ప్రధాన వార్తలు
ఉత్కంఠ పోరు.. ఒకే ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది.చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ వేసిన 19 ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగిపోయింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయసమీకరణం 13 పరుగులగా మారింది. చివరి ఓవర్ వేసే బాధ్యతను గుజరాత్ కెప్టెన్.. ప్రసిద్ద్ కృష్ణకు అప్పగించాడు. అయితే తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీగా మలిచాడు. తర్వాతి బంతికి నిగమ్ ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 4 బంతుల్లో 9 పరుగులగా మారింది. మూడో బంతికి కుల్దీప్ సింగిల్ తీసి మిల్లర్కు స్ట్రైక్ ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ సిక్సర్గా మలిచాడు. దీంతో రెండు బంతుల్లో ఢిల్లీకి రెండు పరుగులు అవసరయ్యాయి. మిల్లర్ క్రీజులో ఉండడంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని భావించారు. ఐదో బంతికి సింగిల్ వచ్చే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకున్నాడు. కానీ అయితే ఆఖరి బంతిని ప్రసిద్ద్ అద్భుతమైన బౌన్సర్గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. మిల్లర్ బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ సూపర్త్రోతో స్ట్రైకర్ ఎండ్ వైపు స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయ్యేది. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్లో మిల్లర్తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. అయినప్పటికి ఢిల్లీ ఓడిపోవడంతో రాహుల్, మిల్లర్(20 బంతుల్లో 41) ఇన్నింగ్స్లు వృథా అయిపోయాయి. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
జట్టు నుంచి తీసేమన్నారు.. కట్ చేస్తే! బౌండరీలతో బీభత్సం
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన ఐపీఎల్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో అద్భుతమైన అర్ధ శతకంతో మెరిశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన సుందర్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు.వాషీ కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. సుందర్ కేవలం 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే తొలి రెండు మ్యాచ్ల్లో మాత్రం సుందర్ బంతితో పాటు బ్యాట్తో కూడా విఫలమయ్యాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ గుజరాత్ మేనెజ్మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. తన అద్భుత ఇన్నింగ్స్తో మేనెజ్మెంట్ నమ్మకాన్ని సుందర్ నిలబెట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సుందర్తో పాటు శుభ్మన్ గిల్(70), జోస్ బట్లర్(52) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.Gujrat Titans against Delhi CapitalsGT70(45 : Shubman Gill55(32) : Washington Sundar52(27) : Jos ButtlerDC2/55 : Mukesh Kumar1/24 : Lungi Ngidi1/42 : Kuldeep Yadav pic.twitter.com/Wk8cmnCVba— Hello Cricket (@thehellocricket) April 8, 2026
శాంసన్ మంచి మనసు.. సెల్ఫీ అడిగిన అభిమానికి ఊహించని సర్ప్రైజ్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్కే తమ చివరి మ్యాచ్లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది. అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ క్రమంలో సంజూ మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు పక్కన తాను కారు ఆపాడు. అయితే అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్తో కలిసి బైక్పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్లో సంజూ ఉండడంతో చూసి తన బైక్ను అతడు ఆపాడు. శాంసన్ తన ఫోన్ కాల్ ముగించిన తర్వాత శబరీష్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఫొటో దిగుదామా అని సంజూనే స్వయంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు. దీంతో వెంటనే సంజూ తన వద్ద ఉన్న రూ. 40,000 విలువైన స్మార్ట్ఫోన్ను శబరీష్కు బహుమతిగా ఇచ్చాడు. సదరు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్లో దుమ్ములేపిన సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.చదవండి: IPL 2026: జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో
జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎట్టకేలకు తన రిథమ్ను అందుకున్నాడు. ఈ ధనధాన్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో బట్లర్ మెరుపు అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు.ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్కు బట్లర్ చుక్కలు చూపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ బౌలింగ్లో బట్లర్ ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఓవర్ మొదటి బంతికే తన ఫేవరెట్ 'ర్యాంప్ షాట్'తో సిక్సర్ కొట్టి బౌలర్ను ఒత్తిడిలోకి నెట్టాడు. బట్లర్ మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్
ఐపీఎల్లో మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్!
ఐపీఎల్-2026లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో వెటరన్ పేసర్ సందీప్ శర్మది కీలక పాత్ర. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో సందీప్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. 151 పరుగుల భారీ లక్ష్య చేధనలో ముంబైకి సందీప్ చుక్కులు చూపించాడు. సందీప్ శర్మ తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ వంటి కీలక వికెట్ను సందీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ శర్మపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ పేసర్లతో సందీప్ను అశ్విన్ పోల్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలర్లు అని అశ్విన్ కొనియాడాడు. "60-70 శాతం మంది బౌలర్లు గేమ్ను సరిగ్గా అర్ధం చేసుకోలేరు. కానీ సందీప్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అతడు బ్యాటర్ల మైండ్సెట్ను ముందే పసిగడతాడు. సందీప్ శర్మకు బుమ్రాతో పోలిస్తే వేగం తక్కువగా ఉండవచ్చు. కానీ అతడిలో కొన్ని అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి.అతడు మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. గేమ్ను సరిగ్గా రీడ్ చేయడంతో పాటు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగల్గితే ఐపీఎల్లోనే అత్యుత్తమ బౌలర్గా ఎదుగుతారు." అని అశ్విన్ ఓ క్రికెట్ షోలో పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి స్టార్ బ్యాటర్లపై సందీప్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది.చదవండి: IPL 2026: వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు
ఐపీఎల్ 2026 నేపథ్యంలో బీసీసీఐ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మ్యాచ్ సమయంలో బెంచ్పై ఉన్న ఆటగాళ్ల కదలికలపై కఠిన నియంత్రణలు విధించింది. జట్టుకు ఎంపికైన 16 మంది (11 మంది ప్లేయర్లు, ఐదుగురు ఇంపాక్ట్ సబ్స్) ఆటగాళ్లు మాత్రమే ఫీల్డ్లోకి వెళ్లి డ్రింక్స్, బ్యాట్స్ లేదా సందేశాలు ఇవ్వాలి. ఈ జాబితలో లేని ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీల్డ్లోకి ప్రవేశించరాదు. బౌండరీ చుట్టూ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే (బిబ్స్ ధరించి) ఉండాలి. మిగతా ఆటగాళ్లు డగౌట్కే పరిమితం కావాలి. బౌండరీ లైన్, LED బోర్డుల మధ్య కదలిక చేయరాదు. బీసీసీఐ నియమావళిలోని క్లాజ్ 11.5.2, 24.1.4 ఆధారంగా ఈ నియమాలు నిర్దేశించబడ్డాయి. ఇటీవల జట్టులో లేని ఆటగాళ్లు (16 మంద సభ్యుల జాబితాలో లేని వారు) ఫీల్డ్లోకి వెళ్లి డ్రింక్స్, సందేశాలు ఇవ్వడం వల్ల ఈ నియమాలను అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఢిల్లీ వేదికగా 14వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ విజయం
Gujarat titans vs Delhi capitals live Updates: ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమిఅరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. ప్రసిద్ద్ కృష్ణ పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ రనౌట్ కావడం మ్యాచ్ గుజరాత్ వశమైంది. ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 41) చివరి వరకు పోరాడనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు నిస్సాంక(41) కూడా రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, సిరాజ్ ఓ వికెట్ సాధించాడు.మిల్లర్.. కిల్లర్అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 12 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన సమయంలో మిల్లర్ వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు.ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 92 పరుగులు చేసిన రాహుల్.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 16 బంతుల్లో 42 పరుగులు కావాలి.ఢిల్లీ ఐదో వికెట్ డౌన్160 పరుగుల వద్ద ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. డిల్లీ విజయానికి 20 బంతుల్లో 50 పరుగులు కావాలిఢిల్లీ నాలుగో వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కేవలం రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఢిల్లీ విజయానికి 36 బంతుల్లో 77 పరుగులు కావాలి. క్రీజులో కేఎల్ రాహుల్(71) ఉన్నాడు.డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్డేవిడ్ మిల్లర్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. ఎడమ చేతి వేలి గాయం కారణంగా మిల్లర్ మైదానాన్ని వీడాడు. అతడి స్ధానంలో అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.రషీద్ ఖాన్ మ్యాజిక్రషీద్ ఖాన్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ ఐదో బంతికి నితీష్ రాణా ఔట్ కాగా.. ఆరో బంతికి సమీర్ రిజ్వీ క్లీన్ బౌల్డయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీతొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన కేఎల్ రాహుల్.. గుజరాత్తో మ్యాచ్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 24 బంతుల్లో 41 పరుగులు చేసిన నిస్సాంక.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(26), నిస్సాంక(35) ఉన్నారు.4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 36/04 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(19), నిస్సాంక(15) ఉన్నారు.గిల్ విధ్వంసం.. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్(70), జోస్ బట్లర్(52), వాషింగ్టన్ సుందర్(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు, ఎంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.శుభ్మన్ గిల్ ఔట్శుభ్మన్ గిల్ రూపంలో గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 70 పరుగులు చేసిన గిల్.. లుంగి ఎంగిడీ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు.భారీ స్కోర్ దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(51), వాషింగ్టన్ సుందర్(41) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 85/2దూకుడుగా ఆడుతున్న గుజరాత్జోస్ బట్లర్(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.గుజరాత్ తొలి వికెట్ డౌన్19 పరుగుల గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. 2.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 19/1టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్మన్ తిరిగి రావడంతో కుమార్ కుశాగ్ర బెంచ్కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్Innovative 🤝 Powerful Jos Buttler looks in the 𝙈.𝙊.𝙊.𝘿 tonight 😎#GT 68/1 after the powerplay. Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT | @josbuttler | @gujarat_titans pic.twitter.com/mLBuDqyQWl— IndianPremierLeague (@IPL) April 8, 2026
భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ల రీఎంట్రీ
ఏప్రిల్ 13–17 వరకు అర్జెంటీనాలో జరుగబోయే నాలుగు మ్యాచ్ల సిరీస్ కోసం 24 మంది సభ్యుల భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. స్టార్ ప్లేయర్లు సవితా పూనియా (గోల్ కీపర్), దీపిక (ఫార్వర్డ్) ఈ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చారు. సలీమా టేటే కెప్టెన్గా కొనసాగుతారు. జ్యోతి, ముంతాజ్ ఖాన్ జట్టులోకి తిరిగి వచ్చారు. రుతుజా, ఇషికా, సాక్షి రాణా వంటి యువ ప్లేయర్లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. సవితతో పాటు మరో గోల్ కీపర్గా బిచు దేవి ఎంపికయ్యారు.డిఫెండర్లుగా నిక్కీ ప్రధాన్, ఇషికా చౌధరి, సుశీలా చాను, మనీషా చౌహాన్, లల్తంత్లుయాంగి, జ్యోతి, ఉదితా చోటు దక్కించుకున్నారు. మిడ్ఫీల్డర్లుగా వైష్ణవి విఠల్ ఫల్కే, సాక్షి రాణా, సునెలితా టోప్పో, సలీమా టేటే, నేహా, దీపికా సోరెంగ్, రుతుజా దాదాసో పిసాల్, ఇషికా .. ఫార్వర్డ్ ప్లేయర్లుగా బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపికా, అన్ను, బ్యూటీ దుంగ్దుంగ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్ వ్యవహరించనున్నారు.ఈ సిరీస్ భారత జట్టుకు హాకీ వరల్డ్ కప్ 2026, ఆసియా గేమ్స్కు ముందు కీలకమైందిగా పరిగణించబడుతుంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఆడటం యువ ప్లేయర్లకు విలువైన అనుభవంగా నిలువనుంది.
ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు
ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తమ నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. కేకేఆర్ ఈ ధనధాన్ లీగ్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. తొలి రెండు మ్యాచ్లలో ఓటమిపాలైన కేకేఆర్.. లక్నోపై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్కు కేకేఆర్కు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియరెన్స్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో అతడు బౌలింగ్ చేసే అవకాశముంది. గతేడాది జరిగిన మినీ వేలంలో గ్రీన్ను రూ.25.2 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.ఆల్రౌండర్గా ఉపయోపడతాడని గ్రీన్పై అంత భారీ మొత్తాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ వెచ్చింది. కానీ గ్రీన్ మాత్రం ఇప్పటివరకు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్లలోనూ కేవలం స్పెషలిస్టు బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగాడు. దీంతో చాలా మంది మాజీలు విమర్శలు వర్షం కురిపించారు. ఈ మాత్రం దానికి అంత ధర ఎందుకు అని కేకేఆర్పై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.అయితే అతడు వెన్ను గాయం నుంచి కోలుకుని గతేడాది ఆఖరిలో పోటీ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. ఆస్ట్రేలియా తరపున కూడా అతడు చాలా మ్యాచ్లలో కేవలం బ్యాటర్గా మాత్రమే ఆడాడు. ఈ క్రమంలో అతడి ఫిట్నెస్, వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగా గ్రీన్కు ఐపీఎల్లో బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వలేదు. కానీ అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అతడికి సీఎ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.బ్యాటింగ్లో కూడా అట్టర్ ప్లాప్!బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే బ్యాటింగ్లో కూడా అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. టాపార్డర్లో బ్యాటింగ్ వస్తున్న గ్రీన్ కనీస ప్రభావం చూపలేకపోతున్నాడు. మూడు మ్యాచ్లలో 24 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతానికి అతడి ప్రదర్శన చూస్తుంటే ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు తీసుకున్నట్లు ఉంది. కనీసం తర్వాత మ్యాచ్లలోనైనా గ్రీన్ తన ధరకు తగ్గ న్యాయం చేస్తాడో లేదో చూడాలి.చదవండి: IPL 2026: వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం సమీర్ రిజ్వీ తన మెరుపు బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్ల్లో ఒంటి చేత్తో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించాడు.లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్లలో కూడా రిజ్వీకే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కడం గమనార్హం.భారత జట్టులోకి ఎంట్రీ?మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడుతున్న సమీర్ రిజ్వీని భారత జట్టుకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో టాపార్డర్ పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి మిడిలార్డర్ కొంచెం వీక్గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాటర్ జట్టులోకి వస్తే భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారనుంది.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్లో భారత్ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.దీంతో భారత జట్టులో రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది జూన్లో భారత అండర్-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
భారత జట్టులో హైదరాబాద్ కుర్రాడు
సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా జూనియర్ డేవిస...
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచల...
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిటల్స్పై గుజరాత్ విజయం
Gujarat titans vs Delhi capitals live Updates: ఉత్...
ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు
ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ తమ ...
వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచ...
కలిసిపోయిన స్మృతి- పలాష్ కుటుంబాలు?.. త్వరలోనే పెళ్లి?!
భారత మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థా...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
