ప్రధాన వార్తలు
గుడ్ న్యూస్ చెప్పిన రషీద్ ఖాన్
అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ను రషీద్ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన చిన్నారికి 'అస్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు రషీద్ వెల్లడించాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్కు స్వాగతం అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రషీద్ ఖాన్ గతేడాది ఆగస్టులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు 2024 అక్టోబర్లో పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ మొదటి పెళ్లి జరిగింది. రషీద్ వివాహ వేడుకకు అఫ్గానిస్తాన్ క్రికెటర్లంతా హాజరయ్యారు. కానీ ఏడాది తిరగకుముందే వ్యక్తిగత కారణాల చేత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు తన రెండో భార్యకు మగ బిడ్డ జన్మించడంతో రషీద్ తండ్రయ్యాడు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్-2026లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రషీద్ 5 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’
‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్లాజ్.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్యతో ఫొటోషూట్ చేసింది.కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?భారత్లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్లాజ్ ( LizLaz) ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్ పేలాయి. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్యూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించగా వైరల్ అయింది. అయితే, తన ఇన్స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్లాజ్ మాత్రం ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్లాజ్ చెప్పుకొచ్చింది.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ లైవ్ అప్డేట్స్
IPL 2026 RCB vs DC Live updates: ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన పాటిదార్.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 12.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 131-4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజత్ పాటిదార్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 99/2దూకుడుగా ఆడుతున్న సాల్ట్8 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(45), పడిక్కల్(11) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు.3 ఓవర్లకు ఆర్సీబీ స్కోరెంతంటే?3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుంగా 29 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(14), సాల్ట్(10) ఉన్నాడు.ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. సమాజంలో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకే ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో ఆడుతోంది.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణారాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్వుడ్ఇంపాక్ట్ సబ్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్
ఔటైయ్యాననే కోపంతో పాక్ కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
పాకిస్తాన్ సూపర్ లీగ్ -2026లో లాహోర్ ఖలందర్స్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లహోర్ ఓటమి పాలైంది. షాహీన్ షా అఫ్రిది సారథ్యంలోని లహోర్ ఖలందర్స్కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం. నిన్న జరిగిన మ్యాచ్లో లహోర్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన లహోర్ 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.లహోర్ ఇన్నింగ్స్లో హసీబుల్లా ఖాన్( 33) మినహా మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్లు ఉస్మాన్ తారీఖ్, జునైద్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టి లహోర్ పతనాన్ని శాసించారు. అనంతరం 135 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా గ్లాడియేటర్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో ఊదిపడేసింది. క్వెట్టా ఫస్ట్ డౌన్ బ్యాటర్ రిలీ రుసో(60) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అయితే ఈ మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తన సహనాన్ని కోల్పోయాడు.ఏమి జరిగిందంటే?మొదట బ్యాటింగ్కు దిగిన లహోర్ ఖలందర్స్.. క్వెట్టా గ్లాడియేటర్స్ బౌలర్ల ధాటికి 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు కెప్టెన్ షాహీన్ అఫ్రిది తనను తానుగా ప్రమోట్ చేసుకుని ముందుగా బ్యాటింగ్కు వచ్చాడు.సికిందర్ రజా, డానియల్ సామ్స్ను కాదని అఫ్రిది ముందుగా బ్యాటింగ్ రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే షాహీన్ తన ఆడిన మొదటి బంతికే స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో గోల్డెన్ డకౌట్ అయిన బాధలో షాహీన్ సహనాన్ని కోల్పోయాడు.డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర ఉన్న టైర్లపై,సైడ్ స్క్రీన్పై తన బ్యాట్ను బలంగా బాదాడు. అంతేకాకుండా మెట్లకు కూడా తన బ్యాట్ను బలంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. మరో సంచలన వార్తShaheen Shah Afridi broke his bat after getting out for duck 🦆. #LHQVQTG pic.twitter.com/DYzLMCFe9f— Nibraz Ramzan (@nibraz88cricket) April 17, 2026
పంత్పై తిట్ల దండకం.. వివరణ ఇచ్చిన గొయెంకా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా తిట్టాడని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గొయెంకా ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. పంత్ లాంటి ఆటగాడిని తిట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదని వివరణ ఇచ్చాడు. నేను ఏది చేసినా వైరలవుతుంది, సోషల్మీడియాకు నేనో పంచింగ్ బ్యాగ్లాగా మారానని అన్నారు. బయట ఎన్ని ప్రచారాలు ఉన్నా, డ్రెస్సింగ్ రూమ్లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన హావభావాలు పదేపదే తప్పుగా అర్దమవుతున్నాయి. ఇక నుంచి చేతులు వెనుక పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటానని హాస్యంగా చెప్పారు.ఇదే సందర్భంగా ఆటలో తన జోక్యంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఎప్పుడూ ఆడలేదు. ఆటగాళ్లకు నేను క్రికెట్ పాఠాలు నేర్పాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. టెక్నికల్ వాళ్లు ఆ పనిని చూసుకుంటారు. నా రోల్ జట్టుకు సపోర్ట్ చేయడం మాత్రమే. నేను ఆటలో జోక్యం చేసుకుంటానన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీతో మ్యాచ్ పూర్తైన తర్వాత గొయెంకా పంత్ను తిట్టాడని సోషల్మీడియా కోడై కూసింది. ఆ మ్యాచ్లో లక్నో ఓటమి అనంతరం బౌండరీ లైన్ వద్ద పంత్ను తిడుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. దీనికిపై అప్పుడే లక్నో అధికారిక సోషల్మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. అందులో గొయెంకా-పంత్ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోలను నెటిజన్లు నమ్మలేదు. ఫేక్ వీడియోలని కొట్టిపారేశారు. గొయెంకాకు కెప్టెన్లను తిట్టిన చరిత్ర ఉంది. గతంలో కేఎల్ రాహుల్ను కూడా దూషించాడు. ఇప్పుడు పంత్ను కూడా తిట్టాడని చర్చించుకున్నారు. తాజాగా గొయెంకా స్వయంగా వివరణ ఇచ్చినా నెటిజన్లు అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు.ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్లో లక్నో పరిస్థితి హాట్ అండ్ కోల్డ్గా ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కెప్టెన్గా రిషబ్ పంత్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ మినహా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తున్నాడు. లక్నో రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
T20 WC 2026: వెలుగులోకి సంచలన విషయం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్తో మ్యాచ్లో ఇలాఈ మెగా ఈవెంట్లో కెనడా.. న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి గ్రూప్-డి నుంచి పోటీపడింది. ఒక్క విజయం కూడా నమోదు చేయలేక చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది. అయితే, న్యూజిలాండ్తో మ్యాచ్లో మాత్రం కెనడా మెరుగ్గా ఆడింది.అనూహ్య నిర్ణయంచెన్నైలో కివీస్తో తలపడ్డ కెనడా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత సెంచరీ (65 బంతుల్లో 110) కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలో తడబడగా.. కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.రెగ్యులర్ బౌలర్ కానప్పటికీ తానే స్వయంగా పవర్ ప్లేలో బంతితో రంగంలోకి దిగాడు బజ్వా. మొత్తంగా రెండు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. బ్యాటర్గానూ అతడు విఫలమయ్యాడు. 39 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో దిల్ప్రీత్ బజ్వా వ్యవహారశైలిని ఉటంకిస్తూ ‘ది ఫిఫ్త్ స్టేట్’ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్లో అతడిపై ఆరోపణలు చేసింది. ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్ బోర్డు, కెప్టెన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.రంగంలోకి ఐసీసీ.. విచారణకు ఆదేశంఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ డాక్యుమెంటరీ ద్వారా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కెనడా బోర్డును బెదిరించినట్లు తెలుస్తోంది.లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ బెదిరింపులుడాక్యుమెంటరీలో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘మా ఆదేశాలను పాటించకపోతే మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన ఆటగాళ్లను జట్టు నుంచి అస్సలు తప్పించకూడదు. ఒకవేళ అలా చేశారంటే మీకు చిక్కులు తప్పవు’’ అని లారెన్స్ బిష్ణోయి బెదిరింపులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి క్రికెట్ కెనడా సన్నిహిత వర్గాలు CBCతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినపుడు క్రికెటర్లు కూడా భయపడతారు. వాళ్లేమీ ఇందుకు అతీతులు కాదు. వాళ్లు చాలా భయపడిపోయారు. అందుకే ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నాయి.సీనియర్లు ఉండగా అతడికే ఎందుకు కెప్టెన్సీ?కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వాపై అనుమానాలు బలపడుతున్నాయి. సీనియర్లు ఉండగా బోర్డు 23 ఏళ్ల ఈ ఆటగాడిని.. అది కూడా టోర్నీకి దాదాపు వారం రోజుల ముందు సారథిగా నియమించడం సందేహాలకు తావిచ్చింది.అయితే, బయటి వ్యక్తుల ఆదేశాలతోనే అతడు ఫిక్సింగ్కు పాల్పడి ఉంటాడని సదరు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ
హాల్ ఆఫ్ 'షేమ్'లో రహానే
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాల కారణంగా ముప్పేటదాడిని ఎదుర్కొంటున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మరో ఘోర అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త కెప్టెన్గా అపవాదును సొంతం చేసుకున్నాడు. కనీసం 25 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకుంటే, అత్యధిక పరాజయాల శాతం కలిగిన కెప్టెన్గా రహానే అందరికంటే ముందున్నాడు.రహానే తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 44 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించి 14 మ్యాచ్ల్లోనే (28 పరాజయాలు, 2 ఫలితం రాలేదు) తన జట్టును గెలిపించాడు. ఈ లెక్కన అతని విజయాల శాతం కేవలం 31.83 మాత్రమే. ఐపీఎల్లో కనీసం 25 మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేసిన ఆటగాళ్లలో ఇంత తక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఎవరికీ లేదు. రహానే తర్వాతి స్థానాల్లో.. మహేళ జయవర్దనే (30 మ్యాచ్ల్లో 10 విజయాలు, 33.33 విన్నింగ్ పర్సంటేజ్),కుమార సంగక్కర (47 మ్యాచ్ల్లో 17 విజయాలు, 36.2),శిఖర్ ధవన్ (27 మ్యాచ్ల్లో 10 విజయాలు, 37),సౌరవ్ గంగూలీ (42 మ్యాచ్ల్లో 17 విజయాలు, 40.5) ఉన్నారు.మొత్తం కెప్టెన్సీ కెరీర్లోనే ఈ ట్రాక్ రికార్డు కలిగిన రహానే, కేకేఆర్ కెప్టెన్గా మరింత దారుణమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2025 ఎడిషన్లో కేకేఆర్ సారధిగా (14 మ్యాచ్ల్లో 5 విజయాలు) బాధ్యతలు చేపట్టిన రహానే, ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ తరఫున 19 మ్యాచ్ల్లో కెప్టెన్సీ వహించి ఏకంగా 12 మ్యాచ్ల్లో తన జట్టును పరాజయం బాట పట్టించాడు. కేకేఆర్ తరఫున అతని విజయాల శాతం కేవలం 26.31 మాత్రమే. కేకేఆర్కు ముందు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరించిన రహానే, ఆ ఫ్రాంచైజీ తరఫున కూడా చెత్త రికార్డు కలిగి ఉన్నాడు. రాయల్స్ కెప్టెన్గా 24 మ్యాచ్ల్లో కేవలం తొమ్మిదే విజయాలు సాధించాడు.కాగా, రహానే సారథ్యంలో కేకేఆర్ తాజాగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. ఈ ఓటమి ఈ సీజన్లో ఆ జట్టుకు ఐదవది (6 మ్యాచ్ల్లో). పంజాబ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ ఉంది. ఏప్రిల్ 19న జరిగే తదుపరి మ్యాచ్లో కేకేఆర్ పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది.
సన్రైజర్స్ జట్టులోకి యార్కర్ల కింగ్?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. గత మ్యాచ్లో రాజస్తాన్పై ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఇప్పుడు అదే జోరును సీఎస్కేపై కొనసాగించాలని పట్టుదలతో ఉంది.అయితే ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. ఈ మ్యాచ్కు మాత్రం అందుబాటులో లేడు. ఏప్రిల్ 25న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో కమ్మిన్స్ ఆడనున్నాడు. కాగా సీఎస్కేతో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ఇషాన్ మలింగను పక్కన పెట్టాలని సన్రైజర్స్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత సీజన్లో తన అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్న మలింగ.. ప్రస్తుత సీజన్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన మలింగ.. 10.40 ఏకానమీతో ఏకంగా 156 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో మరో శ్రీలంక స్పీడ్ స్టార్ దిల్షాన్ మధుశంకకు అవకాశమివ్వాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుందంట. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన మధుశంకకు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ముఖ్యంగా అతడు పిన్ పాయింట్ యార్కర్లు బౌలింగ్ చేయగలడు. మధుశంక ఇటీవలే బ్రైడన్ కార్స్ స్ధానంలో జట్టులోకి చేరాడు. గత మ్యాచ్లో సత్తాచాటిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్తో మధుశంక బంతిని పంచుకునే అవకాశముంది. ఒకవేళ నలుగురు పేసర్లతో ఎస్ఆర్హెచ్ ఆడాలని భావిస్తే మలింగకు బదులుగా స్పిన్నర్ హర్ష్ దూబేను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది.సీఎస్కేతో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్( కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, దిల్షాన్ మధుశంక, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే(ఇంపాక్ట్ సబ్)చదవండి: BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!
మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ: మాజీ క్రికెటర్ ఫైర్
కోల్కతా నైట్ రైడర్స్ కథ మారలేదు. ఐపీఎల్-2026లో కేకేఆర్ ఐదో ఓటమిని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఇంత వరకు ఈ సీజన్లో ఇప్పటి వరకు గెలుపున్నదే ఎరుగని ఏకైక జట్టుగా కేకేఆర్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ నాయకత్వ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథి అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ జట్టులో శుద్ధ దండగ అంటూ మండిపడ్డాడు. కాగా గుజరాత్తో మ్యాచ్లో రహానే డకౌట్ కాగా.. రింకూ ఒకే ఒక్క పరుగు చేశాడు.వీరిద్దరి వైఫల్యం కారణంగా మిగతా బ్యాటర్ల మీద భారం పడగా.. వాళ్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్ 79 పరుగులతో కేకేఆర్ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ తీరును విమర్శించాడు.మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ‘‘వాళ్లు కనీసం 200 పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లు. ఫైనల్ ఓవర్లలో కేకేఆర్ పూర్తిగా తడబడింది. ఇక కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అసలు ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఉన్నట్లు కనిపించలేదు. ఇద్దరూ ఫామ్లేమితో సతమతమవుతున్నారు. జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ అయినప్పుడు ఇక జట్టు సభ్యులు ఎలా ఆడతారో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.దారుణంగా విఫలమవుతున్న రింకూకాగా అహ్మదాబాద్లో గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో రహానే ఇప్పటికి 152 పరుగులు చేయగా.. రింకూ కేవలం 79 పరుగులే చేశాడు.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!2⃣ points in the bag ✅Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠 Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026
పాకిస్తాన్ సూపర్ లీగ్లో గందరగోళం
పాకిస్తాన్ సూపర్ 2026లో గందరగోళం నెలకొంది. క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ ఒకే మ్యాచ్లో బెవాన్ జాకబ్స్, అతని ప్రత్యామ్నాయంగా ప్రకటించిన దినేశ్ చండీమల్ను బరిలోకి దించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్కు చెందిన బెవాన్ జాకబ్స్ జాతీయ విధుల నిమిత్తం (బంగ్లాదేశ్తో సిరీస్) జట్టుకు అందుబాటులో ఉండడని గ్లాడియేటర్స్ యాజమాన్యం ఏప్రిల్ 16న ప్రకటించింది. అదే సమయంలో అతనికి ప్రత్యామ్నాయంగా శ్రీలంకకు చెందిన దినేశ్ చండీమల్ పేరును కూడా వెల్లడించింది.అయితే లాహోర్ ఖలందర్స్తో నిన్న (ఏప్రిల్ 17) జరిగిన మ్యాచ్లో జాకబ్స్, చండీమల్ ఇద్దరి పేర్లు ప్లేయింగ్ ఎలెవెన్లో కనిపించాయి. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఒకే మ్యాచ్లో జాకబ్స్, అతని రీప్లేస్మెంట్ ఎలా బరిలోకి దిగుతారని చర్చించుకున్నారు.ఈలోపు గ్లాడియేటర్స్ యాజమాన్యం నాలుక కరుచుకుని చండీమల్ జాకబ్స్కు ప్రత్యామ్నాయం కాదు, టామ్ కర్రన్కు అంటూ ప్రకటన చేసింది. కర్రన్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో చండీమల్ జట్టులోకి వచ్చాడని పేర్కొంది.ఈ గందరగోళం చూసి ఏం జరుగుతుందో అర్దం కాక గ్లాడియేటర్స్ అభిమానులే జుట్టు పీక్కున్నారు. నెటిజన్లు అయితే ఇలాంటి సిత్రాలన్నీ పాకిస్తాన్లో మాత్రమే సాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఘోర తప్పిదం జరిగిన ఈ మ్యాచ్లో ఖలందర్స్పై గ్లాడియేటర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చండీమల్ (3) విఫలం కాగా.. జాకబ్స్ (14 నాటౌట్) గ్లాడియేటర్స్ను విజయతీరాలకు చేర్చాడు.
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంప...
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద...
అదరగొట్టిన భారత రెజ్లర్లు..
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
సంచలనం సృష్టించిన భారత యువ షట్లర్
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పెను సంచలనం న...
హాల్ ఆఫ్ 'షేమ్'లో రహానే
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాల కారణంగా ముప్పేటదాడిని ...
సన్రైజర్స్ జట్టులోకి యార్కర్ల కింగ్?
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక...
మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ: మాజీ క్రికెటర్ ఫైర్
కోల్కతా నైట్ రైడర్స్ కథ మారలేదు. ఐపీఎల్-2026లో...
పాకిస్తాన్ సూపర్ లీగ్లో గందరగోళం
పాకిస్తాన్ సూపర్ 2026లో గందరగోళం నెలకొంది. క్వెట...
క్రీడలు
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
వీడియోలు
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
ముంబై చిత్తు.. పంజాబ్ ఘనవిజయం..
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
నొప్పితో అల్లాడిపోయిన పంత్.. హాజెల్వుడ్ దెబ్బకి కన్నీళ్లు
టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు
