Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Henil Patel breathes fire as USA bowled out for 1071
చెలరేగిన భారత బౌలర్లు.. 107 పరుగులకే అమెరికా ఆలౌట్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జ‌ట్టు యువ భార‌త‌ బౌల‌ర్ల ధాటికి 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ముఖ్యంగా టీమిండియా పేస‌ర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్‌తో అమెరికా న‌డ్డి విరిచాడు.హెనిల్ 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మ‌హేష్ వంటి కీల‌క వికెట్ల‌ను హెనిల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ తలా వికెట్‌ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణఫంగా విఫలమయ్యారు.తుది జట్టు వివరాలు:భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్‌, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి

Is Ravindra Jadeja a misfit in ODI setup?2
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం

టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే స‌మాధ‌నం ఎక్కువ‌గా వినిపిస్తోంది. జ‌డేజా టెస్టు క్రికెట్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికి.. వ‌న్డేల్లో మాత్రం త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు.ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లోనూ అత‌డి ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. తొలి వ‌న్డేలో కూడా ఘోరంగా విఫ‌ల‌మైన జడేజా బుధ‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. ఈ మ్యాచ్‌లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు.బ్యాటింగ్‌లోనూ కేవ‌లం 27 ప‌రుగులు చేశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయం కార‌ణంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగ‌డంతో జ‌డేజా ఒక్క‌డే సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అక్ష‌ర్ పటేల్‌ను ఎందుకు వ‌న్డే జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేద‌ని సెలెక్ట‌ర్ల‌ను శ్రీకాంత్ ప్ర‌శ్నించాడు. జ‌డేజా పేల‌వ ఫామ్ గురుంచి కూడా అత‌డు మాట్లాడాడు."నాకు ఇష్ట‌మైన ఆట‌గాళ్ల‌లో జ‌డేజా ఒకరు. కానీ అత‌డు ప్ర‌స్తుతం పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించ‌లేక‌పోతున్నాడు. బంతిని అటాకింగ్‌గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్‌ను ట్రాప్ చేయాలా అనే విష‌యంలో అత‌డు కాస్త గంద‌ర‌గోళంగా ఉన్నాడు.ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్‌రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్‌కోట్ వన్డేలో భారత్‌కు అద‌న‌పు స్పిన్న‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌న్పించింది. అక్ష‌ర్ ప‌టేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్ష‌ర్‌ను ఎందుకు జ‌ట్టులోకి తీసుకోవ‌డం లేదు? అతడొక అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్‌. చాలా మ్యాచ్‌ల‌లో జ‌ట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబ‌ట్టి అత్యుత్త‌మ ఫామ్‌లో ఉన్న అక్ష‌ర్ ప‌టేల్‌ను జ‌ట్టులోకి తీసుకోవ‌డం బెట‌ర్" అని శ్రీకాంత్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జ‌ట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు.దీంతో మ‌రోసారి భార‌త జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ల కొర‌త క‌న్పిస్తోంది. ఇప్ప‌టికే టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన జ‌డేజా.. ఇదే ఫామ్ కొన‌సాగితే వ‌న్డేల నుంచి కూడా త‌ప్పుకొనే అవ‌కాశ‌ముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌ పేరును చాలా మంది మాజీలు సూచిస్తు‍న్నారు.చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్‌కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు.

Debutant Coles all round show powers SEC into SA20 playoffs3
ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్‌

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ జట్టు వరుసగా నాలుగో ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు జేమ్స్‌ కోల్స్‌ అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌కు గెలిపించాడు.తొలుత బ్యాటింగ్‌లో (34 బంతుల్లో 61; 10 ఫోర్లు) ఇరగదీసి, ఆతర్వాత బౌలింగ్‌లోనూ (4-0-34-2) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. కోల్స్‌, డికాక్‌ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో 18, మాథ్యూ బ్రీట్జ్కీ 3, జోర్డన్‌ హెర్మన్‌ 13, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 23 (నాటౌట్‌) పరుగులు చేశారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో డొనొవన్‌ ఫెరియెరా 2, నండ్రే బర్గర్‌, అకీల్‌ హొసేన్‌, వియన్‌ ముల్దర్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో.. ముత్తుసామి (4-0-26-3), కోల్స్‌ (4-0-34-2), మార్కో జన్సెన్‌ (3.1-0-33-2), నోర్జే (4-0-13-1), ఆడమ్‌ మిల్నే (3-0-10-1) ధాటికి సూపర్‌ కింగ్స్‌ 18.1 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టు తరఫున 30 పరుగులు చేసిన జేమ్స్‌ విన్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఐదు మంది రెండంకెల స్కోర్లు చేయగలగినా, ఒక్కరే 20 పరుగుల మార్కును దాటారు. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టు సన్‌రైజర్స్‌. పార్ల్‌ రాయల్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మిగతా ప్లే ఆఫ్స​్‌ బెర్త్‌లక కోసం పోటీ పడుతున్నాయి.

Pakistan to host australia before T20 world cup4
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్‌-పాక్‌ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్‌ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్‌కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే ఆసీస్‌ జట్టే ఈ సిరీస్‌లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్‌ కోసం పాక్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్‌, టీ20 సిరీస్‌లను ఆసీస్‌ గెలుచుకోగా.. వన్డే సిరీస్‌ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్‌ 2026 భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్‌.. టీమిండియాతో పాటు గ్రూప్‌-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్‌-బిలో ఉంది. పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.

Canada announce 15 member squad for T20 World Cup 2026, India born Dilpreet Bajwa to lead5
T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్‌గా భారతీయుడు

ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్‌ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్‌ దేశాల జట్లలో భారతీయులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్లలో సైతం భారతీయులు అవకాశాల కోసం పోటీపడుతున్నారు.న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. కనీసం ఒక్క భారత మూలాలున్న ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలికాలంలో సౌతాఫ్రికాలో సైతం భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ, ఒమన్‌, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌-2026 కోసం ఎంపిక రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్‌ జట్టు కెప్టెన్‌గా జతిందర్‌ సింగ్‌.. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్‌ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్‌ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా.. తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు. వీరే కాక ప్రపంచకప్‌ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్‌ జట్టులో ఐష్‌ సోధి, రచిన్‌ రవీంద్ర, నెదర్లాండ్‌ జట్టులో ఆర్యన్‌ దత్‌, సౌతాఫ్రికా జట్టులో కేశవ్‌ మహారాజ్‌ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్‌ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం​ చాలామంది భారతీయులు ఉన్నారు.ఇదిలా ఉంటే, భారత్‌, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్‌-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు గ్రూప్‌-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.కెనడా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు: దిల్‌ప్రీత్ బజ్వా (C), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్‌దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్‌పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్‌, శివమ్‌ శర్మ, శ్రేయస్‌ మొవ్వ, యువరాజ్‌ సమ్రా

Washington Sundar ruled out of T20I series vs NZ, T20 World Cup 2026 participation in doubt6
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కీలక ప్లేయర్‌ దూరం​

త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. న్యూజిలాండ్‌తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌.. టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్‌ ప్రపంచకప్‌లో పాల్గొనేది కూడా అనుమానంగా మారింది. న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు వరల్డ్‌కప్‌కు ఒకే జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.సుందర్‌కు ఏమైంది..?జనవరి 11న వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్‌ చేస్తుండగా సుందర్‌ ఎడమ వైపు పక్కటెముకల‌ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను ఉన్నపళంగా మైదానం వదిలి వెళ్లాడు. అయితే,‍ ఛేదనలో అతని బ్యాటింగ్‌ సేవలు జట్టుకు అవసరం ​కావడంతో రిస్క్‌ చేసి బరిలోకి దిగాడు. ఈ ప్రయత్నమే సుందర్‌ గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మ్యాచ్‌లో సుందర్‌ తనవంతుగా 7 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అనివార్యం కావడంతో బ్యాటింగ్‌ చేసిన సుందర్‌, ఆతర్వాత వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఆయుశ్‌ బదోనితో భర్తీ చేశాడు. సుందర్‌ గాయం తీవ్రత అధికంగా ఉండటంతో తాజాగా అతన్ని టీ20 సిరీస్‌ నుంచి కూడా తప్పించారు. టీ20లకు సుందర్‌ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. పరిస్థితలు చూస్తుంటే సుందర్‌ టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. పొట్టి ఫార్మాట్‌లో సుందర్‌ లాంటి కీలకమైన మిడిలార్డర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ లేకపోవడం టీమిండియా విజయావాకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. సుందర్‌ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్‌లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ సమయంలో అయినా బౌలింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు 6,7 స్థానాల్లో సైతం సమర్దవంతంగా బ్యాటింగ​్‌ చేయగలడు.రియాన్‌ పరాగ్‌ వస్తాడా..?న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు సుందర్‌కు ప్రత్యామ్నాయంగా రియాన్‌ పరాగ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పరాగ్‌ ఐపీఎల్‌ 2025లో ఓ మోస్తరుకు మించి రాణించాడు. 32.75 సగటున 393 పరుగులు చేశాడు. ఒకవేళ పరాగ్‌కు న్యూజిలాండ్‌ సిరీస్‌లో అవకాశం వచ్చి రాణిస్తే.. ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఉపఖండంలో పిచ్‌లపై స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు చాలా కీలకం​. మరోవైపు వన్డేల్లో సుందర్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్‌ బదోనీనే టీ20 సిరీస్‌కు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు.

IND VS NZ 2nd ODI: Rohit Sharma completes 7000 ODI runs in Asia7
మరో అరుదైన మైలురాయిని తాకిన రోహిత్‌ శర్మ

భారత దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని తాకాడు. ఆసియా ఖండంలో 7000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్‌ను సాధించాడు. రోహిత్‌కు ముందు సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, కుమార సంగక్కర, సనత్‌ జయసూర్య, మహేళ జయవర్దనే ఆసియాలో 7000 వన్డే పరుగుల మైలురాయిని తాకారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి వన్డేలో అద్బుత విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్‌లో చుక్కెదురైంది. పర్యాటక న్యూజిలాండ్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌ (112 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ 24, విరాట్‌ కోహ్లి 23, శ్రేయస్‌ అయ్యర్‌ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 20, హర్షిత్‌ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టియన్‌ క్లార్క్‌ 3, జేమీసన్‌, ఫౌల్క్స్‌, లెన్నాక్స్‌, బ్రేస్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. డారిల్‌ మిచెల్‌ (131 నాటౌట్‌) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు విల్‌ యంగ్‌ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్‌) ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్‌, యంగ్‌ను నిలువరించలేకపోయారు. కుల్దీప్‌ యాదవ్‌ అయితే ఒక్క వికెట్‌ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్‌, ప్రసిద్ద్‌ తలో వికెట్‌ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్‌ వేదికగా జనవరి 18న జరుగనుంది.

Team india captain shubman gill comments after losing to new zealand in second ODI at rajkot8
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్‌ కామెంట్స్‌

రాజ్‌కోట్‌ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (112 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ 24, విరాట్‌ కోహ్లి 23, శ్రేయస్‌ అయ్యర్‌ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 20, హర్షిత్‌ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో క్రిస్టియన్‌ క్లార్క్‌ 3, జేమీసన్‌, ఫౌల్క్స్‌, లెన్నాక్స్‌, బ్రేస్‌వెల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. డారిల్‌ మిచెల్‌ (131 నాటౌట్‌) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు విల్‌ యంగ్‌ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్‌) ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్‌, యంగ్‌ను నిలువరించలేకపోయారు. కుల్దీప్‌ యాదవ్‌ అయితే ఒక్క వికెట్‌ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్‌, ప్రసిద్ద్‌ తలో వికెట్‌ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సైతం తమ బౌలింగ్‌ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్‌ ఉంచినా, మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్‌ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్‌ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్‌ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్‌ చేసి, రిస్క్‌ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్‌ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్‌లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్‌లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్‌లో ఓటమి తప్పదని గిల్‌ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్‌ బౌలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్‌ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్‌ వేదికగా జనవరి 18న జరుగనుంది.

Under 19 cricket world cup 2026 starts from january 15, india to take on USA in first match9
అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్‌.. అందరి చూపు వైభవ్‌వైపే..!

జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి (జనవరి 15) అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2026 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 16 జట్లు పోటీపడుతున్నాయి. భారత్‌–యూఎస్‌ఏ మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టింది.23 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 16 జట్లు 4 గ్రూప్‌లుగా (గ్రూప్‌కు 4) విభజించబడి పోటీపడతాయి. అనంతరం సూపర్‌-6, సెమీస్‌, ఫైనల్‌ జరుగుతాయి. గ్రూప్‌ల వివరాలు- గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జపాన్ - గ్రూప్ B: భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అమెరికా - గ్రూప్ C: జింబాబ్వే, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్ - గ్రూప్ D: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, టాంజానియా ఈ టోర్నీలో భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం ఐదు సార్లు టైటిల్‌ గెలిచింది. గత ఎడిషన్‌ (2024) ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్‌కు ఆయుశ్‌ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్శనగా నిలువనున్నాడు. యువ భారత జట్టులో మరి కొంతమంది గమనించదగ్గ ఆటగాళ్లు ఉన్నారు. ఆరోన్‌ జార్జ్‌, విహాన్‌ మల్హోత్రా, వేదాంత్‌ త్రివేది, అభిగ్యాన్‌ కుందు, దీపేశ్‌ దేవేంద్రన్‌, హెనిల్‌ పటేల్‌, అంబ్రిష్‌ లాంటి వారు అద్భుత ప్రదర్శనలు చేస్తున్నారు. దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌, రోహిత్‌ శర్మ లాంటి వారు అండర్‌-19 ప్రపంచకప్‌లో మెరిసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. అందుకే ఈ టోర్నీకి చాలా ప్రత్యేకత ఉంది.ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు భారత్‌ (5) కాగా.. ఆస్ట్రేలియా 4, పాకిస్తాన్‌ 2, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ తలో సారి టైటిళ్లు గెలిచాయి. ఈ మెగా టోర్నీ భారత అభిమానుల కోసం JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇవాళ జరిగే భారత్‌-యూఎస్‌ఏ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం కానుంది. బులవాయోలోని క్వీన్స్‌ క్లబ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

Delhi Capitals sealed their first victory of the Womens Premier League 202610
ఢిల్లీ తొలి గెలుపు

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపు బోణీ కొట్టింది. బుధవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట యూపీ వారియర్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కెపె్టన్‌ మెగ్‌లానింగ్‌ (38 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో సత్తా చాటగా... హర్లీన్‌ డియోల్‌ (36 బంతుల్లో 47; 7 ఫోర్లు), లిచ్‌ఫీల్డ్‌ (20 బంతుల్లో 27; 5 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షఫాలీ వర్మ, మరిజానే కాప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్‌ రాణా, నందిని శర్మ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (44 బంతుల్లో 67; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షఫాలీ వర్మ (32 బంతుల్లో 36; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.3 ఓవర్లలో 93 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేయగా... వోల్వార్ట్‌ (25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా (21; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి వోల్వార్ట్‌ ఫోర్‌ కొట్టి గెలిపించింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో యూపీ వారియర్స్‌ ఆడుతుంది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: కిరణ్‌ నవగిరె (సి) షఫాలీ (బి) కాప్‌ 0; లానింగ్‌ (సి) హెన్రీ (బి) నందిని 54; లిచ్‌ఫీల్డ్‌ (స్టంప్డ్‌) లిజెల్లి (బి)స్నేహ్‌ రాణా 27; హర్లీన్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 47; శ్వేత (సి) శ్రీచరణి (బి) షఫాలీ 11; ట్రియాన్‌ (సి) నికీ (బి) శ్రీచరణి 1; ఎకిల్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) కాప్‌ 3; శోభన (నాటౌట్‌) 1; దీప్తి (సి) స్నేహ్‌ రాణా (బి) షఫాలీ 2; శిఖా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–0, 2–47, 3–132, 4–141, 5–143, 6–148, 7–150, 8–152. బౌలింగ్‌: కాప్‌ 4–1–24–2; మిన్ను మణి 1–0–16–0; చినెల్లి 2–0–20–0; నందిని 3–0–29–1; స్నేహ్‌ రాణా 2–0–20–1; శ్రీచరణి 4–0–29–1; షఫాలీ 4–0–16–2. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) దీప్తి (బి) శోభన 36; లిజెల్లీ (సి) కిరణ్‌ (బి) దీప్తి 67; వోల్వార్ట్‌ (నాటౌట్‌) 25; జెమీమా (సి) హర్లీన్‌ (బి) దీప్తి 21; కాప్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1–94, 2–114, 3–148. బౌలింగ్‌: క్రాంతి 2–0–10–0; శిఖ 4–0–22–0; ఎకిల్‌స్టోన్‌ 4–0– 44–0; ట్రియాన్‌ 3–0–35–0; శోభన 4–0–20–1; దీప్తి 3–0–26–2.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు