Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

MS Dhoni Never Dropped Yuvraj Singh: Ex Chief Selector On Yograj Claims1
అతడిని తప్పించమని ధోని చెప్పలేదు: మాజీ చీఫ్‌ సెలక్టర్‌

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని. 2007‍ టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపిన సారథి.యువీదే కీలక పాత్రఇక ధోని కెప్టెన్సీలో 2007, 2011 ప్రపంచకప్‌ టోర్నీలు గెలిచిన టీమిండియాలో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సభ్యుడన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఈ ఐసీసీ ఈవెంట్లో 363 పరుగులు చేయడంతో పాటు యువీ పదిహేను వికెట్లు కూడా తీశాడు.అదే సమయంలో యువీ క్యాన్సర్‌ బారిన పడినట్లు తేలగా చాన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని రీఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019 వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. ఈ పరిణామాల నేపథ్యంలో యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) ఎల్లప్పుడూ ధోనిని టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ధోని వల్లే తన కుమారుడి కెరీర్‌ నాశనమైందని.. అతడే జట్టులో యువీకి స్థానం లేకుండా చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. యువీ మీద అసూయతోనే ధోని ఇలా చేశాడని ఆరోపించాడు.ఈ క్రమంలో యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆరోపణలపై టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌ పాటిల్‌ తాజాగా స్పందించాడు. యువీ విషయంలో ధోని ఏనాడూ వివక్ష చూపలేదని.. అతడిని జట్టు నుంచి తప్పించాలని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశాడు.ధోని ఏనాడూ చెప్పలేదు..ఈ మేరకు విక్కీ లల్వాణీ షోలో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ కమిటీ సమావేశాలు.. లేదంటే విదేశీ పర్యటనలు.. అదీ కాదంటే మ్యాచ్‌ల సందర్భంగా .. ఇలా ఎప్పుడూ కూడా.. ఏ సందర్భంలోనూ యువరాజ్‌ సింగ్‌ను జట్టు నుంచి తప్పించమని మహేంద్ర సింగ్‌ ధోని ఏనాడూ చెప్పలేదు.నా మాటలను రికార్డు చేసి పెట్టండి. ధోని ఏనాడూ ఏ ఆటగాడి గురించి చెడుగా చెప్పలేదు. అతడికి సెలక్షన్‌ కమిటీ నిర్ణయంపై పూర్తి నమ్మకం ఉండేది’’ అని యువీ విషయంలో నాడు సెలక్టర్లదే తుది నిర్ణయం అని సందీప్‌ పాటిల్‌ పేర్కొన్నాడు. ఇక ఓ తండ్రిగా యోగ్‌రాజ్‌ ఆవేదనలో తప్పు లేదని.. అయితే, కుమారుడి మీద ప్రేమతో మరొకరిని నిందించడం తగదని హితవు పలికాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

Shaheen Afridi Stuns IPL Teams In The Hundred 2026 Auction With Shocking Move2
షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేలం ఇవాళ (మార్చి 12) జరగాల్సి ఉంది. అయితే వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు అఫ్రిది తన పేరును ఉపసంహరించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వేలంలో పాల్గొంటున్న అతి కొద్ది మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లలో అఫ్రిది ఒకరు. అఫ్రిది లక్ష పౌండ్ల (రూ. 1.23 కోట్లు) బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి తప్పుకొని, తన కోసం ప్రణాళికలు వేసుకున్న ఫ్రాంచైజీలను భారీగా దెబ్బకొట్టాడు. అఫ్రిదితో పాటు క్వింటన్‌ డికాక్‌, సునీల్‌ నరైన్‌, అల్లా ఘజన్‌ఫర్‌, పీటర్‌ సిడిల్‌ కూడా ఆఖరి నిమిషంలో హండ్రెడ్‌ లీగ్‌ వేలం నుంచి తమ పేర్లను వెనక్కి తీసుకున్నారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు దెబ్బప్రస్తుతం హండ్రెడ్‌ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్‌ యాజమాన్యాలు పాకిస్తాన్‌ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్‌ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ లీగ్‌ నిర్వాహకులు పాక్‌ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. తొలిసారి జరుగుతున్న హండ్రెడ్‌ లీగ్‌ వేలానికి 63 మంది పాకిస్తాన్‌ ఆటగాళ్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. వీరిలో షాహీన్‌ అఫ్రిది కూడా ఉన్నాడు. అఫ్రిది కోసం ఐపీఎల్‌ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కూడా పోటీపడే అవకాశం ఉండింది. అఫ్రిది చివరి నిమిషంలో వేలం నుంచి వైదొలగడంతో ఆయా ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బ తగినట్లైంది. అఫ్రిది ఏ కారణం చేత వేలం నుంచి వైదొలిగాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు.ఇదిలా ఉంటే, మహిళల విభాగం హండ్రెడ్‌ లీగ్‌ వేలం​ నిన్ననే జరిగింది. ఈ వేలంలో సోఫీ డివైన్‌, బెత్‌ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్‌ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్‌ ఫాతిమా సనా కూడా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయింది.

Absolutely flabbergasted about him not getting spot Ganguly on Indian Star3
అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదు: గంగూలీ

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో తిరుగులేని జట్టుగా టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో చాంపియన్‌గా నిలిచిన భారత్‌.. తాజాగా సూర్యకుమార్‌ కెప్టెన్సీలో సొంతగడ్డపై 2026 టైటిల్‌ గెలిచింది. ఈ రెండు సీజన్లలో కలిపి మొత్తంగా 17 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏకంగా 16 గెలిచింది.వరుసగా రెండోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగానూ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్లో భారత్‌కు రెండు జట్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.రెండు జట్లు ఉంటే‘‘ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉండి.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ కూడా అందుబాటులో ఉంటే భారత్‌ మరో జట్టు ఏర్పాటు చేసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఓ జట్టు ఉండాలి. నిజానికి కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌ వంటి వాళ్లకు టీ20 ఫార్మాట్లో అవకాశాలే రావడం లేదు.అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయట్లేదుఇక వైభవ్‌ సూర్యవంశీ.. ప్రపంచంలోని ఏ జట్టులోనైనా సరే అతడికి చోటు ఉంటుంది. శ్రేయస్‌ అయ్యర్‌ విషయాని​కి వస్తే.. ఇప్పటికీ అతడు భారత టీ20 జట్టులోకి రాలేకపోతున్నాడు. అతడికి అసలు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో నాకైతే ఇంత వరకు అర్థం కావడమే లేదు.అయ్యర్‌ విషయంలో యాజమాన్యం వైఖరి నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక బౌలర్ల విషయానికొస్తే ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌లకు కూడా టీ20లలో ఆడే అవకాశం రావడం లేదు. లెక్కకు మిక్కిలి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి భారత్‌ రెండు టీ20 జట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది’’ అని గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగాకాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌, ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా టైటిల్‌ గెలిచిన అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఇక ఈ రెండు సీజన్లలో కలిపి ఏకంగా దాదాపు 950 పరుగులు సాధించాడు. అయితే, టీ20 జట్టులో ఖాళీ లేకపోవడం వల్లే శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు ఇవ్వలేకపోతున్నామని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

Not Sanju Samson, AB de Villiers Names Deserving T20 World Cup POTM Winner4
శాంస‌న్ కాదు.. అత‌డే అందుకు అర్హుడు: డివిలియర్స్‌

సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్ వేదిక‌గా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా వరుసగా రెండోసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ చారిత్రత్మ‌క విజ‌యంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్‌ది కీల‌క పాత్ర.వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌తో పాటు సెమీస్‌, ఫైన‌ల్లోనూ సంజూ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. టోర్నీ ఆరంభంలో తుది జ‌ట్టులోనే లేక‌పోయిన శాంస‌న్‌.. ఆ త‌ర్వాత వ‌రుస మ్యాచ్‌ల‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిలిపాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్‌ కేవ‌లం ఐదు మ్యాచ్‌ల‌లోనే 321 ప‌రుగులు చేశాడు.ఈ అసాధారణ ప్రదర్శనకు గాను ఐసీసీ శాంసన్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డుకు సంజూ కంటే జస్ప్రీత్ బుమ్రా మరింత అర్హుడని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.ఈ మెగా ఈవెంట్‌లో బుమ్రా కూడా సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కివీస్‌తో జరిగిన ఫైనల్లోనూ బుమ్రా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ నేప‌థ్యంలోనే బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేసి ఉంటే బాగుండేద‌ని ఏబీడీ అన్నాడు."సంజూ శాంస‌న్‌, బుమ్రాలో ఎవ‌రు ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీ అన్న‌ది నిర్ణ‌యించ‌డం చాలా కష్టం. ఈ టోర్నీలో బుమ్రా అత్య‌ధిక వికెట్లు తీశాడు. కాబ‌ట్టి అత‌డు కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. కానీ నా వ‌ర‌కు అయితే బుమ్రాకే ఆ అవార్డు ఇవ్వాల్సింది. ఎందుకంటే అత‌డు వేసిన కొన్ని కీల‌కమైన స్పెల్‌లు భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాయి.సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్లో బుమ్రా బౌలింగ్ నిజంగా అద్భుతం. అత‌డొక్క‌డే వేరే గ్ర‌హంలో ఉన్నట్లు బౌలింగ్ చేశాడు. అత‌డు భార‌త క్రికెట్‌కు అత‌డొక విలువైన ఆస్తి" అని డివిలియ‌ర్స్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

Dropping Axar Patel was my mistake He Was Angry I apologised: Suryakumar5
T20 WC: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా ఆదివారం సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఓవరాల్‌గా మూడోసారి, వరుసగా రెండోసారి పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా రికార్డు సాధించింది.లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించిన భారత్‌.. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో మాత్రం 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ (Axar Patel) స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తాజాగా స్పందించాడు.అతడి కోపం చల్లారలేదు‘‘అక్షర్‌ పటేల్‌ ఆరోజు చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు. అతడొక అనుభవజ్ఞుడైన ప్లేయర్‌. ఐపీఎల్‌లో ఓ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నాడు. కాబట్టి అతడి కోపంలో అర్థం ఉంది.నా వల్లే తప్పు జరిగిందని.. నన్ను క్షమించమని కోరాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయం తీసుకున్నానని అతడికి వివరించాను. కానీ అతడి కోపం చల్లారలేదు. మరుసటి రోజు వరకు కూడా అతడు నాపై కోపంగానే ఉన్నాడు’’ అని సూర్యకుమార్‌ చెప్పుకొచ్చాడు. అక్షర్‌ను తప్పించి..కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు అక్షర్‌ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా వాషీని తుదిజట్టుకు ఎంపిక చేయడంతో అక్షర్‌ పటేల్‌ తీవ్ర నిరాశకు గురైనట్లు సూర్య మాటల ద్వారా తెలుస్తోంది. అక్షర్‌ను తప్పించి.. వాషీని ఆడించాలనేది తన నిర్ణయమేనని సూర్య స్పష్టం చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లపై గెలిచి సెమీస్‌ చేరింది టీమిండియా. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో అక్షర్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ల వల్లే ఉత్కంఠ పోరులో టీమిండియాకు విజయం సాధ్యమైందని చెప్పవచ్చు.చదవండి: T20 WC: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'

Pak Former Cricketers Angry Shoot Man Who Gave That Gameplan After Loss 1st ODI6
‘గేమ్‌ప్లాన్‌ ఎవడిదో కానీ చంపేయాలి’!

పాకిస్థాన్‌ క్రికెట్‌ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ, కమ్రాన్‌ అక్మల్‌ గేమ్‌ప్లాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ మాట్లాడుతూ.. ‘పవర్‌ప్లేలో 60 కంటే తక్కువ పరుగులు చేయాలని చెప్పిన వాడిని మొదట షూట్‌ చేయాలి. గేమ్‌ప్లాన్‌ చాలా చెత్తగా ఉంది. నాకు తెలిసి ఆ చెప్పినవాడు ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రౌండ్‌లోకి దిగినట్లుగా అనిపించడం లేదు. కేవలం పేపర్‌పై రాసుకొన్న థియరీని మాత్రమే అప్లై చేసే పనిలో పడ్డట్లున్నాడు. పిచ్‌ పరిస్థితులపై కనీసం అంచనాలు లేకుండా జట్టును బరిలోకి ఎలా దించుతారు. ఇదే పిచ్‌పై టీమిండియా కూడా ఓటమి పాలైందన్న సంగతి మరిచిపోయినట్లున్నారు.’ అని తెలిపాడు. మరో మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతుంటే.. పాకిస్థాన్‌ ఆటతీరు మాత్రం క్లబ్‌ క్రికెట్‌ కోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్నట్లుగా ఉంది. బాసిత్‌ అలీకి ఫోన్‌ చేసి పాక్‌ జట్టు ఆడుతున్న ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు క్లబ్‌ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా ఆడరనుకుంటా’ అని తెలిపాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని బాసిత్‌ అలీ తెలిపారు. జట్టులో యువరక్తం ఎక్కువగా ఉందని, వాళ్లంతా సెటిల్‌ కావడానికి టైం పట్టే అవకాశముందన్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 30.4 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్‌ అశ్రఫ్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నహిద్‌ రానా 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్‌ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 13న జరగనుంది.చదవండి: గురుశిష్యులకు అరుదైన గౌరవం!

West Indies cricketer suspended for match-fixing7
ఫిక్సింగ్‌ కలకలం.. వెస్టిండీస్‌ క్రికెటర్‌పై వేటు

వెస్టిండీస్ క్రికెటర్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ జేవన్ సీర్లెస్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ICC) భారీ షాకిచ్చింది. సీర్లెస్‌పై మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఐసీసీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. బార్బడోస్‌లో జరిగిన బీమ్‌10 లీగ్ (2023-24 సీజన్) సమయంలో సీర్లెస్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ అవినీతి నిరోధక కోడ్‌లోని ఐదు నిబంధనలను సీర్లెస్‌ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది. మ్యాచ్ ఫ‌లితాల‌ను ప్రభావితం చేసేలా సీర్లెస్‌ వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. అత‌డితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, అధికారి ట్రెవాన్ గ్రిఫిత్‌పై కూడా ఐసీసీ తాత్కాలిక నిషేదం విధించింది. సీర్లెస్‌పై అత్యధికంగా నాలుగు చార్జీలు నమోదు కాగా, చిత్రంజన్‌పై మూడు, గ్రిఫిత్‌పై ఒక చార్జ్ నమోదైంది. అయితే తమ‌పై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించడానికి వీరి ముగ్గురికి 14 రోజుల సమయం ఉందని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదే బీమ్ టీ10 లీగ్ వ్య‌వ‌హారంలో అమెరికా క్రికెట‌ర్ ఆరోన్ జోన్స్‌పై కూడా ఐసీసీ సస్పెన్షన్ విధించింది. దీంతో అత‌డు టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు దూర‌మ‌య్యాడు.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..

Dravid To Receive BCCI Lifetime Achievement Award-Gill Named Cricketer Of Year8
గురుశిష్యులకు అరుదైన గౌరవం!

టీమిండియా మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అరుదైన గౌరవం అందుకోనున్నాడు. క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పేరున్న సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును రాహుల్‌ ద్రవిడ్‌ సొంతం చేసుకోనున్నాడు. మార్చి 15న ఢిల్లీ వేదికగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక జరగనుంది.ఈ వేడుకలోనే రాహుల్‌ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. కాగా ఇదే వేడుకలో భారత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకోనున్నాడు. ఇక దేశవాలీ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్‌గా గతేడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆయుశ్‌ మాత్రే ‘లాలా అమర్‌నాథ్‌’ అవార్డు అందుకోనున్నాడు. ఇక భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌ కూడా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకోనుంది.భారత​ క్రికెట్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ స్థానం ప్రత్యేకమైనది. సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో సంయుక్తంగా స్థానం సంపాదించిన ద్రవిడ్‌ ‘ది వాల్‌’గా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా పేరు పొందిన ద్రవిడ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌లో ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన ద్రవిడ్‌.. 2001లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఆ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌ అవతారమెత్తిన ద్రవిడ్‌.. 2018 అండర్‌-19 ప్రపంచకప్‌ టీమిండియా గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కప్‌ గెలిచిన జట్టులో శుబ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షాలు సభ్యులుగా ఉన్నారు. ఒకప్పుడు గురువు శిక్షణలో అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన గిల్‌ ఇప్పుడు గురువుతో కలిసి ఒకే వేదికపై అవార్డు అందుకోబోతుండడం విశేషం.ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపికైన రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లోనూ తనదైన మార్క్‌ చూపించాడు. ద్రవిడ్‌ హయాంలోనే టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2024లో అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌‌ విజేతగా నిలిచి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.ఇక శుబ్‌మన్‌ గిల్‌ చివరిగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాడు. కెప్టెన్‌ అయిన తర్వాత ఒత్తిడిలో పడిపోయిన గిల్‌ సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఫామ్‌ లేమితో సతమతమవుతున్న నేపథ్యంలో టీ20 జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ

BCCI Wanted To Replace Sachin Tendulkar Left Him In Shock9
సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ

స‌చిన్ టెండూల్క‌ర్‌.. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. "గాడ్ ఆఫ్ క్రికెట్"గా పేరుగాంచిన సచిన్‌.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు రోల్‌ మోడల్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 34,000 పైచిలుకు పరుగులు, 200 టెస్టులు ఆడిన మొదటి ఆటగాడిగా, వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా ఎన్నో చెక్కు చెరగని రికార్డులను మాస్టర్ బ్లాస్టర్ తన పేరిట లిఖించుకున్నాడు.దాదాపు 24 ఏళ్ల పాటు భారత జట్టుకు తన సేవలను అందించిన సచిన్.. 2013లో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే సచిన్ రిటైర్మెంట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. టెండూల్కర్ రిటైర్మెంట్‌కు ఏడాది ముందే అతని స్ధానాన్ని మరొకరితో భర్తీ చేయాలని బీసీసీఐ భావించిందంట. ఈ విషయాన్ని అప్ప‌టి బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ సందీప్ పాటిల్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. 2012లో సచిన్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో జరిగిన ఓ సంభాష‌ణ‌ను అత‌డు గుర్తు చేసుకున్నాడు."స‌చిన్‌ను మీ తదుపరి ప్రణాళికలు ఏంటి? అని అడిగాను. దీంతో అత‌డు ఎందుకు అలా అడుగుతున్నారు? ఆశ్చ‌ర్య‌పోయాడు. అందుకు బ‌దులుగా మీ స్ధానంలో మ‌రొక‌రికి అవ‌కాశ‌మివ్వాల‌ని సెలెక్షన్ కమిటీ భావిస్తుంద‌ని నేను సూటిగా చెప్పాను. వెంట‌నే స‌చిన్ షాక్‌కు గురువుతూ.. మీరు సీరియ‌స్‌గానే చెబుతున్నారా?" అని తిరిగి న‌న్ను అడిగాడని విక్కీ లాల్వానీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాటిల్ పేర్కొన్నాడు. అదేవిధంగా సెలెక్టర్లు ఒక ఆటగాడిని జట్టు నుంచి పక్కన పెట్టగలరే తప్ప, రిటైర్మెంట్ ప్రకటించమని ఒత్తిడి చేయలేరని పాటిల్ స్పష్టం చేశాడు.సచిన్‌ తనంతట తానే.."స‌చిన్‌ను త‌న ప్లాన్స్ అడిగాము, అందుకు ఆయ‌న కొన‌సాగుతా అని చెప్పాడు. అందుకు మేము అంగీక‌రించాము. చివ‌రికి స‌చినే స్వ‌యంగా ఫోన్ చేసి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మాకు తెలిపాడు" అని పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా 2013లో సచిన్ త‌న స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాడు. టెస్టు, వ‌న్డే ఫార్మాట్‌ల‌లో 19 మ్యాచ్‌లు ఆడిన కేవ‌లం ఒకే ఒక సెంచ‌రీ చేశాడు.చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్‌లో ఓడాం'

IPL 2026 Unlikely Face Oil-LPG-Disruptions-BCCI Ready With Contingency Plans10
IPL 2026: యుద్ధం జరిగినా ఆ చాన్స్‌ లేదు!

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2026 షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 28 నుంచి జరగనున్న సీజన్‌లో దేశంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలి విడత షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. తొలి విడతలో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో గతేడాది చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌, సహజ వాయువుల సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ సంక్షోభం భారత్‌కు కూడా పాకింది. గ్యాస్‌ సంక్షోభం ఏర్పడడంతో బెంగళూరు, ముంబై సహా చాలా నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. చమురు, గ్యాస్‌ సంక్షోభం సెగ ఐపీఎల్‌కు తగిలే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా మ్యాచ్‌లు జరగబోయే స్టేడియం ఫ్లడ్‌లైట్లకు ఉపయోగించే ఇంధన సరఫరాతో పాటు ఆటగాళ్లకు, సిబ్బంది బస చేసే హోటళ్లలో గ్యాస్‌ సంక్షోభం ఏర్పడే అవకాశముందని ఐపీఎల్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పుడైతే పరిస్థితులు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఏదైనా సమస్యలు ఏర్పడినా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చే విదేశీ క్రికెటర్ల ప్రయాణాల్లోనూ కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్రకటించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాకా పూర్తి సీజన్‌ ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. చదవండి: 'వరల్డ్‌కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement