ప్రధాన వార్తలు
కనికరం లేని బ్రూక్.. లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు..!
కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 27) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదాడు. మరో ఎండ్లో జో రూట్ కూడా బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. వీరిద్దరి ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది.జేకబ్ బేతెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) ఔటయ్యాక 31.1వ ఓవర్లో బ్యాటింగ్కు దిగిన బ్రూక్ తొలి బంతి నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాడు. పడ్డ బంతిని పడ్డట్టు బౌండరీ లేదా సిక్సర్కు తరలించాడు. బ్రూక్ విధ్వంసాన్ని తట్టుకోలేక లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఓ పక్క బ్రూక్ చెలరేగుతుంటే రూట్ నిదానంగా తన 20వ వన్డే శతకాన్ని (100 బంతుల్లో), 61వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేశాడు.కఠినమైన పిచ్పై వీరిద్దరు నాలుగో వికెట్కు 113 బంతుల్లో అజేయమైన 191 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 42 ఓవర్ల తర్వాత 38 పరుగులుగా (32 బంతుల్లో) ఉండిన బ్రూక్ స్కోర్ 50 ఓవర్ ముగిసే సరికి 66 బంతుల్లో అజేయమైన 136 పరుగులైంది. దీన్ని బట్టి చూస్తే బ్రూక్ విధ్వంసం ఏ రేంజ్లో కొనసాగిందో అర్దమవుతుంది. చివరి 8 ఓవర్లలో బ్రూక్ 34 బంతులు ఎదుర్కొని ఏకంగా 98 పరుగులు బాదాడు. బ్రూక్ ఇన్నింగ్స్లో మొత్తం 11 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.మరోవైపు బాధ్యతాయుతంగా సెంచరీ పూర్తి చేసిన రూట్.. జోరు మీదున్న బ్రూక్కు ఎక్కువగా స్ట్రయిక్ ఇస్తూ అజేయమైన 111 పరుగుల వద్ద (108 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్ను ముగించాడు. మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లలో రెహాన్ అహ్మద్ 24, బెన్ డకెట్ 7 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, హసరంగ, వాండర్సే తలో వికెట్ తీశారు. వెల్లాలగే (10-0-49-0), లియనగే (3-1-7-0) మినహా మిగతా లంక బౌలర్లందరినీ బ్రూక్ ఆటాడుకున్నారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డే శ్రీలంక గెలవగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.
World Cup 2026: టీమిండియా భారీ స్కోర్
జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్-2026లో ఇవాళ (జనవరి 27) యంగ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. బులవాయోలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్, ఆతిథ్య జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోర్ (352-8) చేసింది.మిడిలార్డర్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా బాధ్యతాయుతమైన సెంచరీతో (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగగా.. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్, వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (62 బంతుల్లో 61; 5 ఫోర్లు, సిక్స్) సెంచరీ వీరుడు విహాన్కు సహకరించాడు.ఆఖర్లో ఖిలన్ పటేల్ (12 బంతుల్లో 30; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 350 పరుగుల మార్కును దాటింది. మిగతా ఆటగాళ్లలో ఆరోన్ జార్జ్ 23, కెప్టెన్ ఆయుశ్ మాత్రే 21, వేదాంత్ త్రివేది 15, కనిష్క్ చౌహాన్ 3, అంబ్రిష్ 21, హెనిల్ పటేల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టటెండ చిముగోరో 3 వికెట్లు పడగొట్టగా.. పనాషే మజాయ్, కెప్టెన్ సింబరాషే మడ్జెంగెరె తలో 2, ధృవ్ పటేల్ ఓ వికెట్ తీశారు.కాగా, గ్రూప్ దశలో భారత్ వరుసగా యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్పై విజయాలు సాధించి సూపర్ సిక్స్లోకి ప్రవేశించింది. సూపర్ సిక్స్లో భాగంగానే భారత్ జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ దాయాది పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 1న బులవాయో వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
విండీస్ వీరుడి విధ్వంసం.. కేవలం 49 బంతుల్లోనే శతకం
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ పేరిట భారత్లో అరంగేట్రం చేసిన ఈ లీగ్.. నిన్ననే (జనవరి 26) మొదలైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.పది రోజుల పాటు జరిగే ఈ లీగ్లో మొత్తం 18 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ లీగ్లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.లీగ్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్లో విధ్వంసకర శతకం నమోదైంది. ఢిల్లీ వారియర్స్కు ఆడుతున్న విండీస్ ఆటగాడు చాడ్విక్ వాల్టన్ కేవలం 49 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఫలితంగా అతని జట్టు దుబాయ్ రాయల్స్ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. పీటర్ ట్రెగో (60), కిర్క్ ఎడ్వర్డ్స్ (41), అంబటి రాయుడు (36), కెప్టెన్ శిఖర్ ధవన్ (26) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూసఫ్ పఠాన్ (2), రిషి ధవన్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వారియర్స్ బౌలర్లలో సుభోత్ భాటి 3, హర్భజన్ సింగ్ 2, ఇసురు ఉడాన ఓ వికెట్ తీశారు.అనంతరం 197 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్ సునాయాసంగా ఛేదించింది. చాడ్విక్ వాల్టన్ (62 బంతుల్లో 128; 14 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో వారియర్స్ను కేవలం 16.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఓపెనర్ శ్రీవట్స్ గోస్వామి (56) సహకరించాడు. వారియర్స్ కోల్పోయిన ఏకైక వికెట్ పియుశ్ చావ్లాకు దక్కింది.
ఆ మరుక్షణమే రిటైర్మెంట్: కేఎల్ రాహుల్
టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.వికెట్ కీపర్గానూటీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్ రాహుల్ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్ కీపర్గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్గా ఉన్న అతడు మిడిలార్డర్కు డిమోట్ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్గా వచ్చాడు.మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తాప్రస్తుతానికి జట్టులో కేఎల్ రాహుల్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ముచ్చటిస్తూ..‘‘రిటైర్మెంట్ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.ఇంకాస్త సమయం ఉందినేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.మానసిక స్థితి బలహీనపడుతుందిఅయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది. ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్ రాహుల్ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కేఎల్ రాహుల్ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!An Incredibly Honest KL Rahul On Retirement 💭 pic.twitter.com/8LJcxVLpnG— The Switch | Kevin Pietersen (@kptheswitch) January 26, 2026
టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల
2026 టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్ఏ, నమీబియాకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్లు జరుగనున్నాయి.ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్ యూఎస్ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)ఈ మ్యాచ్ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్ను అదే రోజు యూఎస్ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్లో లిస్ట్-ఏ మ్యాచ్తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్కప్ టైటిల్ సాధించడంతో రిచర్డ్సన్ భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.అంతర్జాతీయ క్రికెట్తో పోలిస్తే రిచర్డ్సన్కు బిగ్బాష్ లీగ్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్ ప్రతి ఎడిషన్లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్ ఒకరు. మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్బోర్న్ రెనెగేడ్స్కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చివరిగా 2025-26 సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్ కెరీర్లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు.రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్బాష్ లీగ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్గా రిచర్డ్సన్కు మంచి గుర్తింపు ఉంది.
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో మ్యాచ్ (72)తో ఫామ్లోకి వచ్చాడు.తొలుత బ్యాటింగ్చివరగా న్యూజిలాండ్పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్ ఓడిన భారత్... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.వైభవ్ ధనాధన్ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, ఆరోన్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్ పనాషే మజాయ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో షాట్ బాదే క్రమంలో ఆరోన్.. సింబరెషెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.దీంతో వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వైభవ్ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్. 52 పరుగులు చేసిమొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్లో సింబరెషెకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్లలో విజయాలు సాధించిన భారత్కు.. సూపర్ సిక్స్ దశలో ఇదే తొలి మ్యాచ్. తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.జింబాబ్వేనథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!𝙒𝙞𝙙𝙩𝙝 𝙤𝙣 𝙤𝙛𝙛𝙚𝙧, & Vaibhav Sooryavanshi accepted it with interest! 🤌Team India are off to a flying start💥#ICCMensU19WC | #INDvZIM 👉 LIVE NOW ➡️ https://t.co/ty11gF03Wh pic.twitter.com/tEXWCDWeuA— Star Sports (@StarSportsIndia) January 27, 2026
స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026లో వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి ముందుగానే ప్లే ఆఫ్స్ చేరిన స్మృతి మంధాన సేన జోరుకు ఆ తర్వాత బ్రేక్ పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో తొలి ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. సోమవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలోనూ పరాజయం పాలైది.రిచా ఘోష్ భేష్ఈ నేపథ్యంలో ఓటమి స్పందిస్తూ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఆటను మేమంతా ఆస్వాదించాము. నదైన్ డిక్లెర్క్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. నాట్ వరల్డ్క్లాస్ ప్లేయర్. ఒకచోట పడిన బంతిని మూడు వేర్వేరు విధాలుగా షాట్లు బాదగల సత్తా ఆమెకు ఉంది.నాట్ మ్యాచ్ను ముంబై వైపు తిప్పేసింది. అద్భుతంగా ఆడి జట్టును గెలిపించుకుంది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. తొలి ఐదు మ్యాచ్లలో మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. కానీ రోజు మా వాళ్లు సరైన రీతిలో బౌలింగ్ చేయలేదు. టీ20 క్రికెట్లో ఇలాంటివి సహజమే.మా బౌలర్లు విఫలమయ్యారుకొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి. ఏదేమైనా లారెన్ బెల్ కొత్త బంతితో అద్బుతంగా ఆడింది. ఆ తర్వాత తిరిగి వచ్చి కూడా తన వంతు సహకారం అందించింది. కానీ మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా ఈరోజు సరిగ్గా ఆడలేదు. నదైన్ మాత్రం రెండు కష్టతరమైన ఓవర్లను అద్భుతంగా వేసింది’’ అని పేర్కొంది. ముంబై చేతిలో తమ ఓటమికి బౌలర్లే కారణమని స్మృతి మంధాన విశ్లేషించింది.కాగా ఆర్సీబీతో మ్యాచ్లో ముంబై బ్యాటర్ నాట్ సివర్ బ్రంట్ (57 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు శతకం బాదింది. తద్వారా వడోదరలో సోమవారం జరిగిన పోరులో ముంబై 15 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఓడింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 90; 10 ఫోర్లు, 6 సిక్స్లు) మాత్రమే చివరి వరకు వీరోచిత పోరాటం చేసింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటైంది. చదవండి: WPL 2026: చరిత్ర సృష్టించిన నాట్ సివర్ బ్రంట్.. తొలి ప్లేయర్గా
ICC: బంగ్లాదేశ్కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్లు.. ముఖ్యంగా భారత్లో జరిగిన మ్యాచ్లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!
T20 WC: పాపం బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ సానుభూతి
అనూహ్య పరిస్థితుల్లో స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు అర్హత సాధించింది. భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం స్కాట్లాండ్ పాలిట వరంగా మారింది. ర్యాంకుల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ జట్టును ప్రపంచకప్ టోర్నీలో చేర్చింది.రిచీ బెరింగ్టన్ సారథ్యంలోఈ నేపథ్యంలో స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వరల్డ్కప్ టోర్నీ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రిచీ బెరింగ్టన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. జైనుల్లా ఎహ్సాన్కు తొలిసారి జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్లో జన్మించిన ఈ ఫాస్ట్బౌలర్ ఇటీవలే స్కాట్లాండ్ తరఫున ఆడేందుకు అర్హత సాధించాడు.న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైతంఅంతేకాకుండా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. అతడి రాకతో స్కాటిష్ జట్టు బ్యాటింగ్ లైనప్ బలపడినట్లయింది. 34 ఏళ్ల టామ్ న్యూజిలాండ్ తరఫున 17 టీ20 మ్యాచ్లు ఆడాడు.ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగం కానుండటం ఇది ఏడోసారి. అయితే, ఈసారి ఈ యూరోపియన్ జట్టు నేరుగా అర్హత సాధించకుండా.. బంగ్లాదేశ్ను ఐసీసీ తొలగించడం ద్వారా తమ ర్యాంకు ఆధారంగా క్వాలిఫై అయింది.బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల సానుభూతిఈ విషయంపై క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రూడీ లిండ్బ్లేడ్ స్పందించారు. బంగ్లాదేశ్ జట్టు పట్ల తమకు సానుభూతి ఉందని ఆమె తెలిపారు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఈ విధంగా వరల్డ్కప్ టోర్నీలో పాల్గొనాలని మేము అనుకోలేదు.క్వాలిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఈవెంట్లో అడుగుపెట్టాలని భావించాము. అయితే, అనుకోని విధంగా మాకు ఆహ్వానం వచ్చింది. ఏదేమైనా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల మాకు సానుభూతి ఉంది. వారి విషయంలో జరిగిన దానికి మేము చింతిస్తున్నాం’’ అని ట్రూడీ తెలిపారు.మేమేమీ తక్కువ కాదుఅయితే, తమ జట్టు కూడా తక్కువేమీ కాదని.. ప్రపంచంలో తాము పద్నాలుగో ర్యాంకులో ఉన్నట్లు ట్రూడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కష్టం లేకుండానే తాము టీ20 వరల్డ్కప్ ఆడబోతున్నామంటూ వస్తున్న విమర్శలు సరికావని.. గత కొన్నేళ్లుగా తాము అద్భుత విజయాలు సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.కాగా భారత్తో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ పట్టు పట్టింది. ఇందుకు నిరాకరించిన ఐసీసీ.. బంగ్లాను టోర్నీ నుంచి తొలగించి స్కాట్లాండ్తో ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి స్కాట్లాండ్ జట్టురిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఎహ్సాన్, మైకేల్ జోన్స్, మైకేల్ లీస్క్, ఫిన్లే మెక్క్రీత్, బ్రాండన్ మెకల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వ్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్బ్రైడ్, చార్లీ టియర్.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!
శ్రమించిన సబలెంకా
మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్...
క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్న...
గుకేశ్కు తొలి గెలుపు
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర...
శ్రీకాంత్ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్...
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్...
స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకు మరో ఓటమి...
ICC: బంగ్లాదేశ్కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి ...
T20 WC: పాపం బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ సానుభూతి
అనూహ్య పరిస్థితుల్లో స్కాట్లాండ్ టీ20 ప్రపంచకప్-...
క్రీడలు
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వీడియోలు
ఊచకోత అంటే ఇదే..
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
