ప్రధాన వార్తలు
T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలో ఆడటం ప్రతీ క్రికెటర్ చిరకాల స్వప్నం. ఒక్కసారి వరల్డ్కప్ టోర్నీలో ఆడినా తమ కెరీర్ పరిపూర్ణమైందని భావించే ఆటగాళ్లు ఎందరో ఉంటారు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం మొండిపట్టు కారణంగా ఆ దేశ క్రికెటర్లు ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి దూరమయ్యారు.ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నక్వీ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మాజీ అధికారి సయ్యద్ అష్రాఫుల్ హక్ ఆరోపించారు. కాగా బంగ్లాదేశ్ గత కొంతకాలంగా భారత్తో కయ్యానికి కాలుదువుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగగా.. ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్ను తొలగించారు.ఈ నేపథ్యంలో భారత్లో తమకు భద్రత లేదని.. వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు అక్కడకు వెళ్లమని బంగ్లాదేశ్ బోర్డు ఐసీసీకి తెలిపింది. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్లు నిర్వహించాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లకు ముప్పులేదని హామీ ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఈ క్రమంలో బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని చెప్పిన పీసీబీ.. ఐసీసీ జోక్యంతో యూటర్న్ తీసుకుంది. వరల్డ్కప్లో దాయాదితో ఆడి.. మరోసారి ఓడిపోయింది. ఈ పరిణామాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మాజీ సీఈవో, బీసీబీ మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ స్పందించారు. రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతున్న క్రమంలో ‘బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక పాకిస్తాన్ ఉందా?’ అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇందుకు అవకాశం ఉంది. అయితే, నేను ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదు. ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా నేను ఎల్లప్పుడు ఆట పట్ల నిబద్ధత కలిగి ఉంటాను. అయితే, మా చీఫ్ అమినుల్ ఇస్లాంకు అనుభవం, ఆలోచన లేకుండా పోయాయి.అందుకే ఏసీసీ ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ మాటలు ఆయనపై ప్రభావం చూపాయి. నక్వీ రెచ్చగొట్టగానే ఇస్లాం అందుకు తగినట్లు స్పందించారు. ఆఖరికి ఎవరు గెలిచారు?ఏదేమైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తొందరపడ్డారు. ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి తొలగించినంత మాత్రాన ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకునేంత పెద్ద నిర్ణయం తీసుకోకూడదు.బీసీసీఐతో ఆయన మాట్లాడాల్సింది. లేదంటే భారత ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించాల్సింది. ఐసీసీ నిర్వహించే టోర్నీకి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఒకవేళ మనం కోరితే వారు అదనపు భద్రతా ఏర్పాట్లు చేసే అవకాశం కూడా ఉంటుంది.ఈ విషయాలను అర్థం చేసుకోవడంతో నజ్రుల్ విఫలమయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియకుండా పోయింది. ఎవరో (నక్వీ) పన్నిన వ్యూహంలో ఆయన చిక్కుకున్నారు. జాతికి గొప్ప ఆస్తులైన క్రికెటర్లను కాపాడాల్సింది పోయి.. ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో ఉండిపోయారు.లిటన్ దాస్, ముస్తాఫిజుర్, నజ్ముల్ షాంటో మూడు పదుల వయసు దాటేశారు. సీనియర్లు ఇలా వరల్డ్కప్ ఆడే అవకాశం పోగొట్టుకోవడం అన్యాయం. భారత్ తర్వాత బంగ్లాదేశ్లోనే క్రికెట్కు ఆదరణ ఎక్కువ. వరల్డ్కప్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయంతో అభిమానులను కూడా మోసం చేశారు’’ అని అష్రాఫుల్ పేర్కొన్నారు. నక్వీ రెచ్చగొట్టడం వల్లే నజ్రుల్ అలా వ్యవహరించారని.. ఫలితంగా తమ ఆటగాళ్లు, అభిమానులు నష్టపోయారని విమర్శించారు.
Asia Cup 2026: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.ఎనిమిది జట్లుగ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ.. యూఏఈ, నేపాల్ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ-ఎ, శ్రీలంక-ఎ, థాయ్లాండ్, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ టాపర్లు భారత్, పాక్.. గ్రూప్-బి టాపర్లు బంగ్లాదేశ్, శ్రీలంక సెమీ ఫైనల్ చేరాయి.118 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.రాధా యాదవ్కు నాలుగుఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు.బ్యాటింగ్లోనూ ఇరగదీసిన కెప్టెన్ ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది.𝐅𝐢𝐧𝐚𝐥𝐬, 𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐜𝐨𝐦𝐞 🇮🇳Radha Yadav seals it with a boundary as India book their place in the final 😍#SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/vuMvuCPhUH— Sony Sports Network (@SonySportsNetwk) February 20, 2026ఫైనల్లో భారత్మిగిలిన వాళ్లలో తేజల్ హసాబ్నిస్ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్ను భారత్ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!
T20 WC 2026: ఆసీస్కు మరో ఘోర అవమానం!
వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో తిరుగులేని జట్టుగా ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియాకు.. టీ20 ఫార్మాట్లో మాత్రం అవమానాలే మిగులుతున్నాయి. పొట్టి క్రికెట్ వరల్డ్కప్లో ఒకే ఒక్కసారి (2021) విజేతగా నిలిచిన కంగారూలు.. తాజా ఎడిషన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు.టీ20 వరల్డ్కప్-2026లో గ్రూప్-బిలో భాగంగా తొలుత ఐర్లాండ్పై గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. శ్రీలంక చేతిలోనూ ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్లో ఒమన్ (AUS vs OMA)తో శుక్రవారం ఆసీస్ తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, ఈ మ్యాచ్కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి సమయంలో వారిని చిత్తు చేసే సువర్ణావకాశం తమకు ఉందని పేర్కొన్నాడు.ఆసీస్ను మేమూ చిత్తుగా ఓడిస్తాం‘‘ఈ మ్యాచ్లో మేము గెలిచేందుకు వంద శాతం అవకాశం ఉంది. టీ20 మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరైన సమయంలో సరైన విధంగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆసీస్ను చిత్తు చేయడం సులభం. మా జట్టు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో తమదైన ముద్ర వేయాలని మా వాళ్లు ఆతురతగా ఎదురుచూస్తున్నారు’’ అని జతిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.ఘోర అవమానంకాగా ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా ఓడిస్తామంటూ సవాలు విసరడం గమనార్హం. దీంతో ఆసీస్ ఫ్యాన్స్.. ‘‘ఇది ఘోర అవమానం.. ఇకనైనా సరిగ్గా ఆడండి’’ అంటూ మార్ష్ బృందానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రూప్-బిలో జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఓడిపోయింది. ఇక 2024 వరల్డ్కప్ ఎడిషన్లో ఆసీస్ చేతిలోనూ చిత్తైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ సానుకూల దృక్పథంతో ఉండటం విశేషం.ఒమన్ జట్టుఅమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (కెప్టెన్), ఆశిష్ ఒడెదర, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), మహ్మద్ నదీమ్, జితేన్ రామనంది, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, షా ఫైసల్, షఫీక్ జాన్, కరణ్ సోనావాలే, జే ఒడెడ్రా, వసీం అలీఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మాట్ రెన్షా, మాథ్యూ కుహ్నెమాన్, స్టీవెన్ స్మిత్.చదవండి: T20 WC 2026: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!
పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్!
పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ది హండ్రెడ్ లీగ్’-2026 వేలంలో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం ఉండబోతున్నట్లు సమాచారం. కాగా ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.ఐపీఎల్.. లీగ్స్ కా బాప్!అయితే, అన్నింటిలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అత్యంత ఆదరణ పొందిన లీగ్గా వెలుగొందుతోంది. క్యాష్ రిచ్ లీగ్లో ఒక్కసారి ఆడితే ఆటగాళ్ల రాతే మారిపోతుందనేంతలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఐపీఎల్లో పది జట్లు ఉండగా.. ఇందులోని మెజారిటీ ఫ్రాంఛైజీలు విదేశీ లీగ్లలోనూ పెట్టుబడులు పెడుతున్నాయి.సౌతాఫ్రికా లీగ్ ‘మనోళ్ల’దే ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఉన్న ఆరు రాంఛైజీలూ ఐపీఎల్ జట్ల యజమానుల చేతిలోనే ఉన్నాయి. సన్రైజర్స్ ఈస్టర్న్కేప్, ఎంఐ కేప్టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ కింగ్స్, పర్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్.. ఐపీఎల్లోని హైదరాబాద్, ముంబై, లక్నో, చెన్నై, రాజస్తాన్, ఢిల్లీ ఫ్రాంఛైజీల యాజమాన్యంలో కొనసాగుతున్నాయి.ది హండ్రెడ్లోనూ అడుగుఇక ఇటీవల ‘ది హండ్రెడ్ లీగ్’లోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీల యజమానులు అడుగుపెట్టారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, ఎంఐ లండన్, సదరన్ బ్రేవ్, సన్రైజర్స్ లీడ్స్ వీరి చేతుల్లోనే ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ తాజా ఎడిషన్కు సంబంధించి మార్చి 11న మహిళలు, మార్చి 12న పురుష ప్లేయర్ల వేలం లండన్లో జరుగనుంది.వెయ్యి మంది పేర్లు రిజిస్టర్ఇందుకోసం పద్దెనిమిది దేశాల నుంచి దాదాపుగా వెయ్యి మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో పాకిస్తానీ క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే, మాంచెస్టర్, లండన్, సదరన్ బ్రేవ్, సన్రైజర్స్ యాజమాన్యాలు పాక్ క్రికెటర్లను ఎంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.పీసీబీ ఓవరాక్షన్టీ20 ప్రపంచకప్-2026 నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. తమకోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసినా.. బంగ్లాదేశ్ కోసమంటూ భారత్ను నిందించింది.బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీ నుంచి బహిష్కరిస్తామని తొలుత ప్రగల్భాలు పలికింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్ మాత్రమే బాయ్కాట్ చేస్తామని ప్రకటించింది. అయితే, అందరూ ఊహించినట్లుగానే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే భయంతో యూటర్న్ తీసుకుని భారత్తో ఆడింది. టీమిండియా చేతిలో మరోసారి చిత్తుగా ఓడింది.ఐపీఎల్లో నిషేధంఇక ఇప్పటికే పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ క్రికెటర్లపై ఐపీఎల్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పీసీబీ మరింత ఓవరాక్షన్ చేసిన నేపథ్యంలో సౌతాఫ్రికా టీ20 లీగ్లో మాదిరిగానే.. ది హండ్రెడ్లోనూ భారత్కు చెందిన ఫ్రాంఛైజీలు పాక్ క్రికెటర్లను సెలక్ట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈసీబీ స్పందన ఇదేఈ విషయం గురించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) అధికారి ఒకరు బీబీసీకి అనధికారిక సమాచారం ఇచ్చారు. అయితే, ఈసీబీ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గుడ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘రిజిస్టర్ చేసుకున్న ప్రతీ దేశం నుంచి ఆటగాళ్ల కొనుగోలు జరుగుతుంది.ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకుంటాయి. ఇంగ్లండ్ క్రికెట్లో వివక్షకు తావులేదు. ఒకవేళ ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘిస్తే బోర్డు తగిన చర్యలు తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాడు.కాగా మెన్స్ హండ్రెడ్ లీగ్లో మొహమ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. అయితే, వుమెన్ హండ్రెడ్ లీగ్లో ఒక్క పాక్ ప్లేయర్ కూడా ఇంత వరకు ఆడిన దాఖలాలు లేవు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్తో పాటు ILT20లోనూ పాక్ ప్లేయర్లపై అనధికారిక నిషేధం కొనసాగుతోంది. ఈ లీగ్లో భాగమైన అమెరికాకు చెందిన డిజర్ట్ వైపర్స్ మాత్రమే పాకిస్తాన్ను కొంతమంది ఆటగాళ్లను ఎంచుకుంది. ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్ లీగ్లో వంద బంతుల ఆట ఉంటుంది. ఇందులో ఎనిమిది జట్లు భాగంగా ఉన్నాయి.చదవండి: T20 WC 2026: అఫ్గాన్ అద్భుత విజయం.. ట్రాట్కు ఘన వీడ్కోలు
సూపర్-8లో తొలి మ్యాచ్ గెలుస్తాం: సికందర్ రజా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పసికూన జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. గ్రూప్-బిలో తొలుత ఒమన్ను మట్టికరిపించిన రజా బృందం.. ఆ తర్వాత మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని రీతిలో షాకిచ్చింది.గెలుపు గాలివాటం కాదుతదుపరి ఐర్లాండ్తో మ్యాచ్ రద్దు కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్-8కు అర్హత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాను ఎలిమినేట్ చేసిన జింబాబ్వే.. లీగ్ దశలో ఆఖరిగా పటిష్ట శ్రీలంకతో తలపడింది. అనూహ్య రీతిలో కొలంబో వేదికగా గురువారం శ్రీలంకను సైతం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రజా బృందం.. తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది.ఇక్కడితో ఆగిపోముసగర్వంగా గ్రూప్-బి టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జింబాబ్వే కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సికందర్ రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్లో ప్రదర్శనను విశ్లేషించుకుంటూ ముందుకు పోతున్నాం.మున్ముందు ఏదైనా సాధ్యమేఅన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్లో ఉత్సాహం పెరిగింది. లీగ్ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా!..మా తొలి మ్యాచ్లో గెలవవచ్చు కూడా!సూపర్-8లో మేము మా తొలి మ్యాచ్లో గెలవవచ్చు కూడా!.. మా అభిమానుల గుండెల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాము. గ్రూప్ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉంది. ముందుగా చెప్పినట్లు అండర్డాగ్ స్టోరీస్ అందరికీ ఆకర్షిస్తాయి. 23 నాటి మ్యాచ్ మాకు షో టైమ్’’ అని సికందర్ రజా ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా సూపర్-8లో భాగంగా జింబాబ్వే ఫిబ్రవరి 23న వెస్టిండీస్ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 26న భారత్, మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడుతుంది. జింబాబ్వేతో పాటు ఈ ప్రత్యర్థి జట్లన్నీ లీగ్ దశను అజేయంగా ముగించడం విశేషం. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో జర జాగ్రత్తPure dominance by Zimbabwe. 🇿🇼They keep their unbeaten tag alive as they brush aside Sri Lanka. 👏Next stop: The Super 8s! 🙌ICC Men’s #T20WorldCup | #AFGvCAN | LIVE NOW ➡️ https://t.co/0BcVdzugXC pic.twitter.com/pJSD74tlFs— Star Sports (@StarSportsIndia) February 19, 2026
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... నేడు శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ సెమీఫైనల్ పోరు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం రెండు సెమీఫైనల్స్ ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ జట్టు... రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. రెండో సెమీఫైనల్ను మధ్యాహ్నం గం. 12:30 నుంచి నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్3, సోనీ స్పోర్ట్స్ టెన్4 చానెల్స్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టోర్నీలో రాధా యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో యూఏఈ ‘ఎ’ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ పరాజయం నుంచి వెంటనే తేరుకున్న భారత ‘ఎ’ జట్టు తర్వాతి రెండు లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్, నేపాల్ జట్లను ఓడించింది. భారత్, పాక్, యూఏఈ జట్లు నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్తో భారత్, పాక్ సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాయి.
11 ఏళ్ల తర్వాత...
లక్నో: పరుగుల వరద పారిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఉత్తరాఖండ్ జట్టుపై 503 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కారణంగా కర్ణాటక జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. 11 ఏళ్ల తర్వాత కర్ణాటక జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ చేరడం విశేషం. ఈనెల 24 నుంచి హుబ్లీలో జరిగే ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టుతో కర్ణాటక తలపడుతుంది. జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి ఫైనల్ ఆడనుండగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు టైటిల్ సాధించి, నాలుగుసార్లు రన్నరప్గా నిలిచింది. ఉత్తరాఖండ్తో చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 299/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక జట్టు 74.3 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయంగా నిలిచాడు. అనంతరం 827 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు 62 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన కర్ణాటక జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 736 పరుగులు చేయగా... ఉత్తరాఖండ్ 233 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఛేజింగ్లో తడబాటు...
కాన్బెర్రా: తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి రెండో మ్యాచ్లో ఆ్రస్టేలియా మహిళల జట్టు తేరుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి రెండో టి20లో విజయాన్ని అందుకుంది. ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత మహిళల జట్టు చివరకు 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన సోఫీ మోలినెక్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు సాధించింది. సిరీస్లోని చివరిదైన మూడో టి20 అడిలైడ్లో శనివారం జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఆసీస్ జట్టుకు ఓపెనర్లు జార్జియా వోల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) తొలి వికెట్కు 128 పరుగులు జోడించి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. 15వ ఓవర్లో బెత్ మూనీని హైదరాబాద్ బౌలర్ అరుంధతి అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్ను కట్టడి చేశారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్ 35 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెండు వికెట్లు, రేణుక ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన (24 బంతుల్లో 31; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (23 బంతుల్లో 29; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 57 పరుగులు జత చేశారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో షఫాలీ, జెమీమా, స్మృతి అవుటవ్వడంతో భారత్ ఛేజింగ్లో వెనుకబడింది. హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 36; 5 ఫోర్లు) దూకుడు కనబరిచినా 17వ ఓవర్లో ఆమె అవుటవ్వడంతో భారత్ విజయంపై ఆశలు వదులుకుంది. ఆసీస్ బౌలర్లలో యాష్లీ గార్డ్నర్ (3/22), కిమ్ గార్త్ (2/16), అనాబెల్ సదర్లాండ్ (2/18), సోఫీ మోలినెక్స్ (2/37) రాణించారు.356 అంతర్జాతీయ మహిళల క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గుర్తింపు పొందింది. హర్మన్ ఇప్పటివరకు 189 టి20లు, 161 వన్డేలు, 6 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (355 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్ బద్దలు కొట్టింది.
ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్
చెన్నై: 2024 టి20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు చేరినా... ఈ సారి లీగ్ దశకే పరిమితమైన అఫ్గానిస్తాన్ భారీ గెలుపుతో టోర్నీని ముగించింది. గ్రూప్ ‘డి’లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ల చేతిలో పరాజయంతో ‘సూపర్ ఎయిట్స్’ అవకాశాలు కోల్పోయిన అఫ్గానిస్తాన్ ... కెనడాతో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 82 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు)... సాదిఖుల్లా (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), గుర్బాజ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) మెరిపించారు. కెనడా బౌలర్లలో జస్కరణ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. హర్ష్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), సాద్ బిన్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. నబీ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్లూ ఓడిన రెండో జట్టుగా (నమీబియాతో పాటు) కెనడా నిలిచింది. అంతర్జాతీయ టి20ల్లో కెనడా తరఫున అత్యధిక పరుగులు (1305) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన నవనీత్ ధలివాల్ ఈ మ్యాచ్తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు గత నాలుగేళ్లుగా అఫ్గానిస్తాన్ను బలమైన జట్టుగా తీర్చిదిద్ది టీమ్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ కూడా ఈ మ్యాచ్ తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటున్నాడు. టి20 ప్రపంచకప్లో నేడుఆస్ట్రేలియా X ఒమన్వేదిక: పల్లెకెలె; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించారు.
11 ఏళ్ల తర్వాత...
లక్నో: పరుగుల వరద పారిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల...
ఛేజింగ్లో తడబాటు...
కాన్బెర్రా: తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి రెండో మ...
ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్
చెన్నై: 2024 టి20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు చేరి...
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను సంచలన రీ...
క్రీడలు
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
వీడియోలు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
