ప్రధాన వార్తలు
అభిషేక్ను చూసి అసూయపడేవారు!
టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి. పెళ్లి చేసుకో భాయ్..అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది.ఇద్దరి కథ ఒకటే..అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి. అయితే సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో ఫామ్ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇండియానా వెల్స్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి జరిగిన పురుషుల సెమీఫైనల్లో రష్యా స్టార్ డానిల్ మెద్వదెవ్ చేతిలో 6-3, 7-6(7/3)తో అల్కరాజ్ ఓటమి చవిచూశాడు. కేవలం రెండు సెట్ల పాటు జరిగిన మ్యాచ్లో మెద్వదెవ్ను అల్కరాజ్ ప్రతిఘటించలేకపోయాడు. తొలి సెట్ను మెద్వదెవ్ సులువుగా కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో అల్కరాజ్, మెద్వదెవ్ మధ్య రసవత్తరపోరు సాగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైబ్రేక్కు దారి తీసింది. అయితే టైబ్రేక్లో మెద్వదెవ్ మరోసారి తన స్ట్రోక్ పవర్ చూపించి అల్కరాజ్ దెబ్బకొట్టడంతో పాటు టోర్నీ ఫైనల్లో ప్రవేశించాడు. అయితే అల్కరాజ్ ఇండియన్ వెల్స్ టోర్నీ సెమీఫైనల్ వరకు వరుసగా 16 మ్యాచ్ల్లో విజయం సాధించి ఒక టైటిల్ ఫెవరెట్గా నిలిచాడు. ఈ ఏడాది వరుస విజయాలతో దుమ్మురేపిన అల్కరాజ్ కాలిఫోర్నియన్ డెసెర్ట్లో వరుసగా మూడో టైటిల్ సాధిస్తాడని అనుకన్నప్పటికీ అతని ఆశలకు మెద్వదెవ్ గండి కొట్టాడు. మరోవైపు మెద్వదెవ్కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం. గత నెలలో దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మెద్వదెవ్ విజయం సాధించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో మెద్వదెవ్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో 2023, 2024లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్కే పరిమితమయ్యాడు. తాజాగా మూడో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధించాలనే కసితో మెద్వదెవ్ ఉన్నాడు. మరో సెమీస్లో ప్రపంచ రెండో ర్యాంకర్ జానిక్ సిన్నర్ 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిన్నర్తో మెద్వదెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.చదవండి: ‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
‘పాక్, బంగ్లా నాటకం ఫలించలేదు’
ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత్లో భద్రతా కారణాల రీత్యా తమ ఆటగాళ్లను పంపలేమంటూ సాకులు చెప్పి వరల్డ్కప్కు దూరంగా ఉండిపోయింది. వేదికలను మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఐసీసీ ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు ముప్పు లేదని, తాము భరోసా కల్పిస్తామని పేర్కొంది. అయినా కూడా బంగ్లాదేశ్ జట్టు మాట వినకుండా టోర్నీ నుంచి వైదొలిగింది అయితే బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు అప్పట్లో కొత్త డ్రామాకు తెరతీసింది. అయితే ఐసీసీ హెచ్చరికలు, మాజీ ఆటగాళ్ల విమర్శలతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్ టీమిండియాతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్ ముంగిట పాకిస్థాన్, బంగ్లాదేశ్లు ఆడిన డ్రామాల గురించి ఐసీసీ చైర్మన్ జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వరల్డ్కప్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసీసీ ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగాటోర్నీని నిర్వహించాం. పాక్, బంగ్లాదేశ్ నాటకాలు ఫలించలేదు.ఐసీసీ చైర్మన్గా నేను ఒకటే మాట చెప్పదలచుకున్నా.. ఐసీసీ కంటే కూడా ఏ జట్టూ గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. ఇక ఈసారి ప్రపంచకప్ వ్యూయర్షిప్ పరంగానూ కొత్త రికార్డులకు నాంది పలికింది. ఓవరాల్ వీక్షణలోనూ పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. భారత్కు అమెరికా, పాకిస్థాన్కు నెదర్లాండ్స్ గట్టిపోటీనిస్తే, పటిష్ఠమైన ఆస్ట్రేలియాను జింబాబ్వే మట్టికరిపించింది. మరోవైపు ఇంగ్లండ్కు నేపాల్ ఓటమి భయం చూపించింది. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రత్యేక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఉన్నతస్థాయి నుంచి అథమ స్థాయికి పడిపోవడానికి నెలల సమయం చాలు. కానీ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి మాత్రం సంవత్సరాలు పడతాయి. శ్రమిస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: న్యూజిలాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం
న్యూజిలాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం
న్యూజిలాండ్ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రోటీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.మార్క్రమ్, డికాక్, రబాడ, ఎంగిడి వంటి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్ మహారాజ్ సారథ్యంలో ప్రోటీస్ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బ్యాటర్లలో నీషమ్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం 92 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమించింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్హైజెన్(45) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఫలితంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా మార్చి 17న జరగనుంది.చదవండి: మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
కుప్పకూలిన న్యూజిలాండ్.. 91 పరుగులకే ఆలౌట్
మౌంట్ మౌంగానుయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సఫారీ బౌలర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.దీంతో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అయితే డెవాన్ కాన్వే(1), టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి తమ మార్క్ చూపించలేకపోయారు.ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. మౌంట్ మౌంగానుయ్ వేదికలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ వేదికలో న్యూజిలాండ్పై పాకిస్తాన్ 105 పరుగులకు ఆలౌటైంది.తుది జట్లుదక్షిణాఫ్రికా: కానర్ ఎస్టర్హుయిజెన్(వికెట్ కీపర్), జోర్డాన్ హెర్మాన్, టోనీ డి జోర్జీ, రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫారెస్టర్, జార్జ్ లిండే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్), న్కోబాని మోకోనా, ఓట్నీల్ బార్ట్మన్న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్కీపర్), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కోల్ మెక్కాంచీ, కైల్ జామిసన్, బెన్ సియర్స్చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్
న్యూ లుక్లో విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిస్తున్నాడు. ఈ కొత్త లుక్ను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జార్డన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోహ్లి దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ కొత్త లుక్తో బరిలోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన న్యూ లుక్తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కాగా విరాట్ ప్రస్తుతం లండన్లోనే ఉన్నాడు. కోహ్లి త్వరలోనే ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు.ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by Jordan Tabakman (@jordantabakman)తొలిసారి ఛాంపియన్స్కాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్ కోహ్లిది కీలక పాత్ర. గత సీజన్లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఈ ఏడాది సీజన్లో కొనసాగించాలని చేజ్ మాస్టర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. తను చివరిగా ఆడిన న్యూజిలాండ్ సిరీస్లోనూ కోహ్లి దుమ్మలేపాడు.చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్
తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో శనివారం దేవిశా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.దీంతో సూర్య- దేవిశా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికి 2010లో ముంబైలోని ఆర్.ఎ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఈ జంట 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. దేవిషా వృత్తిరీత్యా భరతనాట్యం కోచ్. ఆమె సూర్య కెరీర్ ఆరంభం నుంచి అతడికి అండగా ఉంటూ వస్తోంది. ఎన్నో సందర్బాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. కాగా సూర్య ఇటీవల కెప్టెన్గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ను అందించిన సంగతి తెలిసిందే.Baby shower of Suryakumar Yadav and Devika 😍❤️ pic.twitter.com/rYudGduOPE— Jeet (@JeetN25) March 14, 2026చదవండి: సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?
'మీ భద్రత మీ చేతుల్లోనే'.. సల్మాన్ రనౌట్పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా రనౌటైన తీరు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొంతమంది సల్మాన్ అఘాకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొంత మంది అతడిదే తప్పు అంటూ అభిప్రాయపడుతున్నారు.అయితే తాజాగా ఈ విచిత్ర రనౌట్పై రావల్పిండి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ సల్మాన్ అవుట్ను ఉదాహరణగా తీసుకున్నారు. "రోడ్డు మీద అయినా, మైదానంలోనైనా మీ భద్రత మీ చేతుల్లోనే ఉంటుంది.మిమ్మల్ని మీరు నమ్మండి, అప్రమత్తంగా ఉండండి. సేఫ్గా ఉండడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోండి"అంటూ రోడ్డపై మిరాజ్-సల్మాన్ ఉన్న ఫోటోను పోలీసులు షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అసలేమి జరిగిందంటే?ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 39వ ఓవర్ వేసిన మొహది హసన్ మిరాజ్ బౌలింగ్లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్వైపు షాట్ ఆడాడు. బంతి నాన్స్ట్రైకర్లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్కు అందించే ప్రయత్నం చేశాడు.అయితే ఇదే సమయంలో మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్ను పడగొట్టాడు. అప్పటికే సల్మాన్ క్రీజు బయట ఉండడంతో థర్డ్ అంపైర్గా రనౌట్గా ప్రకటించాడు. బంగ్లా ప్లేయర్లు రనౌట్కు అప్పీల్ చేయడంపై సల్మాన్ అగ్రహం వ్యక్తం చేశాడు. గ్లౌవ్స్, హెల్మెట్ నేలకేసి కొడుతూ బంగ్లా ప్లేయర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై ఐసీసీ కూడా కూడా అతడిని మందలించింది. సల్మాన్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు.చదవండి: సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?Whether on the road or on the playing field, safety begins with personal responsibility.Trust yourself, stay alert, and make wise decisions to keep yourself and others safe.#SafePunjab #trafficawareness #RoadSafety #StayAlert pic.twitter.com/m3gGu1qFWh— City Traffic Police, Rawalpindi (@ctprwp) March 13, 2026
మా జట్లను చూస్తుంటే గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
విశ్వవేదికపై భారత పురుషల, మహిళల జట్లు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. వరుసగా రెండు ఐసీసీ వరల్డ్కప్ టైటిల్స్ గెలుచుకుని తమ సత్తాను మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాయి. గతేడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ నిలిచింది. ముంబై వేదికగా జరిగిన జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించిన ఉమెన్ ఇన్ బ్లూ.. తొలి వరల్డ్కప్ టైటిల్ను ముద్దాడింది.ఈ చారిత్రత్మక విజయం భారత క్రీడారంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన మెన్స్ టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్స్గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా అతరించింది.వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో హర్మన్, సూర్య బృందాలపై టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్లు సాధించిన విజయాల పట్ట తనకు ఎంతో గర్వంగా ఉందని రోహిత్ అన్నాడు."విజయాల వెనుక ప్రత్యేకమైన రహస్యాలు ఏమి లేవు. కేవలం కఠోర శ్రమ మాత్రమే ఉంది. ఈ విజయాలను అందుకోవడానికి ఎంతో శ్రమించారు. మైదానంలో ఆడే ఆటగాళ్లే కాకుండా, తెర వెనుక పని చేసే ఎంతో మంది సిబ్బంది కృషి కూడా ఈ విజయాల్లో దాగి ఉంది. వారందరికీ ఈ క్రెడిట్ దక్కాలి.గత రెండేళ్లలో మా జట్లు సాధించిన విజయాల పట్ల చాలా గర్వంగా ఉంది. కేవలం పురుషల జట్టు మాత్రమే కాదు ముంబైలో ఉమెన్స్ టీమ్ కూడా అద్భుతం చేసింది. ఈ విజయాల జోరును ఇలాగే కొనసాగిస్తూ.. భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని మేజర్ టైటిళ్లను గెలవాలని ఆశిస్తున్నా" అని రోహిత్ ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.చదవండి: సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
భారత చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి కొత్త రికార్డు సృష్టించాడు. అస్సాంలోని గువాహటికి చెందిన 17 ఏళ్ల మయాంక్... తాజాగా గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. తద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి గ్రాండ్మాస్టర్గా నిలిచిన తొలి ప్లేయర్గా మయాంక్ కొత్త చరిత్ర లిఖించాడు.2024లోనే ఇంటర్నేషనల్ మాస్టర్ గుర్తింపు సాధించిన మయాంక్ తాజాగా యూరప్లో జరుగుతున్న టోర్నమెంట్లో... స్వీడన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఫిలిప్ లిండ్గ్రెన్పై విజయం సాధించి గ్రాండ్మాస్టర్ హోదాకు కావాల్సిన మూడో జీఎమ్ నార్మ్ సొంతం చేసుకున్నాడు. భారత్ నుంచి మయాంక్ 94వ గ్రాండ్మాస్టర్.
క్వార్టర్స్కు సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ల...
ఫైనల్పై అమ్మాయిల గురి
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచకప్–2026కు ఇప్పటిక...
యూకీ బాంబ్రీ తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సెమీస్లోకి...
ఇండియన్వెల్స్ (అమెరికా): భారత డబుల్స్ టెన్నిస్...
దూసుకెళ్తోన్న యూకీ బాంబ్రీ జోడి
ఇండియన్ వెల్స్ టోర్నీలో భారత టాప్ డబుల్స్ టెన్...
94వ ‘గ్రాండ్మాస్టర్’ మయాంక్ చక్రవర్తి
భారత చెస్ ఆటగాడు మయాంక్ చక్రవర్తి కొత్త రికార్డు...
ఓ ఇంటివాడైన టీమిండియా స్టార్ క్రికెటర్.. ఫోటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటి...
సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి చెందిన సన్రైజ...
రన్నరప్గా ముగింపు
సాక్షి, హైదరాబాద్: హాకీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్...
క్రీడలు
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
వీడియోలు
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
