Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rohit Sharma Minces No Words Warns Suryakumar Over Poor Form1
ఫామ్‌లోకి రాకుంటే..: సూర్యకు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

గతేడాది టీ20 ఫార్మాట్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్‌-2025 టైటిల్‌ కూడా గెలిచింది.అయితే, బ్యాటర్‌గా మాత్రం సూర్య (Suryakumar Yadav) వరుస వైఫల్యాలతో చతికిలపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన ఈ ముంబైకర్‌.. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ముందు ఈ అంశం టీమిండియాను కలవరపెడుతోంది.సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే..ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌కు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) స్పందించాడు. సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..అతడే ప్రధాన బ్యాటింగ్‌ ‘పవర్‌’‘‘కెప్టెన్‌ ఫామ్‌లో ఉన్నాడా? లేదా? అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ఆటగాడు ఫామ్‌లో లేకుంటే.. మనకు ఏడు నుంచి ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే, మనకున్న ప్రధాన బ్యాటింగ్‌ ‘పవర్‌’ తడబాటుకు లోనైతే పరిస్థితి కఠినంగా మారుతుంది.ప్రణాళికలు, వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వీలుకాదు. అనుకున్నంత ప్రభావం చూపలేకపోవచ్చు. ఒకవేళ సూర్య గనుక సరిగ్గా ఆడకపోతే.. బ్యాటింగ్‌ లైనప్‌ కచ్చితంగా ఇబ్బంది పడుతుంది’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.కెప్టెన్సీపై ప్రశంసలుఅయితే, కెప్టెన్‌గా మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌కు వంక పెట్టేందుకు ఏమీ లేదని రోహిత్‌ శర్మ ప్రశంసించాడు. ‘‘ఆట పట్ల సూర్యకు మంచి అవగాహన ఉంది. తన జట్టులోని ఆటగాళ్లలో అత్యుత్తమం ఎవరన్నది అతడికి బాగా తెలుసు. వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో కూడా అతడికి తెలుసు’’ అని సూర్య కెప్టెన్సీని కొనియాడాడు. రోహిత్‌ స్థానంలోకాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఈ క్రమంలో రోహిత్‌ స్థానంలో టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 జరుగనుండగా.. చివరి సన్నాహకంగా భారత్‌ న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!“SKY knows the game. He knows the players.” 💙@ImRo45 highlights @surya_14kumar's form and impact, calling him a critical batter whose presence brings balance and confidence to India’s batting lineup. 🔑🔥Why is SKY central to India’s success on the biggest stage? 🤔Watch it… pic.twitter.com/JEXFzIPhWA— Star Sports (@StarSportsIndia) January 20, 2026

Will Not bow down to pressure from ICC: Bangladesh Sports advisor2
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్‌

భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్‌ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మా బదులు స్కాట్లాండ్‌ ఆడుతుందా?‘మా స్థానాన్ని స్కాట్లాండ్‌ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్‌ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్‌ నిరాకరిస్తే... వారి మ్యాచ్‌ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్‌ అన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ జట్టు గ్రూప్‌ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ కోరింది. స్పందించని ఐసీసీగ్రూప్‌ ‘బి’లో ఉన్న ఐర్లాండ్‌ జట్టు లీగ్‌ దశలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్‌ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి బంగ్లాదేశ్‌ గ్రూప్‌ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..!

Indian Athletes Thrown Off Train3
‘పోల్‌ వాల్ట్‌’ అథ్లెట్లకు అవమానం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు... పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు నెలకొలి్పన అథ్లెట్‌కు రైల్వే స్టేషన్‌లో అవమానం జరిగింది. టోర్నమెంట్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో క్రీడా సామగ్రితో కలిసి రైలులో ప్రయణించినందుకు గానూ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పన్వేల్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకోగా... సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. అసలేం జరిగిందంటే... మంగళూరు వేదికగా జరిగిన ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రికార్డు హోల్డర్‌ దేవ్‌ కుమార్‌ మీనాతో పాటు అతడి కోచ్‌ ఘన్‌శ్యామ్‌కు రైల్వే స్టేషన్‌లో వింత సమస్య ఎదురైంది. మంగళూరు నుంచి వస్తున్న సమయంలో ప్లేయర్లంతా తమ ‘పోల్‌’లను ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైలులోని ఫ్యాన్‌ల పైభాగంలో ఉంచారు. అయితే ఇది గమనించిన ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ)... ‘పోల్‌’లను ఇలా తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని వారిని రైలు నుంచి దింపాడు. రూ. 8 వేల జరిమానా కట్టాల్సిందేనని... లేకుంటే పోల్స్‌ తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొన్నట్లు వెల్లడించినా... రైల్వే అధికారులు వినలేదు. సుమారు ఐదు గంటల పాటు అథ్లెట్లను మానసిక వేదనకు గురిచేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘మేము మంగళూరు నుంచి వస్తున్నాం. పన్వేల్‌ నుంచి భోపాల్‌ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రైల్వే సిబ్బంది మా క్రీడా సామగ్రిని తొలగించాలని చెప్పారు. అవి పోల్‌ వాల్ట్స్‌ అని... మేము టోర్నమెంట్‌లో పాల్గొని వస్తున్నామని వారికి చెప్పాం. అయితే క్రీడా సామాగ్రిని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో వేయాలని... ఇలా ప్రయాణికులతో పాటు వాటిని ఉంచకూడదని చెప్పారు. పోల్‌వాల్ట్‌ కోసం వినియోగించే పోల్స్‌ ఫైబర్‌తో తయారవుతాయి. వాటి ధర కూడా ఎక్కువే. లగేజీలో వేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే గతంలోనూ వాటిని మాతో పాటే తీసుకొని ప్రయాణించాం. ఎంత చెప్పినా అధికారులు అర్థం చేసుకోలేదు. పెద్ద ఎత్తున జరిమానా కట్టాలని ఒత్తిడి చేశారు. చివరకు దాదాపు 2 వేల రూపాయల జరిమానా అనంతరం మమ్మల్ని వదిలేశారు. ఇది మమ్మల్ని ఎంతగానో బాధించింది’ అని కోచ్‌ ఘన్‌శ్యామ్‌ వెల్లడించారు. దేవ్‌ కుమార్‌ మీనా గతేడాది జర్మనీ వేదికగా జరిగిన ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో 5.40 మీటర్ల ఎత్తు దూకి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టాడు. కాగా రైల్వే శాఖ దీనిపై స్పందిస్తూ... ‘ప్లేయర్ల మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. మేము అథ్లెట్లను గౌరవిస్తాం. ఒక్కో పోల్‌ 5 మీటర్ల కంటే పొడవు ఉంది. దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాం’ అని వివరణ ఇచి్చంది. ఇది ఈ ఒక్కసారి ఎదురైన సమస్య కాదని... ప్రయాణ సమయంలో ప్రతీసారి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అథ్లెట్లు వాపోతున్నారు. క్రీడా పరికరాలను తీసుకెళ్లే విషయంలో కచి్చతమైన నియమాలను రూపొందించాలని కోరుతున్నారు.

India vs New Zealand first T20 on Jan 21 in Nagpur4
ఫైనల్‌ రిహార్సల్‌...

భారత జట్టు 2024లో టి20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వరుసగా ఎనిమిది సిరీస్‌లలో విజేతగా నిలిచింది. సరిగ్గా చెప్పాలంటే 36 మ్యాచ్‌లు ఆడితే 29 గెలిచి, 5 మాత్రమే ఓడిందంటే టీమ్‌ ఎలాంటి ఫామ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో వరల్డ్‌కప్‌ టైటిల్‌ వేటలో చివరి రిహార్సల్‌గా సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో పోరుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ విజయాల పర్వంలో తాము ఒక్కసారి కూడా తలపడని న్యూజిలాండ్‌ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉంది. సంచలనాల కివీస్‌ను రెండేళ్లుగా టి20ల్లో భారత్‌ ఎదుర్కోలేదు. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఫలితం తర్వాత ఇప్పుడు టి20 సిరీస్‌ ఆసక్తిని రేపుతోంది.నాగ్‌పూర్‌: టి20 వరల్డ్‌ కప్‌కు ముందు చివరి సన్నాహకం కోసం భారత్, న్యూజిలాండ్‌ సన్నద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరగనుంది. ఇటీవల సిరీస్‌ ఆడిన వన్డే టీమ్‌తో పోలిస్తే ఒకరిద్దరు మినహా భారత బృందం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్‌ కూడా రెగ్యులర్‌ సభ్యులు అందుబాటులోకి రావడంతో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.టి20 వరల్డ్‌ కప్‌ ఇక్కడే జరగనుండటం, రెండు టీమ్‌లు కూడా ఐసీసీ టోరీ్నలో ఆడే టీమ్‌నే దాదాపుగా ఎంపిక చేయడంతో ఈ సిరీస్‌ సరైన ప్రాక్టీస్‌ కానుంది. తమ బలాబలాలను అంచనా వేసుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపై కూడా జట్లు దృష్టి పెట్టాయి. అనూహ్యంగా వన్డే సిరీస్‌ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగిన న్యూజిలాండ్‌ను భారత్‌ తక్కువగా అంచనా వేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. స్టార్లంతా సిద్ధం... బుమ్రా వచ్చేశాడు, హార్దిక్‌ పాండ్యా కూడా వచ్చాడు... మెరుపు ఆరంభాలకు అభిషేక్‌ శర్మ, సామ్సన్‌ కూడా సిద్ధం. ఎప్పటిలాగే భారత టి20 జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో ప్రతీ ఆటగాడు ఒంటిచేత్తో విజయం అందించే స్థాయిలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. బుమ్రా, పాండ్యాలు సత్తా చాటితే టీమిండియాకు ఎదురే ఉండదు. శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్‌ వర్మకు బదులుగా శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినా... మూడో స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఆడతాడని కెప్టెన్‌ సూర్యకుమార్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో కూడా సందేహాలు లేవు.ఏడు, ఎనిమిది స్థానాల్లో హిట్టర్లు రింకూ సింగ్, శివమ్‌ దూబే ఆడటం అంటే జట్టు బ్యాటింగ్‌ లోతు ఏమిటో తెలుస్తోంది. ఇద్దరు రెగ్యులర్‌ స్పిన్నర్లుగా కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి భారం మోస్తారు. వన్డే సిరీస్‌లో కుల్దీప్‌ ప్రభావం చూపకపోయినా... టి20ల్లో ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థుడు. ఇన్ని సానుకూలతల మధ్య ఏదైనా ఆందోళన ఉందంటే అది కెప్టెన్‌ సూర్య ఫామ్‌ గురించి మాత్రమే. గత 22 ఇన్నింగ్స్‌లలో అతను అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. జట్టు సారథిగా, విధ్వంసకర బ్యాటర్‌గా తనకున్న గుర్తింపును ప్రదర్శించేందుకు ఈ సిరీస్‌ అతనికి సరైన వేదిక. కెరీర్‌లో ఇది సూర్యకు 100వ టి20 మ్యాచ్‌ కానుంది. మిచెల్, ఫిలిప్స్‌పై దృష్టి... న్యూజిలాండ్‌ వన్డేల తరహాలో ఈ సిరీస్‌ కోసం కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన డరైల్‌ మిచెల్, గ్లెన్‌ ఫిలిప్స్‌ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. టి20ల్లో మిచెల్‌కు కూడా మెరుగైన రికార్డు ఉండగా, ఫిలిప్స్‌ దూకుడుకు మారుపేరు. వన్డేల్లో విఫలమైన కాన్వే ఇక్కడ మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. కివీస్‌ కూడా పలువురు టి20 స్పెషలిస్ట్‌లు చాప్‌మన్, డఫీ, సోధిలకు అవకాశం కల్పిస్తోంది. పేసర్‌ డఫీ చక్కటి ఫామ్‌లో ఉండగా... రచిన్‌ రవీంద్ర, కెప్టెన్‌ సాంట్నర్‌ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ్రస్టేలియాపై మెరుపు సెంచరీ చేసిన రాబిన్సన్‌ ఓపెనర్‌గా చెలరేగిపోగలడు. 1210 భారత్, న్యూజిలాండ్‌ మధ్య మొత్తం 25 టి20లు జరగ్గా... భారత్‌ 12 గెలిచి 10 ఓడింది. మరో 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. భారత్‌లో 2017, 2023లలో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు జరగ్గా... రెండూ భారత్‌ గెలిచింది.తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, పాండ్యా, అక్షర్, రింకూ, దూబే, కుల్దీప్, బుమ్రా, వరుణ్‌. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), రాబిన్సన్, కాన్వే, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్‌మన్, నీషమ్, హెన్రీ, సోధి, డఫీ. పిచ్, వాతావరణంబ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలించే మంచి స్పోర్టింగ్‌ వికెట్‌. అయితే స్పిన్నర్లు కొంత అదనపు ప్రభావం చూపగలరు. దేశంలో పెద్ద బౌండరీలు ఉన్న మైదానాల్లో ఒకటి కాబట్టి భారీ స్కోర్లు కష్టం. వర్షం సమస్య లేదు.సినెర్‌ గెలుపు బోణీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌ఐపీఎల్‌లో ‘జెమినై’రూ. 270 కోట్లతో ఒప్పందంన్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్పాన్సర్ల సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థ కూడా చేరింది. గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్‌ ‘జెమినై’ ఐపీఎల్‌లో భాగస్వామిగా మారుతూ బీసీసీఐతో జత కట్టింది. ఇందు కోసం మూడేళ్ల కాలానికి ‘జెమినై’ రూ. 270 కోట్లు చెల్లిస్తుంది. భారత క్రికెట్‌లో ఏఐ ప్లాట్‌ఫామ్‌ల పాత్ర పెరిగేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో మరో ప్రముఖ సంస్థ, ‘జెమినై’కి పోటీదారు అయిన చాట్‌ జీపీటీ ఇప్పటికే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో స్పాన్సర్‌గా ఉండటం విశేషం. గత నవంబర్‌లోనే బీసీసీఐ ఈ ఒప్పందం చేసుకుంది. 2026 ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 26 నుంచి మే 31 వరకు జరుగుతుంది.

WPL 2026: Delhi Capitals beat Mumbai Indians by seven wickets5
ఢిల్లీని గెలిపించిన జెమీమా

వడోదర: జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టేన్‌ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (45 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టేన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు.21 పరుగుల వద్దే ఓపెనర్లు సజన (9), హేలీ మాథ్యూస్‌ (12) నిష్క్రమించగా... హర్మన్, బ్రంట్‌ మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లీజెల్లి లీ (28 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్‌), షఫాలీ వర్మ (29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 63 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. ముంబైకిది ‘హ్యాట్రిక్‌’ పరాజయం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన హర్మన్‌ బృందం కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో యూపీ వారియర్స్‌ తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సజన (బి) నందిని 9; హేలీ మాథ్యూస్‌ (బి) మరిజాన్‌ కాప్‌ 12; నాట్‌ సీవర్‌ (నాటౌట్‌) 65; హర్మన్‌ప్రీత్‌ (సి) హామిల్టన్‌ (బి) శ్రీచరణి 41; నికోలా కేరీ (సి) స్నేహ్‌ రాణా (బి) శ్రీచరణి 12; అమన్‌జోత్‌ (సి) లీజెల్లి (బి) శ్రీచరణి 3; సంస్కృతి (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–21, 3–99, 4–130, 5–134.బౌలింగ్‌: మరిజాన్‌ 4–0–8–1, హామిల్టన్‌ 4–0– 36–0, నందిని శర్మ 4–0–36–1, శ్రీచరణి 4–0– 33–3, స్నేహ్‌ రాణా 3–0–27–0, షఫాలీ వర్మ 1–0–14–0ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (బి) వైష్ణవి 29; లీజెల్లి లీ (స్టంప్డ్‌) రహిలా (బి) అమన్‌జోత్‌ 46; వోల్వార్డ్‌ (రనౌట్‌) 17; జెమీమా (నాటౌట్‌) 51; మరిజాన్‌ కాప్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–63, 2–84, 3–118.బౌలింగ్‌: షబి్నమ్‌ 4–0–26–0, నికోలా 1–0–13–0, నాట్‌ సీవర్‌ 4–0–42–0, సంస్కృతి 1–0–13–0, అమన్‌జోత్‌ 3–0–21–1, వైష్ణవి 4–0–20–1, హేలీ 2–0–19–0.

ECB to sack Brendon McCullum as England head coach after T20 World Cup 2026: Reports6
బ్రెండన్ మెకల్లమ్‌పై వేటు.. ముహూర్తం ఫిక్స్‌!

ఇంగ్లండ్ 'బాజ్‌బాల్' వ్యూహం ఆస్ట్రేలియా గడ్డపై బెడిసికొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లీష్‌ జ‌ట్టు కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క‌ఠిన నిర్ణ‌యాలు దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌పై వేటు వేసేందుకు ఈసీబీ సిద్దమైనట్లు సమాచారం.మెకల్లమ్ కాంట్రాక్ట్‌ను పొడిగించే యోచ‌న‌లో ఈసీబీ లేదంట‌. 'ది టెలిగ్రాఫ్' కథనం ప్రకారం.. టీ20 వరల్డ్ కప్-2026 తర్వాత మెక్‌క‌ల్ల‌మ్‌ను హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టుకు ఆల్‌ఫార్మాట్ హెడ్ కోచ్‌గా కొన‌సాగుతున్నాడు. తొలుత కేవ‌లం టెస్టు జ‌ట్టు హెడ్‌కోచ్‌గా మాత్ర‌మే కొన‌సాగిన మెక్‌క‌ల్ల‌మ్‌.. గతేడాది వైట్‌బాల్ క్రికెట్‌లో ప్ర‌ధాన కోచ్ ప‌గ్గాలు చేప‌ట్టాడు.అయితే మెకల్లమ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ జట్టు ఆటతీరులో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మెకల్లమ్‌ అప్పుడే కొత్తగా టెస్టు కెప్టెన్ అయిన బెన్‌ స్టోక్స్‌తో కలిసి ‘బాజ్‌బాల్‌’కు శ్రీకారం చుట్టాడు. ‘బాజ్‌’ అన్నది మెకల్లమ్‌ ముద్దుపేరు. టీ20 శైలిలో దూకుడుగా ఆడుతూ టెస్టు క్రికెట్ రూపరేఖలనే ఇంగ్లండ్ మార్చేసింది.స్టోక్స్‌-మెకల్లమ్‌ ద్వయం కొన్నాళ్లపాటు అద్భుతం చేసింది. కానీ నెమ్మదిగా బాజ్‌బాల్‌కు బీటలు పడ్డాయి. ఇంగ్లీష్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. ఐసీసీ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొం‍టోంది. ప్రతిష్టత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ వరుసగా రెండోసారి కోల్పోయింది.అంతేకాకుండా జట్టు ఆన్‌ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ క్రమశిక్షణ కూడా లోపించింది. ఆసీస్ పర్యటన మధ్యలో ఆటగాళ్లు 'నూసా' (Noosa) రిసార్ట్‌కు వెళ్లడం, అక్కడ మితిమీరిన విందు వినోదాల్లో పాల్గొనడం వంటి అంశాలపై కూడా తీవ్ర స్దాయిలో విమర్శలు వచ్చాయి. ఆటగాళ్లకు మెకల్లమ్‌ అనుసరిస్తున్న తీరు జట్టు క్రమశిక్షణను దెబ్బతీస్తోందని ఇంగ్లండ్ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడిని తప్పించేందుకు ఈసీబీ సిద్దమైంది. ఒకవేళ మెక్‌కల్లమ్ స్ధానంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

WPL 2026: Delhi capitals bowlers restricted mumbai indians to 154 runs7
చెలరేగిన బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్‌

మహిళల ఐపీఎల్‌ 2026లో (WPL) ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య కీలకమైన మ్యాచ్‌ జరుగుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్‌ మారిజాన్‌ కాప్‌ (4-0-8-1) అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసి ముంబై ఇండియన్స్‌ స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. కాప్‌తో పాటు శ్రీ చరణి (4-0-33-3), నందిని శర్మ (4-0-36-1) కూడా సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లూసీ హ్యామిల్టన్‌ (4-0-36-0), స్నేహ్‌ రాణా (3-0-27-0) ఓ మోస్తరు ప్రదర్శన చేశారు. షఫాలీ వర్మ ఓ ఓవర్‌ వేసి 14 పరుగులు సమర్పించుకుంది. ముంబై ఇండియన్స్‌ బ్యాటర్లలో నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (65 నాటౌట్‌) అజేయ అర్ద శతకంతో రాణించింది. ఆమెకు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41) సహకరించింది. వీరిద్దరు సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో సంజీవన్‌ సజనా (9), హేలీ మాథ్యూస్‌ (12), నికోలా కేరీ (12), అమన్‌జోత్‌ కౌర్‌ (3) స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆఖర్లో సంస్కృతి గుప్త (10 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి, ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.పేరుకు రెండో స్థానంలో ఉన్నా, ముంబైకి ఈ స్థానం గ్యారెంటీ కాదు. ఎందుకంటే మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉన్నాయి. యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో తలా రెండేసి విజయాలు సాధించి మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.

New Zealand Playing XI vs India, 1st T20I, 2026: Biggest enemy in, 4th highest wicket taker out8
భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్‌ తుది జట్టు ఇదే..!

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్‌ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.ఓపెనర్లుగా టిమ్‌ రాబిన్సన్‌, డెవాన్‌ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్‌ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం​ ఊరట కలిగించే అంశం. ఫస్ట్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. వన్‌డౌన్‌లో రచిన్‌ రవీంద్ర రావడం​ కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్‌ చేస్తుంది.న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్‌ మిచెల్‌, ఆతర్వాత మార్క్‌ చాప్‌మన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.లోయర్‌ ఆర్డర్‌ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కమ్‌ బ్యాటర్‌గా మిచెల్‌ సాంట్నర్‌ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్‌ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్‌ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్‌ ఫామ్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్‌ పేస్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.ఐష్‌ సోది డౌటే..!భారత్‌పై ఐష్‌ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్‌మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్‌ సా​ంట్నర్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, టిమ్‌ రాబిన్సన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌.

IND vs NZ 2026: Suryakumar Yadav confirms Ishan Kishan's batting position for first T20I9
న్యూజిలాండ్‌తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్‌ కీలక ప్రకటన

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్‌ అప్‌డేట్‌ అందుతుంది. ఈ మ్యాచ్‌లో పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ప్రకటించాడు.ISHAN KISHAN LOCKED 🔐 - Ishan will bat at 3 tomorrow for India. 🇮🇳pic.twitter.com/rHXco5dmLN— Johns. (@CricCrazyJohns) January 20, 2026రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్‌‌పై మేనేజ్‌మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్‌ జట్టులోకి వస్తే, శ్రేయస్‌ అయ్యర్‌ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు. తిలక్‌ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ అయిన ఇషాన్‌ భర్తీ చేయగలడని మేనేజ్‌మెంట్‌ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్‌ కంటే ఇషాన్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్‌ మాటల ద్వారా స్పష్టమవుతుంది.ఇషాన్‌ చివరిగా 2023లో భారత్‌ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్‌కు ఇషాన్‌ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్‌ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జట్టులోకి వచ్చినా తిలక్‌ గాయపడకుంటే, ఇషాన్‌కు అవకాశం​ వచ్చేది కాదు. తిలక్‌ గాయం ఇషాన్‌కు కొత్త లైఫ్‌ ఇచ్చినట్లైంది.వరల్డ్ కప్‌కు ముందు కీలక సిరీస్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్‌ ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్‌ జట్టునే ఈ సిరీస్‌కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్‌కు ముందు భారత్‌ న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన వారిలో తిలక్‌ వర్మతో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ కూడా గాయపడ్డాడు. తిలక్‌ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌, సుందర్‌ స్థానాన్ని రవి బిష్ణోయ్‌ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి రావచ్చు.షెడ్యూల్‌..తొలి టీ20- నాగ్‌పూర్‌రెండో టీ20- రాయ్‌పూర్‌మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురం

Kamalini ruled out of WPL, Vaishnavi Sharma named replacement10
ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

డబ్ల్యూపీఎల్‌ 2026 ఎడిషన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం​ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్‌ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.17 ఏళ్ల కమిలిని ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.వైష్ణవి శర్మతో భర్తీ 20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్‌-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. డబ్ల్యూపీఎల్‌ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్‌ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు చాలా కీలకం.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement