ప్రధాన వార్తలు
బుమ్రా ఫెయిలూర్కు కారణమిదే: రవిశాస్త్రి
ఐపీఎల్-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొనసాగుతోంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా విఫలమయ్యాడు. తన శైలికి విరుద్దంగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. జస్ప్రీత్ తన నాలుగు ఓవర్ల కోటాలో 11.20 ఏకానమీ రేటుతో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీనియర్ పేసర్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో బుమ్రా మొత్తంగా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.ప్రతీ సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్లోడ్ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు."బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్లోడ్తో అతడు ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి. రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్తో గడపనుంది. పలు టెస్టు సిరీస్లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.చదవండి: IPL 2026: 'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'
సౌతాఫ్రికా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సౌతాఫ్రికా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను నియంత్రిస్తుందని ఆరోపించాడు. భారత్ వాణిజ్య శక్తి కారణంగా అంతర్జాతీయ క్రికెట్పై భారీ ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డాడు.అంతర్జాతీయ క్రికెట్లో శక్తి సమతౌల్యం ఇంకా మారలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్లోని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఆ విజయం తర్వాత కూడా మారని సమీకరణలుగతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. 1991-92లో క్రికెట్లోకి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇది తొలి రెడ్బాల్ టైటిల్.అయితే ఈ విజయం తర్వాత కూడా ప్రపంచ క్రికెట్లో శక్తి సమతౌల్యత మారలేదన్నది సైమన్ అభిప్రాయం. ఐసీసీపై ఇంకా భారత్ పెత్తనమే కొనసాగుతుందన్నది అతని వాదన. బీసీసీఐ ధనబలంతో ఐసీసీని నియంత్రిస్తోందన్నది అతని వాదన. బవుమా, కాన్రాడ్పై ప్రశంసలుఇదే సందర్భంగా సైమన్ తన సొంత జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోచ్ షుక్రి కాన్రాడ్, కెప్టెన్ టెంబా బవుమాను ఆకాశానికెత్తాడు. వారి జట్టు ఒకరిద్దరి స్టార్ ప్లేయర్ల జట్టు కాదని.. కోచ్ ప్రతి విషయాన్ని నేరుగా మాట్లాడటం చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్ వ్యవస్థపై కూడా విమర్శలుసైమన్ ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులో స్పిన్నర్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించాడు. కౌంటీ క్రికెట్ నిర్మాణం వల్ల వారు లీడర్షిప్ పాత్రలో ఎదగలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.మొత్తంగా సైమన్ తన వ్యాఖ్యల్లో బీసీసీఐ పెత్తనం చేస్తోందని, ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థలో లోపాలున్నాయని అన్నాడు. సైమన్ గతేడాది స్వదేశంలో టీమిండియాను ఓడించిన (టెస్ట్ సిరీస్) జట్టులో సభ్యుడు.
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మిలింద్ సోమన్
వయసు కేవలం అంకె మాత్రమే అని మరోసారి నిరూపించాడు ప్రముఖ మోడల్, భారత ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్. మిలింద్ 60 ఏళ్ల వయస్సులో ఐరోపా, అఫ్రికా ఖండాన్ని వేరు చేసే జిబ్రాల్టర్ జలసంధిని ఈది సరికొత్త చరిత్ర సృష్టించాడు.మే 1న యూరప్లోని టారిఫా నుండి ఆఫ్రికాలోని మొరాకో తీరం వరకు సుమారు 15 కిలో మీటర్లు ఈది జిబ్రాల్టర్ జలసంధిని అతడు దాటాడు. ఈ ఘనతను ఒక అద్భుతంగా అతడు అభివర్ణించాడు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను దాటి మరి ఈ లక్ష్యాన్ని అతడు చేరుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. కాగా మిలింద్ సోమన్ ఫిట్నెస్ పరంగా ఎంతో మందికి రోల్ మోడల్. సోమన్ తాజాగా తన ఫిట్నెస్ రహస్యాలను అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది కాలంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటిస్తున్నట్లు మిలింద్ తెలిపాడు.ఇక సోమన్ 1990లలో సూపర్ మోడల్గా నిలిచాడు. ఆ తర్వాత అల్ట్రా-మారథాన్ రన్నర్గా, 'ఐరన్ మ్యాన్' టైటిల్ను గెలుచుకున్నారు. అంతేకాకుండా జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్లలో తన నటనతో మొప్పించారు.At 60, most people slow down. Milind Soman chose to cross continents.On May 1, he swam 15 km across the Strait of Gibraltar, from Tarifa in Europe to the coast of Morocco in Africa.Calling the experience “beautiful,” he reminded the world that endurance isn’t about age, it’s… pic.twitter.com/Icx6mRgJFr— The Better India (@thebetterindia) May 5, 2026
చిచ్చు రగిలింది.. చిక్కుల్లో రాజస్తాన్ రాయల్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రాంచైజీగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు ఇటీవలే చేతులు మారిన సంగతి తెలిసిందే. ఆదివారం లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలాలతో కూడిన కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.65 బిలియన్ డాలర్ల (రూ. 15,660 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే కొనుగోలు మురిపెం తీరకుండానే రాజస్తాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. తెర ముందు డీల్ ముగిసినట్లు కనిపిస్తున్నా, తెరవెనుక అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. రాజస్తాన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు దాదాపు అదే ధరకు చర్చలు జరిపిన అమెరికాకు చెందిన కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం, ఇప్పుడు ఈ ఒప్పందంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. తమ చేతుల్లోకి రావాల్సిన డీల్ చివరి నిమిషంలో చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో కల్ సోమని బృందం ఇప్పటికే తమ న్యాయ, పబ్లిక్ రిలేషన్స్ బృందాలతో చర్చలు జరిపింది. ‘ఈ ఉదయం అమెరికాలోని మా లీగల్ టీమ్తో మాట్లాడాము. ఇవాళే దీనిపై అధికారికంగా లీగల్ నోటీసు పంపబోతున్నాము’ అని కల్ సోమని బృందం వెల్లడించింది. పరిస్థితిని బట్టి తాము ఎంత బహిరంగంగా ముందుకు వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించుకుంటామని తెలిపారు. ఈ వివాదం ముదిరితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకునే అవకాశముంది.మిట్టల్ గ్రూప్ కంటే ముందు కల్ సోమని గ్రూప్తో కుదరాల్సిన డీల్ ఆగిపోవడం వెనుక సకాలంలో సోమని బృందం చెల్లింపులు చేయలేకపోవడమే కారణమని తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను సోమని బృందం కొట్టిపారేసింది. తమ వెనుక రాబ్ వాల్టన్, హాంప్ ఫ్యామిలీ వంటి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఉన్నారని, నిధులు తమకు ఎప్పుడూ సమస్య కాదని వారు స్పష్టం చేశారు. మరి ఈ సమస్య ఎలా కొలిక్కి వస్తుందన్నది చూడాలి.ఐపీఎల్ 2026 సీజన్ తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ రెండో అంచె పోటీల్లో చతికిలపడుతోంది. ప్రస్తుతం 10 మ్యాచ్లాడిన రాజస్తాన్ 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో మూడింట గెలిస్తే రాజస్తాన్ ప్లేఆఫ్ బెర్తు దక్కించుకుంటుంది. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసిన రాజస్తాన్ తమ తర్వాతి మ్యాచ్ మే 9న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది. ఆ తర్వాత మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో, మే 19న లక్నోతో, మే 24న ముంబైతో ఆడాల్సి ఉంది.చదవండి: బాంబు పేల్చిన కేఎల్ రాహుల్!
బీసీసీఐపై కేఎల్ రాహుల్ ఆగ్రహం!
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్స్టార్కు చెందిన సూపర్స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్బాల్ క్రికెట్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది. కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్ఫామ్లో ఉన్న రాహుల్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్ల్లో 433 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్!
పూరన్ సిక్సర్ల వర్షం.. దెబ్బకు వైభవ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్ను ఝూళిపించాడు. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన పూరన్.. తన తుఫాన్ బ్యాటింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న 8 సిక్సర్లు, ఒక ఫోర్తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. పూరన్ ఇప్పటివరకు 5 సార్లు 20 కంటే తక్కువ బాల్స్లోనే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు వైభవ్ సూర్యవంశీ(4) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో వైభవ్ను పూరన్ అధిగమించాడు. ఈ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ(6) అగ్రస్ధానంలో ఉన్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే..లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు.చదవండి: 'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'
భారీ వర్షం.. ఢిల్లీ-సీఎస్కే మ్యాచ్పై అనిశ్చితి
ఐపీఎల్ 2026లో ఇవాళ (మే 5) కీలక సమరం జరగాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే పరిస్థితి ఉంది. మ్యాచ్కు కొన్ని గంటలకు ముందు (సాయంత్రం 4 గంటల ప్రాంతంలో) ఢిల్లీలో భారీ వడగండ్ల వాన కురిసింది.మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్సింది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు కూడా వాతావరణం ప్రతికూలంగానే ఉండటంతో వాష్ ఔట్ అయ్యే ప్రమాదం ఉందని అంచనా. It's delhi at 3.15 pm not Manali #weather pic.twitter.com/kB9JwzVkeJ— vipul kashyap (@kashyapvipul) May 5, 2026ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే ప్లే ఆఫ్స్ బెర్త్పై భారీ ఆశలు పెట్టుకున్న ఇరు జట్లకు తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సీఎస్కే, ఢిల్లీ తలో 9 మ్యాచ్ల్లో నాలుగేసి విజయాలతో 8 పాయింట్లతో పట్టికలో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పోలిస్తే సీఎస్కే రన్రేట్ మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించబడుతుంది. అప్పుడు ఇరు జట్లకు అది సంకటంగా మారే ప్రమాదం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు రంజుగా సాగుతుంది. 13 పాయింట్లతో పంజాబ్ టాప్ ప్లేస్లో ఉండగా.. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్ తలో 12 పాయింట్లతో వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నాయి. సీఎస్కే, ఢిల్లీ తలో 8 పాయింట్లతో 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న కేకేఆర్, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ సైతం తాజాగా ఓ విజయం సాధించి అధికారికంగా రేసులో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ ఆశలను దాదాపుగా వదులుకున్న జట్టు ఏదైనా ఉందా అంటే, అది లక్నో మాత్రమే. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతయ్యాయి. అధికారికంగా రేసులో ఉన్నప్పటికీ.. అది జరిగే పని కాదు.
'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'
ఐపీఎల్-2026 సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, టెక్నికల్గా మాత్రం ఇంకా చాలా మెరుగుపడాలి అని మంజ్రేకర్ అన్నాడు. అంతేకాకుండా భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు సూర్యవంశీకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు. కాగా వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, హేజిల్వుడ్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం విడిచిపెట్టలేదు.ఐపీఎల్ సీజన్కు ముందు జరిగిన అండర్-19 వరల్డ్కప్లోనూ వైభవ్ దుమ్ములేపాడు. దీంతో సంజయ్ మంజ్రేకర్ మాత్రమే కాకుండా సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం వైభవ్ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయాలని సూచిస్తున్నారు."వైభవ్ సూర్యవంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై సెంచరీ, ఐపీఎల్లో ఫామ్ను బట్టి చూస్తే భారత టీ20 జట్టులోకి వచ్చేందుకు అతడు అర్హుడు. ఐపీఎల్ వంటి మహా వేదికపై ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే, కచ్చితంగా జాతీయ జట్టు అరంగేట్రానికి సిద్దంగా ఉన్నట్లే.ఇప్పుడు వైభవ్ కూడా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుత భారత టీ20 జట్టులో ఇప్పటికే ఓపెనింగ్ స్ధానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి వారు కూడా ఓపెనర్లగా రాణిస్తున్నారు.ఈ క్రమంలో వైభవ్ను ఓపెనర్గా ఆడిస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైభవ్కు మంచి టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్సైడ్లో షాట్లు కొడుతున్నాడు. ఇది కేవలం టీ20ల మాత్రమే సరిపోతుంది. టెస్టులకు సరిపోదు. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి పిచ్లపై రాణించాలంటే బంతికి దగ్గరగా వెళ్లి ఆడాలి. ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడితే పరుగులు సాధించలేరు. టీ20 క్రికెట్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు మీకు మంచి పేరును తీసుకురావచ్చు. కానీ నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్లో రాణిస్తానే దక్కుతుందని" మంజ్రేకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్న టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత్, తాజా ర్యాంకింగ్స్లో 275 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.ఈ జాబితాలో ఇంగ్లండ్ 262 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య తేడా స్వల్పంగా తగ్గినప్పటికీ, భారత్ టాప్ ర్యాంక్ను నిలుపుగోగలిగింది.గత రెండు సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్లో భారత్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుసగా 2024, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటు, ఈ మధ్యకాలంలో ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్లలో అజేయంగా నిలిచింది. ఈ విజయాలే భారత జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాయి.ఇక ర్యాంకింగ్స్లో నాలుగో నుంచి ఏడో స్థానాల వరకు పెద్ద మార్పులు లేవు. న్యూజిలాండ్ (247), సౌతాఫ్రికా (244), పాకిస్తాన్ (240), వెస్టిండీస్ (233) వరుస స్థానాలు దక్కించుకున్నాయి.దిగువ స్థానాల్లో మాత్రం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానానికి ఎగబాకగా, శ్రీలంక తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 220 పాయింట్లతో పదో స్థానాన్ని నిలబెట్టుకుంది.పసికూన అమెరికా జట్టు మంచి పురోగతి సాధిస్తూ 13వ స్థానానికి చేరుకోగా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ జట్లు ఒక్కో స్థానం దిగజారాయి. 2026 ప్రపంచకప్లో ఆకట్టుకున్న ఇటలీ జట్టు గణనీయంగా మెరుగై 23వ స్థానానికి ఎగబాకింది.మొత్తంగా తాజా ర్యాంకింగ్స్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతుండగా, ఇతర జట్లు కూడా క్రమంగా పోటీని పెంచుతున్నాయి.
Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా!
క్రికెటర్గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల్లో చాలా మందికి ఈ కల అందని ద్రాక్ష లాంటిదే. రంజిత్ విషయంలోనూ ఇదే జరిగింది. క్రికెటర్ కావాలన్న ఆశయానికి మధ్యలోనే గండిపడింది. కారణాలు ఏవైనా.. ప్రతిభ ఉన్నా సరే అతడు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోయాడు.అయినప్పటికీ క్రికెట్పై ప్రేమను వదులుకోలేకపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సలహా అతడికి కొత్త దారి చూపించింది. ఆట, ఆటగాళ్లతో మమేకమయ్యే వీలు కల్పించింది. హైదరాబాద్ మేటి క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు.. అమన్ రావు వంటి వర్ధమాన క్రికెటర్లకు ఫిట్నెస్ మెళకువలు నేర్పే స్థాయికి చేర్చింది.తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని అగ్రహారం రంజిత్ కుమార్ స్వస్థలం. తల్లిదండ్రులు ఏనుగుల బీరయ్య, ఏనుగుల భాగ్య. వారిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉపాధి నిమిత్తం రంజిత్ తండ్రి హైదరాబాద్కు వలస వచ్చారు. ఓవైపు చదువుకుంటూనే క్రికెట్పై మక్కువ పెంచుకున్న రంజిత్.. తండ్రికి మనసులోని మాట చెప్పాడు.ఎంబీఏ చదివాడుఆర్థికంగా కష్టంగా ఉన్నా కుమారుడి ఆశయానికి ఆయన అడ్డుచెప్పలేదు. జూనియర్ లెవల్లో హైదరాబాద్ తరఫున కొడుకు సత్తా చాటుతుంటే మురిసిపోయారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?.. ప్రతిభ ఉన్నా కొన్ని అనుకోని అడ్డంకుల వల్ల క్రికెటర్ కావాలన్న రంజిత్ కల ముగిసిపోయింది.ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టిన రంజిత్.. ఎంబీఏ పూర్తి చేశాడు. అయితే, భవిష్యత్తుపై అప్పుడు అతడికి ఎలాంటి స్పష్టతా లేదు. మనసంతా క్రికెట్ మీదే ఉంది. ఆ సమయంలోనే స్నేహితుడొకరు ఫిట్నెస్ ఇండస్ట్రీ గురించి రంజిత్కు చెప్పాడు. అసలు తనకు ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి వెళ్లడం సరైందేనా అని అతడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాడు.అవగాహన లేని రంగంలోకి వెళ్లి.. సక్సెస్ఏం జరిగినా మన మంచికే అనుకుని రంగంలోకి దిగాడు. కొన్నాళ్లపాటు దారీతెన్నూ లేకుండా రంజిత్ ప్రయాణం సాగింది. అయితే, కఠిన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందంటారు. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రంజిత్.. స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు.ఆటగాళ్ల జీవితంలో అత్యంత కీలక పాత్ర స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్దేనన్న సంగతి తెలిసిందే. ప్లేయర్ల ఫిట్నెస్, బలం, వేగం, చురుకుదనాన్ని పెంచడం.. అదే విధంగా గాయాల బారిన పడకుండా వారి ఆట తీరును మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతలు.తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతోఇక ఒక్కో మెట్టు ఎక్కిన రంజిత్ కుమార్.. హైదరాబాద్ సీనియర్ మెన్స్ జట్టు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎదిగాడు. రంజీ ట్రోఫీ, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో తిలక్ వర్మ, సిరాజ్ వంటి ఆటగాళ్లతో నిండిన జట్లకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా వ్యవహరించాడు. బీసీసీఐ-ఎన్సీఏ అక్రిడేషన్ పొందిన రంజిత్ కుమార్.. ప్రస్తుతం పెర్ఫామెన్స్ కోచింగ్లో మాస్టర్స్ చేస్తున్నాడు. ఇటీవలే BCCI COE అండర్-19 బాయ్స్ క్యాంప్నకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా ఎంపికయ్యాడు.చిన్ననాడు కలలు కన్నట్లుగా తానొక స్టార్ క్రికెటర్ కాలేకపోయినా.. ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్ సజావుగా కొనసాగించేందుకు కోచ్గా రంజిత్ తన ప్రతిభను ఉపయోగిస్తున్నాడు. విధి తనకు ఓ దారి మూసివేసినా.. కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో మరో దారిలో తన గమ్యాన్ని చేరుకున్న రంజిత్ కుమార్ యువతకు ఆదర్శం.చదవండి: హార్దిక్ పాండ్యాపై వేటు.. ముంబై కెప్టెన్గా తొలగింపు?
సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి ...
అదరగొట్టిన భారత్
హోర్సెన్స్ (డెన్మార్క్): తమదైన రోజున సహజశైలిలో ...
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్’
మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్ సంఘం (డబ...
పట్టుదలే పెట్టుబడిగా...
విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో ...
'ఐపీఎల్లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'
ఐపీఎల్-2026 సీజన్లో అద్భుత ప్రదర్శనలతో దూస...
టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్న టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక పురుషుల టీ20 జట్...
Karimnagar: అగ్రహారం నుంచి బీసీసీఐ దాకా!
క్రికెటర్గా ఎదగడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యంగా మధ...
'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'
ఐపీఎల్-2026 సీజన్లో సోమవారం ఏకానా స్టేడియం వేద...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
వీడియోలు
భయం పుట్టిస్తున్న వైభవ్ బ్యాటింగ్..
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
