Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

 Abhishek Sharma, Rinku Singh star as India beat New Zealand by 48 runs1
తొలి టీ20లో భారత్‌ ఘన విజయం

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్‌(24 బంతుల్లో 44 నాటౌట్‌), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్‌, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్‌, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్‌ స్టార్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్‌ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్‌మన్‌(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, అర్ష్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్‌పూర్‌ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌

IND VS NZ 1st T20I: Surya kumar yadav completes 9000 runs in t20s2
అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్‌

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్‌.. పొట్టి క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్‌లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో విరాట్‌ కోహ్లి (271 ఇన్నింగ్స్‌లు), శిఖర్‌ ధవన్‌ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ పేరిట ఉంది. బాబర్‌ కేవలం 245 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. అభిషేక్‌ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్‌ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ అతి భారీ స్కోర్‌ (238/7) చేసింది.మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్‌.ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ (10), ఇషాన్‌ కిషన్‌ (8), శివమ్‌ దూబే (9), అక్షర్‌ పటేల్‌ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు తొలి ఓవర్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్‌ డెవాన్‌ కాన్వేను (0) ఔట్‌ చేశాడు. రెండో ఓవర్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్‌ పాండ్యా రచిన్‌ రవీంద్రను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 39-2గా ఉంది. రాబిన్సన్‌ (19), గ్లెన్‌ ఫిలిప్స్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి.

IND VS NZ 1st T20I: Abhishek slams blasting 84, Team india set 239 runs target3
అభిషేక్‌ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌

నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్‌ (238/7) చేసింది. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్‌కు జతగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్‌ భారీ స్కోర్‌ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ 10, ఇషాన్‌ కిషన్‌ 8, శివమ్‌ దూబే 9, అక్షర్‌ పటేల్‌ 5, అర్షదీప్‌ (6 నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జేమీసన్‌ చెరో 2.. క్రిస్టియన్‌ క్లార్క్‌, సోధి, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

Abhishek Sharma has the fastest fifty by an Indian vs New Zealand in T20I history4
అభిషేక్‌ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!

నాగ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్‌ రాహుల్‌ పేరిట ఉండేది. రాహుల్‌ 2020లో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్‌కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్‌ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్‌ తర్వాతి స్థానాల్లో ఫిల్‌ సాల్ట్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఎవిన్‌ లూయిస్‌ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్‌ సోధి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్‌ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో (33 ఇన్నింగ్స్‌లు) 2 సెంచరీలు, 7 హాఫ్‌ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్‌రేట్‌తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి న్యూజిలాండ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్‌కే ఔటైనా అభిషేక్‌ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్‌ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్‌ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్‌) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్‌ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హార్దిక్‌ (14 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్‌ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 185/5గా ఉంది.

ICC rejects BCB's request to relocate T20 WC matches5
బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ

భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్‌ మ్యాచ్‌ల వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్‌ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్‌ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఓవరాక్షన్‌ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్‌ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్‌కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్‌ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్‌లైన్‌ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్‌ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం​ జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్‌-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది.

IND VS NZ 1st T20I: New Zealand won the toss and choose to bowl, here are playing XI6
భారత్‌తో తొలి టీ20.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్‌, డఫీ ఉన్నారు.మరోవైపు భారత్‌ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీభారత్‌: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

Ben Mayes creates history for England at U19 World Cup 20267
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌

ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ బెన్‌ మేస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో మేస్‌ కేవలం 65 బంతుల్లో శతక్కొట్టి, మొత్తంగా 117 బంతుల్లో 191 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. మేస్‌ మరో రెండు పరుగులు చేసుంటే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఏ జట్టు తరఫున అయిన అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించి ఉండేవాడు. ఈ ప్రపంచ రికార్డు శ్రీలంక ఆటగాడు విరాన్ చముదిత పేరిట ఉంది. విరాన్‌ ఇదే ఎడిషన్‌లో జపాన్‌పై 192 పరుగుల చేశాడు. మేస్‌.. మరో శ్రీలంక ఆటగాడు హసిత బోయగోడాతో కలిసి ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. హసిత కూడా మేస్‌ లాగే 191 పరుగుల వద్ద ఆగిపోయాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మేస్‌ భారీ శతకంతో పాటు ఓపెనర్‌ జోసఫ్‌ మూర్స్‌ (81) అర్ద సెంచరీతో రాణించాడు. లోయర్‌ మిడిలార్డర్‌ ఆటగాడు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్‌ 400 పరుగుల మైలురాయిని తాకింది. కెప్టన్‌ థామస్‌ రూ 22, కాలెబ్‌ ఫాల్క్‌నర్‌ 32, రాల్ఫీ ఆల్బర్ట్‌ 13, ఫర్హాన్‌ అహ్మద్‌ 15 (నాటౌట్‌), సెబాస్టియన్‌ మోర్గాన్‌ 24 (నాటౌట్‌) పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ బెన్‌ డాకిన్స్‌ 5 పరుగులకే ఔటయ్యాడు.స్కాట్లాండ్‌ బౌలర్లలో జేక్‌ వుడ్‌హౌస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫిన్లే జోన్స్‌ 2, మ్యాక్స్‌ ఛాప్లిన్‌ ఓ వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్‌ తడబడుతుంది. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 48 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. మనూ సరస్వత్‌ (6), మ్యాక్స్‌ ఛాప్లిన్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అలెక్స్‌ గ్రీన్‌, లూక్‌ హ్యాండ్స్‌, ఫర్హాన్‌ అహ్మద్‌కు తలో వికెట్‌ దక్కింది.కాగా, ప్రస్తుత ఎడిషన్‌ ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. మరోవైపు స్కాట్లాండ్‌.. జింబాబ్వేతో ఆడాల్సిన తమ తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. రెండో మ్యాచ్‌లో ఆ జట్టు పాకిస్తాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది.

100th T20I MATCH FOR INDIAN CAPTAIN SURYAKUMAR YADAV8
సూర్యకుమార్‌ యాదవ్‌ సెంచరీ

భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన స్కై.. న్యూజిలాండ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌తో మ్యాచ్‌ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.భారత క్రికెట్‌లో ఇప్పటివరకు రోహిత్‌ శర్మ (159), విరాట్‌ కోహ్లి (125), హార్దిక్‌ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని తాకారు.మరో చారిత్రక మైలురాయి దిశగా..మ్యాచ్‌ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 346 మ్యాచ్‌ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్‌లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం రోహిత్‌ శర్మ (547), విరాట్‌ కోహ్లి (435) మాత్రమే సాధించారు.పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యనేటి మ్యాచ్‌లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్‌ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్‌గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్‌ను ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే అతని కెరీర్‌ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.ఇదిలా ఉంటే, భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌ జరుగనుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

Don't be surprised if he Takes over the captaincy: Clarke on India Star9
టీమిండియా టీ20 కెప్టెన్‌గా అతడే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీమిండియా బరిలో దిగనుంది. సొంతగడ్డపై ఈ ఐసీసీ ఈవెంట్‌ జరుగనుండటం సూర్యకుమార్‌ సేనకు మరో సానుకూలాంశం. ఇక ఈ మెగా టోర్నీకి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్‌ పాల్గొననుంది.ఇదిలా ఉంటే.. కివీస్‌తో పాటు ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టు నుంచి సెలక్టర్లు శుబ్‌మన్‌ గిల్‌ను తప్పించిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20లలోకి తిరిగి వచ్చి వరుసగా విఫలం కావడమే ఇందుకు కారణం.అద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్‌కప్‌ టోర్నీ తర్వాత గిల్‌ భారత టీ20 జట్టులోకి తిరిగి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌ కూడా అవుతాడని అంచనా వేశాడు. ఈ సందర్భంగా గిల్‌ అద్భుతమైన ఆటగాడు అని క్లార్క్‌ ప్రశంసలు కురిపించాడు.ఫామ్‌లేమి కారణంగానేబియాండ్‌23క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ అతడు పోటీలోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టుకు అవసరమైన రీతిలో అతడు బ్యాటింగ్‌ చేయడం లేదన్న కారణంగా పక్కనపెట్టారు. అంతేకాదు.. టీమిండియాకు లెక్కకు మిక్కిలి ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆప్షన్లు ఉన్నాయి.ప్రస్తుతం అతడు కెప్టెన్‌ కూడా కాదు. అందుకే వరల్డ్‌కప్‌ జట్టు నుంచి అతడిని తొలగించే సాహసం చేశారు. ప్రపంచకప్‌ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న న్యూజిలాండ్‌ సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఫామ్‌లేమి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదుఅయితే, ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత గిల్‌ జట్టులోకి తిరిగి రావడమే కాదు.. కెప్టెన్సీ చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అతడొక అద్భుతమైన ప్లేయర్‌. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేకపోవచ్చు. అయితే, కెప్టెన్‌ అయ్యేందుకు అతడికి అర్హత ఉంది. ప్రస్తుతానికి వరల్డ్‌కప్‌ టోర్నీ మీద దృష్టి పెట్టినందు వల్లే మేనేజ్‌మెంట్‌ అతడిని తప్పించింది’’ అని క్లార్క్‌ అభిప్రాయపడ్డాడు.రోహిత్‌ స్థానంలో సూర్య, గిల్‌ కాగా రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌ భారత టీ20 జట్టు సారథిగా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక టెస్టుల్లో రోహిత్‌ రిటైర్మెంట్‌ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ పగ్గాలు చేపట్టగా.. గతేడాది వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. అయితే, క్లార్క్‌ అభిప్రాయపడినట్లు వరల్డ్‌కప్‌ తర్వాత గిల్‌ సూర్య స్థానాన్ని భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్‌-2026 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC: సూర్యకుమార్‌ యాదవ్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

U19 World Cup 2026: Malajczuk record ton sets up Australia win10
చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ బ్యాటర్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ విల్ మలాజ్‌చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్‌-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు ఖాసిం అక్రమ్‌ పేరిట ఉండేది. ఖాసిమ్‌ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్‌ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్‌ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్‌చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్‌ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హ్యూగో కెల్లీ (79 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్‌ పర్మార్‌ (33), చార్లెస్‌ హి​ంజ్‌ (24), హర హింజ్‌ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్‌ బౌలర్లలో కూరే 3, విల్‌ బైరోమ్‌ 2, ఆర్యన్‌ శర్మ, కేసీ బార్టన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. మలాజ్‌చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ (60 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్‌ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement