ప్రధాన వార్తలు
'సన్రైజర్స్ కెప్టెన్గా అతడే ఉండాలి'.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా దిగ్గజం, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్-2026 సీజన్లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరగనున్న మ్యాచ్లో కమ్మిన్స్ బరిలోకి దిగడం ఖాయమైంది. దీంతో తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్కు అప్పగించే అవకాశముంది.అయితే కమ్మిన్స్ గైర్హజారీలో సన్రైజర్స్ జట్టును కిషన్ అద్బుతంగా నడిపించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్గా, బ్యాటర్గా కిషన్ విజయవంతమయ్యాడు. దీంతో కమ్మిన్స్ తిరిగొచ్చినా కెప్టెన్గా కిషన్నే కొనసాగించాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కానీ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఇందుకు విరుద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను కమ్మిన్స్ తిరిగి తీసుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు."కమ్మిన్స్ తిరిగి రావడం ఎస్ఆర్హెచ్కు అతిపెద్ద ప్లస్ పాయింట్. అయితే కిషన్ నుంచి కమ్మిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలి. కమ్మిన్స్ జట్టుకు దూరంగా ఉండటం వల్లే ఇషాన్ కిషన్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు కమ్మిన్స్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి అతడే జట్టును నడిపించాలి. కమ్మిన్స్ ఒక సీనియర్ కెప్టెన్ మాత్రమే అద్బుతమైన ఆల్రౌండర్ కూడా. సరైన సమయంలో కమ్మిన్స్ అందుబాటులోకి వచ్చాడు. అయితే కమ్మిన్స్ ప్లేయింగ్ ఎలెవన్లోకి ఎవరి స్ధానంలో వస్తాడన్నదే ప్రశార్ధకంగా మారింది. అతడిని మధుశంక స్ధానంలో తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది" క్రిక్బజ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్!
సీఎస్కేకు భారీ షాక్.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్!
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కారణంగా సీఎస్కే జట్టును వీడి పుణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించలేదు. అయితే అతడు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.మరోవైపు సీఎస్కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.ఒకవేళ రుతురాజ్ గుజరాత్తో మ్యాచ్కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ అప్డేట్స్
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్కు దిగింది.Delhi Capitals vs Punjab kings Updates: పది ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 102-1రాహుల్ 56, నితీశ్ రాణా 35 పరుగులతో ఉన్నారు.రాహుల్ హాఫ్ సెంచరీ9.1: విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్. 26 బంతుల్లో రాహుల్ ఫిఫ్టీ.పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 68-1(6)కేఎల్ రాహుల్ 16 బంతుల్లో 35 పరుగులతో, నితీశ్ రాణా 13 బంతుల్లో 22 పరుగులతో ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్28 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన నిస్సాంక.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు.2 ఓవర్లకు ఢిల్లీ స్కోరెంతంటే?2 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(12), నిస్సాంక(11) ఉన్నారు.బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీఐపీఎల్-2026లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు గత మ్యాచ్లో ఆడిన జట్లునే కొనసాగించాయి.తుది జట్లుపంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ఢిల్లీ క్యాపిటల్స్ : కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్
గొయెంకాపై తప్పుడు పోస్ట్లు పెడితే కఠిన చర్యలు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్కు యజమాని అయిన సంజీవ్ గొయెంకా విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. తన పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడుతూ అవమానకరమైన పోస్టులు, వీడియోలు రూపొందిస్తున్నారని గొయెంకా ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తన ముఖాన్ని ఇతరుల శరీరాలకు జతచేసి, హింసాత్మక లేదా అనుచిత దృశ్యాల్లో చూపిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు గొయెంకాకు వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కల్పించింది. ఐపీఎల్ 2026 సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్, ఏఐ ఆధారిత కంటెంట్పై తాత్కాలిక ఆంక్షలు విధించింది.గొయెంకా తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపించారు. "ఇది సరదా కాదు, వ్యంగ్యం కాదు. వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం" అని కోర్టుకు తెలిపారు. ఇటువంటి కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ఆయన వ్యాపార సంస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రముఖులు విమర్శలను, వ్యంగ్యాన్ని భరించాల్సి ఉంటుందని పేర్కొంటూనే.. డిజిటల్ మార్ఫింగ్, డీప్ఫేక్ల ద్వారా తప్పుడు కథనాలు సృష్టించడం మాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది.ప్రత్యేకంగా గొయెంకాపై ఐపీఎల్ నేపథ్యంలో వైరల్ అవుతున్న కంటెంట్ హద్దులు దాటిందని కోర్టు అభిప్రాయపడింది. వ్యంగ్యానికి, అవమానానికి మధ్య స్పష్టమైన రేఖ ఉందని తెలిపింది.ఈ ఉత్తర్వులతో గోయెంకా పేరు, ఫోటోలు, వ్యక్తిత్వాన్ని వక్రీకరించి ప్రచారం చేసే కంటెంట్ను తొలగించేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
సింధు కణతపై ‘టెంపుల్’.. స్పందించిన భర్త
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రస్తుతం ఉబెర్ కప్ టోర్నమెంట్తో బిజీగా ఉంది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సింధు తన ఆట తీరుతోనే కాకుండా.. కుడి కణతపై ధరించిన ప్రత్యేక పరికరంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్ పేరు ‘టెంపుల్’.ఎందుకీ ‘టెంపుల్’?జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బృందం ఈ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉండగా.. పీవీ సింధు ఓ అంతర్జాతీయ మ్యాచ్లో దీనిని ధరించడం విశేషం. మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ స్థాయిలను ‘టెంపుల్’ రియల్ టైమ్లో కొలుస్తుందని సమాచారం. దీని ద్వారా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని తెలుస్తోంది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో ఇది మెదడులో ఆక్సిజన్ స్థాయిని కొలుస్తుందని సమాచారం. కేవలం ఇంచు పొడవు ఉండే ‘టెంపుల్’ను మూడు- నాలుగు గంటల పాటు ధరించవచ్చు. ఇది బ్రెయిన్ ఫిట్నెస్ ట్రాకర్లా ఉపయోగపడుతుందని సమాచారం. ముఖ్యంగా క్రీడాకారులు మ్యాచ్ ఆడే సమయంలో లేదంటే ప్రాక్టీస్ సెషన్లో ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటా విశ్లేషణకు ఈ డివైస్ ఉపయోగపడనుంది.స్పందించిన సింధు భర్తఇక సింధు ధరించిన ‘టెంపుల్’ గురించి ఆమె భర్త వెంకటదత్త సాయి (Venkata Datta Sai) స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఈ డివైస్ ద్వారా తన మెట్రిక్స్ కొలుస్తున్నాము. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీని ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఆరంభ దశలో వస్తున్న ఫలితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని వెంకటదత్త సాయి హర్షం వ్యక్తం చేశారు. కాగా క్రీడా ప్రపంచంలో ఇప్పుడు ఈ ‘టెంపుల్’ డివైస్ చర్చనీయాంశంగా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఉబర్ కప్ సింగిల్స్ మ్యాచ్లో 30 ఏళ్ల పీవీ సింధు తొలుత లీనీ క్రిస్టోఫర్సెన్ను ఎదుర్కొంది. ఆతిథ్య డెన్మార్క్ చెందిన 26 ఏళ్ల లినీని సింధు 21-13, 18-21, 21-17 తేడాతో ఓడించి గెలుపుజెండా ఎగురవేసింది. పందొమ్మిదేళ్లు కాదని గుర్తు చేస్తోందిఈ నేపథ్యంలో మ్యాచ్లు ముగించుకున్న తర్వాత పీవీ సింధు చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘రెండు గంటల్లో రెండు మ్యాచ్లు.. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు నా శరీరం.. ‘ఇంకా నీ వయసు 19 కాదు అని మర్యాదగా గుర్తు చేసింది. రెండు మ్యాచ్లు గెలవడం సంతోషంగా ఉంది’’ అని సింధు క్యాప్షన్ జతచేసింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!
పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం
31 ఏళ్ల పాకిస్తాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బ్రిటిష్ పౌరసత్వం పొందిన అ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.లాహోర్లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అనంతరం 2021లో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టు అవకాశాలు రాలేదు. దీంతో విరక్తి చెందిన గోహర్ పాక్ నుంచి ఇంగ్లండ్కు మాకం మార్చేశాడు. స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్.. దేశవాలీ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 343 వికెట్లు తీసి, 3000కుపైగా పరుగులు సాధించాడు.దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు.గోహర్ దేశీయ దేశవాలీ క్రికెట్తో పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. అయితే పాక్ సెలెక్టర్లు గోహర్ కౌంటీ ప్రదర్శనలను విస్మరించారు. ఓ సెలెక్టర్ ఏకంగా గోహర్ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలుగా అభివర్ణించాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.ఇంగ్లండ్లో నాలుగు సీజన్లు గడిపిన గోహర్, ప్రస్తుతం మిడిల్సెక్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. కౌంటీ చాంపియన్షిప్లో బ్యాట్, బాల్తో రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గోహర్కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. జాక్ లీచ్ స్థానాన్ని భర్తీ చేసే దీర్ఘకాలిక ఎంపికగా గోహర్ను ఇంగ్లండ్ పరిశీలించే అవకాశం ఉంది. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు.
వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడచూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్న ఈ బిహారీ పిల్లాడిని.. త్వరలోనే టీమిండియాకు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పదిహేనేళ్ల వయసులోనే ఎంతో పరిణతి సాధించిన క్రికెటర్లా అతడు షాట్లు బాదడం చూసి ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ సైతం ముచ్చటపడ్డాడు.ఇక ఇర్ఫాన్ పఠాన్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ వంటి భారత మాజీ క్రికెటర్లు అయితే వీలైనంత త్వరగా వైభవ్ను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు.తొందరపాటు చర్యే అవుతుందిరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్కు సన్నద్ధమయ్యే క్రమంలో అతడు ఏడాదికి కావాల్సినంత ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎమర్జింగ్ టూర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఇండియా-‘ఏ’ టూర్లకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.వైభవ్ (Vaibhav Suryavanshi)కు ఇది రెండో ఐపీఎల్ సీజన్. గతేడాది అదరగొట్టిన అతడు.. ఈ ఏడాది కూడా శుభారంభం అందుకుని దానిని కొనసాగిస్తున్నాడు. ఈ పిల్లాడంటే నాకూ ఇష్టమే. అతడు విజయవంతం కావాలని నాలాగే ఎంతో మంది కోరుకుంటున్నారు.అయితే, వైభవ్ విషయంలో తొందరపాటు వద్దనేది నా అభిప్రాయం. ఇప్పటికే యశస్వి జైస్వాల్ భారత టీ20 జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కుతుందని అతడు చూశాడు. కానీ అలా జరుగలేదు. జైస్వాల్తో పాటు ఎంతోమంది లైన్లో ఉన్నారు.ప్రియాన్ష్ ఆర్య కూడా టీమిండియా తలుపులు బాదుతున్నాడు. ప్రియాన్ష్, వైభవ్ సూర్యవంశీ.. ఈ ఇద్దరూ ఆసియా ఎమర్జింగ్ స్టార్స్ టోర్నీలో ఆడారు. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేస్తే బాగుంటుంది.సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదువైభవ్ విషయంలో ఆలోచించినట్లే అందరి విషయంలోనూ ఆలోచించాలి. వైభవ్ను ఐర్లాండ్ లేదంటే జింబాబ్వే టూర్కు పంపితే మంచిదే. అక్కడ కూడా అతడు రాణిస్తాడనే అనుకుంటున్నా. భిన్నమైన పిచ్ పరిస్థితులు అతడికి అలవడతాయి.ముందుగా చెప్పినట్లు వైభవ్ ఒక్కడే కాదు.. మిగతా వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టీమిండియా క్యాప్నకు ఒక విలువ ఉంది. దానిని అందించే తీరు విస్మయంగా మాత్రం ఉండకూడదు. అంటే.. అందరితో పోలిస్తే.. ఆ ఆటగాడికి సులువుగా క్యాప్ దక్కిందే అనే భావన రాకూడదు.వైభవ్ టీమిండియాకు ఆడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, అతడు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే బాగుంటుంది. అలా అయితేనే అతడి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని అశ్విన్ అన్నాడు.వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!వైభవ్ విషయంలో తొందరపాటు వద్దని.. యశస్వి జైస్వాల్, ప్రియాన్ష్ ఆర్య వంటి సీనియర్లకు ముందుగా అవకాశం ఇస్తే బాగుంటుందని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్-19 జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో రాణించిన వైభవ్.. వరల్డ్కప్ ఫైనల్లో 175 పరుగులతో సత్తా చాటి జట్టును విజేతగా నిలిపాడు.ఇక ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఇప్పటికి ఏడు ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. 254 పరుగులు రాబట్టాడు. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో టాప్-6లో కొనసాగుతున్నాడు. రాయల్స్కే చెందిన యశస్వి జైస్వాల్ 245 పరుగులు చేయగా.. పంజాబ్ స్టార్ ప్రియాన్ష్ ఆర్య ఐదు మ్యాచ్లలో 211 పరుగులు చేశాడు.చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్
రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటన
ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్ 2026 సీజన్కు సంబంధించిన రిటైన్ ఆటగాళ్ల జాబితాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కూడా భారత స్టార్ క్రికెటర్లు లీగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ వంటి స్టార్లు తమ తమ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్నారు.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు తలా ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా సముచిత ప్రాధాన్యం లభించింది.Triumph Knights Mumbai North East జట్టు సూర్యకుమార్ యాదవ్ను ఐకాన్ ప్లేయర్గా కొనసాగించింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే, సూర్యాంశ్ షెడ్గే కూడా జట్టులో నిలిచారు.గత సీజన్ రన్నరప్ SoBo Mumbai Falcons తమ ఐకాన్ ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ను రిటైన్ చేసుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ, హర్ష్ అఘవ్ కూడా జట్టులో కొనసాగుతున్నారు.డిఫెండింగ్ ఛాంపియన్ Mumbai South Central Maratha Royals తుషార్ దేశ్పాండేను ఐకాన్ ప్లేయర్గా ఎంపిక చేసింది. సిద్ధేశ్ లాడ్, రోహన్ రాజే కూడా కొనసాగనున్నారు.Bandra Blasters తరఫున యశస్వి జైస్వాల్ ఐకాన్ ప్లేయర్గా నిలిచాడు. సువేద్ పార్కర్, ధృమిల్ మట్కర్ జట్టులో కొనసాగుతున్నారు.ARCS Andheri శివమ్ దూబేను రిటైన్ చేయగా, ప్రగ్నేష్ కన్పిల్లేవార్, దీపక్ శెట్టి కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.Aakash Tigers Mumbai Western Suburbs సర్ఫరాజ్ ఖాన్ను ఐకాన్ ప్లేయర్గా ఎంపిక చేసింది. షమ్స్ ములానీ, జే బిస్తా కూడా జట్టులో ఉన్నారు.North Mumbai Panthers అజింక్య రహానేను రిటైన్ చేసుకోగా, అభిజ్ఞాన్ కుందు, తనుష్ కోటియన్ జట్టులో కొనసాగుతున్నారు.Eagle Thane Strikers శార్దూల్ ఠాకూర్ను ఐకాన్ ప్లేయర్గా నిలబెట్టుకుంది. అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ కూడా జట్టులో ఉన్నారు.ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ, ఈ రిటెన్షన్లు లీగ్ స్థాయిని మరింత పెంచుతాయని అన్నారు. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.2018లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయికి వెళ్లే వేదికగా నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టి త్వరలో జరగనున్న వేలంపై ఉంది.
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ సమిత్ పటేల్ దేశీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. భారత్లో నిర్వహించిన అనుమతి లేని లీగ్లో పాల్గొనడం కారణంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై 12 నెలల నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 41 ఏళ్ల సమిత్ 2008 నుంచి 2015 వరకు ఇంగ్లండ్ తరఫున 60 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అయితే అతనికి అసలైన గుర్తింపు కౌంటీ క్రికెట్లోనే దక్కింది. ముఖ్యంగా నాటింగ్హమ్షైర్ కౌంటీ క్లబ్కు అతను రెండు దశాబ్దాలకు పైగా సేవలందించాడు.తన కౌంటీ కెరీర్లో 25 వేలకుపైగా పరుగులు, 800కుపైగా వికెట్లు సాధించి అరుదైన ఘనత సాధించాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ సత్తా చాటి తన జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.ఇటీవల గోవాలో జరిగిన వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్లో పాల్గొనడం సమిత్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈసీబీ నిబంధనల ప్రకారం, అనుమతి లేని టోర్నమెంట్లలో ఆడిన ఆటగాళ్లు ఏడాది పాటు ఇంగ్లండ్ దేశీయ క్రికెట్లో ఆడటానికి అనర్హులు అవుతారు.ఈ నిషేధంతో తన దేశీయ కెరీర్కు ముగింపు పలకక తప్పలేదని సమిత్ వెల్లడించాడు. ఈ పరిణామాలు ముందే తెలిసి ఉంటే ఆ లీగ్లో ఆడేవాడిని కాదు. ఇంకా ఒక సీజన్ ఆడే అవకాశం ఉండేదని సమిత్ బాధపడ్డాడు. ఇంగ్లండ్ దేశీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సమిత్, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్లలో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.రిటైర్మెంట్ ప్రకటన అనంతరం నాటింగ్హమ్షైర్ కౌంటీ సమిత్ సేవలను ఘనంగా కొనియాడింది. క్లబ్ డైరెక్టర్ మిక్ న్యూవెల్ మాట్లాడుతూ.. సమిత్ సాధించిన విజయాలు నాటింగ్హమ్షైర్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. అతని నిబద్ధత, పోరాట పటిమ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయని ప్రశంసించారు.
‘ఆ వీడియోతో కోటి సంపాదన... భజ్జీతో బంధం తెగిపోయింది’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్గేట్’ వివాదం. ఆరంభ సీజన్ 2008లో భారత మాజీ బౌలర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్, శ్రీశాంత్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.శ్రీశాంత్ను చెంప దెబ్బకొట్టిన భజ్జీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాడు మ్యాచ్ పూర్తైన తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భజ్జీ కోపంగా శ్రీశాంత్ను చెంపదెబ్బ (IPL Slapgate) కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న శ్రీశాంత్ అలా చూస్తుండిపోయాడు.పశ్చాత్తాపందీంతో భజ్జీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. దాదాపుగా ఎనిమిది మ్యాచ్లు ఆడకుండా అతడిపై నిషేధం విధించింది. ఈ ఘటనపై ఇటీవలే భజ్జీ మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. వెనక్కి వెళ్లే అవకాశం వస్తే తన కెరీర్ నుంచి ఈ మచ్చను తుడిచివేస్తానని.. ఆరోజు జరిగిన దానికి ఇప్పటికే శ్రీశాంత్కు 200 సార్లకు పైగా క్షమాపణలు చెప్పానని తెలిపాడు.అయితే, తాజాగా శ్రీశాంత్ భజ్జీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఒకప్పుడు అన్నా అంటూ పిలిచాను గనుకే హర్భజన్ను క్షమించానని.. అయితే, అతడికి మాత్రం కృతజ్ఞత లేదంటూ మండిపడ్డాడు. మలయాళ వార్తా సంస్థ మాతృభూమితో మాట్లాడుతూ..కోటి దాకా సంపాదించాడు‘‘భజ్జీ గురించి గతంలో నేను ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి. ఇన్నేళ్లుగా అతడితో నాకు సమస్య రాలేదు. కానీ ఇటీవలే ఆ ఘటనపై అతడు ఓ యాడ్ చేశాడు. దానిని నుంచి దాదాపుగా రూ. 80 లక్షల నుంచి కోటి దాకా సంపాదించాడు.అంతేకాదు.. నాకు ఫోన్ చేసి ఆ యాడ్ గురించి ఇన్స్టా స్టోరీలో పెట్టమని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘నేను నిన్ను క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోను’ అని భజ్జీకి సమాధానం ఇచ్చాను.మన పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిని క్షమించవచ్చు. కానీ ఆ తప్పును క్షమించకూడదు. లేదంటే వాళ్లు తిరిగి అదే పునరావృతం చేస్తారు. ఇందుకు భజ్జీ మంచి ఉదాహరణ అని చెప్పడానికి నేను సందేహించను.అన్నా అని పిలిచేవాడినిఒకప్పుడు అతడిని అన్నా అని పిలిచేవాడిని. కానీ అతడు ఎప్పుడైతే ఆ యాడ్ చేశాడో అప్పటి నుంచి అస్సలు మాటలు లేవు. ఇన్స్టాగ్రామ్లో అతడిని బ్లాక్ చేశాను కూడా!.. నా తల్లిదండ్రులు క్షమాగుణం గురించి చెప్పారు. అంతేకానీ తప్పును క్షమించమని, ఎదుటివాళ్లు చేసిన అవమానాన్ని మర్చిపొమ్మని ఎన్నడూ చెప్పలేదు.తప్పును క్షమించనుఇంత చేసినా అతడిపై నాకేమీ ఫిర్యాదులు లేవు. అతడు, అతడి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. ఆ ఘటనను మాత్రం నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని శ్రీశాంత్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఐపీఎల్ రూపకర్త లలిత్ మోదీ ఇటీవల స్లాప్గేట్ వీడియో విడుదల చేయగా.. శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod)
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
ఢాకా: దశాబ్దం తర్వాత భారత్ వేదికగా దక్షిణాసియా మహ...
బెస్ట్ అల్కరాజ్, సబలెంకా
మాడ్రిడ్: క్రీడా ప్రపంచంలో అస్కార్ అవార్డులుగా భ...
శివ నర్వాల్ పసిడి గురి
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్...
పంజాబ్ క్రీడాకారులకు హాకీ దిగ్గజం బోవెలాండర్ పాఠాలు!
చండీగఢ్: నెదర్లాండ్స్ హాకీ దిగ్గజం ఫ్లోరిస్ జాన...
రిటైన్ ప్లేయర్ల జాబితా ప్రకటన
ప్రతిష్టాత్మక టీ20 ముంబై లీగ్ 2026 సీజన్కు సంబంధ...
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ సమిత్ పటేల్ దేశీయ క్ర...
‘ఆ వీడియోతో కోటి సంపాదన... భజ్జీతో బంధం తెగిపోయింది’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో మాయని...
విరాట్పై విషం చిమ్మిన ఇంగ్లండ్ దిగ్గజం
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
GTపై RCB ఘన విజయం
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
హైదరాబాద్ లో ఢిల్లీ చిత్తు.. శతక్కొట్టిన అభిషేక్
