ప్రధాన వార్తలు
టీ20 ప్రపంచకప్: ఇంగ్లాండ్కి షాకిచ్చిన వెస్టిండీస్
టీ20 ప్రపంచకప్లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు.. బుధవారం రాత్రి వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో విండీస్ జట్టు విజయం సాధించింది. 30 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని మట్టికరిపించింది. 76 పరుగులతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన రూథర్ఫర్డ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రూథర్ఫర్డ్ 76 పరుగులు చేయగా.. ఛేజ్ 34, హోల్టర్ 33 తలో చేయి వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్, రషీద్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్ జట్టుకు మంచి ఆరంభమే దక్కినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వరస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. సామ్ కరన్ 43 పరుగులతో కాస్త పోరాడినప్పటికీ ఇతడికి సహకారం అందించే బ్యాటర్లు కరువయ్యారు. ఫలితంగా ఈ టోర్నీలో విండీస్ రెండో విజయం నమోదు చేసింది.
రూథర్ఫోర్డ్ వీరంగం.. హోల్డర్ మెరుపులు.. విండీస్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) రాత్రి 7 గంటలకు మొదలైన మ్యాచ్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.8 పరుగులకే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (1), షాయ్ హోప్ (0) వికెట్లు కోల్పోయిన విండీస్ను షిమ్రోన్ హెట్మైర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరు ఔటయ్యాక రూథర్ఫోర్డ్ (76 నాటౌట్), హోల్డర్ (33) చెలరేగి ఆడి విండీస్కు భారీ స్కోర్ అందించారు. వీరిద్దరు చివరి ఓవర్లలో విధ్వంసం సృష్టించారు. పోటీపడి సిక్సర్లు బాది స్కోర్ను 200 దరికి చేర్చారు. రూథర్ఫోర్డ్ 42 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాదగా.. హోల్డర్ 17 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా విండీస్ బ్యాటర్లలో రోవ్మన్ పావెల్ 14, రొమారియో షెపర్డ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు.ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4-0-16-2) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటర్లను కట్టడి చేయగా.. జేమీ ఓవర్టన్ (4-0-33-2) పర్వాలేదనిపించాడు. జోఫ్రా ఆర్చర్ వికెట్ తీసినా (4-0-48-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ (3-0-36-1) ఈ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. జాక్స్ 2 ఓవర్లలో 32, డాసన్ 3 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ మెరుపు వేగంతో ప్రారంభించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేసి, మరో భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (15) ఆచితూచి ఆడుతుండగా.. జేకబ్ బేతెల్ (20) వేగంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ వికెట్ నష్టానికి 67 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 84 బంతుల్లో 130 పరుగులు చేయాలి.
టీమిండియాకు గుడ్ న్యూస్
రేపు (ఫిబ్రవరి 12) నమీబియాతో జరుగబోయే టీ20 ప్రపంచకప్ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందుతుంది. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, గత రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్ శర్మ డిశ్చార్జ్ అయ్యాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని అభిషేక్ సహ టీమిండియా సభ్యుడు తిలక్ వర్మ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించాడు. అయితే అభిషేక్ రేపటి మ్యాచ్ ఆడతాడా లేదా అన్నదానిపై మాత్రం తిలక్ క్లారిటీ ఇవ్వలేదు.అభిషేక్ జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియాకు మరో సమస్య వచ్చి పడింది. అభిషేక్ నమీబియా మ్యాచ్కు అందుబాటులోకి రాలేడేమోనని, జట్టు మేనేజ్మెంట్ సంజూ శాంసన్ను రేపటి మ్యాచ్కు సిద్దం చేసింది. సంజూ.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి ఇవాళ కూడా నెట్స్లో చాలాసేపు శ్రమించాడు. మ్యాచ్ సమయానికి అభిషేక్ ఫిట్ అయితే, ఆఖరి నిమిషంలో అయినా సంజూకు హ్యాండ్ తప్పకపోవచ్చు.ఒకవేళ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ (ఫిబ్రవరి 15) వరకు అభిషేక్కు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం, నమీబియాతో మ్యాచ్లో ఇషాన్, సంజూ భారత ఇన్నింగ్స్ను ప్రారంభిస్తారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. సంజూ నమీబియా మ్యాచ్లో రాణిస్తే.. పాక్తో మ్యాచ్కు ముందు అభిషేక్తో పోటీపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఇటీవలికాలంలో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ప్రపంచకప్ తొలి మ్యాచ్లో యూఎస్ఏపై గోల్డెన్ డకౌటయ్యాడు. ఆ మ్యాచ్ సందర్భంగానే అతను తొలుత అస్వస్థతకు గురయ్యాడు. ఆతర్వాత టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంట్లో (ఢిల్లీ) డిన్నర్కు వెళ్లినప్పుడు పరిస్థితి క్షీణించి, ఆసుపత్రిలో చేరాడు. ఈ ప్రపంచకప్లో అభిషేక్పై భారీ అంచనాలు ఉన్నాయి. అతను తన సహజ శైలిలో అందించే మెరుపు ఆరంభాలు మ్యాచ్ గతినే మార్చేస్తాయి. అభిషేక్ ప్రతి మ్యాచ్లో 30, 40 పరుగులు చేసినా టీమిండియా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. భారత బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టి, ఆ స్కోర్లను విజయంవంతంగా కాపాడుకోవచ్చు. అభిషేక్తో పాటు టీమిండియా సభ్యులంతా తలో మ్యాచ్లో సత్తా చాటినా భారత్ మరోసారి ప్రపంచకప్ ఎగరేసుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
T20 WC 2026: పసికూనపై ఆస్ట్రేలియా ప్రతాపం
టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఘనంగా బోణీ కొట్టింది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఇవాళ (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పసికూన ఐర్లాండ్పై 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. 45 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. జోష్ ఇంగ్లిస్, మ్యాట్ రెన్షా తలో 37 పరుగులు.. కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్ చెరో అజేయమైన 11 పరుగులు.. తాత్కాలిక కెప్టెన్ ట్రవిస్ హెడ్ , గ్లెన్ మ్యాక్స్వెల్ 9 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టార్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆడమ్ జంపా (4-0-23-4), నాథన్ ఎల్లిస్ (3.5-1-12-4) ధాటికి 16.5 ఓవర్లలో 115 పరుగులకే చాపచుట్టేసింది. మిగతా ఆసీస్ బౌలర్లలో కుహ్నేమన్ (4-0-29-1) కూడా రాణించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన జార్జ్ డాక్రెల్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. డాక్రెల్ ఈ స్కోర్ చేయకపోయుంటే ఐర్లాండ్ 100 పరుగుల మార్కును కూడా దాటలేకపోయేది. మిగతా ఐరిష్ బ్యాటర్లలో లోర్కన్ టక్కర్ (24), రాస్ అదైర్ (12), గెరాత్ డెలానీ (11) రెండంకెల స్కోర్లు చేశారు.
బంగ్లాదేశ్ కెప్టెన్కు పాకిస్తాన్లో ఘోర అవమానం
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడిన పాకిస్తాన్, తదనంతరం పరిణామాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రారంభం నుంచి బంగ్లాదేశ్ కోసం ఏదో చేస్తున్నామన్నట్లు బిల్డప్ ఇచ్చిన పాక్, ఐసీసీతో చర్చల తర్వాత స్వలాభం చూసుకొని భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్ను క్షుణ్ణంగా గమనిస్తే పాక్ బంగ్లాదేశ్ను ఫూల్ చేసిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాక్ ఐసీసీ అంక్షలకు భయపడి భారత్తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా.. బంగ్లాదేశ్ మాత్రం ప్రపంచకప్ నుంచి వైదొలిగి, ఏకాకిలా మిగిలిపోయింది.ఈ ఎడిసోడ్ నడుస్తుండగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాక్లో జరిగే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. మొత్తం 50 మంది బంగ్లాదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ 2026 వేలంలో పాల్గొన్నారు. మూడు బేస్ ప్రైజ్ల విభాగాల్లో బంగ్లా ఆటగాళ్లు వేలం బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ విషయంలో లేని ప్రేమను ఒలకబోసిన పాక్.. పీఎస్ఎల్ వేలంలో ఆ దేశ ఆటగాళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తం 50 మంది వేలం బరిలో నిలిస్తే.. కేవలం ఒకరిద్దరిని మాత్రం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి. అమ్ముడుపోయిన వారికి కూడా పెద్ద మొత్తంలో ధర దక్కలేదు. ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ వేలంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఆ దేశ దిగ్గజ ఆటగాడు షకీబ్ అల్ హసన్ను కూడా పట్టించుకునే నాథుడే లేడు. వీరితో పాటు చాలామంది బంగ్లా స్టార్ ఆటగాళ్లవైపు పీఎస్ఎల్ ఫ్రాంచైజీలు కన్నెత్తి కూడా చూడలేదు.బంగ్లాతో స్నేహం ఒలకబోసి, ఆ దేశ టీ20 జట్టు కెప్టెన్ను కనీసం బేస్ ధరకు (48 లక్షల టాకాలు) కూడా కొనుగోలు చేయకపోవడం ఎంత ఘోర అవమానమో బంగ్లా ఆటగాళ్లకు అర్దం కావాలి. ఇకనైనా బంగ్లాదేశ్ పాక్ కపట నాటకాలకు పావుగా మారకుండా ఉండేందుకు జాగ్రత్త పడాలి. లిట్టన్ దాస్కు గతంలో పీఎస్ఎల్లో ఆడిన అనుభవం ఉన్నా, ఫ్రాంచైజీలు చిన్నచూపు చూశాయి. ఈ వేలంలో కొద్దోగొప్పో లబ్ది పొందింది రిషద్ హొసేన్. ఈ బంగ్లా ఆల్రౌండర్ను రావల్పిండి బేస్ ఫ్రాంచైజీ 3 కోట్ల పాక్ కరెన్సీకి సొంతం చేసుకుంది. అలాగే ఐపీఎల్ నుంచి గెంటివేయబడ్డ ముస్తాఫిజుర్ రహ్మాన్ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ వేలానికి ముందే డైరెక్ట్ సైనింగ్ ద్వారా స్వల్ప మొత్తానికి దక్కించుకుంది. మొత్తంగా చూస్తే పీఎస్ఎల్ వేలంలో బంగ్లా ఆటగాళ్లను పట్టించుకునే నాథుడే లేడన్న విషయం స్పష్టమైంది.
చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' సమరాలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెగ్యులర్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి. అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్ ఓవర్) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్ మూడో సూపర్కు కూడా వెళ్లేది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూపర్ ఓవర్ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్ ఔట్ పద్దతి అమల్లో ఉండేది. సూపర్ ఓవర్ రాకతో బౌల్ ఔట్ పద్దతికి చరమగీతం పాడారు.అప్పటి నుంచి రెగ్యులర్ మ్యాచ్ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్ ఓవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది. ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్ ఆలౌట్గా పరిగణించబడుతుంది. సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది. సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్ ఓవర్ జరుగుతుంది. రెండో సూపర్ ఓవర్లోనూ సేమ్ రూల్స్తో ఇరు జట్లకు ఓ ఓవర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్ ఓవర్కు కూడా ఆస్కారముంటుంది. ఒకవేళ మూడో సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్ పరిస్థితులు, షెడ్యూల్ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది. 2025 జూన్ 16న నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మూడో సూపర్ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా చరిత్రకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్ కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అది ఐపీఎల్ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా నిలిచింది. ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్లో చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. 2012 ఎడిషన్లో న్యూజిలాండ్-వెస్టిండీస్.. అదే ఎడిషన్లో న్యూజిలాండ్-శ్రీలంక.. 2024 ఎడిషన్లో నమీబియా-ఒమన్.. అదే ఎడిషన్లో పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి.
న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్వెల్ ప్రపంచకప్కు ముందు భారత్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్ సమయానికంతా ఫిట్నెస్ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. వార్మప్ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్వెల్కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్కాంచీని బ్రేస్వెల్కు రీప్లేస్మెంట్గా ప్రకటించారు. మెక్కాంచీ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ అండర్ డాగ్గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్ (డి) మ్యాచ్లో కెనడాతో తలపడనుంది.
గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు. కాగా ఫార్మాట్లకు అతీతంగా ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్.ధనాధన్హర్యానాకు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.ఫైనల్లోనూ భారీ శతకంఇక ఇటీవల ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ను గుర్తుకు తెస్తోందన్నాడు.గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీవిజ్డన్ క్రికెట్ వీక్లీ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. “వైభవ్ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్ను స్వింగ్ చేయడం.. ఆ టైమింగ్, పరిపూర్ణత సూపర్. అతడి హ్యాండ్ స్పీడ్, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.అచ్చం సోబర్స్ లాగే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్ మాత్రం తన బ్యాటింగ్ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్ స్వింగ్ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్’’ అని మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీని కొనియాడాడు. చదవండి: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు.. నెటిజన్స్ ఫైర్
రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీరోచిత పోరాటం
అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్ తమ వీరోచిత పోరాటంతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది.తొలుత రెగ్యులర్ మ్యాచ్లో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్గా సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది.రెగ్యులర్ మ్యాచ్సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)ఆఫ్ఘనిస్తాన్ 187-10 (19.4 ఓవర్లు)ఫ్రీ హిట్కు రనౌట్రెగ్యులర్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్. ఆఫ్ఘన్ కోల్పోయి వికెట్ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.తొలి సూపర్ ఓవర్ఆఫ్ఘనిస్తాన్- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)రెండో సూపర్ ఓవర్సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)ఆఫ్ఘనిస్తాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్ హక్ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-30-0), మొహమ్మద్ నబీ (2-0-20-0), నూర్ అహ్మద్ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్ బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ (5), స్టబ్స్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో జన్సెన్ (16) బ్యాట్ ఝులిపించాడు.188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్ను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఆఫ్ఘన్ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. మిగతా ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్ 12, దర్విష్ రసూల్ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్, సెదిఖుల్లా అటల్, ముజీబ్, ఫజల్ హక్ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్, రబాడ, లిండే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.బిగ్బాష్లో అద్భుత ఫామ్లో ఉన్నా, స్టీవ్ను ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ వేధిస్తున్న గాయాలుప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్ - ఐర్లాండ్తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11 - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13 - శ్రీలంకతో – ఫిబ్రవరి 16 - ఒమాన్తో – ఫిబ్రవరి 20 ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగా...
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మ...
భారత్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స...
ఇలవేనిల్కు రెండు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్...
న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న...
గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మ...
రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీరోచిత పోరాటం
అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత...
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
