ప్రధాన వార్తలు
అర్షదీప్ సింగ్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
భారత నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజ్లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అర్షదీప్ డారిల్ మిచెల్పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్ మిచెల్పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్ను బలంగా తాకింది. Final Hungama : Daryl Mitchell 🆚 Arshdeep Singh Surya ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲವೂ ಶಾಂತ... SKY Handle ಮಾಡಿದ ರೀತಿ ನಿಜಕ್ಕೂ ಅದ್ಬುತ!👏🏻🤝🏻ವೀಕ್ಷಿಸಿ | ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#T20WorldCup2026Final pic.twitter.com/K4ECnGh9ra— Star Sports Kannada (@StarSportsKan) March 8, 2026ఆ సమయంలో మిచెల్ సైతం సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్-మిచెల్ కరచాలనం చేసుకున్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్ చెల్లించుకున్నాడు.కాగా, ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.
ప్రపంచకప్లో భారత్పై మెరుపు శతకం.. ఇంగ్లండ్ యువ కెరటానికి జాక్పాట్
టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్గా నియమించింది. లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో బేతెల్కు కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది. 22 ఏళ్ల బేతెల్కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.ఫీనిక్స్ కెప్టెన్గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బేతెల్ తాజాగా భారత్తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్లో బేతెల్ 8 ఇన్నింగ్స్ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.ఐపీఎల్లో సవాలుహండ్రెడ్ లీగ్లో బేతెల్కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్లో బేతెల్ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.
ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్పై బిగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్ను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 2026 ఎడిషన్ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.ఓపెనింగ్ మ్యాచ్లో ఎవరెవరు..? సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్ కింగ్స్ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో ఐపీఎల్ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్ అనే సాంప్రదాయానికి బ్రేక్ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
పెళ్లిపీటలెక్కనున్న స్టార్ స్పిన్నర్.. ఎప్పుడంటే?
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ముసోరిలో ఒక రిసార్ట్ వేదికగా జరగనుంది. గతేడాది జూన్ 4న లక్నోలోని ఒక హోటల్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ఇక మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే వాస్తవానికి కుల్దీప్ వివాహం గతేడాని నవంబర్లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్ జట్టులోకి కుల్దీప్ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో కేవలం పాకిస్థాన్తో మ్యాచ్లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం ఆడాడు.2013-14 రంజీ సీజన్లో ఉత్తర్ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు. ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు. మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు. కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది.
‘అడాలజ్ స్టెప్వెల్’ చరిత్ర తెలుసా?
అహ్మదాబాద్: ప్రపంచకప్తో భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాంధీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్తో సందడి చేశాడు. అతను కప్తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్ కట్టడం వద్ద కప్ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్... కిస్సిక్...’ మోత మోగాయి.సుప్రసిద్ధ ‘అడాలజ్ స్టెప్వెల్’ (Adalaj Stepwell) 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్ను నిర్మించింది. ఆమె వాఘెలా సంస్థానధీశుడు రాణా వీర్ సింగ్ భార్య. రాణా వీర్ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్ స్టెప్వెల్ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా విన్నర్స్ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫొటోలు దిగారు.𝐄𝐭𝐜𝐡𝐞𝐝 𝐈𝐧 𝐆𝐥𝐨𝐫𝐲 🏆📸 Captain Surya Kumar Yadav with the prestigious ICC Men’s T20 World Cup Trophy 😍💙#TeamIndia | #T20WorldCup | #MenInBlue | @surya_14kumar pic.twitter.com/oxK2VVPMYe— BCCI (@BCCI) March 9, 2026 ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్ ఆలయానికి ప్రపంచకప్ను తీసుకువెళ్లి పూజలు చేశారు. పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు ప్రపంచకప్తో దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.#WATCH | Gujarat | Team India Skipper Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #icct20worldcup2026 pic.twitter.com/QoCBEa6vPm— ANI (@ANI) March 8, 2026
30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం రెండు ఫార్మాట్లకే పరిమితమై ఉండేది. ఒకటి టెస్టు క్రికెట్, మరొకటి వన్డే ఫార్మాట్. ఈ రెండు ఫార్మాట్లను తలదన్నేలా 20 ఏళ్ల క్రితం పుట్టుకొచ్చింది టీ20 ఫార్మాట్. దనాధన్ ఆటతో కొద్దికాలంలోనే క్రికెట్ అభిమానుల ఆదరణ చూరగొన్న ఈ పొట్టి ఫార్మాట్ ఇవాళ ఎనలేని క్రేజ్ను సొంతం చేసుకుంది. 20 ఓవర్ల ఆటలో క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ బౌండరీలు, సిక్సర్లు కొట్టాలనే తాయత్రయంతోనే ఉంటారు. కానీ ఇన్నింగ్స్లో చివరి 5 ఓవర్లను డెత్ ఓవర్లుగా పిలవడం ఆనవాయితీ. ఈ ఓవర్లలో నిఖార్సైన ఇన్నింగ్స్లు ఆడే బ్యాటర్ను ఫినిషర్గా పిలుస్తుంటారు. టీమిండియాకు ప్రస్తుతం శివమ్ దూబే రూపంలో మంచి హిట్టర్ దొరికాడు. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్లో శివమ్ దూబే 9 మ్యాచ్ల్లో 169 స్ట్రైక్రేట్ 235 పరుగులు చేసి భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దూబే ప్రదర్శనను ఇప్పటి అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు కానీ నిజమైన దూబే 30 ఏళ్ల ముందే ప్రపంచానికి పరిచయమయ్యాడంటే నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం.పాక్ను చీల్చిచెండాడి..1990ల్లో 50 ఓవర్ల ఆటలో 250 పరుగులు చేయడం కష్టంగా ఉండేది. టాపార్డర్, మిడిలార్డర్ రాణిస్తే తప్ప స్కోరుబోర్డు పరిగెత్తకపోయేది. అయితే 1996 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య క్వార్టర్ఫైనల్ పోరు రసవత్తరంగా సాగింది. ఆ మ్యాచ్లో ఓపెనర్ నవ్జ్యోత్ సిద్ధూ 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో యాంకర్ పాత్రను పోషించాడు. సచిన్, కాంబ్లీ, మంజ్రేకర్, అజారుద్దీన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజయ్ జడేజా (25 బంతుల్లో 45, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిఖార్సైన ఆటతీరుతో పాక్ను హడలెత్తించాడు. అప్పట్లో జడేజా ఆడిన ఆట ఇవాళ దూబే ఆట కంటే రెట్టింపు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి పాక్ జట్టులో వకార్ యూనిస్, ముస్తాక్ అహ్మద్, సలీమ్ మాలిక్ వంటి బలమైన బౌలింగ్ లైనప్ను చీల్చిచెండాడమే ఇందుకు కారణం. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 248 పరుగులకు ఆలౌటైంది. 1996 ప్రపంచకప్లో సెమీస్ చేరినప్పటికీ ఆనాటి చాంపియన్స్ శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.నిఖార్సైన ఆల్రౌండర్..ఇక 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అజయ్ జడేజా భారత జట్టు తరఫున 196 వన్డేల్లో 5,359 పరుగులు, 15 టెస్టుల్లో 576 పరుగులు చేశాడు. అయితే 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలడంతో అజయ్ జడేజాపై ఐదేళ్ల నిషేధం పడింది. కానీ జట్టులో కొనసాగినన్ని రోజులు అజయ్ జడేజా నాణ్యమైన ఆల్రౌండర్గా పేరు గడించాడు. ఆ తర్వాత డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అజయ్ జడేజా స్థానాన్ని భర్తీ చేయడంలో విజయవంతమయ్యాడు.చదవండి: అందరూ మ్యాచ్ విన్నర్లే!
టైటిల్ నిరీక్షణ ముగించేందుకు... స్విస్ ఓపెన్ బరిలో శ్రీకాంత్
గత ఏడాది రెండు టైటిల్స్కు విజయం దూరంలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ షట్లర్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ మరోసారి టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. నేడు మొదలయ్యే స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోరీ్నలో శ్రీకాంత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ జేసన్ గుణవాన్ (హాంకాంగ్)తో శ్రీకాంత్ తలపడతాడు. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలవుతాయి. గత సంవత్సరం మలేసియా మాస్టర్స్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఫైనల్కు చేరి రన్నరప్తో సరిపెట్టుకున్న శ్రీకాంత్ ఈ సీజన్లో టైటిల్ నిరీక్షణకు తెర దించాలని పట్టుదలతో ఉన్నాడు.శ్రీకాంత్ చివరిసారి 2017లో ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత అతను మరో అంతర్జాతీయ టోరీ్నలో టైటిల్ సాధించలేదు. శ్రీకాంత్తోపాటు స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ తరఫున హెచ్ఎస్ ప్రణయ్, ఆయుశ్ శెట్టి, కిరణ్ జార్జి, తరుణ్ మన్నేపల్లి పోటీపడుతున్నారు. క్వాలిఫయింగ్లో శంకర్ ముత్తుస్వామి బరిలో ఉన్నాడు.మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్వన్ పీవీ సింధు ఈ టోరీ్నకి దూరంగా ఉంది. వాస్తవానికి సింధు ఎంట్రీ ఖరారు చేసినా... ఇటీవల ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు దుబాయ్ మీదుగా బర్మింగ్హామ్ చేరుకోవల్సింది. కానీ ఇరాన్తో అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం మొదలుకావడం... దుబాయ్ విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ సంఘటన తర్వాత దుబాయ్ గగనతలం మూసివేయడంతో సింధు మూడు రోజులపాటు దుబాయ్లోనే చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. విమానాల రాకపోకలు పునరుద్ధరణ తర్వాత స్వదేశానికి చేరుకున్న సింధు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆమె స్విస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. సింధు గైర్హాజరీలో భారత్ నుంచి మహిళల సింగిల్స్లో ఉన్నతి హుడా, మాళవిక బన్సోద్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్, తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు పాల్గొంటున్నాయి.
గుజరాత్ జెయింట్స్ కోచ్గా ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ఐపీఎల్-2026 సీజన్కు ముందు గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్ను తమ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా నియమిస్తున్నట్లు గుజరాత్ ప్రకటించింది. వరల్డ్కప్ విన్నర్, డేంజరస్ ప్లేయర్ హేడెన్ రాకతో టైటాన్స్ బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది."మా ప్రయాణంలో మాథ్యూ హేడెన్ నియామకం ఒక కీలకమైన ఘట్టం. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాథ్యూను మా బ్యాటింగ్ కోచ్గా నియమించాము. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో అతడి అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది" గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ విధ్వంసకర బ్యాటర్ గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, పార్థివ్ పటేల్లతో కలిసి పనిచేయనున్నాడు. హేడన్ గతంలో 2021 టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేశాడు. కానీ పూర్తి స్ధాయిలో ఎప్పుడు కోచ్గా బాధ్యతలు నిర్వర్తించలేదు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న హేడెన్.. ఐపీఎల్లో కూడా తన మార్క్ను చూపించాడు.హేడెన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్లు ఆడారు. 2010లో టీమ్ ని టైటిల్ గెలిపించగా, 2009లో 12 మ్యాచ్ల్లో 572 రన్స్ చేసి ఆరెంజ్ కాప్ను కూడా సొంతం చేసుకున్నాడు. పవర్ ప్లే ఓవర్లలో విధ్వంసకర బ్యాటింగ్తో ఆట తీరునే మార్చేసిన హేడెన్, ఇప్పుడు కోచ్గా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడాలి. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది.చదవండి: Teamindia: బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?
బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?
టీ20 వరల్డ్కప్-2026 విజేత భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ.131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది. "టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్ను రిటైన్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచిన టీమిండియాకు రూ. 131 కోట్ల రూపాయల క్యాష్ రివార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ అద్భుత విజయానికి కారకులైన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు అభినందనలు" అని బీసీసీఐ ఓ ప్రకటలో పేర్కొంది.కాగా గతంలో టీ20 ప్రపంచకప్-2024ను రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్లు ప్రకటించింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆ మొత్తాన్ని పెంచి రూ. 131 కోట్లు ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తం అందింది. ఛాంపియన్గా నిలిచినందుకు భారత్కు సుమారు రూ. 27.48 కోట్ల ప్రైజ్మనీనీ ఐసీసీ అందజేసింది. అంతేకాకుండా గ్రూపు స్టేజి, సూపర్-8 దశల్లో గెలిచి ప్రతీ మ్యాచ్కు అదనంగా సుమారు రూ. 28.6 లక్షల చొప్పున భారత్కు బోనస్ లభించనుంది.అహ్మదాబాద్లో అదుర్స్ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసింది. దీంతో ముచ్చటగా మూడో పొట్టి ప్రపంచకప్ టైటిల్ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ అవతరించింది.ఈ తుది పోరులో మెన్ ఇన్ బ్లూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 159 పరుగులకే కుప్పకూలింది.చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
సెమీస్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపి...
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యా...
మళ్లీ ఓడిన గుకేశ్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ప్రాగ్ చెస్ ఫెస్టివల...
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపి...
బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?
టీ20 వరల్డ్కప్-2026 విజేత భారత జట్టుకు బీసీసీఐ...
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్
పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్, సియాల్కోట్ స్టార్...
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్ ఇదే.. పాక్ నుంచి ఒక్కరు కూడా!
టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను భారత్ కైవసం చేసుక...
ఇండియా క్రికెట్ను నాశనం చేసింది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ను సూర్యకుమార్ యాదవ్ స...
క్రీడలు
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వీడియోలు
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
చరిత్ర సృష్టించిన భారత్
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
