Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

David Warner loses cool at PSL captains presser1
పాక్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభానికి ముందు ఆసక్తికర పరిణామం

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెప్టెన్ల ప్రెస్‌ మీట్‌లో కరాచీ కింగ్స్ కెప్టెన్‌డేవిడ్ వార్నర్ సహచర కెప్టెన్లపై ఫైర్‌ అయ్యాడు. వార్నర్‌ విలేకరుల ప్రశ్నలకు జవాబిస్తుండగా ఇతర ఫ్రాంచైజీల కెప్టెన్లు షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ రిజ్వాన్‌, మార్నస్‌ లబూషేన్‌ నవ్వుకుంటూ కనిపించారు. 🗣️ “What’s wrong gentlemen? Sorry we’ve got some school kids here” - David Warner on guys being unprofessional at the captains day press conference pic.twitter.com/gJRDtTAw8t— Usman (@jamilmusman_) March 25, 2026దీంతో చిర్రెత్తిపోయిన వార్నర్‌ వారికి గట్టిగా చురకలంటిచ్చాడు. What’s wrong with you..? Sorry gentlemen, we have got school kids here అంటూ అసహనం ‍ప్రదర్శించాడు. ఎప్పుడూ సరదాగా ఉండే వార్నర్‌ ఇలా రియాక్ట్‌ కావడంతో విలేకరులు సహా అక్కడున్న వారంతా కాసేపు షాక్‌లో ఉండిపోయారు.ఇదిలా ఉంటే, 2026 ఎడిషన్‌ పాక్‌ సూపర్‌ లీగ్‌ ఇవాళ (మార్చి 26) ప్రారంభ​మైంది. పశ్చిమాసియాలో యుద్దం కారణంగా ఇంధన సంక్షోభం ఏర్పడటంతో ఈ లీగ్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. అవి కూడా కేవలం రెండు వేదికల్లో మాత్రమే జరుపుతున్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో షాహీన్‌ అఫ్రిది నేతృత్వంలోని లాహోర్‌ ఖలందర్స్‌, మార్నస్‌ లబూషేన్‌ నేతృత్వంలోని కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్‌ కింగ్స్‌మన్‌ తలపడుతున్నాయి.

Heard few RCB chants: Bethell recalls T20 WC semi final knock vs IND2
T20 WC Semis: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు వాళ్ల మద్దతు

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్‌ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.253 పరుగుల భారీ స్కోరుముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.టాపార్డర్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆశలు రేపాడు.బెతెల్‌ విధ్వంసకర సెంచరీకేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్‌ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్‌ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్‌ బెతెల్‌ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.వాళ్లు నాకు మద్దతుగా నిలిచారుఈ విషయం గురించి బెతెల్‌ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.కాగా 22 ఏళ్ల బెతెల్‌ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్‌ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

IPL 2026: SRH matches scheduled in second phase3
IPL 2026: రెండో దశలో సన్‌రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20 మ్యాచ్‌లతో కలుపుకొని లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో వెలువడుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్‌లో 10 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి విడత నాలుగు మ్యాచ్‌లతో కలుపుకొని సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌ లీగ్‌ దశ మొత్తంలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది.రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లోనే (ఏప్రిల్‌ 13) ఎస్‌ఆర్‌హెచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరుగనుంది.ఏప్రిల్‌ 18- సీఎస్‌కేతో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్‌ 21- ఢిల్లీ క్యాపిటల్స్‌తో (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్‌ 25- రాజస్థాన్‌ రాయల్స్‌ (జైపూర్‌, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్‌ 29- ముంబై ఇండియన్స్‌ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)మే 3- కేకేఆర్‌ (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)మే 6- పంజాబ్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)మే 12- గుజరాత్‌ టైటాన్స్‌ (అహ్మదాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)మే 18- సీఎస్‌కే (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)మే 22- ఆర్సీబీ (హైదరాబాద్‌, రాత్రి 7:30 గంటలకు)తొలి దశలో ప్రకటించిన షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లు..మార్చి 28- ఆర్సీబీతో (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్‌ 2- కేకేఆర్‌తో (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్‌ 5- లక్నో సూపర్‌ జెయింట్స్‌తో (హైదరాబాద్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)ఏప్రిల్‌ 11- పంజాబ్‌ కింగ్స్‌తో (ముల్లాన్‌పూర్‌, మధ్యాహ్నం 3:30 గంటలకు)

Good news for rohit and virat fans, Team India going to play 20 ODIs till May 20274
రోహిత్‌, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్‌లో టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్‌ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్‌ ఇలా ఉండబోతుంది.ఐపీఎల్‌ తర్వాత జూన్‌ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఏకైక టెస్ట్‌ మరియు 3 వన్డేల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్‌ మ్యాచ్‌ జూన్‌ 6 నుంచి 10 వరకు ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్‌ 14), లక్నో (జూన్‌ 17), చెన్నై (జూన్‌ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.అనంతరం భారత్‌ జులైలో ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్‌ లీ స్ట్రీట్‌, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌, ట్రెంట్‌ బ్రిడ్జ్‌, బ్రిస్టల్‌, సౌథాంప్టన్‌ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, కార్డిఫ్‌, లార్డ్స్‌లో జరుగనున్నాయి.సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్‌ 27, 30, అక్టోబర్‌ 3 తేదీల్లో తిరువనంతపురం​, గౌహతి, ముల్లాన్‌పూర్‌ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్‌ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్‌, డెహ్రాడూన్‌, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్‌పై స్పష్టత రావాల్సి ఉంది.డిసెంబర్‌లో శ్రీలంక భారత్‌లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు డిసెంబర్‌ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి.వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి.

IPL 2026 second schedule released5
ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ విడుదల

ఐపీఎల్‌ 2026 రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ దశలో లీగ్ స్టేజ్‌లో మిగిలిన 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌లు ఏప్రిల్ 13 నుండి మే 24 వరకు దేశంలోని 12 వేదికలపై జరగనున్నాయి. కొద్ది రోజుల కిందటే తొలి దశ షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే తొలి దశలో మొత్తం 20 మ్యాచ్‌లు జరుగున్నాయి. తొలి దశ 20, రెండో దశ 50 కలిపి లీగ్‌ స్టేజ్‌లో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్‌ వేదికలు తరువాత ప్రకటించబడతాయి.🚨 IPL 2026 FULL SCHEDULE 🚨 pic.twitter.com/xRrjx7qYhs— Johns. (@CricCrazyJohns) March 26, 2026రెండో దశ మ్యాచ్‌ల వేదికలుబెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయపూర్, న్యూ చండీగఢ్‌రెండో దశలో తొలి మ్యాచ్‌ ఏప్రిల్ 13న హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగనుంది. రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్న మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.కాగా, దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు.

IPL 2026: CSK To Make Big Change After Sanj Inclusion Ruturaj Hints6
IPL 2026: సీఎస్‌కేలో కీలక మార్పు

గతేడాది చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే). చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌లో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని జట్టును ముందుకు నడిపాడు.ఊహించని నిర్ణయంఅయితే, పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది సీఎస్‌కే. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు సీఎస్‌కే ఊహించని నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్‌, సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను ట్రేడ్‌ చేసింది.సంజూ శాంసన్‌ చేరికజడ్డూను రాజస్తాన్‌ రాయల్స్‌కు ఇచ్చేసి.. అతడికి బదులుగా ఆ జట్టు కెప్టెన్‌, టీమిండియా టీ20 స్టార్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)ను జట్టులో చేర్చుకుంది. దీంతో వికెట్‌ కీపింగ్‌లో ధోని వారసుడిగా సంజూ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు రుతురాజ్‌ గైక్వాడ్‌ను కాదని సంజూను కెప్టెన్‌ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, సీఎస్‌కే మాత్రం రుతుకే మరోసారి పగ్గాలు అప్పగించింది.నాతో పాటు ఓపెనర్‌గాఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌ పాత్ర ఏమిటన్న అంశంపై రుతురాజ్‌ గైక్వాడ్‌ తాజాగా స్పందించాడు. ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశానికి రుతు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను, సంజూ ఈసారి ఓపెనర్లుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా ఈసారి సీఎస్‌కే ఓపెనింగ్‌ జోడీ ఎవరన్న ప్రశ్నకు తెరదించాడు.కాగా ఓపెనర్‌గా రుతుకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి 60 ఇన్నింగ్స్‌లో అతడు 2289 పరుగులు చేశాడు. అయితే, గతేడాది రచిన్‌ రవీంద్ర, రాహుల్‌ త్రిపాఠి సీఎస్‌కే ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. మూడో స్థానంలో రుతురాజ్‌ వచ్చాడు.ఓపెనర్‌గానే బెస్ట్‌ఇక ఇప్పటికి ఓవరాల్‌గా వన్‌డౌన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌ ఆడిన రుతు కేవలం 208 పరుగులే చేశాడు. దీంతో మరోసారి తానే ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. టీమిండియా, రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా సంజూకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

IPL 2026: One good news and one bad news for RCB, Hazlewood in, Thushara Out7
IPL 2026: ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీకి ఓ గుడ్‌ న్యూస్‌, ఓ బ్యాడ్‌ న్యూస్‌ అందుతుంది. స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో చేరాడు. హాజిల్‌వుడ్‌ ఈ సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే అతను సీజన్‌ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో జోష్‌ నింపాడు. తమ బౌలింగ్‌ యూనిట్‌కు బ్యాక్‌ బోన్‌ అయిన హాజిల్‌వుడ్‌ జట్టులో చేరడంతో ఆర్సీబీ టైటిల్‌ నిలబెట్టుకోగలమన్న ధీమా వ్యక్తం చేస్తుంది. గత ఎడిషన్‌లో ఆర్సీబీ టైటిల్‌ గెలవడంలో హాజిల్‌ కీలకపాత్ర పోషించాడు. అందుకే ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న హాజిల్‌వుడ్‌, ఎట్టకేలకు జట్టులో చేరడంతో ఆర్సీబీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 12.5 కోట్లకు రీటైన్‌ చేసుకున్న విషయం తెలిసిందే.బ్యాడ్‌ న్యూస్‌ ఏంటంటే.. రూ. 1.6 కోట్లకు రీటైన్‌ చేసుకోబడిన నువాన్‌ తుషార (శ్రీలంక) ఈ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ కారణాల చేత లంక క్రికెట్‌ బోర్డు అతనికి ఎన్‌ఓసీ మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్‌ 2026లో పాల్గొనడానికి అనర్హుడయ్యాడు. తుషారపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకొని ఉండింది. డెత్‌ ఓవర్లలో అతని వైవిధ్యం జట్టుకు ఉపయోగపుడుతుందని భావించింది. అయితే చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.తుషార అంశం బయటికి రాక​ ముందే ఆర్సీబీ పేస్‌ బౌలింగ్‌ విభాగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగత కారణాల చేత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ యశ్‌ దయాల్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు.ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరంభ మ్యాచ్‌తోనే తమ ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో మార్చి 28న జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రజత్‌ పాటిదార్‌ నేతృత్వంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత సీజన్‌తో పోలిస్తే, ఆర్సీబీలో పెద్ద మార్పులు జరగలేదు. విరాట్‌ కోహ్లి, టిమ్‌ డేవిడ్‌, జేకబ్‌ బేతెల్‌, కృనాల్‌ పాండ్యా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఫిల్‌ సాల్ట్‌, రొమారియో షెపర్డ్‌, జితేశ్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తదితర ఆటగాళ్లు జట్టులో కొనసాగుతున్నారు.

BCCI HAS ANNOUNCED TEAM INDIA HOME SCHEDULE8
టీమిండియా హోం షెడ్యూల్‌ విడుదల

2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా హోం షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (మార్చి 26) విడుదల చేసింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. 17 వేదికల్లో మొత్తం 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు (9 వన్డేలు, 8 టీ20లు, 5 టెస్ట్‌లు) జరగనున్నాయి.ఈ సీజన్ సెప్టెంబర్ 27న వెస్టిండీస్ పర్యటనతో మొదలవుతుంది. ఇందులో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉన్నాయి. వన్డేలు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్‌లో.. టీ20లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. 🚨 FULL HOME SCHEDULE OF TEAM INDIA IN 2026-27 HOME SEASON 🇮🇳- Great work by BCCI to announce the schedule way earlier. pic.twitter.com/bWopsVcmVu— Johns. (@CricCrazyJohns) March 26, 2026డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటలో మూడు వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లో జరుగనుండగా.. మూడు టీ20లు రాజ్‌కోట్, కటక్, పూణేలో షెడ్యూల్‌ అయ్యాయి. వచ్చే ఏడాది (2027) జనవరిలో జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు ఉంటాయి. ఇవి కోల్‌కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. ఈ హోం సీజన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భాగం ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. ఐదు టెస్టుల ఈ సిరీస్ కోసం​ ఆస్ట్రేలియా జట్టు జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 21వ తేదీ నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరుగుతుంది. తరువాతి మ్యాచ్‌లు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

Abhinav Mukund predicts the top four teams for IPL 20269
ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు రంగం సిద్ద‌మైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.ఈ నేప‌థ్యంలో ఐపీఎల్‌-19వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జ‌ట్ల‌ను భార‌త మాజీ ఓపెన‌ర్ అభిన‌వ్ ముకుంద్ అంచనా వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి కూడా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంద‌ని అత‌డు జోస్యం చెప్పాడు. కాగా గ‌తేడాది 17 ఏళ్ల నిరీక్ష‌ణ త‌ర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా గ‌త సీజ‌న్‌లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ సైతం ఈసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంద‌ని ముకుంద్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ రెండు జ‌ట్ల‌తో పాటు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తాయని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.కాగా సీఎస్‌కే గ‌త రెండు సీజ‌న్ల‌లోనూ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేక‌పోయింది. కానీ ఈసారి మాత్రం 'యెల్లో ఆర్మీ', ఖచ్చితంగా టాప్-4లో ఉంటుందని ముకుంద్ భావిస్తున్నాడు. అయితే ముకుంద్ త‌న ఎంచుకున్న టాప్‌-4లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, మూడు సార్లు ఛాంపియ‌న్ కేకేఆర్ జ‌ట్ల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.చదవండి: IPL 2026: మ‌రో 2 రోజుల్లో ఐపీఎల్‌.. అంతలోనే బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం

NZ vs SA: Esterhuizen Creates History Becomes First Player In World To10
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

సౌతాఫ్రికా క్రికెటర్‌ కానర్‌ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు ఎస్తురూజెన్‌.సంగక్కర రికార్డు బద్దలుతద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్‌ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఎస్తురూజెన్‌ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్‌ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్‌పై 69 పరుగులు చేశాడు. 33 పరుగుల తేడాతో..మ్యాచ్‌ విషయానికొస్తే.. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్‌ కైవసం చేసుకుంది.ధనాధన్‌ హాఫ్‌సెంచరీన్యూజిలాండ్‌ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్‌ ఎస్తురూజెన్‌ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్‌ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు.రుబిన్‌ హెర్మన్‌ (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ముల్డర్‌ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. కివీస్‌ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్‌ భారీ షాట్‌లతో చెలరేగిపోయాడు.నాలుగో వికెట్‌కు ఫోరెస్టర్‌ (21 నాటౌట్‌)తో కలిసి కానర్‌ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో బెన్‌ సీర్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.154 పరుగులకు పరిమితంఅనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్‌ జాకబ్స్‌ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ జేమ్స్‌ నీషమ్‌ (24), టిమ్‌ రాబిన్‌సన్‌ (25), క్లీవర్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు.అయితే, కివీస్‌ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్‌ ఎస్తురూజెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. చదవండి: IPL 2026: ప్యాట్‌ కమ్మిన్స్‌ కీలక ప్రకటన

Advertisement
Advertisement
 
Advertisement