Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bumrah breaks Ashwins record for most T20 World Cup wickets for India1
చ‌రిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. తొలి భార‌త బౌల‌ర్‌గా

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సత్తాచాటాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆ​రంభంలోనే దక్షిణాఫ్రికాను బుమ్రా దెబ్బ తీశాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్లు ​​​‍‍క్వింటన్ డికాక్‌, రికెల్టన్‌ను బుమ్రా ఔట్ చేశాడు.మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో జస్ప్రీత్ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఇప్పటివరకు పొట్టి ప్రపంచకప్ హిస్టరీలో 33 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌(32), అర్ష్‌దీప్ సింగ్‌(32) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిద్దిరిని బుమ్రా అధిగమించాడు.టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరేజస్ప్రీత్ బుమ్రా-33 రవిచంద్రన్ అశ్విన్‌- 32అర్ష్‌దీప్ సింగ్- 32హార్దిక్ పాండ్యా-29రవీంద్ర జడేజా-22

Jasprit Bumrah dismisses Quinton de Kock
వారెవ్వా బుమ్రా.. లెగ్‌ స్టంప్ ఎగిరిపోయిందిగా? వీడియో

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8 మ్యాచ్‌లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. త‌న పేస్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ప్రోటీస్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను బుమ్రా ఔట్ చేసిన‌ తీరు గురుంచి ఎంత చెప్పుకొన్న త‌క్కువే.జ‌స్ప్రీత్ అద్భుత‌మైన బంతితో డికాన్‌ను బోల్తా కొట్టించాడు. బుమ్రా వేసిన బంతికి డికాక్ వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 2 ఓవ‌ర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని నిప్-బ్యాకర్ డెలివ‌రీగా సంధించాడు. అయితే ఆ బంతిని డి కాక్ ఎటువంటి ఫుట్ వర్క్ లేకుండా స్లాగ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి కాస్త లో-బౌన్స్‌గా వచ్చి బ్యాట్‌ను మిస్స్ అయ్యి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇది చూసిన డికాక్ ఒక్క‌సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. జ‌స్ప్రీత్ దెబ్బ‌కు డికాక్ కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత స్టార్ బ్యాట‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌ను కూడా బుమ్రా పెవిలియ‌న్‌కు పంపాడు.తుది జ‌ట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడిJasprit Bumrah wastes no time and removes the danger man, Quinton de Kock, in this all-important Super 8 clash. 🔥ICC Men's #T20WorldCup | SUPER 8 | #INDvSA | LIVE NOW 👉 https://t.co/dZWPZfqfbO pic.twitter.com/23RqtAxaoq— Star Sports (@StarSportsIndia) February 22, 2026

India vs South Africa Super 8 Group 1 live updates and highlights3
పీక‌ల్లోతు క‌ష్టాల్లో భార‌త్‌.. కెప్టెన్ సూర్య ఔట్‌

India vs South Africa Super 8 live updates: టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. పీక‌ల్లోతు క‌ష్టాల్లో భార‌త్‌.. కెప్టెన్ సూర్య ఔట్‌టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కార్భిన్ బాష్ బౌలింగ్‌లో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌(18) ఔట‌య్యాడు. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వ‌చ్చాడు. భార‌త్ విజయానికి 64 బంతుల్లో 134 ప‌రుగులు కావాలి.భార‌త్ నాలుగో వికెట్ డౌన్‌43 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. బాష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.అభిషేక్ శ‌ర్మ ఔట్‌అభిషేక్ శ‌ర్మ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్ వ‌చ్చాడు. 7 ఓవ‌ర్లకు భార‌త్ స్కోర్‌: 42/3తిలక్ వర్మ ఔట్‌5 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన తిలక్ వర్మ.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు.భారత్ తొలి వికెట్ డౌన్‌188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఐడైన్ మార్‌క్రమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ డౌకటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. అదేవిధంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫోరుతో తన ఖాతా తెరిచాడు.భార‌త్ టార్గెంట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. 30 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు.డేవిడ్ మిల్ల‌ర్‌(63) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. బ్రెవిస్‌(45), స్ట‌బ్స్‌(44) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు.సౌతాఫ్రికా ఆరో వికెట్ డౌన్‌157 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్‌.. మిల్ల‌ర్ ఔట్డేవిడ్ మిల్ల‌ర్ రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 63 ప‌రుగులు చేసిన మిల్ల‌ర్‌.. వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో ఔట‌య్యాడు.సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్డెవాల్డ్ బ్రెవిస్ రూపంలో సౌతాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సౌతాఫ్రికా 4 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు చేసింది.నిల‌కడ‌గా ఆడుతున్న మిల్ల‌ర్, బ్రెవిస్‌30 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు మిల్ల‌ర్‌, బ్రెవిస్ ఆదుకున్నారు. వీరిద్ద‌రూ నాలుగో వికెట్‌కు 64 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి సౌతాఫ్రికా 3 వికెట్ల న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది.సౌతాఫ్రికా మూడో వికెట్ డౌన్‌రికెల్ట‌న్ రూపంలో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన రికెల్ట‌న్‌.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 6 ఓవ‌ర్ల‌కు ప్రోటీస్ స్కోర్: 41/3సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్‌12 ప‌రుగుల వ‌ద్ద సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 4 ప‌రుగులు చేసిన కెప్టెన్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌(4).. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్‌టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. స్టార్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్‌ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 ఓవ‌ర్ల‌కు ప్రోటీస్ స్కోర్: 10/1టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 సూప‌ర్‌-8లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సూప‌ర్‌-8 పోరులో ప్రోటీస్ నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది.గ‌త మ్యాచ్‌కు దూర‌మైన లుంగీ ఎంగిడి, జాన్సెన్‌, కేశ‌వ్ మ‌హారాజ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. భార‌త్ మాత్రం ఎటువంటి మార్పులు చేయ‌లేదు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను జ‌ట్టులో కొన‌సాగించారు. దీంతో అక్ష‌ర్ ప‌టేల్ మ‌రోసారి బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు.తుది జ‌ట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తిదక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి

India A Women won ACC Women's Asia Cup Rising Stars 2026 title4
ఆసియా కప్‌ 2026 విజేతగా భారత్‌

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టైటిల్‌ను భారత్‌ వరుసగా రెండో ఎడిషన్‌లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్‌ వేదికగా జరిగిన 2026 ఎడిషన్‌లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్‌ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్‌-ఏపైనే విజయం సాధించే టైటిల్‌ను చేజిక్కించుకుంది.నేటి ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్‌లో వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్‌ (4-0-12-3), తనూజా కన్వర్‌ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (4-0-16-1), సైమా ఠాకోర్‌ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటి​కి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. సర్మిన్‌ సుల్తానా (18), కెప్టెన్‌ ఫాతిమా ఖాతూన్‌ (14), సదియా అక్తర్‌ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్‌ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్‌లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది.

ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh bowlers restricted team india to 134 runs in final5
ఆసియా కప్‌ ఫైనల్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్‌కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్‌లో భారత్‌ శ్రీలంకపై, బంగ్లాదేవ్‌ పాకిస్తాన్‌పై విజయాలు సాధించి తుది పోరు​కు అర్హత సాధించాయి.

Four winners in one group, Fans slam Super 8 pre seeding for T20 World Cup 20266
టాపర్లంతా ఒకే గ్రూప్‌లో.. ఏంటీ సూపర్‌-8 ప్రీ-సీడింగ్‌ గోల..?

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైనప్పటి నుంచి క్రికెట్‌ అభిమానులు ఓ పదాన్ని తరుచూ వింటూ ఉన్నారు. ఏంటా పదం అంటే.. ప్రీ-సీడింగ్‌. ఈ ప్రీ-సీడింగ్‌ పద్దతిని ఐసీసీ ప్రస్తుత ప్రపంచకప్‌ ఎడిషన్‌ నుంచే ప్రవేశ పెట్టింది.రెండు దేశాల్లో (భారత్‌, శ్రీలంక) మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నందున టికెట్లు, ప్రసారాలు, లాజిస్టిక్స్, అభిమానుల ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేయడానికి ప్రీ-సీడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం, జట్లకు ముందే స్లాట్లు కేటాయించబడ్డాయి. పలానా జట్టు సూపర్‌-8కి చేరితే పలానా గ్రూప్‌లో ఉంటుందని ముందే నిర్ణయించబడింది.ఐసీసీ ఈ ప్రీ-సీడింగ్‌ విధానాన్ని అభిమానులు, ఆటగాళ్ల సౌకర్యార్థం ప్రవేశపెడితే, దీని పర్యవసనాలు విమర్శలకు దారి తీశాయి. ముందుగా కేటాయించబడిన స్లాట్ల ప్రకారం​ ఆయా గ్రూప్‌ల్లో టాపర్లుగా ఉన్న జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌ సూపర్‌-8 గ్రూప్‌-1లోకి వచ్చాయి. అదే గ్రూప్‌ల్లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సూపర్‌-8 గ్రూప్‌-2లోకి చేరాయి.గ్రూప్‌ దశలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి టాపర్లుగా సూపర్‌-8కి చేరిన జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌కు అదనపు ప్రయోజనాలు ఏమీ దక్కకపోవడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. గ్రూప్‌ దశలో టాపర్లుగా నిలిచిన ఆ జట్లకు అదనపు ప్రయోజనాలు (రెండో స్థానంలో నిలిచిన జట్లతో మ్యాచ్‌లు) కల్పించాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్‌ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ విధానంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు సూపర్‌-8 బెర్త్‌లను డీల్‌ చేసే అధికారాలే వస్తే, తప్పక సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని అన్నాడు.ఈ అశాస్త్రీయ ప్రీ-సీడింగ్‌ విధానం వల్ల ఇప్పుడు గ్రూప్‌ దశలో టాపర్ జట్లు సూపర్‌-8 దశలో ఒకదానితో ఒకటి పోటీపడనున్నాయి. గ్రూప్‌ దశలో రెండో స్థానంలో నిలిచిన జట్లంతా ఒక దానితో ఒకటి తలపడనున్నాయి. నిన్న న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ మధ్య జరగాల్సి తొలి సూపర్‌-8 గ్రూప్‌-2 మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తి తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) మరో రెండు సూపర్‌-8 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం గ్రూప్‌-2లో శ్రీలంక-ఇంగ్లండ్‌, రాత్రి గ్రూప్‌-1లో భారత్‌-సౌతాఫ్రికా తలపడనున్నాయి.

Another South African Star Joins PSL 2026 In The IPL Window7
పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్‌ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రూబిన్‌ హెర్మన్‌ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.ఫాఫ్‌ డుప్లెసిస్‌ తర్వాత ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్‌గా హెర్మన్‌ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్‌ ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకొని పీఎస్‌ఎల్‌లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్‌ కెరీర్‌లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్‌, పీఎస్‌ఎల్‌ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్‌ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎ‌ల్‌లో పాల్గొంటుండటం ఆసక్తికరం.హెర్మన్ ప్రదర్శనలు 29 ఏళ్ల హెర్మన్‌ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్‌లో హెర్మన్‌ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.లాహోర్ జట్టు వ్యూహం లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్‌ బలం మరింత పెరుగనుంది. హెర్మన్‌ మిడిలార్డర్‌లో కీలకమైన బ్యాటర్‌. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్‌ ప్రత్యేకత.

SURYA KUMAR YADAV NOMINATED FOR ICC MEN'S PLAYER OF THE MONTH AWARD JANUARY 20268
సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకు మరో గుడ్‌ న్యూస్‌

సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ కూడా నామినేట్‌ అయ్యారు. మహిళల విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ శోభన మోస్టరీ, యూఎస్‌ఏకు చెందిన టారా నోర్రిస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు పోటీపడుతున్నారు. గత నెలలో వీరంతా తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేయడంతో ఐసీసీ వీరిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ చేసింది.డారిల్‌ మిచెల్‌జనవరిలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టుకు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రెండు, మూడు వన్డేల్లో మిచెల్‌ వరుస శతకాలు సాధించి మొత్తం 352 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 176గా ఉండటం విశేషం.ఈ ప్రదర్శన తర్వాత మిచెల్‌ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా 186.56 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు సాధించి సత్తా చాటాడు.జో రూట్‌రూట్‌ విషయానికొస్తే.. ఈ స్టార్‌ బ్యాటర్‌ జనవరి నెలలో శ్రీలంకపై ఇంగ్లండ్‌ 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అతను వరుసగా 61, 75, 111 నాటౌట్‌ స్కోర్లు చేశాడు. అదనంగా రెండు వికెట్లు కూడా తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" అవార్డును కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనల కారణంగానే రూట్‌ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.సూర్యకుమార్‌ యాదవ్‌జనవరి నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్కై తన పూర్వపు ఫామ్‌ను తిరిగి పొందాడు. అంతకుముందు 25 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన స్కై.. ఆ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 197 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేసి భారత్‌కు సిరీస్‌ విజయాన్ని (4-1) అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగానే స్కై ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు.

England suffer major blow ahead of T20 World Cup super 8 clash with Sri Lanka9
శ్రీలంకతో సూపర్‌-8 సమరానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 సమరాలు నిన్నటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమయ్యాయి. పాక్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన తొలి సమరం వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) సూపర్‌-8లో మరో రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి.మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.కాగా, శ్రీలంకతో కీలక సమరానికి ముందు మాజీ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ గాయపడ్డాడు. బేతెల్‌ ఎడమ చేతి ఉంగరం వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను వేళ్లకు బ్యాండ్‌ ఎయిడ్‌ (protective strapping) వేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బేతెల్‌ శ్రీలంక మ్యాచ్‌లో బౌలింగ్‌కు అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది.ఐసీసీ నియమాలు ప్రకారం, బౌలర్ చేతికి ఏ రకమైన రక్షణ ఉండాలన్నా మైదానంలోకి దిగే ముందు దాన్ని అంపైర్లు ఆమోదించాలి. ఇంగ్లండ్ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని రెండు సార్లు ఎదుర్కొంది. కాబట్టి బేతెల్‌కి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.బేతెల్ ప్రాధాన్యంపల్లెకెలెలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే బేతెల్ గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఇంగ్లండ్ విజయానికి కీలకమైంది. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడుతున్న సందర్భంలో బేతెల్‌ బౌలింగ్‌ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.వ్యూహంపై ప్రభావంబేతెల్ గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టు వ్యూహంలో మార్పులు తప్పనిసరి కావచ్చు. అతని బౌలింగ్ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు ఇతర స్పిన్ ఎంపికలపై ఆధారపడాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే బేతెల్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటు అవుతుంది. శ్రీలంక జట్టు స్పిన్ విభాగంలో బలంగా ఉండటంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతుంది. మ్యాచ్‌కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Indias Super 8 clash with South Africa today in T20 World Cup10
పునరావృతమా... ప్రతీకారమా...

రెండేళ్ల క్రితం టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌... ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ 7 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది. అభిమానులెవరూ దీనిని మరచిపోలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఎనిమిది మ్యాచ్‌లు జరిగినా...వరల్డ్‌ కప్‌ లెక్కే వేరు. నాటి ఫైనల్‌ తర్వాత ఇప్పుడు రెండు టీమ్‌లు అదే వరల్డ్‌ కప్‌ అసలు మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్‌ కాని ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో 2024 ఫలితాన్ని భారత్‌ పునరావృతం చేస్తుందా లేక దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంటుందా ఆసక్తికరం.అహ్మదాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో భారత్‌ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అన్నింటా గెలిచి లీగ్‌ దశను అజేయంగా ముగించింది. కానీ ఎదురుపడిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ గట్టి ప్రత్యర్థులైతే కానే కావు. దాయాది పాకిస్తాన్‌ అయినా పోటీ ఇస్తుందనుకుంటే ఆ మూడింటి సరసనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఆడిన అన్ని గెలిచాం. అజేయమని ఆదమరిస్తే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశలో భాగంగా నేడు (ఆదివారం) జరిగే పోరులో దక్షిణాఫ్రికాను భారత్‌ ఎదుర్కొంటుంది. దక్షిణాఫ్రికా కూడా తమ గ్రూప్‌లో ఆడిన నాలుగూ గెలిచి టాపర్‌గా ముందంజ వేసింది. బలాబలాలను బట్టి చూస్తే సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం. అభిషేక్‌ ‘జీరో’ నుంచి ‘హీరో’ అయ్యేనా... సూపర్‌ హిట్టర్, స్టార్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై భారత్‌ గంపెడాశలు పెట్టుకుంది. మెరుపులతో మురిపిస్తాడని, మ్యాచ్‌లను ఏకపక్షంగా మలిచేస్తాడని భావించింది. కానీ ఈ ప్రపంచకప్‌లోనే అభిషేక్‌ ఖాతా తెరువలేదు. అన్ని ‘జీరో’లే! భారత్‌ స్థాయికి తగని ప్రత్యర్థులతోనే అతను ఆడలేకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతుంది. నేడు దక్షిణాఫ్రికాతో కీలకమైన సూపర్‌ పోరులో అయినా ఖాతా తెరవాలని, సఫారీ బౌలింగ్‌పై మెరిపించాలని జట్టే కాదు యావత్‌ దేశం గట్టిగా కోరుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు భారత్‌ ఈ మెగా ఈవెంట్‌లో గొప్ప మ్యాచ్‌ అయితే ఆడలేదు. అమెరికాతో జరిగిన పోరులో ఒకే ఒక్కడు సూర్యకుమార్‌ మెరిపించాడు. ఇంకెవరూ 30 పరుగులైనా చేయలేదు. నమీబియాలాంటి ప్రత్యరి్థపై కూడా ఆడింది ఇద్దరే! ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యాలు ఫిఫ్టీలు చేశారు. పాక్‌తో కీలకమైన పోరు జరిగినా దంచింది మాత్రం ఇషాన్‌ కిషన్‌ ఒక్కడే! నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి పోరులోనూ భారత ఇన్నింగ్‌ ఒక్కడి ఫిఫ్టీపైనే ఆధారపడింది. శివమ్‌ దూబే రాణించాడు. క్రికెట్‌ కూనలే ఎదురైనా, పాక్‌తో జాగ్రత్తగా ఆడాల్సివున్నా... ప్రతీ మ్యాచ్‌లో ఏ ఒకరో లేదంటే ఇద్దరో ఆడారు. ఇకపై కూడా ఎవరో ఒకరిద్దరు ఆడితే గెలిచేయొచ్చనుకుంటే భారత్‌ కథ ఈ సూపర్‌–8కే పరిమితమవుతుంది. స్పీడ్‌స్టర్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్పిన్‌ ద్వయం అక్షర్‌ పటేల్, వరుణ్‌ చక్రవర్తిలు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని ప్రతి మ్యాచ్‌లోనూ నిలబెడుతున్నారు. దుర్బేధ్యంగా దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో గత ఫైనలిస్టు దక్షిణాఫ్రికా పట్టుదలతో ఆడింది. ప్రధాన బ్యాటర్లే కాదు.... లోయర్‌ మిడిలార్డర్‌లోనూ దంచేసిన ఆటగాళ్లున్నారు. అమెరికాపై 200 పైచిలుకు చేసిన సఫారీ... అఫ్గాన్‌పై 187/6 స్కోరు చేసింది. ఇక కివీస్‌పై అయితే 176 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యూఏఈని తక్కువ స్కోరు (122/6)కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 13.2 ఓవర్లలోనే ఛేదంచింది. కెప్టెన్‌మార్క్‌రమ్, డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్‌ ఇలా అందరూ ఫామ్‌లో ఉన్నారు. అంతకుమించి సమష్టిగా రాణిస్తున్నారు. ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఒకరిద్దరితో గెలిచిన సందర్బాలే లేవు. ఇక బౌలింగ్‌ బలం గురించి చెప్పాల్సిన పనిలేదు. రబడా, ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్, కార్బిన్‌ బాష్, యాన్సెన్‌ ప్రత్యర్థి బ్యాటర్లను వణికించగలరు. పిచ్‌–వాతావరణం అహ్మదాబాద్‌ వికెట్‌ బ్యాటింగ్‌కే అనుకూలం. ప్రత్యేకించి టి20లైతే ధనాధన్‌ షో గ్యారంటీ. ఈ మైదానంలో ఛేదన సులువు కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయం. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, రింకూ, అక్షర్‌ పటేల్, వరుణ్, బుమ్రా, అర్ష్ దీప్‌. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, బాష్, రబడా, ఎన్‌గిడి, కేశవ్‌ మహరాజ్‌.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement