Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Orange cap shared between kohli, rahul, vaibhav, abhishek in a single day1
పొద్దున్నే విరాట్‌.. రాత్రికి అభిషేక్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్‌ క్యాప్‌ను రాహుల్‌ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్‌ క్యాప్‌ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్‌ మరో ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం​ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Not Highest Successful Chase, Punjab Kings Smash Another World Record In IPL2
పంజాబ్‌ కింగ్స్‌ మరో చరిత్ర

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్‌ పొట్టి క్రికెట్‌లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్‌ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ.. కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించింది.

Rajasthan Royals Issue Official Update On Vaibhav Sooryavanshi's Injury3
వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక​ అప్‌డేట్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్‌ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన వైభవ్‌ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.వైభవ్‌ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్‌ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెక్‌ పెట్టాడు. వైభవ్‌ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్‌ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.రాథోడ్‌ మాటల్లో.. "వైభవ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.రాథోడ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌ రాయల్స్‌ తదుపరి మ్యాచ్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 28న పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌ సమయానికి వైభవ్‌ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఒకవేళ వైభవ్‌ ఆ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్‌కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వైభవ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్‌లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ పరాజయంపాలైంది.

IPL 2026: PBKS Captain Shreyas Iyer Comments After win against DC4
వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ సారధి శ్రేయస్‌ అయ్యర్‌ సంతోషం వ్యక్తం​ చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్‌ మాటల్లో..నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్‌ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్‌ రాహుల్‌ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాంశ్‌ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో పంజాబ్‌ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్‌ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్‌ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్‌లో ఇదే శ్రేయస్‌ నేతృత్వంలో పంజాబ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

Axar Patel Holds These Players Responsible For Worst Ever IPL Record5
పంజాబ్‌ చేతిలో ఓటమిని సహచరులపైకి నెట్టిన అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిని ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ తన ఫీల్డర్ల ఖాతాలోకి వేశాడు.మ్యాచ్‌ అనంతరం ఓటమిపై స్పందిస్తూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు."మేము మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై బౌలర్లకు ఫీల్డర్లు సహకరించకపోతే, ఓడిపోవడమే సరైన ఫలితం" అంటూ కఠినంగా వ్యాఖ్యానించాడు.ముఖ్యంగా ఫీల్డింగ్ వైఫల్యమే మ్యాచ్‌ను చేజార్చిందని స్పష్టం చేశాడు. కరుణ్‌ నాయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన రెండు కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టుకు భారీ మూల్యం చెల్లింపజేసిందని అన్నాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అయ్యర్ 36 బంతుల్లో అజేయమైన 71 పరుగులు చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడని తెలిపాడు.అక్షర్ తన బౌలర్లపైనా అసహనం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి పరుగుల వేగాన్ని నియంత్రించడంలో బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నాడు. ఢిల్లీ బౌలర్లందరూ ఓవరుకు 11కి పైగా పరుగులు సమర్పించడం జట్టు పరిస్థితిని మరింత దయనీయంగా మార్చిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు.కుల్దీప్‌ రెండు వికెట్లు తీసినా 46 పరుగులు ఇచ్చాడు. తాను, నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకిబ్‌ నబీ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నామని అన్నాడు. ఈ వికెట్‌పై 264 పరుగుల స్కోర్‌ చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. లక్‌ మా పక్షాన ఉండి, క్యాచ్‌లు పట్టుంటే ఈజీగా గెలిచేవాళ్లమని తెలిపాడు. ఈ సీజన్‌లో మేం ఓడిన మ్యాచ్‌లు చూస్తే చాలా వరకు క్లోజ్‌ మ్యాచ్‌లు. వాటిలో కొన్ని అవకాశాలను ఓడిసి పట్టుకుని ఉంటే, రెండు-మూడు అదనపు విజయాలు మా ఖాతాలో ఉండేవని అని అభిప్రాయపడ్డాడు. తప్పులు పదేపదే రిపీట్‌ చేస్తుంటే, అవకాశాలు మళ్లీమళ్లీ రావని అసహనం వ్యక్తం చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది.

IPL 2026: SRH Captain Cummins comments after win against RR6
ఇలాంటి స్కోర్లను మా బ్యాటర్లు ఊదేస్తారు.. కమిన్స్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. అభిషేక్‌ శర్మ (57), ఇషాన్‌ కిషన్‌ (74), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (36) మెరుపు విన్యాసాల కారణంగా ఎస్‌ఆర్‌హెచ్‌ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఊదేసింది.ఈ గెలుపుపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఇలా స్పందించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ (ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్‌) ఎలా సాగుతుందో ఎప్పుడూ కొంత అనిశ్చితి ఉంటుంది. కానీ మా సన్నాహాలు అద్భుతంగా జరిగాయి. అనుభవంతో ఆటను త్వరగా అర్థం చేసుకోగలుగుతున్నాను.ప్రస్తుతం టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారిపోయింది. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్‌లు బౌలర్లకు పెద్ద సవాలే. కానీ రెండు ఖరీదైనా ఓవర్లు వేసినా, మళ్లీ తిరిగి వచ్చి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే టీ20 అందం.యువ బౌలర్ల ప్రదర్శనపై కమిన్స్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. ప్రఫుల్‌ హింగే ప్రస్తావన తీసుకొచ్చాడు. వీరిని ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ లాంటి సీనియర్లు ఉండనే ఉన్నారని అన్నాడు. డగౌట్‌ బౌలర్లతో కలకలలాడుతుందని తెలిపాడు. యువ బౌలర్లు స్పష్టమైన ప్రణాళికలతో రాణిస్తున్నారని కొనియాడాడు.మధ్య విరామ సమయంలో జట్టు చాలా ప్రశాంతంగా ఉందని వెల్లడించాడు. ప్రత్యర్థి స్కోరు 250 దాటే అవకాశముండగా, 220 వద్ద నిలిపేయడం కీలకమైందని చెప్పాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌పై పట్టుసాధించాలని భావించామని తెలిపాడు. ప్రస్తుతమున్న ఫామ్‌లో మా బ్యాటర్లు ఇలాంటి లక్ష్యాలను సులభంగా ఊదేయగలరని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, కమిన్స్‌ వ్యాఖ్యల్లో తన బృందంపై నమ్మకం, ధీమా కొట్టొచ్చినట్లు కనిపించింది. తన గైర్హాజరీలో ఇషాన్‌ జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడని అభిప్రాయపడ్డాడు. అలాగే బౌలర్లు, ముఖ్యంగా యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బ్యాటర్ల మెరుపు విన్యాసాలపై ధీమా కనిపించింది. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు.

IPL 2026: RR Captain Riyan Parag Comments after losing to SRH7
అదే మా కొంపముంచింది.. సన్‌రైజర్స్‌ చేతిలో ఓటమి అనంతరం రియాన్‌ పరాగ్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. వైభవ్‌ సూర్యవంశీ (103) శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా, సన్‌రైజర్స్‌ ఇషాన్‌ కిషన్‌ (74), అభిషేక్‌ శర్మ (57) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ రాయల్స్‌ను వెనక్కు నెట్టి (నాలుగో స్థానానికి) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఇలా స్పందించాడు.భారీ స్కోరు చేసినప్పటికీ, క్యాచ్‌లు వదిలేయడం జట్టుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నైపుణ్య పరంగా చూస్తే మేం బాగా ఆడాం. కానీ కీలక సమయంలో చాలా క్యాచ్‌లు వదిలేశాం. అభిషేక్‌ శర్మ లాంటి నాణ్యమైన ఆటగాళ్లకు రెండో అవకాశం ఇస్తే, అతను దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాడు. అదే జరిగింది.228 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ఇంకా 10 నుంచి 15 పరుగులు వెనుకపడ్డాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో పరుగులను నియంత్రించారు.బౌలింగ్ మార్పులపై వివరణ ఇస్తూ.. ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉండటంతో తాను, మరో స్పిన్నర్ కలిసి వికెట్ కోసం ప్రయత్నించాం. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోవడంతో మా ప్రణాళిక ఫలించలేదు.ఆర్చర్‌ ప్రదర్శన చాలా అద్భుతం. ఈ సీజన్ అంతా అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా క్లాసిక్ స్పెల్ వేశాడు. కొన్ని టాప్ ఎడ్జ్‌లు ఫీల్డర్ల మధ్య పడటం అతని దురదృష్టం.తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కొననుండటంపై స్పందిస్తూ.. ప్రతి వేదిక కొత్త సవాల్. చండీగఢ్ పిచ్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకుంటాము.ఒక రోజు విరామం ఉంది. మానసికంగా ఫ్రెష్ అయి, తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఫీల్డింగ్‌ వైఫల్యాలను అధిగమిస్తే రాజస్థాన్ రాయల్స్ మరింత ప్రమాదకర జట్టుగా మారడం ఖాయమని రియాన్‌ అభిప్రాయపడ్డాడు.కాగా, ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓటమికి ఫీల్డింగ్‌ వైఫల్యాలు, క్యాచ్‌లు జారవిడచడమే ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్‌లో లోపాలు సైతం గమినించదగ్గవే. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఇంకా భారీ స్కోర్‌ చేసుండాల్సింది. సూర్యవంశీ క్రీజ్‌లో ఉన్నంత సేపు సునాయాసంగా 250 ప్లస్‌ వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔటైన వెంటనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఫెరియెరా మెరుపులు మినహా మధ్య వరుస బ్యాటర్లెవ్వరూ రాణించలేదు. అలాగే ఈ మ్యాచ్‌లో రియాన్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక ఏకంగా 8 మంది బౌలర్లను ప్రయోగించాడు. స్ట్రయిట్‌ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాతో తలో ఓవర్‌ మాత్రమే వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. మొత్తంగా ఈ ఓటమితో రాయల్స్‌ చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

Deepti Sharma Maiden T20I five Wicket Hual India Beat South Africa8
తొలిసారి 5 వికెట్లు.. భార‌త్‌ను గెలిపించిన దీప్తి శ‌ర్మ‌

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజ‌యాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ‌నివారం జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల‌తో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా వుమెన్ 14 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. దీప్తిశ‌ర్మ ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. రోడ్రిగ్స్ (43), దీప్తిశ‌ర్మ (36 నాటౌట్‌), రిచా ఘోష్ (34 నాటౌట్‌) రాణించారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మారి మార్స్, యాలా రెనెకి చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం 186 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌ఫారీలు 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగుల‌కు ప‌రిమితమ‌యింది. ఓపెన‌ర్ సునె లుస్ (40) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, తంజిమ్ బ్రిట్జ్ 30 ప‌రుగులు చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 5 వికెట్లు తీయ‌గా, క్రాంతి, చ‌ర‌ణి, క‌శ్వీ గౌత‌మ్‌, షెఫాలీ త‌లా ఒక వికెట్ తీశారు. సిరీస్‌లో భాగంగా చివ‌రి టీ20 సోమ‌వారం జ‌ర‌గ‌నుంది. ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన దీప్తి శ‌ర్మ‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా దీప్తి శర్మ టీ20ల్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.4⃣ Overs1⃣9⃣ Runs5⃣ fantastic wickets 👏Deepti Sharma picks up her 𝗠𝗔𝗜𝗗𝗘𝗡 𝗙𝗜𝗩𝗘-𝗪𝗜𝗖𝗞𝗘𝗧 𝗛𝗔𝗨𝗟 in T20Is 🫡Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#TeamIndia | #SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/Kj1CzmR8M7— BCCI Women (@BCCIWomen) April 25, 2026𝗦𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘁𝗮𝗹𝗹 𝗮𝗻𝗱 𝘀𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗯𝗿𝗶𝗴𝗵𝘁 ✨Deepti Sharma is adjudged the Player of the Match for her fabulous all-round performance as #TeamIndia clinch victory 🔝👌Scorecard ▶️ https://t.co/92BPfF0bsf#SAvIND | @Deepti_Sharma06 pic.twitter.com/sYwLVZ2cUm— BCCI Women (@BCCIWomen) April 25, 2026

Punjab Kings registered the highest-ever run chase in IPL history9
ప్రపంచ రికార్డుపై ‘పంజా’బ్‌

ఆహా ఏమా మ్యాచ్‌... ఏమా కొట్టుడు! ఒకరిని మించి ఒకరు వంతులు వేసుకున్నట్లు... ప్రత్యర్థి బౌలర్లపై ఏదో పగ పట్టినట్లు... బంతిమీద ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లు... ఫోర్లు, సిక్స్‌లు ఒకటే మోత! మొదట కేఎల్‌ రాహుల్, నితీశ్‌ రాణా దంచి కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ చరిత్రలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసుకుంటే... పంజాబ్‌ కింగ్స్‌ మరో 7 బంతులు మిగిలుండగానే దాన్నిఊదేసింది.ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ప్లేయర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డు సృష్టిస్తే... మేమేం తక్కువా అన్నట్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శ్రేయస్‌ అయ్యర్‌ విశ్వరూపం చూపారు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్‌ తమ పేరిటే ఉన్న రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. రెండు జట్లు కలిపి 49 ఫోర్లు, 33 సిక్స్‌లు బాదిన ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదు కాగా... శనివారం అభిమానులు పైసా వసూల్‌ పరుగుల పండగను వీక్షించారు.న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ ఖాతాలో ఆరో విజయం చేరింది. శనివారం జరిగిన పోరులో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేఎల్‌ రాహుల్‌ (67 బంతుల్లో 152 నాటౌట్‌; 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో కదం తొక్కగా... నితీశ్‌ రాణా (44 బంతుల్లో 91; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు.వీరిద్దరు రెండో వికెట్‌కు 220 పరుగులు జోడించడంతో... ఢిల్లీ కొండంత స్కోరు చేయగలిగింది. ఐపీఎల్‌ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో మూడో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రాహుల్‌ నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 265 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26 బంతుల్లో 76; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (36 బంతుల్లో 71 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో విజృంభించగా... ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. రాహుల్‌ రాక్స్‌... ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఆరంభం నుంచే... దూకుడుగా ఆడింది. మూడో ఓవర్‌లో నిసాంక (11) వెనుదిరగగా... అక్కడి నుంచి రాహుల్, రాణా మోత మొదలైంది. ఈ జంట వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 68/1తో నిలిచింది. ఈ క్రమంలో రాహుల్‌ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... బార్ట్‌లెట్‌ వేసిన 12వ ఓవర్‌లో రాణా వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అర్‌‡్షదీప్‌ ఓవర్‌లో 4, 6, 4, 4 కొట్టిన రాహుల్‌ యాన్సెన్‌ ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వైశాక్‌ వేసిన 16వ ఓవర్‌లో రాహుల్‌ 6, 6, 6, 4తో విజృంభించాడు. సెంచరీకి సమీపించిన నితీశ్‌ రాణా భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా... రాహుల్‌ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 6 ఓవర్లలో 116 పరుగులు కొండంత లక్ష్యం ముందున్నా పంజాబ్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ , ప్రభ్‌సిమ్రన్‌ పోటీపడి బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. అక్షర్‌ వేసిన మూడో ఓవర్‌లో రెండు సిక్స్‌లు ఒక ఫోర్‌తో ఆర్య 20 పరుగులు రాబట్టుకోగా... అఖీబ్‌ ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 3 సిక్స్‌లు బాదాడు. ఐదో ఓవర్‌లో నటరాజన్‌ 9 పరుగులే ఇవ్వగా... ముకేశ్‌ వేసిన ఆరో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ 6 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి పంజాబ్‌ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో అవుటైనా... శ్రేయస్‌ మిగిలిన పని పూర్తిచేశాడు. శ్రేయస్‌ క్యాచ్‌ మిస్‌ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఫీల్డింగ్‌ పేలవంగా సాగింది. విప్రాజ్‌ నిగమ్‌ వేసిన 15వ ఓవర్‌ చివరి బంతికి శ్రేయస్‌ ఇచ్చిన క్యాచ్‌ను కరుణ్‌ నాయర్‌ వదిలేశాడు. అదే ఓవర్‌లో నేహల్‌ వధేరా (25; 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్యాచ్‌ను ఒడిసి పట్టిన కరుణ్‌... శ్రేయస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటికి పంజాబ్‌ విజయానికి 31 బంతుల్లో 63 పరుగులు అవసరం కాగా... శ్రేయస్‌ 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్‌ చేస్తున్నాడు. తదుపరి ఓవర్‌ రెండో బంతికి సైతం శ్రేయస్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను మరోసారి కరుణ్‌ నాయర్‌ జారవిడిచాడు. దీన్ని సది్వనియోగ పరుచుకున్న అయ్యర్‌... అదే ఓవర్‌లో 6, 4, 6, 6 కొట్టి సమీకరణాన్ని సులభతరం చేశాడు. నటరాజన్‌ ఓవర్‌లోనూ 6, 4 బాదిన శ్రేయస్‌ 26 బంతుల్లో పిఫ్టీ మార్క్‌ దాటడంతో పాటు... శశాంక్‌ సింగ్‌ (19 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.152 ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ చేసిన స్కోరు. ఐపీఎల్‌లో ఓ భారత బ్యాటర్‌ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అభిõÙక్‌ శర్మ (141) రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా క్రిస్‌ గేల్‌ (175; 2013లో), మెక్‌కల్లమ్‌ (158; 2008లో) తర్వాత లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌ రాహుల్‌.ఎన్‌గిడికి గాయం... పంజాబ్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ప్రియాన్ష్ ఆర్య కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఢిల్లీ ప్లేయర్‌ ఎన్‌గిడి గాయపడ్డాడు. మిడాఫ్‌ ప్రాంతంలో బంతిని క్యాచ్‌ పట్టే క్రమంలో ఎన్‌గిడి కిందపడ్డాడు. దీంతో తల బలంగా నేలకు తాకి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్య బృందం అతడిని పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో విప్రాజ్‌ నిగమ్‌ ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా మైదానంలోకి వచ్చాడు. కాగా మ్యాచ్‌ అనంతరం ఎన్‌గిడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది.⇒ 1 ఐపీఎల్‌లో ఇదే (265) అత్యధిక పరుగుల ఛేదన. 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పంజాబ్‌ కింగ్స్‌... ఇప్పుడు దానికంటే కాస్త ఎక్కువ స్కోరును ఛేదించింది.⇒ 220 రెండో వికెట్‌కు రాహుల్, నితీశ్‌ రాణా జోడించిన పరుగులు. ఐపీఎల్‌లో ఏ వికెట్‌కైనా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 2016లో విరాట్‌ కోహ్లి–ఏబీ డివిలియర్స్‌ జోడీంచిన 229 పరుగుల భాగస్వామ్యం ‘టాప్‌’లో ఉంది.⇒ 2 ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 5.2 ఓవర్లలో 100 పరుగుల మార్క్‌ అందుకుంది. ఐపీఎల్‌లో ఇది రెండో వేగవంతమైంది. 2024లో ఢిల్లీపైనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 ఓవర్లలోనే వంద పరుగులు చేసింది. ఓవరాల్‌గా పవర్‌ప్లే (6 ఓవర్లలో) పంజాబ్‌ 116 పరుగులు చేసి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ 125తో అగ్ర స్థానంలో ఉంది.స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 11; రాహుల్‌ (నాటౌట్‌) 152; నితీశ్‌ (సి) శ్రేయస్‌ (బి) బార్ట్‌లెట్‌ 91; మిల్లర్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–28, 2–248. బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–49–1; బార్ట్‌లెట్‌ 4–0–69–1; యాన్సెన్‌ 4–0–45–0; వైశాక్‌ 3–0–48–0; చాహల్‌ 4–0–42–0; స్టొయినిస్‌ 1–0–11–0. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) రిజ్వీ 43; ప్రభ్‌సిమ్రన్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 76; కూపర్‌ (బి) కుల్దీప్‌ 17; శ్రేయస్‌ (నాటౌట్‌) 71; నేహల్‌ (సి) (సబ్‌) కరుణ్‌ (బి) విప్రాజ్‌ 25; శశాంక్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 265. వికెట్ల పతనం: 1–126, 2–132, 3–145, 4–201. బౌలింగ్‌: అఖీబ్‌ 2–0–41–0; ముకేశ్‌ 3–0–55–0; అక్షర్‌ 4–0–44–1; నటరాజన్‌ 3.5–0–54–0; కుల్దీప్‌ 4–0–46–2; విప్రాజ్‌ నిగమ్‌ 2–0–24–1.

IPL 2026: Sunrisers Hyderabad Beat Rajasthan Royals By 5 Wickets10
ఎస్ఆర్‌హెచ్ ఘన విజ‌యం.. పలు రికార్డులు బద్దలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ విజ‌యం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్‌ జురేల్‌ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్‌, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్‌ కిషన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్‌ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. 2023 సీజ‌న్ నుంచి రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఎస్ఆర్‌హెచ్‌కు ఇది వ‌రుస‌గా ఆరో విజ‌యం కావ‌డం విశేషం. గ‌తంలో సీఎస్‌కే (2010 నుంచి 2013 మధ్య‌) రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఆరు వ‌రుస విజ‌యాలు సాధించింది. 2019 నుంచి 2022 మ‌ధ్య ఆర్సీబీ.. రాజ‌స్తాన్‌పై 5 వ‌రుస విజ‌యాలు అందుకుంది. 2018 నుంచి 2020 మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఐదు వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసింది.ఐపీఎల్‌లో 200 ప్ల‌స్ ప‌రుగుల ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా ఛేదించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండ‌గా, ముంబై ఇండియ‌న్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొన‌సాగుతోంది. రాజ‌స్తాన్‌, ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఛేదించిన జట్ల‌లో ఎస్ఆర్‌హెచ్ చోటు ద‌క్కించుకుంది. రాజ‌స్తాన్‌పై 229 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 ప‌రుగుల టార్గెట్‌), ఎస్ఆర్‌హెచ్ (పంజాబ్‌పై 246 ప‌రుగుల టార్గెట్‌) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (ల‌క్నోపై 228 ప‌రుగుల టార్గెట్‌) ఉంది.జైపూర్ వేదిక‌పై రాజ‌స్తాన్‌పై 228 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్‌హెచ్ త‌న రికార్డును తానే మెరుగుప‌రుచుకుంది. 2023లో ఇదే రాజ‌స్తాన్‌పై 215 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును స‌వ‌రించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement