Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Even if he hadnt said sorry: Gambhir on Arshdeep Daryl Mitchell clash1
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్‌

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సమర్థించాడు. డారిల్‌ మిచెల్‌ విషయంలో అర్ష్‌దీప్‌ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్‌ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్‌ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్‌ పోరులో క్రీజులో ఉన్న కివీస్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌కు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్‌ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్‌ కోపంగా అర్ష్‌దీప్‌ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్‌‌ సూర్యకుమార్‌ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్‌దీప్‌ కూడా మిచెల్‌ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా అర్ష్‌దీప్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్‌ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్‌ అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.

IPL 2026: Defending champions RCB will face SRH in season opener2
ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదల

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 2026 షెడ్యూల్‌ విడుదలైంది. బీసీసీఐ ముందుగా ప్రకటించినట్లుగానే తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు జరిగే 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్‌లు ఆడనుంది.🚨 News 🚨Presenting the schedule for the first 20 matches of #TATAIPL 2026, to be played from March 28 to April 12, 2026 🗓️Full schedule will be announced once poll dates are announced for three states set to undergo State Assembly elections.More details ▶️… pic.twitter.com/8Iq492v8TE— IndianPremierLeague (@IPL) March 11, 2026ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో 20 మ్యాచ్‌లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్‌లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి.తొలి విడతలో నాలుగు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు ఏప్రిల్‌ 4న జరుగుతాయి. ఈ విడతలో హైదరాబాద్‌లో ఒకే ఒక మ్యాచ్‌ జరుగనుంది. ఏప్రిల్‌ 5న లక్నో సూపర్‌ జెయింట్స్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొట్టనుంది.

The Hundred 2026: Deepthi Sharma to Sunrisers Leeds, Richa Ghosh to Manchester super giants3
హండ్రెడ్‌ లీగ్‌ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ది హండ్రెడ్‌ క్రికెట్‌ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతుంది. 2026 సీజన్‌ కోసం ఇవాళ (మార్చి 11) మహిళల విభాగం ఆక్షన్‌ నడుస్తుంది. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్లేయర్లను రిటైన్‌, డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోగా.. మిగతా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు వేలంలో పోటీపడుతున్నాయి.ఈ వేలంలో భారత మహిళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను సన్‌రైజర్స్‌ లీడ్స్‌ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది. మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. శ్రేయాంక పాటిల్‌, పూజా వస్త్రాకర్‌, కశ్వీ గౌతమ్‌, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, నందిని శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్‌ ఇంకా వేలానికి రాలేదు. ఈ వేలంలో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పాల్గొనడం లేదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్‌ చేసుకున్నాయి.ఫ్రాంచైజీలు రీటైన్‌, ప్రీ సైనింగ్‌ చేసుకున్న ప్లేయర్లు..మాంచెస్టర్ సూపర్ జెయింట్స్: సోఫీ ఎక్లెస్టోన్ (రీటైన్‌) స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్ (ప్రీ సైనింగ్‌)లండన్ స్పిరిట్: గ్రేస్ హారిస్, చార్లీ డీన్ (రీటైన్‌), మారిజాన్ కాప్, మహికా గౌర్ (ప్రీ సైనింగ్‌)బర్మింగ్‌హామ్ ఫీనిక్స్: ఎల్లీస్ పెర్రీ (రీటైన్‌), ఆలిస్ కాప్సే, లూసీ హామిల్టన్, లారెన్ ఫైలర్ (ప్రీ సైనింగ్‌)ఎంఐ లండన్: హేలీ మాథ్యూస్, డాని వ్యాట్-హాడ్జ్, మెలీ కెర్ ప్రీ సైనింగ్‌)సదరన్ బ్రేవ్: లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మైయా బౌచియర్ (రీటైన్‌), జెమిమా రోడ్రిగ్స్ (ప్రీ సైనింగ్‌)సన్‌రైజర్స్ లీడ్స్: కేట్ క్రాస్, అన్నాబెల్ సదర్లాండ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (రీటైన్‌)ట్రెంట్ రాకెట్స్: నాట్ స్కైవర్-బ్రంట్, యాష్ గార్డ్నర్ (రీటైన్‌), సోఫియా డంక్లీ, కిమ్ గార్త్ (ప్రీ సైనింగ్‌)వెల్ష్ ఫైర్: జార్జియా వేర్హమ్, ఫ్రెయా కెంప్, జార్జియా వోల్ (ప్రీ సైనింగ్‌)కాగా, రేపు (మార్చి 12) పురుషుల విభాగంలో వేలం జరుగనుంది.

Kris Srikkanth Team of the Tourney T20 WC 2026 leaves out Axar Patel4
T20 WC 2026: కెప్టెన్‌గా సాంట్నర్‌.. అక్షర్‌కు దక్కని చోటు!

జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్‌ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్‌కప్‌ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్‌ (Sanju Samson), జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్‌ పటేల్‌ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్‌ హీరోలను కూడా ఫ్యాన్స్‌ హైలైట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్‌కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్‌ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌, న్యూజిలాండ్‌ పవర్‌ హిట్టర్‌ టిమ్‌ సీఫర్ట్‌ను ఎంచుకున్న చిక్కా.. వన్‌డౌన్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్‌ వీరుడు షిమ్రన్‌ హెట్‌మైర్‌, భారత ఆల్‌రౌండర్‌ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్‌.. టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా, ఇంగ్లండ్‌ డేంజరస్‌ ప్లేయర్‌ విల్‌ జాక్స్‌కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను కాదని.. న్యూజిలాండ్‌ సారథి మిచెల్‌ సాంట్నర్‌ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్‌ విభాగంలో ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్‌ వీరుడు జేసన్‌ హోల్డర్‌ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్‌ చక్రవర్తితో కలిసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టిమ్‌ సీఫర్ట్‌ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2026 చిక్కా టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌సంజూ శాంసన్‌, టిమ్‌ సీఫర్ట్‌, ఇషాన్‌ కిషన్‌, షిమ్రన్‌ హెట్‌మైర్‌, శివం దూబే, హార్దిక్‌ పాండ్యా, విల్‌ జాక్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఆదిల్‌ రషీద్‌, లుంగి ఎంగిడి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Bangladesh beat Pakistan by 8 wickets in 1st ODI5
పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉండినట్లు నటించి, చివరికి హ్యాండిచ్చిన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ జట్టు తగిన బుద్ది చెప్పింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి, 'మిత్రధర్మాన్ని' నిలబెట్టుకుంది. ఫ్రెండ్‌, ఫ్రెండ్‌ అంటూ.. బంగ్లాదేశ్‌ పాక్‌ను ఇంటి​కి పిలిచి మరీ దెబ్బ​కొట్టింది.పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. 22 ఏళ్ల పేసర్‌ నహిద్‌ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో పాకిస్తాన్‌పై ఓ బంగ్లాదేశ్‌ బౌలర్‌ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (5-24) ఇవే.పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు.ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీ​ం​ జూనియర్‌ డకౌటయ్యారు.అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (42 బంతుల్లో 67 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశాడు. మరో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 4 పరుగులకే ఔటైనా.. నజ్ముల్‌ హసన్‌ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనంతరం లిటన్‌ దాస్‌ (3 నాటౌట్‌) సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ వసీం జూనియర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే వేదికగా మార్చి 13న జరుగనుంది.

With T20 WC medal Shivam Dube reveals how he returned home via train6
T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే

టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుపు బ్యాటింగ్‌తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్‌ ఖాన్‌తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.3rd ఏసీ టికెట్లు దొరికాయి‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్‌ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్‌ చేసుకున్నాం.నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్‌ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్‌ స్లీవ్స్‌ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.పోలీసులకు ముందుగానే సమాచారంఅందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్‌లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్‌ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాడు.నాలుగేళ్ల కుమారుడు అయాన్‌, రెండేళ్ల కుమార్తె మెవిష్‌లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్‌ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్‌ హీరో ట్రైన్‌లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల

Pakistan all out for 114 runs in 1st ODI vs bangladesh7
తీరు మార్చుకోని పాకిస్తాన్‌.. పసికూన చేతిలో..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బొక్కబోర్లా పడింది. పసికూన బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న పాక్‌.. ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.పేసర్లు నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), స్పిన్నర్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విలవిలలాడిపోయింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీం​ జూనియర్‌ డకౌటయ్యారు.బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇది. ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచకప్‌ నుంచి వైదొలిగే విషయంలో బంగ్లాదేశ్‌కు అండగా ఉండినట్లు నటించి, చివరి నిమిషంలో హ్యాండిచ్చిన పాక్‌కు కూడా ప్రపంచకప్‌ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. పాక్‌ ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఈ సిరీస్‌కు పాక్‌ సీనియర్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ లేకుండా బరిలోకి దిగింది. పాక్‌ జట్టుకు షాహీన్‌ అఫ్రిది నాయకత్వం వహిస్తున్నాడు. జట్టు మారినా, ప్లేస్‌ మారినా పాక్‌ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. ప్రపంచకప్‌తో పోలిస్తే ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్‌ ఆటగాడు మొహమ్మద్‌ రిజ్వాన్‌ వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. టీ20 జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ అఘా ప్రభావం చూపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కితే అద్భుతమే.

25 Years Since Harbhajan Singh Hat-trick Gilchrist Controversial LBW8
భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు!

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 2001లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ చిరస్మరణీయం. నిజానికి భారత టెస్టు క్రికెట్‌లో మరిచిపోలేని కీలక ఘట్టానికి ఆవిష్కరణ జరిగిన రోజు (మార్చి 11) ఇదే కావడం విశేషం. అప్పటికే సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. కోల్‌కతా వేదికగా ఆరంభమైన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కనబరిచింది. తొలి రోజు ఆటను 236/3తో ఘనంగా ముగించిన ఆస్ట్రేలియా రెండో రోజు కూడా అదే జోరు కనబరిచింది. కానీ ఆస్ట్రేలియా ఆటలు 72వ ఓవర్‌ వరకు మాత్రమే సాగింది. 72వ ఓవర్‌ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన హర్భజన్‌ సింగ్‌ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. వరుస బంతుల్లో పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, షేన్‌ వార్న్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.భజ్జీ హ్యాట్రిక్‌..అప్పటికీ హర్భజన్‌ తన కెరీర్‌ మొదలుపెట్టి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. అయితే ఇది జరిగి 25 ఏళ్లవుతున్నా ఆ సంఘటనను మాత్రం గిల్‌క్రిస్ట్‌ ఇప్పటికీ మరిచిపోలేదనిపిస్తుంది. ‘ట్రూ కలర్స్‌’ పేరిట గిల్‌క్రిస్ట్‌ రాసిన పుస్తకంలో ఆనాటి అనుభవాలను పంచుకున్నాడు. ‘ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌కు దాదాపు 90వేల మంది ప్రేక్షకులు వచ్చారు. తొలిరోజు పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ మిచెల్‌ సాల్ట్‌, హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌ త్రయం పరుగులు రాబట్టారు. కానీ రెండోరోజు ఆటలో మాత్రం హర్భజన్‌ సింగ్‌ మాపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడు. పాంటింగ్, వార్న్‌లతో పాటు నా వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ నమోదు చేసిన భజ్జీ (హర్భజన్‌) మొత్తంగా మా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు.అంపైర్ నిర్ణయంతో షాక్‌!కానీ ఆరోజు నేను ఎల్బీగా ఔటైన విధానం ఇప్పటికీ నా మనసు నుంచి పోవడం లేదు. హర్భజన్‌ వేసిన తొలి బంతి లెగ్‌స్టంప్‌ వెలుపల తగిలి నావైపు టర్న్‌ అయింది. అయితే దానిని నేను ఆన్‌సైడ్‌లోకి తిప్పే ప్రయత్నం చేశాను. కానీ బంతి నా ప్యాడ్‌లకు తాకి పక్కకు వెళ్లింది. నేను ఔట్‌ కాలేదన్న ధీమాతో ఉన్నప్పటికీ, హర్భజన్‌ సహా మిగతా భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఎస్‌కె బన్సల్‌ ఔట్‌ ఇచ్చాడు. కానీ అంపైర్‌ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బంతి ప్యాడ్‌కు తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో చేసేదేమీ లేక వెనుదిరిగాల్సి వచ్చింది. ఇప్పుడున్న డీఆర్‌ఎస్‌ టెక్నాలజీ అప్పట్లో అందుబాటులో ఉండుంటే కచ్చితంగా నాటౌట్‌ అనే ఫలితం వచ్చి ఉండేది.’ అని రాసుకొచ్చాడు.చారిత్రక విజయం..కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 171 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేయడమే గాక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకోవడం విశేషం. ఆనాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ వా సెంచరీతో చెలరేగగా.. హెడెన్‌, లాంగర్‌ అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్‌ డబుల్ సెంచరీకి తోడు రాహుల్‌ ద్రవిడ్‌ సెంచరీతో రికార్డు స్థాయిలో 376 పరుగులు జోడించడంతో 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పని పట్టిన హర్భజన్‌ రెండో ఇన్నింగ్స్‌ లోనూ 6 వికెట్లతో దుమ్మురేపడంతో 212 పరుగులకే చాపచుట్టింది. దీంతో భారత్‌ చారిత్ర్మక విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు అటు లక్ష్మణ్‌.. ఇటు హర్భజన్‌లు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. చదవండి: ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహోIn 2001,Historic Kolkata Test, Bhajji takes a Hattrick V Steve Waugh's Invincible Aus Team. @harbhajan_singh became the 1st Indian to take a Test Hat-trick🇮🇳🇮🇳First RickyPonting√Second- @gilly381Third- @ShaneWarne √#GillyKingPair Hard to believe!pic.twitter.com/Zkc6kdNRAw— Piyush Glystar (@piyushgilly) August 28, 2019

Ishan Kishan-Abhishek Sharma-Sanju Samson Career Best In ICC T20 Rankings 9
ఇషాన్‌ కెరీర్‌ బెస్ట్‌.. శాంసన్‌ అదరహో

భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్‌ తరఫున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్‌ బెస్ట్‌ సాధించాడు. మిగతా బ్యాటర్లలో తిలక్‌ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ హీరో సంజూ శాంసన్‌ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్‌-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్‌ విభాగంలో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్‌ పటేల్‌ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా, భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్‌ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌

Gambhir Befitting Reply To Kirti Azad Comments T20 WC Remarks10
టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్‌

భారత మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. కొంతమంది జట్టు విజయాన్ని కించపరిచేలా మాట్లాడతారని.. అలాంటి వాళ్ల గురించి పట్టించుకోవడంలో అర్థం లేదన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. తద్వారా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం గౌతం గంభీర్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఐసీసీ చైర్మన్‌ జై షా స్టేడియానికి సమీపంలో ఉన్న హనుమాన్‌ ఆలయాన్ని దర్శించారు.కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశాడు. ‘‘టీమిండియా సిగ్గుపడు!.. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచినపుడు.. ఆ జట్టులో హిందు, ముస్లిం, సిక్కు ఉన్నారు. నాడు మేము ఆ ట్రోఫీని మాతృభూమి భారత్‌=హిందుస్థాన్‌= ఇండియాకు తీసుకువచ్చాము.కానీ ఇప్పటి క్రికెట్‌ జట్టు ట్రోఫీని ఎందుకిలా చేస్తోంది. మసీదు లేదంటే చర్చి లేదంటే గురుద్వారకు తీసుకువెళ్లవచ్చు కదా!.. ఈ జట్టు ఇండియా మొత్తానికి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇదేమీ సూర్యకుమార్‌ యాదవ్‌ లేదంటే జై షా కుటుంబానికి చెందినది కాదు.సిరాజ్‌ ఎప్పుడూ ట్రోఫీని మసీదుకు తీసుకువెళ్లలేదు. విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ చర్చికి తీసుకువెళ్లలేదు. ఇది 140 కోట్ల భారతీయులకు చెందినది. అంతేగానీ ఓ మతానికి చెందినది కాదు’’ అని కీర్తి ఆజాద్‌ పోస్టు చేశాడు. ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చుఈ విషయంపై స్పందించాల్సిందిగా ANI గంభీర్‌ను కోరగా.. ‘‘అలాంటి వాళ్ల మాటలకు స్పందించడం కూడా దండగే. దేశం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. అతి పెద్ద సంబరం ఇది. వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచిన జట్టును అందరూ అభినందిస్తున్నారు.కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు ఆ విజయాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడతారు. రేపు ఇంకొకరు ఇంకా దిగజారి కూడా మాట్లాడవచ్చు. ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా జట్టులోని ఆటగాళ్లు వీటిని సీరియస్‌గా తీసుకోరు.సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారీ ఓటమి తర్వాత మా వాళ్లు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజేతలుగా నిలిచారు. అయితే, కొంతమంది మాత్రం సొంత దేశ ఆటగాళ్లను, జట్టును కించపరుస్తున్నారు. ఇది సరికాదు’’ అని గంభీర్‌ కీర్తి ఆజాద్‌కు చురకలు అంటించాడు.#WATCH | On TMC MP & former cricketer Kirti Azad's statement, Head Coach of Team India, Gautam Gambhir says in an interview with ANI, "...It is not even worth answering this question...These kinds of statements just degrade the players and team, which should not be done."Watch… pic.twitter.com/gIWtMpIbm8— ANI (@ANI) March 11, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement