Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: team india set 210 runs target to namibia1
ఇషాన్‌ విధ్వంసం, హార్దిక్‌ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12; సిక్స్‌) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

Ishan becomes the first Indian WK batter to score a fifty in T20 World Cup history2
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు ఏ భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్‌ (2007, 2024) అయినా, ఓ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం​ నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్‌ సెంచరీఈ రికార్డు హాఫ్‌ సెంచరీని ఇషాన్‌ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్‌.. ఆమరుసటి ఓవర్‌లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్‌ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో వరుసగా మరో సిక్సర్‌, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్‌ తొలి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్‌ ధాటికి భారత్‌ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్‌ సిక్సర్లు, బౌండరీ ​కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్‌ ఔటయ్యాక భారత స్కోర్‌ కాస్త నెమ్మదించింది.హార్దిక్‌ లైన్‌లోకి వచ్చాడుఅయితే హార్దిక్‌ పాండ్యా రాకతో భారత స్కోర్‌ మళ్లీ జోరందుకుంది. హార్దిక్‌ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 205/5గా ఉంది. శివమ్‌ దూబే (23), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

Abhishek Sharma doubtful for IND vs PAK T20 World Cup match, SKY confirms injury setback3
T20 WC 2026: బాంబు పేల్చిన సూర్యకుమార్‌ యాదవ్‌

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 12) భారత్‌, నమీబియా మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఓ బాంబు లాంటి విషయాన్ని చెప్పాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపాడు. అభిషేక్‌ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్‌ అయ్యే అవకాశముందని అన్నాడు. ఈ లెక్కన అభిషేక్‌ నమీబియా మ్యాచ్‌తో పాటు ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని చెప్పకనే చెప్పాడు.యూఎస్‌ఏ మ్యాచ్‌ సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడిన అభిషేక్‌.. సమస్య అధికం కావడంతో కొద్ది రోజుల కిందట ఆసుపత్రిలో చేరాడు. నిన్ననే అభిషేక్‌ డిశ్చార్జ్‌ అయ్యాడని వార్తలు వచ్చినప్పటికీ.. ఇవాళ టీమిండియా కెప్టెన్‌ చెప్పిన మాటలను బట్టి చూస్తే అభిషేక్‌ ఆరోగ్యం ఇం​కా కుదుటపడలేదని స్పష్టంగా తెలుస్తుంది. అభిషేక్‌ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా దూరమైతే టీమిండయాకు ఎంతోకొంత మైనస్‌ అవుతుంది. అభిషేక్‌ ఇటీవలికాలంలో భారత విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు. అతడు ఇచ్చే మెరుపు ఆరంభాలే మ్యాచ్‌ ఫలితాన్ని భారత్‌కు అనుకూలంగా మార్చాయి. అలాంటి అభిషేక్‌ ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది.కాగా, నమీబియాతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. అలాగే ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ మరో మార్పు కూడా చేసింది. గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్‌ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు.గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్న సంజూఅభిషేక్‌ కడుపు సమస్యతో బాధపడుతుండటంతో నమీబియా మ్యాచ్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ అందివచ్చిన గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్నాడు. తొలి మూడు బంతులను జాగ్రత్తగా ఆడిన సంజూ.. ఆతర్వాత వరుసగా మూడు సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే ఆతర్వాతి బంతికే బౌలర్‌ బెన్‌ షికోంగో ఉచ్చులో (స్లో బాల్‌) చిక్కి వికెట్‌ సమర్పించుకున్నాడు. మొత్తంగా సంజూ ఈ ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 35 పరుగులుగా ఉంది. ఇషాన్‌ కిషన్‌ 11, తిలక్‌ వర్మ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.తుది జట్లు..భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

Jos Buttler Enters Guinness World Records With The Highest Catch Ever4
T20 WC 2026: గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కిన జోస్‌ బట్లర్‌

ఇంగ్లండ్‌ వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జోస్ బట్లర్‌ తన అసమాన క్యాచింగ్‌ ప్రతిభతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బట్లర్ 122 మీటర్ల ఎత్తు నుంచి డ్రోన్ ద్వారా వదిలిన బంతిని పట్టుకుని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్యాచ్ పట్టిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు. బట్లర్‌కు ముందు ఈ ఫీట్‌ను సాధించేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఎవరి వల్ల కాలేదు.బట్లర్‌ మాత్రం తన అద్భుతమైన హ్యాండ్‌-ఐ కమ్యూనికేషన్‌తో, బంతిపైనే పూర్తి ఏకాగ్రత ఉంచి అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకున్నాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ బ్యాటర్‌ తిమోతి షానన్ జెబ్సీలన్ పేరిట ఉండేది. 2021లో తిమోతి 119.86 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టుకుని రికార్డు సృష్టించాడు. తాజాగా బట్లర్ తిమోతి రికార్డును అధిగమించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ప్రవేశించాడు. Jos Buttler Breaks World Record For Highest Cricket Catch! 🤯 pic.twitter.com/AZaZQtY0v2— The Switch | Kevin Pietersen (@kptheswitch) February 11, 2026ఈ ఫీట్‌కు క్రికెట్‌తో ఏ సంబంధం లేనప్పటికీ.. ఈ అనుభవం మాత్రం బట్లర్‌కు ఆన్‌ ఫీల్డ్‌ చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డింగ్‌ సమయంలో ఎప్పుడైనా ఇలాంటి పరీక్ష ఎదురైతే బట్లర్‌ తప్పక సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంటుంది. బట్లర్‌ ఇప్పటికే ఆన్‌ ఫీల్డ్‌లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకున్నాడు. వికెట్‌కీపర్‌గానే కాకుండా ఫీల్డర్‌గానూ పలు మంచి అనుభవాలు కలిగి ఉన్నాడు. తాజా అనుభవం (గిన్నిస్‌ రికార్డు) మాత్రం బట్లర్‌ను చాలా ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ గిన్నిస్‌ రికార్డు ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.ఇదిలా ఉంటే, బట్లర్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌ ఇటీవలికాలంలో ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ప్రపంచకప్‌లోనూ బట్లర్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. నేపాల్‌తో మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతను.. నిన్న వెస్టిండీస్‌పై 21 పరుగులకు ఔటయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లో బట్లర్‌కు శుభారంభాలే లభించినా, పెద్ద స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు.బట్లర్‌ ఫామ్‌లాగే, మెగా టోర్నీ ఇంగ్లండ్‌ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. తొలుత పసికూన నేపాల్‌ చేతిలో తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్న ఈ జట్టు.. నిన్న విండీస్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో విండీస్‌, స్కాట్లాండ్‌, ఇటలీ తర్వాత నాలుగో స్థానంలో ఉంది.

T20 WC 2026 IND VS NAM: Namibia won the toss and choose to bowl, here are playing XI5
నమీబియాతో మ్యాచ్‌.. టీమిండియాలో రెండు మార్పులు

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) రాత్రి 7 గంటలకు భారత్‌ వర్సెస్‌ నమీబియా మ్యాచ్‌ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు ఇన్‌ఫెక్షన్‌ నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. అలాగే గత మ్యాచ్‌లో (యూఎస్‌ఏ) జ్వరం కారణంగా ఆడలేకపోయిన బుమ్రా ఈ మ్యాచ్‌తో తిరిగి వచ్చాడు. సిరాజ్‌ స్థానంలో అతను బరిలో దిగనున్నాడు. మరోవైపు నమీబియా కెప్టెన్‌ కూడా ఈ మ్యాచ్‌లో కోసం రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.తుది జట్లు..భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

Italy stuns Nepal in T20 World Cup 20266
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం

ఇటలీ క్రికెట్‌ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్‌ జట్టు ప్రపంచకప్‌లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్‌ 2026 బెర్త్‌ దక్కించుకుంది.తొలి ప్రపంచకప్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం​ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న నేపాల్‌పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్‌ జట్టు టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్‌ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్‌-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇటలీ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ వేన్‌ మ్యాడ్‌సన్‌ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్‌సన్‌ స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.తొలి మ్యాచ్‌లో ఇటలీకి స్కాట్లాండ్‌ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్‌ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.తిప్పేసిన స్పిన్నర్లుటాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ నేపాల్‌ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్‌ చేసింది. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు.నేపాల్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.మోస్కా బ్రదర్స్‌ అదుర్స్‌124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్‌ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్‌ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. జస్టిన్‌, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్‌ఈ మ్యాచ్‌లో మోస్కా బ్రదర్స్‌ చరిత్ర సృష్టించారు. తొలి వికెట​్‌కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అ‍న్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు.

T20 WC 2026: nepal all out for 123 runs in a match vs italy7
మొన్న ఏమో ఇంగ్లండ్‌ను గడగడలాడించారు.. ఇప్పుడేమో ఇటలీ ముందు..!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో రెండు రోజుల కిందట పటిష్టమైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసిన పసికూన నేపాల్‌, ఇవాళ (ఫిబ్రవరి 12) వారి కంటే చిన్న జట్టైన ఇటలీ ముందు తేలిపోయింది. మొన్న తన మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ బౌలర్లను గడగడలాడించిన లోకేశ్‌ బామ్‌.. ఇవాళ ఇటలీ బౌలర్ల ముందు తస్సుమన్నాడు. లోకేశ్‌తో పాటు ఏ ఒక్క ఆటగాడు కూడా సత్తా చాటలేకపోవడంతో ఇటలీతో మ్యాచ్‌లో నేపాల్‌ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది.27 పరుగులు చేసిన ఆరిఫ్‌ షేక్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్‌ షేక్‌ (20), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (23), దీపేంద్ర సింగ్‌ ఎయిరీ (17), కరణ్‌ కేసి (18 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్‌ భుర్టెల్‌, సందీప్‌ లామిచ్చేన్‌ చెరో 5, లోకేశ్‌ బామ్‌, గుల్షన్‌ ఝా తలో 3, నందన్‌ యాదవ్‌ మరియు లలిత్‌ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇటలీ అన్ని విభాగాల్లో నేపాల్‌ను కట్టడి చేసింది. ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. స్పిన్నర్లు క్రిషన్‌ కలుగమగే (4-0-18-3), బెన్‌ మనెన్టి (4-0-9-2), స్మట్స్‌ (4-0-22-1) నేపాల్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్‌, జస్ప్రీత్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నేపాల్‌ను దెబ్బేశారు.

IPL Unsold Players Who Got Crores In PSL Auction 20268
ఐపీఎల్‌లో అమ్ముడుపోని వారిపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కనకవర్షం

ఐపీఎల్‌ 2026 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పలువురు విదేశీ ఆటగాళ్లపై పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో కనకవర్షం కురిసింది. పీఎస్‌ఎల్‌లో తొలిసారి వేలం విధానాన్ని ప్రవేశపెట్టగా, కొందరు విదేశీ స్టార్ల కోసం​ ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఫలితంగా కొందరు ఫారిన్‌ ప్లేయర్లకు ఊహించని ధర లభించింది. జాక్‌పాట్‌ కొట్టిన ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌, ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఉన్నారు.ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోక, పీఎస్‌ఎల్‌ వేలంలో భారీ మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు..డారిల్ మిచెల్: ఈ న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు ఐపీఎల్‌ 2026 వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్‌ విభాగంలో పోటీపడ్డా, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ పీఎస్‌ఎల్‌లో మాత్రం మిచెల్‌పై కనకర్షం కురిసింది. ఇతన్ని రావల్పిండి ఫ్రాంచైజీ ఏకంగా 8.05 కోట్ల పాక్‌ కరెన్సీకి కొనుగోలు చేసింది. ఈ మొత్తం భారత రూపాయల్లో 2.59 కోట్లవుతుంది.ఆడమ్ జంపా: ఐపీఎల్‌ 2025లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను ఐపీఎల్‌ 2026లో వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్‌ఎల్‌ బాట పట్టాడు. అక్కడ అతన్ని కరాచీ కింగ్స్‌ ఫ్రాంచైజీ 4.5 కోట్లకు (పాక్‌ కరెన్సీ) కొనుగోలు చేసింది. భారత కరెన్సీలో ఇది రూ. 1.46 కోట్లకు సమానమవుతుంది.రిలీ రొస్సో: ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో (2025, 2026) అన్‌ సోల్డ్‌గా మిగిలిపోయిన సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్‌ రిలీ రొస్సోను క్వెట్టా గ్లాడియేటర్స్ అనే ఫ్రాంచైజీ 5.5 కోట్ల పాక్‌ కరెన్సీకి సొంతం చేసుకుంది. ఇది భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లకు సమానం.పీఎస్‌ఎల్‌-2026 వేలంలో భారీ ధర దక్కించుకున్న విదేశీ ఆటగాళ్లు.. మార్క్‌ చాప్‌మన్‌- 7 కోట్లు (పాక్‌ కరెన్సీలో)ఆస్టన్‌ టర్నర్‌- 4.2 కోట్లుమైఖేల్‌ బ్రేస్‌వెల్‌- 4.2 కోట్లుకుసాల్‌ మెండిస్‌- 4.2 కోట్లుటామ్‌ కర్రన్‌- 4.2 కోట్లుకుసాల్‌ పెరీరా- 3.1 కోట్లుజేమ్స్‌ విన్స్‌- 3 కోట్లురిషద్‌ హొసేన్‌- 3 కోట్లు వీరితో పాటు పీటర్‌ సిడిల్‌, జోష్‌ ఫిలిప్‌, తబ్రేస్‌ షంషి, జాన్సన్‌ ఛార్లెస్‌, మ్యాక్స్‌ బ్రయాంట్‌, షమార్‌ జోసఫ్‌, ఓట్నీల్‌ బార్ట్‌మన్‌, గుడకేశ్‌ మోటీ, రిచర్డ్‌ గ్లీసన్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, దసున్‌ షనక, సామ్‌ హార్పర్‌, బెవాన్‌ జాకబ్స్‌ తదితర ఆటగాళ్లకు కూడా పీఎస్‌ఎల్‌ వేలంలో ఓ మోస్తరు ధర లభించింది.పీఎస్‌ఎల్‌లో అమ్ముడుపోని ప్రముఖుల్లో షకీబ్‌ అల్‌ హసన్‌, కైల్‌ మేయర్స్‌, కొలిన్‌ మున్రో, అల్జరీ జోసఫ్‌, జేమ్స్‌ నీషమ్‌, జేసన్‌ రాయ్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, డేవిడ్‌ మలాన్‌, కేశవ్‌ మహారాజ్‌ తదితరులు ఉన్నారు.

T20 WC: Afghanistan Nabi Handed Hefty Penalty By ICC Reason Is9
T20 WC 2026: మహ్మద్‌ నబీకి షాకిచ్చిన ఐసీసీ

అఫ్గనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధించింది. టీ20 ‍ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌- సౌతాఫ్రికా మధ్య బుధవారం మ్యాచ్‌ జరిగింది. అహ్మదాబాద్‌లో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు తొలుత బౌలింగ్‌ చేసింది.సమ ఉజ్జీలుగాఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్‌ సైతం 19.4 ఓవర్లలో సరిగ్గా 187 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా పేసర్‌ లుంగి ఎంగిడి మూడు వికెట్లతో రాణించాడు. అఫ్గన్‌ కీలక ఆటగాళ్లను అవుట్‌ చేసి‌ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు.రెండు సూపర్‌ ఓవర్లుఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. అఫ్గన్‌- ప్రొటిస్‌ ఈసారి కూడా చెరో పదిహేడు పరుగులు చేసి సమంగా నిలిచాయి. దీంతో రెండో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. ఈసారి సౌతాఫ్రికా పైచేయి సాధించి గెలుపు జెండా ఎగురవేసింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. జార్జ్‌ లిండే బౌలింగ్‌లో ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే, తాను క్రీజులో ఉన్న వేళ.. అఫ్గన్‌ పద్నాలుగో ఇన్నింగ్స్‌లో నబీ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.అంపైర్‌తో వాగ్వాదంలుంగి ఎంగిడి ధరించిన రిస్ట్‌ బ్యాండ్‌ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అంపైర్‌తో గొడవపడ్డందుకు ఐసీసీ నబీకి జరిమానా వేసింది. ఈ మేరకు ‘‘ఐసీసీ ప్యానెల్‌ మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ గిల్బర్ట్‌ ముందు నబీ తన తప్పును అంగీకరించాడు. కాబట్టి తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది.అతడి మ్యాచ్‌ ఫీజులో పదిహేను శాతం కోత విధిస్తున్నాం. గడిచిన 24 నెలల కాలంలో ఇదే అతడి మొదటి తప్పిదం కావున ఒక్క డిమెరిట్‌ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. చదవండి: T20 WC IND vs NAM: మాకు అన్యాయం: నమీబియా కెప్టెన్‌ ఆరోపణలు

T20 WC 2026: Oman player Mohammad Nadeem becomes the oldest batter to score 50 plus in a T20 WC match10
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్‌ ప్లేయర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, ఒమన్‌ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. కుసాల్‌ మెండిస్‌ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్‌ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ దసున్‌ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్‌ మిషారా 8, కమిందు మెండిస్‌ 19 (నాటౌట్‌), వెల్లాలగే 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఒమన్‌ బౌలర్లలో షా ఫైసల్‌ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్‌ రామనంది (4-0-41-2), సూఫ్యాన్‌ మెహమూద్‌ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్‌ ఖాన్‌ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్‌ కలీమ్‌ 6, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌ 1, హమ్మద్‌ మీర్జా 9, వినాయక్‌ శుక్లా 1, నదీం ఖాన్‌ 2, సూఫ్యాన్‌ మెహమూద్‌ 1, షా ఫైసల్‌ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్‌), జితేన్‌ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్‌ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్‌ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం​ వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో వెస్టిండీస్‌పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్‌లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్‌ 2024 ఎడిషన్‌లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement