ప్రధాన వార్తలు
‘క్యాష్ రిచ్’ లీగ్ ఐపీఎల్కు ఘోర అవమానం?
టీ20 క్రికెట్కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్ను మతంలా భావించే భారత్లో పొట్టి క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగాదేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనటంలో సందేహం లేదు.ప్రతిభ ఉన్న యువ, అన్క్యాప్డ్ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్కు టాప్-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్కు రెండో ర్యాంకు ఇచ్చింది. క్యాష్ రిచ్.. కానీ బెస్ట్ కాదు!క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఐపీఎల్ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్లకు టాప్-5లో చోటు ఇచ్చింది.ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్/ఏజెంట్ అప్రూవల్ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.ఈ అంశాలలో మెరుగుపడాలి!ఇందులో భాగంగా ది హండ్రెడ్కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్గా ఐపీఎల్ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది. పాక్ పరిస్థితి ఇదీఇక బిగ్బాష్ లీగ్కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.అంతటా మనోళ్లదే పైచేయికాగా WCA ప్రకటించిన టాప్-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్’, సౌతాఫ్రికా టీ20 లీగ్లలో అత్యధిక జట్లు ఐపీఎల్కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్ ప్రీమియర్ లీగ్, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
సీఎస్కేకు భారీ షాక్!.. మాకు నిజంగా ఎదురుదెబ్బే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్ తీవ్రంగా గాయపడ్డాడు. తొడకండరాల గాయం కారణంగా అతడు ఐపీఎల్-2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.పతిరణను వదిలేసి..కాగా 2026 మినీ వేలానికి ముందు శ్రీలంక స్టార్, తమ విజయాల్లో కీలకమైన యువ పేసర్ మతీశ పతిరణను సీఎస్కే విడిచిపెట్టింది. దీంతో పేస్ దళం బలహీనపడగా.. రూ. 2 కోట్లకు ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)ను మాత్రం సీఎస్కే అట్టిపెట్టుకుంది.అయితే, సీజన్ ఆరంభానికి సమయం సమీపిస్తున్న వేళ ఎల్లిస్ గాయపడ్డాడు. గాయం తీవ్రత కారణంగా సీజన్ మొత్తానికి అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధ్రువీకరించారు.మాకు ఇది భారీ ఎదురుదెబ్బ‘‘మాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఎల్లిస్ జట్టులో కీలక బౌలర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు ప్రభావం చూపగలడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడి కోసం వెదుకుతున్నాము’’ అని విశ్వనాథన్ స్పోర్ట్స్స్టార్కు తెలిపారు. దీనిని బట్టి త్వరలోనే ఎల్లిస్ రీప్లేస్మెంట్ను సీఎస్కే ప్రకటించనున్నట్లు స్పష్టమైంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే పేస్ విభాగంలో ప్రస్తుతం ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు ఉన్నారు. మ్యాట్ హెన్రీని రూ. 2 కోట్లు, ఫౌల్క్స్ను రూ. 75 లక్షలకు సీఎస్కే మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఇక ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు.ఐపీఎల్-2026 టోర్నీకి సీఎస్కే జట్టుMS ధోని (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్, సంజూ శాంసన్ (ట్రేడింగ్ ద్వారా, వికెట్ కీపర్), గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ చౌదరి, శివమ్ దూబే, ఆయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్, శ్రేయాస్ గోపాల్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), ఖలీల్ అహ్మద్, అకీల్ హొసేన్, ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ, మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, జాక్ ఫౌల్క్స్, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చహర్, మ్యాట్ హెన్రీ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
రూ. 18 కోట్లు.. ఫిట్గా ఉన్నా అనుమతి లేదు?
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ను కేకేఆర్ జట్టు నుంచి తొలగించింది.పతిరణకూ గాయం!ఇక కేకేఆర్ మరో ఆటగాడు, టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. పేస్ దళాన్ని పటిష్టం చేసే క్రమంలో రాణాతో పాటు రాణిస్తాడని భావించిన శ్రీలంక బౌలర్ మతీశ పతిరణ కూడా గాయపడ్డాడు.ఫిట్గా ఉన్నా అనుమతి లేదు?టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పతిరణ కాలికి గాయం కాగా.. అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే అతడు ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) మాత్రం ఐపీఎల్లో ఆడేందుకు పతిరణకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పతిరణ ఫిట్నెస్ విషయంలో తమకు సంతృప్తికరమైన సమాచారం వచ్చినపుడే NOC ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి కేకేఆర్ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లు (SLC) అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడన్న అంశంపై ఇంత వరకు స్పష్టతనివ్వలేదు.విమాన టికెట్లు బుకింగ్, రద్దుమేము వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. దాదాపుగా ప్రతిరోజు పతిరణ కోసం విమాన టికెట్లు బుక్ చేయడం, రద్దు చేయడం జరుగుతోంది’’ అని పేర్కొన్నాయి. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన పతిరణ.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందాడు.చెన్నై వదిలేయగా.. రూ. 18 కోట్లకు కొనుగోలుఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన 23 ఏళ్ల మతీశ పతిరణ.. 47 వికెట్లు తీశాడు. అయితే, 2026 వేలానికి ముందు చెన్నై అతడిని వదిలివేయగా.. కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓవైపు హర్షిత్ రాణా జట్టుకు దూరం కాగా.. పతిరణ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగడం కేకేఆర్కు తలనొప్పిగా మారింది.మరోవైపు.. పతిరణ మేనేజర్ మాత్రం అతడు త్వరలోనే అందుబాటులోకి వస్తాడనేలా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీని కేకేఆర్ జట్టులో చేర్చుకున్న సంగతి తెలిసిందే.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
మా నాన్నలా కాదు!.. పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా ఏకంగా వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇలాంటి ఇంకెన్నో చిరస్మరణీయ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ బ్యాటర్.ఇప్పటికీ గుర్తింపు అంతంతమాత్రమేఇక సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కూడా తండ్రి బాటలో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. కానీ ఇప్పటికీ తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడీ 26 ఏళ్ల ఆల్రౌండర్. దేశీ క్రికెట్లో తొలుత ముంబైకి ఆడిన అర్జున్.. తర్వాత గోవాకు మారిపోయి అక్కడ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఇక ఐపీఎల్లో తండ్రి సచిన్ మెంటార్గా ఉన్న ముంబై ఇండియన్స్ (MI) తరఫున 2023లో అరంగేట్రం చేశాడు అర్జున్. ఇప్పటికి మొత్తంగా ఐదు మ్యాచ్లు ఆడి మూడు వికెట్లు తీయడంతో పాటు 13 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు అర్జున్ను వదిలేసిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కు అతడిని ట్రేడ్ చేసింది.ఈసారి లక్నో తరఫున అయినా అవకాశాలు అందిపుచ్చుకోవాలని అర్జున్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్తో అర్జున్ సంభాషించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో పంత్.. అర్జున్ టెండుల్కర్ బ్యాట్ బరువు గురించి అడుగగా..మా నాన్నలా కాదులే!.. ‘‘1220 గ్రాముల బరువు ఉండవచ్చు. ఇంతకంటే తక్కువ బరువున్న బ్యాట్తో నేను ఆడలేను. మా నాన్న అయితే 1301-1315 గ్రాముల బరువున్న బ్యాట్ వాడేవారు. నేను అలా కాకుండా 1220 గ్రాముల బరువు ఉన్నది వాడతాను. బ్యాట్ ఎలా ఉన్నా బంతిని బాదడమే అంతిమ లక్ష్యం’’ అని అర్జున్ సమాధానం ఇచ్చాడు.పెళ్లైన మరుసటి రోజే వచ్చేశావా?ఇక ఆట పట్ల అర్జున్ టెండుల్కర్ అంకిత భావం గురించి రిషభ్ పంత్ ప్రస్తావిస్తూ.. ‘‘యువరాజ్ సింగ్ పాజీతో కలిసి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా! పెళ్లైన మరుసటి రోజే నెట్స్కి వచ్చేశావు. క్రికెట్ పట్ల నువ్వు అత్యంత ఆసక్తిగా, ఉత్సుకతతో ఉన్నావు సోదరా!’’ అని పేర్కొన్నాడు.కాగా మార్చి 5న సానియా చందోక్తో.. అర్జున్ టెండుల్కర్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 ఆరంభం కానుంది. లక్నో తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!Already loving this new Rishabh-Arjun bond 🥹❤️💙 pic.twitter.com/pa79YqebbU— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2026
తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధతో డీప్ఫేక్స్ తయారు చేసి కొంతమంది తన పరువుకు భంగం కలిగించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే వీటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. అదే విధంగా నష్ట పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించాడు.హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లుగాసామాజిక మాధ్యమాలైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర వేదికలపై 2025 నుంచి తనపై డీప్ఫేక్స్ పెరిగిపోయాయని గంభీర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇందులో తాను హెడ్కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు గంభీర్ చెప్పినట్లుగా ఉన్న ఓ నకిలీ వీడియోకు ఏకంగా 29 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఆయుధంలా వాడుకుంటూ అప్రతిష్టఇక మరో వీడియోలో గంభీర్ (Gautam Gambhir).. టీమిండియా సీనియర్ క్రికెటర్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాయి.. దీనిని 17 లక్షల మందికిపైగా వీక్షించడం విశేషం. ఈ నేపథ్యంలో తన పేరు, గుర్తింపు, రూపం, గొంతుక ఇలా అన్నింటిని వాడుకుంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని గంభీర్ కోర్టును ఆశ్రయించాడు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.చట్టబద్ధంగా రక్షణ కల్పించాలితన గుర్తింపును ఆయుధంగా వాడుకుని పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ఆదాయం కూడా ఆర్జిస్తున్నారని పేర్కొన్నాడు. కృత్రిమ మేధ యుగంలో తనపై డీప్ఫేక్ వీడియోలు పెరిగిపోతున్న తరుణంలో.. చట్టబద్ధంగా రక్షణ కల్పించాలని గౌతీ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇందులో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తక్షణమే ఆ వీడియోలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని గంభీర్ కోరాడు.కాగా 2024లో టీమిండియా హెడ్కోచ్గా నియమితుడయ్యాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో భారత జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025.. ఆసియా టీ20 కప్-2025.. తాజాగా టీ20 ప్రపంచకప్-2026 టైటిల్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కోచ్గా గంభీర్ విజయవంతమైనా.. టెస్టుల్లో మాత్రం అతడికి పేలవమైన రికార్డు ఉండటం గమనార్హం.చదవండి: T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
వాళ్ల ముందు మోకరిల్లారు: పీసీబీపై మాజీ క్రికెటర్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రస్తుత యాజమాన్యం తీరుపై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకరిల్లిందని.. అందుకే పాక్ క్రికెట్ నాశనమైపోయిందని మండిపడ్డాడు.వరుస వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనలతో విమర్శలు మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో 2023 నుంచి వైఫల్యాలు కొనసాగుతున్నాయి. వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ కూడా చేరకుండా ఇంటిబాట పట్టిన పాక్.. టీ20 ప్రపంచకప్-2024లో కనీసం సూపర్-8 చేరకుండానే నిష్క్రమించింది.తాజాగా 2026 టీ20 ప్రపంచకప్లో సూపర్-8 దశ దాటినా.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. ఇక ఈ టోర్నీ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టు.. వన్డే సిరీస్లో 2-1తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తద్వారా పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఈ మేరకు బంగ్లా చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది.ఐదారు మందిపైనే ఫోకస్ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ వెటరన్ బ్యాటర్ అహ్మద్ షెబాజ్ పీసీబీ తీరును ఘాటుగా విమర్శించాడు. ‘‘మీ ఆటగాళ్ల స్థాయి మీరు ఊహించిన స్థాయిలో లేదు. పాకిస్తాన్ జట్టు, పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వేదికగా మీరు గత 5-7 ఏళ్ల నుంచి 6-8 మందినే ప్రధానంగా చూపిస్తూ హైలైట్ చేస్తున్నారు.పీఎస్ఎల్, పాక్ జట్టు ముఖచిత్రంగా వారిని ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం మీ రాత మార్చలేకపోతున్నారు. వాళ్లకు స్పాన్సర్షిప్లు, ఎండార్స్మెంట్ల రూపంలో డబ్బులే డబ్బులు. వాళ్లకు పీఎస్ఎల్లో కెప్టెన్సీలు కూడా మీరే ఇప్పిస్తారు. పాక్ క్రికెట్ అంటే వాళ్లే అనేంతలా ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు.కనక వర్షంకానీ వాళ్లు పాక్ క్రికెట్ వ్యవస్థలోని లోపాలు అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల జేబులు నిండుతున్నాయి. కానీ పాక్ జట్టు ఘోరమైన ఓటములు చవిచూస్తోంది. అయినా సరే అందులో ఒక్క ఆటగాడు కూడా బాధ్యత వహించేందుకు ముందుకు రాడు.జట్టు ఓటమికి ఏవేవో కుంటిసాకులు చెబుతూ తప్పు తమది కాదని పక్క వాళ్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీబీ చరిత్రలో ఇంతటి బలహీనమైన యాజమాన్యాన్ని ఎప్పుడూ చూడలేదు. ఆటగాళ్ల ముందు పీసీబీ మోకర్లింది. మీరే దిక్కు అంటూ వారిని నెత్తినపెట్టుకుంది.కొత్త వాళ్లను ప్రోత్సహించే బదులు పాత వాళ్లను అందలం ఎక్కించింది. వాళ్లేమో ప్రతీ టోర్నీలో ఓడటం.. దానికి ఏదో ఒక సాకు చెప్పడం పరిపాటిగా మారింది. ప్రజలకు కూడా ఇది అలవాటైపోయింది’’ అని పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీని ఉద్దేశించి అహ్మద్ షెబాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నాలుగు ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఎడిషన్లో రన్నరప్గా నిలిచిన రోహిత్ సేన.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో చాంపియన్గా నిలిచింది.ఇక దుబాయ్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్-2026లో సూర్య (Suryakumar Yadav) కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంతగడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.సాహసోపేత నిర్ణయాలుఈ నాలుగు సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ ఉన్నాడు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే, చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నాడు.ఫలితంగా జూన్, 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు ఈ మాజీ క్రికెటర్. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్బై చెప్పిన నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్పై కూడా విమర్శలు వచ్చాయి.రో-కో ఆడటం కష్టమంటూఅంతేకాదు వన్డే వరల్డ్కప్-2027లో రో-కో ఆడటం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు, అర్ధంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి టెస్టు, వన్డే కెప్టెన్ గిల్ను తప్పించడం.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి మంచి రికార్డే ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం ఇందుకు నిదర్శనం.మరోసారి..ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అగార్కర్ మరోసారి తన పదవీకాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం.వన్డే వరల్డ్కప్-2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలక్టర్గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెస్ట్జోన్ నుంచి ఓ మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
విరాట్ కోహ్లి విశ్వరూపం.. తొలి రోజే సిక్సర్ల వర్షం!
ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు.ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్పై కూడా తన ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర. కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి టైటిల్ను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.చదవండి: IPL 2026: 'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'Wtf is Virat Kohli cooking in nets. Man is Dealing only in sixes 😭😭Someone really said, 2026 is the new 2016. pic.twitter.com/rSBD0HUkmc— Selfless⁴⁵ (@SelflessCricket) March 18, 2026
'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్కు రంగం సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ మహమ్మద్ ఇజార్పై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజార్ను తక్కువగా అంచనా వేయొద్దని బ్యాటర్లను పఠాన్ హెచ్చరించాడు.కాగా గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో బిహార్కు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ ఇజార్ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం పేసర్ అయిన ఇజార్.. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై వంటి పెద్ద ఫ్రాంచైజీ తమ జట్టులోకి తీసుకుంది."ముంబై ఇండియన్స్లో ఇప్పటికే ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి ప్రధాన పేసర్లు ఉన్నారు. ఇప్పుడు మహ్మద్ ఇజార్ రూపంలో మరో పేస్ సంచలనం ముంబై జట్టులోకి వచ్చాడు. అతడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఇజార్ 'బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్' స్లోయర్ డెలివరీలు అద్భుతంగా బౌలింగ్ చేయగలడు.అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. ఇజార్ 135 కిలోమీటర్ల వేగంతో షార్ట్ బాల్స్, ఫుల్లర్ లెంగ్త్ డెలివరీలు కూడా సంధించగలడు. ముఖ్యంగా స్లో బాల్స్ వేయడం అతడి స్పెషాలిటీ. ఆ బంతులతో ఎలాంటి బ్యాటర్నైనా అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.గతసీజన్లో యువ పేసర్ అశ్విన్ కుమార్ అద్భుతంగా రాణించాడు. కాబట్టి అందరి దృష్టి అతడిపై ఉంటుంది. కానీ ఇజార్ను కూడా తక్కువ అంచనా వేయకండి" అని పఠాన్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటివరకు కేవలం 5 టీ20లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్ వంటి మహా వేదికపై సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు.చదవండి: Dinesh Karthik: 40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య, స్టార్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ పండింటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ పాపకు డికే-దీపికా జోడీ 'రాహా' అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.దీంతో అభిమానులు వారిద్దరికి శుభకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు కుమారులు(కవలలు) ఉన్నారు. 2021లో కబీర్, జియాన్ జన్మించారు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులో డికే మూడోసారి తండ్రి అయ్యాడు.కాగా ఆల్ఫార్మాట్ క్రికెట్ విడ్కోలు పలికిన కార్తీక్.. ప్రస్తుతం కామెంటేటర్గా, కోచ్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్గా డీకే వ్యవహరిస్తున్నాడు. ఇక దీపికా విషయానికి వస్తే.. ఆమె చివరగా ఆసియాగేమ్స్-2023లో మిక్సిడ్ డబుల్స్లో బంగారు పతకంతో మెరిసింది.అంతకుముందు వరల్డ్ డబుల్స్ ఛాంపియన్షిప్-2022లో రెండు స్వర్ణాలు ఆమె సాధించింది. దీంతో ఆమె సేవలకుగాను భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: T20 WC 2026: జోస్ బట్లర్ రిటైర్మెంట్..?
LA Olympics 2028: 4 రోజుల ముందే పోటీలు షురూ
లాస్ ఏంజెలిస్: మరో రెండేళ్లలో లాస్ ఏంజెలిస్లో ...
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్...
ఇరాన్ అభ్యర్థనతో చిక్కుల్లో ఫిఫా!
పశ్చిమాసియాలో భీకరయుద్ధం నేపథ్యంలో ఇరాన్ జట్టు జూ...
క్యాండిడేట్స్ టోర్నీకి హంపి దూరం!
బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపి...
T20 WC 2026: బీసీసీఐకి అగార్కర్ రిక్వెస్ట్!
టీమిండియా గత మూడేళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో నా...
విరాట్ కోహ్లి విశ్వరూపం.. తొలి రోజే సిక్సర్ల వర్షం!
ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళ...
'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీ...
40 ఏళ్ల వయసులో తండ్రైన దినేష్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్త...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
