ప్రధాన వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 31) జరుగుతున్న నాలుగో మ్యాచ్లో గత ఎడిషన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ పంజాబ్ హోం గ్రౌండ్ అయిన మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో (ముల్లాన్పూర్) జరుగుతుంది. ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఇరు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. అహ్మదాబాద్ వేదికగా గత ఎడిషన్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేయగా.. గుజరాత్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో (232) నిలిచిపోయింది. ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్గా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు.తుది జట్లు..పంజాబ్: ప్రభ్సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్లు: ప్రియాంష్ ఆర్య, హర్ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్గేగుజరాత్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(c), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, M షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్లు: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్రా
సంజూ శాంసన్ను రెచ్చగొట్టిన రియాన్ పరాగ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఓపెనర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను ప్రస్తుత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన తర్వాత వికెట్కీపింగ్ చేస్తున్న సంజూను కవ్విస్తూ ఓవరాక్షన్ చేశాడు. సంజూ తరహాలోనే కండలు చూపిస్తూ, ఇది నా పవర్ అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలైంది.pic.twitter.com/jV9dCFiTJn— crictalk (@crictalk7) March 31, 2026ఇది చూసి సంజూ అభిమానులు హర్ట్ అయ్యారు. హనుమంతుని ముందా కుప్పిగంతులు అంటూ పంచ్లు వేశారు. మాజీ కెప్టెన్ అన్న గౌరవం కూడా లేదా అంటూ మండిపడ్డారు. కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. వాస్తవానికి రియాన్ను ఇలాంటి అతి ప్రవర్తన కొత్తేమీ కాదు. అతనికి ఓవరాక్షన్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. అయితే, తాజా మాజీ కెప్టెన్ విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. రియాన్ ఏ ఉద్దేశంతో కండలు చూపించినా, అది సంజూ అభిమానులను మాత్రం హర్ట్ చేసింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రియాన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ సీఎస్కేపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో సీఎస్కేను 127 పరుగులకే కుప్పకూల్చి, ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలిసారి సీఎస్కేకు ఆడుతున్న సంజూ శాంసన్ (6) ఈ మ్యాచ్లో దారుణంగా విఫలం కాగా.. ఫుల్టైమ్ కెప్టెన్గా రియాన్ తొలి మ్యాచ్లోనే బోణీ కొట్టాడు.బౌలింగ్లో కలిసికట్టుగా సీఎస్కే పతనాన్ని శాశించిన రాయల్స్.. బ్యాటింగ్లో వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో విరుచుకుపడటంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది.
బంగ్లాదేశ్ పర్యటన.. కివీస్ వన్డే, టీ20 జట్ల ప్రకటన
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాట్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు చోటు దక్కింది. కాగా భారత్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది.ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది కివీస్ జట్టు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై 3-2తో గెలిచింది.పరిమిత ఓవర్ల సిరీస్లుఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్ 17న వన్డే సిరీస్ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్ ముగియనుంది.టామ్ లాథమ్ సారథ్యంలోఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కివీస్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు.కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్ 17, 20, 23)టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.బంగ్లాదేశ్తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు (ఏప్రిల్ 27, 29, మే 2)టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్పై నిషేధం
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫకర్ జమాన్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో బాల్ టాంపరింగ్ ఆరోపణలు రుజువు కావడంతో లీగ్ యాజమాన్యం ఇతనిపై రెండు మ్యాచ్ల నిషేధం విధించింది. పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్కు ఆడే జమాన్.. మార్చి 29న కరాచీ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం టీవీ స్క్రీన్లలోనూ స్పష్టం కనిపించింది.అయితే జమాన్ ఈ ఆరోపణలు ఖండించాడు. తాను ఎలాంటి బాల్ టాంపరింగ్కు పాల్పడలేదని అన్నాడు. దీంతో మ్యాచ్ రిఫరి రోషన్ మహానామా రంగంగలోకి దిగి విచారణ చేపట్టారు. ఇందులో జమాన్ దోషిగా తేలడంతో నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. బాల్ టాంపరింగ్ అంశం పీఎస్ఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని లెవల్–3 ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు శిక్ష రెండు మ్యాచ్ల నిషేధం.నిషేధం ప్రకటనలో జమాన్ ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్తో, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్తో జరుగనున్న మ్యాచ్లకు దూరం కానున్నాడు. అసలేం జరిగిందంటే..?కరాచీ కింగ్స్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ అఫ్రిది పేసర్ హరీస్ రవూఫ్కు అప్పగించాడు. అయితే ఈ క్రమంలో ఫకర్ జమాన్, అఫ్రిది, రవూఫ్ ముగ్గురూ కలిసి బౌలర్ ఎండ్ వద్ద మాట్లాడుకున్నారు. ఈ సమయంలో బంతికి ఒకరు చేతి నుంచి ఒకరు మార్చుకున్నారు.అయితే బంతిని ఫకర్ తన చేతి వేలితో గీకినట్లు కనిపించింది. దీంతో వెంటనే అంపైర్ బంతిని అతడి చేతి నుంచి తీసుకుని టాంపరింగ్కు గురైనట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో బంతిని మార్చడంతో పాటు లహోర్కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. జమాన్ జట్టు ఓటమిపాలైంది.
ఐపీఎల్ 2026లో విషాదం
ఐపీఎల్ 2026లో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్కు చెందిన 76 ఏళ్ల బ్రాడ్కాస్ట్ ఇంజనీర్ జాన్ విలియం లాంగ్ఫోర్డ్ ముంబైలోని తన హోటల్ గదిలో విగతజీవిగా పడి ఉన్నారు. లాంగ్ఫోర్డ్ మార్చి 24 నుంచి ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో ఉంటున్నారు. మార్చి 29న జరిగిన ముంబై ఇండియన్స్–కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో ఆయన పని చేశారు. ఆ రాత్రి హోటల్ గదిలోకి వెళ్లిన అతను.. మరుసటి రోజు ఉదయం ఎంతకీ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది స్పేర్ లాక్తో డోర్ ఓపెన్ చేసి చూడగా లాంగ్ఫోర్డ్ నేలపై పడివున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నివేదికలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించలేదని పోలీసులు తెలిపారు. లాంగ్ఫోర్డ్ కెరీర్ బ్రిటిష్ సిటిజన్ అయిన లాంగ్ఫోర్డ్ ఐపీఎల్ 2026లో ZOOM కమ్యూనికేషన్స్ తరఫున ఫ్రీలాన్స్ విజన్ సూపర్వైజర్గా పని చేస్తున్నారు. గతంలో అతను మహిళల ప్రీమియర్ లీగ్, 2024 పారిస్ ఒలింపిక్స్, 2010 FIFA వరల్డ్ కప్ వంటి ప్రధాన ఈవెంట్లలో కూడా సేవలందించారు. 1996 నుంచి 2011 వరకు భారత్, శ్రీలంక, వెస్టిండీస్లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్స్లో కూడా పని చేశారు. లాంగ్ఫోర్డ్కు ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్–కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి అసైన్మెంట్గా మిగిలిపోయింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ (78), ర్యాన్ రిక్ల్టన్ (81) మెరుపు ఇన్నింగ్స్ల కారణంగా ముంబై ఇండయన్స్ ఘన విజయం సాధించింది.
ఒకే సీజన్లో 67 వికెట్లు.. అయినా పట్టించుకోరు!
గత కొన్నాళ్లుగా టీమిండియా సెలక్షన్ కమిటీ వెటరన్ పేసర్ మహ్మద్ షమీని పట్టించుకోవడం మానేసింది. వన్డే వరల్డ్కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో ఈ రైటార్మ్ బౌలర్ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్గా నిలవడంలోనూ షమీది ముఖ్య భూమిక.అయితే, దాదాపు మూడేళ్లుగా షమీకి టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డేల్లో మేజర్ టోర్నీల్లో సత్తా చాటినా.. ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఫిట్నెస్ సమస్యల వల్లే షమీని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్వయంగా వెల్లడించాడు.ఒకే సీజన్లో 67 వికెట్లు..కానీ షమీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించడమే కాకుండా.. పూర్తి ఫిట్నెస్తో దేశవాళీ క్రికెట్ బరిలో దిగి సత్తా చాటాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు.ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తుండగా షమీ స్పందించాడు. శుభంకర్ మిశ్రా షోలో మాట్లాడుతూ.. ‘నేను అలసిపోయానని భావించిన మరుక్షణం రిటైర్ అవుతాను. అంతేగాని ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. నిజానికి రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే మనం వెనుకబడి పోతాము. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాముందుగా చెప్పినట్లు నేను అలసిపోయాను.. ఆడలేను అని భావించినపుడే నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నేను ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. అందుకు తగ్గట్లే సానుకూల ఫలితాలు వస్తున్నాయి’ అని షమీ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘బౌలర్గా వంద శాతం బాధ్యతలు నిర్వర్తించగలను.అంచనాలు అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. మిగతాదంతా నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానిని నేనైతే మార్చలేను. అంకితభావంతో ఆడటం మాత్రమే నా పని. లక్నో నన్ము నమ్మింది. కచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’’ అని షమీ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున 2023లో చివరగా టెస్టు ఆడిన షమీ.. 2025లో వన్డే, టీ20 మ్యాచ్లు ఆడాడు.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్
IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’
తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత కోల్కతా నైట్రైడర్స్ సారథి అజింక్య రహానే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తాను క్రికెట్ ఆడేది పూర్తిగా తన వ్యక్తిగతమని.. ప్రేక్షకుల్ని మురిపించడానికో.. విమర్శకులకు తానేంటో నిరూపించడానికో కాదని స్పష్టం చేశాడు. ఆటగాడిగానేతన భవిష్యత్తుపై, రిటైర్మెంట్పై వచ్చే ఊహాగానాలను రహానే (Ajinkya Rahane) కొట్టిపారేశాడు. 37 ఏళ్ల రహానే గత సీజన్లో ముంబై రంజీ ట్రోఫీ సారథ్యం నుంచి తప్పుకున్నాడు. దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ నాయకుడిగా కాకుండా ఆటగాడిగానే కొనసాగాడు. దీంతో ఇక విమర్శకులు అదేపనిగా రహానే రిటైర్మెంట్ ఖాయమనే వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా అదే పని ముంబైతో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో దీనిపై రహానే స్పందిస్తూ ‘ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటారు. ఇవేమి కొత్తకాదు కదా! దాదాపు 20 ఏళ్లుగా నా గురించి మాట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లని అలాగే కొనసాగనివ్వండి. నేనేమో నా బ్యాటింగ్ను ఆస్వాదిస్తాను. వాళ్లనలా చూడనివ్వండినా ఆటతీరేంటో నాకు తెలుసు. నా ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. అంతేతప్ప నేనేంటో... నా ప్రతిభేంటో కొత్తగా ఎవరికీ చూపించుకోవడానికి ఆడట్లేదు. ప్రేక్షకులు చూస్తున్నారు. వాళ్లనలా చూడనివ్వండి. విమర్శకులు విమర్శిస్తారు. వీళ్లను అలాగే చేయనివ్వండి’ అని అన్నాడు. ముంబైతో జరిగిన పోరులో రహానే మెరుపు ఫిఫ్టీతో అదరగొట్టాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన ‘జింక్స్’... 5 సిక్సర్లు, మూడు బౌండరీలు బాదాడు. గత రెండు మూడేళ్లుగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నా బ్యాటింగ్ను మెరుగుపర్చుకున్న తీరుపట్ల తానెంతో సంతోషంగా ఉన్నానన్నాడు. ఓ క్రికెటర్గా, బ్యాటర్గా ఎదగడం ముఖ్యమని, తానిప్పుడు చేస్తున్నది కూడా అదేనని రహానె చెప్పుకొచ్చాడు. ముంబైతో జరిగిన పోరులో తాము బాగానే ఆడామని, కీలకమైన తరుణంలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా చేయలేకపోయామని అన్నాడు.మా ఓటమికి కారణం అదే‘ముందుగా మేం 220 స్కోరు చేస్తే చాలానుకున్నాం. కానీ ఓ దశలో 235 నుంచి 240 పరుగులు చేస్తామని కూడా అనిపించింది. అయితే బుమ్రా స్పెల్ మా జోరుకు అడ్డుకట్ట వేసింది. అతని రెండు ఓవర్ల స్పెలే మరిన్ని పరుగులు చేయకుండా నిరోధించింది’ అని రహానే అన్నాడు.అనుభవలేమి బౌలింగ్ కూడా తమ ఓటమికి కారణమని రహానే చెప్పాడు. వైభవ్, కార్తీక్ త్యాగి, ముజరబానిలు తేలిపోయారని చెప్పాడు. ముజరబానికి అంతర్జాతీయ అనుభవమైతే ఉండొచ్చు కానీ ఐపీఎల్ అనుభవమైతే లేదన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలం కూడా పనిచేయలేదని, దీనివల్లే ముంబై జోరుకు ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయామన్నాడు. చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్
బెంగాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీలోకి టెన్నిస్ దిగ్గజం
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.పేస్ పాపులారిటీ యువ ఓటర్లపై సానుకూల ప్రభావం చూపుతుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. 1973 జూన్ 17న కోల్కతాలో లియాండర్ పేస్ జన్మించారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో బ్రెజిల్కు చెందిన ఫెర్నాండో మెలిగెనిని ఓడించి పేస్ కాంస్యం గెలిచారు. వ్యక్తిగత ఒలింపిక్ పతకం గెలిచిన కేడీ జాధవ్ తర్వాత తొలి భారతీయ క్రీడాకారుడిగా పేస్ నిలిచారు.ప్రొఫెషనల్ టెన్నిస్లో సింగిల్స్ కంటే డబుల్స్పై దృష్టి సారించిన పేస్ పురుషుల గ్రాండ్స్లామ్ టోర్నీల్లో డబుల్స్లో ఎనిమిది సార్లు, పది సార్లు మిక్స్డ్ డబుల్స్ లో టైటిల్స్ సాధించాడు. దేశానికి చేసిన సేవలకుగాను 1990లో అర్జున, 1996లో ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ, 2014 జనవరిలో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కీలకమైన యువత, క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పేస్ను తమ పార్టీలోకి ఆహ్వానించడాన్ని బీజేపీ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడిలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఇది కీలక పరిణామం. #WATCH | Delhi: Former ace Tennis star Leander Paes joins the BJP, in the presence of Union Ministers Kiren Rijiju and Sukanta Majumdar. pic.twitter.com/qIDW1OovWz— ANI (@ANI) March 31, 2026
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్మురేపాడు. మెరుపు అర్ధ శతకం బాది శెభాష్ అనిపించుకున్నాడు.ప్రశంసల వర్షంగువాహటి వేదికగా కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అతడి విధ్వంసకర ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక వైభవ్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా రాజస్తాన్ చెన్నైపై అలవోక విజయం సాధించింది. 128 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అయితే ఓ అడుగు ముందుకేసి.. వైభవ్ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలనే ప్రతిపాదన తెచ్చాడు. క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ..నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే‘‘అతడు ఎప్పుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడు? అని నేనెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాను. ఇది కాస్త తొందరపాటే అని అనిపించవచ్చు. ఐపీఎల్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి ఇన్నింగ్స్. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.ఒకవేళ నేనే గనుక సెలక్టర్ అయి ఉంటే వైభవ్ను ఈ టూర్కు కచ్చితంగా ఎంపిక చేస్తా. ప్రస్తుతానికి అతడికి జట్టులో చేరాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ జట్టుకు అతడి అవసరం ఉంటుందేమో!.. పదిహేనేళ్ల పిల్లాడిని టూర్కు అనుమతిస్తారా? అంటే నేనేమీ చెప్పలేను.కానీ అతడు ఇప్పటికే ఆటగాడిగా పరిణతి సాధించాడు. టీమిండియా తరఫున కూడా కచ్చితంగా సత్తా చాటగలడు’’ అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా వైభవ్ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు.చదవండి: Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!
కేకేఆర్ను మోసం చేసిన గ్రీన్?.. రీఫండ్ చెల్లించాల్సిందే!
భారత క్రికెట్ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గురించి చర్చ నడుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడి కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడికి సరైన వారసుడిగా గ్రీన్ను భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.అయితే, ఊహించని రీతిలో కేకేఆర్కు షాక్ తగిలింది. ఈ సీజన్లో కేకేఆర్ తొలుత ముంబై ఇండియన్స్తో తలపడగా.. ఆ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేయనేలేదు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు.. అందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బదులిచ్చిన తీరు ఇప్పుడు హాట్టాపిక్గా మారిపోయింది.క్రికెట్ ఆస్ట్రేలియానే అడగండి‘ఆ విషయం ఏదో క్రికెట్ ఆస్ట్రేలియానే (CA) అడగండి’... ముంబైతో మ్యాచ్లో కామెరాన్ గ్రీన్ (Cameron Green) బౌలింగ్ చేయకపోవడంపై అడిగిన ప్రశ్నకు అజింక్య రహానే సమాధానమిది. ఒక ఐపీఎల్ టీమ్ సారథిగా తన జట్టు సభ్యుడి గురించి తనకే తెలీదన్నట్లుగా ఒకింత అసహనంతో రహానే ఈ మాట చెప్పడం వివాదాన్ని రేపింది. 10–12 రోజుల్లో దీనిపై ఆస్ట్రేలియా వెంటనే స్పందించింది. ‘గ్రీన్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతనిపై భారం ఎక్కువ పడకూడదని బౌలింగ్కు దూరంగా ఉంటున్నాడు. 10–12 రోజుల్లో అతను బౌలింగ్ చేయవచ్చు. ఈ విషయం కేకేఆర్ యాజమాన్యానికి కూడా తెలుసు’ అని సీఏ స్పష్టం చేసింది. ఒక ఆల్రౌండర్ బౌలింగ్ చేయలేకపోవడం కోల్కతా తుది జట్టులో కూర్పుకు సమస్యగా మారింది. నిజానికి మ్యాచ్కు రెండు రోజుల ముందు, మ్యాచ్ ఆరంభానికి కొద్ది సేపు ముందు కూడా గ్రీన్ బౌలింగ్ చేశాడు. కానీ మ్యాచ్లో మాత్రం అతను బంతిని అందుకోలేదు! ఇటీవల టీ20 వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లూ కలిపి గ్రీన్ 19 బంతులే వేశాడంటే ఇప్పటికి దీనిపై కోల్కతా యాజమాన్యానికి స్పష్టత వచ్చేసి ఉంటుంది. రూ.25.20 కోట్లా!!!.. తెలివైన మోసం?నిజానికి తాజా పరిస్థితికి నైట్రైడర్స్ స్వయంకృతమే కారణం అనిపిస్తుంది. గ్రీన్ తన వైపు నుంచి తెలివిగా వేలంలోకి అడుగు పెట్టాడు. రిజిస్ట్రేషన్లో కేవలం ‘బ్యాటర్’ జాబితాలోనే తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇలా ఎందుకని అడిగితే తన మేనేజర్ పొరపాటు అని, బౌలింగ్ కూడా చేస్తానని చెప్పాడు. కానీ అది సాంకేతికంగా ముందు జాగ్రత్త కోసమే ‘ఆల్రౌండర్’ జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు. ఆండ్రీ రసెల్ రిటైర్మెంట్తో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో గ్రీన్ పేరు వచ్చింది. వేలం నిబంధనల ప్రకారం మొదటి ‘సెట్’లో బ్యాటర్లు వస్తారు. ఆ సమయంలో అన్ని జట్ల వద్ద భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది. వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిసహజంగానే జట్లు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ‘బ్యాటర్’ జాబితాలో వచ్చిన గ్రీన్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీ పడింది. అప్పటికే గ్రీన్ బౌలింగ్ గురించి టీమ్కు సమాచారం ఉండే ఉంటుంది. ఎందుకంటే 2025 డిసెంబర్లో వేలం జరగ్గా... అంతకుముందు సంవత్సరంపాటు సెప్టెంబరు 24 నుంచి అక్టోబర్ 2025 వరకు గాయంతో గ్రీన్ బౌలింగ్ చేయలేదు. టీ20ల్లో బ్యాటర్గా గ్రీన్ రికార్డు ఏమీ ఘనంగా లేదు. పైగా కొన్ని బంతుల్లో మ్యాచ్ గమనాన్ని మార్చే విధ్వంసకర బ్యాటర్ కూడా కాదు. అయినా సరే వెర్రిగా వేలంలో ముందుకు వెళ్లిన కేకేఆర్ కేవలం అతని బ్యాటింగ్ కోసం ఏకంగా రూ.25.20 కోట్లు ఖర్చు చేసింది! విఫల సమర్థనఇప్పుడేమో బౌలింగ్ చేయడం లేదని వాపోతోంది. నిజానికి గ్రీన్ కోసం వెచ్చించిన మొత్తంపై సంతోషమే అంటూ కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ విఫల సమర్థన కొత్త కాదు. 2025 సీజన్ కోసం వెంకటేశ్ అయ్యర్కు రూ. 23.75 కోట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ఆ సీజన్లో అతను అన్ని మ్యాచ్లు కూడా ఆడలేదు. 7 ఇన్నింగ్స్లలో కలిపి ఒకే అర్ధసెంచరీతో 142 పరుగులు చేసిన వెంకటేశ్ ఒక్క బంతి కూడా బౌల్ చేయలేదు! రీఫండ్ చెల్లించాల్సిందే!ఇదిలా ఉంటే.. గ్రీన్ విషయంలో భారత మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కోల్కతా జట్టుకు అండగా నిలిచాడు. ‘ఒకవేళ మనం ఆల్రౌండర్గా ఆడే వ్యక్తికి భారీ మొత్తం చెల్లిస్తే.. అతడు కేవలం బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటే.. రీఫండ్ పొందడం కనీస అర్హత’ అని ట్వీట్ చేశాడు. అయితే, అతడి పోస్ట్పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరేమో గ్రీన్ కేకేఆర్ను తెలివిగా మోసం చేశాడని అంటుండగా.. మరికొందరు మాత్రం అన్నీ తెలిసే కేకేఆర్ ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందని చివాట్లు పెడుతున్నారు. చదవండి: IPL 2026: నిషేధిత బ్యాట్తో దొరికిపోయిన సర్ఫరాజ్ ఖాన్
సవాల్కు ప్రజ్ఞానంద సిద్ధం
పఫోస్ (సైప్రస్): ప్రపంచ చాంపియన్ను ఢీకొట్టే అర్...
ఆంటోనెల్లికి ‘పోల్ పొజిషన్’
సుజుకా (జపాన్): ఫార్ములావన్ (ఎఫ్1) జపాన్ గ్రాం...
’అదంతా మీడియా, సోషల్ మీడియా సృష్టే’
న్యూఢిల్లీ: హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీత...
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ అరెస్ట్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్వుడ్స్ను ఫ్లోరిడా పోలీసులు...
IPL 2026: ’ప్రేక్షకుల్ని మురిపించడానికి ఆడను’
తనను విమర్శించే వారికి భారత మాజీ కెప్టెన్, ప్రస్త...
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ!
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ స్టార్ వైభవ్...
కేకేఆర్ను మోసం చేసిన గ్రీన్?.. రీఫండ్ చెల్లించాల్సిందే!
భారత క్రికెట్ వర్గాల్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క...
రాయల్స్ రాజసం
ఐపీఎల్లో గత ఏడాది రాజస్తాన్, చెన్నై జట్లు చివరి ర...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో RCBతో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ
