. కేవలం అనారోగ్యం కారణంగానే గత మ్యాచ్కు దూరమయ్యాడు. ఇప్పుడు అతను పూర్తి ఫిట్గా ఉన్నాడు. మంగళవారం రాజస్తాన్తో జరిగే మ్యాచ్లో పాండ్యా తప్పకుండా ఆడతాడుమాంబ్రే ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.కాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించినంత మేర రాణించలేకపోయింది. పాండ్యా రీఎంట్రీ ఇస్తే దీపక్ చహర్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశముంది.ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా) : రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, హార్దిక్ పాండ్యా మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, , జస్ప్రీత్ బుమ్రా
పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
ఇంగ్లండ్ మహిళల జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి , ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ పీపా క్లియరీని జోన్స్ పెళ్లి చేసుకుంది. 2022 నుంచి డేటింగ్లో ఉన్న వీరిద్దరూ గతేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఏప్రిల్ 4న వీరిద్దిరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమీ జోన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వీరి వివాహ వేడకకు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. కాగా మహిళల బిగ్ బాష్ లీగ్-2023లో సందర్భంగా జోన్స్-పీపాకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిథ్యం హహిస్తున్నారు.ఇక ఇటీవల మహిళల క్రికెట్లో సేమ్ జేండర్ పెళ్లిల్లు కామన్ అయిపోయాయి. వీరికంటే ముందు న్యూజిలాండ్కు చెందిన అమీ సాటర్వైట్- సహచరి లియా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు స్కివర్-కేథరిన్ బ్రంట్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్- కాప్, డానియెల్ వ్యాట్- జార్జీ హోడ్జ్ జంటలు పెళ్లి చేసుకుని అందరిని షాక్కు గురి చేశారు. అమీ జోన్స్ ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది.చదవండి: IPL 2026: ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్.. తన ఆట పరంగా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ ఆసీస్ ఆల్రౌండర్ వరుసగా మూడో మ్యాచ్లో విఫలమయ్యాడు.ఈడెన్గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో గ్రీన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బార్ట్లెట్ బౌలింగ్లో తను ఎదుర్కొన్న తొలి బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గ్రీన్.. ఆ తర్వాత బంతికి మాత్రం వికెట్ల వెనక దొరికిపోయాడు. అంతకుముందు ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం రెండు పరుగులు చేశాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో కూడా గ్రీన్ 18 పరుగులు చేశాడు. మొత్తంగా మూడు మ్యాచ్లు కలిపి గ్రీన్ కేవలం 24 పరుగులు చేశాడు. దీంతో అతడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ.25.2 కోట్ల దండగ అని పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ అతడు ప్రస్తుతం కేవలం బ్యాటర్గా మాత్రమే తన సేవలను అందిస్తున్నాడు. గాయం కారణంగా అతడికి బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా అనుమతి లభించలేదు.చదవండి: IPL 2026: అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్రైజర్స్ ఫిర్యాదు?
కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్కు అవమానం!
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ తన తోటి ప్లేయర...
సత్తా చాటిన పంకజ్ అద్వానీ
లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ పూల్ ...
శీతల్కు పాయల్ షాక్!
బ్యాంకాక్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత జట్...
భారత మహిళల జోరు
పాఫోస్ (సైప్రస్): వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ ట...
ఈ చెత్త ఆటకేనా? రూ. 25 కోట్లు
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ కా...
అవేశ్ అత్యుత్సాహం.. బీసీసీఐకి సన్రైజర్స్ ఫిర్యాదు?
లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ అవేష్ ఖాన్కు పేరుక...
వర్షం కారణంగా పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ రద్దు
IPL 2026 KKR vs PBKS Live Updates: ఐపీఎల్-2026లో ...
‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడు’
టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పరుగుల వరద పారిస్తున...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
దూసుకెళ్తున్న పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
