ప్రధాన వార్తలు
పాకిస్తాన్ సూపర్ లీగ్లో ప్రమాదకర ఘటన
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భయంకర ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్ మిర్ హమ్జా సజ్జాద్ తలకు బంతి బలంగా తగలడంతో ఆసుపత్రిలో చేరాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మార్క్ చాప్మన్ బలంగా కొట్టిన ఓ షాట్ సజ్జాద్ తల వెనుక భాగానికి తగిలింది. దీంతో అతను స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సజ్జాద్ స్పృహలోకి వచ్చి స్థిరంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గాయ తీవ్రతను అంచనా వేసేందుకు CT స్కాన్ చేయనున్నట్లు వెల్లడించారు. మిర్ హమ్జా సజ్జాద్ విషయానికొస్తే.. ఈ పాకిస్తానీ దేశవాలీ క్రికెటర్ ఇప్పటివరకు 6 టీ20 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. సజ్జాద్ను ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్లోనే ఇస్లామాబాద్ యునైటెడ్ 70 లక్షలకు (పాక్ కరెన్సీ) కొనుగోలు చేసింది. సజ్జాద్ ఇంతవరకు పీఎస్ఎల్ అరంగేట్రం చేయలేదు. ఈ గాయం అతని అరంగేట్రాన్ని మరింత ఆలస్యం చేయవచ్చు. కాగా, ప్రస్తుత పీఎస్ఎల్ సీజన్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. ఇటీవల లాహోర్ ఖలందర్స్కు చెందిన ఓ బౌలర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. తాజాగా సజ్జాద్ గాయం నెట్స్లో ప్రాక్టీస్ అంటేనే భయం పుట్టేలా చేస్తుంది. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు నెట్స్లో ప్రాక్టీస్ చేసేందుకు భయపడుతున్నారు. లీగ్ నిర్వహకులు నెట్స్లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ పీఎస్ఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. నిర్వహకులు ఏ విషయంలోనూ ప్రమాణాలు పాటించడం లేదని విదేశీ ఆటగాళ్ల నుంచి ప్రతి రోజు ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఈ లీగ్ ఇంధన కొరత కారణంగా ఖాళీ స్టేడియాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
పాపం.. గర్ల్ఫ్రెండ్ చేసిన పనికి సిన్నర్ ఎమవుతాడో!
ప్రస్తుతం టెన్నిస్లో జానిక్ సిన్నర్, కార్లోస్ అల్కరాజ్లు ఒకరితో ఒకరు పోటీ పడడం మస్తు మజాను అందిస్తుంది. ఈ ఇద్దరు టెన్నిస్ ర్యాంకింగ్స్లో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పుడు నాదల్, ఫెదరర్, జొకోవిచ్ మధ్య పోటీ ఎంత రసవత్తరంగా ఉండేదో అదే తరహాలో ఇప్పుడు సిన్నర్, అల్కరాజ్లు ఎక్కడ తలపడినా ఆ మ్యాచ్కు యమా క్రేజ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు మాంటే కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో ఆడుతున్నారు. ప్రస్తుతం జానిక్ సిన్నర్ డెన్మార్క్కు చెందిన మోడల్ లైలా హసనోవిక్తో లవ్లో ఉన్న సంగతి తెలిసిందే. సిన్నర్ ఏ టోర్నీ ఆడినా అక్కడ హసనోవిక్ ప్రత్యక్షమయ్యేది. అయితే తాజాగా మాంటే కార్లో టెన్నిస్ టోర్నీలో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.హసనోవిక్ తన ప్రియుడి మ్యాచ్కు కాకుండా సిన్నర్ చిరకాల ప్రత్యర్థి అల్కరాజ్ మ్యాచ్కు హాజరవ్వడమే ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్. టోర్నీలో భాగంగా అల్కరాజ్ తన తొలి మ్యాచ్లో సెబాస్టియన్ బేజ్ను 6-1, 6-3తో ఓడించాడు. కేవలం 70 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో హసనోవిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే అల్కరాజ్ ఆడుతున్నంత సేపు హసనోవిక్ అతడిని కళ్లార్పకుండా చూసింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంతకముందు రోజు తన బాయ్ఫ్రెండ్ సిన్నర్ మ్యాచ్కు కూడా హసనోవిక్ హాజరయ్యింది. కాగా తొలి రౌండ్ మ్యాచ్లో సిన్నర్ 6-3, 6-0తో హ్యూగో హంబర్ట్ను సులువుగా ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. మరి ఈ ఇద్దరు ఈ టోర్నీలో తలపడినప్పుడు హసపనోవిక్ ఎవరి ఆట చూస్తుందో తెలియడానికి కొద్ది రోజులు ఆగాల్సిందే.Laila Hasanovic watching alcaraz today pic.twitter.com/6J7vuRdATj— Kieza (@Czekoladka32904) April 7, 2026చదవండి: జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
చెప్పి మరీ చితక్కొట్టాడు.. ఇంకెందుకు ఆలస్యం?
రాజస్తాన్ రాయల్స్ స్టార్, భారత అండర్-19 వరల్డ్కప్ విజేత వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్లో.. అటు భారత జూనియర్ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్.మెరుపులు మెరిపించాడుఇక ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లూ గెలవడంలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో వరల్డ్క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సిక్సర్తో వైభవ్ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026డెస్టినీ చైల్డ్ఈ క్రమంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడుఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్లో చితక్కొడతాను’ అని చెప్పాడు.అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్లోనే వైభవ్ అదరగొట్టాడు.20 ఏళ్లు ధనాధన్దయచేసి వైభవ్ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్’’ అంటూ టీమిండియాకు వైభవ్ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లకు సూచించాడు. చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్లో 3 మ్యాచ్ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 10 ఇన్నింగ్స్ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్, ఉర్విల్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆండ్రీ రసెల్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.- వైభవ్ సూర్యవంశీ – 4.88 - రొమారియో షెపర్డ్ – 5.1 - ఉర్విల్ పటేల్ – 5.3 - జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ – 6.4 - ఆండ్రీ రసెల్ – 6.8 ఆకాశమే హద్దుప్రస్తుత ఎడిషన్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.ఈ సీజన్లో వైభవ్.. యశస్వి జైస్వాల్తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్ రాయల్స్ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, టేబుల్ టాపర్గా కొనసాగుతుంది.తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77 నాటౌట్) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది.
జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి ఒక కీలక విషయం బయటకొచ్చింది. మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్కు జైస్వాల్ క్రాక్ వచ్చిన బ్యాట్తోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పంచుకున్నాడు. నిజానికి ముంబైతో మ్యాచ్కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జైస్వాల్ భారీ షాట్లు ఆడాడు. ఈ నేపథ్యంలో బ్యాట్కు చిన్న క్రాక్ వచ్చింది. బ్యాట్కు క్రాక్ వచ్చిన విషయాన్ని జైస్వాల్ కోచ్ విక్రమ్కు చూపించాడు. అయితే విక్రమ్ మాత్రం ఏం పర్లేదు.. విరిగిన బ్యాట్తో ఆడితే ఫలితం బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై విక్రమ్ రాథోర్ స్పందిస్తూ.. ‘నిజానికి జైస్వాల్ బ్యాట్కు చిన్న పగులు మాత్రమే వచ్చింది. ఎంత గట్టి షాట్లు ఆడినా బ్యాట్కు తట్టుకునే సామర్థ్యముంది. అందుకే నేను జైస్వాల్ను అదే బ్యాట్తో బరిలోకి దిగమని చెప్పాను. అతడి నమ్మకమే అతడి బలం.’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పుంచుకోవడంతో వైరల్గా మారింది. అలా జైస్వాల్ చిన్నపాటి క్రాక్ వచ్చిన బ్యాట్తోనే ముంబైతో మ్యాచ్లో బరిలోకి దిగి ఇరగదీశాడు. అసలే ముంబై ఇండియన్స్పై మంచి రికార్డు కలిగి ఉన్న జైస్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77), సూర్యవంశీ (39), పరాగ్ (20) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు!
చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్!
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు మ్యాచ్లు ఆడి గాయం వల్ల దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. అయితే, జట్టు సమిష్టి వైఫల్యం కారణంగా ధోని కెప్టెన్సీపై కూడా మచ్చ పడింది.గతేడాది సీఎస్కే ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. సీఎస్కే చరిత్రలో ఇంతటి ఘోర ప్రదర్శన నమోదు చేయడం ఇదే తొలిసారి.ధోనితో పాటు అతడూ దూరంఇక ఐపీఎల్-2026లోనూ చెన్నైకి ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్లలోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఫినిషర్ ధోని (MS Dhoni)తో పాటు పవర్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది.PC: BCCIకాగా చెన్నై తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. సీఎస్కే సొంతమైదానం చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్కు ధోని అందుబాటులోకి వస్తాడని మేనేజ్మెంట్ తొలుత సంకేతాలు ఇచ్చింది. అతడు ఫిట్నెస్ టెస్టుకు హాజరుకాబోతునట్లు తెలిపింది.ఢిల్లీతో మ్యాచ్కు కూడా రాలేడు!అయితే, తాజా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్కు కూడా ధోని దూరం కానున్నట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ కథనం ప్రకారం.. ధోని పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి ఇంకో వారం రోజులు పట్టనున్నట్లు సమాచారం. కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్ నాటికి ధోని అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.ధోని, బ్రెవిస్ల గురించి సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ధోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అతడు ఎప్పటికి కోలుకుంటాడో స్పష్టంగా చెప్పలేము. ఇక బ్రెవిస్ తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, అతడు పూర్తిగా కోలుకుంటేనే మైదానంలో దిగుతాడు’’ అని తెలిపాడు. చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా
సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 19వ సీజన్లో తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు తీయడమే గాక అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే దేశవాలీ, ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం షమీని పట్టించుకోవడం లేదు. దీంతో షమీని జాతీయ జట్టులోకి తిరిగి తీసుకోవాలనే వాదనలు పెరిగిపోయాయి. ఇక ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా గురువారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్తో లక్నో తలపడనుంది. షమీ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్ అయినప్పటికీ దేశవాలీ క్రికెట్లో మాత్రం అతడు బెంగాల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లెక్కన ఈడెన్ గార్డెన్స్ షమీకి సొంత మైదానం వంటిది. ఇటీవలే రంజీ ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున పాల్గన్న షమీ తాజాగా లక్నో తరఫున ఈడెన్లో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో షమీ మంగళవారం బెంగాల్ ప్రొ టీ20 లీగ్ మూడో సీజన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇదే కార్యక్రమానికి కేకేఆర్ కెప్టెన్ రహానే, వైస్కెప్టెన్ రింకూ సింగ్ కూడా వచ్చారు. షమీ మాట్లాడుతూ.. ‘సొంతమైదానంలో మ్యాచ్ ఆడడం ఎవరికైనా అనుకూలంగానే ఉంటుంది. ఒక లోకల్ ఆటగాడిగా కేకేఆర్కు ప్రత్యర్థిగా ఆడినప్పటికీ పిచ్పై పూర్తి అవగాహన ఉండడం సానుకూలాంశం.’ అని చెప్పుకొచ్చాడు. స్థిరమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా షమీ తనదైన శైలిలో స్పందించాడు. ‘మనం రోజువారీ కూలీలం మాత్రమే. అవకాశం మన తలుపు తట్టేవరకు నిత్యం బౌలింగ్ వేస్తూనే ఉండాలి.’ అని సెలెక్షన్ కమిటీని ఉద్దేశిస్తూ చమత్కరించాడు. షమీ ఇంకా మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎత్తుపల్లాలు, గాయాలు కావడం సహజం. కానీ మన గ్రౌండ్ లెవెల్ హార్డ్వర్క్ మూలాలు మాత్రం ఎప్పటికీ మరిచిపోకూడదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఒక ఆటగాడిగా అవకాశం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంటాను. నా దృష్టిలో దేశవాలీ క్రికెట్కు అధిక ప్రాధాన్యమిస్తాను. నేను ఉత్తర్ప్రదేశ్లో పుట్టినప్పటికీ బెంగాల్ ఎప్పటికీ నా కర్మభూమినే. నాలో శక్తి, పోరాడే తత్వం ఉన్నంతవరకు బెంగాల్కు ఆడుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ తరఫున 16.72 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టి స్థిరమైన ప్రదర్శనతో టాప్-6 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. రంజీలో బెంగాల్ సెమీస్ చేరడంలోనూ షమీ కీలకపాత్ర పోషించాడు. 90 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి బెంగాల్ను ఫైనల్ చేర్చాడు.చదవండి: అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు!
PSL: పాక్ క్రికెట్ బోర్డు పరువు తీసిన ఆసీస్ స్టార్!
ఆస్ట్రేలియా స్టార్, ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వాహకులపై కౌంటర్ వేశాడు. తమ జట్టులోని సభ్యులంతా ఓ దుప్పటి, దిండు వెంట తెచ్చుకుని ఉంటే బాగుండేందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్తో పోటీపడి చేతులు కాల్చుకుంటున్నా పీసీబీ తీరు మారడం లేదు. ఐపీఎల్కు ధీటుగా టోర్నీని నిర్వహించాలనే ఆశతో మ్యాచ్లు షెడ్యూల్ చేస్తున్న పీసీబీకి గతంలో చేదు అనుభవాలే మిగిలాయి. క్రేజ్, ప్రసార హక్కుల విషయంలో ఐపీఎల్ అందనంత ఎత్తులో ఉండటం.. పీసీబీకి ప్రతికూల ఫలితాలు ఇచ్చింది.అయినప్పటికీ ఈసారి కూడా పీసీబీ వెనక్కి తగ్గలేదు. ఐపీఎల్ కంటే రెండు రోజులు ముందుగా.. అనగా మార్చి 26న టోర్నీని ఆరంభించగా.. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల కేవలం రెండు వేదికల్లోనే మ్యాచ్లు నిర్వహించాల్సిన దుస్థితి. ఇంధన సంక్షోభం, పెరిగిన ధరల భారం ఇందుకు కారణం.మరోవైపు.. పీఎస్ఎల్ షెడ్యూల్ రూపకల్పనలోనూ పీసీబీ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు ఆదివారం లాహోర్లోని గడాఫీ స్టేడియంలో క్వెట్టా గ్లాడియేటర్స్తో తలపడింది. ఆ మరుసటి రోజు అంటే సోమవారం.. అదే వేదికపై రావల్పిండిజ్తో ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ను షెడ్యూల్ చేశారు.ఈ నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్ ఆష్టన్ టర్నర్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడికైనా వెళ్లి.. ఓ బ్లాంకెట్, దిండు తెచ్చుకుని ఇక్కడే నిద్రపోతే బాగుండేది. మా షెడ్యూల్ అలా ఉంది మరి’’ అని ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించి అలసటను కాస్త మర్చిపోయిందని ఆష్టన్ టర్నర్ పేర్కొన్నాడు.కాగా ఆదివారం నాటి మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన ముల్తాన్ సుల్తాన్స్.. రావల్పిండిజ్పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్లలో నాలుగు గెలిచిన టర్నర్ బృందం ఎనిమిది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా
అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ దూకుడు మాములుగా లేదు. అన్ని జట్లతో పోలిస్తే రాజస్తాన్ తుది జట్టులోని స్వదేశీ ఆటగాళ్లలో అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయినప్పటికీ యువరక్తం కావడంతో జోష్ రెండింతలు అయినట్లుంది. జట్టులో రవీంద్ర జడేజా మాత్రమే టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. జడేజాను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లకు అనుభవం తక్కువే. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తాము ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టులో కూడా ఒకరిని మించి మరొకరు చెలరేగిపోతుండడం వారికి సానుకూలాంశంగా మారింది. జైస్వాల్ నుంచి ఆర్చర్ దాకా బ్యాటింగ్ చేసే వాళ్లే ఉండడం రాజస్తాన్కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సమతుల్యతతో ఉండడం కలిసొచ్చే అంశం.భయపెడుతున్న వైభవ్..52, 31, 39.. ఇవి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన పరుగులు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ అతడి దనాధన్ బ్యాటింగ్ ప్రభావం ప్రత్యర్థి జట్లపై గట్టిగానే చూపిస్తోంది. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే పరమావధిగా పెట్టుకున్నసూర్యవంశీ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర స్ట్రైక్రేట్తో పరుగులు సాధించి తన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్లో బుమ్రా, దీపక్ చాహర్ పదునైన బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు అభినందనీయమని చెప్పొచ్చు.జైస్వాల్ మోత..సాధారణంగా యశస్వి జైస్వాల్ చూడ్డానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ అతడి ఆటతీరు మాత్రం అసాధారణమని చెప్పొచ్చు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. రాజస్తాన్కు ఓపెనర్లిద్దరే సగం బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చే ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో జురేల్ 75 పరుగుల ఇన్నింగ్స్ రాజస్తాన్ గెలుపుకు కారణమైంది.పరాగ్ నాయకత్వం..జట్టు విజయాలు సాధిస్తుంటే తప్పులు పెద్దగా కనిపించవు. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్లో మెరుపులు లేనప్పటికీ అతని కెప్టెన్సీలో రాయల్స్ చెలరేగిపోవడం అతని వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం లేదు. నాయకుడిగా మూడు మ్యాచ్ల్లో సక్సెస్ అయిన పరాగ్ బ్యాటింగ్లోనూ అదరగొడితే రాయల్స్కు తిరుగు లేనట్లే. హెట్మైర్, జడేజా వంటి అనుభవజ్ఞులు తమదైన రోజున ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బౌలింగ్లోనూ అదుర్స్..బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనూ రాజస్తాన్ అదుర్స్ అనిపిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్లో ఉండడం, స్పిన్నర్లు రవి బిష్ణోయ్, జడేజాల స్పిన్ మాయజాలాం, నండ్రీ బర్గర్ సూపర్ బౌలింగ్, తుషార్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా ముద్ర ఉండడంతో అంతా మ్యాచ్ విన్నర్లుగానే కనిపిస్తున్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగి తొలి టైటిల్ ఎగరేసుకుపోయిన రాజస్తాన్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. శాంసన్ వచ్చిన తర్వాత రాయల్స్ ఆటతీరు మారడమే గాక 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పుడు శాంసన్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న పరాగ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ సీజన్ మొత్తం ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026చదవండి: కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి!
బుమ్రాకే చుక్కలు చూపించావు!.. నీ గుండె గట్టిదిరా!: హార్దిక్
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో 15 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 18 బంతుల్లో 31 పరుగులతో మెరిశాడు.విధ్వంసకర బ్యాటింగ్తాజాగా ముంబై ఇండియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఇందులో ఓ ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో వైభవ్.. ముంబై స్టార్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండు సిక్సర్లు బాదడం హైలైట్గా నిలిచింది.The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూడగా.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్లో రాజస్తాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.ఈ గుండె గట్టిదిరా బుడ్డోడాఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ముంబై కెప్టెన్, టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా వైభవ్ను ప్రత్యేకంగా అభినందించాడు. అతడి భుజం తడుతూ.. గుండెపై చేయి వేసి.. ‘ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026 ఏ బౌలర్ బౌలింగ్లోనైనాఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ‘‘పదహారు, పదిహేడేళ్ల పిల్లాడు ఇలా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. రాజస్తాన్తో మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో మేము వైభవ్ గురించి చాలా సేపు చర్చించాము.అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి అసలు భయమే లేదు. అందుకే ఏ బౌలర్ బౌలింగ్లోనైనా అలాంటి షాట్లు ఆడగలుగుతున్నాడు. అతడి భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని హార్దిక్ పాండ్యా వైభవ్కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’𝙂𝙖𝙢𝙚 𝙧𝙚𝙘𝙤𝙜𝙣𝙞𝙨𝙚𝙨 𝙜𝙖𝙢𝙚! 🤝🎥 #MI captain Hardik Pandya with some very kind words for the young Vaibhav Sooryavanshi 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/t5Wg9LCtoV— IndianPremierLeague (@IPL) April 7, 2026
వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!
భారత్కు చెందిన మినర్వా ఫుట్బాల్ క్లబ్ సంచల...
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ...
యశస్వి, వైభవ్ మెరుపులు
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ...
ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్కు వరుసగా రె...
బుమ్రాను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ...
రవిశాస్త్రికి అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవ...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
హ్యాట్రిక్ కొట్టిన RR
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
దూసుకెళ్తున్న పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
