ప్రధాన వార్తలు
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ
ఐపీఎల్ 2026లో సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న (ఏప్రిల్ 18) ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (hamstring tear) యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే సీజన్ మొత్తానికి దూరమయ్యాడని తెలుస్తుంది. మాత్రే గాయంపై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అధికారక ప్రకటన చేశాడు. మాత్రే గాయం చాలా తీవ్రమైందని ఆయన ధృవీకరించాడు. హస్సీ ప్రకటనతో మాత్రే సీజన్ మొత్తానికి దూరమవుతున్న విషయం స్పష్టమవుతుంది.ఈ సీజన్లో మాత్రే అద్భుతమైన టచ్లో ఉన్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తనవంతు కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వర్తించాడు. సీఎస్కే సాధించిన రెండు విజయాల్లోనూ తనదైన పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో అతను జట్టుకు దూరం కావడం సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనే మాత్రే చాలా ఇబ్బందిపడుతూ బ్యాటింగ్ చేశాడు.మాత్రే గాయం తీవ్రత స్కానింగ్స్లో తెలుస్తుంది. ఈ సీజన్లో మాత్రే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 178 స్ట్రయిక్రేట్తో 201 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ద సెంచరీలు, రెండు 30 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో మాత్రే స్థానాన్ని ఉర్విల్ పటేల్తో భర్తీ చేసే అవకాశం ఉంది. మాత్రే గాయం సీఎస్కే గాయాల జాబితాను మరింత పెద్దది చేసింది. ఇప్పటికే ధోని, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ జాబితాలో ఉన్నారు.నిన్నటి ఎస్ఆర్హెచ్-సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సీఎస్కే 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కేకు ఎదురైన మరో పరాజయం ఇది. వాస్తవానికి ఈ మ్యాచ్లో సీఎస్కే గెలవాల్సింది. అయితే ఆ జట్టు చేజేతులా ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంది. తొలుత బౌలింగ్లో సన్రైజర్స్ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన సీఎస్కే బౌలర్లు.. ఆతర్వాత ఛేదనలో సగం వరకు మ్యాచ్పై పట్టు నిలుపుకున్నారు. అయితే అనూహ్యంగా సన్రైజర్స్ బౌలర్లు మ్యాచ్పై పట్టుబిగించి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సీఎస్కే ఫ్యాన్స్ నోళ్లు మూయించిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపు అనంతరం మైదానంలోని స్టాండ్స్లో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. సన్రైజర్స్ యజమాని కావ్యా మారన్ తనదైన శైలిలో సంబురాలు చేసుకుంటూ కనిపించింది. భావోద్వేగాలను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోలేని కావ్యా, సన్రైజర్స్ గెలవగానే చిన్నపిల్లలా ఎగిరిగంతులేసింది. ఈ క్రమంలో అప్పటికే అల్లరి చేస్తున్న సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించింది. నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ విరాట్ కోహ్లి స్టయిల్లో గెస్టర్ ఇచ్చింది. Kavya Maran doing Silence gesture🤫🔥🔥🔥 pic.twitter.com/C5FDifkPej— Eagle_Riser 🦅 (@UnpairedElect17) April 18, 2026విరాట్ కూడా అభిమానులు ఎక్కువ హడావుడి చేస్తే నోటిపై వేలు పెట్టి సైలెన్స్ అంటూ గెశ్చర్స్ ఇస్తాడు. కావ్యా సీఎస్కే అభిమానుల నోళ్లు మూయించిన వీడియోలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసి తమిళ ప్రజలు కావ్యా మారన్పై మండిపడుతున్నారు. తమిళురాలై ఉండి, తమిళ అభిమానుల నోళ్లు మూయించడమేంటని ఫైరవుతున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ ఫార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్. ఈ మ్యాచ్లో గెలుపుతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
సీఎస్కే చెత్త రికార్డు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు. ముఖ్యంగా ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) కూడా పర్వాలేదనిపించారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఎస్కే ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. 34 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్ ఆ జట్టులో టాప్ స్కోరర్.హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. ఈ ఓటమితో సీఎస్కే పలు చెత్త రికార్డులను సొంతం చేసుకుంది.2019 తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా 180 ప్లస్ టార్గెట్ను ఛేదించలేదు. 14 ప్రయత్నాల్లో ఓటమినే చవిచూసింది. సీఎస్కే చివరిసారిగా 180 ప్లస్ టార్గెట్ను 2018 సీజన్లో ఇదే ఎస్ఆర్హెచ్పై ఛేదించింది.ఇది కాక సీఎస్కే మరో చెత్త రికార్డును కూడా కొనసాగించింది. నిన్న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరిగిన వేదికపై (హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం) సీఎస్కే ఎనిమిదేళ్లుగా ఒక్క గెలుపూ నమోదు చేయలేదు. ఈ వేదికపై సీఎస్కేకు అతి చెత్త రికార్డు ఉంది. కాగా, నిన్నటి పరాజయం తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో సీఎస్కే బౌలర్లు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. ఆతర్వాత బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఒక్క బ్యాటర్ కుదురుగా క్రీజ్లో నిలబడినా, ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిచేదే.ఛేదనలో సగం మ్యాచ్ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 195 పరుగుల ఛేదనలో సీఎస్కే స్కోర్ 10 ఓవర్ల తర్వాత 111-3గా ఉండింది. ఈ దశలో ఆ జట్టు గెలుపు నల్లేరుపైనడకే అనుకున్నారు. అయితే ఆతర్వాత మూడు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. 11, 12, 13 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ ఓవర్లలో సీఎస్కే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది.ఆతర్వాత ఓవర్లలోనూ సీఎస్కే బ్యాటర్లు అడపాదడపా పరుగులు చేసి గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచారు. అయితే చివరి ఓవర్లలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదించదగ్గ లక్ష్యమే (6 బంతుల్లో 18 పరుగులు) కళ్ల ముందు ఉన్నా, సీఎస్కే బ్యాటర్లు దాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో సీఎస్కే ఓడింది.ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇలా అన్నాడు. ఇలాంటి పిచ్పై 195 పరుగుల లక్ష్యం ఏ రోజైనా సాధ్యమే. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30-40 పరుగులు నిరోధించగలగారు. 10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్ మాదే. కానీ ఆతర్వాత 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్ స్వరూపాన్ని మర్చేసింది. డెత్ ఓవర్లలో 12–13 రన్స్ ఛేజ్ చేయడం కష్టంగా మారింది.మా బౌలింగ్ యూనిట్ను ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ప్లేలో అభిషేక్ శర్మ బాగా ఆడినా, ఆతర్వాత మొమెంటమ్ తిరిగి పొందాం. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్ చేశారు.ముఖ్యంగా అన్షుల్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇందు కోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చాలా స్పష్టంగా తన ప్లాన్స్ చెప్పి, కెప్టెన్ నేను ఇలా చేస్తానని నమ్మకంగా చెప్పే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. మొత్తంగా అన్షుల్ ప్రతిరోజూ మెరుగుపడుతున్నాడు. రుతురాజ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్లో ఓడినా, అతని బౌలర్లపై సంతృప్తిగానే ఉన్నాడు. ఛేదించదగ్గ లక్ష్యమే అయినా, కొద్ది ఓవర్లు కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సీఎస్కే హ్యాట్రిక్ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో ఏదో స్థానంలో కొనసాగుతుంది.
ప్లాన్ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై సన్రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేసిన సన్రైజర్స్, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కేను గెలుపును అడ్డుకున్నారు.మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ మాటల్లో..యువ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్లాన్లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్లు తయారు చేసుకోవడంతో కెప్టెన్గా ఫీల్డ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్ సెషన్స్లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము.బ్యాటింగ్లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ త్వరగా ఔట్ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్లో అది జరగలేదు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.పాయింట్స్ టేబుల్పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్. ఏ మ్యాచ్కు ఆ మ్యాచ్ను టార్గెట్గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్గా ఆడటమే మా కర్తవ్యం.ఇషాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 21న జరిగే తదుపరి మ్యాచ్లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ సొంత మైదానం హైదరాబాద్లోనే జరుగనుంది.
సన్రైజర్స్ అదరహో
సన్రైజర్స్ బ్యాటింగ్ మొదలైన తీరును బట్టి జట్టు కనీసం 220కు పైగా స్కోరు చేస్తుందని అనిపించింది. అయితే చివర్లో బ్యాటర్ల వైఫల్యంతో స్కోరు 200 కూడా దాటలేదు. చెన్నై ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే ఆటను చూస్తేసునాయాసంగా ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా చెలరేగిపోయారు. బంతిపై పట్టు చేజారనీయకుండా ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఐదుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్ తీయడంతో చెన్నై చతికిలపడింది. హైదరాబాద్ ఖాతాలో మూడో గెలుపు చేరింది. అంతకుముందు అభిషేక్ శర్మ, క్లాసెన్ మెరుపులతో చెన్నైపై హైదరాబాద్ తమ అత్యధిక స్కోరును నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జోరును ప్రదర్శిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ రెండో వరుస విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో రైజర్స్ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్స్లు), క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించగా... అన్షుల్ కంబోజ్, ఒవర్టన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమైంది. మాథ్యూ షార్ట్ (30 బంతుల్లో 34; 3 ఫోర్లు), ఆయుశ్ మాత్రే (13 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా, ఇషాన్ మలింగకు 3 వికెట్లు... నితీశ్ కుమార్ రెడ్డికి 2 వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం రాగా, ప్రఫుల్ హింగే 7 పరుగులే ఇచ్చాడు. కెప్టెన్ విఫలం... షార్ట్ వేసిన తొలి ఓవర్లో 4 పరుగులే రావడంతో రైజర్స్ ఇన్నింగ్స్ ప్రశాంతంగా మొదలైంది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ దూకుడు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదిన అభిషేక్... కంబోజ్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. అయితే మరో ఎండ్లో ముకేశ్ ఓవర్లో 3 ఫోర్లు బాది ధాటిని పెంచినట్లు కనిపించిన ట్రవిస్ హెడ్ (20 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. హెడ్ను అవుట్ చేసిన ముకేశ్ తర్వాతి బంతికే కెప్టెన్ ఇషాన్ కిషన్ (0) వికెట్ కూడా తీయడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 75 పరుగులకు చేరింది. కొద్దిసేపటికే ఒవర్టన్ తన తొలి ఓవర్లోనే అభిషేక్ను వెనక్కి పంపించాడు. ఈ దశలో క్లాసెన్ కొన్ని చక్కటి షాట్లతో స్కోరు పెంచే బాధ్యత తీసుకున్నాడు. మరోవైపు అనికేత్ వర్మ (2) ప్రభావం చూపలేకపోగా, ఉప్పల్లో గత రెండు మ్యాచ్లలో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి (12; 1 సిక్స్) ఈసారి విఫలమయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్లో భారీ సిక్స్ కొట్టిన క్లాసెన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేసి ప్రత్యర్థిని నిలువరించడంలో సఫలమయ్యారు. ఆఖరి 4 ఓవర్లలో రైజర్స్ 31 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. మాత్రే మినహా... ఛేదనలో చెన్నై ఆరంభంలోనే సంజు సామ్సన్ (7) వికెట్ కోల్పోయింది. తొలి బంతికే సిక్స్ కొట్టినా అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సున్నా వద్ద తాను ఇచ్చిన క్యాచ్ను క్లాసెన్ వదిలేయడంతో బతికిపోయిన మాత్రే ఆ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. హింగే ఓవర్లోనే అతను 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 22 పరుగులు రాబట్టడం విశేషం. అయితే క్లాసెన్ అద్భుత క్యాచ్తో మాత్రే ఇన్నింగ్స్ ముగియగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (19) వైఫల్యం ఈ మ్యాచ్లోనూ కొనసాగింది. పవర్ప్లేలో జట్టు 76 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో జట్టును నడిపించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ (19 బంతుల్లో 25; 3 ఫోర్లు) తడబడుతూనే ఆడగా, షార్ట్ కూడా దూకుడు చూపించలేదు. హైదరాబాద్ మెరుగైన బౌలింగ్తో ఒత్తిడి పెరిగి జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. శివమ్ దూబే (16 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్)పై ఆశలు ఉండగా... 20 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో గెలుపు దారులు మూసుకుపోయాయి. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సామ్సన్ (బి) ఒవర్టన్ 59; హెడ్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 23; ఇషాన్ కిషన్ (సి) రుతురాజ్ (బి) ముకేశ్ 0; క్లాసెన్ (బి) కంబోజ్ 59; అనికేత్ (సి) నూర్ (బి) ఒవర్టన్ 2; నితీశ్ రెడ్డి (సి) షార్ట్ (బి) ఒవర్టన్ 12; అరోరా (సి) బ్రెవిస్ (బి) గుర్జప్నీత్ 13; లివింగ్స్టోన్ (సి) బ్రెవిస్ (బి) కంబోజ్ 1; శివాంగ్ (సి) గుర్జప్నీత్ (బి) కంబోజ్ 12; హింగే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–75, 2–75, 3–93, 4–112, 5–147, 6–177, 7–179, 8–193, 9–194. బౌలింగ్: షార్ట్ 3–0–38–0, ముకేశ్ చౌదరి 2–0–21–2, కంబోజ్ 3–0–22–3, నూర్ 4–0–33–0, ఒవర్టన్ 4–0–37–3, గుర్జప్నీత్ 4–0–34–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 7; రుతురాజ్ (సి) అరోరా (బి) మలింగ 19; మాత్రే (సి) క్లాసెన్ (బి) నితీశ్ రెడ్డి 30; షార్ట్ (సి) అనికేత్ (బి) మలింగ 34; సర్ఫరాజ్ (సి) నితీశ్ రెడ్డి (బి) మలింగ 25; బ్రెవిస్ (సి) లివింగ్స్టోన్ (బి) శివాంగ్ 0; దూబే (బి) సాకిబ్ 21; ఒవర్టన్ (సి) లివింగ్స్టోన్ (బి) హింగే 16; కంబోజ్ (నాటౌట్) 13; నూర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–15, 2–66, 3–66, 4–112, 5–113, 6–148, 7–154, 8–182. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–60–1, నితీశ్ రెడ్డి 4–0–31–2, సాకిబ్ 4–0–32–1, ఇషాన్ మలింగ 4–0–29–3, శివాంగ్ 3–0–18–1, అభిషేక్ 1–0–13–0.షార్ట్పై అభిషేక్ దాడి... ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మాథ్యూ షార్ట్ బ్యాటర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 3 బంతులాడిన అభిషేక్ 2 పరుగులే చేయగలిగాడు. అయితే ఆ తర్వాత అభిషేక్ తానేంటో షార్ట్కు చూపించాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన అతను... మూడో ఓవర్లో చెలరేగిపోయాడు. తొలి బంతికి హెడ్ సింగిల్ తీయగా... తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా 4, 4, 4, 6, 6 బాది 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 15 బంతుల్లోనే అభిషేక్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 51 పరుగుల వద్ద దూబే అతని క్యాచ్ను వదిలేసినా...దాని వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదు.ధోని ఆడలేదు... భారత స్టార్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు నిరాశ తప్పలేదు. గాయం కారణంగా టోర్నీ ఆరంభం నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని టీమ్తో పాటు హైదరాబాద్కు వచ్చాడు. శుక్రవారం ప్రాక్టీస్లో కూడా అతను పాల్గొన్నాడు. దాంతో బరిలోకి దిగవచ్చని అనిపించింది. అయితే మరోసారి ధోని పెవిలియన్కే పరిమితమయ్యాడు. 2025 సీజన్ షెడ్యూల్లో భాగంగా ఉప్పల్లో హైదరాబాద్, చెన్నై మధ్య మ్యాచే జరగలేదు. ఈసారి ఆ మ్యాచ్ వచ్చినా... ధోని ఆట మాత్రం నగర ఫ్యాన్స్ చూడలేకపోయారు. 2024లో ఆడిన మ్యాచ్లో ధోని 2 బంతులే ఎదుర్కొన్నాడు!
ఢిల్లీ ధమాకా
బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరు జట్టును బోల్తా కొట్టించింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని సాధారణ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ... ఛేదనలో చివరి వరకు పోరాడి విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళురు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (38 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా... విరాట్ కోహ్లి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు) సహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, ఎన్గిడి, కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (47 బంతుల్లో 60 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. భువనేశ్వర్ (3/26) ధాటికి 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఈ జోడీ నిలబడి ఢిల్లీని ఆదుకుంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (10 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మిల్లర్ 6, 6, 4 ఛేదనలో ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్ నాలుగో బంతికి నిసాంక (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న భువనేశ్వర్... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. కరుణ్ నాయర్ (5) సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ బాటపట్టించి ఢిల్లీని ఆత్మరక్షణలోకి నెట్టాడు. ఈ దశలో స్టబ్స్తో కలిసి ‘బర్త్డే బాయ్’ రాహుల్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అనంతరం రాహుల్ అవుట్ కాగా... అక్షర్ పటేల్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు) కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఢిల్లీ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా... షెఫర్డ్ తొలి రెండు బంతులకు రెండు పరుగులే ఇచ్చాడు. ఉత్కంఠ పెరుగుతున్న సమయంలో మిల్లర్ 6, 6, 4 కొట్టి జట్టును గెలిపించాడు. సాల్ట్ ఒక్కడే... అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరుకు... ముగిసిన విధానానికి పొంతనే లేదు. ఓపెనర్లు సాల్ట్, కోహ్లి ధాటిగా ఆడటంతో... 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లి అవుట్ కాగా... దేవదత్ పడిక్కల్ (18), కెపె్టన్ రజత్ పాటీదార్ (8), టిమ్ డేవిడ్ (26), జితేశ్ శర్మ (14), షెఫర్డ్ (1), కృనాల్ పాండ్యా (12) పెవిలియన్కు క్యూ కట్టారు. పేస్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొన్న ఆర్సీబీ బ్యాటర్లు స్పిన్ను ఎదుర్కోవడంలో తడబడ్డారు. అక్షర్ పటేల్, కుల్దీప్ కట్టిపడేయడంతో పరుగుల రాక గగనమైంది. దీంతో ఒత్తిడికి గురైన ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఆకుపచ్చ రంగు జెర్సీతో బరిలోకి దిగింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 63; కోహ్లి (సి) నిసాంక (బి) ఎన్గిడి 19; పడిక్కల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 18; పాటీదార్ (సి) రాహుల్ (బి) ముకేశ్ 8; డేవిడ్ (సి) నటరాజన్ (బి) అక్షర్ 26; జితేశ్ (సి) మిల్లర్ (బి) ఎన్గిడి 14; షెఫర్డ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; కృనాల్ పాండ్యా (రనౌట్) 12; రసిక్ సలామ్ (నాటౌట్) 0; భువనేశ్వర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–52, 2–99, 3–105, 4–131, 5–146, 6–149, 7–172, 8–172. బౌలింగ్: అఖీబ్ నబీ 3–0–36–0; ముకేశ్ 4–0–32–1; ఎన్గిడి 4–0–39–2; కుల్దీప్ 4–0–32–2; నటరాజన్ 2–0–16–0; అక్షర్ 3–0–18–2. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 1; కేఎల్ రాహుల్ (సి) కోహ్లి (బి) కృనాల్ 57; కరుణ్ నాయర్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 5; సమీర్ రిజ్వీ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 2; స్టబ్స్ (నాటౌట్) 60; అక్షర్ (రిటైర్డ్ హర్ట్) 26; మిల్లర్ (నాటౌట్) 22; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–2, 2–16, 3–18, 4–87. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–26–3; హాజల్వుడ్ 4–0–38–0; రసిక్ 4–0–40–0; కృనాల్ 4–0–24–1; సుయాశ్ 3–0–31–0; షెఫర్డ్ 0.5–0–17–0.100హోం గ్రౌండ్లో 100 మ్యాచ్లు ఆడిన తొలి ఐపీఎల్ జట్టుగా ఆర్సీబీ గుర్తింపు పొందింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ మొదలైంది. ఈ వేదికపై మొదటి మ్యాచ్, 50వ మ్యాచ్, 100వ మ్యాచ్లోనూ ఆర్సీబీ జట్టుకు ఓటమి ఎదురుకావడం గమనార్హం. హోం గ్రౌండ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో కోల్కతా నైట్రైడర్స్ (ఈడెన్ గార్డెన్స్లో 98 మ్యాచ్లు), ముంబై ఇండియన్స్ (వాంఖడే స్టేడియంలో 95 మ్యాచ్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
లెక్క సరిచేసేందుకు...
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు... నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను సమం చేయాలని హర్మన్ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. భారత జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించగా... స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, రిచా ఘోష్ విఫలమయ్యారు. ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన టీమిండియా... జోరు పెంచాల్సిన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేక ఓటమి వైపు నిలిచింది. అయితే తొలి మ్యాచ్ లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్లో సమష్టిగా సత్తా చాటేందుకు టీమిండియా రెడీ అయింది. బౌలింగ్లో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తొలి మ్యాచ్లో ఫర్వాలేదనిపించగా... వీరితో పాటు సీనియర్ బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్ కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. ఇటీవల ఆ్రస్టేలియా, శ్రీలంకపై టి20 సిరీస్లు గెలిచిన టీమిండియా... నెల రోజుల విశ్రాంతి అనంతరం సఫారీ పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్ ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగగా... ఆదివారం ‘డే మ్యాచ్’ నిర్వహించనున్నారు. మరోవైపు గత మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య సఫారీ జట్టు అదే జోరు కొనసాగిస్తూ సిరీస్లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. కెప్టెన్ వోల్వార్ట్తో పాటు, డెర్క్సన్, బ్రిట్స్, లుస్ మంచి ఫామ్లో ఉన్నారు. సఫారీ బ్యాటర్లను మన బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
విభిన్న మస్కట్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కోసం ప్రత్యేక మస్కట్ రూపొందించేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) దేశవ్యాప్త పోటీని ప్రకటించింది. 17 ఏళ్ల తర్వాత భారత్లో జరుగనున్న ఈ పోటీలకు ‘బాయ్’ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో అభిమానులు, దేశ ప్రజలను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో విభిన్న ఆలోచనలు, సరికొత్త ఆకృతులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏడాది ఆగస్టు 17–23 మధ్య న్యూఢిల్లీ వేదికగా ఈ చాంపియన్షిప్ జరగనుంది. గత దశాబ్దంలో ఈ చాంపియన్షిప్లో భారత షట్లర్లు 15 పతకాలు సాధించారు. పీవీ సింధు 2019లో చారిత్రాత్మక స్వర్ణం గెలవగా... గతేడాది సాత్విక్–చిరాగ్ జంట కాంస్యం నెగ్గింది. దేశ క్రీడా ప్రగతిని, సాంస్కృతిక వైభవాన్ని, బ్యాడ్మింటన్ విజయ యాత్రను ప్రతిబింబించే విధంగా మస్కట్ రూపకల్పన ఉండాలని ‘బాయ్’ భావిస్తోంది. వచ్చేనెల 10 వరకు జరగనున్న ఈ పోటీలో ఆసక్తిగల వారు ‘బాయ్’ అధికారిక వెబ్సైట్ https://www. badmintonindia.org/ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. విజేతకు రూ. 25 వేల నగదుతో పాటు... ఫైనల్ మ్యాచ్ వీఐపీ పాస్లు ఇవ్వనున్నారు. ‘దేశంలో బ్యాడ్మింటన్కు ఆదరణ బాగా పెరిగింది. ప్రాంతం, సంస్కృతి, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతీచోట బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ప్రపంచ చాంపియన్షిప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ను మన దేశంలో నిర్వహిస్తున్న సందర్భంగా... అభిమానులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మస్కట్ పోటీ ప్రారంభించాం’ అని ‘బాయ్’ కార్యదర్శి సంజయ్ మిశ్రా అన్నారు.
2–2తో సమం
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్ల సిరీస్ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను ‘డ్రా’ చేసుకుంది. తొలి మ్యాచ్లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది.
సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్కు చెం...
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు...
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంప...
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద...
ఢిల్లీ ధమాకా
బెంగళూరు: సొంతగడ్డపై ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్...
లెక్క సరిచేసేందుకు...
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభిం...
వారెవ్వా మిల్లర్.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు నవ్వి!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క...
ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఐపీఎల్-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాల...
క్రీడలు
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
వీడియోలు
కలిసిరాని గ్రీన్ జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
ముంబై చిత్తు.. పంజాబ్ ఘనవిజయం..
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
