Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: What Happens To Australia If IRE vs ZIM Is Abandoned1
T20 WC: జింబాబ్వే రైట్‌ రైట్‌.. అదే జరిగితే ఆసీస్‌ ఇంటికే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందే ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ గాయాల కారణంగా దూరమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సైతం ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.దీంతో కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆస్ట్రేలియా.. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలుపొంది శుభారంభం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆసీస్‌ అదే జోరు కొనసాగించలేకపోయింది.తమ రెండో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో పసికూన జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆస్ట్రేలియా. తద్వారా జింబాబ్వే గ్రూప్‌-బి నుంచి సూపర్‌-8 అవకాశాలు మెరగుపరచుకోగా.. కంగారూ జట్టుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంకతో సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.గ్రూప్‌-బి నుంచి శ్రీలంక మూడింటికి మూడు గెలిచి సూపర్‌-8కు చేరగా.. జింబాబ్వే రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెట్‌రన్‌రేటు (+1.984).మరోవైపు ఆస్ట్రేలియా మూడు ఆడి కేవలం ఒక్కటే గెలిచి.. 2 పాయింట్లతో ఉంది. నెట్‌రన్‌రేటు (+0.414) తదుపరి ఒమన్‌తో ఆసీస్‌ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆసీస్‌ సూపర్‌-8 అవకాశాలు సజీవంగా ఉంటాయి.అయితే, దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా ఆస్ట్రేలియాను వర్షం గండం వెంటాడుతోంది. ఆసీస్‌ కంటే పాయింట్లు, నెట్‌రన్‌రేటు పరంగా జింబాబ్వే పటిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి తరుణంలో మంగళవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే జింబాబ్వే ఆరు పాయింట్లతో నేరుగా సూపర్‌-8 చేరితే ఆసీస్‌ ఇంటి బాటపడుతుంది.ఒకవేళ ఐర్లాండ్‌ చేతిలో జింబాబ్వే ఓడితే ఆసీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే, ఐర్లాండ్‌- జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలెలో వర్షం పడుతున్న కారణంగా ఇరుజట్ల మధ్య మ్యాచ్‌కు టాస్‌ ఆలస్యమైంది. ఒకవేళ వర్షం తెరిపినివ్వకపోతే మ్యాచ్‌ రద్దైపోతుంది.అదే జరిగితే ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు జింబాబ్వే ఖాతాలో పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుతుంది. తద్వారా ఆటోమేటిక్‌గా జింబాబ్వే సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ఆసీస్‌ టోర్నీ నుంచి ఘోర పరాభవంతో లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తుంది. అన్నట్లు జింబాబ్వేకు మరో మ్యాచ్‌ కూడా మిగిలి ఉంది. శ్రీలంకతో గురువారం జింబాబ్వే తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫలితం తేడాగా వచ్చిన జింబాబ్వేకు ఇంకో అవకాశం మిగిలే ఉంటుందన్నమాట.

T20 WC 2026: New zealand confirms super 8 berth, what are the other team qualified and what are the teams in the race of super 82
సూపర్‌-8కు న్యూజిలాండ్‌.. మిగిలిన రెండు బెర్త్‌లు ఎవరివి..?

టీ20 ప్రపంచకప్‌ 2026లో మరో సూపర్‌-8 బెర్త్‌ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక సూపర్‌-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్‌లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం​ పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.గ్రూప్‌-సి,డి నుంచి సూపర్‌-8 బెర్త్‌లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్‌ల్లో ఓ బెర్త్‌ ఖరారైనా, మరో బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌ సూపర్‌-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్‌, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి.గ్రూప్‌-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్‌ ఒక్కటే సూపర్‌-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌ నుంచి మరో బెర్త్‌ కోసం​ టెక్నికల్‌గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్‌ఏ, పాకిస్తాన్‌ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్‌ టెక్నికల్‌గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్‌-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.పాక్‌, యూఎస్‌ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్‌కే సూపర్‌-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్‌ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్‌లో పాక్‌ గెలిస్తే.. నేరుగా సూపర్‌-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్‌ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్‌ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని, పాక్‌తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరాలంటే పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్‌, యూఎస్‌ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా యూఎస్‌ఏ సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది.గ్రూప్‌-ఏ నుంచి టెక్నికల్‌గా సూపర్‌-8 లైన్‌లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్‌. ఈ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించింది. ఒకవేళ నెదర్లాండ్స్‌ భారత్‌పై ఘన విజయం సాధించి, పాక్‌ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్‌ఏ, పాక్‌, నెదర్లాండ్స్‌ జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది.గ్రూప్‌-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక ఇదివరకే సూపర్‌-8కు చేరిపోగా.. ఒమన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్‌ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్‌-8కు, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్‌-8 బెర్త్‌ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్‌ మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి. ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనా, జింబాబ్వే సూపర్‌-8కు వెళ్తుంది. ఆసీస్‌, ఐర్లాండ్‌ ఇంటిముఖం పడతాయి. ఐర్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్‌ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్‌కు సూపర్‌-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్‌ అనధికారికంగా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే.

Kapil Dev, Gavaskar Bat For Imran Khan, Request Pak Govt For Fair Treatment3
పాక్‌ మాజీ కెప్టెన్‌కు గావస్కర్‌ మద్దతు.. ప్రభుత్వానికి లేఖ

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు టీమిండియా దిగ్గజాలు అండగా నిలిచారు. ఇమ్రాన్‌ పట్ల పాక్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా పాకిస్తాన్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన లెజెండరీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌.ఇమ్రాన్‌ సారథ్యంలో 1992లో పాక్‌ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఇప్పటి వరకు మరే ఇతర పాక్‌ కెప్టెన్‌కు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించిన ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan).. పాకిస్తాన్‌ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలు, ఇతరత్రా కారణాలతో అతడు జైలు పాలయ్యాడు.జైలు జీవితంఈ క్రమంలో 2023 సెప్టెంబరు నుంచి జైలులోనే ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం ఇటీవల క్షీణించినట్లు వార్తలు వచ్చాయి. కంటిచూపు 85 శాతం పోయినట్లు ఆయన న్యాయవాది చెప్పారు. సరైన వైద్య సదుపాయం అందించాలని.. లేని పక్షంలో ఆయన పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అండగా పద్నాలుగు మంది మాజీ కెప్టెన్లుఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్‌, షోయబ్‌ అక్తర్‌ తదితరులు ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా పద్నాలుగు మందితో మాజీ కెప్టెన్లతో కూడిన బృందం పాకిస్తాన్‌ ప్రభుత్వానికి పిటిషన్‌ పంపింది.ప్రభుత్వానికి లేఖ‘‘పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, క్రికెట్‌ లెజెండ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్‌కు అతడు అందించిన సేవలు ప్రశంసనీయం. కెప్టెన్‌గా పాకిస్తాన్‌కు తొలి వరల్డ్‌కప్‌ అందించిన వ్యక్తి అతడు.మాలో చాలా మంది అతడి ప్రత్యర్థిగా మైదానంలో దిగాము. అయితే, పోటీ ప్రపంచంలో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆల్‌రౌండర్‌గా చరిష్మా ఉంది. అంతేకాదు పాక్‌ ప్రధాని గానూ ఇమ్రాన్‌ పనిచేశారు.సంక్షోభ సమయంలో పగ్గాలు చేపట్టి దేశాన్ని ముందుకు నడిపించారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదు. అంతర్జాతీయ స్థాయి వైద్యులను పిలిపించి ఆయనకు వైద్యం చేయాలని.. ఆ సమయంలో కుటుంబ సభ్యులు సైతం పక్కనే ఉండేందుకు అనుమతినివ్వాలని కోరుతున్నాం.గావస్కర్‌, కపిల్‌ దేవ్‌లతో పాటుచట్టపరంగానే వైద్య సదుపాయం అందించండి. కానీ ఆలస్యం చేయవద్దు’’ అని మాజీ కెప్టెన్లు పాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై భారత దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌తో పాటు మైకేల్‌ ఆథర్టన్‌, అలెన్‌ బోర్డర్‌, మైకేల్‌ బ్రేర్లీ, గ్రెగ్‌ చాపెల్‌, ఇయాన్‌ చాపెల్‌, బెలిండా క్లార్క్‌, డేవిడ్‌ గోవర్‌, కిమ్‌ హ్యూస్‌, నాజర్‌ హుసేన్‌, సర్‌ క్లైవ్‌ లాయిడ్‌, స్టీఫెన్‌ వా, జాన్‌ రైట్‌ సంతకాలు చేశారు.చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Yuvraj Samra World Record Scripts T20 WC History 65 Ball 110 Vs NZ4
T20 WC: చరిత్ర సృష్టించిన కెనడా బ్యాటర్‌.. ప్రపంచ రికార్డు

కెనడా క్రికెటర్‌, భారత మూలాలు ఉన్న యువరాజ్‌ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. తాజా ఎడిషన్‌లో భాగంగా పటిష్ట న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ ఈ ఘనత సాధించడం విశేషం.58 బంతుల్లోనేటీ20 వరల్డ్‌కప్‌-2026లో భాగంగా గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌- కెనడా (NZ vs CAN) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌లో.. టాస్‌ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో కెనడా ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.పందొమ్మిదేళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ కేవలం 58 బంతుల్లోనే శతక్కొట్టాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్‌ సమ్రా 11 ఫోర్లు, ఆరు సిక్స్‌లు బాది 110 పరుగులు సాధించాడు. తద్వారా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా యువరాజ్‌ నిలిచాడు.A HISTORIC MILESTONE! 🙌Canada’s Yuvraj Samra creates history with a breathtaking century, becoming the youngest centurion in T20Is! 🫡ICC Men’s #T20WorldCup | #NZvCAN | LIVE NOW ➡️ https://t.co/uuKxoyS6gX pic.twitter.com/bCbK9u8AIq— Star Sports (@StarSportsIndia) February 17, 2026 173 పరుగులు ఇక కివీస్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ శతకం (110)తో ఆకట్టుకోగా.. మరో ఓపెనర్‌, కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో నవనీత్‌ ధలీవాల్‌ (10) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. నికోలస్‌ కిర్టాన్‌ (2) విఫలమయ్యాడు. హర్ష్‌ థాకర్‌ 3, దిలాన్‌‌ హెలిగర్‌ 8 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా కెనడా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 173 పరుగులు స్కోరు చేసింది. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కైలీ జెమీషన్‌, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ తీయగా.. యువరాజ్‌ రూపంలో జేకబ్‌ డఫీ కీలక వికెట్‌ దక్కించుకున్నాడు.టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు🏏యువరాజ్‌ సమ్రా (కెనడా)- చెన్నై వేదికగా న్యూజిలాండ్‌ మీద 2026లో 19 ఏళ్ల 141 రోజుల వయసులో🏏అహ్మద్‌ షెహజాద్‌ (పాకిస్తాన్‌)- మిర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌ మీద 2014లో 22 ఏళ్ల 127 రోజుల వయసులో🏏సురేశ్‌ రైనా (ఇండియా)- గ్రాస్‌ ఐస్‌లెట్‌ వేదికగా సౌతాఫ్రికా మీద 2010లో 23 ఏళ్ల 156 రోజుల వయసులో🏏అలెక్స్‌ హేల్స్‌ (ఇంగ్లండ్‌)- ఛట్టోగ్రామ్‌ వేదికగా శ్రీలంక మీద 2014లో 25 ఏళ్ల 83 రోజుల వయసులో🏏గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)- సిడ్నీ వేదికగా శ్రీలంక మీద 2022లో 25 ఏళ్ల 327 రోజుల వయసులో సెంచరీ.కివీస్‌ గెలుపుఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 15.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గ్లెన్‌ ఫిలిప్స్ (36 బంతుల్లో 76), రచిన్‌ రవీంద్ర 39 (బంతుల్లో 59) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేశారు.చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Shoaib Akhtar Embarrassing U-Turn After Calling Naqvi Illiterate5
T20 WC: పాక్‌ మరో ‘యూటర్న్‌’!.. ఈసారి ఎవరంటే?

టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో పాకిస్తాన్‌ వరుస ‘యూటర్న్‌’లతో వార్తల్లో నిలుస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టోర్నీనే బహిష్కరిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొలుత సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.మాట మార్చడమే పనిఆ తర్వాత మొదటికే మోసం వస్తుందని భావించి.. కేవలం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బాయ్‌కాట్‌ చేస్తామని ఏ​కంగా పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ప్రకటన చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) రంగంలోకి దిగడంతో ఈ విషయంలోనూ పాక్‌ మాట మార్చింది.ఐసీసీతో పాటు పాక్‌ భద్రతా కారణాల గురించి మాట్లాడటంతో శ్రీలంక సైతం తమపై గతంలో పాక్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ లేఖ రాసింది. యూఏఈ కూడా పాకిస్తాన్‌ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరింది. ఆఖరికి బంగ్లాదేశ్‌ సైతం భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేసింది.ఈ నేపథ్యంలో ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ, బంగ్లాదేశ్‌ ఒత్తిళ్ల కారణంగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడతామంటూ పాక్‌ అతి పెద్ద యూటర్న్‌ తీసుకుంది. అన్నట్లుగానే కొలంబో వేదికగా పటిష్ట భారత్‌తో తలపడ్డ పాకిస్తాన్‌ 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.నాలుక మడతేసిన అక్తర్‌ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ చైర్మన్‌ , మంత్రి మొహ్సిన్‌ నక్వీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసమర్థ వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ మండిపడ్డాడు. సీనియర్‌ ప్లేయర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ వరుసగా విఫలమవుతున్నా.. ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించాడు.ఆట పట్ల అవగాహన లేని వ్యక్తి చైర్మన్‌ అయితే ఇలాగే ఉంటుందంటూ నక్వీని ఉద్దేశించి అక్తర్‌ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌ వైరల్‌ కాగా అక్తర్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో అతడు కూడా యూటర్న్‌ తీసుకున్నాడు. తాను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి.. ‘‘చదువులేని వాడు, అసమర్థుడు’’ అని అనలేదంటూ మాట మార్చాడు.‘‘నేను నక్వీ భాయ్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆయనను అగౌరవపరచాలనే ఉద్దేశమే నాకు లేదు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ క్రికెట్‌ దిగజారుతున్న తీరుపైనే నేను ఆవేదన వ్యక్తం చేశాను.నక్వీ భాయ్‌ మంచి వ్యక్తిఅసమర్థులైన వ్యక్తులు వ్యవస్థను నాశనం చేస్తారు అని మాత్రమే అన్నాను. అయితే, అది నక్వీ భాయ్‌ను ఉద్దేశించి మాత్రం కాదు. కానీ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. అదే కార్యక్రమంలో నేను నక్వీ భాయ్‌ మంచి వ్యక్తి అని చెప్పాను. కానీ ఆ మాటలను ప్రసారం చేయలేదు.అయితే, ఒక విషయంలో మాత్రం నక్వీ భాయ్‌పై నాకు నిజంగానే కోపం వచ్చింది. టీమిండియాతో ఆడమని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మాట మీద నిలబడలేదు. మేమంతా ఆయనతోనే ఉన్నాం. మీకసలు సిగ్గుందా?అయినా సరే యూటర్న్‌ తీసుకోవడం నచ్చలేదు. ఈ విషయంలో పునరాలోచన చేసే ముందు నన్ను సంప్పదించాల్సింది’’ అని అక్తర్‌ తాను కూడా మాట మార్చేశాడు. ఈ నేపథ్యంలో ‘‘యూటర్న్‌ల మీద యూటర్న్‌లు.. మీకసలు సిగ్గుందా?’’ అంటూ నెటిజన్లు పీసీబీ, అక్తర్‌కు చివాట్లు పెడుతున్నారు.చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Ranji Trophy Semifinal BEN vs JK Day 3 Shami Picks 8 Wickets Fans Reacts6
నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

టీమిండియా వెటరన్‌ పేసర్‌, బెంగాల్‌ బౌలింగ్‌ స్టార్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్‌ క్రికెట్‌ అకాడమీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా జమ్మూ కశ్మీర్‌- బెంగాల్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలైంది.328 పరుగులకు ఆలౌట్‌టాస్‌ గెలిచిన జమ్మూ కశ్మీర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బెంగాల్‌ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (49), షాబాజ్‌ అహ్మద్‌ (42) రాణించగా.. సుదీప్‌ కుమార్‌ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్‌ అయింది.జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో స్టార్‌ పేసర్‌ అకీబ్‌ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్‌ కుమార్‌ (Sunil Kumar) మూడు, యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌, అబిద్‌ ముస్తాక్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌ మొదటి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్‌ అయింది.ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్‌ పేసర్‌ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్‌ హసన్‌ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్‌ సమద్‌ (82), కన్హయ్య వాధవాన్‌ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.అంతేకాదు.. అబిద్‌ ముస్తాక్‌ (27), వన్షజ్‌ శర్మ (3), ఆకిబ్‌ నబీ (42), యుధ్‌వీర్‌ సింగ్‌ చరఖ్‌ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్‌ బౌలర్లలో టీమిండియా స్టార్‌ ముకేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.ఆడినా లాభమేంటి?గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్‌ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్‌లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్‌ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్‌లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.An 8️⃣-wicket masterpiece 🫡Watch 🎥Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥 Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026చదవండి: గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

Is Gambhir to quit India head coach role RR offer triple role ahead of IPL 20267
గంభీర్‌కు గోల్డెన్‌ ఆఫర్‌!.. హెడ్‌కోచ్‌ పదవికి గుడ్‌బై?

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..భారత క్రికెట్‌ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్‌ జాగరణ్‌లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌ రాయల్స్‌ గంభీర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్‌కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.వాటా ఇస్తారా?.. ట్రిపుల్‌ ధమాకా!ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్‌ (Gautam Gambhir)కు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్‌గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు మొత్తం గంభీర్‌ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్‌కప్‌ విన్నర్‌కు దక్కుతుంది.ఒకవేళ గంభీర్‌ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్‌లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.టెస్టులలో ఫ్లాప్‌అయితే, రాజస్తాన్‌ ఆఫర్‌ను గంభీర్‌ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్‌ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం గంభీర్‌కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్‌ 2025ని కూడా కైవసం చేసుకుంది.పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హిట్‌ప్రస్తుతం డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీ20 ప్రపంచకప్‌-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవి చేపట్టిన గంభీర్‌ పదవీ కాలం 2027 వరల్డ్‌కప్‌ వరకు ఉంది. ఇలాంటి తరుణంలో గంభీర్‌ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆఫర్‌కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్‌ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్‌ అందించిన తర్వాతే హెడ్‌కోచ్‌గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.ఐపీఎల్‌ వీరుడుటీమిండియా ఓపెనర్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్‌గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కూడా గంభీర్‌ మెంటార్‌గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఐపీఎల్‌లో మొత్తంగా 154 మ్యాచ్‌లు ఆడి 4218 పరుగులు సాధించాడు.చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌

Ranji Trophy Semis 2026: Karnataka Scores 736 in 1st Innings Vs UTK8
పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు

రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (141), స్మరణ్‌ రవిచంద్రన్‌ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ (232)తో కదం తొక్కాడు.736 పరుగులుమిగిలిన వారిలో కరుణ్‌ నాయర్‌ (60), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కృతిక్‌ కృష్ణ (60), విద్యాధర్‌ పాటిల్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5) విఫలం కాగా.. శ్రేయస్‌ గోపాల్‌ (0), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (0) డకౌట్‌ అయ్యారు. శిఖర్‌ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.ఇక ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్య రావత్‌ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్‌ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్‌ నేగి, అన్వీశ్‌ సుధా, లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.రెండో రోజు ఆట సాగిందిలా..కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (232; 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీ... స్మరణ్‌ (121 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.కరుణ్‌ నాయర్‌ (60; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి పడిక్కల్‌ మూడో వికెట్‌కు 129 పరుగులు ... స్మరణ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జత చేశాడు. శ్రేయస్‌ గోపాల్‌ (0) డకౌట్‌కాగా ... కృతిక్‌ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి స్మరణ్‌ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్‌ కెరీర్‌లో ఐదో ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ సాధించాడు. కృతిక్‌ వెనుదిరిగాక ... విద్యాధర్‌ పాటిల్‌ (35 బ్యాటింగ్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్మరణ్‌ మరో వికెట్‌ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

Azmatullah Omarzai stars as Afghanistan beat UAE to keep Super Eight hopes alive9
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్‌ 

న్యూఢిల్లీ: గ్రూప్‌లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు మూడో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. ‘సూపర్‌–8’ చేరే అవకాశాలను నిలబెట్టుకుంది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన మ్యాచ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (4 వికెట్లు; 21 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపొందింది. మొదట యూఏఈ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. సోహైబ్‌ ఖాన్‌ (48 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేశాడు. అజ్మతుల్లా (4–0–15–4) నిప్పులు చెరిగే స్పెల్‌తో యూఏఈ బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో అఫ్గానిస్తాన్‌ కెపె్టన్, లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అర్ఫాన్‌ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో టి20 క్రికెట్‌ చరిత్రలో 700 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ టి20ల్లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ ఖానే (191) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం అఫ్గానిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. ఇబ్రహీం జద్రాన్‌ (41 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అజ్మతుల్లా రాణించారు. ఈ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన మూడూ గెలిచి 6 పాయింట్లతో ఇప్పటికే ‘సూపర్‌–8’కు చేరింది. రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్‌ 4 పాయింట్లతో అఫ్గానిస్తాన్‌ కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈరోజు కెనడాతో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే అఫ్గానిస్తాన్‌ టోర్నీ నుంచి ని్రష్కమిస్తుంది. న్యూజిలాండ్‌ ‘సూపర్‌–8’కు చేరుతుంది.

Australia tumbled to a crushing eight-wicket defeat against Sri Lanka 10
‘శత’క్కొట్టిన నిసాంక 

పల్లెకెలె: పాథుమ్‌ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్‌లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్‌ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్‌’ విజయాలతో లంక జట్టు ‘సూపర్‌–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్‌ ‘సూపర్‌–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్‌ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దాసున్‌ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్‌ మిచెల్‌ మార్‌‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్‌ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్‌ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్‌గ్లిస్‌ (27; 3 ఫోర్లు), మ్యాక్స్‌వెల్‌ (22; 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మ్యాక్స్‌వెల్‌ రివర్స్‌ స్వీప్‌తో బౌండరీకి యత్నించగా... బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్‌తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్‌కు కుశాల్‌ మెండిస్‌ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో 97 పరుగులు, తర్వాత పవన్‌ రత్నాయకే (28 నాటౌట్‌; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 20న ఒమన్‌ జట్టుతో ఆడుతుంది. ఆసీస్‌ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్‌లు (నేడు ఐర్లాండ్‌తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్‌–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్‌రేట్‌లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్‌–8’ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement