Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Gavaskar Explains Why Miller Shouldnt Be Blamed For 1 Run Defeat vs GT1
‘మిల్లర్‌ తప్పేమీ లేదు.. కుల్దీప్‌ స్ట్రైక్‌ తీసుకుంటే బాగుండేది’

టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ పవర్‌ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్‌ తప్పేమీ లేదంటూ అతడికి మద్దతుగా నిలిచాడు. ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం మంచిదే అయినా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తప్పవని.. మిల్లర్‌ విషయంలోనూ ఇదే జరిగిందన్నాడు.ఐపీఎల్‌-2026లో భాగంగా ఢిల్లీ- గుజరాత్‌ బుధవారం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తలపడ్డాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడ్డా.. డేవిడ్‌ మిల్లర్‌ (20 బంతుల్లో 41*) విజయంపై ఆశలు పెంచాడు.ఒక్క పరుగు తేడాతోఈ ఐదో నంబర్‌ బ్యాటర్‌ ధనాధన్‌ దంచికొడుతూ ఆఖరి ఓవర్‌ వరకు మ్యాచ్‌ను తీసుకువచ్చాడు. అయితే, చివరి ఓవర్లో గుజరాత్‌ బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ రంగంలోకి దిగగా.. విప్రాజ్‌ నిగమ్‌ తొలి బంతికి సిక్స్‌ బాది మరుసటి బంతికి అవుటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ మిల్లర్‌కు ఇవ్వగా.. నాలుగో బంతికి అతడు సిక్సర్‌ బాదాడు.చివరి రెండు బంతుల్లో విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. మిల్లర్‌ సింగిల్‌కు నిరాకరించాడు. ఆఖరి బంతికి తానే హిట్టింగ్‌ ఆడాలని భావించగా.. ప్రసిద్‌ షార్ట్‌ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో సింగిల్‌ తీసేందుకు మిల్లర్‌ ప్రయత్నించగా.. కుల్దీప్‌ స్ట్రైకర్‌ వైపునకు వచ్చే క్రమంలో రనౌట్‌ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.అతడి తప్పేమీ లేదుఈ నేపథ్యంలో మిల్లర్‌పై విమర్శలు వస్తుండగా.. భారత దిగ్గజ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ మాత్రం మద్దతుగా నిలిచాడు. "నిజానికి మిల్లర్‌ విన్నింగ్‌ రన్స్‌ తానే తీయాలని భావించాడు. అయితే, ఆఖరి ఓవర్లో కుల్దీప్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతి ద్వారా సింగిల్‌ తీసిన తీరును మిల్లర్‌ గుర్తుంచుకోవాల్సింది.కుల్దీప్‌నకు స్ట్రైక్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అయితే, గత ఓవర్లో తాను సిక్సర్‌ బాదిన విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈసారి కూడా అదే పునరావృతం చేయగలనని మిల్లర్‌ విశ్వసించాడు. ఇందులో అతడి తప్పేమీ లేదు. కానీ ప్రసిద్‌ కృష్ణ అద్భుత బంతి సంధించి మిల్లర్‌ ఆశలపై నీళ్లు చల్లాడు’’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026

IPL 2026: Shubman Gill Faces Punishment After GT Narrow Win Over DC2
శుబ్‌మన్‌ గిల్‌కు ‘ఊహించని’ షాక్‌!

గుజరాత్‌ టైటాన్స్‌ ఎట్టకేలకు ఐపీఎల్‌-2026 టోర్నీలో బోణీ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ఢిల్లీ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ (20 బంతుల్లో 41 నాటౌట్‌) చేసిన పొరపాటు టైటాన్స్‌ నెత్తిన పాలు పోసింది. ఫలితంగా ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో టైటాన్స్‌ను విజయం వరించింది.ధనాధన్‌సొంతమైదానం అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా టాస్‌ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు సాధించింది. శుబ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 70) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరవగా.. జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 52), వాషింగ్టన్‌ సుందర్‌ (32 బంతుల్లో 55) ధనాధన్‌ దంచికొట్టారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగుల వద్ద నిలిచిపోయింది. పాతుమ్‌ నిస్సాంక (24 బంతుల్లో 41), కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 92), మిల్లర్‌ ఇన్నింగ్స్‌ వృథా అయ్యాయి. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీయగా.. ప్రసిద్‌ కృష్ణ రెండు, మహ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.శుబ్‌మన్‌ గిల్‌కు ఊహించని షాక్‌అయితే, గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఢిల్లీతో మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఐపీఎల్‌ పాలక మండలి అతడికి జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.‘‘ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గుజరాత్ టైటాన్స్‌ స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం.. గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జరిమానా విధించడమైనది. ఈ సీజన్‌లో ఇదే అతడి తొలి తప్పిదం కాబట్టి రూ. 12 లక్షల జరిమానాతో సరిపెడుతున్నాము’’ అని ఐపీఎల్‌ పాలక మండలి ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026

Babar Azam Fumes At Reporter Kohli Finishes Matches But You Don't3
అది నీ తప్పు!.. మండిపడ్డ బాబర్‌ ఆజం

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ ఆజంకు కోపమొచ్చింది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లితో పోలుస్తూ అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది. కాగా ఒకప్పుడు పాకిస్తాన్‌ ముఖచిత్రంగా పేరొందిన బాబర్‌కు ఇప్పుడు జాతీయ జట్టులో చోటే కరువయ్యే దుస్థితి.మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఒకప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న బాబర్‌ ఆజం (Babar Azam).. గత మూడేళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024లో పాక్‌ సెమీస్‌ చేరకుండానే నిష్క్రమించడంతో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా అతడు తప్పుకొన్నాడు. ఫామ్‌లేమిజట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నా ఫామ్‌లేమితో విమర్శల పాలయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలోనూ చెత్త ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా పాక్‌ సెలక్టర్లు యాభై ఓవర్ల ఫార్మాట్‌ నుంచీ పక్కనపెట్టారు. దీంతో బాబర్‌ ఆజం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.ఒకప్పుడు కోహ్లితో బాబర్‌ను పోల్చిన పాక్‌ మాజీ క్రికెటర్లు సైతం ఇప్పుడు అతడి ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2026లో పెషావర్‌ జల్మీ జట్టు కెప్టెన్‌గా బాబర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో బాబర్‌ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు.15వ ఓవర్లో హసన్‌ ఖాన్‌ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పెషావర్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలవడంతో బాబర్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం విలేకరులతో మాట్లాడిన సమయంలో అతడికి ఊహించని ప్రశ్న ఎదురైంది.అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!‘‘విరాట్‌ కోహ్లి మాదిరే మీకు కూడా మంచి పేరు ఉంది. అయితే, అతడు మ్యాచ్‌లను గొప్పగా ఫినిష్‌ చేస్తాడు. మీరు మాత్రం ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. చాలా మంది అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!.. మరి ఈ పోలికపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించారు.మండిపడ్డ బాబర్‌ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయాలను నీతోనే పెట్టుకో. ఈ పోలికలు ఆపేసి అంతా ముందుకు సాగండి. నేను మ్యాచ్‌లు ఫినిష్‌ చేయలేననుకోవడం నీ తప్పు. అది నీ అభిప్రాయం మాత్రమే’’ అని బాబర్‌ ఆజం ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: ‘సింగిల్‌’తో ఢిల్లీ డీలా🚨 BABAR RESPONDED TO A QUESTION ON KOHLI-BABAR COMPARISON 🚨• Journalist - "Virat Kohli comes with the same shot of game as you but he finishes the match which you lack. People compare him with you what are your views on the comparison?" • Babar Azam - "Let these things to… pic.twitter.com/A69fIV9urI— Abdullah. (@Abdullahh_56) April 8, 2026

Miller Single Refusal DC lose last Ball thriller to GT, Axar Patel Reaction Viral4
ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. కెప్టెన్‌ రియాక్షన్‌ ఇదే!

ఐపీఎల్‌-2026లో వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో అక్షర్‌ సేన ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.ఆఖరి ఓవర్లో హైడ్రామాకాగా అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ- గుజరాత్‌ (DC vs GT) మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తమ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణను బరిలోకి దించాడు. అతడి ఓవర్లో తొలి బంతికే విప్రాజ్‌ నిగమ్‌ ఫోర్‌ బాదాడు.అయితే, మరుసటి బంతికే ప్రసిద్‌ విప్రాజ్‌ను అవుట్‌ చేసి ఢిల్లీ ఉత్సాహాన్ని నీరు గార్చాడు. దీంతో విజయ సమీకరణం మూడు బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఆఖరి ఓవర్‌ మూడో బంతికి కుల్దీప్‌ యాదవ్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ డేవిడ్‌ మిల్లర్‌కు ఇచ్చాడు.ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌ఈ క్రమంలో నాలుగో బంతికి మిల్లర్‌ తనదైన శైలిలో సిక్సర్‌ బాదాడు. దీంతో ఢిల్లీ గెలుపు దాదాపు ఖరారైనట్లేనని అంతా భావించారు. కానీ ఆఖరి రెండు బంతుల్లో మిల్లర్‌ చేసిన తపు​ ఢిల్లీ కొంపముంచింది. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమైన సమయంలో.. ఐదో బంతికి మిల్లర్‌ సింగిల్‌ తీసేందుకు నిరాకరించాడు.కుల్దీప్‌ బదులు తానే స్ట్రైక్‌లో ఉండాలని భావించాడు. అయితే, ఆఖర్లో ప్రసిద్‌ షార్ట్‌ బాల్‌ సంధించగా.. మిల్లర్‌ షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. దీంతో సింగిల్‌కు యత్నించగా.. వికెట్‌ కీపర్‌ బట్లర్‌ బంతిని అందుకుని వికెట్లకు గిరాటేశాడు. ఒక్క పరుగు తేడాతోఅయితే, అప్పటికి కుల్దీప్‌ క్రీజులోకి రాకపోవడంతో రనౌట్‌ అయ్యాడు. ఆ సమయంలో ఢిల్లీ వైడ్‌ కోసం రివ్యూ తీసుకోగా ప్రతికూల ఫలితం వచ్చింది. దీంతో ఒక్క పరుగు తేడాతో గెలిచిన గుజరాత్‌ సంబరాలు అంబరాన్నంటగా.. ఢిల్లీకి భంగపాటు ఎదురైంది.ఈ నేపథ్యంలో డేవిడ్‌ మిల్లర్‌ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఓటమి అనంతరం ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ ఎంతో సంయమనం పాటించాడు. మిల్లర్‌ను హత్తుకుని అతడిని ఓదార్చాడు. దీంతో అక్షర్‌ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి స్థానంలో వేరే కెప్టెన్‌ ఉండి ఉంటే గనుక పరిస్థితి వేరుగా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఆఖరి వరకు పోరాడిన తీరు అద్భుతమంటూ ఢిల్లీ జట్టును కొనియాడుతున్నారు. కాగా ఇప్పటికి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఢిల్లీ రెండు గెలిచింది.చదవండి: అతడు లేనిలోటు తీరనిది.. బ్యాటర్లే మా ఓటములకు కారణం: క్లాసెన్‌Watch it yourself to believe it 🤯A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd— IndianPremierLeague (@IPL) April 8, 2026

Pakistan Players Shocked After Hockey Federation Rope New Head Coach5
పాకిస్తాన్‌కు కొత్త హెడ్‌కోచ్‌.. ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి

కరాచీ: పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌) తమ సీనియర్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీమ్‌కు కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియన్‌ కొలిన్‌ బ్యాచ్‌ స్థానంలో స్వదేశీ కోచ్‌ను ప్రకటించింది. మాజీ ఒలింపియన్‌ మన్‌జూర్‌ ఉల్‌ హసన్‌ పాక్‌ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. రాబోయే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్, ప్రపంచ కప్‌లలో పాల్గొనే టీమ్‌ మన్‌జూర్‌ శిక్షణలోనే సన్నద్ధమవుతుంది. మాజీ ఆటగాళ్లు హసన్‌ సర్దార్, ఇస్లాహుద్దీన్‌ సిద్దిఖీలతో కూడిన పీహెచ్‌ఎఫ్‌ ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సిఫారసుపై కొత్త కోచ్‌ ఎంపిక జరిగింది. తీవ్ర అసంతృప్తిఅయితే మన్‌జూర్‌ను కోచ్‌గా నియమించడంపై పాక్‌ జట్టులో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తాజా నిర్ణయం పట్ల వారు నిర్ఘాంతపోయారు. 70వ, 80వ దశకాల్లో డిఫెండర్‌గా మన్‌జూర్‌ పాక్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనూహ్య ప్రకటన‘ఆటగాడిగా మన్‌జూర్‌కు మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. అయితే కోచ్‌గా ఆయనను ఎంపిక చేయడం అంటే తీవ్ర నిరాశాజనక ఫలితాలను కొనితెచ్చుకోవడమే. కొలిన్‌ బ్యాచ్‌ అన్ని రకాలుగా అర్హుడైన కోచ్‌. మేమంతా ఆయన శిక్షణతో సంతోషంగా ఉన్నాం. ఆధునిక హాకీకి సంబంధించి అన్ని అంశాలపై అవగాహన ఉంది. ప్రొ లీగ్, వరల్డ్‌ కప్‌లాంటి పెద్ద ఈవెంట్లలో మమ్మల్ని కొలిన్‌ సమర్థంగా నడిపిస్తాడని భావించిన తరుణంలో ఈ అనూహ్య ప్రకటన వచ్చింది’ అని పాక్‌ జాతీయ జట్టులోని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్‌ ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు

Gujarat Titans beat Delhi Capitals by one run6
‘సింగిల్‌’తో ఢిల్లీ డీలా

ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు కావాలి. రిటైర్డ్‌హర్ట్‌గాతప్పుకొని మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన మిల్లర్‌పైనే ఆశలు ఉన్నాయి. 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే సిరాజ్‌ వేసిన 19వ ఓవర్లో మిల్లర్‌ చెలరేగి 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 11 పరుగులు లభించాయి. ఇక చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే! అయితే డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌ వరకు బంతి వెళ్లినా సునాయాస సింగిల్‌ తీయకుండా కుల్దీప్‌ను మిల్లర్‌ వెనక్కి పంపించాడు. ఈ అనూహ్య నిర్ణయం ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రసిధ్‌ కృష్ణ వేసిన షార్ట్‌ బంతిని మిల్లర్‌ ఆడలేకపోగా, సింగిల్‌ తీసే ప్రయత్నంలో కుల్దీప్‌ రనౌటయ్యాడు. వైడ్‌ కోసం అంపైర్లు పరిశీలించగా అది సరైందేనని తేలింది. దాంతో గుజరాత్‌ సంబరాలు చేసుకోగా... ఢిల్లీ బృందం నిరాశలో మునిగింది. అంతకుముందు గిల్, బట్లర్, సుందర్‌ అర్ధసెంచరీలతో గుజరాత్‌ భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. న్యూఢిల్లీ: మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌లో గెలుపు బోణీ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన గుజరాత్‌ బుధవారం జరిగిన పోరులో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్‌ సుందర్‌ (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (27 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడం విశేషం. రెండో వికెట్‌కు బట్లర్‌తో 32 బంతుల్లో 60 పరుగులు జోడించిన గిల్‌... మూడో వికెట్‌కు సుందర్‌తో 61 బంతుల్లో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడిపోయింది. కేఎల్‌ రాహుల్‌ (52 బంతుల్లో 92; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా, డేవిడ్‌ మిల్లర్‌ (20 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు. భారీ భాగస్వామ్యం... ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... చాలా కాలం తర్వాత బట్లర్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడటంతో టైటాన్స్‌ భారీ స్కోరుకు పునాది పడింది. సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్‌...అక్షర్‌ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టాడు. అనంతరం ముకేశ్‌ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అతను ఆ తర్వాత మరో సిక్స్‌ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా, 24 బంతుల్లోనే బట్లర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే కుల్దీప్‌ చక్కటి బంతితో అతని ఆటను ముగించాడు. ఈ దశలో గిల్, సుందర్‌ కలిసి ధాటిని ప్రదర్శించారు. విప్రాజ్‌ వేసిన 12వ ఓవర్‌ గుజరాత్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో సుందర్‌ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టగా, గిల్‌ మరో సిక్స్‌ బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. 33 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న గిల్‌... కుల్దీప్‌ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో చెలరేగాడు. గుజరాత్‌ ఆఖరి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టగా... 30 బంతుల్లో సుందర్‌ అర్ధసెంచరీ పూర్తయింది. అనారోగ్యంతో గత మ్యాచ్‌లో ఆడని గిల్‌ కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఒక్క కుల్దీప్‌ బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. రిజ్వీ విఫలం... సిరాజ్‌ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది నిసాంక జోరుగా ఛేదనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అశోక్‌ ఓవర్లోనూ అతను వరుసగా 4, 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన రాహుల్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. అశోక్‌ ఓవర్లోనే ఢిల్లీ 23 పరుగులు రాబట్టింది. తొలి వికెట్‌కు 76 పరుగుల (49 బంతుల్లో) తర్వాత నిసాంకను ప్రసిధ్‌ అవుట్‌ చేయగా...అదే ఓవర్‌ చివరి నాలుగు బంతుల్లో రాహుల్‌ వరుసగా 4, 6, 6, 4తో చెలరేగి 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్‌ రాణా (5) మళ్లీ విఫలం కాగా, గత రెండు మ్యాచ్‌ల హీరో సమీర్‌ రిజ్వీ (0) ఈసారి తొలి బంతికే బౌల్డయ్యాడు. అక్షర్‌ పటేల్‌ (2) కూడా నిలబడలేకపోగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్‌ అవుటయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా బయటకు వెళ్లిన మిల్లర్‌ ఈ దశలో తిరిగొచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.స్కోరు వివరాలు గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సుదర్శన్‌ (బి) ముకేశ్‌ 12; గిల్‌ (సి) రాణా (బి) ఎన్‌గిడి 70; బట్లర్‌ (బి) కుల్దీప్‌ 52; సుందర్‌ (సి) రాణా (బి) ముకేశ్‌ 55; ఫిలిప్స్‌ (నాటౌట్‌) 14; తెవాటియా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–19, 2–79, 3–183, 4–205. బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 4–0–55–2, ఎన్‌గిడి 4–0–24–1, అక్షర్‌ 3–0–32–0, కుల్దీప్‌ 4–0–42–1, నటరాజన్‌ 4–0–34–0, విప్రాజ్‌ 1–0–23–0. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: నిసాంక (సి) తెవాటియా (బి) ప్రసిధ్‌ 41; రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 92; రాణా (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 5; రిజ్వీ (బి) రషీద్‌ 0; మిల్లర్‌ (నాటౌట్‌) 41; అక్షర్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రషీద్‌ 2; స్టబ్స్‌ (రనౌట్‌) 7; విప్రాజ్‌ (సి) గిల్‌ (బి) ప్రసిధ్‌ 12; కుల్దీప్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–101, 3–101, 4–134, 5–160, 6–166, 7–202, 8–209. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–52–1, రబాడ 4–0–32–0, రషీద్‌ ఖాన్‌ 4–0–17–3, అశోక్‌ శర్మ 3–0–45–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–52–2, సుందర్‌ 1–0–11–0.ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X లక్నో వేదిక: కోల్‌కతారాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Aayush Shetty sensational victory over world number seven7
ఆయుశ్‌ అద్భుతం

నింగ్బో (చైనా): ఆసియా సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్‌ ఆయుశ్‌ శెట్టి సంచలనంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 25వ ర్యాంకర్‌ ఆయుశ్‌ 21–13, 21–16తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ లిన్‌ షి ఫెంగ్‌ (చైనా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ ఆయుశ్‌ తొలుత వెనుకబడ్డా... సంయమనం కోల్పోకుండా ఆడి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా ముందంజ వేశాడు. ప్రణయ్‌ 24–22, 21–12తో నుగుయెన్‌ హాయ్‌ డాంగ్‌ (వియత్నాం)పై గెలుపొందాడు. అయితే పతకం సాధిస్తాడనుకున్న భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచారు. ప్రపంచ 22వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యి (హాంకాంగ్‌)తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 12–21, 19–21తో ఓడిపోయాడు. లీ చెయుక్‌ చేతిలో లక్ష్య సేన్‌కిది నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ ఏడాది మలేసియా ఓపెన్‌లోనూ లీ చెయుక్‌ చేతిలో లక్ష్య సేన్‌ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ మాజీ చాంపియన్‌ లో కీన్‌ యెవ్‌ (సింగపూర్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–18, 9–21, 11–21తో ఓటమి చవిచూశాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... అదే జోరును కొనసాగించడంలో విఫలమై ఓటమి మూటగట్టుకున్నాడు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిమ్రన్‌–కవిప్రియ సెల్వం (భారత్‌) జోడీ 9–21, 8–21తో లీ యి జింగ్‌–లువో జు మిన్‌ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో శ్రుతి మిశ్రా–ప్రియ (భారత్‌) ద్వయం 21–15, 17–21, 21–13తో ఫామ్‌ థి డియు లె–ఫామ్‌ థి కాన్‌ (వియత్నాం) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.

Indian womens team wins first match in Asia Cup Under 20 tournament8
22 ఏళ్ల తర్వాత...

పాథుమ్‌ థాని (థాయ్‌లాండ్‌): ఆసియా కప్‌ మహిళల అండర్‌–20 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు 3–1 గోల్స్‌ తేడాతో చైనీస్‌ తైపీ జట్టును ఓడించింది. భారత్‌ తరఫున శిబాని దేవి నోంగ్‌మెకాపమ్‌ (32వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా... భూమిక దేవి ఖుముక్‌చామ్‌ (26వ నిమిషంలో) ఒక గోల్‌ చేసింది. చైనీస్‌ తైపీ తరఫున సబ్‌స్టిట్యూట్‌ కావో సిన్‌ (90+3వ నిమిషంలో) ఏకైక గోల్‌ నమోదు చేసింది. 2004 తర్వాత ఆసియా కప్‌ అండర్‌–20 మహిళల టోర్నీలో భారత జట్టుకిదే తొలి విజయం కావడం విశేషం. నాలుగు జట్లున్న గ్రూప్‌ ‘సి’లో భారత జట్టు తమ మూడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్‌ ఒక మ్యాచ్‌లో గెలిచి మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. మూడు గ్రూప్‌ల నుంచి టాప్‌–2లో నిలిచిన ఆరు జట్లతోపాటు మూడు గ్రూప్‌ల్లో మూడో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటాయి. గ్రూప్‌ ‘బి’లో ఉజ్బెకిస్తాన్, జోర్డాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే భారత జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించేది. అయితే జోర్డాన్‌పై ఉజ్బెకిస్తాన్‌ భారీ విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడంతోపాటు భారత జట్టు నాకౌట్‌ దశకు చేరే అవకాశాలకు తెరదించింది.

Nitesh wins silver at Asian Senior Wrestling Championship9
నితేశ్‌కు రజతం

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్‌ స్టయిల్‌లో భారత రెజ్లర్లు నితేశ్‌ (97 కేజీలు) రజత పతకం దక్కించుకోగా... ప్రిన్స్‌ (82 కేజీలు), సచిన్‌ సెహ్రావత్‌ (67 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ మొహమ్మధాది సరావి (ఇరాన్‌)తో జరిగిన ఫైనల్లో నితేశ్‌ 1–7 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దిదార్‌ అమన్‌జరోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో ప్రిన్స్‌ 10–1తో విజయం సాధించాడు. అబ్దుమలిక్‌ అమినోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన కాంస్య పతక బౌట్‌లో సచిన్‌ 6–5 పాయింట్ల తేడాతో గెలిచాడు. ఓవరాల్‌గా గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్లు రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 115 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 195 పాయింట్లతో ఇరాన్‌ గ్రీకో రోమన్‌ విభాగంలో అగ్రస్థానాన్ని సంపాదించింది. 154 పాయింట్లతో కిర్గిస్తాన్‌ రెండో స్థానంలో, 136 పాయింట్లతో ఉజ్బెకిస్తాన్‌ మూడో స్థానంలో నిలిచాయి. బుధవారమే మొదలైన మహిళల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో భారత రెజ్లర్లు హన్సిక లాంబా (55 కేజీలు), నేహా (59 కేజీలు) నేడు కాంస్య పతకాల కోసం పోటీపడతారు. సెమీఫైనల్లో హన్సిక 1–11తో యుజువాన్‌ లీ (చైనా) చేతిలో, నేహా 5–12తో మెంగ్యు జి (చైనా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన కాజల్‌ (76 కేజీలు), నీలమ్‌ (50 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం చవిచూశారు.

27 medals for Telangana gymnasts10
తెలంగాణ జిమ్నాస్ట్‌లకు 27 పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా లెవెల్‌ వైజ్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు అదరగొట్టారు. న్యూఢిల్లీలోని ద జిమ్నాస్టిక్‌ అకాడమీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ చిన్నారులు 25 రజత పతకాలు, రెండు కాంస్య పతకాలతో మెరిశారు. మొత్తం 27 పతకాలు సొంతం చేసుకొని ఓవరాల్‌గా రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. టేబుల్‌ వాల్ట్, అన్‌ఈవెన్‌ బార్స్, బ్యాలెన్సింగ్‌ బీమ్, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ ఈవెంట్స్‌లో పోటీలు నిర్వహించారు. ఈ టోర్నీలో పతకాలు సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్‌లను బుధవారం హైదరాబాద్‌లోని వందన బద్రుక ఇన్‌స్టిట్యూట్‌ కల్పతరులో అంతర్జాతీయ ప్లేయర్, జాతీయ చాంపియన్, జాతీయ జడ్జి ప్రియాంక అభినందించింది. ఈ టోర్నీలో పతకాలు గెలిచిన తెలంగాణ జిమ్నాస్ట్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. బాలికలు (లెవెల్‌–1): హియా యాదవ్, ప్రణవి షా, జెకా నవాజ్, అయేషా సిద్దిఖి, ఆద్య కపూర్, మెహర్‌ అగర్వాల్‌. బాలురు (లెవెల్‌–1): అన్షుల్‌ యాదవ్, ఆకుల అద్వైత్, చందూరి అద్వైత్, గొల్ల విదిత్, ఎన్‌.సిద్విక్‌ రెడ్డి, రేయాంశ్‌ రావు. బాలికలు (లెవెల్‌–2): మాన్వీ రెడ్డి, మండవ మైరా, అనన్య రెడ్డి, కృషా జైన్, కృత్యా కొయిరాలా, వర్ణిక రెడ్డి, రియానా రెడ్డి, ఆర్ణవి చందూరి, ఆముక్త. బాలురు (లెవెల్‌–2): చొక్కారపు లౌక్య విరాట్‌. బాలికలు (లెవెల్‌–3): ఇనారా రుక్మిణి. బాలికలు (లెవెల్‌–4): సిమోన్‌ పెస్తోంజి. బాలికలు (లెవెల్‌–6): ఖుషీ రాయ్‌.

Advertisement
Advertisement
 
Advertisement