ప్రధాన వార్తలు
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బయలు దేరి వెళ్లిపోయాడు.దీంతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు రింకూ దూరమయ్యాడు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడన్నది కూడా స్పష్టత లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ముందుగానే బ్యాటింగ్కు వచ్చినప్పటికి.. డకౌటై పెవిలియన్కు చేరాడు.అయితే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాల్వడంతో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్కు చాలా కీలకం. ఇటువంటి మ్యాచ్కు ముందు రింకూ జట్టును వీడడం గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి.
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో పాకిస్తాన్ ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఓపెనర్ సైమ్ అయూబ్(9), కెప్టెన్ సల్మాన్ అఘా(5) నిరాశపరిచినప్పటికి.. సాహిబ్జాదా ఫర్హాన్(63), ఫఖర్ జమాన్(25), బాబర్ ఆజం(25),షాదాబ్ ఖాన్(23) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లైమ్ డాసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓవర్టన్, జోఫ్రా అర్చర్ తలా రెండేసి వికెట్లు చోప్పున సాధించారు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
వైభవ్కు టాటా లగ్జరీ కారు గిఫ్ట్.. ధర ఎంతంటే?
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల వైభవ్ ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. తన సంచలన బ్యాటింగ్తో వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం వణికించాడు.కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. అతడు 206.56 స్ట్రైక్ రేట్తో కేవలం 7 మ్యాచ్ల్లోనే 252 పరుగులు చేశాడు. దీంతో వైభవ్ “ టాటా కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ ఇన్స్టాలో షేర్ చేసింది. కాగా టాటా కర్వ్ టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 22 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు అత్యాధునికమైన డీజిల్ ఇంజిన్ ,డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీ వంటి ఫ్యూచర్స్ కలిగి ఉంది.
ఇంగ్లండ్తో మ్యాచ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న పాక్
టీ20 ప్రపంచకప్-2026లో మరో రసవత్తర పోరుకు తెర లేచింది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్,ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో పాక్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫహీమ్ అష్రాప్ స్ధానంలో షాహీన్ అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్
'వాళ్లేం మాల్కం మార్షల్ కాదు'.. హార్దిక్, దూబేపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా సెమీఫైనల్కు చేరుతుందా? లేదా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో పరిస్థితి అంతా తారుమారైంది. గ్రూపు-1 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్ధానంలో ఉంది. నెట్రన్ రేట్(-3.800) భారీగా పడిపోయింది.దీంతో భారత్ సెమీస్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలో భారీ విజయాలతో పాటు, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ భారత్ విఫలమైంది.21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సఫారీలను భారత బౌలర్లు ఆపలేకపోయారు. మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఓటమిలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత వద్ద సరైన ఫాస్ట్ బౌలర్లు లేరని అక్తర్ అన్నాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు ఏమి మాల్కమ్ మార్షల్ వంటి బౌలర్లు కాదని అక్తర్ ఎద్దేవా చేశాడు."సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది. సాధారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 97 నుంచి 98 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తాడు. కానీ ఈ మ్యాచ్లో 94 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అతడిని డెవాల్డ్ బ్రెవిస్ టార్గెట్ చేశాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు.వారిద్దరూ ఏమి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టే మాల్కమ్ మార్షల్లు కారు. డెత్ ఓవర్లలో అటువంటి వారితో బౌలింగ్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రోటీస్తో మ్యాచ్లో అదే జరిగింది. ఈ మ్యాచ్లో పాండ్యా 45 పరుగులు సమర్పించుకున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.
'గంభీర్ రాజకీయాలు చేస్తున్నాడు.. సూర్యతో కుల్దీప్కు గొడవ'
టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు పరిస్థితి గందరగోళంగా మారింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో అదరగొట్టిన మెన్ ఇన్ బ్లూ, కీలకమైన సూపర్-8 స్టేజిలో మాత్రం తేలిపోయింది. సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో ఘోర ఓటమి చవిచూసిన భారత్ .. తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.సెమీస్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ప్రయోగం బెడిసి కొట్టింది.అద్బుతమైన ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్కు కాదని వాషింగ్టన్ సుందర్కు తుది జట్టులో ఛాన్స్ వచ్చారు. సుందర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో గంభీర్పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వ్యవహారశైలి జట్టును దెబ్బతీస్తోందని అతడు అన్నాడు."గంభీర్ వ్యూహత్మక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. తుది జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లను ఆడించాల్సిన అవసరం ఏముంది? గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థికి కలిసొచ్చింది. ఐడైన్ మార్క్రామ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్ వచ్చి వికెట్ తీస్తే, అది జట్టుపై అనవసరమైన ఒత్తిడిని కచ్చితంగా పెంచుతోంది.భారత జట్టు వద్ద చాలా అప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ గంభీర్ ఆటగాళ్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లను భారత్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్తాన్తో మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ను సూర్య వెనక్కి నెట్టివేసిన వీడియో ఒకటి వైరలైంది.బహుశా సూర్యకుమార్తో ఉన్న గొడవ వల్లే కులదీప్ను తప్పించారని అందరూ అనుకుంటున్నారు. లేదంటే కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ పక్కన పెట్టే ఛాన్సే లేదు. ఏదైనా రంగంలో రాణించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం. కానీ గంభీర్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల అతడి ఆలోచనా దృక్పథం పూర్తిగా మారిపోయింది.గంభీర్ రాజకీయాల్లో పెద్దగా రాణించలేక తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఇప్పుడు అదే తరహా రాజకీయాలను టీమిండియాలో చేస్తున్నాడు. గంభీర్ తన సొంతప్రయోగాలతో భారత జట్టు ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహజాద్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఈ సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ బ్యాటర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వర్మ(4) వరుస బంతుల్లో పెవిలియన్కు చేరారు. అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత భారత్ మళ్లీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించగా.. మేఘాన్ షాట్, అలానా కింగ్, మెక్గ్రాత్ తలా వికెట్ సాధించారు.215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్ఫీల్డ్ (32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బెత్ మూనీ (76 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు, దీప్తీ శర్మ, క్రాంతి గౌడ్ తలా వికెట్ సాధించారు.
మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక జట్టు తలపడనున్నాయి. ఈ పొట్టి ప్రపంచకప్లో మొత్తం మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లు నేరుగా అర్హత సాధించగా.. క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తమ స్ధానాలను ఖాయం చేసుకున్నాయి.భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో ఉన్న భారత్-పాకిస్తాన్ జట్లు జూన్ 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా అమీతుమీ తెల్చుకోనున్నాయి. భారత్కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. గ్రూపు-ఎలో భారత్, పాక్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 5న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుందిభారత్ మ్యాచ్ల షెడ్యూల్ జూన్ 14 - పాకిస్తాన్తో.. ఎడ్జ్బాస్టన్జూన్ 17- నెదర్లాండ్స్తో.. లీడ్స్జూన్ 21-సౌతాఫ్రికాతో.. మాంచెస్టర్జూన్ 25- బంగ్లాదేశ్తో.. మాంచెస్టర్జూన్ 28- ఆస్ట్రేలియాతో.. లార్డ్స్
సౌతాఫ్రికా హోం సమ్మర్ షెడ్యూల్ ప్రకటన
ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్ షెడ్యూల్ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్ ఆస్ట్రేలియా సిరీస్తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 వన్డేలు, 3 టెస్ట్లు ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ 3 వన్డేలు, 3 టెస్ట్లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.ఆస్ట్రేలియా టూర్ సెప్టెంబర్ 24-తొలి వన్డే, డర్బన్సెప్టెంబర్ 27-రెండో వన్డే, జోహనెస్బర్గ్సెప్టెంబర్ 30-మూడో వన్డే, పోచెఫ్స్ట్రూమ్అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్కెబెర్హాఅక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్టౌన్బంగ్లాదేశ్ టూర్ నవంబర్ 15-19: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్నవంబర్ 23-27: రెండో టెస్ట్, సెంచూరియన్డిసెంబర్ 1- తొలి వన్డే, ఈస్ట్ లండన్డిసెంబర్ 4- రెండో వన్డే, గ్కెబెర్హాడిసెంబర్ 7- మూడో వన్డే, కేప్టౌన్డిసెంబర్ 10- తొలి టీ20, కింబర్లీడిసెంబర్ 12- రెండో టీ20, బెనోనీడిసెంబర్ 13- మూడో టీ20, సెంచూరియన్ఇంగ్లండ్ టూర్డిసెంబర్ 17-21: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్డిసెంబర్ 26-30: రెండో టెస్ట్, సెంచూరియన్2027 జనవరి 3-7: మూడో టెస్ట్, కేప్టౌన్జనవరి 10- తొలి వన్డే, పార్ల్జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు.
రాణించిన కెప్టెన్, వైస్ కెప్టెన్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43), రిచా ఘోష్ (23) కూడా సహకరించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. వీరు మినహా భారత ఇన్నింగ్స్లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో 2, ఓపెనర్ ప్రతీక రావల్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది. మెగాన్ షట్ (9-1-42-2), సోఫీ మోలినెక్స్ (5-1-17-1), తహ్లియా మెక్గ్రాత్ (4-0-16-1), డార్సీ బ్రౌన్ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్ సదర్ల్యాండ్ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొ...
బెల్జియం చేతిలో భారత్ ఓటమి
రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుక...
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల...
మళ్లీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఎప్పుడంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ను ఐసీసీ ...
సౌతాఫ్రికా హోం సమ్మర్ షెడ్యూల్ ప్రకటన
ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్ షెడ్యూల్ను దక్షిణాఫ...
రాణించిన కెప్టెన్, వైస్ కెప్టెన్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
