Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

USA T20 World Cup 2026 squad leaked, Monank Patel to Lead, ex SL player included1
యూఎస్‌ఏ ప్రపంచకప్‌ జట్టులో వివాదాస్పద ఎంపికలు..?

యూఎస్‌ఏ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలిపారు.స్థానికంగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.యూఎస్‌ఏ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్‌ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్‌ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నారు.ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా జెస్సీ సింగ్‌ ఎంపికయ్యాడు.మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్‌) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.కోచ్‌ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్‌ఏ జట్టు (లీకుల ప్రకారం)..మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్. కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్‌ఏతో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్‌ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్‌, 13న నెదర్లాండ్స్‌, 15న నమీబియాతో పోటీపడనుంది.

Gill Jadeja KL Rahul Return Date Confirmed Set To Play In This Tourney2
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..

టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్‌ తరఫున ఓపెనర్‌గా గిల్‌ బరిలోకి దిగనున్నాడు.జైపూర్‌ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్‌ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్‌లో గిల్‌ భాగం కానున్నట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లో గిల్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అనూహ్య రీతిలో వేటుతొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్‌ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్‌-2026 జట్టులోనూ గిల్‌కు చోటివ్వలేదు. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్‌ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్‌ భావిస్తున్నాడు.ఇప్పటికే ఆడేశారుఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్టార్లు రిషభ్‌ పంత్‌ ఢిల్లీ సారథిగా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మహారాష్ట్ర, సర్ఫరాజ్‌ ఖాన్‌ ముంబై, దేవదత్‌ పడిక్కల్‌ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్‌ శర్మ సైతం పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాడు.టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..ఈ జాబితాలో ఇప్పుడు గిల్‌తో పాటు వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్‌, గుజరాత్‌ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం కర్ణాటక తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.త్రిపుర, రాజస్తాన్‌లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో కర్ణాటక తరఫున కేఎల్‌ రాహుల్‌ ఆడనున్నాడు. ఇక గిల్‌తో పాటు.. జడేజా, కేఎల్‌ రాహుల్‌ విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్‌లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయరు?

Gill Needs To Trust Him: India Ex Star Advocates More Responsibility3
నువ్వు అతడిని నమ్మాలి గిల్‌.. సిరీస్‌లు గెలవాలంటే..

బ్యాటింగ్‌తో మ్యాచ్‌లు గెలిస్తే.. పటిష్ట బౌలింగ్‌తో సిరీస్‌లు గెలవవచ్చని భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప అన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియా బౌలర్ల సేవలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత టెస్టు జట్టు సారథిగా ఇంగ్లండ్‌ పర్యటనతో శుబ్‌మన్‌ గిల్‌ తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఇంగ్లండ్‌ గడ్డపై బ్యాటర్‌గా అదరగొట్టిన గిల్‌ (Shubman Gill).. కెప్టెన్‌గా 2-2తో ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ సమం చేశాడు. ఆ తర్వాత స్వదేశంలో అతడి సారథ్యంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలో మాత్రం ఘోర పరాభవం చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేశారు.అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను బ్యాటర్‌గానే ఎక్కువగా ఆడించింది మేనేజ్‌మెంట్‌. అతడికి పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) సేవలను వాడుకున్నప్పటికీ స్థాయికి తగ్గట్లు అతడిని ఉపయోగించుకోలేకపోయింది.నువ్వు అతడిని నమ్మాలి గిల్‌ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. వీరిద్దరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. నువ్వు వాషింగ్టన్‌ సుందర్‌పై మరింతగా నమ్మకం ఉంచాలి. ఇలాంటి ఆటగాళ్లకు బౌలింగ్‌ కూడా మంచినీళ్లప్రాయమే.తాను అద్భుతంగా బౌలింగ్‌ చేయగలనని వాషీ భావించడం సహజం. అయితే, నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండాలి. భారత క్రికెట్‌.. ముఖ్యంగా టెస్టుల్లో అభివృద్ధి చెందాలంటే వాషింగ్టన్‌, కుల్దీప్‌ యాదవ్‌లను వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లలో ఆడిస్తూ.. కుదిరినన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ వేయించాలి.బౌలింగ్‌ పటిష్టంగా ఉంటే..బ్యాటింగ్‌తో మనం మ్యాచ్‌లు గెలవగలం.. అయితే, బౌలింగ్‌ పటిష్టంగా ఉంటే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోగలము. మన బౌలర్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కుల్దీప్‌ యాదవ్‌తో కనీసం 20-25 ఓవర్లు వేయించాలి. అతడి సేవలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి’’ అని ఊతప్ప.. వాషీ, కుల్దీప్‌ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. గిల్‌కు సలహాలు ఇచ్చాడు.కాగా ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో 0-2తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. అనంతరం 2-1తో వన్డే సిరీస్‌ గెలిచింది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?

Mitchell Marsh Slams Blasting Hundred Against Hobart Hurricanes, Completes 2000 runs in BBL4
ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ ఉగ్రరూపం

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ ఉ‍గ్రరూపం దాల్చాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌ 2025-26లో భాగంగా పెర్త్‌ స్కార్చర్స్‌కు ఆడుతూ హోబర్ట్‌ హరికేన్స్‌పై విధ్వంసకర శతకం బాదాడు. 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని ఓవరాల్‌గా 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మార్ష్‌కు ఇది రెండో శతకం. మార్ష్‌ తన తొలి బీబీఎల్‌ శతకాన్ని కూడా హోబర్ట్‌ హరికేన్స్‌పైనే చేశాడు.HUNDRED FOR MITCHELL MARSH IN BIG BASH...!!! 🥶- He is getting ready for the T20 World Cup. pic.twitter.com/Q7hXZpbgWK— Johns. (@CricCrazyJohns) January 1, 2026తాజా ప్రదర్శనలో భాగంగా మార్ష్‌ 2000 బీబీఎల్‌ పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. మిచెల్‌ ఓవెన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ ల్యాండ్‌ మార్క్‌ను చేరుకున్నాడు. 2011-12 ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మార్ష్‌.. బీబీఎల్‌ కెరీర్‌లో 76 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పైచిలుకు పరుగులు చేశాడు.తాజా మ్యాచ్‌లో మార్ష్‌తో పాటు ఆరోన్‌ హార్డీ కూడా చెలరేగాడు. హార్డీ కేవలం​ 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో హార్డీ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా 5 బౌండరీలు, సిక్సర్‌ బాదాడు. మార్ష్‌ సైతం 14వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. వరుసగా 4,6,6,4 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో మార్ష్‌, హార్డీ కలిపి 20 బౌండరీలు, 10 సిక్సర్లు బాదారు. వీరి ఊచకోత ధాటి​కి స్కార్చర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.మిగతా స్కార్చర్స్‌ బ్యాటర్లలో ఫిన్‌ అలెన్‌ 16, కూపర్‌ కన్నోలీ 4, టర్నర్‌ 1 (నాటౌట్‌) పరుగులు చేశారు. హరికేన్స్‌ బౌలర్లలో నాథన్‌ ఇల్లిస్‌ 2, మిచెల్‌ ఓవెన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో హరికేన్స్‌ తడబడుతుంది. 9 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు మాత్రమే చేసింది. టిమ్‌ వార్డ్‌ (27), మిచెల్‌ ఓవెన్‌ (4), మాకలిస్టర్‌ రైట్‌ (16), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (18) ఔట్‌ కాగా.. నిఖిల్‌ చౌదరి (17), మాథ్యూ వేడ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. స్కార్చర్స్‌ బౌలర్లలో జోయల్‌ పారిస్‌, ఆరోన్‌ హార్డీ, ఆస్టన్‌ అగర్‌, బ్రాడీ కౌచ్‌కు తలో వికెట్‌ దక్కింది.ఈ మ్యాచ్‌లో హరికేన్స్‌ గెలవాలంటే 66 బంతుల్లో 154 పరుగులు చేయాలి.కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ జట్టుకు నాయకుడిగా మిచెల్‌ మార్ష్‌ను కొనసాగించారు.టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

Australia Test squad for 5th Ashes match vs England announced5
యాషెస్‌ చివరి టెస్ట్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

యాషెస్‌ సిరీస్‌ 2025-26 చివరి టెస్ట్‌ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. తుది జట్టు స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. కెమరూన్‌ గ్రీన్‌ పేలవ ఫామ్‌ ( గత 6 ఇన్నింగ్స్‌ల్లో 112 పరుగులు, 3 వికెట్లు) ఆసీస్‌ను కలవరపెడుతుంది. గ్రీన్‌ స్థానాన్ని మరో ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా జేక్‌ వెదరాల్డ్‌, ట్రవిస్‌ హెడ్‌ కొనసాగడం ఖాయం. ఉస్మాన్‌ ఖ్వాజా మరోసారి మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాల్సి రావచ్చు. సిడ్నీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున టాడ్‌ మర్ఫీ తుది జట్టులోకి రావచ్చు. ఐదో టెస్ట్‌ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి జరుగుతుంది.కాగా, ఈ ఐదు మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ ఇదివరకే (3-1) కైవసం చేసుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్‌ నాలుగో టెస్ట్‌లో పరాజయంపాలైంది. ఈ టెస్ట్‌ నెగ్గి ఆధిక్యత 4-1కి పెంచుకోవాలని ఆసీస్‌.. ఆసీస్‌ ఆధిక్యాన్ని 3-2కు తగ్గించాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉన్నాయి.ఐదో టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు- స్టీవ్ స్మిత్ (కెప్టెన్) - స్కాట్ బోలాండ్ - అలెక్స్ క్యారీ - బ్రెండన్ డాగెట్ - కెమెరూన్ గ్రీన్ - ట్రావిస్ హెడ్ - జోష్ ఇంగ్లిస్ - ఉస్మాన్ ఖవాజా - మార్నస్ లాబుషేన్ - టాడ్ మర్ఫీ - మైఖేల్ నేసర్ - జై రిచర్డ్సన్ - మిచెల్ స్టార్క్ - జేక్ వెదరాల్డ్ - బ్యూ వెబ్‌స్టర్

Sri Lanka squad for ICC Under 19 World Cup 2026 announced6
ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే..?

నమీబియా, జింబాబ్వే వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగబోయే 2026 అండర్‌ 19 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ కోసం 15 మం​ది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా విమత్ దిన్సరా ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) కవిజ గమగే నియమితుడయ్యాడు.ప్రపంచకప్‌లో శ్రీలంక.. జపాన్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రేలియాతో కలిసి గ్రూప్‌-ఏలో పోటీపడుతుంది. ఈ మెగా టోర్నీ కోసం లంక జట్టు ఇవాళే నమీబియాకు బయల్దేరనుంది. ముందుగా వెళితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడవచ్చని లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం జనవరి 17న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో తలపడుతుంది. అనంతరం జనవరి 19న ఐర్లాండ్‌తో, 23న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.గతేడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ల్లో​ ఓటమిపాలైనప్పటికీ, ఆసియా కప్‌లో సెమీఫైనల్ వరకు చేరిన లంక యువ జట్టు.. మొదటి వరల్డ్‌కప్ టైటిల్ కోసం బలంగా పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టు వివరాలు- విమత్ దిన్సరా (కెప్టెన్) - కవిజ గమగే (వైస్ కెప్టెన్) - దిమంత మహవితాన - విరాన్ చముదిత - దుల్నిత్ సిగేరా - చమిక హీంటిగల - ఆడమ్ హిల్మీ - చమరిందు నెత్సరా - సేత్మిక సెనేవిరత్నె - కుగథాస్ మాథులన్ - రసిత్ నిమ్సరా - విగ్నేశ్వరన్ ఆకాష్ - జీవంత శ్రీరామ్ - సెనుజ వెకునగొడ - మలింత సిల్వా

Such a talent Ignored neglected: Dilip Vengsarkar on Indian batter7
నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయరు?

దేశవాళీ క్రికెట్‌లో చాలాకాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. సొంత జట్టు తరఫున రంజీ ట్రోఫీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుకున్నాడు.తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గోవాతో బుధవారం నాటి మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. యాభై ఆరు బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మొత్తంగా 75 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లతో పాటు ఏకంగా 14 సిక్సర్లు ఉండటం విశేషం.మరోవైపు.. కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏకంగా మూడు సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌, మాజీ సారథి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా ఇది సిగ్గుచేటు‘‘మూడు ఫార్మాట్లలోనూ అత్యంత నిలకడగా ఆడుతున్నాడు. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలనూ సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు కూడా సెలక్టర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం నన్ను విస్మయానికి గురిచేస్తోంది.అంతటి ప్రతిభ ఉన్న ఆటగాడిని తరచూ ఇలా ఎలా పక్కనపెట్టగలుగుతున్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో పడిక్కల్‌తో కలిసి సర్ఫరాజ్‌ ఖాన్‌ కీలక సమయంలో 132 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.మిమ్మల్ని మీరే నిందించుకోవాలికానీ సెలక్టర్లు ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన ఇద్దరిని పక్కనపెట్టారు. సర్ఫరాజ్‌ మ్యాచ్‌ విన్నర్‌. అతడి బ్యాటింగ్‌ అద్బుతం. మానసికంగానూ అతడు బలవంతుడు.ఏ ఫార్మాట్లోనైనా.. ఎక్కడైనా చితక్కొట్టగలడు. అలాంటి ఆటగాడిని సెలక్ట్‌ చేయకుండా.. పరాజయాల పాలైతే వేరే ఎవరినీ మీరు నిందించకూడదు. మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సి ఉంటుంది’’ అని దిలీప్‌ వెంగ్‌సర్కార్‌.. టీమిండియా సెలక్టర్లకు చురకలు అంటించాడు. కాగా తీవ్ర స్థాయిలో విమర్శల అనంతరం సర్ఫరాజ్‌ ఖాన్‌ను 2024లో అరంగేట్రం చేయించింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. ఇప్పటికి ఆరు టెస్టుల్లో కలిపి అతడు 371 పరుగులు సాధించాడు. ఇందులో ఓ శతకం, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.చదవండి: వారితో టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’.. మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?

Smriti Mandhana Shares cryptic Lord Krishna quote from Gita Post Viral8
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్‌ వైరల్‌

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధానకు గతేడాది గొప్ప అనుభూతితో పాటు.. చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 2025 సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపురానిదిగా మిగిలిపోనుంది. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న చిరకాల కోరిక నవంబరులో తీరింది.ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌-2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. కెరీర్‌లోని అత్యుత్తమ గెలుపు తర్వాత.. అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.అనూహ్య రీతిలో వాయిదా.. ఆపై రద్దుదాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో ఏడడుగులు వేసేందుకు స్మృతి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికొన్ని గంటల్లో (నవంబరు 23) పెళ్లి తంతు మొదలుకానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా.. పలాష్‌ సైతం ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పలాష్‌ గురించి పెద్ద ఎత్తు చర్చ మొదలైంది. స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా.. తనతో అతడు చాట్‌ చేశాడంటూ ‘ప్రైవేటు’ సంభాషణను ఓ అమ్మాయి షేర్‌ చేసింది. పలాష్‌ స్త్రీలోలుడు అనేలా ఆ మెసేజ్‌లు ఉన్నాయి.అధికారికంగా ప్రకటించి..ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా.. పలాష్‌పై ట్రోలింగ్‌ ఎక్కువైంది. ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకున్నామంటూ స్మృతి- పలాష్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని.. ఇకపై క్రికెట్‌ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది.అందుకు అనుగుణంగానే ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరింది. ఇక 2025లో ఓవరాల్‌గా 1703 పరుగులు సాధించి.. క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాన్ని దిగమింగి.. టీ20 ప్రపంచకప్‌-2026లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.2025కు గుడ్‌బై.. ఉన్నదంతా కోల్పోయామంటే..ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్‌ చేసిన స్మృతి మంధాన.. గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది. ‘‘ఏదైనా గొప్ప విషయం, మంచి జరిగే ముందు.. అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతాము. కాబట్టి ఓపికగా ఎదురుచూడటమే ఉత్తమం’’ అని స్మృతి పేర్కొంది. ఇక ఈ వీడియోలో తన స్నేహితులు, సహచర ఆటగాళ్లు.. అమ్మానాన్న, అన్నయ్య, మేనల్లుడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె జత చేసింది. ఈ మేరకు 2025కు గుడ్‌బై చెబుతూ స్మృతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: 2026: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana)

VHT 2025 Padikkal Ruturaj Sarfraz Message To Selectors Knock Doors9
టీమిండియా సెలక్టర్లకు ‘తలనొప్పి’గా మారిన ప్లేయర్లు

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌, ముంబై సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. పడిక్కల్‌ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో మూడుసార్లు శతక్కొట్టాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో 147 పరుగులతో దుమ్ములేపిన పడిక్కల్‌.. కేరళపై 124 పరుగులు సాధించాడు.టీమిండియా సెలక్టర్లకు తలనొప్పిఅనంతరం పుదుచ్చేరిపై 113 పరుగులతో పడిక్కల్‌ ఆకట్టుకున్నాడు. మరోవైపు.. సర్ఫరాజ్‌ బుధవారం విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. గోవాతో మ్యాచ్‌లో 75 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు బాది 157 పరుగులు సాధించాడు. నిలకడైన ప్రదర్శనతో రాణిస్తూ వన్డేలకూ తాను సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నాడు.వీరిద్దరితో పాటు మహారాష్ట్ర బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) సైతం దేశీ వన్డే టోర్నీలో అదరగొడుతున్నాడు. ఉత్తరాఖండ్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ రుతు అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 113 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 124 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 331 పరుగులు చేయడంలో రుతుది కీలక పాత్ర.మరోవైపు.. సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ సైతం మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బెంగాల్‌ తరపున బుధవారం నాటి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసిన షమీ.. జమ్మూ కశ్మీర్‌పై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇలా వీరంతా అదరగొడుతుంటే.. టీమిండియా రెగ్యులర్‌ జట్టులో భాగమైన ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆంధ్ర సారథి నితీశ్‌ కుమార్‌ రెడ్డి మాత్రం నిరాశపరుస్తున్నారు.ఆంధ్ర జట్టుకు మూడో పరాజయంనితీశ్‌ కెప్టెన్సీలోని ఆంధ్ర జట్టు (Andhra Cricket Team).. బ్యాటర్ల వైఫల్యం కారణంగా విజయ్‌ హజారే ట్రోఫీలో మూడో పరాజయం మూటగట్టుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో సౌరాష్ట్ర చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్విక్‌ దేశాయ్‌ (81 బంతుల్లో 61; 7 ఫోర్లు), చిరాగ్‌ జానీ (96 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రుచిత్‌ అహిర్‌ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు.ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు 3 వికెట్లు పడగొట్టగా... కలిదిండి రాజు 2 వికెట్లు తీశాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జాగర్లపుడి రామ్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఆంధ్ర జట్టు తడబడింది. బ్యాటర్లంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవడంతో... ఆంధ్ర జట్టు 47.2 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.జ్ఞానేశ్వర్‌ (33; 6 ఫోర్లు), హేమంత్‌ రెడ్డి (29; 4 ఫోర్లు), కెప్టెన్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (30; 4 ఫోర్లు), రాజు (30; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేయగా... శ్రీకర్‌ భరత్‌ (4), రికీ భుయ్‌ (4), యారా సందీప్‌ (0) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అంకుర్‌ పన్వర్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక విజయం, మూడు పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆంధ్ర జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో శనివారం గుజరాత్‌తో ఆంధ్ర జట్టు తలపడనుంది.మరి పంత్‌, నితీశ్‌ రెడ్డి సంగతి?అంతకు ముందు.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లోనూ నితీశ్‌ రెడ్డి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్‌ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు. అయితే, రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి బ్యాట్‌తో రాణించారు. ఐదో స్థానంలో వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు.అనంతరం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్‌ రెడ్డి మరోసారి నిరాశపరిచాడు. ఆరు పరుగులు చేసి.. ఒకే ఒక వికెట్‌ తీయగలిగాడు. తాజాగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు.. రిషభ్‌ పంత్‌ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 121 (ఆంధ్రపై 5, గుజరాత్‌పై 70, సౌరాష్ట్రపై 22, ఒడిశాపై 24)పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు పంత్‌ ఇలా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోవడం ప్రభావం చూపే అవకాశం ఉంది.చదవండి: 2026: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న కోహ్లి పోస్ట్‌

Australia announce Squad for T20 WC 2026 3 injured players selected10
టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేసిన టెస్టు కెప్టెన్‌, స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.ఆ ఇద్దరికీ చోటుకమిన్స్‌తో పాటు గాయాల బెడదతో ఆటకు దూరంగా ఉన్న మరో కీలక పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood)తో పాటు హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ (Tim David) కూడా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు సంపాదించారు. అయితే, ఫిట్‌నెస్‌ ఆధారంగానే ఈ ముగ్గురు జట్టులో ఉంటారా? లేదా? అనేది త్వరలోనే తేలనుంది.జనవరి ఆఖరి వారంలో కమిన్స్‌ స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌తో జట్టులోకి వచ్చిన అతడికి వెన్నునొప్పి తిరగబెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. తొడ కండరాల గాయం, కాలి నొప్పితో బాధ పడుతున్న హాజిల్‌వుడ్‌ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు.డ్వార్షుయిస్‌కు మొండిచేయిఇక బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా టిమ్‌ డేవిడ్‌ గాయపడిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌ నాటికి అతడు కోలుకోకపోతే ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తప్పదు. కాగా లెఫ్టార్మ్‌ సీమర్‌, గతేడాది నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బెన్‌ డ్వార్షుయిస్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.ఒకవేళ టోర్నీ నాటికి కమిన్స్‌, హాజిల్‌వుడ్‌లలో ఎవరో ఒకరు అందుబాటులో లేకుంటే డ్వార్షుయిస్‌కు ఛాన్స్‌ రావొచ్చు. అతడు కూడా గాయం వల్ల కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా.. వేగంగానే కోలుకుంటున్నట్లు సమాచారం.వారికి నిరాశేమరోవైపు.. స్పిన్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా కూపర్‌ కన్నోలి ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌గా జోష్‌ ఇంగ్లిస్‌ ఒక్కడినే సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఫిలిప్‌లకు నిరాశతప్పలేదు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న మొదలయ్యే ఈ టోర్నీ మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక పొట్టి ఫార్మాట్లో 2021లో తొలిసారి చాంపియన్లుగా నిలిచిన ఆసీస్‌.. ఈసారి మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో గత ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది.టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీకి ఆస్ట్రేలియా ప్రాథమిక జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కన్నోలీ, ప్యాట్‌ కమిన్స్‌, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.చదవండి: రిషభ్‌ పంత్‌ ఫెయిల్‌.. ఇలా అయితే కష్టమే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement