Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Who Is James Coles, The Most Expensive Player Of The Hundred 2026 Auction1
జాక్‌పాట్‌ కొట్టిన ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌

తొలిసారి నిర్వహించిన హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఓ అనామక ఆటగాడు జాక్‌పాట్‌ కొట్టాడు. క్రికెట్‌ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ససెక్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ను లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీ ఏకంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 4.8 కోట్లు) సొంతం చేసుకుంది. 75 వేల పౌండ్ల బేస్‌ప్రైజ్‌ విభాగంలో వేలంలో బరిలోకి దిగిన 21 ఏళ్ల కోల్స్‌ కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు (బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌, మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌) తీవ్రంగా పోటీపడ్డాయి. 35 బిడ్డింగ్‌ రౌండ్ల అనంతరం లండన్‌ స్పిరిట్‌ అతన్ని ఊహించని ధరకు దక్కించుకుంది.లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ కమ్‌ డాషింగ్‌ బ్యాటర్‌ అయిన కోల్స్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26తో వెలుగులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో అతను టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 16 ఏళ్లకే ససెక్స్‌ తరఫున అరంగేట్రం చేసిన కోల్స్‌.. ఈ కౌంటీ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.చిన్న వయసులోనే 51 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ కలిగిన కోల్స్‌.. 82 ఇన్నింగ్స్‌ల్లో 38.42 సగటున పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 3.75 ఎకానమీతో 57 వికెట్లు తీశాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఓ మోస్తరు రికార్డు కలిగిన కోల్స్‌.. ఈ ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. హండ్రెడ్‌ లీగ్‌లో ఇంతకుముందే ప్రవేశమున్న కోల్స్‌.. ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ఆడి ఓ మోస్తరు ప్రభావం చూపించాడు. గత ఎడిషన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన కోల్స్‌.. 152 పరుగులు చేసి, 5 వికెట్లు తీశాడు. 2024-25లో ఇంగ్లండ్‌ లయన్స్‌ తరఫున భారత్‌, ఆస్ట్రేలియాల్లో పర్యటించిన కోల్స్‌ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. హండ్రెడ్‌ లీగ్‌లో జాక్‌పాట్‌ కొట్టడంతో, విదేశీ లీగ్‌ ఫ్రాంచైజీల కన్ను కోల్స్‌పై పడింది. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 వేలంలో కోల్స్‌ తన పేరు నమోదు చేసుకోలేదు. త్వరలో జరుగబోయే హండ్రెడ్‌ లీగ్‌లో కోల్స్‌ తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు సైతం అతని కోసం ఎగబడే అవకాశం ఉంది. హండ్రెడ్‌ వేలంలో కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.హెండ్రెడ్‌ లీగ్‌ వేలంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది.ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

Trent Boult becomes the first Cricketer to be part of all MI family teams2
చరిత్ర సృష్టించిన ట్రెంట్‌ బౌల్ట్‌

న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌ చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం దక్కింది. ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీలో ప్రతి ఫ్రాంచైజీకి ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌.. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్‌.. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించిన బౌల్ట్‌.. తాజాగా ద హండ్రెడ్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ అయిన ఎంఐ లండన్‌కు ఎంపికయ్యాడు. బౌల్ట్‌ను ఇవాళ (మార్చి 12) జరిగిన వేలంలో ఎంఐ లండన్‌ లక్ష స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.23 కోట్లు) సొంతం చేసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బౌల్ట్‌ ఇప్పటివరకు ప్రాతినిథ్యం వహించిన ప్రతి ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో టైటిల్‌ నెగ్గాడు. ఇందులో మరో విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీల తరఫున అతనాడిన ప్రతి ఫైనల్‌లోనూ అతని జట్టు నెగ్గింది.ఇదిలా ఉంటే, హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం​ జరుగుతుంది. ఈ సీజన్‌ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్‌ తరహా వేలం​ జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.ఈ వేలంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ లీగ్‌లోని తమ సిస్టర్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ కోసం పాకిస్తానీ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను (1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు)) ఎంపిక చేసుకుంది. ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయారు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.

Dont see a point in MS Dhoni batting at No 8 or 9: Pujara Ahead IPL 20263
ధోని అలా బ్యాటింగ్‌ చేయడంలో అర్థం లేదు: పుజారా

గత పద్దెమినిదేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొనసాగుతున్నాడు టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) కెప్టెన్‌గా.. ఆ జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. ఇక నలభై నాలుగేళ్ల వయసులోనూ తలా ఐపీఎల్‌-2026 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు.ఎనిమిదో స్థానంలోటోర్నీ ఆసాంతం ధోని ఆడతాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఐదు మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడిన నేపథ్యంలో ధోని పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక బ్యాటర్‌గా ఎనిమిదో స్థానంలో వచ్చిన ధోని.. 135కు పైగా స్ట్రైక్‌రేటుతో 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 196 పరుగులే చేశాడు.ఈ క్రమంలో గతంలో ఎ‍న్నడూ లేని విధంగా చెన్నై జట్టు పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ ఛతేశ్వర్‌ పుజారా ధోనిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం అర్థం లేని విషయం అని అభిప్రాయపడ్డాడు.ధోని అలా బ్యాటింగ్‌ చేయడంలో అర్థం లేదు‘‘ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఎంఎస్‌ ధోని (MS Dhoni) సొంతం. సీఎస్‌కే జట్టులోనూ ఎవరూ ఆయనకు సాటిరారు. అలాంటి ధోని ఎనిమిది లేదంటే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంలో అర్థం లేదు.ఒకవేళ ఆయన కేవలం ఐదు లేదంటే పది బంతుల్లోనే పరుగులు రాబట్టగలిగినపుడు.. కనీసం 25 నుంచి 30 బంతులు ఎదుర్కొంటే ఫలితం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఫినిషర్‌గా గొప్ప పేరున్న ధోని మరీ లోయర్‌ ఆర్డర్‌లో రావడం ఏమాత్రం సరికాదు’’ అని పుజారా జియోస్టార్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.విశ్వసనీయత ఎక్కువఅదే విధంగా సీఎస్‌కేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘నేను గతంలో చెన్నైకి ఆడాను. ఆ జట్టులో వాతావరణం ఎంతో బాగుంటుంది. ఆటగాళ్లంతా సొంత కుటుంబంలా కలిసి ఉంటారు. ఆటగాడిగా మన నుంచి ఫ్రాంఛైజీ ఏం కోరుకుంటుందో ప్రతీ ఆటగాడికి తెలసు.సీఎస్‌కే ఫ్రాంఛైజీకి విశ్వసనీయత ఎక్కువ. ఫ్రాంఛైజీ పట్ల ఆటగాళ్లకు అభిమానం మెండు. ధోని మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఆ జట్టుతో చాన్నాళ్లు కొనసాగిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆ జట్టులో మార్పులు జరుగుతున్నాయి. వెటరన్‌ ప్లేయర్లకు బదులు యువ ఆటగాళ్లతో జట్టును నింపేశారు’’ అని పుజారా పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్‌-2026 తొలి విడత షెడ్యూల్‌ బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్‌కే మార్చి 30న రాజస్తాన్‌ రాయల్స్‌తో, ఏప్రిల్‌ 3న పంజాబ్‌ కింగ్స్‌తో, ఏప్రిల్‌ 5న ఆర్సీబీతో, ఏప్రిల్‌ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ఐపీఎల్‌-2026 సీఎస్‌కే జట్టుఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (RR నుండి ట్రేడింగ్‌), ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్✈️, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్✈️, నాథన్ ఎల్లిస్✈️, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్‌, జేమీ ఓవర్టన్✈️, గుర్జప్నీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్✈️, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్‌ కీపర్‌), మాథ్యూ షార్ట్✈️, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ✈️, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్క్స్✈️చదవండి: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. షాహిన్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు

The Hundred Auction: Kavya Maran Takes Pakistan Spinner Abrar Ahmed into sunrisers leeds4
వివాదంలో కావ్యా మారన్‌.. సన్‌రైజర్స్‌లోకి పాక్‌ ఆటగాడు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్వా మారన్‌ వివాదంలో చిక్కుకుంది. హండ్రెడ్‌ లీగ్‌-2026 వేలంలో పాక్‌ ఆటగాడిని కొనుగోలు చేసి, భారత క్రికెట్‌ అభిమానుల నుంచి భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. కావ్యా మారన్‌ నేతృత్వంలోని సన్‌ గ్రూప్‌ ఇటీవలే హండ్రెడ్‌ లీగ్‌లోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీలో మెజార్టీ శాతం వాటాను సొంతం చేసుకుంది.ఈ క్రమంలో తొలిసారి జరుగుతున్న వేలంలో పాల్గొన్న ఆమె.. పాక్‌ ఓవరాక్షన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను 1.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 2.34 కోట్లు) కొనుగోలు చేసింది. మరో ఫ్రాంచైజీతో (ట్రెంట్‌ రాకెట్స్‌) పోటీపడి మరీ అబ్రార్‌ను దక్కించుకుంది. ఈ చర్యతో కావ్వా భారత క్రికెట్‌ అభిమానుల పాలిట విలన్‌గా మారిపోయింది. అబ్రార్‌ అహ్మద్‌ ఇటీవలికాలంలో టీమిండియాతో ఆడిన మ్యాచ్‌ల్లో ఓవరాక్షన్‌ చేశాడు. ఓ సందర్భంలో భారత వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసి చాలా అతి చేశాడు. ఇందుకు భారత ఆటగాళ్లు కూడా తగిన కౌంటర్లు ఇచ్చినప్పటికీ భారతీయుల కసి తీరలేదు. అలాంటి అబ్రార్‌ను కావ్యా మారన్‌ జట్టులో చేర్చుకోవడం భారతీయులకు మింగుడుపడటం లేదు.దీనికి ముందే కావ్యా మరో పాక్‌ ఆటగాడు (హరీస్‌ రౌఫ్‌) వేలానికి రాగా, అతన్ని రిజెక్ట్‌ చేసింది. అప్పుడు శభాష్‌ అనుకున్న భారత క్రికెట్‌ అభిమానులు, అబ్రార్‌ తీసుకున్న వెంటనే సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ ప్రారంభించారు. ఇదే వేలంలో మరో పాక్‌ ఆటగాడు ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. వేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన పాక్‌ ఆటగాళ్లు ఉస్మాన్‌ తారిక్‌, అబ్రార్‌ అహ్మద్‌ మాత్రమే. మరో పాక్‌ ఆటగాడు షాదాబ్‌ ఖాన్‌ కూడా వేలానికి వచ్చినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. కాగా, కొద్ది గంటల ముందే పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది ఈ వేలం బరి నుంచి వైదొలిగాడు. ఈ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు పాల్గొంటున్నారు.ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి ఆటగాళ్ల వేలం జరుగుతుంది. ఈ సీజన్‌ (2026) నుంచే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ ద్వారా జరిగేది. ఈ సీజన్‌తో తొలిసారి ఐపీఎల్‌ తరహా వేలం​ జరుగుతుంది. నిన్న (మార్చి 11) మహిళల విభాగం వేలం పూర్తి కాగా.. ఇవాళ (మార్చి 12) పురుషుల వేలం జరుగుతుంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతున్నాయి.ఇప్పటివరకు జరిగిన పురుషుల వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

It could be bit of issue: Aakash Chopra on SRH initial IPL 2026 schedule5
IPL 2026: సన్‌రైజర్స్‌కు కష్టమే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి రంగం సిద్దమైంది. మార్చి 28న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌కు తెరలేవనుంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది.ఇరవై మ్యాచ్‌ల షెడ్యూల్‌ మాత్రమేఓవైపు ఇరాన్‌తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. మరోవైపు.. తమిళనాడు, అసోం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ విడుదల చేసింది.ఇందులో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు తొలి మ్యాచ్‌లో మార్చి 28న డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఇందుకు బెంగళూరు వేదిక. ఇక రెండో మ్యాచ్‌లో ఏప్రిల్‌ 2న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కోల్‌కతాలో.. తదుపరి ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో.. అనంతరం ఏప్రిల్‌ 11న పంజాబ్‌ కింగ్స్‌తో న్యూ చండీగఢ్‌లో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సన్‌రైజర్స్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి విడత షెడ్యూల్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లు సొంత మైదానం వెలుపల ఆడటం తలనొప్పిగా మారుతుందన్నాడు.సన్‌రైజర్స్‌కు కష్టమే!‘‘గుజరాత్‌ టైటాన్స్‌తో పాటు సన్‌రైజర్స్‌ తొలి నాలుగు మ్యాచ్‌లలో మూడు సొంత మైదానంలో కాకుండా.. ఇతర వేదికలపై ఆడాల్సి ఉంది. నాకైతే సన్‌రైజర్స్‌ గురించే బాధంతా!వాళ్లకు ఫ్లాట్‌ పిచ్‌లు కావాలి. కానీ ఆయా వేదికల్లో వీరి కోసం ఎవరూ ఇలాంటి పిచ్‌ను తయారు చేయలేరు. సొంత మైదానంలో ఒకే ఒక్క మ్యాచ్‌.. అది కూడా మధ్యాహ్నం షెడ్యూల్‌ చేశారు. నిజానికి సన్‌రైజర్స్‌కు హోం గ్రౌండ్‌లో సీజన్‌ ఆరంభించడమే మంచిది.అక్కడైతే వారు శుభారంభం అందుకోగలరు. వారి విజయాలు, ఆత్మవిశ్వాసంపై ఇది కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌లో అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి విధ్వంసకర వీరులు ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

The Hundred League 2026 Auction: Pakistan Usman Tariq joins Birmingham Phoenix6
పాక్‌ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్‌

హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న వేలంలో పాకిస్తాన్‌ వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఇతన్ని బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. లక్ష పౌండ్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో నిలిచిన తారిక్‌ కోసం ట్రెంట్‌ రాకెట్స్‌ కూడా పోటీపడింది. ఫీనిక్స్‌, రాకెట్స్‌ రెండూ ఐపీఎల్‌ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కావు. ఈ వేలంలో అమ్ముడుపోయిన తొలి పాకిస్తాన్‌ ఆటగాడు తారిక్‌. ఇతనికి ముందు హరీస్‌ రౌఫ్‌, షాదాబ్‌ ఖాన్‌ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్‌ స్టార్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఫ్రిది, రౌఫ్‌ మార్కీ ప్లేయర్లుగా వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.తొలిసారి వేలం​హండ్రెడ్‌ లీగ్‌లో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్‌ లీగ్‌ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.నిర్వహకులు భరోసా ఇచ్చినా..!ప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ యాజమాన్యాలు పాకిస్తాన్‌ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్‌ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. లీగ్‌ నిర్వాహకులు పాక్‌ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. దీంతో ఈ వేలంలో 63 మంది పాక​్‌ ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నాయి. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. ఈ 14 మందిలో ప్రస్తుతానికి ఉస్మాన్‌ తారిక్‌ ఒక్కడే అమ్ముడుపోయాడు.అనామక ఆటగాడిపై కనకవర్షం​ఇప్పటివరకు జరిగిన వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

Shaheen Afridi retains faith in young Pak brigade despite Loss To BAN7
పాక్‌కు ఘోర ఓటమి.. షాహిన్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్‌ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కనీసం సెమీస్‌ చేరకుండానే పాకిస్తాన్‌ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.మూడు వన్డేల సిరీస్‌ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది పాక్‌ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 114 పరుగులకే ఆలౌట్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిని పాక్‌.. 114 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌, అరంగేట్ర బ్యాటర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్‌రౌండర్‌ ఫాహీమ్‌ ఆష్రఫ్‌ 37 పరుగులతో పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ నహీద్‌ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్‌ ‍బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. కెప్టెన్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడు, టస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.15.1 ఓవర్లలోనే ఫినిష్‌లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో విఫలమైన బాబర్‌ ఆజంను బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ నుంచి తప్పించింది యాజమాన్యం.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షామిల్‌ హుసేన్‌, మాజ్‌ సదాకత్‌ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్‌ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్‌ జోడీగా వచ్చిన సదాకత్‌ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షామిల్‌ 4 పరుగులకే అవుటయ్యాడు.ఓడినా పర్లేదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి అనంతరం పాక్‌ కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్‌లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్‌, బాల్‌.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్‌ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసిఅయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్‌ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్‌ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్‌ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్‌ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

D Gukesh Faces Question Mark Over World Chess Championship Defence8
గుకేశ్‌కు ఈసారి ఓటమి తప్పదు!

భారత చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ తన చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కష్టమేనని చెస్‌ దిగ్గజం జుడిత్‌ పోల్గర్‌ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. 2024 డిసెంబర్‌లో వరల్డ్‌ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్‌తో త్వరలో చెస్‌ క్యాండిడేట్‌ టోర్నీ విజేతతో అమీతుమీ తేల్చుకోనున్నాడు.ఈ నేపథ్యంలో జుడిత్‌ పోల్గర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈసారి గుకేశ్‌ టైటిల్‌ నిలబెట్టుకోవడ కష్టమని, ఎందుకంటే క్యాండిడేట్‌ చెస్‌ టోర్నీ విజేత అతడిని ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘గుకేశ్‌ ఈసారి విఫలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి చాంపియన్‌షిప్‌ తర్వాత మరోసారి గుకేశ్‌ చాంపియన్‌గా నిలుస్తాడా అనేది చెప్పడం సందేహమే. 2024లో చైనా దిగ్గజం డింగ్‌ లిరెన్‌ను ఓడించిన గుకేశ్‌ అత్యంత పిన్న వయస్సులో చాంపియన్‌గా నిలిచాడు. కానీ ఈసారి గుకేశ్‌ ఆటతీరులో మార్పు కనిపిస్తుంది. 2024 నుంచి గుకేశ్‌ ఆడిన గేముల్లో డ్రాలతో పాటు ఓటములు కూడా ఉన్నాయి. దీంతో గుకేశ్‌పై సహజంగానే ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే అతడు జాగ్రత్తగా ఆడితే తప్ప చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నిలబెట్టుకోలేకపోవచ్చు.’ అని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల కాలంలో జరిగిన టోర్నీల్లో గుకేశ్‌ కేవలం ప్రేగ్‌ మాస్టర్స్‌ టోర్నీలో మాత్రమే విజయాన్ని అందుకున్నాడు.2025లో విజ్‌ ఆన్‌ వేదికగా జరిగిన టాటా మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో పాల్గొన్నగుకేశ్‌ భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానందతో తలపడ్డాడు. చివరి రౌండ్‌ వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో టైటిల్‌ను డిసైడ్‌ చేసేందుకు టైబ్రేకర్‌ వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ టైబ్రేక్‌ ప్రజ్ఞానంద విజయం సాధించడంతో గుకేశ్‌కు నిరాశే మిగిలింది.చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!

Tim Seifert: despite his pyrotechnics at the T20 World Cup, goes unsold in Hundred league auction9
టీ20 ప్రపంచకప్‌ 2026 హీరోకు ఘోర అవమానం

తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు చేర్చడంతో పాటు టోర్నీలో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌కు ఘోర అవమానం జరిగింది. ఇవాళ (మార్చి 12) జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఈ వేలంలో టిమ్‌ టైర్‌-1 బ్యాటర్‌గా లక్షల పౌండ్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్నా, టిమ్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. టిమ్‌ పేరు వేలంలో మరోసారి వచ్చే అవకాశం ఉంది.టిమ్‌ తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 166.33 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. ఈ టోర్నీలో టిమ్‌వే అత్యధిక హాఫ్‌ సెంచరీలు (4). టిమ్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్‌-2026 వేలంలో కేకేఆర్‌ రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ వేలానికి సరిగ్గా ముందు రోజు టిమ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజాగా భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో మిగతా న్యూజిలాండ్‌ బ్యాటర్లంతా విఫలమైనా టిమ్‌ ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ టిమ్‌ అర్ద సెంచరీతో (58) సత్తా చాటాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన టిమ్‌ను హండ్రెడ్‌ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.ఇదిలా ఉంటే, ప్రస్తుతం లండన్‌లో పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ వేలం జోరుగా సాగుతోంది. దేశ, విదేశాల ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్‌ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్‌ లీగ్‌ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.

MS Dhoni cleared conflict of interest allegations by BCCI ahead of IPL 202610
ఎంఎస్‌ ధోనికి భారీ ఊరట

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్టార్‌ ప్లేయర్‌ ఎం​ఎస్‌ ధోనికి భారీ ఊరట లభించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉల్లంఘించాడంటూ అతనిపై నమోదైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్‌ కమిటీ కొట్టిపారేసింది. ఈ కేసులో ఎథిక్స్‌ కమిటీ అధికారి అరుణ్‌ మిశ్రా (రిటైర్డ్‌) ధోనికి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. టీమిండియా ఆటగాడిగా ఉంటూనే, 'ఆర్కా స్పోర్ట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' అనే క్రికెట్‌ అకాడమీతో అనుబంధం (యజమానిగా) కొనసాగించడని ధోనిపై 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు నమోదైంది. ఇలా వ్యవహరించడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొనబడింది. 2018లో సవరించిన రూల్‌ 38(4)(a), 38(4)(p) ప్రకారం ఇది తప్పు అని ఫిర్యాదుదారు వాదించారు. అదనంగా, ధోని తప్పనిసరి డిస్క్లోజర్‌ బాధ్యతలను కూడా నిర్వర్తించలేదని ఆరోపించారు.ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జస్టిస్‌ మిశ్రా.. ధోని ఎలాంటి తప్ప చేయలేదని క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అతనికి వ్యతిరేకంగా ఎలాంటి విరుద్ధ ప్రయోజనాల కేసు నిలబడదని స్పష్టం చేశారు. ధోని 2017లో ఆర్కా సంస్థతో ఒప్పందం చేసుకున్నారని, బీసీసీఐ సవరించిన నిబంధనలు 2018 సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. అందువల్ల, ధోని ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి విరుద్ధ ప్రయోజనం లేదని తేల్చారు. ఫిర్యాదుదారుడు వ్యక్తిగత కారణాలతోనే ఈ కేసు వేసినట్లు తీర్పులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ధోనిని 2026 ఐపీఎల్‌ సీజన్‌ కోసం​ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే. సీఎస్‌కే సీఈవో ఇటీవల చెప్పిన దాని ప్రకారం.. ధోని ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడు. వయసు పైబడిన రిత్యా ధోని ఈ సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని తొలుత ప్రచారం జరిగింది. తాజాగా సీఈవోనే స్పష్టత ఇవ్వడంతో ఉహాగానాలకు తెరపడింది.2026 సీజన్‌కు సంబంధించి తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే విడదల చేశారు. ఈ విడతలో అన్ని ఫ్రాంచైజీల్లాగే సీఎస్‌కే కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.తొలి దశలో సీఎస్‌కే షెడ్యూల్‌ - మార్చి 30: CSK vs RR – గౌహటి - ఏప్రిల్‌ 3: CSK vs PBKS – చెన్నై - ఏప్రిల్‌ 5: CSK vs RCB – బెంగళూరు - ఏప్రిల్‌ 11: CSK vs DC – చెన్నై కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement