Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Inunganbi Takhellambam won bronze medal Asian Judo Championships1
పట్టుదలే పెట్టుబడిగా...

విశ్వ వేదికపై ఆసియా దేశాల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో జూడో ఒకటి. జపాన్, ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, మంగోలియా దేశాలు ఈ క్రీడలో ఎంతోమంది ప్రపంచ చాంపియన్‌లను అందించాయి. భారత్‌ విషయానికొస్తే ప్రాతినిధ్యమే తప్ప పతకాల గురించి ఆలోచిస్తే అత్యాశే అవుతుంది. కానీ ప్రతిభావంతులకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఈ క్రీడలోనూ భారత ప్లేయర్లు మెరిపిస్తారని మణిపూర్‌ అమ్మాయి ఇనున్‌గన్‌బీ తఖెల్లంబం నిరూపించింది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా సీనియర్‌ జూడో చాంపియన్‌షిప్‌లో ఇనున్‌గన్‌బీ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు కాంస్యం రూపంలో పతకాన్ని అందించింది.భారత్‌ నుంచి చివరిసారి అనితా చాను రూపంలో ఆసియా జూడో చాంపియన్‌షిప్‌ మెడలిస్ట్‌ను చూశాము. 2013లో జరిగిన ఆసియా పోటీల్లో ఆమె కూడా కాంస్య పతకం సాధించింది. 13 ఏళ్ల తర్వాత అనితా చాను కోచ్‌ హోదాలో హాజరైన ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మళ్లీ పతకం లభించింది. మహిళల 70 కేజీల విభాగంలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇనున్‌గన్‌బీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. కాంస్య పతక పోరులో మంగోలియా జూడోకాపై ఇనున్‌గన్‌బీ నెగ్గింది. ఇక ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్, ఏషియన్‌ గేమ్స్‌లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని మణిపూర్‌కు చెందిన 27 ఏళ్ల ఇనున్‌గన్‌బీ వెల్లడించింది. చాన్నాళ్లుగా జాతీయ జట్టు బ్లేజర్‌ వెంట తీసుకెళ్తున్న అనిత ఎట్టకేలకు ఈ టోర్నీలో తొలిసారి దానిని ధరించింది. ‘కోచ్‌ అనిత మొదటి టోర్నీ నుంచి బ్లేజర్‌ వెంట పెట్టుకొని వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు దాన్ని వేసుకునే సందర్భం రాలేదు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే ఆమె నన్ను అడిగారు. ఈ సారైనా బ్లేజర్‌ వేసుకోనిస్తావా అని. నేను అప్పుడే చెప్పా తప్పకుండా అని. ఎట్టకేలకు 13 ఏళ్ల తర్వాత నేను కాంస్యం సాధించడం ద్వారా పతక ప్రదానోత్సవం సందర్భంగా ఆమె బ్లేజర్‌ వేసుకున్నారు’ అని వెల్లడించింది. జూడోలో సాధారణంగా కోచ్‌లు ట్రాక్‌ సూట్‌లే ధరిస్తారు. పతక ప్రదానోత్సవంలో బ్లేజర్‌ వేసుకుంటారు. ‘భారత్‌ తరఫున చివరిసారిగా అనిత మేడమ్‌ ఈ పతకం నెగ్గారని నాకు తెలియదు. ఆమె 2013 కంటే చాలా ముందే మెడల్‌ గెలిచి ఉంటారని అనుకున్నా. ఆమె తర్వాత పతకం నెగ్గిన తొలి భారతీయురాలిని నేనే అని కోచ్‌లు చెప్పినప్పుడు నా ఆనందరం రెట్టింపు అయింది. 2021 నుంచి భారత సీనియర్‌ జట్టులో ఉన్నా. ఇప్పటి వరకు పాల్గొన్న ఏ టోర్నమెంట్‌లోనూ తొలి రౌండ్‌ దాటి ముందుకు వెళ్లలేకపోయా. ఇది నా కెరీర్‌లోనే అతిపెద్ద విజయం. ఈ ఫలితం నాలో ఆత్మవిశ్వాసం పెంపొందించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది. గాయాల నుంచి కోలుకొని... దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్, మేటి వెయిట్‌లిఫ్టర్‌ కుంజారాణి దేవి వంటి సూపర్‌స్టార్స్‌ వచ్చిన నేల మణిపూర్‌ నుంచే ఇనున్‌గన్‌బీ వెలుగులోకి వచి్చంది. ఇతర ప్లేయర్ల లాగే ఆమె కూడా కెరీర్‌ తొలి నాళ్లలో అనేక ఆటలు ప్రయత్నించి చివరకు జూడోను ఎంచుకుంది. ‘చిన్నప్పటి నుంచి కుంజారాణి దేవి, మేరీకోమ్‌ వంటి వారు సాధించిన ఘనతల గురించి చాలా విన్నాను. వాళ్లలాగే దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకునేదాన్ని. వారి బాటలోనే క్రీడలను ఎంచుకోవాలని ముందే భావించా. ఫుట్‌బాల్‌ సహా చాలా ఆటలు ఆడా... కానీ జూడో నా దృష్టిని ఆకర్షించింది’ అని ఇనున్‌గన్‌బీ చెప్పింది. కెరీర్‌ ఆరంభంలో మణిపూర్‌లోని జాతీయ స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె... ఆ తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించి సత్తా చాటింది. 2018లో ప్రాక్టీస్‌ సమయంలో తీవ్రంగా గాయపడిన ఇనున్‌గన్‌బీ... శస్త్రచికిత్స అనంతరం ఏడాది పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తిగా చిక్కిపోయింది. ‘నా శరీరం పెన్సిల్‌ లాగా అయిపోయింది’ అని ఒక సందర్భంలో ఈ మణిపూర్‌ జూడోకా తెలిపింది. ఆ తర్వాత 2024లో అదే కాలికి మరోసారి గాయం కావడంతో చాన్నాళ్ల పాటు ఆటకు దూరమైంది. అయితే కిందపడ్డ ప్రతిసారీ పైకి లేవడం అలవర్చుకున్న ఈ మణిపూర్‌ ముత్యం... ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో అది్వతీయ ప్రదర్శనతో చరిత్ర లిఖించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ షిరిన్‌జోన్‌ యుల్డోషోవా చేతిలో ఇనుంగాన్బి పరాజయం పాలైంది. అయితే ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ ఫైనల్‌కు చేరడంతో... మన బాక్సర్‌కు రెపిచాజ్‌ అవకాశం దక్కింది. ‘క్వార్టర్‌లో ఓడి నిరాశగా ఉన్నప్పుడు మరో అవకాశం వచి్చంది. కాంస్య పతక పోరుకు ముందు ఈ చాన్స్‌ వదిలి పెట్టకూడదని బలంగా నిర్ణయించుకున్నా’ అని ఇనున్‌గన్‌బీ వెల్లడించింది. ఫుట్‌బాల్‌ వద్దనడంతో... నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇనున్‌గన్‌బీకి బాక్సింగ్, రెజ్లింగ్‌లో కూడా ప్రవేశం ఉంది. తండ్రి ఫుట్‌బాల్‌ ఆడేందుకు నిరాకరించడంతో ఆమె తన దృష్టిని ఇండోర్‌ గేమ్స్‌ వైపు మరల్చుకుంది. రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో పక్కనే జూడో శిక్షణ సాగుతుంటే దాన్ని నిశితంగా పరిశీలించేంది. అందులో కొందరు ప్లేయర్లు నల్ల బెల్ట్‌లు, కొందరు తెల్ల బెల్ట్‌లు వేసుకునే వారు. అది ఆమెను బాగా ఆకర్షించింది. అందులోనూ తన ప్రత్యేకత చాటుకోవాలని భావించిన ఇనున్‌గన్‌బీ చివరకు జూడోలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. ఆరంభంలో నాలుగేళ్ల పాటు ప్రాథమిక దశను దాటలేకపోయిన ఇనున్‌గన్‌బీ... ఆ తర్వాత నిలకడ కనబర్చింది. తొలిసారి 2021 ఆసియా జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఈ మణిపూర్‌ ప్లేయర్‌ మొదటి రౌండ్‌లోనే పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత గాయాలు వేధించినా... పట్టుదలే పెట్టుబడిగా పెట్టి... మొక్కవోని దీక్షతో ముందుకు సాగి... తాజాగా కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. గతేడాది జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఓపెన్‌ జూడో పోటీల్లో ఇనున్‌గన్‌బీ పసిడి పతకం సాధించింది. ఈ జోరు ఇలాగే కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలనుకుంటున్న ఇనున్‌గన్‌బీకి మనమూ ఆల్‌ ద బెస్ట్‌ చెబుదాం! –సాక్షి క్రీడా విభాగం

Telangana State has huge sports potential, says Jayesh Ranjan2
‘క్రీడా యూనివర్సిటీతో గొప్ప ఫలితాలు’

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని, అందుకు తగిన వాతావరణం కల్పించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. ఈ క్రమంలోనే తొలిసారి ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ యూనివర్సిటీలో త్వరలోనే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో క్రీడలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక సదస్సును నిర్వహించింది. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా క్రీడలు, దాని అనుబంధ రంగాలతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ‘అటు క్రీడలు, ఇటు చదువుకు సమప్రాధాన్యం ఇస్తూ రెండు రంగాల్లోనూ అత్యుత్తమ ఫలితాలు అందించడమే యంగ్‌ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యంతో యూనివర్సిటీ సఫలం అవుతుందనే నమ్మకం ఉంది’ అని జయేశ్‌ రంజన్‌ చెప్పారు. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించిందని స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోనీబాలా దేవి అన్నారు. స్పోర్ట్స్‌ ఎడ్యుకేషన్, ఒలింపిక్‌ వాల్యూస్, స్పోర్ట్స్‌ సైన్స్, స్పోర్ట్స్‌ టెక్నాలజీ, పారా స్పోర్ట్స్‌ వంటి ఐదు వేర్వేరు అంశాలపై చర్చా కార్యక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డీలు ఇస్మాయిల్‌ బేగ్, నాగపురి రమేశ్, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కిషోర్‌ గోపినాథన్‌ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

IPL 2026 Match 42 : Gujarat Beat RCB3
ఆర్సీబీకి షాకిచ్చిన గుజరాత్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన గుజరాత్‌ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ తడబడుతూనే బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-28-3), రొమారియో షెపర్డ్‌ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్‌ గిల్‌ (43), జోస్‌ బట్లర్‌ (39), రాహుల్‌ తెవాతియా (27 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 6, వాషింగ్టన్‌ సుందర్‌ 12, షారుక్‌ ఖాన్‌ 8, జేసన్‌ హోల్డర్‌ 12, రషీద్‌ ఖాన్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్‌ శర్మ (3.5-0-44-1) వికెట్‌ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్‌ చేసిన హాజిల్‌వుడ్‌ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్‌ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

Jason Holder Catch Controversy, Will Virat Kohli Face IPL Ban For Losing Cool On Umpire4
అంపైర్‌పై ఫైర్‌ అయిన కోహ్లి

ఐపీఎల్‌ 2026లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్‌ ఆటగాడు జేసన్‌ హోల్డర్‌ పట్టిన ఓ క్యాచ్‌ (రజత్‌ పాటిదార్‌ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. Virat Kohli is unhappy with the decision by the third umpire on the catch of Rajat Patidar ❌Out or not-out - What are your thoughts? 👀 #RCBvsGT pic.twitter.com/3ItI5ZngJP— Hassi (@hass_1707) April 30, 2026ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్‌తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో విరాట్‌పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్‌లో రాణా అంపైర్‌తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్‌కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.Ball clearly touched the ground, it's a clear notout. Virat Kohli wasn't happy with Umpire decision.He schooled Umpire live in front of 130k fans😭🔥pic.twitter.com/2QrEN2nDCh— ` (@wokenupkohli) April 30, 2026కాగా, హోల్టర్‌ క్యాచ్‌ నిజంగా క్లీన్‌గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్‌ అంపైర్‌ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్‌ ఇవ్వడం మాత్రం కరెక్ట్‌ కాదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ గుజరాత్‌ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.

Virat Kohli Bruises Kagiso Rabada's Ego As Express Pace Gets Zero Respect5
దడదడలాడించిన విరాట్‌ కోహ్లి

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగుతున్న 42వ మ్యాచ్‌లో ఆర్సీబీ- గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఊహించిన విధంగానే గుజరాత్‌ బౌలర్లు తొలుత బౌలింగ్‌ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్‌ కోహ్లి. ఈ మ్యాచ్‌లో విరాట్‌ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్‌ కెరీర్‌ తొలినాళ్లలో విరాట్‌లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్‌ గుజరాత్‌ బౌలర్‌ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.Pace meets 𝙋𝙀𝙍𝙁𝙀𝘾𝙏𝙄𝙊𝙉 🤌🎥 Virat Kohli with 5️⃣ consecutive boundaries against Kagiso Rabada 🔥Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweets pic.twitter.com/mdunPUJiV0— IndianPremierLeague (@IPL) April 30, 2026ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో రబాడ బౌలింగ్‌లో విరాట్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్‌ బౌలర్‌ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.పుల్ షాట్‌తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్‌లో కోహ్లీ ఒకే ఓవర్‌లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.* 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)* 23 పరుగులు vs ఢిల్లీ (2013)* 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)* 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)మరో అరుదైన ఘనతఐపీఎల్ చరిత్రలో క్రిస్‌ గేల్‌, షేన్‌ వాట్సన్‌ తర్వాత ఒకే ఓవర్‌లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.రబాడ ఓవర్‌ తర్వాత సిరాజ్‌ వేసిన మరుసటి ఓవర్‌లోనూ ఓ సిక్సర్‌ బాదిన విరాట్‌.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో విరాట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తెరపడింది. వాస్తవానికి ఈ సీజన్‌ ప్రారంభం నుంచే విరాట్‌ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్‌ ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్‌లో విరాట్‌ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.కాగా, ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు.

South Africa Announce A Squad For Key Series Against England Lions6
ఇంగ్లండ్‌ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

త్వరలో ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టును ఇవాళ (ఏప్రిల్‌ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మార్క్వెస్‌ అకెర్మన్‌ ఎంపిక కాగా.. పలువురు జాతీయ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికా-ఏ జట్టు మే 22 నుంచి జూన్‌ 9 వరకు రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు అనధికారిక వన్డేల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ కోసం సౌతాఫ్రికా-ఏ జట్టు మే 16న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.ఈ పర్యటనలో తొలుత నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే 22-25 వరకు అరండల్‌ వేదికగా తొలి మ్యాచ్‌, మే 29-జూన్‌ 1 వరకు బెకెన్హమ్‌ వేదికగా రెండో మ్యాచ్‌ జరుగనున్నాయి.అనంతరం జూన్‌ 5న లీసెస్టర్‌ వేదికగా తొలి వన్డే, జూన్‌ 7న వార్సెస్టర్‌ వేదికగా రెండో వన్డే, జూన్‌ 9న వార్సెస్టర్‌ వేదికగా మూడో వన్డే జరుగనున్నాయి.నాలుగు రోజుల మ్యాచ్‌లకు సౌతాఫ్రికా-ఏ జట్టు..మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, బ్జోర్న్ ఫోర్టుయిన్, జుబైర్ హమ్జా, జోర్డన్ హెర్మన్, రూబిన్ హెర్మన్, న్కోబాని మొకోయెనా, డేన్ ప్యాటర్సన్, సినేతెంబా క్వెషిలే, లెసెగో సెనోక్వానే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్, టియాన్ వాన్ వూరెన్, కోడి యూసఫ్.వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా-ఏ జట్టు..మార్క్వెస్ అకెర్మన్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, Gerald Coetzee, టోనీ డి జోర్జి, కానర్ ఎస్టర్‌హుయిజెన్, డియాన్ ఫోరెస్టర్, బ్జోర్న్ ఫోర్టుయిన్, రూబిన్ హెర్మన్, క్వేనా మఫాకా, న్కోబాని మొకోయెనా, న్కాబా పీటర్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, సినేతెంబా క్వెషిలే, జేసన్ స్మిత్, ప్రెనెలన్ సుబ్రయెన్.

Shreyas Iyer Sidelined Surprising Pick Emerges As India New T20 Captain7
శ్రేయస్‌ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించాడు. కెప్టెన్‌గా సూపర్‌ హిట్‌ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ ఆడాల్సి ఉంది.యువ నాయకుడి సారథ్యంలోఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.అయితే, గిల్‌ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.రేసులో ఈ ఐదుగురుమరోవైపు.. రోహిత్‌ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్‌ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్‌ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇక సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లకు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్‌లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్‌ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.తెరమీదకు ఊహించని పేరుకానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్‌ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్‌ కిషన్‌ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ2025-26 సీజన్‌లో జార్ఖండ్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా రాణించి ఇషాన్‌ జట్టుకు తొలి టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్‌-2026లో అదరగొట్టాడు. అదేవిధంగా.. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్‌ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

IPL 2026, Match 42: Gujarat Titans vs RCB Updates and Highlights8
ఆర్సీబీపై గుజరాత్‌ గెలుపు

ఆర్సీబీపై గుజరాత్‌ గెలుపు156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ తడబడుతూనే బ్యాటింగ్‌ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్‌ కుమార్‌ (4-0-28-3), రొమారియో షెపర్డ్‌ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్‌మన్‌ గిల్‌ (43), జోస్‌ బట్లర్‌ (39), రాహుల్‌ తెవాతియా (27 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ 6, వాషింగ్టన్‌ సుందర్‌ 12, షారుక్‌ ఖాన్‌ 8, జేసన్‌ హోల్డర్‌ 12, రషీద్‌ ఖాన్‌ 7 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్‌తో పాటు సుయాశ్‌ శర్మ (3.5-0-44-1) వికెట్‌ తీశాడు. గత మ్యాచ్‌లో చెలరేగి బౌలింగ్‌ చేసిన హాజిల్‌వుడ్‌ (4-0-56-0) ఈ మ్యాచ్‌లో వికెట్‌ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గెలుపు దిశగా గుజరాత్‌7 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 86-2గా ఉంది. బట్లర్‌ 33, సుందర్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 155 పరుగులకే ఆలౌటైన ఆర్సీబీఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్‌ 3, సాయి సుదర్శన్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2 క్యాచ్‌లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్‌లో అర్షద్‌ ఖాన్‌ 3, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తలో 2, సిరాజ్‌, రబాడ చెరో వికెట్‌ పడగొట్టారు. ఫలితంగా ఆర్సీబీ 155 పరుగులకే ఆలౌటైంది.ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌ (40) టాప్‌ స్కోరర్‌ కాగా.. విరాట్‌ 28, బేతెల్‌ 5, పాటిదార్‌ 19, జితేశ్‌ శర్మ 1, టిమ్‌ డేవిడ్‌ 9, కృనాల్‌ 4, షెపర్డ్‌ 17, వెంకటేశ్‌ అయ్యర్‌ 12, భువనేశ్వర్‌ కుమార్‌ 15 (నాటౌట్‌), హాజిల్‌వుడ్‌ డకౌటయ్యారు. ఏడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ13.6వ ఓవర్‌- 126 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్‌ కోల్పోయింది.రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పడిక్కల్‌ (40) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ8.1వ ఓవర్‌- 80 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హోల్డర్‌ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మ (1) అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హోల్డర్‌ సూపర్‌ క్యాచ్‌7.4వ ఓవర్‌- 79 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్లో జేసన్‌ హోల్డర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రజత్‌ పాటిదార్‌ (19) ఔటయ్యాడు. కోహ్లి ఔట్‌3.2వ ఓవర్‌- 35 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ కోహ్లి (28) ఔటయ్యాడు. తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ2.4వ ఓవర్‌- 34 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి జేకబ్‌ బేతెల్‌ (5) ఔటయ్యాడు.టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరుగనున్న 42 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. గుజరాత్‌ ఐదో స్థానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించగా.. గుజరాత్‌ 8లో నాలుగు విజయాలు నమోదు చేసింది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), జాసన్ హోల్డర్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్

Samarawickrama, Dilhari shine as Sri Lanka clinch T20I series9
టీ20 సిరీస్‌ కూడా లంకదే..!

మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టు, తొలుత వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిల్హెట్‌ వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్‌ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్‌), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్‌, నహిద అక్తెర్‌, రితూ మోనీ తలో వికెట్‌ తీశారు.అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్‌ అక్తెర్‌ (44 నాటౌట్‌) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్‌ 23, జుయారియా ఫిర్దోస్‌ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్‌ నిగార్‌ సల్తానా 7, షోర్నా అక్తెర్‌ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్‌ వేదికగా జరుగనుంది.

Shakib Al Hasan OnT20 WC 2026 Row Calls Bangladesh Boycott A Blunder10
‘బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసింది’

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ దిగ్గజం షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ప్రభుత్వ తప్పిదం కారణంగా బంగ్లా క్రికెట్‌ భారీ నష్టం చవిచూసిందన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బంగ్లాదేశ్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.అయితే, భారత్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆరంభానికి ముందు భారత్‌-బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు.భద్రతా కారణాలు సాకుగా చూపగా..ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. ఇందుకు.. బంగ్లా భద్రతా కారణాలు సాకుగా చూపగా.. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానుసారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.ఈ అంశంపై బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ షకీబ్‌ అల్‌ హసన్‌ తాజాగా స్పందించాడు. ‘‘నిజంగా అతి పెద్ద నష్టం. మా దేశంలో క్రికెట్‌ను ప్రేమించే వాళ్ల సంఖ్య ఎక్కువ. మా ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడుతుంటే చూడాలని అంతా కోరుకున్నారు.కానీ చివరికి మా జట్టు టోర్నీలోనే లేకుండా పోయింది. అప్పటి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు ఇది. ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడటం కలలాంటిది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసిందికానీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆటగాళ్లు ఈ సువర్ణ అవకాశాన్ని మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది’’ అని షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పటి ప్రభుత్వం, బంగ్లా క్రికెట్‌ బోర్డు తీరును విమర్శించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆతిథ్య భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది మూడో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్‌.. బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణ కోసం తిరిగి చర్యలు చేపట్టింది. బంగ్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ ఇందుకు కృషి చేస్తున్నాడు.చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement