Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026 CSK VS PBKS: Sanju Samson Fails in two consecutive matches1
IPL 2026: నిరాశలో సీఎస్‌కే ఫ్యాన్స్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో భీకర ఫామ్‌ ప్రదర్శించి, టీమిండియా టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్‌ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అతను ఫామ్‌ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు. ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ అయిన చెటా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్‌ 3) పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.అప్పటివరకు భీకర ఫామ్‌లో ఉండిన సంజూ తమ ఫ్రాంచైజీకి వచ్చే సరికి వరుసగా విఫలం​ కావడాన్ని సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంద చెటా ఇది అంటూ బాధపడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండిన సంజూపై సీఎస్‌కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.అసలే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజూనే అనుభవజ్ఞుడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ నుంచి ఆశించడం తప్పేమీ కాదు. నేటి మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్‌ కీపర్‌ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 71-1గా ఉంది. సంజూ త్వరగా ఔటైనా, ఆయుశ్‌ మాత్రే ధాటిగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (14) అండగా ఉన్నాడు. కాగా, ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోయింది. వారు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఛేదనలో యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, ఆదిలోనే తన జట్టు గెలుపును ఖరారు చేశాడు.

IPL 2026: Only the second instance of CSK fielding four players aged 21 or younger2
IPL 2026: సీఎస్‌కే చరిత్రలో అరుదైన సందర్భం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఆ జట్టు నలుగురు 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆటగాళ్లను బరిలోకి దించింది. ఆ జట్టు చరిత్రలో ఇలా జరగడం​ ఇది రెండో సారి మాత్రమే. గత ఎడిషన్‌ ఆరంభంలో తొలిసారి ఇలా జరిగింది. సాధారణంగా సీఎస్‌కేను ముసలివాళ్ల జట్టుగా పరిగణిస్తారు. ఆ జట్టు చరిత్ర చూస్తే 30 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. గత రెండు సీజన్లుగా సీఎస్‌కే ఆ ముద్రను చెరిపివేసే ప్రయత్నం చేస్తుంది.పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయుశ్‌ మాత్రే, కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌, నూర్‌ అహ్మద్‌ లాంటి యువకులను సీఎస్‌కే బరిలోకి దించింది. వీరంతా 21 లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు.ఆయుశ్‌ మాత్రే (18 ఏళ్ల 261 రోజులు)కార్తీక్ శర్మ (19 ఏళ్ల 342 రోజులు)ప్రశాంత్ వీర్ (20 ఏళ్ల 130 రోజులు)నూర్ అహ్మద్ (21 ఏళ్ల 90 రోజులు)ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌ చివరి బంతికి సంజూ శాంసన్‌ (7) ఔటయ్యాడు. సీఎస్‌కేకు మారిన తర్వాత సంజూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 24-1గా ఉంది. ఆయుశ్‌ మాత్రే (0), రుతురాజ్‌ గైక్వాడ్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు.

Massive Update On Josh Hazlewoods Return Ahead Of RCB vs CSK Match3
ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ వచ్చేస్తున్నాడు?

ఐపీఎల్‌-2026 తొలి మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్ మీద ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ పేస‌ర్ జోష్ హాజిల్‌వుడ్ ఊహించిన దానికంటే ముందుగానే తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. హాజిల్‌వుడ్ ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడున్నాడు.దీంతో యాషెస్ సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ హాజిల్‌వుడ్ మాత్రం భారత్‌కు వచ్చి ఆర్సీబీ జట్టుతో చేరాడు. అయితే ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ అండీ ఫ్లవర్ ధ్రువీకరించాడు.అయితే ఇప్పుడు హాజిల్‌వుడ్ తన ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాడు. చిన్నస్వామి స్టేడియం నెట్స్‌లో జోష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. చాలా రోజుల తర్వాత పూర్తి రిథమ్‌తో బౌలింగ్ చేయడంతో దాదాపుగా అతడు పూర్తి సాధించినట్లు కన్పిస్తున్నాడు. ఏప్రిల్ 10న గువాహటిలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హాజిల్‌వుడ్ పునరాగమనం చేస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న సీఎస్‌కేతో తలపడనుంది.చదవండి: IPL 2026: అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?

IPL 2026 Match 7: CSK VS PUNJAB KINGS Updates4
మాత్రే (73) ఔట్‌

మాత్రే (73) ఔట్‌12.3వ ఓవర్‌-123 పరుగుల వద్ద సీఎస్‌కే మూడో వికెట్‌ కోల్పోయింది. విజయ్‌ కుమార్‌ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ మాత్రే ఔటయ్యాడు.రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే11.1వ ఓవర్‌- 110 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో నేహల్‌ వధేరాకు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ గైక్వాడ్‌ (28) ఔటయ్యాడు. భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న సీఎస్‌కేటాస్‌ ఓడి తొలుత బ్యాటంగ్‌ చేస్తున్న సీఎస్‌కే భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ఆదిలోనే సంజూ వికెట్‌ కోల్పోయినా.. ఆయుశ్‌ మాత్రే (62) ధాటిగా ఆడుతుండటంతో 10 ఓవర్లలో వికెట​్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మాత్రే తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అతనికి రుతురాజ్‌ (25) సహకరిస్తున్నాడు. సంజూ మరోసారి విఫలంసీఎస్‌కే మారిన తర్వాత సంజూ శాంసన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులకు ఔటైన అతను.. ఇవాల్టి మ్యాచ్‌లో మరో పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్‌ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 3) జరుగుతున్న ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఎలాంటి మార్పులు చేయకపోగా.. సీఎస్‌కే ఓ మార్పు చేసింది. మాథ్యూ షార్ట్‌ స్థానంలో ప్రశాంత్‌ వీర్‌ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఇంపాక్ట్ సబ్స్‌: సూర్యాంశ్ షెడ్గే, ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే, హేమంత్ బ్రార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ సబ్స్: జామీ ఓవర్టన్, రాహుల్ చాహర్, మాథ్యూ షార్ట్, రామకృష్ణ ఘోష్, గుర్జప్నీత్ సింగ్

Delhi Capitals Lock Ben Duckett Replacement, Star All Rounder Joins Squad5
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక అడుగు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ చౌధరి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరినట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో అతను డీసీ ఆటగాళ్లతో కలిసి కనిపించాడు. దీంతో నిఖిల్‌ను జట్టు నుంచి చివరి నిమిషంలో వైదొలిగిన ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారన్న టాక్‌​ నడుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారక ప్రకటన లేనప్పటికీ.. డీసీ మాత్రం నిఖిల్‌ను లాక్‌ చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. నిఖిల్‌ భారత మూలాలున్న ఆస్ట్రేలియా ఆటగాడు. ఇతను ఢిల్లీలో జన్మించాడు. కుటుంబంతో సహా చిన్నతనంలోనే ఆస్ట్రేలియాకి వెళ్లిన నిఖిల్‌.. టాస్మానియా తరఫున క్రికెట్‌ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌ 2026 వేలంలో విదేశీ ఆటగాడిగా నమోదు చేసుకున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేయలేదు.నిఖిల్‌ తాజాగా ముగిసిన బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబార్ట్‌ హరికేన్స్‌ తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 153.50 స్ట్రైక్‌ రేట్‌తో 307 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసే నిఖిల్‌ ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల సామర్థ్యం కూడా ఉన్న నిఖిల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిలార్డర్‌లో ఉపయోగకరమైన ఆటగాడిగా మారవచ్చు.ఇదిలా ఉంటే, ఢిల్లీ ఈ సీజన్‌ను గెలుపుతో బోణీ కొట్టింది. తాజాగా ముగిసిన మ్యాచ్‌లో ఈ జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమీర్‌ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్‌ స్టబ్స్‌ (32 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) సహకరించాడు.ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ రేపు ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.

Rinku Singh Set To Replace Ajinkya Rahane As KKR Captain Midway in IPL 20266
అజింక్య ర‌హానేకు భారీ షాక్‌.. కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ?

ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో ఓటమిని మూటకట్టుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ‍కేకేఆర్ చిత్తు అయింది. 2012 తర్వాత కేకేఆర్ వరుసగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.దీంతో అజింక్య రహానే కెప్టెన్సీపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత సీజన్‌లో కూడా కేకేఆర్‌ను విజయపథంలో రహానే నడిపించలేకపోయాడు. కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరుకుండానే కేకేఆర్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈసారి కూడా అదే సూచనలు కన్పిస్తున్నాయి.రహానేపై వేటు?ఈ క్రమంలో అజింక్యా రహానేను సీజన్‌ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే ఆలోచనలో కేకేఆర్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. రహానే స్ధానంలో స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని 'రాయ్‌స్పోర్ట్స్' ప్రతినిధి సందీపన్ బెనర్జీ పేర్కొన్నారు. రింకూ ప్రస్తుతం కేకేఆర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా రహానే గాయంతో మైదానం వీడినప్పుడు రింకూ కెప్టెన్సీ బాధ్యతలు చేప‌ట్టాడు.కానీ 221 పరుగుల భారీ ఛేదనను అడ్డుకోవడంలో అతను విఫలమయ్యాడు. కానీ రింకూ సింగ్‌కు మాత్రం కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది. 2024-25 డొమాస్టిక్ సీజ‌న్‌లో యూపీ జ‌ట్టు కెప్టెన్‌గా రింకూ వ్య‌వ‌హ‌రించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి పూర్తి స్ధాయి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌ని కేకేఆర్ మేనెజ్‌మెంట్ భావిస్తున్న‌ట్లు సమాచారం.త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ర‌హానే స్పందించాడు. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ అనంత‌రం ర‌హానే మాట్లాడుతూ.. నేను ఆడటం కొందరికి ఇష్టం లేదు. నా విజయాలను చూసి వారు అసూయపడుతున్నారు. నేను బ‌య‌ట వ్య‌క్తుల మాట‌ల‌ను ప‌ట్టించుకోను. నేను ఏం చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. కేవలం ఒక ఇన్నింగ్స్ విఫలమైతే విమర్శలు చేయడం సరికాదు అని పేర్కొన్నాడు.చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

Yuvraj Singh Lambasts SRH For Denying Abhishek Sharma IPL Captaincy7
అభిషేక్‌కు అన్యాయం చేశారు.. స‌న్‌రైజ‌ర్స్‌పై యువ‌రాజ్ ఫైర్‌

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్ వ్య‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ గాయం కార‌ణంగా ఫ‌స్ట్ హాఫ్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో జ‌ట్టు ప‌గ్గాల‌ను కిష‌న్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజ‌మాన్యం అప్ప‌గించింది.ట్రావిస్ హెడ్‌, క్లాసెన్‌, అభిషేక్ శ‌ర్మ వంటి ప్లేయ‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కిష‌న్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది. తాజాగా ఇదే విష‌యంపై భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిష‌న్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ 2017 నుంచి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. కానీ కిష‌న్ మాత్రం గ‌తేడాదే ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. కిష‌న్ ఇటీవ‌లే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిని స్టాండిన్ కెప్టెన్‌గా ఆరెంజ్ ఆర్మీ నియ‌మించింది. అత‌డికి డిప్యూటీగా మాత్రం అభిషేక్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు."అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌కోపోవ‌డం న‌న్ను నిరాశ‌ప‌రిచింది. ఇషాన్ కిష‌న్ అంటే నాకు కూడా ఇష్ట‌మే. అతడు ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శ‌ర్మ గ‌త 7 ఏళ్లగా ఎస్ఆర్‌హెచ్ జ‌ట్టుతో పాటు ఉన్నాడు. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.ఎస్ఆర్‌హెచ్ కోసం త‌న సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కూడా కెప్టెన్ కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అటువంటి వ్య‌క్తికి కెప్టెన్సీ ఇవ్వ‌క‌పోవ‌డం నిజంగా బాధాక‌రం. గ‌తంలో కూడా నాకు ఇలానే జ‌రిగింది. 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భార‌త్‌కు గొప్ప విజ‌యాలు అందించాడు.అందుకు అత‌డే అర్హ‌డు అన్పించింది. ఇది నేను కేవ‌లం ఉదాహరణగా మాత్ర‌మే చెబుతున్నాను. కానీ ఒక ఆట‌గాడు కొన్నేళ్లు పాటు జ‌ట్టుకు తన సేవలు అందించినప్పుడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తాయి" స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్‌ నుంచి వెళ్లిపోయిన డేవిడ్‌ వార్నర్‌?

Standing fighting trying She is Me: Sania Mirza Emotional Viral8
ఆ రెండింటి కలయిక నేను: సానియా మీర్జా భావోద్వేగం

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హైదరాబాదీ స్టార్‌ ఎన్నో సవాళ్లు అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్‌ స్టార్‌గా గుర్తింపు పొందింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో సానియా మీర్జా మొత్తంగా 43 డబుల్స్‌ టైటిళ్లు సాధించింది. కెరీర్‌లో అత్యున్నత స్థాయికిఇందులో మూడు మహిళల డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు, మూడు మిక్స్‌డ్‌ డబుల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు ఉండటం విశేషం. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగిన సానియా మీర్జా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చేదు అనుభవాలు చవిచూసింది. తొలుత సొహ్రాబ్‌ అనే వ్యక్తితో సానియా నిశ్చితార్థం చేసుకోగా.. ఆ బంధం పెళ్లి వరకు రాలేదు.షోయబ్‌తో వివాహం, విడాకులుఆ తర్వాత పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించిన సానియా మీర్జా.. అతడితో వివాహ బంధంలో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో సానియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరిగింది. అయినా సరే ఆమె ఏనాడూ ధైర్యం కోల్పోకుండా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఇక షోయబ్‌- సానియాలకు కుమారుడు ఇజహాన్‌ సంతానం.కాగా కొన్నాళ్ల క్రితం షోయబ్‌ మాలిక్‌ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సానియా- షోయబ్‌ల విడాకుల వ్యవహారం బయటకు వచ్చింది. షోయబ్‌ ప్రవర్తనతో విసిగిపోయిన సానియా.. తానే అతడికి విడాకులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కుమారుడితో కలిసి సానియా దుబాయ్‌లో నివసిస్తోంది. టెన్నిస్‌ అకాడమీ వ్యవహారాలతో బిజీగా గడుపుతోంది.ఆ రెండింటి కలయిక నేనుఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టా వేదికగా సానియా మీర్జా భావోద్వేగ పోస్టు పెట్టగా వైరల్‌గా మారింది. "కొన్ని రోజులు ఆమె యోధురాలిగా ఉంటుంది. మరికొన్నిసార్లు కుప్పకూలిపోతుంది. చాలాసార్లు ఈ రెండింటి కలయికగా ఆమె ఉంటుంది. అయితే, ప్రతి రోజు ఆమె ఉనికి మాత్రం అలాగే ఉంటుంది.ధైర్యంగా నిలబడటం.. పరిస్థితులతో పోరాడటం.. నిరంతరం కొత్తగా ఏదైనా ప్రయత్నించడం.. ఆమెకు అలవాటు. ఆ ఆమెను నేనే’’ అని సానియా స్ఫూర్తిదాయక వాక్యాలు పంచుకుంది. చదవండి: Sheetal Devi: పోరాటానికి పరిమితులెందుకు?

Yuvraj Singh Blames Virat Kohli For His Retirement, Drops Huge Bombshell9
విరాట్‌ కోహ్లిపై యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్మెంట్‌ ప్రకటించడానికి నాడు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కారణమని బాంబు పేల్చాడు. తన ఎంపికను పరిగణలోకి తీసుకోవడం లేదన్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. సీనియర్‌ని అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఫైరయ్యాడు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసి, సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలాకాలం ఎదురుచూశానని తెలిపాడు. చివరికి ధోనితో మాట్లాడితే కాని విషయం అర్దం కాలేదని అన్నాడు. చేసేదేమీ లేక రిటైర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నిజాయితీగా పరిస్థితిని వివరించి సహాయం చేశాడని ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ విషయంలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ తీరు కూడా తప్పుబట్టాడు. తాజాగా స్పోర్ట్స్‌ టాక్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, యువీ 2019 జూన్‌ 10న రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అతను చివరిగా 2017లో టీమిండియా తరఫున వన్డే ఆడాడు. అవకాశాల కోసం చాలాకాలం వేచి చూసి, చేసేదేమీ లేక ఆట నుంచి వైదొలిగాడు. యువీ చివరి వన్డే ఆడే సమయానికి మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఆ ఏడాది 11 మ్యాచ్‌ల్లో 98.67 స్ట్రయిక్‌రేట్‌తో 372 పరుగులు చేశాడు. అయినా టీమిండియాలో స్థానం దక్కలేదు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలు చేసి, రెండు ప్రపంచకప్‌ విజయాల్లో (2007 టీ20, 2011 వన్డే) కీలకపాత్ర పోషించిన యువీ అవమానకర రీతిలో రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. క్యాన్సర్‌పై విజయం సాధించి, తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్‌ ఆటకు సంబంధించి తన చివరి కోరికను తీర్చుకోకుండానే రిటైరయ్యాడు. యువీకి 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఆడాలని కోరిక ఉండింది. ఇందుకోసమే అతను వయసు మీద పడుతున్నా తీవ్రంగా శ్రమించి ఫిట్‌నెస్‌ మెయిన్‌టైన్‌ చేశాడు. అయినా సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపించారు. వాస్తవానికి యువీని పక్కకు పెట్టడానికి విరాట్‌-రవిశాస్త్రి వద్ద కూడా ఎలాంటి వ్యక్తిగత కారణాలూ లేవు. కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. 2015 వరల్డ్‌ కప్‌ సమయంలో నాటి కెప్టెన్‌ ధోని కూడా గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌లను ఈ కారణంగానే పక్కన పెట్టాడు.

BCB Appeals To BCCI To Revive Cricketing Ties Big Reason Behind: Report10
అప్పుడేమో ఓవరాక్షన్‌.. ఇప్పుడు కాళ్లబేరానికి!

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) దిగొచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సత్సంబంధాల కోసం ముందడుగు వేసింది. ఇరుదేశాల మధ్య క్రికెట్‌ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీబీ.. బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం.దౌత్యపరమైన ఉద్రిక్తతలుకాగా ఆది నుంచి బంగ్లాదేశ్‌కు భారత్‌ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కొన్నినెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లా నేతలు ఈశాన్య భారతంపై అవాకులు, చెవాకులు పేలడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.బంగ్లాదేశ్‌ హైడ్రామాఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ టూర్‌ నిరవధికంగా వాయిదాపడింది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 ఆడేందుకు భారత్‌కు రామని బంగ్లాదేశ్‌ హైడ్రామా చేసింది.భద్రతా కారణాలు చూపుతూ తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బీసీబీ ఐసీసీ (ICC)ని కోరింది. ఇందుకు ఐసీసీ నిరాకరించడంతో.. తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపింది. అంతేకాదు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.సత్సంబంధాలు కోరుకుంటున్నామని..అయితే, కొత్త ప్రభుత్వం మాత్రం క్రికెట్‌ విషయంలో భారత్‌తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. ఐపీఎల్‌ ప్రసారాలపై ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించింది. కానీ జియోస్టార్‌ రంగంలోకి దిగి.. బంగ్లా స్థానిక బ్రాడ్‌కాస్టర్‌ బాకాయిల చెల్లింపులో జాప్యం చేస్తున్నందున కాంట్రాక్టు రద్దు చేసింది.బీసీసీఐకి లేఖఈ నేపథ్యంలో తాజాగా బీసీబీ మరో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. దైనిక్‌జాగరణ్‌ కథనం ‍ప్రకారం.. బీసీబీ బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడేందుకు టీమిండియాను తమ దేశానికి పంపాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఆసియా కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే క్రమంలోనే బీసీబీ ఈమేరకు దిగివచ్చినట్లు తెలుస్తోంది.అదే జరిగితే..కాగా వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్‌-2027 ఆతిథ్య హక్కులను బంగ్లాదేశ్‌ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాకుండా ఓవరాక్షన్‌ చేసిన బంగ్లాదేశ్‌కు టీమిండియా ఈ విషయంలో షాకిచ్చే అవకాశం ఉంది. ఒకవేళ భారత జట్టు గనుక ఆసియా కప్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లకపోతే.. వేదికను శ్రీలంక లేదంటే యూఏఈకి మార్చడం లాంఛనమే అవుతుంది.అదే జరిగితే బంగ్లాదేశ్‌ ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ మేరకు బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా బీసీబీ బీసీసీఐకి లేఖ రాసిన విషయాన్ని బంగ్లాదేశ్‌ బోర్డు అధికారి ఒకరు ధ్రువీకరించారు. రొటీన్‌ ప్రాసెస్‌లో భాగంగానే తాము ఈ పని చేసినట్లు వెల్లడించారు. చదవండి: లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!

Advertisement
Advertisement
 
Advertisement