Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan fans booing India U19 Players How Vaibhav Suryavanshi Reacted1
పాక్‌ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్‌ సూర్యవంశీ ఏం చేశాడంటే..

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్‌-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని టార్గెట్‌ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్‌ గెలుపుఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ (యూత్‌ వన్డే)-2025 టోర్నమెంట్‌ దుబాయ్‌ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌.. గ్రూప్‌-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్‌ దశలో పాక్‌ను భారత్‌ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్‌ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక ఆసియా కప్‌ అండర్‌-19 టైటిల్‌ను భారత్‌ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్‌ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ.. పాక్‌ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్‌ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత అండర్‌-19 ఆటగాళ్లు టీమ్‌ బస్‌ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్‌ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్‌ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్‌ ఫ్యాన్స్‌ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్‌ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్‌-19 ఆసియా కప్‌ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్‌ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్‌ టోర్నీలో వైభవ్‌ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్‌ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025

Next edition of Afghanistan Premier League slated for late 20262
మరో టీ20 లీగ్‌.. ఐపీఎల్‌ తర్వాత ఏ లీగ్‌కు ఆదరణ ఎక్కువ..?

పొట్టి క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు మరో లీగ్‌ సిద్దమైంది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL T20) ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ లీగ్‌ 2018లోనే ప్రారంభమైంది. అయితే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ, చివరికి ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్దమైంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడదలైంది.APL T20 లీగ్‌ యూఏఈలో జరుగనున్నా, ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఆథ్వర్యంలోనే జరుగుతుంది. తొలి ఎడిషన్‌ తరహాలోనే 2026 ఎడిషన్‌లోనూ ఐదు ఫ్రాంచైజీలు (బాల్ఖ్ లెజెండ్స్, కాబూల్ జ్వానన్, కందహార్ నైట్స్, నంగర్‌హార్ లియోపార్డ్స్, పక్తియా పాంథర్స్) పాల్గొంటాయి. తొలి ఎడిషన్‌లో బల్క్‌ లెజెండ్స్‌ విజేతగా నిలిచింది. ఈ లీగ్‌లో కూడా ఇతర లీగ్‌ల్లో లాగే భారత ఆటగాళ్లు మినహా ప్రపంచవాప్తంగా ఉండే ఆటగాళ్లు పాల్గొంటారు.ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ రీఎంట్రీ వార్త నేపథ్యంలో ప్రైవేట్‌ టీ20 లీగ్‌లకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐసీసీ ఫుల్‌టైమ్‌ మెంబర్‌గా ఉండే ప్రతి దేశంలో ఓ ప్రైవేట్‌ టీ20 లీగ్‌ జరుగుతుంది. వీటిలో భారత్‌లో జరిగే ఐపీఎల్‌కే ఆదరణ ఎక్కువన్నది కాదనలేని సత్యం. అయితే, ఐపీఎల్‌ తర్వాత రెండో స్థానం ఏ లీగ్‌దన్నదే ప్రస్తుత చర్చ.ఆదరణ ప్రకారం చూసినా, బిజినెస్‌ పరంగా చూసినా ఐపీఎల్‌ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌దే రెండో స్థానమన్నది బహిరంగ రహస్యం. ఐపీఎల్‌ మొదలైన మూడేళ్ల తర్వాత పురుడుపోసుకున్న ఈ లీగ్‌, ప్రారంభ దినాల్లో పెద్దగా సక్సెస్‌ కాకపోయినా, క్రమంగా ఆదరణ చూరగొంది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్ల స్టార్లందరూ పాల్గొనడంతో పాటు భారత్‌ మినహా ప్రపంచ క్రికెట్‌ స్టార్లంతా పాల్గొంటారు. ఐపీఎల్‌ తరహాలోనే ఈ లీగ్‌ కూడా సదీర్ఘంగా సాగుతుంది.ఐపీఎల్‌, బీబీఎల్‌ తర్వాత అత్యంత​ ప్రజాదరణ పొందిన లీగ్‌ ఏదంటే.. 2023లో ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ అని చెప్పాలి. ఈ లీగ్‌లో కూడా బీబీఎల్‌ తరహాలోనే స్థానిక స్టార్లు, విదేశీ స్టార్లు పాల్గొంటారు. SA20లో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్‌ ఆధారిత ఫ్రాంచైజీలే కావడం విశేషం. పారితోషికాల విషయంలో ఈ లీగ్‌ ఐపీఎల్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ లీగ్‌ పుణ్యమా అని సౌతాఫ్రికా టీ20 జట్టు చాలా పటిష్టంగా తయారయ్యిందనే టాక్‌ ఉంది.సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తర్వాత ఇంచుమించు అదే స్థాయి ఆదరణ కలిగిన లీగ్‌గా ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌కు పేరుంది. దుబాయ్‌లో జరిగే ILT20, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ప్రారంభమైన 2023వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో కూడా చాలావరకు ఐపీఎల్‌ ఆధారిత ఫ్రాంచైజీలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీగ్‌ నాలుగో ఎడిషన్‌ నడుస్తుంది.SA20, ILT20 తర్వాత ఇప్పుడిప్పుడే యూఎస్‌ఏలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (MLC), ఇంగ్లండ్‌లో జరిగే ద హండ్రెడ్‌ లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023లో ప్రారంభం కాగా.. హండ్రెడ్‌ లీగ్‌ 2021లో మొదలైంది. హండ్రెడ్‌ లీగ్‌ 100 బంతుల ఫార్మాట్లో జరిగినా టీ20 ఫార్మాట్‌ పరిధిలోకే వస్తుంది.ఈ లీగ్‌ల కంటే చాలా ముందుగానే ప్రారంభమైనా పాకిస్తాన్‌లో జరిగే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (2016), బంగ్లాదేశ్‌లో జరిగే బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (2012), వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (2013), శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్‌ లీగ్‌ (2020) పెద్దగా సక్సెస్‌ కాలేదు. పైన పేర్కొన్న లీగ్‌లతో పోలిస్తే ఈ లీగ్‌ల్లో ఆటగాళ్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా స్టార్‌ క్రికెటర్లు ఈ లీగ్‌ల్లో పాల్గొనేందుకు పెద్దగా సుముఖత చూపారు. దీంతో ఆటోమేటిక్‌గా ఈ లీగ్‌లకు ఆదరణ తక్కువగా ఉంటుంది. పీఎస్‌ఎల్‌ లాంటి లీగ్‌ ఐపీఎల్‌కు తాము సమానమని జబ్బలు చరుచుకుంటున్నా, ఆ లీగ్‌లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్లు ఇష్టపడరు. భద్రతా కారణాలు, సదుపాయాల లేమి, పారితోషికాలు తక్కువగా ఉండటం లాంటి కారణాల చేత విదేశీ ప్లేయర్లు ఈ లీగ్‌ ఆడేందుకు రారు.ఐపీఎల్‌తో పోలిస్తే ఆటగాళ్ల పారితోషికాలు పీఎస్‌ఎల్‌లో కనీసం పావు శాతం కూడా ఉండవు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో కెమరూన్‌ గ్రీన్‌కు రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్ల భారీ మొత్తం దక్కింది. పీఎస్‌ఎల్‌లో ఇంత మొత్తంలో పది శాతం కూడా ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌కు దక్కదు.

Virat Kohli on Cusp of major List A record VHT Comeback For Delhi3
Virat Kohli: చరిత్రకు ఒ‍క్క పరుగు దూరంలో..

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్‌ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ కెప్టెన్‌.ఇక ఐపీఎల్‌లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్‌ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.వరుస సెంచరీలుఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్‌ ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచ్చాడు.అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్‌తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్‌టైమ్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్‌తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.చరిత్రకు ఒక్క పరుగు దూరంలోఅంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఓవరాల్‌గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్‌లో ఒక్క రన్‌ చేస్తే.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్‌గా నిలుస్తున్నాడు.ఈ జాబితాలో సచిన్‌ టెండుల్కర్‌ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్‌ హజారే ట్రోఫీ, భారత్‌-ఎ, జోనల్‌ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్‌-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్‌గా ఈ లిస్టులో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ గ్రాహమ్‌ గూచ్‌ 22,211 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు👉సచిన్‌ టెండుల్కర్‌- 538 ఇన్నింగ్స్‌లో 21,999 రన్స్‌👉విరాట్‌ కోహ్లి- 329 ఇన్నింగ్స్‌లో 15,999 రన్స్‌👉సౌరవ్‌ గంగూలీ- 421 ఇన్నింగ్స్‌లో 15,622 రన్స్‌ 👉రోహిత్‌ శర్మ- 338 ఇన్నింగ్స్‌లో 13,758 రన్స్‌👉శిఖర్‌ ధావన్‌- 298 ఇన్నింగ్స్‌లో 12,074 రన్స్‌.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్‌ ఎవరు?

From a run filled SMAT 2025 to a disappointing U19 Asia Cup, tale of two different outings for Ayush Mhatre4
అక్కడేమో సెంచరీల మోత.. ఇక్కడేమో ఇలా..!

భారత పురుషుల అండర్‌-19 జట్టు కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో దారుణంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ టోర్నీలో సహచరులంతా రాణించినా (పాక్‌తో జరిగిన ఫైనల్‌ మినహా) మాత్రే ఒ‍క్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 సగటున, 112 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.ఫైనల్లో పాకిస్తాన్‌ చేతిలో దారుణ పరాజయం​ వరకు మాత్రే వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టును విజయవంతంగా నడిపించాడన్న తృప్తి ఉండేది. అయితే ఫైనల్లో వ్యక్తిగత వైఫల్యాలను కొనసాగించడంతో పాటు టాస్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భారత క్రికెట్‌ అభిమానులకు మాత్రే టార్గెట్‌ అయ్యాడు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమైన మాత్రే టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మాత్రే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకోకుండా బౌలింగ్‌ ఎంచుకొని ప్రత్యర్దికి భారీ పరుగులు చేసే ఆస్కారమిచ్చాడు. ఆతర్వాత లక్ష్య ఛేదనలో నిర్లక్ష్యమైన షాట్‌ ఆడి వికెట్‌ పారేసుకున్నాడు. మాత్రే వికెట్‌తోనే టీమిండియా పతనం మొదలైంది. పాక్‌ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 156 పరుగులకే చాపచుట్టేసి 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ ఓటమి తర్వాత టోర్నీ మొత్తంలో వ్యక్తిగతంగా, ఫైనల్లో కెప్టెన్‌గానూ విఫలమైన ఆయుశ్‌ మాత్రేపై ముప్పేటదాడి మొదలైంది. దాయాది చేతిలో ఘెరంగా ఓడినందుకుగానూ భారత క్రికెట్‌ అభిమానులు అతన్ని సోషల్‌మీడియా వేదికగా టార్గెట్‌ చేస్తున్నారు. ఎంతో గొప్ప ఆటగాడు, కెప్టెన్‌ అవుతాడనుకుంటే పాక్‌ చేతిలో ఘోరంగా ఓడి భారత్‌ పరువు తీశాడంటూ అభిమానులు అక్షింతలు వేస్తున్నారు. ఈ ఓటమి మాత్రే కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.వాస్తవానికి ఆయుశ్‌ మాత్రే స్థాయి ఇది కాదు. టెక్నికల్‌గా వైభవ్‌ సూర్యవంశీ ‍లాంటి వారి కంటే చాలా బెటర్‌ బ్యాటర్‌. అయినా ఆసియా కప్‌లో మాత్రే ఎందుకో రాణించలేకపోయాడు. కొద్ది రోజుల ముందు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించిన అతను.. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చే సరికి తేలిపోయాడు. ముస్తాక్‌ అలీ టోర్నీలో మాత్రే 6 ఇన్నింగ్స్‌ల్లో 108.33 సగటున, 166.67 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఆసియా కప్‌కు వచ్చే సరికి మాత్రే ఈ సూపర్‌ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఇది గమనించిన అభిమానులు రోజుల వ్యవధిలో ఇంత మార్పేంటని అనుకుంటున్నారు. మొత్తంగా ఆసియా కప్‌లో మాత్రే వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా విఫలమై కెరీర్‌లో మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ఈ వైఫల్యాలు ఈ యువ బ్యాటర్‌పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. ముంబైకి చెందిన 18 ఏళ్ల మాత్రే ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్‌, ఐపీఎల్‌లో పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్‌లోనే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన మాత్రే సీఎస్‌కే తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా సీఎస్‌కే అతన్ని తదుపరి సీజన్‌కు కూడా రీటైన్‌ చేసుకుంది. మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 660 పరుగులు.. 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 458 పరుగులు.. 13 టీ20ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 565 పరుగులు చేశాడు.

Indonesia Gede Priandana makes history, takes first 5 wicket haul in an over in T20Is5
అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర

అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ఓ బౌలర్‌ ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఇలాంటి ఫీట్‌ నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గరిష్టంగా ఓ ఓవర్‌లో నాలుగు వికెట్ల ఫీట్‌ నమోదైంది. శ్రీలంక మాజీ పేసర్‌ లసిత్ మలింగ 2019లో న్యూజిలాండ్‌పై నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.ఓవరాల్‌గా (అంతర్జాతీయం, దేశవాలీ, ప్రైవేట్‌ టీ20 లీగ్‌లు) చూస్తే.. ఓ ఓవర్‌లో ఐదు వికెట్ల ఘనత ఇదివరకే రెండు సార్లు నమోదైంది. దేశవాలీ టీ20 మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌కు చెందిన అల్-అమిన్ హొసైన్, కర్ణాటకకు చెందిన అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించారు.చరిత్ర సృష్టించిన గెడే ప్రియందనాఅంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో, అందులోనూ తన తొలి ఓవర్‌లోనే ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా (పురుషులు లేదా మహిళలు) ఇండొనేషియాకు చెందిన గెడే ప్రియందనా చరిత్ర సృష్టించాడు. బాలి వేదికగా కాంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ప్రియందనా ఈ చారిత్రక ఘనత సాధించాడు.ఇండోనేషియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని కాంబోడియా చేధించే క్రమంలో ఈ ఫీట్‌ నమోదైంది. కాంబోడియా స్కోర్‌ 15 ఓవర్లలో 106/5 వద్ద ఉండగా.. మీడియం పేసర్‌ అయిన ప్రియందనా ఒక్కసారిగా చెలరేగిపోయాడు. 16వ ఓవర్‌ తొలి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆతర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా.. ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్‌లను ఔట్ చేసి ఐదు వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఓవర్‌లో ఒక్క రన్ (వైడ్) మాత్రమే వచ్చింది. ప్రియందనా ఉన్నపళంగా కాంబోడియా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంతో ఇండోనేషియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు ధర్మ కేసుమా విధ్వంసకర శతకంతో (68 బంతుల్లో 110 నాటౌట్‌) చెలరేగడంతో ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది.

Vaibhav Suryavanshi A Generational Talent But Cricket Demands A Lot More6
వైభవ్‌.. దూకుడు ఒక్కటే కాదు!

వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే విధ్వంసక‌ర బ్యాటింగ్‌తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొన్న యువ సంచలనం అతడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయష్కుడైన ఆటగాడిగా నుంచి.. అండర్-19 స్థాయిలో మెరుపు సెంచరీలు బాదడం వరకు అతడి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. అయితే అంత‌ర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో నిలిచిన వైభవ్‌.. కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. వైభ‌వ్‌కు అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జూనియ‌ర్ క్రికెట్‌కు సీనియ‌ర్ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది.హిట్టింగ్ ఒక్కటే కాదు..క్రికెట్ ఒక చద‌రంగం వంటిది. ఎక్కడ ఎత్తుకు పై ఎత్తు వేయాలో.. ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలియాలి. సీనియర్ స్ధాయిలో రాణించాలంటే కేవ‌లం హిట్టింగ్ చేసే సత్తా ఉంటే స‌రిపోదు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచినప్పటికి.. తమ శైలికి విరుద్దంగా ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ముగిసిన అండర్‌-19 ఆసియాకప్‌నే ఉదాహరణగా తీసుకుందాం.యూఏఈ, మలేషియా వంటి పసికూనలపై విధ్వసంకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ వైభవ్‌.. కీలకమైన ఫైనల్లో పాకిస్తాన్‌పై మాత్రం విఫలమయ్యాడు. కేవ‌లం ప‌ది బంతుల్లో 26 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో జ‌ట్టుకు కావాల్సింది ఇది కాదు. నిల‌క‌డ‌గా ఆడి త‌న ల‌భించిన ఆరంభాల‌ను భారీ స్కోర్ల‌గా మ‌లుచుకోవాలి. అప్పుడే జ‌ట్టు విజ‌యాల్లో స‌ద‌రు ఆట‌గాడు భాగం అవుతాడు. వైభ‌వ్ త్వ‌రగా ఔట్ కావ‌డం కూడా భార‌త్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. అదే వైభ‌వ్ ఒక ప‌ది ప‌దేహేను ఓవ‌ర్ల పాటు కాస్త ఆచితూచి ఆడి క్రీజులో నిల‌బ‌డి ఉంటే ప‌రిస్థితి భిన్నంగా ఉండేది. ప‌రిస్థితికి త‌గ్గ‌ట్టు ఆడ‌డం నేర్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్సివ్‌గా ఆడాలి.. ఎప్పుడు ఎటాక్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విష‌యంలో అతడు ఇంకా ప‌రిణితి చెందాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం,షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో సూర్య‌వంశీ ఇంకా మెరుగుప‌డాలి.టాలెంట్ ఉంటే స‌రిపోదు..క్రికెట్ వంటి జేంటిల్ మ్యాన్ గేమ్‌లో నిలదొక్క‌కోవాలంటే కేవ‌లం ప్ర‌తిభ ఉంటే స‌రిపోదు.. మ‌న ప్ర‌వ‌ర్త‌న కూడా ముఖ్యం. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్ అలీ రాజా- వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. వైభ‌వ్‌ను ఔట్ చేసిన అనంత‌రం అలీ రాజా స్లెడ్జ్ చేశాడు. అయితే త‌న స‌హ‌నాన్ని కోల్పోయి వైభ‌వ్‌.. త‌న కాలి షూ వైపు చూపిస్తూ దుర్భాషలాడాడు. ఈ విషయంపై బీసీసీఐ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మైదానంలో దూకుడు అవసరమే కానీ.. అది హుందాతనాన్ని దాటకూడదు.హద్దు దాటకూడదు..కాగా క్రికెటర్‌గా చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను, డబ్బును హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. వైభవ్ అతి పిన్న వయస్సులోనే రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు ఓవర్‌నైట్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి ఒక హోదా పొందిన వైభవ్ తన కెరీర్ పక్క త్రోవపట్టకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. పృథ్వీ షాను తన కెరీర్ ఆరంభంలో భారత క్రికెట్‌కు మరో సచిన్ టెండూల్కర్ దొరికాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అతడి పేరు మారుమ్రోగింది. కానీ కొన్నాళ్లకే తన లభించిన డబ్బును, కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేక ఒక సాధారణ క్రికెటర్‌గా మిగిలిపోయాడు.జైశ్వాల్ ఒక రోల్ మోడల్‌..వైభవ్ సూర్య వంశీ.. తన రాజస్తాన్ రాయల్స్ టీమ్ యశస్వి జైశ్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. జైశ్వాల్ అతి తక్కువ కాలంలోనే ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగినా.. తన వినయాన్ని, ఆటపై ఫోకస్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. ఐపీఎల్ అనేది ఒక వేదిక మాత్రమే.. అదే చివరి లక్ష్యం కాదని వైభవ్ గుర్తించాలి. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన జైశ్వాల్ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అతడు ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి వన్డేలో సెంచరీతో సత్తాచాటి భారత్‌కు సిరీస్‌ను అందించాడు. ఇది కదా ఒక ఛాంపియన్ క్రికెటర్ లక్షణం.ఓవర్ కాన్ఫడెన్స్ వద్దు..వైభవ్ ఆటలో అతి విశ్వాసం కన్పిస్తోంది. అయితే సిక్స్.. లేదంటే అవుట్ అనే ధోరణిలో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అతడు తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కానీ క్రికెట్ వంటి మాస్టర్ మైండ్ గేమ్‌లో అది ఏ మాత్రం పనికిరాదు. వికెట్ విలువ తెలిసి ఆడినవాడే గొప్ప బ్యాటర్ అవుతాడు. కఠినమైన బంతులను ఆచితూడి ఆడుతూ.. సులువైన బంతులను ఫనిష్ చేసేవాడే వరల్డ్ క్లాస్ బ్యాటర్ కాగలడు.

T20 World Cup 2026: Who will be Team India Finishers In ICC Event7
వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్‌ ఎవరు?

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది.పేస్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా, శివం దూబే.. స్పిన్‌ విభాగంలో అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఉన్నారు. వీరికి తోడు టాపార్డర్‌లో ఉన్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), తిలక్‌ వర్మ (Tilak Varma) .. లోయర్‌​ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ కూడా అవసరమైన వేళ బౌలింగ్‌పరంగానూ సేవలు అందించగలరు.ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో ఫినిషర్‌గా సత్తా చాటిన జితేశ్‌ శర్మకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. మరి వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియాకు ఉన్న ఫినిషింగ్‌ ఆప్షన్లు ఏవి?రింకూ సింగ్‌ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే రింకూ.. నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో ధనాధన్‌ దంచికొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఐపీఎల్‌-2023లో కేకేఆర్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో యశ్‌ దయాళ్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ఇందుకు ఉదాహరణ.ఇటీవల సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడిన జట్టులో రింకూకు చోటే లేదు. అయితే, ఫినిషర్‌గా అతడు సత్తా చాటగలడు కాబట్టి ప్రపంచకప్‌ జట్టులో సెలక్టర్లు అతడికి స్థానం కల్పించారు. అయితే, తుదిజట్టులో చోటు కోసం అతడు ఎదురుచూడకతప్పదు. ఇప్పటికి టీమిండియా తరఫున 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 550 పరుగులు చేశాడు.శివం దూబేఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్న శివం దూబే.. సాధారణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసేవాడు. అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ వచ్చిన తర్వాత ఎక్కువగా లోయర్‌ ఆర్డర్‌లోనే అతడి సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.ఇటీవలి కాలంలో ఈ ముంబై ఆల్‌రౌండర్‌ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా.. స్లో మీడియం పేస్‌తో బౌలింగ్‌తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్‌గా శివం దూబే మంచి ఆప్షన్‌. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో సత్తా చాటి ఫామ్‌లో ఉండటం అతడికి సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా.. (11, 1, 10 నాటౌట్‌, 10 నాటౌట్‌, రెండు వికెట్లు) తర్వాత ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.హార్దిక్‌ పాండ్యాపరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు నెంబర్‌ వన్‌ ఫినిషర్‌ అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు హార్దిక్‌ పాండ్యా. గాయం నుంచి కోలుకుని.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్‌.. సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్‌లోనే 142 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సఫారీలతో ఆఖరి టీ20లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన హార్దిక్‌.. మొత్తంగా 25 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.గతే ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్‌ పాండ్యాదే కీలక పాత్ర. మూడు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 89 రన్స్‌ చేసిన పాండ్యా.. మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత ప్రదర్శన (3/20) కనబరిచాడు. ఈసారి కూడా ఫినిషర్‌గా హార్దిక్‌ పాండ్యానే ఫస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అనడంలో సందేహం లేదు. ఇక పై ముగ్గురు పిచ్‌, మ్యాచ్‌ పరిస్థితులను బట్టి ఐదు నుంచి ఏడో స్థానంలో బరిలోకి దిగుతారు.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, రింకూ సింగ్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌).చదవండి: IND vs NZ: భార‌త్‌తో వ‌న్డే సిరీస్‌.. విలియ‌మ్స‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

I Have Bullet Proof Car: Rashid Khan Tells Pietersen Explains Why8
నా దగ్గర బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఉంది: స్టార్‌ క్రికెటర్‌

ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా అఫ్గనిస్తాన్‌లోనూ క్రికెట్‌, క్రికెటర్లకు క్రేజ్‌ ఎక్కువ. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫ్యాన్స్‌ ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.ముఖ్యంగా క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజాలను నేరుగా కలవాలని పిచ్‌లోకి దూసుకువెళ్లి... ఇబ్బందులపాలైన వీరాభిమానులను ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కోసారి అభిమానం శ్రుతిమించితే సదరు ఆటగాళ్లకు కూడా కష్టమే.లండన్‌లోనే కోహ్లిఅందుకే కోహ్లి తన పిల్లలు ఇద్దరినీ లండన్‌లోనే ఎక్కువగా పెంచుతున్నాడు. ఇంత వరకు వాళ్ల ఫొటోలు కూడా రివీల్‌ చేయలేదు. సోషల్‌ మీడియాకు దూరంగా.. సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా సాధారణ పిల్లల మాదిరే వారిని పెంచుతున్నాడు. కోహ్లి సైతం లండన్‌ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది, హంగూ ఆర్భాటాలు లేకుండా స్వేచ్చగా తిరగగలుగుతున్నాడు.తన పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అంటున్నాడు అఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashid Khan). సొంత దేశంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలన్నా అతడికి భయమే. అయితే, కోహ్లి మాదిరి కేవలం క్రేజ్‌ కారణంగా మాత్రమే అతడికి ఈ పరిస్థితి తలెత్తలేదు. దేశంలోని అనిశ్చితులు ఇందుకు ప్రధాన కారణం.నా దగ్గర బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఉందిఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌తో మాట్లాడుతూ రషీద్‌ ఖాన్‌ ఈ విషయం గురించి స్పందించాడు. అఫ్గనిస్తాన్‌ వీధుల్లో స్వేచ్ఛగా విహరించగలవా? అని పీటర్సన్‌ అడుగగా.. ‘‘లేదు. నేనసలు అఫ్గన్‌ వీధుల్లో నడవలేను. నా దగ్గర బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఉంది. అందులోనే బయటకు వెళ్తా’’ అని రషీద్‌ ఖాన్‌ బదులిచ్చాడు.‘‘కాబూల్‌లో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారా? ఎందుకు?’’ అని పీటర్సన్‌ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా నేను ఆ కారునే వాడతాను. ఉండకూడని సమయంలో.. ఉండకూడని చోట ఉంటే అంతే సంగతులు.అయినా అఫ్గనిస్తాన్‌లో ఇవన్నీ సాధారణమే. దాదాపు ప్రతి ఆటగాడి దగ్గర బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఉంటుంది’’ అని రషీద్‌ ఖాన్‌ వెల్లడించాడు. తద్వారా తనకు కారు అనేది కేవలం విలాస వస్తువు కాదని.. వ్యక్తిగత భద్రత కోసం తప్పక వాడతానని స్పష్టం చేశాడు. కాగా అఫ్గన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రపంచ స్థాయి స్పిన్నర్‌గా ఎదిగాడు రషీద్‌ ఖాన్‌. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ప్రస్తుతం తిరుగులేని బౌలర్‌గా సత్తా చాటుతున్నాడు. ఇక అఫ్గన్‌ తరఫున రషీద్‌ ఖాన్‌ 117 వన్డేలు, 108 టీ20లు, 6 టెస్టులు ఆడి.. 210, 182, 45 వికెట్లు కూల్చాడు.చదవండి: ఆ ముగ్గురిని వాడుకోవాల్సింది: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

BCCI to review India U19 teams performance after U19 Asia Cup loss9
పాక్ చేతిలో ఓట‌మి.. టీమిండియాపై బీసీసీఐ సీరియ‌స్‌

అండ‌ర్‌-19 ఆసియాక‌ప్ ఫైన‌ల్లో పాకిస్తాన్ చేతిలో భార‌త యువ జ‌ట్టు ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. టోర్నీ అసాంతం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన టీమిండియా.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో విఫ‌ల‌మైన ఆయూష్ మాత్రే అండ్ కో.. ఏకంగా 191 ప‌రుగుల తేడాతో ఘోర ప‌రాభావన్ని మూట‌క‌ట్టుకుంది.దాయాది చేతిలో ఓట‌మి పాలవ్వ‌డాన్ని భార‌త అభిమానులు, మాజీ క్రికెట‌ర్లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతో ఈ ఘోర ఓట‌మిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా సీరియస్ అయింది. ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. డిసెంబ‌ర్ 22న వ‌ర్చ‌వ‌ల్‌గా జ‌రిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. జట్టు హెడ్ కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రే, టీమ్ మేనేజర్ నుండి బోర్డు వివరణ కోరనున్న‌ట్లు క్రిక్‌బ‌జ్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. బ్యాటింగ్‌కు అనుకూల‌మైన పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డాన్ని బోర్డు తప్పుబడుతోంది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భార‌త‌ ఆటగాళ్ల ప్రవర్తనపై వచ్చిన నివేదికలు కూడా బీసీసీఐ దృష్టిలో పడినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కూడా ఆటగాళ్లతో బీసీసీఐ చర్చిస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు."గతంలో భారత జట్లు క్రికెట్‌ను గౌరవించేవి. కానీ ఇప్పుడు అలా లేదు. భారత జట్ల ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది" అని సర్ఫరాజ్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. తమ సీనియర్ ఆటగాళ్లనే జూనియర్స్ కూడా ఫాలో అయ్యారు.కాగా ఈ తుది పోరులో భారత ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రేలు ప్రవర్తన కూడా చర్చనీయాంశమైంది. పాక్‌ పేసర్ అలీ రజా వీరిని ఔట్ చేశాడు. ఔటైన తర్వాత వైభవ్, ఆయుష్‌.. పాక్ బౌలర్‌ను దుర్భాషలాడారు. ముఖ్యంగా వైభవ్ అయితే తన షూను చూపిస్తూ ఫైరయ్యాడు. అయితే వీరికి భారత అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ బౌలర్ స్లెడ్జ్ చేయడంతోనే వైభవ్ అలా ప్రవర్తించాడని పోస్ట్‌లు పెడుతున్నారు.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్‌కు భారీ షాక్‌

Kaif Lambasts Selectors Over Gill Flip Flop Before T20 WC 202610
టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్‌ ఫైర్‌

టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ మండిపడ్డాడు. ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో పిచ్చి ప్రయోగాలతో ఆటగాళ్లను గందరగోళానికి గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం రెండు నుంచి మూడు నెలల కాలం వృథా చేశారంటూ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తీరును తప్పుబట్టాడు.గిల్‌పై వేటుఅసలు విషయమేమిటంటే.. భారత్‌- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బీసీసీఐ ఇటీవలే తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. జితేశ్‌ శర్మను కూడా జట్టు నుంచి తప్పించింది.గిల్‌, జితేశ్‌ స్థానాల్లో రింకూ సింగ్‌, ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan)లను మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఆడిన జట్టునే వరల్డ్‌కప్‌ టోర్నీకీ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ.. గిల్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ చేసిన తప్పును ఎత్తి చూపాడు.సెలక్టర్లు తప్పు చేశారు‘‘మెరుగైన ఆటగాళ్లు ఎవరో వాళ్లకు (సెలక్టర్లకు) ముందుగానే తెలుసు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు ఎవరు సరిపోతారో వారికి ఓ అవగాహన ఉంది. గిల్‌ కంటే పొట్టి క్రికెట్‌లో బాగా ఆడే వాళ్లున్నారని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ సెలక్టర్లు తప్పు చేశారు.వారి తప్పు వల్ల భారత క్రికెట్‌ వెనుకబడింది. గత రెండు- మూడు నెలలుగా గిల్‌కు బదులు వాళ్లు యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మలను ఎక్కువగా ఆడించాల్సింది’’ అని కైఫ్‌ పేర్కొన్నాడు.కాగా ఆసియా టీ20 కప్‌-2025 టోర్నీతో గిల్‌ టీ20 జట్టులో పునరాగమనం చేయగా.. ఓపెనింగ్‌ జోడీగా ఉన్న అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌లను విడదీయాల్సి వచ్చింది. సంజూ స్థానంలో గిల్‌ ఓపెనర్‌గా వచ్చి వరుస మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో పాటు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.భవిష్య సారథినే తప్పించారుఈ క్రమంలో అనూహ్య రీతిలో గిల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. ప్రపంచకప్‌ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ను తిరిగి నియమించింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే జట్లకు గిల్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కూడా భవిష్య సారథిగా అతడే ఉంటాడని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో విఫలమైన నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ అతడిని జట్టు నుంచే తప్పించడం గమనార్హం.చదవండి: కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement