ప్రధాన వార్తలు
WPL Eliminator: దంచికొట్టిన బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026 తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ చేరగా.. మరో బెర్తు కోసం గుజరాత్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది.దంచికొట్టిన బెత్ మూనీఇందులో భాగంగా కొటాంబిలోని వడోదర స్టేడియంలో మంగళవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ బెత్ మూనీ అజేయ అర్ధ శతకం (51 బంతుల్లో 62) మెరవగా.. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6), వన్డౌన్ బ్యాటర్ అనుష్క శర్మ (16) నిరాశపరిచారు.ఇక కెప్టెన్ ఆష్లే గార్డ్నర్, భారతి ఫల్మలి డకౌట్గా వెనుదిరగగా.. కనిక అహుజా సైతం 6 పరుగులకే అవుటైంది. జార్జియా వారేహమ్ (25 బంతుల్లో 35), కశ్వీ గౌతం (10 బంతుల్లో 18) మెరుగ్గా రాణించారు. ఫలితంగా గుజరాత్ 150 పరుగుల మార్కు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.ఢిల్లీ బౌలర్లలో చినెల్లి హెన్రీ మూడు వికెట్లతో చెలరేగగా.. నందాని శర్మ రెండు, మిన్ను మణి ఒక వికెట్ పడగొట్టారు. గుజరాత్ విధించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది.డబ్ల్యూపీఎల్-2026 ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీతుదిజట్లుగుజరాత్బెత్ మూనీ (వికెట్ కీపర్), సోఫీ డివైన్, అనుష్క శర్మ, ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), జార్జియా వరేహమ్, భారతి ఫల్మలి, కనిక అహుజా, కశ్వీ గౌతం, తనుజా కన్వేర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గైక్వాడ్.ఢిల్లీలిజెల్లి లీ (వికెట్ కీపర్), షఫాలి వర్మ, లారా వల్వర్ట్, జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మరిజానే కాప్, చినెల్లి హెన్రీ, నికీ ప్రసాద్, స్నేహ్ రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందాని శర్మ. Beth Mooney dances down the track and puts it away for a much-needed boundary 👊Will Mooney anchor Gujarat Giants to a big total in this eliminator clash? 👀#TATAWPL Eliminator | #GGvDC 👉 LIVE NOW ➡️ https://t.co/Bd8nlT8AGe pic.twitter.com/YO8yPWT0VJ— Star Sports (@StarSportsIndia) February 3, 2026
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్లో ఆసీస్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్డౌన్లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్ ఖతం: రమీజ్ రాజా
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.కోరికోరి వివాదాలుభారత్లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకువచ్చింది.అయితే, బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. తటస్థ వేదికల ఏర్పాటుకాగా భారత్- పాక్ మధ్య దైపాక్షిక సిరీస్లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్లో మ్యాచ్లు ఆడింది. ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టోర్నీ భారత్లో జరుగగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్కప్లోనూ పాక్ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.భారత్తో పెట్టుకుంటే అంతేఅయినప్పటికీ బంగ్లాదేశ్ కోసమంటూ పాక్.. భారత్ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. భారత్తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.సెనేట్ స్టాండింగ్ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.90 శాతం ఆదాయం అక్కడి నుంచేఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్ క్రికెట్ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్ క్రికెట్కు ఫండింగ్ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వీడియో ఫేక్ కావొచ్చు అంటూ పాక్ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చదవండి: ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!#WATCH : Throwback Video Of Ramiz Raja Warned PCB Could ‘Collapse’ If India Pulls SupportAn old video of former Ramiz Raja, made during his tenure as chairman of the Pakistan Cricket Board, has resurfaced on social media, drawing renewed attention amid ongoing cricket diplomacy… pic.twitter.com/BCkNgzyI2z— upuknews (@upuknews1) February 3, 2026
T20 WC: శ్రీలంకకు షాకిచ్చిన పసికూన!
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహక మ్యాచ్లో ఒమన్ శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించి లంక-'ఎ' జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న వరల్డ్కప్ టోర్నీ ఆరంభంకానున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీలంక-'ఎ' జట్టు మంగళవారం ఒమన్తో తలపడింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 145 పరుగులకే పరిమితంఅయితే, ఒమన్ బౌలర్ల ధాటికి తాళలేక 145 పరుగులకే పరిమితమైంది. టాపార్డర్లో ఓపెనర్ సినెత్ జయవర్దన (9), వన్డౌన్ బ్యాటర్ పులిందు పెరిరా (9) విఫలం కాగా.. మరో ఓపెనర్ దుల్నిత్ సిగెర (20) ఫర్వాలేదనిపించాడు.మిగిలిన వారిలో గుణశేఖర (21), వనుజ సహాన్ (29) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి శ్రీలంక 145 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లో షా ఫైజల్, షకీల్ అహ్మద్, జే ఒడెరా రెండేసి వికెట్లు పడగొట్టగా.. నదీం ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆమీర్ కలీమ్ ధనాధన్ అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 146 పరుగులు సాధించింది. ఓపెనర్, 44 ఏళ్ల వెటరన్ ప్లేయర్ ఆమీర్ కలీమ్ (47 బంతుల్లో 80) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ వినాయక్ శుక్లా (24 బంతుల్లో 39 నాటౌట్) రాణించాడు. మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో వనుజ సహాన్ మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్ లాహిరు సమరకూన్, కవిజ గమేజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!
మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్ఎల్ గతేడాది జరగలేదు. ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.ఈ నెల 14 నుంచే ఫుట్బాల్ లీగ్ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్బాలర్లు సైతం తమ మ్యాచ్ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్ జిందాల్ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు. రూ.కోట్లు పోయి లక్షలు ఐఎస్ఎల్ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్కోడ్’ యాప్ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్లున్న ఫుట్బాల్ ఈవెంట్ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. అంటే ఒక్కో మ్యాచ్కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్ మీడియా రైట్స్ పొందింది. 2024–25 సీజన్లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్లు జరిగాయి. అంటే మ్యాచ్కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి నేపాల్ వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–19 మహిళల చాంపియన్షిప్లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్సీ అండర్–17 మహిళల ఆసియా కప్కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్–19 టోరీ్నలో భారత్ అండర్–17 జట్టును బరిలోకి దింపింది.టీనేజ్ జట్టు తొలి మ్యాచ్లో 1–0తో ఆతిథ్య నేపాల్పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్లో భారత్ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్ (29వ నిమిషంలో), అల్పి అక్తర్ (40వ ని.) చెరో గోల్ చేశారు.
ICC vs PCB: పాకిస్తాన్కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైనా పాకిస్తాన్ మొండివైఖరి వీడటం లేదు. బంగ్లాదేశ్ కోసమంటూ నాటకానికి తెరతీసిన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)నే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాక్ మ్యాచ్ల కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసినా.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరలేపింది.బంగ్లాదేశ్కు ఇప్పటికే షాక్తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని.. అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీకి మాత్రం ఇంతవరకు అధికారికంగా మాత్రం ఇ-మెయిల్ పంపలేదు. కాగా భారత్లో తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెట్టిన బంగ్లాదేశ్కు ఇప్పటికే ఐసీసీ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే.తమ పరిశీలన బృందం నివేదిక ప్రకారం భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని.. అందుకే వేదికను శ్రీలంకకు మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో ఆ జట్టును తప్పించి.. స్కాట్లాండ్ను వరల్డ్కప్ టోర్నీలో చేర్చింది. టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలుఈ అంశమై ఓటింగ్ నిర్వహించగా.. బంగ్లాదేశ్కు మద్దతుగా ఆ దేశంతో పాటు పాక్ మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా.. మిగతా ఐసీసీ సభ్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.దీంతో పాకిస్తాన్ తాము సైతం టోర్నీ నుంచి వైదొలుగుతామని మొదట బీరాలు పలికినా.. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్ మాత్రమే ఆడమని ప్రకటించింది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం. శ్రీలంకలో ఆడే మిగతా మ్యాచ్లకు లేని భద్రతా సమస్యలు.. టీమిండియాతో మ్యాచ్కు ఉంటాయని చెప్పడం విమర్శలకు దారితీసింది.ఆ అధికారం, హక్కు మాకు లేవుఈ నేపథ్యంలో పాక్ బోర్డు.. ఇతర దేశాల బోర్డులను సంప్రదించి తమకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఐసీసీతో సమావేశంలో తమకు, బంగ్లాదేశ్కు అనుకూలంగా వ్యవహరించాలని బతిమాలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పాక్కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.డబుల్ గేమ్ ఎందుకు?రెవ్స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఈ అంశాల్లో తలదూర్చే అధికారం, హక్కు తమకు లేవని ఆయా బోర్డులు పీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఐసీసీ, బీసీబీ మధ్య వివాదంలో తాము దూరలేమని పేర్కొన్న బోర్డులు.. పీసీబీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టినట్లు తెలుస్తోంది.కాగా ఇటీవల అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో పాక్.. భారత్తో మ్యాచ్ ఆడింది. యువ భారత జట్టు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు.. పాక్ మహిళల ‘ఎ’ జట్టు.. ఫిబ్రవరి 15న భారత మహిళల ‘ఎ’ జట్టుతో తలపడనుంది. బ్యాంకాక్లో జరిగే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, పాక్ ఈ మ్యాచ్లో యథావిధిగా ఆడనుంది.పాక్కు గట్టి షాక్ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ సభ్య దేశాలకు బోర్డులు.. పీసీబీకి తాము అండగా ఉండలేమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కాగా భారత్- శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. భారత్- పాక్ మ్యాచ్ను కొలంబోలో ఫిబ్రవరి 15న నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా.. పీసీబీ ఇలా బాయ్కాట్ అంటూ సాగదీస్తోంది.చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!
బుమ్రా కాదు!.. ఈసారి టాప్ వికెట్ టేకర్ అతడే!
పొట్టి క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. ఇందులో భాగంగా తొలిరోజు ముంబైలోని వాంఖడే వేదికగా టీమిండియా అమెరికాతో తలపడనుంది.నాలుగు గ్రూపులుఇక అదే రోజు కొలంబోలో పాకిస్తాన్- నెదర్లాండ్స్, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్- స్కాట్లాండ్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక ఈసారి ఈ మెగా టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.గ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ .. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియాతో పాటు ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే పోటీలో ఉన్నాయి. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ల, ఇటలీ.. గ్రూప్-డిలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా బరిలో నిలిచాయి.ఉపఖండ పిచ్లపై వరల్డ్కప్ఇక ఈసారి ఉపఖండ పిచ్లపై వరల్డ్కప్ జరగడం స్పిన్నర్లకు అనుకూలించే అంశం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అంచనా వేశాడు. రేసులో వారు సైతంఅయితే, టాప్ వికెట్ టేకర్ల పోటీలో టీమిండియా పేస్దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, ఆసీస్ స్టార్లు జోష్ హాజిల్వుడ్, ఆడం జంపా, ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రాన్ కూడా ఉంటాడని మెగ్రాత్ పేర్కొన్నాడు.టీ20 టాప్ బౌలర్కాగా రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికి 111 మ్యాచ్లలో కలిపి 187 వికెట్లు కూల్చాడు. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024లో టాప్ వికెట్ టేకర్గా నిలిచి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు" అందుకున్న బుమ్రా ఖాతాలో.. 102 అంతర్జాతీయ టీ20 వికెట్లు ఉన్నాయి.అభిషేక్ శర్మకే ఇద్దరి ఓటుఇదిలా ఉంటే. ఆసీస్ మాజీ పేసర్ డెమేన్ ఫ్లెమింగ్ మాత్రం వరల్డ్కప్లో అత్యధిక వికెట్ల వీరుడిగా బుమ్రాకే ఓటు వేశాడు. ఇక ఈసారి టాప్ రన్ స్కోరర్గా టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను మెగ్రాత్ ఎంచుకోగా.. ఫ్లెమింగ్ కూడా అతడికి మద్దతు పలికాడు. కాగా గత కొన్నాళ్లుగా సూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈసారి కూడా సత్తా చాటి.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సూర్యకుమార్ సేనకు అన్ని అర్హతలు ఉన్నాయి.ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత ఆట తీరుతో దుమ్ములేపిన టీమిండియా స్వదేశంలో మెగా టోర్నీ జరుగనుండటం సానుకూలాంశం. అయితే, వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలైన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (Axar Patel), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలబారిన పడ్డారు.పూర్తిగా కోలుకున్న తిలక్వీరిలో వేలి నొప్పితో బాధపడిన అక్షర్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ (IND vs NZ)లో ఆఖరి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన ఈ హైదరాబాదీకి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. అనంతరం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్లో ఉన్న తిలక్ మ్యాచ్ ఫిట్గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.ఈ క్రమంలో ప్రపంచకప్ అసలు పోరుకు ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్ల ద్వారా తిలక్ వర్మకు ప్రాక్టీస్ కల్పించాలని భావించిన సెలక్టర్లు భారత ‘ఎ’ జట్టులో చోటు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 పరుగులు చేసి.. వరల్డ్కప్ టోర్నీకి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.వాషీ విషయంలో ఆందోళనఅయితే, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వాషీ వేగంగా కోలుకుంటున్నా వరల్డ్కప్ లీగ్ దశ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది."వాషింగ్టన్ సుందర్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అతడి పక్కటెముకలో ఫ్రాక్చర్ ఉంది. అయితే, అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు బ్యాటింగ్ సెషన్లు పూర్తి చేసుకున్నాడు.సోమవారం (ఫిబ్రవరి 2) స్పాట్ బౌలింగ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. బుధవారం మరోసారి బౌలింగ్ సెషన్లో వాషీ పాల్గొంటాడు. దీని ఆధారంగానే అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై అంచనాకు రావొచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. వారికి లైన్క్లియర్కాగా వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్నాడు. తిలక్ వర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఇక్కడే పునరావాసం పొందారు. వీళ్లందరూ పూర్తి ఫిట్గా ఉన్నట్లు ఫిజియోలు ఇటీవలే ప్రకటించారు. కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్వదేశీ స్పిన్ పిచ్ల మీద రాణించగల సత్తా వాషీకి ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నా వాషీ లేకపోవడం కూడా లోటు లాంటిదే. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలయ్యే వరల్డ్కప్ టోర్నీ మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది. చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ సూపర్ లీగ్లో స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో వైరలవుతుంది. స్టీవ్ను రానున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎడిషన్ కోసం సియాల్కోట్ స్టాలియన్జ్ అనే ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. స్టాలియన్జ్ స్టీవ్ను డైరెక్ట్ సైనింగ్ ద్వారా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.ఈ వార్త పాక్ అభిమానుల సోషల్మీడియా గ్రూప్ల్లో హల్చల్ చేస్తుంది. పాక్ ఫ్యాన్స్ స్టీవ్కు స్వాగతం పలుకుతున్నారు. స్టీవ్ ఇప్పటివరకు పీఎస్ఎల్లో ఆడలేదు. స్టీవ్ రాక పీఎస్ఎల్కు కల తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం స్టీవ్ మంచి ఫామ్లో ఉన్నాడు.తాజాగా ముగిసిన బిగ్ బాష్ లీగ్ (BBL) 15వ సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతూ 6 మ్యాచ్ల్లో 299 పరుగులు (సగటు 59.80, స్ట్రైక్ రేట్ 167.97) చేశాడు. ఇందులో 42 బంతుల్లో శతకం కూడా ఉంది. మొత్తం టీ20 కెరీర్లో 272 మ్యాచ్లు ఆడిన స్టీవ్.. 6,242 పరుగులు, 5 శతకాలు, 30 అర్ధశతకాలు సాధించాడు. కాగా, పాకిస్తాన్ సూపర్ లీగ్ తదుపరి ఎడిషన్ ప్రారంభానికి ముందు పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీకి ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సంతకం చేసుకునే అవకాశం ఉంది. గత ఎడిషన్లో ఆడని ఆటగాడిని మాత్రమే ఈ విధానం ద్వారా తీసుకోవచ్చు. స్టాలియన్జ్ ఈ అవకాశాన్ని వినియోగించి స్టీవ్ను చేజిక్కించుకుంది. స్టాలియన్జ్ PSLలో కొత్తగా ప్రవేశించిన రెండు జట్లలో ఒకటి.2026 జనవరి 8న జిన్నా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఫ్రాంచైజీల వేలంలో OZ Developers (హమ్జా మజీద్, కామిల్ ఖాన్) స్టాలియన్జ్ను రూ.1.85 బిలియన్ రికార్డు ధరకు కొనుగోలు చేశారు. PSL చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది.
IND vs PAK: ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్తో మ్యాచ్ బహిష్కరించడంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. వరల్డ్కప్ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్ ఆఘా వ్యాఖ్యానించాడు.ఆసీస్ను క్లీన్స్వీప్ చేసి..అదే విధంగా.. గ్రూప్ దశలో మ్యాచ్ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్ ఆఘా స్పందించాడు. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచకప్ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆసీస్ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్ ఈ మేర విజయం సాధించింది.ప్రపంచకప్ అంటే భారత్తో మ్యాచ్ మాత్రమే కాదుఈ నేపథ్యంలో ఆసీస్తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్ ఆఘా (Salman Agha) భారత్తో మ్యాచ్ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్ అంటే భారత్తో మ్యాచ్ మాత్రమే కాదు కదా!..లీగ్ దశలో మరో మూడు మ్యాచ్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు షాహిత్ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్ లతీఫ్, మొయిన్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించారు.మిగిలిన మూడు జట్లు అవేకాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్తో పాటు పాకిస్తాన్ గ్రూప్-‘ఎ’లో ఉంది. అయితే, భారత్లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. అపుడు అమెరికా చేతిలో ఓడిఅయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్ మ్యాచ్లో పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్ న్యూస్!
విష్ణువర్ధన్ ఖాతాలో 48వ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ...
అల్కరాజ్ కొత్త చరిత్ర
మెల్బోర్న్: పురుషుల టెన్నిస్ చరిత్రలో స్పెయిన్...
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే
ఆస్ట్రేలియా ఓపెన్-2026లో రసవత్తర పోరుకు రంగం ...
పీటీ ఉష ఇంట్లో విషాదం
కోజికోడ్: దిగ్గజ అథ్లెట్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓ...
బుమ్రా కాదు!.. ఈసారి టాప్ వికెట్ టేకర్ అతడే!
పొట్టి క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెపుడా అని ఎదురుచ...
T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంప...
పాకిస్తాన్ సూపర్ లీగ్లో స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు సంబం...
IND vs PAK: ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్తో మ్యాచ్...
క్రీడలు
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
వీడియోలు
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
World Cup 2026 : యువ భారత్ జైత్రయాత్ర.. దుమ్మురేపిన విహాన్
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
