ప్రధాన వార్తలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
గెలిపించిన గ్రీన్
ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ క్రిస్ గ్రీన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో సత్తా చాటాడు. ఈ లీగ్లో ఇస్లామాబాద్ యునైటెడ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న గ్రీన్.. లాహోర్ ఖలందర్స్తో ఇవాళ (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్లో పొదుపుగా (4-0-13-3) బౌలింగ్ చేయడంతో పాటు 3 కీలక వికెట్లు తీసి ప్రత్యర్దిని దారుణంగా దెబ్బకొట్టాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.గ్రీన్తో పాటు షాదాబ్ ఖాన్ (4-0-18-2), ఇమాద్ వసీం (4-0-13-2), రిచర్డ్ గ్లీసన్ (3-0-13-2), ఫహీమ్ అష్రఫ్ (2.3-0-21-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇస్లామాబాద్ లాహోర్ను 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ చేసింది. లాహోర్ ఇన్నింగ్స్లో 25 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (19), అబ్దుల్లా షఫీక్ (10), ఆసిఫ్ అలీ (15) రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇస్లామాబాద్ 10.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. డెవాన్ కాన్వే (59 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో ఇస్లామాబాద్ను గెలిపించాడు. అతనికి మొహమ్మద్ ఫైక్ (34 నాటౌట్) సహకరించాడు. ఇస్లామాబాద్ కోల్పోయిన ఏకైక వికెట్ (సమీర్ మిన్హాస్ (5)) లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి దక్కింది.ఎవరీ క్రిస్ గ్రీన్..?32 ఏళ్ల కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ ఫ్రాంచైజీ క్రికెట్లో సుపరిచితుడు. సౌతాఫ్రికాలో పుట్టి ఆస్ట్రేలియా తరఫున ఓ టీ20 ఆడిన గ్రీన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి క్రికెట్ లీగ్లో ఆడాడు. బిగ్బాష్ లీగ్లో ఇతనికి మంచి పేరు వచ్చింది. అయితే బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండటం అతని కెరీర్ను సజావుగా సాగనివ్వలేదు. ఈ గ్రీన్ ఐపీఎల్లోనూ ఓ మ్యాచ్ ఆడాడు. యాదృచ్చికంగా ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న కెమరూన్ గ్రీన్, ఈ క్రిస్ గ్రీన్ కేకేఆర్ ఫ్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించారు. క్రిస్ గ్రీన్ను కేకేఆర్ 2020 ఎడిషన్లో రూ. 20 లక్షలకు సొంతం చేసుకోగా.. కెమరూన్ గ్రీన్ను 2026 వేలంలో కేకేఆర్ ఏకంగా రూ. 25. 20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్గా కెమరూన్ గ్రీన్ రికార్డుల్లోకెక్కాడు. అయితే తనపై పెట్టిన పెట్టుబడికి గ్రీన్ న్యాయం చేయలేకపోతున్నాడు. బ్యాటింగ్లో దారుణంగా విఫలమవుతూ, అస్సలు బౌలింగే చేయడం లేదు.
డేవిడ్ మిల్లర్ కాదు.. ఢిల్లీ ఓటమికి అసలు కారణమిదే?
ఐపీఎల్-2026లో బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్లర్ సినిమాను తలపించిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.అద్భుతమైన ఇన్నింగ్స్తో హీరోగా మారుతాడు అనుకున్న డేవిడ్ మిల్లర్ ఒక్క తప్పిదంతో విలన్గా మారిపోయాడు. ప్రసిద్ద్ కృష్ణ చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని విప్రజ్ నిగమ్ బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతికి విప్రజ్ ఔటయ్యాడు.మూడో బంతికి కుల్దీప్ మిల్లర్కు సింగిల్ తీసి ఇచ్చాడు. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్గా మలిచాడు. దీంతో ఢిల్లీ విజయానికి ఆఖరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరయ్యాయి. అయితే ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నప్పటికి మిల్లర్ తిరస్కరించాడు. మిల్లర్ స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు. కానీ మిల్లర్ అనుకున్నది జరగలేదు. ఆఖరి బంతి ప్రసిద్ద్ బౌన్సర్గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. బై కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవిచూడాల్సింది. ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్నే కోల్పోవల్సింది. ఓటమి అనంతరం మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ఆటగాళ్లు మిల్లర్ను ఓదార్చారు.అయితే ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అసలేంటి ఆ రూల్? ఢిల్లీ ఓటమికి ఎలా కారణమైందో ఓసారి పరిశీలిద్దాం.ఏమి జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్లో నిస్సాంక ఔటయ్యక నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రెండో బంతి నితీష్ రాణా ప్యాడ్లకు తగిలింది. అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే వేలెత్తి అవుట్ అని ప్రకటించాడు. అప్పటికే రాహుల్, నితీశ్ పరుగు పూర్తి చేశాడు. నితీష్ రాహుల్తో చర్చించి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియర్గా బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే నితీశ్ తీసిన రన్ను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్ను అవుట్ అని ప్రకటించిన మరుక్షణమే ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది. ఆ తర్వాత బంతి బౌండరీకి వెళ్లినా లెక్కలోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే జరిగింది. నిర్ణయం మారినప్పటికీ అప్పటికే బాల్ డెడ్ కావడంతో బ్యాటర్లు తీసిన ఆ ఒక్క పరుగును అంపైర్లు నిరాకరించారు. ఆఖరికి ఢిల్లీ జట్టు కేవలం 1 పరుగు తేడాతోనే ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ పరుగు ఇచ్చి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లేది.చదవండి: PSL 2026: డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్?
రోహిత్ శర్మకు సంబంధించి బిగ్ న్యూస్
దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. హిట్మ్యాన్పై బయోపిక్ రాబోతుందని సోషల్మీడియా కోడై కూస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 9) రోహిత్ ఇన్స్టాలో షేర్ చేరిన స్టోరీ ఈ పుకార్లకు తావిచ్చింది.రోహిత్ షేర్ చేసిన క్రిప్టిక్ పోస్ట్లో నెట్ఫిక్స్ లోగో కలిగిన డ్రాఫ్ట్ #45 అనే స్క్రిప్ట్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. దీనిపై Champion అని రాసి ఉంది. Rohit Sharma’s copy అనే వాటర్మార్క్ ఉండటంతో, హిట్మ్యాన్ ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం అయ్యాడని అభిమానులు భావిస్తున్నారు. #collab అనే క్యాప్షన్ Netflixతో అధికారిక ఒప్పందం ఉందని సూచిస్తోంది. Rohit bhai ab Netflix Netflix pe bhi pull karenge ❤️ pic.twitter.com/mOdNjOIr09— Johns. (@CricCrazyJohns) April 9, 2026వీటన్నిటినీ బట్టి హిట్మ్యాన్పై డాక్యుమెంటరీ లేదా బయోపిక్ రాబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్-రోహిత్ బ్యాక్డ్రాప్లో డాక్యూ–సిరీస్ ఉంటుందని కొందరనుకుంటున్నారు. మరికొందరేమో, రోహిత్ స్పోర్ట్స్–థీమ్ షోలో పాల్గొనబోతున్నాడని చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. మరోవైపు ఫ్రాంచైజీ క్రికెట్లో ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో హిట్మ్యాన్ ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్లో 78 (38) పరుగులు, ఆతర్వాతి మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మూడో మ్యాచ్లో 5 పరుగులు సహా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 118 పరుగులు చేశాడు. హిట్మ్యాన్ తన తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 12న ఆడనున్నాడు. వాంఖడే జరిగే ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆర్సీబీతో తలపడుతుంది.
డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఆ జట్టుకు కొత్త కెప్టెన్?
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో వరుస విజయాలతో దూసుకు పోతున్న కరాచీ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ కింగ్స్ గురువారం పెషావర్ జల్మీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు కరాచీ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.డేవిడ్ వార్నర్ సిడ్నీలో మధ్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పోలీసులు డ్రండ్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. అయితే అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వార్నర్ ఏప్రిల్ 7న కరాచీ కింగ్స్ జట్టుతో తిరిగి చేరాల్సింది.కానీ అతడు ఇంకా పాకిస్తాన్కు రానిట్లు తెలుస్తోంది. ఈరోజు పెషావర్ జల్మీతో జరగనున్న కీలక మ్యాచ్కు వార్నర్ అందుబాటులో లేకపోవడంతో, కరాచీ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్గా పేసర్ హసన్ అలీ వ్యవహరించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.అసలేమి జరిగిందంటే?కరాచీ కింగ్స్ జట్టుకు వారం రోజులు విశ్రాంతి లభించడంతో వార్నర్ తన కుటుంబంతో సమయం గడపడానికి పాక్ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ క్రమంలో సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లో వార్నర్ దొరికిపోయాడు.వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి నిర్ణీత పరిమితి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆ తర్వాతి అతడిని విడిచిపెట్టారు. అయితే వచ్చే నెలలో ఈ కేసుకు సంబంధించి వార్నర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కాగా పెషావర్ జల్మీతో మ్యాచ్కు దూరంగా ఉన్నప్పటికి కరాచీ ఆడే తదుపరి మ్యాచ్కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.చదవండి: IPL 2026: 'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'
'ఎంత మంది వచ్చినా అతడే నా ఫేవరేట్ కెప్టెన్'
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా మూడో టైటిల్ను అందించిన శ్రేయస్ అయ్యర్.. గతేడాది పంజాబ్ కింగ్స్ను రన్నరప్గా నిలిచాడు. ఐపీఎల్-2026లో కూడా పంజాబ్ను అయ్యర్ విజయపథంలో నడిపిస్తున్నాడు.ఈ ఏడాది సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు విజయాలను నమోదు చేసింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్పై ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2019 నుండి జట్టుతో ఉన్న ప్రభ్సిమ్రాన్.. గత ఏడేళ్లలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజ కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. కానీ తన ఫేవరేట్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ప్రభ్సిమ్రాన్ ఎంచుకున్నాడు.శ్రేయస్ అయ్యర్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాడు. నేను కొన్ని మ్యాచ్లలో సరిగ్గా ఆడకపోయినప్పటికి, శ్రేయస్ నా దగ్గరకు వచ్చి ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని చెప్పేవాడు. నా ఆట నన్ను ఆడమని మద్దతు ఇచ్చేవాడు. అందుకే నా దృష్టిలో అతడే బెస్ట్ కెప్టెన్. అయ్యర్ నన్ను ఒక సీనియర్ ప్లేయర్గా చూశేవాడు. జట్టు వ్యూహాల్లో భాగం చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ప్రభ్సిమ్రాన్ పేర్కొన్నాడు.చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’
ఆస్ట్రేలియా ప్లేయర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మోసస్ హెన్రిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో అతను ఆస్ట్రేలియాను వదిలి పోర్చుగల్కు వలస వెళ్లనున్నాడని సమాచారం. ఈ విషయాన్ని పోర్చుగల్ క్రికెటర్ సిరాజ్ ఉల్లా ఖదెమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లీక్ చేశాడు. త్వరలో మన జట్టులో ఓ బిగ్బాష్ లీగ్ ప్లేయర్ జాయిన్ కాబోతున్నాడని హింట్ ఇచ్చాడు.హెన్రిక్స్ పోర్చుగల్కు మకాం మార్చడానికి ఓ ప్రధాన కారణముంది. అతనికి ఆస్ట్రేలియా జట్టు తరఫున అవకాశాలు రావడం లేదు. స్టోయినిస్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్ల వల్ల అతని అవకాశాలు కనుమరుగయ్యాయి. పైగా అతని వయసు ప్రస్తుతం 37 ఏళ్లు. వయసు కూడా అతనికి అడ్డంకిగా మారింది. దీంతో అతను తన స్వస్థలమైన పోర్చుగల్కు మారాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. హెన్రిక్స్కు ఆస్ట్రేలియాతో పాటు పోర్చగల్ పౌరసత్వం కూడా ఉంది.హెన్రిక్స్ 1989లో పోర్చుగల్లో జన్మించాడు. అతడి తండ్రి ఆల్వారో ఓ ప్రొఫెషనల్ ఫుట్బాలర్. చిన్న వయసులోనే హెన్రిక్స్ కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. 2013లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన హెన్రిక్స్ 4 టెస్టులు, 16 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన హెన్రిక్స్ అంతర్జాతీయ కెరీర్లో 636 పరుగులు చేసి, 17 వికెట్లు సాధించాడు. బిగ్బాష్ లీగ్లో హెన్రిక్స్కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. సిడ్నీ సిక్సర్స్ తరఫున 3324 పరుగులు చేసి, రెండు టైటిల్స్ (2019/20, 2020/21) గెలిపించాడు. అసోసియేట్ దేశాలు అంతర్జాతీయ క్రికెట్లో బలంగా ఎదుగుతున్న తరుణంలో హెన్రిక్స్ లాంటి ఆటగాడు పోర్చుగల్కు వలస వెళ్లడం ఆ దేశ క్రికెట్ తలరాతనే మార్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇటలీ లాంటి చిన్న జట్టు అద్భుతాలు చేసి, ప్రపంచ దృష్టిని ఆకర్శించిన విషయం విధితమే.అసోసియేట్ జట్లలో చేరిన ప్రముఖ క్రికెటర్లు- ఉన్ముక్త్ చంద్ (భారత్) – యూఎస్ఏ - రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే – నెదర్లాండ్స్ - కోరె ఆండర్సన్ – యూఎస్ఏ - డేవిడ్ వీస్ – నమీబియా - వేన్ మాడ్సన్ – ఇటలీ - రాస్ టేలర్ – సమోవా
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఐసీసీ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ (2007)లో భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.అదే విధంగా.. సొంతగడ్డపై భారత్ వన్డే వరల్డ్కప్-2011 టైటిల్ గెలవడంలో యువీదే ముఖ్య భూమిక. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అద్భుత ప్రదర్శన కారణంగా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియా మరోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో యువీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఆటకే ప్రాధాన్యంఅయితే, ఇంతటి సంతోషకర సమయంలోనే ఓ చేదు వార్త యువరాజ్ సింగ్కు తెలిసింది. తనకు క్యాన్సర్ సోకిందనే విషయం బయటపడింది. అదే సమయంలో టెస్టు జట్టులో యువీకి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కంటే ఆటకే ప్రాధాన్యం ఇవ్వాలని అతడు భావించాడు. అయితే, డాక్టర్ హెచ్చరికల తర్వాత యువీ తన నిర్ణయాన్ని మార్చుకోకతప్పలేదు.అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్.. మహమ్మారిని జయించి యువరాజ్ సింగ్ మరికొన్నేళ్లు క్రికెటర్గా కొనసాగాడు. అయితే, చేదు అనుభవాల గురించి అతడు తాజాగా మనసు విప్పాడు. ‘‘ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకున్న వేళ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతున్నట్లు అనిపించింది.అప్పుడు మేము ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లాల్సి ఉంది. గంగూలీ రిటైర్ అయిన కారణంగా నాకు టెస్టు జట్టులో అప్పుడే చోటు దక్కింది. ఏడేళ్ల నిరీక్షణ ఫలించబోతున్న తరుణం. నేను చచ్చిపోయినా పర్లేదు.. ఆ స్థానం నాకు కావాల్సిందే అని మనసులో గట్టిగా అనుకున్నాను.ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చుఅయితే, అప్పుడు డాక్టర్ నితేశ్ రోహత్గి నాకో భయంకర నిజం చెప్పారు. ‘నీ గుండె, ఊపిరి తిత్తులకు మధ్య ట్యూమర్ ఉంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్లి క్రికెట్ ఆడితే గుండెపోటు వచ్చినా రావొచ్చు. కీమోథెరపీ ఇప్పుడు గనుక మొదలుపెట్టకపోతే ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం’ అని కుండబద్దలుకొట్టేశారు.అప్పుడే నాకు సమస్య తీవ్రత అర్థమైంది. అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నా. నేనిక ఆడలేను అన్న బాధ మానసికంగా నన్ను కుంగదీసింది. కానీ అసలు క్రికెట్ లేకపోతే నేనెవరిని? నా గుర్తింపు ఏమిటి? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు పాత క్రికెట్ వీడియోలు చూస్తూ స్ఫూర్తి పొందేవాడిని.ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టునేను అమెరికాలో ఉన్నపుడు అనిల్ కుంబ్లే వచ్చాడు. లాప్టాప్లో మ్యాచ్లు చూస్తుంటే.. ‘ముందు ఆరోగ్యంమీద శ్రద్ధ పెట్టు. ఇవన్నీ పక్కన పెట్టు’ అని మందలించాడు. ఇంగ్లండ్లో ఉన్నపుడు సచిన్ పాజీ వచ్చి ‘నువ్వు త్వరలోనే కోలుకుని తిరిగి వస్తావు’ అని ధైర్యం నింపాడు’’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో యూట్యూబ్ చాట్లో యువీ పంచుకున్నాడు.చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్.. అక్షర్ పటేల్ రియాక్షన్ ఇదే!
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్ ఇక్బాల్ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.ఏప్రిల్ 7న బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్ను 11 మంది సభ్యులతో కూడిన అడ్–హాక్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.మహిళా క్రికెటర్లకు భారీ ఊరట తమీమ్ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్కు 15000 టాకాలు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్కు 20000 టాకాలుగా మారాయి. టాప్ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది. పురుష క్రికెటర్లకు జాక్పాట్తమీమ్ నిర్ణయంతో బంగ్లాదేశ్ పురుషు క్రికెటర్లకు జాక్పాట్ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్ల వారీగా విభజన జరిగి, గ్రేడ్ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు.
బాంబు పేల్చిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, తన అంతర్జాతీయ కెరీర్పై ఆసక్తికర ప్రకటన చేశాడు. నిన్న (ఏప్రిల్ 8) ఢిల్లీ క్యాపిటల్స్పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన (3-17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన అతను.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చి బాంబు పేల్చాడు.మ్యాచ్ అనంతరం రషీద్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా నేను ఆడాను. గతేడాది జింబాబ్వేపై ఓ టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు వేశాను. ఈ చర్య నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్ట్లు ఆడే సాహసం చేస్తే, ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించినట్లు వెల్లడించాడు. కాగా, రషీద్ ఖాన్ 2023 నుంచి వెన్ను గాయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. శస్త్రచికిత్స కూడా జరిగింది. వైద్యులు రెడ్బాల్ క్రికెట్ ఆడొద్దని స్పష్టంగా సూచించారు. అయినా రషీద్ గతేడాది జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడి ఏకంగా 67 ఓవర్లు వేశాడు. ఈ నిర్ణయం అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. రషీద్ 2023 వన్డే వరల్డ్ కప్ కోసం శస్త్రచికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆతర్వాత యూకేలో సర్జరీ చేయించుకున్నాడు. 2024లో తిరిగి వచ్చాడు. వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అతను తిరిగి గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. బ్యాట్తోనూ పర్వాలేదనిపించాడు. రషీద్ టెస్ట్ కెరీర్ను పరిశీలిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 2017లో టెస్ట్ హోదా పొందినప్పటి నుంచి 12 మ్యాచ్లు ఆడగా, రషీద్ కేవలం 6 టెస్ట్ల్లో మాత్రమే పాల్గొన్నాడు. చివరిసారి అతను 2025లో జింబాబ్వేపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో 67 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా రషీద్ తన టెస్ట్ కెరీర్లో 6 మ్యాచ్ల్లో 45 వికెట్లు తీశాడు.
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఏమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అ...
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
గ్రనాడా (స్పెయిన్): రైఫిల్, పిస్టల్ ప్రపంచకప్ ...
భారత రెజ్లర్ లలిత్కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపి...
ఫైనల్లో జైస్మీన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్...
ఆస్ట్రేలియా ప్లేయర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మోసస్ హెన్రిక్స్...
‘ఆర్నెళ్లకు మించి బతకలేవు.. గుండెపోటు రావొచ్చు’
భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ పేరు చిరస్...
బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ...
బాంబు పేల్చిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్ర...
క్రీడలు
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
వీడియోలు
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
కేకేఆర్ ఫ్యాన్స్ ఫైర్.. స్పందించిన అయ్యర్ సోదరి
పరుగు తేడాతో బోణీ కొట్టిన GT
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
విఫలమైన బుమ్రా అస్త్రం... వీడు మామూలు బుర్డోడు కాదు
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
