ప్రధాన వార్తలు
శ్రీలంక జట్టుకు అతి భారీ షాక్
టీ20 ప్రపంచకప్కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ అయిపోయాక తీసిన ఎంఆర్ఐ స్కానింగ్లో హసరంగ ఎడమ కాలి హ్యామ్స్ట్రింగ్లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్ మ్యాచ్లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది. హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక.. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై ఘన విజయం సాధించి, సూపర్-8 దిశగా సాగుతోంది. గ్రూప్ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్-8లో మాత్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది.
IND VS NAM: భారత తుదిజట్టు ఇదే.. సిరాజ్ అవుట్!
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ఆరంభ మ్యాచ్లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.సూర్యకుమార్ ధనాధన్ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ (49 బంతుల్లో 84 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్ పడగొట్టగా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్దీప్ సింగ్ డకౌట్గా వెనక్కి పంపాడు.రాణించిన సిరాజ్మొత్తంగా సిరాజ్ మూడు, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకిఈ మ్యాచ్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.సిరాజ్పై వేటు తప్పదుకాగా హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్ వరల్డ్కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్పై వేటు తప్పదని బంగర్ అన్నాడు.నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్లో ఉన్న సిరాజ్ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయప్డాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్గా సంజూ శాంసన్ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్లలోనూ అతడినే ఓపెనర్గా కొనసాగించే అవకాశం ఉంది.నమీబియాతో మ్యాచ్కు భారత తుదిజట్టు అంచనాఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా/మొహమ్మద్ సిరాజ్.చదవండి: భారత్తో మ్యాచ్కు అంగీకరించిన పాక్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే
సుడిగాలి శతకం.. అయినా వరించని అదృష్టం
బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల్లో (2025-26) ముగ్గురి పేర్లు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్. ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నా, బీసీసీఐ కాంట్రాక్ట్లు దక్కలేదు. షమీ, సర్ఫరాజ్ను పక్కన పెడితే ఇషాన్ కిషన్కు కాంట్రాక్ట్ లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.ఎందుకంటే, ఇతగాడు ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20 సుడిగాలి శతకం (43 బంతుల్లో) బాదాడు. అయినా అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. ఇషాన్కు కాంట్రాక్ట్ దక్కకపోవడానికి బీసీసీఐ ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పనప్పటికీ.. నిబంధనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.అదేటంటే.. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్ట్ లభించాలంటే సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలి. ఇషాన్ ఈ మధ్యకాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ లభించలేదు. కాంట్రాక్ట్ లభించడానికి ఫామ్ కొలమానం కాదు. ఈ కారణంగానే ఇషాన్ సూపర్ ఫామ్లో ఉన్నా కాంట్రాక్ట్ లభించలేదు.షమీ, సర్ఫరాజ్ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరు కూడా సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దేశవాలీ క్రికెట్లో ఈ ముగ్గురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటినా, బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. వీరిలో ఇషాన్, సర్ఫరాజ్కు వచ్చే ఏడాదైనా కాంట్రాక్ట్ లభించవచ్చేమో కాని, షమీని మాత్రం ఇక మరిచిపోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లు లభించిన ఆటగాళ్లు..గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.
'బాస్' ఆల్రౌండ్ షో.. పసికూనల పోరులో నెదర్లాండ్స్ గెలుపు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 10) ఉదయం (11 గంటలకు) జరిగిన పోరులో పసికూనలు నెదర్లాండ్స్, నమీబియా తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ పైచేయి సాధించింది. బాస్ డి లీడ్ ఆల్రౌండ్ మెరుపుల కారణంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లీడ్ తొలుత బంతితో (3-0-20-2), ఆతర్వాత బ్యాట్తో (48 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటి నెదర్లాండ్స్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ ప్రస్తుత ఎడిషన్లో బోణీ కొట్టింది. ఈ జట్టు తొలి మ్యాచ్లో పాక్ చేతిలో ఖంగుతింది. మరోవైపు నబీమియాకు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్లోనే ఆ జట్టు పరాజయంపాలైంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (30), జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ (42) ఓ మోస్తరు స్కోర్లు సాధించి నమీబియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మిగతా బ్యాటర్లలో జేజే స్మిట్ (22), కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లొగన్ వాన్ బీక్, బాస్ డి లీడ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాస్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని నెదర్లాండ్స్ సునాయాసంగా ఛేదించింది. బాస్ డి లీడ్ అజేయమైన మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. లీడ్తో పాటు కొలిన్ ఆకెర్మన్ (32), మైఖేల్ లెవిట్ (28), స్కాట్ ఎడ్వర్డ్స్ (18 నాటౌట్) కూడా రాణించడంతో నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా బౌలర్లలో బెర్నాల్డ్ స్కోల్జ్, రూబెన్ ట్రంపెల్మన్, నికోల్ లాఫ్టీకి తలో వికెట్ దక్కింది.
పావురాల రెట్టలతో పరువు పోయినా.. ఓ శుభవార్త
అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో టోర్నీల నిర్వహణకు సంబంధించి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం పలు టోర్నమెంట్లో స్థాయిని తగ్గించడంతో పాటు మరికొన్ని టోర్నీలను అదనంగా చేర్చారు.వరల్డ్ టూర్ టోర్నమెంట్ల నిర్వహణ కోసం గత ఏడాది 32 దేశాలు దరఖాస్తు చేయగా, ఈసారి డిమాండ్ మరింతగా పెరిగి 56 దేశాలు మ్యాచ్ల నిర్వహణకు ఆసక్తి చూపించాయి. అస్తవ్యస్త నిర్వహణ పట్ల విమర్శలు.. అయినా ఓ శుభవార్తదాంతో భిన్న దేశాల్లో ఆటకు గుర్తింపు తీసుకురావడంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. దీని ప్రకారం భారత్ ఎప్పటిలాగే కచ్చితంగా నిర్వహించే ఏడాదికి నాలుగు టోర్నీల సంఖ్య తగ్గి రెండుకు పరిమితం అయింది.ఇక 2023లో సూపర్–750 టోర్నీగా గుర్తింపు తెచ్చుకున్న ఇండియా ఓపెన్ (India Open Retains)అదే స్థాయిలో కొనసాగుతుంది. ఇటీవల ఈ టోర్నీ అస్తవ్యస్త నిర్వహణ పట్ల పలు విమర్శలు వచ్చిన... అదృష్టవశాత్తూ బీడబ్ల్యూఎఫ్ నుంచి ఎలాంటి చర్యలూ ఎదురు కాలేదు. సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించిఅయితే మరో టోర్నీ సయ్యద్ మోడీ సూపర్–300 స్థాయి మాత్రం మారింది. లక్నోలో ప్రతీ ఏటా భారత మాజీ షట్లర్ సయ్యద్ మోడీ సంస్మరణార్ధం నిర్వహించే ఈ టోర్నీని ఇప్పుడు సూపర్–100కు పరిమితం చేశారు.ఇండియా ఓపెన్ కాకుండా తమకు సూపర్–100 మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో దేశంలో చాలా ఏళ్లుగా జరుగుతున్న టోర్నీ కాబట్టి పేరు మార్చకుండా సయ్యద్ మోడీనే స్థాయి తగ్గించి కొనసాగించాలని నిర్ణయించుకున్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భారత్లో కొనసాగుతున్న మరో రెండు సూపర్–100 టోర్నీలు (గువహటి, ఒడిషా)లను సర్క్యూట్నుంచి బీడబ్ల్యూఎఫ్ పూర్తిగా తొలగించింది. మొత్తం 36 టోర్నీలు... బీడబ్లూఎఫ్ కొత్త క్యాలెండర్ ప్రకారం ఒక ఏడాదిలో టోర్నీలను ఆరు స్థాయిల్లో విభజించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ అన్నింటికంటే అగ్రభాగాన ఉంటుంది. ఆ తర్వాత 5 సూపర్–1000, 5 సూపర్–750, 9 సూపర్–500, 8 సూపర్–300 టోర్నీలు జరుగుతాయి. తొలి సారి సూపర్–100 టోర్నీలను కూడా ప్రధాన టూర్ సర్క్యూట్లో చేర్చారు. ఏడాదికి 8 సూపర్–100 టోర్నమెంట్లు నిర్వహిస్తారు.గతంలో సూపర్–1000 టోర్నీలు నాలుగు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటిని ఐదుకు పెంచారు. అన్ని టోర్నీలు కలిపి మొత్తం ప్రైజ్మనీని 26.9 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 245 కోట్లు) పెంచుతున్నట్లు కూడా బీడబ్ల్యూఎఫ్ ప్రటించింది. ఫార్మాట్లో కూడా స్వల్ప మార్పు చోటు చేసుకుంది.లీగ్ కం నాకౌట్ పద్ధతిలోఇప్పటి వరకు తొలి మ్యాచ్నుంచి ‘నాకౌట్’ కాగా...ఇప్పుడు దీనిని మార్చి లీగ్ కం నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఒక్కో ప్లేయర్ ఒక టోర్నీలో కనీసం రెండు మ్యాచ్లైనా ఆడే అవకాశం కల్పించాలనేదే అందుకు కారణం. టీమ్ ఈవెంట్లు సుదిర్మన్ కప్, థామస్ కప్, ఉబెర్ కప్లలో కూడా జట్ల సంఖ్యను పెంచనున్నారు. మరింత ఎక్కువ మందికి బ్యాడ్మింటన్కు చేరువ చేసే క్రమంలో భాగంగా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్లను టీవీల్లో ప్రసారం చేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ఏడాదికి కనీసం 3 వేల మ్యాచ్లు ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. పావురాల రెట్టలున్యూఢిల్లీలో ఇండియా ఓపెన్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని.. ప్రాక్టీస్ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచ్ఫీల్డ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.బ్లిచ్ఫీల్డ్ విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగి.. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించింది.
IND vs PAK: థాంక్యూ.. బీసీసీఐ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది. కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న దాయాదులు ముఖాముఖి పోరులో తలపడేందుకు పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.థాంక్యూ చెబుతున్నాఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించిన తీరు వైరల్గా మారింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘ఐసీసీ చైర్మన్ (జై షా), ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదికినందుకు బీసీసీఐ తరఫున నేను ఐసీసీకి థాంక్యూ చెబుతున్నా.అతిపెద్ద విజయం ఇదిపాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో చర్చించి.. అన్ని వర్గాల వాదనలు విని ఐసీసీ సమస్యను పరిష్కరించింది. క్రికెట్ మనుగడలో ఇది అత్యంత కీలక నిర్ణయం. ఆట కొనసాగుతూనే ఉండాలి. ప్రపంచకప్ విజయవంతం కావాలి. ఐసీసీ సాధించిన అతిపెద్ద విజయం ఇది.బంగ్లాదేశ్ బోర్డు కూడా ఐసీసీని ప్రశంసించింది. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమంగా క్రికెట్ ఒక్కటే అందరికీ ముఖ్యమైనది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ సజావుగా సాగాలి’’ అని రాజీవ్ శుక్లా ఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు.భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాకాగా వరల్డ్కప్ టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకొంది. భారత్లో తాము మ్యాచ్లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది.మధ్యలో ఎంటరైన పాక్ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ సైతం తాము టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి.. ఆ తర్వాత మాట మార్చింది. కేవలం టీమిండియాతో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఈ మ్యాచ్ జరుగకపోతే ఐసీసీకి భారీ ఆర్థిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.ఈ ప్రభావం బంగ్లా, పాక్లతో పాటు అన్ని సభ్య దేశాల మీదా పడుతుంది. ఈ నేపథ్యంలో లాహోర్లో పాక్, బంగ్లా బోర్డు అధికారులతో చర్చలు జరిపిన ఐసీసీ బృందం.. పాక్ భారత్తో మ్యాచ్ ఆడేలా ఒప్పించింది. ఎప్పటిలాగే ముందు నుంచి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్.. యూటర్న్ తీసుకుని టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.చదవండి: IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ
T20 WC 2026: క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డు
సౌతాఫ్రికా క్రికెట్ స్టార్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘డి’లో నుంచి సౌతాఫ్రికా- కెనడా సోమవారం పోటీపడ్డాయి.మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీఅహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లలో కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మెరుపు హాఫ్ సెంచరీ (32 బంతుల్లో 59) సాధించగా.. క్వింటన్ డికాక్ 22 బంతుల్లో 25 పరుగులు చేయగలిగాడు.మిగతా వారిలో ర్యాన్ రికెల్టన్ (21 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34 నాటౌట్) రాణించారు. ఫలితంగా సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.156 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 156 పరుగులకే పరిమితం అయింది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.క్వింటన్ డికాక్ ‘వరల్డ్’ రికార్డుఇక ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండు డిస్మిసల్స్లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్లో కెనడా ఓపెనర్లు కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా (0), యువరాజ్ సమ్రా (12) ఇచ్చిన క్యాచ్లను డికాక్ ఒడిసిపట్టాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్గా ధోని వరల్డ్ రికార్డును డికాక్ సమం చేశాడు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక డిస్మిసల్స్లో భాగమైన వికెట్ కీపర్లు వీరే🏏🧤క్వింటన్ డికాక్- 32🏏🧤ఎంఎస్ ధోని- 32🏏🧤కమ్రాన్ అక్మల్- 30🏏🧤దినేశ్ రామ్దిన్- 27🏏🧤కుమార్ సంగక్కర- 26🏏🧤జోస్ బట్లర్- 26.చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.షెడ్యూల్ ప్రకారం పాక్- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్ టోర్నీలో పాక్ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా ఓడిస్తాంపాక్తో మ్యాచ్కు ముందు మొహమ్మద్ మొహ్సిన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఈ ప్రపంచకప్ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్కప్లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్ పాక్లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.సంచలన విజయం కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ లీగ్ దశలో అమెరికా పాకిస్తాన్పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించగా.. పాక్పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్-8కు చేరగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్కప్-2026లో సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ నెదర్లాండ్స్ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్ పటేల్ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)- పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడటం ఖాయమైంది.ఐసీసీ అధికారిక ప్రకటనఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలోనూ మా వైఖరి మారలేదు.ఎలాంటి ప్రభావం ఉండదు200 మిలియన్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.తగిన ప్రమాణాలు పాటిస్తేనే బంగ్లాకు ఆ ఛాన్స్అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్ వరల్డ్కప్ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.పాక్ ఓవరాక్షన్కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ వరల్డ్కప్ టోర్నీ-2026కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలో ఆడేలా ఒప్పందం కుదిరింది. అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ బెదిరింపులకు దిగింది. దీంతో ఐసీసీ- పీసీబీతో చర్చలు జరుపగా యూటర్న్ తీసుకుని.. టీమిండియాతో ఆడేందుకు అంగీకరించింది.ఇదిలా ఉంటే.. భారత్- బంగ్లాదేశ్ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ విడుదల చేసింది. దీంతో భారత్లో తాము వరల్డ్కప్ ఆడము అని.. శ్రీలంకలో తమకు ఆడే అవకాశం ఇవ్వాలని బంగ్లా ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్ వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ.. మరోసారి ఆలోచించాలని సూచించింది.ఫైనల్గా యూటర్న్కానీ తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొనేందుకైనా సిద్ధమని బంగ్లాదేశ్ చెప్పగా.. ఐసీసీ సరేనంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. ఈ విషయంలో ఓవరాక్షన్ చేసిన పీసీబీ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అని కొత్తరాగం ఎత్తుకుంది. అయితే, శ్రీలంక, యూఏఈ, బంగ్లా బోర్డులు భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ లేఖలు రాశాయి. ఐసీసీ సైతం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. దీంతో పాక్ మాట మార్చి భారత్తో ఆడేందుకు అంగీకరించింది. చదవండి: పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
వైభవ్ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్
‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్కు వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్ కొనసాగించా’ అని చెప్పాడు అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్ మెంటార్షిప్ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్ టెండూల్కర్ ప్రేరణతోనే క్రికెటర్ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్ పట్టా. ప్లాస్టిక్ బ్యాట్తో ప్రాక్టీస్ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్ స్టైల్ చూసి మా నాన్న క్రికెట్ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్ విశ్రాంతి పోలీస్ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్ కుర్ర సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం మంచి కిక్ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్ షాట్స్ కొట్టాం. రన్ రేట్ పడిపోకుండా చూశాం. అండర్–19 ప్రపంచ కప్ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్ నుంచి ప్రపంచ కప్నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెపె్టన్సీలోనే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోరీ్నలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్ చందర్ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచి్చనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్ అకాడమీ కోచ్ విజు నాయర్ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది.
ప్రపంచ 88వ ర్యాంకర్పై దక్షిణేశ్వర్ విజయం
బెంగళూరు: సొంతగడ్డపై జరుగుతున్న డేవిస్ కప్ పురుష...
హుసాముద్దీన్కు కాంస్యం
లా నూసియా (స్పెయిన్): బాక్సమ్ ఎలైట్ ఇంటర్నేషనల్...
రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్కు రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్...
క్వార్టర్ ఫైనల్లో కథ ముగిసె!
కింగ్డావ్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపి...
ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు ...
IND vs PAK: పాక్ యూటర్న్.. స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్- పా...
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం ...
పాక్ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్
ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణ...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
కుర్రాళ్లు కుమ్మేశారు
