ప్రధాన వార్తలు
న్యూజిలాండ్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్ట్లో ఈ ఘతన సాధించారు. టెస్ట్ క్రికెట్లోనే కాదు, యావత్ ఫస్ట్క్లాస్ చరిత్రలోనే ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా కాన్వే, లాథమ్ చరిత్ర సృష్టించారు.ఈ మ్యాచ్లో లాథమ్ తొలి ఇన్నింగ్స్లో 137, రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 37, జాన్ క్యాంప్బెల్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథమ్ శతక్కొట్టారు. దీనికి ముందు విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 575 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాన్వే డబుల్ సెంచరీ, లాథమ్ సెంచరీ చేయగా.. రచిన్ రవీంద్ర (72 నాటౌట్) రాణించాడు.
టీమిండియాకు ఘోర పరాభవం
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో భారత్ 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది. ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మిన్హాస్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ 347 పరుగులతో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. గత ఎడిషన్లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్తోనే సరిపెట్టుకుంది.
మెస్సీ మోజులో 'మన హీరో'పై చిన్నచూపు..!
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.ముంబై ప్రొగ్రామ్లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్లో ఫుట్బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. భారత ఫుట్బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేసి ఆల్టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు.
అత్యంత అరుదైన మైలురాయిని తాకిన మిచెల్ స్టార్క్
ఆసీస్ వెటరన్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన మైలురాయిని తాకాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 750 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో స్టార్క్కు ముందు కేవలం 12 మంది మాత్రమే ఈ ఘనత సాధించారు. ఆసీస్ తరఫున కేవలం ఇద్దరే 750 వికెట్ల మార్కును తాకారు. ఇంగ్లండ్తో ఇవాళ ముగిసిన మూడో యాషెస్ టెస్ట్లో స్టార్క్ ఈ ఘనత సాధించాడు.ఫార్మాట్లవారీగా స్టార్క్ ప్రదర్శనలు..103 టెస్ట్ల్లో 424 వికెట్లు130 మ్యాచ్ల్లో 247 వికెట్లు65 టీ20ల్లో 79 వికెట్లుఅంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..మురళీథరన్-1347షేన్ వార్న్-1001జిమ్మీ ఆండర్సన్-991అనిల్ కుంబ్లే-956గ్లెన్ మెక్గ్రాత్-949వసీం అక్రమ్-916స్టువర్ట్ బ్రాడ్-847షాన్ పొల్లాక్-829వకార్ యూనిస్-789టిమ్ సౌథీ-776రవిచంద్రన్ అశ్విన్-765చమింద వాస్-761మిచెల్ స్టార్క్-750అడిలైడ్ వేదికగా ఇవాళ ముగిసిన యాషెస్ మూడో టెస్ట్లో స్టార్క్ 4 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తోనూ (54) సత్తా చాటాడు. ఈ సిరీస్ తొలి రెండు టెస్ట్ల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన (7,3) నమోదు చేసిన అతను.. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో 8 వికెట్లతో (6,2) సత్తా చాటాడు.రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో స్టార్క్ బ్యాటింగ్లోనూ (77 పరుగులు) రాణించాడు. తొలి రెండు టెస్ట్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన స్టార్క్ ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు.మూడో టెస్ట్లో స్టార్క్తో పాటు అలెక్స్ క్యారీ (106, 5 క్యాచ్లు, 72, ఓ స్టంప్, ఓ క్యాచ్) విజృంభించడంతో ఆసీస్ ఇంగ్లండ్పై 82 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆసీస్ మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్ల్లో కూడా ఆసీసే విజయం సాధించింది. ఈ సిరీస్లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26న మొదలవుతుంది.చదవండి: Ashes Series 2025: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
Asia Cup Final: పాకిస్తాన్ భారీ స్కోర్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.పాక్ ఇన్నింగ్స్లో సమీర్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. సమీర్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. అహ్మద్ హుసేన్ (56) సమీర్కు అండగా నిలిచాడు. ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించాడు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.చివరి మూడు ఓవర్లలో పాక్ టెయిలెండర్లు నికాబ్ షఫీక్ (12 నాటౌట్), మొహమ్మద్ సయ్యమ్ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడి జట్టు స్కోర్ను 350 పరుగుల మార్కు వరకు తీసుకెళ్లారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్స్కు చేరాయి. చదవండి: చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా
మాట వినలేదని జట్టు నుంచి తీసేశారు..! ఇప్పుడు ఏకంగా వరల్డ్కప్ జట్టులోనే
రెండేళ్ల కిందట ఓ భారత ఆటగాడు బీసీసీఐ ఆదేశాలను దిక్కరించినందుకు ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్నూ కోల్పోయాడు. అతడిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ సదరు ఆటగాడు ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా.. మైదానంలోనే తన ప్రతాపం చూపాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పటికైనా జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎట్టకేలకు అతడి శ్రమకు ఫలితం దక్కింది. తిరిగి భారత జెర్సీ ధరించేందుకు ఆ ఆటగాడు సిద్దమయ్యాడు. అతడే పాకెట్ డైనమైట్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టులో కిషన్ చోటు దక్కించుకున్నాడు. కెరీర్ ముగిసిపోయిందన్న స్టేజి నుంచి ప్రపంచకప్ జట్టులోకి రావడం అతడు ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈ క్రమంలో అతడి కమ్బ్యాక్ స్టోరీపై లుక్కేద్దాం.బీసీసీఐ అగ్రహం..ఇషాన్ కిషన్ 2023 ఏడాది ఆఖరిలో భారత జట్టుతో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. కానీ ఇషాన్ ‘మానసికంగా ఇబ్బందిపడుతున్నా’ అంటూ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. అయితే స్వదేశానికి వచ్చేసిన కిషన్ విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తూ కన్పించాడు. దీంతో అతని ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ జట్టులో లేనప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.కానీ కిషన్ మాత్రం బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బోర్డు తప్పించింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ కిషన్ ఆడాడు. రంజీ ట్రోఫీతో పాటు విజయ్ హాజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్కు సారథ్యం వహించాడు. అడపాదడపా పరుగులు చేస్తూ రాణించినా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. కానీ సెంట్రల్ కాంట్రాక్ట్ మాత్రం తిరిగి దక్కించుకున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ గాయపడడంతో కిషన్కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ అదే సమయంలో కిషన్ కూగా గాయం బారిన పడడంతో ఛాన్స్ మిస్సయ్యాడు.ఎట్టకేలకు..అయితే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కిషన్ నిరీక్షణ ఫలింది. ఏకంగా ఇప్పుడు టీ20 వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో ఆడేందుకు ఇషాన్ సిద్దమయ్యాడు. సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఈ జార్ఖండ్ డైన్మైట్ను జట్టులోకి తీసుకున్నారు. ఇషాన్ కిషన్ రీఎంట్రీకి ప్రధాన మార్గం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 నిలిచింది. ఈ టోర్నీలో కిషన్ దుమ్ములేపాడు. కెప్టెన్గా, ఒక ఆటగాడిగా జార్ఖండ్కు తొలిసారి ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను అందించాడు. ఈ టోర్నీలో 10 ఇన్నింగ్స్ల్లో 517 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కిషన్ నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగానే కిషన్ను భారత జట్టుకు ఎంపిక చేశారు.స్పందించిన కిషన్..తన రీ ఎంట్రీపై కిషన్ స్పందించాడు. తిరిగి జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందుకోసం గతేడాదిగా చాలా కష్టపడ్డాను. జార్ఖండ్కు ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ వచ్చినందుకు కూడా ఆనందంగా ఉంది. వరల్డ్ కప్ కోసం ఆతృతగా ఎదుచూస్తున్నాను అని ఎఎన్ఐతో కిషన్ పేర్కొన్నాడు. బ్యాకప్ ఓపెనర్గా కిషన్ జట్టులో ఉండనున్నాడు.టీ20 వరల్డ్ కప్ 2026 - భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్ (కీపర్), వరుణ్ చక్రవర్తి.
మొదటి మ్యాచ్లోనే ముద్ర.. వార్నర్ వికెట్తో వార్తల్లోకెక్కాడు
తెనాలి: ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతమైన వికెట్తో సంచలనం సృష్టించిన తెలుగు యువ క్రికెటర్ యర్రా పృథ్వీరాజ్ గాయాలతో రెండు సీజన్ల విరామం తర్వాత పునరాగమనం చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన సత్తాను చాటిన ఈ ఎడంచేతి ఫాస్ట్ బౌలర్ను తాజా ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ నుంచి టీమిండియాకు ఆడాలన్న కలను ఈసారి నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ యువతేజం వివరాల్లోకి వెళితే...పృథ్వీరాజ్ జన్మస్థలం తెనాలి సమీపంలోని దుగ్గిరాల. తల్లి జంపాల కృష్ణకుమారి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్లో జూనియర్ అకౌంట్స్ అధికారిగా రిటైరయ్యారు. తండ్రి యర్రా శ్రీనివాసరావు సివిల్ ఇంజినీరు, ప్రభుత్వ కాంట్రాక్టరు. తల్లి ఉద్యోగరీత్యా విశాఖలో పెరిగిన పృథ్వీరాజ్ ప్రస్తుతం అక్కడే ఇంజినీరింగ్ చేశాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి జట్టుకు వివిధ విభాగాల్లో ఆడుతూ వచ్చాడు. తండ్రికి కజిన్ అయిన ఆంధ్రా యూనివర్సిటీ హెచ్ఓడీ, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఎన్.విజయమోహన్ తొలి గురువు. క్రికెట్లో ఓనమాలు నేర్పారాయన. ఇప్పటికీ పృథ్వీరాజ్ శిక్షణను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. తండ్రి వారసత్వంగా క్రికెట్పై ఆసక్తి... పృథ్వీరాజ్ కు ఆట వారసత్వం అనుకోవచ్చు. తాత ప్రసాదరావు పహిల్వాన్. తండ్రి యర్రా శ్రీనివాసరావు స్వస్థలం చీరాల. బాపట్లలో ఇంజినీరింగ్ కాలేజీలో చదివేటపుడు క్రీడల్లో యాక్టివ్గా ఉన్నారు. రెండేళ్లు కాలేజీ చాంపియన్. 1985లో గుంటూరు జిల్లా అండర్–19 క్రికెట్ జట్టులో ఆడారు. 1986లో జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించారు. ఈ నేపథ్యమే పృథ్వీరాజ్కు క్రికెట్పై ఆసక్తిని కలిగించింది. విజయమోహన్ వ్యక్తిగత శిక్షణలో సాధన ఆరంభించి, విజయశిఖరాలను అధిరోహిస్తూ వచ్చాడు. 2011 నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అండర్–14 నుంచి వివిధ వయసు విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్కూల్స్ జాతీయ పోటీలకు ఆడిన జట్టుకు కెప్టెన్ గా చేశాడు. 19 ఏళ్లకే దేశవాళీ క్రికెట్లోకి... 2017 అక్టోబరులో 19 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీకి ఎంపికైన పృథ్వీరాజ్ రెండు మ్యాచ్ల్లో పన్నెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 2018 జులైలో బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ క్రికెట్ అకాడమీ నిర్వహించే ఇండియన్ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్ క్యాంప్కు ఇండియా నుంచి ఏడుగురిని ఎంపిక చేయగా, అందులో పృథ్వీరాజ్ కు అవకాశం దక్కింది. అక్కడ శిక్షణ అనంతరం ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోపీలో ఇండియా రెడ్ టీమ్కు ఆడాడు. 2018 అక్టోబరులో బీసీసీఐ విజయ్ హజారే ట్రోఫీకి నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు ఆడి, హైదరాబాద్పై రెండు వికెట్లు తీశాడు. 2019లో వన్డేలోనే ప్రొఫెసర్ ధియోధర్ ట్రోఫీకి ఆడారు. అదే ఏడాది డిసెంబరులో రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు. వార్నర్ వికెట్తో సంచలనం అక్కడ్నుంచి పృథ్వీరాజ్ పయనం ప్రతిష్టాకరమైన ఐపీఎల్కు చేరింది. వేలంలో కేకేఆర్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ తుది 11 మంది జట్టులో స్థానం కల్పించలేదు. హైదరాబాద్తో మ్యాచ్తోనే జట్టులో బెర్త్ దక్కింది. అందులో మొదటి, మూడో ఓవర్లో పృథీ్వరాజ్ బౌలింగ్లో రెండు క్యాచ్లను జారవిడిచారు. అయినప్పటికీ మెయిడెన్ వికెట్గా వార్నర్ను బౌల్డ్ చేయడంతో వార్తల్లోకెక్కాడు, అంతకుముందు ఫిబ్రవరి 28న మూలపాడులో జరిగిన బీసీసీఐ సయ్యద్ ముస్తాఫ్ఆలీ టీ20 టోర్నమెంటులో జార్ఖండ్పై నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్కు నెట్ బౌలర్గా పృథీ్వరాజ్, కోల్కతా నుంచి ఆకాశ్దీప్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తర్వాత ఆకాశ్దీప్ ఇండియా జట్టుకు అన్ని ఫార్మట్లలోనూ ఆడారు. సెలక్షన్స్ టైములో గాయాల కారణంగా అవకాశం కోల్పోయాడు. రంజీ ట్రోఫీల్లో సత్తా మళ్లీ గత రెండు సీజన్లలోనూ దేశవాళీ క్రికెట్లో రెడ్ బాల్, వైట్ బాల్లోనూ సత్తా చాటుతున్నాడు. 2023లో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్పై రెండు ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నా, ఆంధ్ర జట్టు ఓటమి చెందింది. గతేడాది విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. రెండు రంజీ ట్రోఫీల్లో పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీరాజ్. 2025–26 సీజన్ తొలి దశ రంజీట్రోఫీలో మూడు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ టీ20లో ఆంధ్ర జట్టు తరఫున ఆడిన తొమ్మిది మ్యాచ్లో ఏడు పరుగుల సగటుతో 12 వికెట్లు తీయటం మరో ప్రత్యేకత. ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యేకత ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలింగ్ పృథ్వీరాజ్ ప్రత్యేకత. 145–150 కి.మీ. వేగంతో బౌల్ చేయటం, బంతిని రెండువైపులా స్వింగ్ చేయటం, మెరుపుల్లాంటి బౌన్సర్లు వేయగల నేర్పు ఉన్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ప్రముఖ శిక్షకుడు సీడీ థాంప్సన్ మెలకువలు నేర్చారు. ఈ ప్రత్యేకతలతోనే గాయాలతో కొన్ని సీజన్లు వైట్బాల్కు దూరంగా ఉన్నా, మళ్లీ ఘనంగా గుజరాత్ టైటాన్తో పునరాగమనం చేయగలిగాడు పృథీ్వరాజ్. గుజరాత్ టైటాన్ జట్టు ఆడిన తొలి ఐపీఎల్లోనే కప్ను గెలుచుకుందనీ, ఆ జట్టులో ఆటతో టీమిండియాకు ఆడే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాడు.
చరిత్ర సృష్టించిన డెవాన్ కాన్వే.. తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా
మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దుమ్ములేపాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్లోనూ శతక్కొట్టాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్లో ద్విశతకం, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్గా కాన్వే చరిత్ర సృష్టించారు.ఇప్పటివరకు ఏ కివీ ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్గా ప్రపంచ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాటర్గా కాన్వే నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు చేసిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్లో వంద పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కాన్వే ఈ ఏడాది మాత్రం అదరగొట్టాడు. ఐదు టెస్టు మ్యాచ్ల్లో 87.12 సగటుతో 697 పరుగులు సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 452 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కరేబియన్ జట్టు విజయానికి ఇంకా 419 పరుగులు కావాలి. క్రీజులో బ్రాండెన్ కింగ్(37), క్యాంప్బెల్(2) ఉన్నారు. అంతకుముందు కివీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో కాన్వేతో పాటు టామ్ లాథమ్ కూడా శతక్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ ఉంచింది.ఇక విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్లో అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 420 పరుగులకు ఆలౌట్ అయింది. అదేవిధంగా న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 575 పరుగుల భారీ స్కోర్ చేసింది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే 3-0 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 82 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ ఘోర పరభావాన్ని మూట కట్టుకుంది. 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 352 రన్స్కు ఆలౌటైంది.లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (85) అద్భుతంగా పోరాడినప్పటికీ.. మిడిలార్డర్ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. ఆఖరిలో జామీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39 నాటౌట్) జట్టును గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, లియోన్ తలా మూడు వికెట్లతో ఇంగ్లీష్ జట్టు ఓటమిని శాసించారు."సిరీస్ను ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో అడిలైడ్లో అడుగుపెట్టాము. కానీ మా కల ఇప్పుడు చెదిరిపోయింది. ఈ ఓటమి జట్టులోని ప్రతీ ఒక్కరిని ఎంతో బాధకు గురి చేస్తోంది. చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఆస్ట్రేలియాకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. గెలుపు అనేది మూడు విభాగాల్లో రాణించడంపై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాచ్లో ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. వారు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ మాపై పైచేయి సాధించారు. నాలుగో ఇన్నింగ్స్లో మా ముందు భారీ లక్ష్యం ఉన్నప్పటికి మేము ఆఖరివరకు పోరాడాము. విల్ జాక్స్, జేమీ స్మిత్ ఆడిన తీరు చూసి మేము గెలుస్తామని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. టాస్ ఓడినప్పటికి ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో ఓ మోస్తార్ స్కోర్కే కట్టడి చేయడంలో మేము విజయవంతమయ్యాము. అయితే ఆ తర్వాత మేము భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యాము. రెండో ఇన్నింగ్స్లో కూడా కేవలం 60 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు పడగొట్టాము. మాకు చాలా సానుకూల ఆంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చూపిన పోరాటపటిమ నిజంగా అద్బుతం. నేను ఆశించిన పట్టుదల వారిలో కన్పించింది. సిరీస్ కోల్పోయినప్పటికి మిగిలిన రెండు టెస్టుల్లో విజయం సాధించించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో స్టోక్స్ పేర్కొన్నాడు.చదవండి: సంజూ శాంసన్ కీలక నిర్ణయం
పాక్తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. పాక్ మాత్రం ఒక్క మార్పు చేసింది.డానియల్ అలీ ఖాన్ స్ధానంలో నిఖాబ్ షఫీక్ ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని టీమిండియా.. తుది పోరులో కూడా తమ జోను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్ దుమ్ములేపుతున్నారు.తుది జట్లుపాకిస్తాన్: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ , అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హంజా జహూర్ (వికెట్ కీపర్), హుజైఫా అహ్సాన్, నికాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయామ్భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
మన ఫుట్బాల్ సంగతేంటి?
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ జట్టుపై గురువారం రాజ్య...
ఈ ఏటి మేటి షోలో సామ్రాట్ ‘స్వర్ణ’ గురి
న్యూఢిల్లీ: భారత షూటర్ సామ్రాట్ రాణా ప్రపంచ చాంప...
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చ...
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్...
చాలా చాలా బాధగా ఉంది.. మా కల చెదిరిపోయింది: బెన్ స్టోక్స్
యాషెస్ సిరీస్ 2025-26ను మరో రెండు మ్యాచ్లు మిగిల...
పాక్తో ఫైనల్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భాగంగా దుబాయ్ వేద...
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన యాషెస్ మూడో ట...
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
టీ20 వరల్డ్కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్...
క్రీడలు
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
వీడియోలు
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
