Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ENG VS IND 2nd Test Day 2: India is tightening its grip on England Match1
ENG VS IND 2nd Test Day 2: పట్టుబిగిస్తున్న భారత్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.వరుస షాక్‌లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్‌ ఆడుతున్న ఆకాశ్‌దీప్‌ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌లను డకౌట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్లు డకెట్‌, పోప్‌ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్‌ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 20 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 77/3గా ఉంది. రూట్‌ (18), బ్రూక్‌ (30) క్రీజ్‌లో ఉన్నారు.

ENG VS IND 2nd Test Day 2: Akash Deep Gets Duckett And Pope In Back To Back Balls2
ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్‌ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.వరుస షాక్‌లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్‌ ఆడుతున్న ఆకాశ్‌దీప్‌ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌లను డకౌట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్‌ ఫామ్‌ బ్యాటర్లు డకెట్‌, పోప్‌ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్‌ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 33/3గా ఉంది. రూట్‌ (5), బ్రూక్‌ (5) క్రీజ్‌లో ఉన్నారు.

ENG VS IND 2nd Test: India All Out For 587 Runs In First Innings3
ENG VS IND 2nd Test: గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్‌ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్‌ అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్‌.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్‌.. ఇవాళ డబుల్‌ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్‌ సుందర్‌ (42) రాణించారు. గిల్‌.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్‌ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 2, కరుణ్‌ నాయర్‌ 31, రిషబ్‌ పంత్‌ 25, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 1, ఆకాశ్‌దీప్‌ 6, సిరాజ్‌ 8, ప్రసిద్ద్‌ కృష్ణ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ 3, క్రిస్‌ వోక్స్‌, జోష్‌ టంగ్‌ తలో 2, బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్‌ (101), గిల్‌ (147), పంత్‌ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (137), పంత్‌ (118) శతకాలు చేశారు.

ENG VS IND 2nd Test: Gill Breaks Kohli All Time Record Of Highest Score By An Indian Captain In Tests4
భారీ డబుల్‌ సెంచరీ.. కోహ్లి ఆల్‌ టైమ్‌ రికార్డు బద్దలు కొట్టిన గిల్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారీ డబుల్‌ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి రికార్డులు తిరగరాశాడు. రెండో రోజు గిల్‌ టీ విరామం తర్వాత కాసేపటికే ఔటయ్యాడు. టంగ్‌ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ డబుల్‌ సెంచరీతో గిల్‌ చాలా రికార్డులు సాధించాడు.కోహ్లి ఆల్‌ టైమ్‌ రికార్డు బద్దలుఈ మ్యాచ్‌లో 269 పరుగులు చేసి ఔటైన గిల్‌.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉండేది. విరాట్‌ 2019లో సౌతాఫ్రికాపై 254 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అవతరించాడు. గిల్‌ కెప్టెన్‌గా తన మూడో ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 భారత కెప్టెన్లు..గిల్‌-269కోహ్లి-254 నాటౌట్‌ (2019)కోహ్లి-243 (2017)కోహ్లి-235 (2016)ధోని-224 (2013)టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాళ్లు..వీరేందర్ సెహ్వాగ్ - 319వీరేందర్ సెహ్వాగ్ - 309కరుణ్ నాయర్ - 303*వీరేందర్ సెహ్వాగ్ - 293వీవీఎస్ లక్ష్మణ్ - 281రాహుల్ ద్రవిడ్ - 270శుభ్‌మన్ గిల్ - 269ఇంగ్లండ్‌లో 250+ స్కోర్లు సాధించిన పర్యాటక టెస్ట్ కెప్టెన్లు..311 - బాబ్ సింప్సన్ (AUS), ఓల్డ్ ట్రాఫోర్డ్, 1964277 - గ్రేమ్ స్మిత్ (SA), ఎడ్జ్‌బాస్టన్, 2003269 - శుభ్‌మన్ గిల్ (IND), ఎడ్జ్‌బాస్టన్, 2025259 - గ్రేమ్ స్మిత్ (SA), లార్డ్స్, 2003విదేశీ టెస్టుల్లో టీమిండియా తరపున 250+ స్కోర్లు చేసిన ఆటగాళ్లు..309 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, ముల్తాన్, 2004270 - రాహుల్ ద్రవిడ్ vs PAK, రావల్పిండి, 2004269 - శుభ్‌మన్‌ గిల్ vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2025254 - వీరేంద్ర సెహ్వాగ్ vs PAK, లాహోర్, 2006గిల్‌ సాధించిన మరిన్ని రికార్డులు..ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌..ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక స్కోర్‌ చేసిన భారత ఆటగాడు.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడు.. విదేశాల్లో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్‌.. ఇంగ్లండ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడు.. టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్‌మ్యాచ్‌ విషయానికొస్తే.. గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. గిల్‌ ఔటయ్యాక భారత్‌ అదే స్కోర్‌ వద్ద ఆకాశ్‌దీప్‌ (6) వికెట్‌ కూడా కోల్పోయింది. 149 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 583/9గా ఉంది. సిరాజ్‌ (7), ప్రసిద్ద్‌ కృష్ణ (2) క్రీజ్‌లో ఉన్నారు.యశస్వి జైస్వాల్‌ (87), కేఎల్‌ రాహుల్‌ (2), కరుణ్‌ నాయర్‌ (31), రిషబ్‌ పంత్‌ (25), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1), రవీంద్ర జడేజా (89), సుందర్‌ (42), గిల్‌ (269), ఆకాశ్‌దీప్‌ (6) ఔటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, టంగ్‌, బషీర్‌ తలో 2 వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, రూట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ENG VS IND 2nd Test Day 2: Gill Becomes First Asian Captain To Score A Double Hundred In SENA Countries5
ENG VS IND 2nd Test: భారీ డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారీ డబుల్‌ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్‌ తర్వాత గిల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి డబుల్‌ సెంచరీ. ఈ మైలురాయిని గిల్‌ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్‌తో గిల్‌ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా..ఇంగ్లండ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక స్కోర్‌ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్‌గా.. విదేశాల్లో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన భారత కెప్టెన్‌గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ ఇప్పటికే భారీ స్కోర్‌ చేసేసింది. డబుల్‌ సెంచరీ తర్వాత కూడా గిల్‌ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్‌దీప్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామం సమయానికి​ భారత్‌ స్కోర్‌ 565/7గా ఉంది.310/5 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్..‌ లంచ్‌ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్‌-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో (42) కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ (87), కేఎల్‌ రాహుల్‌ (2), కరుణ్‌ నాయర్‌ (31), రిషబ్‌ పంత్‌ (25), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జోష్‌ టంగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

Is Lord Bigger Than Series: Kumar Sangakkara Slams Decision To Rest Bumrah6
IND vs ENG: గంభీర్‌ ఏం చేస్తున్నాడు?.. కుమార్‌ సంగక్కర ఫైర్‌

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార​ సంగర్కర విమర్శించాడు. సిరీస్‌ గెలవడం కంటే కూడా.. లార్డ్స్‌ టెస్టే ముఖ్యమా అంటూ భారత జట్టు నాయకత్వ తీరును ప్రశ్నించాడు. కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లీడ్స్‌ (Leeds Test)లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు జరిగింది. ఇందులో గిల్‌ సేన.. స్టోక్స్‌ బృందం చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఇక టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన శుబ్‌మన్‌ గిల్‌కూ పరాజయం రూపంలో చేదు అనుభవమే మిగిలింది.విశ్రాంతి పేరిటకాగా భారత్‌ -ఇంగ్లండ్‌ (Ind vs Eng) మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బుధవారం (జూలై 2) రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్‌కు.. విశ్రాంతి పేరిట భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరమయ్యాడు. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం అతడిని ఇంగ్లండ్‌లో కేవలం మూడు టెస్టులే ఆడిస్తామన్న మేనేజ్‌మెంట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇక టాస్‌ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించిన కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్టులో బుమ్రాను ఆడిస్తామని చెప్పాడు. అక్కడి పిచ్‌ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా తప్పక ఆడతాడని చెప్పాడు.విమర్శల వర్షంనిజానికి.. తొలి టెస్టుకు.. రెండో టెస్టుకు మధ్య వారం రోజుల విరామ సమయం దొరికింది. అయినప్పటికీ కీలక మ్యాచ్‌లో బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునిల్‌ గావస్కర్‌ తదితరులు తప్పుబట్టారు. ఇక సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ అయితే.. టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీరును తనదైన శైలిలో విమర్శించాడు.రొనాల్డో లేని పోర్చుగల్‌ మాదిరి‘‘ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్‌ అయిన రొనాల్డో లేకుండా పోర్చుగల్‌ బరిలోకి దిగితే ఎలా ఉంటుందో.. బుమ్రా లేని టీమిండియాకు కూడా అదే పరిస్థితి. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అంటూ స్టెయిన్‌ చురకలు అంటించాడు. ఇక ఈ జాబితాలో తాజాగా.. శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం కుమార్‌ సంగక్కర కూడా చేరిపోయాడు.ఈ నిర్ణయం ఎవరిది?.. కోచ్‌ ఏం చేస్తున్నాడు?‘‘అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? ఆటగాళ్లను, ఫిజియోలను సంప్రదించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? సిరీస్‌ గెలవడం కంటే లార్డ్స్‌ టెస్టే ముఖ్యమని మీరు భావిస్తున్నారా?బుమ్రాను మూడు టెస్టులే ఆడించాలని భావిస్తే.. 1-3-5 మాత్రమే ఎందుకు కావాలి? కావాల్సినంత విరామం దొరికింది.. విజయం కోసం జట్టు పరితపిస్తోంది. మరి అలాంటపుడు కోచ్‌ బుమ్రా దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పవచ్చు కదా!’’ అని కుమార్‌ సంగక్కర స్కై స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు.కాగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. బుమ్రాకు రెస్ట్‌ ఇవ్వడంతో పాటు.. సాయి సుదర్శన్‌, శార్దూల్‌ ఠాకూర్‌లపై వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాలను ఆకాశ్‌ దీప్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌లతో భర్తీ చేసింది.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్‌!.. గంగూలీ విమర్శలు

Pakistan Set To Take Part In Hockey Asia Cup In Bihar Next Month7
భారత్‌కు రానున్న పాకిస్తాన్‌ జట్టు..!

ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌) తర్వాత భారత్‌, పాక్‌ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్‌తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్‌ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్‌, జూనియర్‌ వరల్డ్‌కప్‌ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ హాకీ జట్లు భారత్‌కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్‌) 27 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్‌ జరుగనుంది. ఈ టోర్నీ కోసం​ 31 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టుకు భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ స్పోర్ట్స్‌స్టార్‌కు చెప్పాడు. జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌ నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్‌కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్‌, పాకిస్తాన్‌ త్వరలో క్రికెట్‌ ఆసియా కప్‌లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది క్రికెట్‌ ఆసియా కప్‌ సెప్టెంబర్‌ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. భారత్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Ind vs Eng 2nd Test: Shubman Gill Slams Double Century Check Records8
డబుల్‌ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్‌లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్‌ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్‌ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్‌ చేరాడు. గిల్‌ కంటే ముందు.. విరాట్‌ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్‌ నమోదు చేయగా.. మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని ఒక్కో డబుల్‌ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్‌ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్‌ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్‌ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్‌ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్‌ కంటే ముందు మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్‌మన్‌ గిల్‌- 2025లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్‌ టెండుల్కర్‌- 1999లో అహ్మదాబాద్‌ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్‌ కోహ్లి- 2016లో నార్త్‌ సౌండ్‌ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఓవైపు శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్‌ నుంచి వాషింగ్టన్‌ సుందర్‌ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్‌ 24, గిల్‌ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్‌ కాగా.. తొలిరోజు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (87) కూడా హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్‌!.. గంగూలీ విమర్శలు

Doesnt Make Any Sense: Ronaldo Tearful Tribute To Diogo Jota Last Post Viral9
భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్‌ వైరల్‌

లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్‌లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్‌బాల్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్‌ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్‌ లైఫ్‌లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్‌ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల ‍క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్‌ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది.లివర్‌పూల్‌ తరఫున ఐదు టైటిళ్లులివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున డియోగో జోటా ప్రీమియర్‌ లీగ్‌తో పాటు రెండు నేషన్స్‌ లీగ్‌ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్‌ఎల్‌ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్‌ ప్లేయర్‌ మృతి పట్ల లివర్‌పూల్‌ ఎఫ్‌సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano)

ENG VS IND 2nd Test Day 2: Ravindra Jadeja Missed Well Deserved Hundred10
ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్‌..!

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ లంచ్‌ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్‌మన్‌ గిల్‌ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్‌ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్‌-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. గిల్‌తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా సెంచరీ మిస్‌ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్‌లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్‌) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జేమీ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్‌ విరామం సమయానికి గిల్‌ 168, వాషింగ్టన్‌ సుందర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌తో గిల్‌ విరాట్‌ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్‌ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్‌ నిలిచాడు. 1990లో ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో మహ్మద్‌ అజారుద్దీన్‌ కెప్టెన్‌ హోదాలో 179 పరుగులు సాధించాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు