Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mohammad Amir Makes New Prediction On India After T20 WC Semifinals Take1
చెత్త ఫీల్డింగ్‌.. టీమిండియా గెలవలేదు: పాక్‌ మాజీ బౌలర్‌ ఓవరాక్షన్‌

పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్‌ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలో సూర్యకుమార్‌ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్‌-8గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి.. సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ సెమీస్‌ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్‌ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్‌-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్‌ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండిఅయినప్పటికీ ఆమిర్‌ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్‌ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి.గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్‌ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదుఇక వెస్టిండీస్‌ బ్యాటర్లు వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు. వాళ్లు ఫైనల్‌ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్‌ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్‌ సూపర్‌-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

T20 WC Semis IND vs ENG: Sanju Samson biggest threat Jofra Archer2
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నాకౌట్‌ దశకు చేరుకుంది. ఇ‍ప్పటికే నాలుగు సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్‌ జట్లు బుధవారం కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్‌- ఇంగ్లండ్‌ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక సూపర్‌-8లో హ్యాట్రిక్‌ విజయాలతో ఇంగ్లండ్‌ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్‌ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్‌అయితే, వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో రాణించడంతో భారత్‌ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాలు.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప వేరే బౌలర్‌ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ విఫలం కావడం సెమీస్‌కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్‌ పేసర్‌ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్‌ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఆర్చర్‌తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్‌ ఈసారి కూడా ఆర్చర్‌తోనే బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభిస్తే.. ఓపెనర్‌ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్‌ కర్రాన్‌ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్‌లో నాలుగేళ్లలో సామ్‌ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌ విండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్‌-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్‌తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Protest At Gymkhana Ground During HCA President Press Meet 3
ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా

తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అమర్‌నాథ్‌ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్‌నాథ్‌.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి. మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది.

Become A Star In Short Time: Ex India Star Slams Abhishek Sharma4
బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.సూపర్‌-8 దశలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్‌కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌గా‘‘వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్‌ శర్మ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్‌స్టార్‌గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాట్‌ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్‌లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్‌తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్‌సెట్‌ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్‌ తివారి అభిషేక్‌ శర్మ ఆట తీరును విమర్శించాడు. మరోవైపు.. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం అభిషేక్‌ ఫామ్‌లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్‌ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

IPL 2026 Its Official: RCB confirmed to return to Chinnaswamy stadium5
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్‌ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్‌ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్‌లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్‌లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌గా టైటిల్‌ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌: గంభీర్‌

Choti Soch: Shahid Afridi Lambasts at PCB narrow minded 50 lakh fine6
చిల్లర.. సంకుచిత బుద్ధి: పాక్‌ బోర్డుపై మండిపడ్డ ఆఫ్రిది

ఐసీసీ ఈవెంట్లో పాకిస్తాన్‌ మరోసారి నిరాశపరిచింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ‌లో‌ పేలవ ప్రదర్శనతో ‘సూపర్‌–8’ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌‌ క్రికెట్‌ బోర్డు (PCB) సీనియర్లపై గుర్రుగా ఉంది.ఈ నేపథ్యంలో ఆటగాళ్ల పారితోషికాలు, మ్యాచ్‌ ఫీజుల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ‘‘ఈ విషయంలో బోర్డు తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఫీజుల్లో కోత విధించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనకు ఈ విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది’’ అని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.చిల్లర.. సంకుచిత బుద్ధిఈ విషయంపై పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది (Shahid Afridi) ఘాటుగా స్పందించాడు. పీసీబీ విధించే జరిమానా చిల్లరలా ఉందని.. ఇంత సంకుచిత స్వభావం పనికిరాదంటూ బోర్డు తీరును విమర్శించాడు. చెత్తగా ఆడి దేశం పరువు తీసిన వాళ్లకు ఇంతకంటే కఠినమైన శిక్షలు విధించాలంటూ పాక్‌ జట్టు తీరుపై మండిపడ్డాడు.‘‘ఇది చాలా చిన్న మొత్తం. యాభై లక్షల రూపాయలతో మీరేం చేస్తారు? ఇది అసలు జరిమానాలా అనిపించడమే లేదు. ఇంత సంకుచిత బుద్ధి పనికిరాదు. సరిగ్గా ఆడని క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.రెండేళ్లు పక్కన పెట్టండిఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడమని చెప్పాలి. జట్టులో ‘ఇంకొందరు మహానుభావులు’ ఉన్నారు. వాళ్లనైతే మరో రెండేళ్లపాటు జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదు. వాళ్లకు ఇలాంటి శిక్ష అయితేనే సరిగ్గా ఉంటుంది’’ అని షాహిద్‌ ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాగా ఆడని ఆటగాళ్లకు పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 50 లక్షలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 16 లక్షలు) జరిమానా వేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆఫ్రిది అన్నట్లు పాక్‌ ఆటగాళ్లకు ఇదేమీ చిన్నమొత్తం కాదు. వార్షిక కాంట్రాక్టులలో గ్రేడ్‌ సి, డిలలో ఉన్న వాళ్లకు పాక్‌ కరెన్సీలో కేవలం రూ. 10- 17 లక్షల పారితోషికం మాత్రమే ఉంటుంది.నానాటికీ తీసికట్టుగాఇదిలా ఉంటే.. మేజర్‌ టోర్నీల్లో పాకిస్తాన్‌ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా జట్టు నిష్క్రమించడం వరుసగా ఇది నాలుగోసారి.ఈ నేపథ్యంలో బోర్డు కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదు. మరోవైపు.. ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడిన పాకిస్తాన్‌ ఆదివారం రాత్రి కొలంబో నుంచి నేరుగా లాహోర్‌ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లంతా గప్‌చుప్‌గా ఇంటిబాట పట్టారు. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సల్మాన్‌ ఆఘా కెప్టెన్సీలో పాక్‌.. గ్రూప్‌ దశలో పసికూనలు నెదర్లాండ్స్‌, అమెరికా, నమీబియాలపై గెలిచింది. టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. సూపర్‌-8 దశలో న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా.. తదుపరి ఇంగ్లండ్‌ చేతిలో ఓడింది. ఆఖరిగా శ్రీలంకపై గెలిచినా నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

FIFA World Cup 2026: Iran To Withdraw If So Who Will Replace Iran7
WC 2026: యుద్ధం ఎఫెక్ట్‌.. ప్రపంచకప్‌ టోర్నీ నుంచి అవుట్‌

యుద్ధం వేళ ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్‌-2026 టోర్నీ నుంచి ఇరాన్‌ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూన్‌–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్‌ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్‌ స్పష్టం చేశాడు.వైమానిక దాడులుకాగా మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్‌.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్‌ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్‌ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్‌ అన్నాడు.ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్‌–జూలైలలో జరిగే ప్రపంచకప్‌లో ఇరాన్‌ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్‌ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్‌, ఈజిప్ట్‌లతో కలసి ఉంది ఇరాన్‌.గత ఆరు పర్యాయాల్లోనూషెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 15న న్యూజిలాండ్‌తో (కాలిఫోర్నియాలో), జూన్‌ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్‌ 26న ఈజిప్ట్‌తో (సియాటెల్‌లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్‌ అభిమానుల ప్రవేశంపై ట్రంప్‌ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్‌ జట్టు ఏడోసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్‌ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.ఇరాన్‌ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?ఒకవేళ ఇరాన్‌ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్‌లో ఉన్న ఇరాన్‌.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్‌, యూఏఈ ఉన్నాయి. భారీ జరిమానాఅయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్‌ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.చదవండి: FIFA World Cup 2026: అర్హ‌త సాధించిన దేశాలు ఇవే

Who Brought Him: BCCI Clear Stance Amid Demands Of Auqib Nabi Selection8
అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

ఆకిబ్‌ నబీ.. భారత క్రికెట్‌లో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో అతడి అత్యద్భుత ప్రదర్శనలు ఇందుకు కారణం. జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ గెలవడంలో ఈ పేస్‌ బౌలర్‌ది కీలక పాత్ర.స్పందించిన బీసీసీఐసీజన్‌ ఆసాంతం అద్భుత ఆట తీరుతో జట్టును గెలిపించిన ఆకిబ్‌ నబీ (Auqib Nabi Dar)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని భారత టెస్టు జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పందించాడు.అతడిదే కీలక పాత్రత్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆకిబ్‌ ఎంపిక విషయంలో తుది నిర్ణయం మాత్రం సెలక్టర్లదేనని స్పష్టం సైకియా చేశాడు. ‘‘అతడు అద్భుతంగా ఆడాడు. జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర.క్వార్టర్‌ ఫైనల్లో ఐదు వికెట్లు తీశాడు. సెమీ ఫైనల్లోనూ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఫైనల్లోనూ ఇదే ప్రదర్శన పునరావృతం చేశాడు. ఐదు వికెట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతడి బౌలింగ్‌ ఫైనల్‌ రాతను మార్చింది. కాబట్టి ప్రతి ఒక్కరి దృష్టిని అతడు ఆకర్షించగలిగాడు.రంజీ ట్రోఫీకి సంబంధించి ప్రతి మ్యాచ్‌కు మా సెలక్టర్లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశాము. ఫైనల్‌ సహా కీలక మ్యాచ్‌లన్నీ మా సెలక్టర్లు వీక్షించారు. వాళ్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారనే అనుకుంటున్నా. ఇప్పటికే అతడు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. సెలక్టర్లే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?ప్రతిభ ఉన్న వాళ్లకు అన్యాయం జరగకుండా బీసీసీఐ సరైన చర్యలు తీసుకుంటుంది. మా సెలక్టర్లు అతడితో పాటు మ్యాచ్‌లో మెరుగ్గా రాణించిన అందరి ఆటను గమనించారు. నబీని వెలుగులోకి తీసుకుచ్చింది ఎవరు?.. అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. జమ్మూ కశ్మీర్‌ సెలక్టర్లే కదా!.. దేశీ క్రికెట్‌లో రాష్ట్ర జట్టు తరఫున అదరగొట్టిన వారికి బీసీసీఐ సెలక్టర్లు కచ్చితంగా అవకాశం ఇస్తారు’’ అని దేవజిత్‌ సైకియా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పేర్కొన్నాడు.60 వికెట్లు కూల్చాడుకాగా కర్ణాటకతో ఫైనల్లో జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీ ఐదు వికెట్లతో రాణించి.. కర్ణాటక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విజేతగా అవతరించింది. తాజా రంజీ సీజన్‌లో 29 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్‌ ఏకంగా 60 వికెట్లు కూల్చాడు. ఇందులో ఎనిమిది ఫైవ్‌ వికెట్లు హాల్స్‌ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆకిబి నబీ అరంగేట్రానికి డిమాండ్లు పెరుగుతున్నాయి. చదవండి: ప్రపంచకప్‌ వైఫల్యాల తర్వాత కూడా బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు

Cricket is team game Shivam 2 fours as important as Sanju 97: Gambhir  9
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్‌ ఆరంభంలో నేపాల్‌ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్‌-8లో శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ఇంగ్లండ్‌ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్‌ సాల్ట్, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్, విల్‌ జాక్స్‌ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్‌ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్‌ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్‌ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్‌తో కీలకమైన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో శాంసన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు’’ అని గంభీర్‌ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!‘క్రికెట్‌ ఎప్పటికైనా టీమ్‌ గేమ్‌. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్‌ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్‌ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్‌ (97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

PV Sindhu returns home safely after harrowing Dubai ordeal as Middle East crisis costs her All England shot10
సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.భయానక అనుభవం సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.ఇంటికి చేరాను మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది. కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement