Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan and England will face off in a high stakes Super 8 showdown at the 2026 T20 World Cup1
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో ఆసక్తికర సమరం

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 24) మరో ఆసక్తికర సూపర్‌-8 సమరం జరుగనుంది. పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌ పాకిస్తాన్‌కు డూ ఆర్‌ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ రేసులో ఉంటుంది. లేకపోతే సెమీస్‌ అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. మరోపక్క ఇంగ్లండ్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఏ తలనొప్పి లేకుండా సెమీస్‌కు చేరాలనుకుంటే ఇంగ్లండ్‌ కూడా ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాలి. శ్రీలంకపై తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్‌ గ్రూప్‌-2 టాపర్‌గా ఉంది. ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవడంతో ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ (2.550) కూడా మెరుగ్గానే ఉంది. ఈ గ్రూప్‌ నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ దక్కించుకునే అవకాశాలు ప్రస్తుతానికి ఇంగ్లండ్‌కే అధికంగా ఉన్నాయి.పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన తొలి సూపర్‌-8 మ్యాచ్‌ వర్షం​ కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పొందాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన శ్రీలంక -2.550 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.హెడ్‌ టు హెడ్‌ రికార్డులుపాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ ఇప్పటివరకు 30 టీ20ల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్‌ 21, పాక్‌ కేవలం 9 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో కూడా ఇంగ్లండే పైచేయి సాధించింది. ఇందులో 2022 ఎడిషన్‌ ఫైనల్‌ కూడా ఉంది.పిచ్‌ కూడా వారికి అనుకూలమే..!ఈ మ్యాచ్‌ జరుగనున్న పల్లెకెలె పిచ్‌ కూడా ఇంగ్లండ్‌కు అనుకూలంగానే ఉంది. ఈ వేదికపై ఆ జట్టు తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టునే చిత్తు చేసింది. దీనికి ముందు ఇదే వేదికపై లంకతో ద్వైపాక్షిక సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఇది ఇంగ్లీష్‌ ఆటగాళ్లకు బాగా కలిసొస్తుంది. మరోపక్క పాక్‌ ఈ వేదికపై ఇటీవలికాలంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఈ పిచ్‌ పరిస్థితులపై కూడా ఆ జట్టుకు అవగాహణ లేదు. ఎటు చూసినా నేటి మ్యాచ్‌లో ఇంగ్లండే హాట్‌ ఫేవరెట్‌గా కనిపిస్తుంది.. పాక్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ ప్రస్తుత టోర్నీలో మెరుగైన ఫామ్‌లో ఉంది. గ్రూప్‌ దశలో స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌పై విజయాలు సాధించి సూపర్‌-8లోకి అడుగుపెట్టింది. పాక్‌ విషయానికొస్తే.. ఈ జట్టు కూడా గ్రూప్‌ దశలో 3 విజయాలు సాధించి, సూపర్‌-8లోకి ప్రవేశించినా.. తమకంటే చిన్న జట్లపై గెలిచేందుకు పాక్‌ ప్లేయర్లు ఆపసోపాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.తుది జట్లు (అంచనా)..ఇంగ్లండ్‌: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వారం), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (సి), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్తాన్‌: సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా (c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (wk), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్

T20 WC 2026, WI VS ZIM: Brad Evans become first bowler to take a wicket in 28 consecutive innings in T20s2
T20 WC 2026: జింబాబ్వే ప్లేయర్‌ వరల్డ్‌ రికార్డు

జింబాబ్వే రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రాడ్‌ ఈవాన్స్‌ పొట్టి క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా 28 ఇన్నింగ్స్‌ల్లో వికెట్‌ తీసిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.గతంలో ఈ రికార్డు శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్‌ మలింగ, ఐర్లాండ్‌ పేసర్‌ మార్క్‌ అదైర్‌ పేరిట ఉండేది. మలింగ, అదైర్‌ వరుసగా 27 టీ20 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైనా తీశారు. తాజాగా ఈవాన్స్‌.. మలింగ, అదైర్‌ పేరిట సంయుక్తంగా ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.ఈ రికార్డుకు సంబంధించి ఈవాన్స్‌, మలింగ, అదైర్‌ను సమీపించేందుకు పాకిస్తాన్‌ వివాదాస్పద బౌలర్‌ ఉస్మాన్‌ తారిక్‌ అతి సమీపంలో ఉన్నాడు. తారిక్‌ ఇప్పటివరకు వరుసగా 25 ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఓ వికెటైన తీశాడు.వెస్టిండీస్‌-జింబాబ్వే మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్‌మైర్‌ (85), రోవ్‌మన్‌ పావెల్‌ (59), రూథర్‌ఫోర్డ్‌ (31 నాటౌట్‌), షెపర్డ్‌ (21), హోల్డర్‌ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్‌ ఈవాన్స్‌ (43), నగరవ (7 నాటౌట్‌) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్‌ హొసేన్‌ (4-1-28-3) తమ స్పిన్‌ మాయాజాలంతో జింబాబ్వే పతనాన్ని శాశించారు.

The 44 run partnership between Brad Evans and Ngarava is the highest 10th wicket stand in the T20 World Cup3
T20 WC 2026: చరిత్ర సృష్టించిన జింబాబ్వే ఆటగాళ్లు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్‌ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినా, ఆ జట్టు ఆటగాళ్లు ఓ ప్రపంచకప్‌ రికార్డును సాధించారు. ఓటమి ఖరారైన వేల బ్రాడ్‌ ఈవాన్స్‌-రిచర్డ్‌ నగరవ పదో వికెట్‌కు 44 పరుగులు జోడించి, ప్రపంచకప్‌ చరిత్రలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు.సిక్సర్లతో విరుచుకుపడ్డారుజింబాబ్వే ఓటమి ఖరారయ్యాక​ ఈవాన్స్‌, నగరవ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈవాన్స్‌ 5, నగరవ ఓ సిక్సర్‌తో విధ్వంసం సృష్టించారు. షమార్‌ జోసఫ్‌ వేసిన 17వ ఓవర్‌లో ఈవాన్స్‌ మూడు సిక్సర్లు బాదాడు. అంతకుముందు జేసన్‌ హోల్డర్‌ వేసిన 16వ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు కొట్టాడు. దీనికి ముందు ఓవర్‌ చివరి బంతికి నగరవ ఓ సిక్సర్‌ బాదాడు.ప్రపంచకప్‌ రికార్డుఈ మ్యాచ్‌లో మరో ప్రపంచకప్‌ రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్లు కలిపి ఏకంగా 31 సిక్సర్లు బాదాయి. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్లు ఇవే. గతంలో ఈ రికార్డు 2014 ఎడిషన్‌ నెదర్లాండ్స్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ పేరిట ఉండేది. ఆ మ్యాచ్‌లో 30 సిక్సర్లు నమోదయ్యాయి.ముగిసిన జైత్రయాత్రఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ కూడా ఓ ప్రపంచకప్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఔట్‌ కాకుండా అత్యధిక పరుగులు (180) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 5 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో ప్రస్తుత ప్రపంచకప్‌లో బెన్నెట్‌ అజైత్రయాత్ర ముగిసింది. ఈ మ్యాచ్‌కు ముందు బెన్నెట్‌ 3 ఇన్నింగ్స్‌ల్లో 175 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్‌మైర్‌ (85), రోవ్‌మన్‌ పావెల్‌ (59), రూథర్‌ఫోర్డ్‌ (31 నాటౌట్‌), షెపర్డ్‌ (21), హోల్డర్‌ (13) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. బ్రాడ్‌ ఈవాన్స్‌ (43), నగరవ (7 నాటౌట్‌) చివరి వికెట్‌కు 44 పరుగులు జోడించి జింబాబ్వేను 100 పరుగుల మార్కును దాటించారు. మోటీ (4-1-28-4), అకీల్‌ హొసేన్‌ (4-1-28-3) తమ స్పిన్‌ మాయాజాలంతో జింబాబ్వే ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

T20 WC 2026: West indies ruined team india semis hopes by huge victory over zimbabwe4
T20 WC 2026: టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన వెస్టిండీస్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 23) జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేపై వెస్టిండీస్‌ 107 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు అదే గ్రూప్‌లో ఉన్న టీమిండియాను భారీ దెబ్బ కొట్టింది. అదేంటని అనుకుంటున్నారా..?ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 254 పరుగుల భారీ స్కోర్‌ చేసిన విండీస్‌.. ఆతర్వాత జింబాబ్వేను 147 పరుగులకే పరిమితం చేసి నెట్‌ రన్‌రేట్‌ను (5.350) భారీగా కూడగట్టుకుంది. ఈ రన్‌రేటే భారత్‌ కొంపముంచేలా ఉంది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి తర్వాత మన జట్టు రన్‌రేట్‌ -3.800లో పడి పోగా.. సౌతాఫ్రికా రన్‌ రేట్‌ 3.800 వద్ద కూర్చుంది.ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌కు చేరే అవకాశాలు రెండు జట్లకు మాత్రమే ఉంటాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి భారీ రన్‌ రేట్‌ కూడగట్టుకున్న విండీస్‌, సౌతాఫ్రికా సెమీస్‌ రేసులో ముందున్నాయి. భారత్‌, జింబాబ్వే మైనస్‌ రన్‌ రేట్‌లతో సెమీస్‌ రేసులో భారీగా వెనుకపడి పోయాయి. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే తదుపరి జరిగే రెండు సూపర్‌-8 మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, విండీస్‌) భారీ తేడాతో గెలవాలి. ఇలా గెలిచినా సెమీస్‌కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకంటే విండీస్‌ రన్‌ రేట్‌ విషయంలో కొండెక్కి కూర్చుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా, భారత్‌) ఆ జట్టు ఏ ఒక్క మ్యాచ్‌ గెలిచినా దర్జాగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. మరోపక్క భారత్‌పై గెలిచి సౌతాఫ్రికా ఇప్పటికే మరో సెమీస్‌ బెర్త్‌పై కర్చీఫ్‌ వేసుకొని కూర్చుంది. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తమ కంటే బలహీనమైన జింబాబ్వే, విండీస్‌తో పోటీ పడుతుంది. ఒకవేళ విండీస్‌తో ఓడినా, జింబాబ్వేపై గెలిస్తే.. మరో సెమీస్‌ బెర్త్‌ సౌతాఫ్రికా వశమవుతుంది.ఈ లెక్కన ప్రస్తుత పరిస్థితి చూస్తే, భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కడం చాలా కష్టంగా కనిపిస్తుంది. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించడంతో పాటు సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ తలో మ్యాచ్‌లో అయినా ఓడాలి. అప్పుడు కూడా భారత్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.ఉదాహరణకు సౌతాఫ్రికా విండీస్‌ చేతిలో ఓడి, జింబాబ్వేపై గెలిస్తే.. వారి ఖాతాలో నాలుగు పాయింట్లతో పాటు మంచి రన్‌ రేట్‌ ఉంటుంది. విండీస్‌ భారత్‌ చేతిలో ఓడి, సౌతాఫ్రికాపై ఓ మోస్తరు విజయం సాధించినా.. ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లు, మంచి రన్‌రేట్‌ ఉంటుంది. ఇలా జరిగి, భారత్‌.. జింబాబ్వే, విండీస్‌పై విజయాలు సాధించినా.. విండీస్‌, సౌతాఫ్రికా రన్‌రేట్‌ను అధిగమిస్తుందన్న గ్యారెంటీ లేదు.ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌ సెమీస్‌కు చేరాలంటే ఒక్క సమీకరణకు మాత్రమే అధిక అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే.. భారత్‌.. జింబాబ్వే, విండీస్‌పై భారీ విజయాలు సాధించాలి. మరోపక్క విండీస్‌.. సౌతాఫ్రికా చేతిలో కూడా ఓడాలి. అప్పుడు సౌతాఫ్రికా, భారత్‌ సెమీస్‌కు చేరుకుంటాయి.అనుకోవడానికి ఇది బాగానే ఉన్నా, ప్రస్తుతం విండీస్‌ ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇది జరిగే పని కాకపోవచ్చు. విండీస్‌ ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి మాంచి జోష్‌లో ఉంది. తదుపరి వారు ఆడబోయే సౌతాఫ్రికా, భారత్‌ మ్యాచ్‌ల్లోనూ ఇది కొనసాగవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లో విండీస్‌ గెలిచినా భారత్‌ మూడో పొట్టి ప్రపంచకప్‌ కల కల్లగా మారిపోతుంది. మొత్తంగా వెస్టిండీస్‌.. జింబాబ్వేపై భారీ తేడాతో గెలిచి భారత్‌ సెమీస్‌ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసేసింది. ఫిబ్రవరి 26న జరిగే వెస్టిండీస్‌-సౌతాఫ్రికా మ్యాచ్‌ తర్వాత సెమీస్‌ బెర్త్‌లపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా, గ్రూప్‌-1 నుంచి ఓ సెమీస్‌ బెర్త్‌ ఖరారైపోతుంది. రెండో బెర్త్‌ కోసం సౌతాఫ్రికా, భారత్‌, జింబాబ్వే పోటీ పడాల్సి ఉంటుంది. విండీస్‌ చేతిలో భారీ తేడాతో ఓడినా, జింబాబ్వేకు కూడా ఇంకా సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆ జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌, సౌతాఫ్రికాపై ఘన విజయాలు సాధించాలి. అసాధ్యమని చెప్పలేము కానీ, ఇది సాధ్యపడటం​ మాత్రం చాలా కష్టమే.

Australia Women are all set to host India Women in the first ODI5
మరో విజయం లక్ష్యంగా...

బ్రిస్బేన్‌: టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టుతో బ్రిస్బేన్‌లో నేడు జరిగే తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం బరిలోకి దిగనుంది. గత ఏడాది తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత భారత్‌ ఆడబోతున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. నవీ ముంబైలో గత వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిపోయిన ఆ్రస్టేలియా ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్‌ స్టార్‌ అలీసా హీలీ వన్డే సిరీస్‌కు కెపె్టన్‌గా అందుబాటులోకి వచ్చింది. భారత్‌తో సిరీస్‌ తర్వాత అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకోనుంది. టి20 సిరీస్‌లో ఆడిన అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, శ్రేయాంక పాటిల్‌ స్థానాల్లో కాశ్వీ గౌతమ్, హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్‌ భారత వన్డే జట్టులోకి వచ్చారు. వన్డే ఫార్మాట్‌లో ఏకంగా ఏడుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో ఎలీస్‌ పెరీ, యాష్లీ గార్డ్‌నర్, బెత్‌ మూనీ, అనాబెల్‌ సదర్లాండ్, అలీసా హీలీ రూపంలో పలువురు మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. పటిష్టమైన ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే భారత్‌ ఓడించాలంటే... బ్యాట్‌తో స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్, హర్లీన్‌ డియోల్, రిచా ఘోష్‌... బంతితో రేణుక, క్రాంత్రి, శ్రీచరణి అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. బ్రిస్బేన్‌ మైదానం ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ఎంతో కలిసొచ్చిన వేదిక. ఈ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి వరకు ఆడిన 20 వన్డేల్లోనూ విజయం సాధించి అజేయంగా ఉంది. మంగళవారం తొలి వన్డే అనంతరం.... రెండు జట్లు హోబర్ట్‌ వేదికగా ఫిబ్రవరి 27న రెండో వన్డే, మార్చి 1న మూడో వన్డే ఆడతాయి. టి20, వన్డే, టెస్టు సిరీస్‌ ముగిశాక ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టుకు ఓవరాల్‌ విన్నర్స్‌ ట్రోఫీని అందజేస్తారు. టి20 సిరీస్‌ నెగ్గిన భారత జట్టు ప్రస్తుతం 4–2తో ఆధిక్యంలో ఉంది.

T20 World Cup 2026: West Indies big win over Zimbabwe6
WI vs ZIM: హెట్‌మైర్‌ ‘సూపర్‌’ షో

టాస్‌ నెగ్గగానే జింబాబ్వే కెప్టెన్‌ సికందర్‌ రజా బౌలింగ్‌ ఎంచుకొని మొదటి తప్పు చేశాడు. హెట్‌మైర్‌ బ్యాటింగ్‌కు దిగగానే 9 పరుగుల వద్ద ముసెకివా సులువైన క్యాచ్‌ నేలపాలు చేసి ముప్పుతెచ్చాడు. ఇది మ్యాచ్‌నే మార్చేసింది. వాంఖడేను మురిపించింది. ప్రేక్షకుల్ని మెరుపులతో ముంచెత్తింది. ఈ ప్రపంచకప్‌లో అసలైన టి20 విందునిచ్చింది. ‘సూపర్‌–8’లో విండీస్‌కు భారీ విజయాన్నిచ్చింది. ముంబై: వెస్టిండీస్‌ విధ్వంసం... జింబాబ్వే విలాపం... ఈ టి20 ప్రపంచకప్‌కే మెరుపుల ‘షో’కులద్దిన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు 107 పరుగులతో తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదుచేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన వెస్టిండీస్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెట్‌మైర్‌ (34 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు), రోవ్‌మన్‌ పావెల్‌ (35 బంతుల్లో 59; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎన్‌గరవ, ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. ఇవాన్స్‌ (21 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించాడు. గుడకేశ్‌ మోతీ (4/28), హోసిన్‌ (3/28) వెన్నువిరిచారు. తమ తదుపరి ‘సూపర్‌–8’ పోటీల్లో 26న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌; అదేరోజు భారత్‌తో జింబాబ్వే ఆడతాయి. హెట్‌ ‘ఫైర్‌’ ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (9), షై హోప్‌ (14) వికెట్లను కోల్పోయిన విండీస్‌ హెట్‌మైర్, పావెల్‌ ధనాధన్‌ భాగస్వామ్యంతో శరవేగంగా దూసుకెళ్లింది. క్రిమర్‌ వేసిన ఏడో ఓవర్లో 2 వరుస సిక్స్‌లు కొట్టిన హెట్‌మైర్‌... రజా వేసిన మరుసటి ఓవర్లో మూడు సిక్స్‌లు బాదేశాడు. దీంతోనే అతను 19 బంతుల్లో టి20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన కరీబియన్‌ బ్యాటర్‌గా రికార్డును నెలకొల్పాడు. హెట్‌మైర్‌ బాదిన మొత్తం 7 సిక్స్‌ల్లో ఐదింటిని ఈ రెండు ఓవర్లలోనే కొట్టడం విశేషం! హెట్‌మైర్‌ విధ్వంసరచనకు కారణమైన ముసెకివా మళ్లీ అతను 70 పరుగుల వద్ద కొట్టిన షాట్‌ను రెండోసారి క్యాచ్‌ పట్టలేకపోయాడు. మరోవైపు పావెల్‌ 29 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరు అవుటయ్యాక రూథర్‌ఫోర్డ్‌ (13 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫర్డ్‌ (10 బంతుల్లో 21; 3 సిక్స్‌లు), హోల్డర్‌ (4 బంతుల్లో 13; 2 సిక్స్‌లు) దంచేయడంతో విండీస్‌ సులువుగా 250 పరుగుల్ని దాటేసింది. హెట్‌మైర్జింబాబ్వే విలవిల ఆ్రస్టేలియా, శ్రీలంకలాంటి మేటి జట్లను ఓడించి సూపర్‌–8కు చేరుకున్న జింబాబ్వే... విండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనకు కుదేలైంది. 20 పరుగుల వద్దే మరుమని (14), బెనెట్‌ (5), బర్ల్‌ (0) వికెట్లను కోల్పోయింది. కాస్త కుదుటపడి 50 స్కోరును దాటగానే గుడకేశ్‌ మోతీ చావుదెబ్బ తీయడంతో 103 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువైంది. మైయెర్స్‌ (28), కెప్టెన్‌ రజా (27) మెరుగ్గా ఆడారంతే! ఆఖరి వికెట్‌ ఎన్‌గరవ (7 నాటౌట్‌) అండతో బ్రాడ్‌ ఇవాన్స్‌ కాసేపు చెల రేగడంతో జింబాబ్వే పరాజయం ఆలస్యమైంది.స్కోరు వివరాలు వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: బ్రాండన్‌ కింగ్‌ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవ 9; షై హోప్‌ (సి) బెనెట్‌ (బి) ఇవాన్స్‌ 14; హెట్‌మైర్‌ (సి) బెనెట్‌ (బి) క్రిమర్‌ 85; పావెల్‌ (సి) ముసెకివా (బి) ముజరబాని 59; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 31; షెఫర్డ్‌ (సి) బర్ల్‌ (బి) ఎన్‌గరవ 21; హోల్డర్‌ (సి) మున్యొంగా (బి) ముజరబాని 13; ఫోర్డ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–17, 2–54, 3–176, 4–194, 5–229, 6–248. బౌలింగ్‌: ఎన్‌గరవ 4–0–47–2, ముజరబాని 4–0–42–2, ఇవాన్స్‌ 4–0–46–1, క్రిమర్‌ 4–0–38–1, రజా 3–0–52–0, మైయెర్స్‌ 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్‌: మరుమని (సి) హెట్‌మైర్‌ (బి) ఫోర్డ్‌ 14; బెనెట్‌ (బి) హోసిన్‌ 5; మైయెర్స్‌ (బి) మోతీ 28; బర్ల్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హోసిన్‌ 0; రజా (బి) మోతీ 27; మున్యొంగా (సి) జోసెఫ్‌ (బి) మోతీ 14; ముసెకివా (బి) మోతీ 0; ఇవాన్స్‌ (సి) హోసిన్‌ (బి) ఫోర్డ్‌ 43; క్రిమర్‌ (సి అండ్‌ బి) హోల్డర్‌ 0; ముజరబాని (సి) జోసెఫ్‌ (బి) హోసిన్‌ 0; ఎన్‌గరవ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్‌) 147. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–20, 4–52, 5–94, 6–94, 7–101, 8–102, 9–103, 10–147. బౌలింగ్‌: హోసిన్‌ 4–1–28–3, ఫోర్డ్‌ 3.4–0–27–2, మోతీ 4–1–28–4, జోసెఫ్‌ 3–0–35–0, హోల్డర్‌ 3–0–25–1.

Shimron Hetmyer blitzkrieg powers Windies to 254-6 in Mumbai7
వెస్టిండీస్ బ్యాట‌ర్ల విధ్వంసం.. ఏకంగా 254 ప‌రుగుల భారీ స్కోర్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 254 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెన‌ర్లు బ్రాండెన్ కింగ్‌(9), షాయ్ హోప్(14) విఫ‌ల‌మైన‌ప్ప‌టికి.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మాత్రం విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా షెమ్రాన్ హెట్‌మైర్ అయితే జింబాబ్వే బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన హెట్‌మైర్ కేవ‌లం బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.మొత్తంగా 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అత‌డితో పాటు రావ్‌మ‌న్ పావెల్(59), రూథ‌ర్ ఫ‌ర్డ్‌(31), షెఫ‌ర్డ్‌(21) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌల‌ర‌ల్లో నగార‌వ, ముజ‌ర్‌బానీ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. క్రీమ‌ర్‌, ఎవెన్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో రెండో అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం.

Shimron Hetmyer sets new record for West Indies with half-century against Zimbabwe in T20 WC 20268
చ‌రిత్ర సృష్టించిన హెట్‌మైర్‌.. ఫాస్టెస్ట్ ఫిప్టీ

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో వాంఖడే స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్‌మైర్ విధ్వంసం సృష్టించాడు. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్ తన ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు.జింబాబ్వే బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా కెప్టెన్ సికిందర్ రజాకు అయితే చుక్కలు చూపించాడు. 8వ ఓవర్ వేసిన రజా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఏకంగా మూడు సిక్స్‌లతో 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో హెట్‌మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హెట్‌మైర్ టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన విండీస్‌ ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు.వెస్టిండీస్ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన రికార్డును తానే మళ్లీ తిరగరాశాడు. ఇదే టోర్నీలోహెట్‌మైర్‌ స్కాట్లాండ్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు కేవలం 19 బంతుల్లోనే ఆర్ధం శతకం బాదేశాడు.ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హెట్‌మైర్‌.. 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సార్లు హెట్‌మైర్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రెండు సులువైన క్యాచ్‌లను జింబాబ్వే ఫీల్డర్లు జారవిడిచారు. ఇందుకు జింబా‍బ్వే భారీ మూల్యం చెల్లించుకోంది.

 Former Indian batters scathing remarks after IND vs SA T20 World Cup 2026 Super 8 clash9
'వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక ఫారెస్ట్ లాంటిది.. వారిద్ద‌రి ఆట తీరు మారాలి'

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా యువ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. అభిషేక్ శ‌ర్మ వ‌రుస‌గా మూడు డకౌట్లు కాగా.. తిల‌క్ కూడా త‌న జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. అభిషేక్ 13 ప‌రుగులు చేయ‌గా, తిల‌క్ డ‌కౌట‌య్యాడు. ఇప్పటివరకు తిల‌క్‌ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.అతని స్ట్రైక్ రేట్ 119 కంటే త‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రిపై భార‌త మాజీ క్రికెట‌ర్ సదాగోపన్ రమేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫ‌లితాలే ఎదుర‌వ‌తాయ‌ని అత‌డు హెచ్చ‌రించాడు."అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవ‌లం గార్డెన్ మాత్ర‌మే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బ‌లి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. దానిని త‌ట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ త‌మ తొలి సూప‌ర్‌-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం చేసుకుంది. భార‌త్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో భారీ తేడాతో విజ‌యం సాధించాలి.

Bangladesh Take Big Step Over Allegations By Ex Skipper Jahanara Alam10
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం!

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ మొన్‌జురుల్‌ ఇస్లాంపై వేటు వేసింది. తమ పరిధిలోకి వచ్చే క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలన్నింటికీ దూరంగా ఉండాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.అసలేం జరిగిందంటే.. ప్రపంచకప్‌-2022 సందర్భంగా మొన్‌జురుల్‌ ఇస్లాం తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బంగ్లా మహిళా క్రికెట్‌ జట్టు నాటి కెప్టెన్‌ జహనారా ఆలం సంచలన ఆరోపణలు చేసింది. స్వతంత్ర విచారణ కమిటీఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బోర్డు.. ఆదివారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. షేర్‌-ఏ- బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో సమావేశమైన బోర్డు సభ్యులు.. స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించారు.జహనారా ఆరోపించినట్లుగానే మొన్‌జురెల్‌కు సంబంధించి తమకు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు కమిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ‘‘బీసీబీ నియమించిన స్వతంత్ర విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు... మహిళా జట్టు కెప్టెన్‌ జహనార ఆలం ఆరోపణలు నిజమేనని తేలాయి.నిషేధం విధిస్తున్నాంఈ క్రమంలో మొన్‌జురుల్‌ ఇస్లాంపై నిషేధం విధిస్తున్నాం. బీసీబీ పరిధిలోని క్రికెట్‌ సంబంధిత వ్యవహారాలతో ఇకపై అతడికి ఎలాంటి సంబంధాలు ఉండవు. కమిటీ చేసిన సిఫారసులను బీసీబీ సమీక్షిస్తుంది. ఈ విషయంలో అదనపు చర్యలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తాం’’ అని బీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది.కాగా బంగ్లాదేశ్‌ మహిళల జట్టు సెలక్టర్‌, మేనేజర్‌గా మొన్‌జురుల్‌ వ్యవహరించాడు. గతేడాది జూన్‌ 30న అతడి పదవీకాలం ముగిసింది. ఇదిలా ఉంటే.. మహిళా జట్టు సెలక్షన్‌ ప్యానెల్‌ చైర్మన్‌ ఘాజి ఆష్రఫ్‌ హొసేన్‌ పదవీకాలాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బీసీబీ ఈ సందర్భంగా వెల్లడించింది. ఘాజి స్థానాన్ని త్వరలోనే భర్తీ చేస్తామని.. అందుకోసం కాస్త సమయం పడుతుంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.చారిత్రాత్మ​క ముందుడుగుబంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చారిత్రాత్మక​ ముందడుగు వేసింది. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించే క్రమంలో వుమెన్‌ బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (WBPL) నిర్వహణకు పచ్చజెండా ఊపింది. తొలి ఎడిషన్‌కు ఏప్రిల్‌ 4- 14 వరకు షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయగా.. బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఢాకా, ఛట్టోగ్రామ్‌ వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement