Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India beat Zimbabwe by 72 runs in T20 World Cup1
అదరగొట్టారు

భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్‌ శుభారంభం అందిస్తే, అభిషేక్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్‌ పాండ్యా, తిలక్‌ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్‌ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్‌ పంచ్‌ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్‌ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది. చెన్నై: టి20 వరల్డ్‌ కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్‌–1’ మ్యాచ్‌లో భారత్‌ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్‌ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్‌ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్‌ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు. పాండ్యా, తిలక్‌ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్‌ బ్రయాన్‌ బెన్నెట్‌ (59 బంతుల్లో 97 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు. పోటీ పడి పరుగులు... ఇన్నింగ్స్‌ రెండో బంతికే సంజు సామ్సన్‌ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్‌ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్‌ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాది అభిషేక్‌ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్‌ ధాటిగా ఆడాడు. సామ్సన్‌ వెనుదిరిగిన తర్వాత ఇషాన్‌ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది. 26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్‌ లభించగా, 26 బంతుల్లో అభిషేక్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్‌ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్‌ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్‌ ముగిసింది. 4 ఓవర్లలో 69 పరుగులు... 16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్‌ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్‌ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్‌గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్‌ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్‌ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్‌ బాదగా భారత్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్‌ సుందర్, రింకూ సింగ్‌ స్థానాల్లో అక్షర్‌ పటేల్, సంజు సామ్సన్‌ జట్టులోకి వచ్చారు. బెన్నెట్‌ పోరాటం వృథా... భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్‌ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్‌ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్‌ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టిన బెన్నెట్‌ 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్‌ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్‌ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది. 256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్‌ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) బర్ల్‌ (బి) ముజరబాని 24; అభిషేక్‌ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్‌ కిషన్‌ (సి) ఎన్‌గరవా (బి) రజా 38; సూర్యకుమార్‌ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవా 33; పాండ్యా (నాటౌట్‌) 50; తిలక్‌ (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్‌: ఎన్‌గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్‌ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్‌ 2–0–16–0, బర్ల్‌ 1–0–10–0. జింబాబ్వే ఇన్నింగ్స్‌: బెన్నెట్‌ (నాటౌట్‌) 97; మరుమని (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 20; మైయర్స్‌ (సి) తిలక్‌ (బి) వరుణ్‌ 6; రజా (సి) అభిషేక్‌ (బి) అర్‌‡్షదీప్‌ 31; బర్ల్‌ (ఎల్బీ) (బి) అర్‌‡్షదీప్‌ 0; మున్‌యోంగా (బి) అర్‌‡్షదీప్‌ 11; ముసెకివా (సి) సామ్సన్‌ (బి) దూబే 7; ఇవాన్స్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్‌ 4–0–35–1, అక్షర్‌ 4–0–35–1, దూబే 2–0–46–1. గెలిచే జట్టు సెమీస్‌కు... జింబాబ్వేపై భారత్‌ విజయంతో ‘గ్రూప్‌–1’ నుంచి సెమీఫైనల్‌ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్‌ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్‌ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్‌ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్‌ క్వార్టర్‌ ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్‌రేట్‌లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్‌ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్‌ ఎయిట్స్‌’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నిష్క్రమించింది. టి20 ప్రపంచకప్‌లో నేడుఇంగ్లండ్‌ X న్యూజిలాండ్‌ వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

South Africa beat West Indies by 9 wickets in T20 World Cup2
సెమీస్‌లో దక్షిణాఫ్రికా

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో 2024 టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్‌ ఇప్పుడు ‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్‌–2’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్‌–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్‌గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్‌ బాష్‌ (2/31) చెలరేగడంతో విండీస్‌ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్‌ (16), హెట్‌మైర్‌ (2), బ్రెండన్‌ కింగ్‌ (21), ఛేజ్‌ (2), రూథర్‌ఫర్డ్‌ (12), రావ్‌మన్‌ పావెల్‌ (9) పూర్తిగా విఫలమయ్యారు. 83/7 నుంచి విండీస్‌ జట్టును రొమారియో షెఫర్డ్‌ (37 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), హోల్డర్‌ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్‌ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్క్‌రమ్‌ (46 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడగా... డికాక్‌ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించారు. డికాక్‌తో తొలి వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్‌ మార్క్‌రమ్‌... రెండో వికెట్‌కు రికెల్టన్‌తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు. 89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్‌–హోల్డర్‌ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్‌ ప్లేయర్లు షరీఫ్‌–మోమ్‌సెన్‌ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్‌పై) కనుమరుగైంది.

Karnataka in danger of follow on in Ranji Trophy final3
శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్‌

హుబ్లీ: దేశవాళీ రంజీ టోర్నీలో కర్ణాటకది ఘనమైన చరిత్ర. ఏకంగా 8 టైటిల్స్, 6 సార్లు రన్నరప్‌తో సత్తా చాటుకుంది. ఇలా 14 ఫైనల్స్‌ ఆడిన మేటి దేశవాళీ జట్టుపై తొలిసారి ఫైనల్‌కు వచ్చిన జమ్మూకశ్మీర్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌తో, మూడో రోజు బౌలింగ్‌తో, ఇలా ఈ మూడు రోజులు జమ్మూ కశ్మీర్‌ ఆల్‌రౌండ్‌ షోనే! ముఖ్యంగా మూడో రోజైతే ఆఖిబ్‌ నబీ (14–3–32–3) ఎంతో అనుభవమున్న కర్ణాటక బ్యాటర్లను హడలెత్తించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ (13)ను ఆరంభంలోనే అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కరుణ్‌ నాయర్‌ (0), రవిచంద్రన్‌స్మరణ్‌ (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఇలా తన పేస్‌ ప్రతాపంతో జమ్మూకశ్మీర్‌ను శాసించే స్థితిలో నిలిపాడు. ప్రత్యర్థి కర్ణాటకకు ఫాలోఆన్‌ ముప్పు తెచ్చిపెట్టాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (207 బంతుల్లో 130 బ్యాటింగ్‌; 17 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా కర్ణాటక 364 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 527/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జమ్మూకశ్మీర్‌ 173.1 ఓవర్లలో 584 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు అర్ధసెంచరీ సాధించిన సాహిల్‌ లోత్రా (72; 8 ఫోర్లు) అందుబాటులో ఉన్న ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టు స్కోరు పెంచాడు. అబిద్‌ ముస్తాక్‌ (28; 3 ఫోర్లు), యుద్‌వీర్‌ సింగ్‌ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కాసేపు పోరాడటంతో జమ్మూకశ్మీర్‌ మరో 57 పరుగులు చేయగలిగింది. ప్రసిధ్‌ కృష్ణకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కర్ణాటకను నబీ వణికించాడు. కేఎల్‌ రాహుల్‌ను అవుట్‌ చేసి మయాంక్‌తో ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 50 పరుగులు దాటగానే కెప్టెన్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (11)ను సునీల్‌ కుమార్‌ పెవిలియన్‌ చేర్చాడు. 56/2 స్కోరుతో ఉన్న కర్ణాటకను నబీ తర్వాతి ఓవర్‌ కష్టాల్లోకి నెట్టేసింది. 18వ ఓవర్‌ వేసిన నబీ వరుస బంతుల్లో కరుణ్, స్మరణ్‌లను డకౌట్‌ చేశాడు. పరుగు తేడాతో ఒక్కసారిగా 57/4 స్కోరు వద్ద కర్ణాటక కుదేలైంది. ఈ దశలో మయాంక్‌... శ్రేయస్‌ గోపాల్‌ (27; 1 ఫోర్‌) అండతో ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించి కర్ణాటకను ఆదుకున్నాడు. యు«ద్‌వీర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత కృతిక్‌ కృష్ణ (27 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)తో కలిసి మయాంక్‌ జట్టు స్కోరును 200 పైచిలుకు చేర్చాడు. ఈ క్రమంలో శతకాన్ని పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు.

Kidambi Srikanth loses in German Open World Tour Super 300 badminton tournament4
శ్రీకాంత్‌ పరాజయం

ముల్హీమ్‌ అన్‌ డెర్‌ రుర్‌: జర్మన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబిశ్రీకాంత్‌ 14–21, 9–21తో లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో 9–2తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆరంభం నుంచే చైనీస్‌ తైపీ ప్లేయర్‌ ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–12, 21–11తో జిమానవ్‌స్కీ (పోలాండ్‌)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, తస్నిమ్‌ మీర్, రక్షిత శ్రీ, తన్వీ శర్మ, ఇషారాణి బారువా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.

Indian wrestler Sujeet Kalkal wins gold medal in wrestling tournament5
77 సెకన్లలోనే...

టిరానా (అల్బేనియా): ముహమెత్‌ మాలో స్మారక వరల్డ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్‌ సుజీత్‌ కల్కాల్‌ పసిడి పతకం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో సుజీత్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్‌ ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో అజర్‌బైజాన్‌ రెజ్లర్‌ రషీద్‌ బాబాజాదెను చిత్తుగా ఓడించాడు. బౌట్‌ మొదలైన 77 సెకన్లకే సుజీత్‌ 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం ప్రత్యర్థి పై 10 అంతకన్నా పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆ రెజ్లర్‌ను ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్‌ చేరే క్రమంలో సుజీత్‌ మూడు బౌట్‌లలోనూ ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలోనే గెలుపొందడం విశేషం. సెమీఫైనల్లో సుజీత్‌ 11–0తో (5 నిమిషాల 17 సెకన్లు) జోసెఫ్‌ క్రిస్టోఫర్‌ (అమెరికా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 10–0తో (4 నిమిషాల 6 సెకన్లు) నికా జకాష్విలి (జార్జియా)పై, తొలి రౌండ్‌లో 16–4తో (3 నిమిషాల 33 సెకన్లు) ఎండ్రియో అవిదిలి (అల్బేనియా)పై విజయం సాధించాడు. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్‌ సిరీస్‌ టోర్నీల్లో సుజీత్‌కిది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2022లో జుహైర్‌ ఎస్గెయిర్‌ టోర్నీలో, 2025లో పొల్యాక్‌ ఇమ్రె–వర్గా యోనస్‌ స్మారక టోర్నీలో, 2026 జాగ్రెబ్‌ ఓపెన్‌ టోర్నీలో సుజీత్‌ పసిడి పతకాలు గెలిచాడు.

Bennett 97 in vain as India beat Zimbabwe by 72 runs6
జింబాబ్వే చిత్తు.. టీమిండియా సెమీస్ ఆశ‌లు స‌జీవం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా తమ సెమీస్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో భార‌త్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. జింబాబ్వేను 72 ప‌రుగుల తేడాతో సూర్య సేన చిత్తు చేసింది. ఈ కీల‌క పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 256 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.ఇండియా బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిల‌క్ వ‌ర్మ‌(16 బంతుల్లో 44), ఇషాన్ కిష‌న్(38), సూర్య‌కుమార్ యాద‌వ్‌(33), సంజూ శాంస‌న్‌(24) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.బెన్నెట్ ఒంట‌రి పోరాటం..255 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 184 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ రియాన్ బెన్నెట్ ఒంట‌రి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 97 ప‌రుగుల‌తో ఆజేయంగా నిలిచాడు. కెప్టెన్ సికింద‌ర్ ర‌జా(31) ఫ‌ర్వాలేద‌న్పించాడు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు.

Team India creates strike rate history in IND vs ZIM match7
చ‌రిత్ర సృష్టించిన టీమిండియా

టీ20 వరల్డ్‌కప్‌-2026లో జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మన బ్యాటర్లు జూలు విధిల్చారు. చెన్నైలోని చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు.బ్యాటింగ్‌కు ప్రతీ ఒక్కరూ పరుగులు సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(55), హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. తిల‌క్ వ‌ర్మ‌(16 బంతుల్లో 44), ఇషాన్ కిష‌న్(38), సూర్య‌కుమార్ యాద‌వ్‌(33), సంజూ శాంస‌న్‌(24) రాణించారు.అయితే మొత్తం ఆరుగురు బ్యాట‌ర్లు కూడా 150+ స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయ‌డం విశేషం. త‌ద్వారా టీమిండియా ఓ అరుదైన రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 20 కంటే ఎక్కువ పరుగులు చేసి, 150+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేయడం ఇదే తొలిసారి.👉ఓ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎడిష‌న్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన జాబితాలో భార‌త్ రెండో స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా ఇప్ప‌టివ‌ర‌కు 63 సిక్సర్లు కొట్టింది. వెస్టిండీస్ 66 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంది.👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అతి తక్కువ బంతులు(26) డాట్ చేసిన జ‌ట్టుగా భార‌త్ నిలిచింది.

T20 WC IND vs ZIM: India Creates History Becomes 1st Team In World To8
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు

టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా సూర్యకుమార్‌ సేన ఈ ఫీట్‌ నమోదు చేసింది.మెరుపులుచెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో టాస్‌ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్‌ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్‌ దంచికొట్టిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.𝙈𝙖𝙥𝙤𝙨𝙖 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙡𝙡, 𝙎𝙆𝙔 𝙬𝙚𝙣𝙩 𝙛𝙪𝙧𝙩𝙝𝙚𝙧. 🚀Total control from Suryakumar Yadav as he steers India forward!ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/QZBUsVXD6e— Star Sports (@StarSportsIndia) February 26, 2026అతడి స్ట్రైక్‌రేటు 275ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్‌, తిలక్‌ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.టీమిండియా ప్రపంచ రికార్డుఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, కెప్టెన్‌ సికందర్‌ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకికాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్‌ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ లీగ్‌ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.అయితే, సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

T20 WC 2026: Tilak Varmas fiery knocks guide Team India to 256 runs9
తిల‌క్ వ‌ర్మ మెరుపులు.. కేవ‌లం 16 బంతుల్లోనే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా యువ ఆట‌గాడు తిల‌క్ వ‌ర్మ కీల‌క మ్యాచ్‌లో త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్‌-8లో తిల‌క్ విధ్వంసం సృష్టించాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. చెపాక్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ హైదరాబాదీ హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా(50 నాటౌట్‌), అభిషేక్ శర్మ(55) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మోపోసా,నగరవా, ముజర్బానీ తలా వికెట​ సాధించారు. అయితే సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగడం విశేషం.

T20 WC IND vs ZIM: Abhishek Hardik Tilak Shines IND Huge Score10
IND vs ZIM: హార్దిక్‌, తిలక్‌ విధ్వంసం.. భారత్‌ భారీ స్కోరు

జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్‌ (24) నిరాశపరచగా.. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్‌, తిలక్‌ విధ్వంసంకెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), తిలక్‌ వర్మ దంచికొట్టారు. హార్దిక్‌ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్‌ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్‌ సికందర్‌ రజా తలా ఒక వికెట్‌ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్‌ నిలిచింది. తాజాగా భారత్‌ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్‌ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement