Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI Releases Schedule For Indian Cricket Team's Bilateral Series1
టీమిండియా చారిత్రక సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

వివిధ విభాగాల్లో భారత క్రికెట్‌ జట్ల ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (మే 6) విడుదల చేసింది. పురుషులు, మహిళలు, ఏ-జట్లు, అండర్-19 జట్ల మ్యాచ్‌లకు వేదికలు, తేదీలను ఖరారు చేసింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ బిజీ షెడ్యూల్‌లోకి వెళ్లనుంది. ముఖ్యంగా భారత్‌-ఏ, మహిళల సీనియర్‌ టీమ్‌, అండర్-19 జట్లు వరుస సిరీస్‌లలో పాల్గొననున్నాయి.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌-ఏ జట్టుతో రెండు మల్టీ డే మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది.సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుకు ఆస్ట్రేలియా సవాల్భారత అండర్‌-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్‌కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్‌కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్‌కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్‌కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)చారిత్రక సిరీస్‌భారత్‌.. జింబాబ్వే మహిళల జట్టుకు తొలిసారి ఓ ద్వైపాక్షిక సిరీస్‌ కోసం ఆతిథ్యమివ్వనుంది. టీ20, వన్డే ఫార్మాట్‌లలో జరిగే ఈ సిరీస్‌ అక్టోబర్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు రాయ్‌పూర్‌, వన్డేలకు బరోడా ఆతిథ్యమివ్వనుంది.అక్టోబర్ 16- తొలి టీ20అక్టోబర్ 18- రెండో టీ20అక్టోబర్ 20- మూడో టీ20అక్టోబర్ 23- తొలి వన్డేఅక్టోబర్ 25- రెండో వన్డేఅక్టోబర్ 28- మూడో వన్డేమహిళల ఏ జట్టు vs ఆస్ట్రేలియాఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్‌లో మల్టీ ఫార్మాట్‌ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్‌ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్‌ (29- ధర్మశాల) జరుగనున్నాయి.మహిళల ఏ జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్‌ జట్టుతో భారత మహిళల ఏ జట్టు నవంబర్-డిసెంబర్‌లో మల్టీ ఫార్మాట్‌ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (నవంబర్‌ 30, డిసెంబర్‌ 3, 5- పూణే), 3 వన్డేలు (డిసెంబర్‌ 8, 11, 14- నవీ ముంబై), ఓ మల్టీ డే మ్యాచ్‌ (డిసెంబర్‌ 19- నవీ ముంబై) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs శ్రీలంకశ్రీలంక అండర్‌-19 జట్టు జూన్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 3 టీ20లు (జూన్‌ 22, 24, 27- చెన్నై), 3 వన్డేలు (జూన్‌ 30, జులై 3, 6- పుదుచ్చేరి) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టు నవంబర్‌-డిసెంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5 టీ20లు (నవంబర్‌ 26, 28 (బరోడా), డిసెంబర్‌ 1, 3, 6 (సూరత్‌)) జరుగనున్నాయి.

Australia to tour Pakistan for three ODIs in May, June2
పాక్‌ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మరోసారి పాకిస్తాన్‌ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్‌ 2, 4 తేదీల్లో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్‌ సిరీస్‌ ఐపీఎల్‌ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్‌ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్‌ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్‌కు ముందు కూడా పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఆ సిరీస్‌ను పాక్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్‌ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్‌ కోసం పాక్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్‌ సిరీస్‌ప్రస్తుతం పాక్‌ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్‌ సిల్హెట్‌ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరుగనున్నాయి.

Shamas, Feroza hit tons as Pakistan win big to clinch ODI series vs Zimbabwe3
ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్‌

మహిళల క్రికెట్‌లో పాకిస్తాన్‌ అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో జరిగిన వన్డేలో పసికూన జింబాబ్వేపై 206 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్‌ మహిళల క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ గెలుపుతో పాక్‌ సిరీస్‌ను కూడా కైవసం​ చేసుకుంది.జింబాబ్వే తొలిసారి పాక్‌లో పర్యటిస్తున్న చారిత్రక సిరీస్‌ ఇది. ఈ పర్యటనలో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే ఇది. అంతకుముందు తొలి వన్డేలోనూ పాకిస్తానే​ విజయం సాధించింది (168 పరుగుల తేడాతో). ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం​ చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే కరాచీ వేదికగా మే 9న జరుగనుంది. అనంతరం 12, 14, 15 తేదీల్లో ఇదే కరాచీ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.ఓపెనర్ల శతకాలుతాజా వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు సదాఫ్‌ షమాస్‌ (101), గుల్‌ ఫెరోజా (100) సెంచరీలతో కదంతొక్కారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సిద్రా అమీన్‌ (59 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా 25, ఆలియా రియాజ్‌ 27, అయేషా జాఫర్‌ 18 (నాటౌట్‌) పరుగులు చేశారు.కుప్పకూలిన జింబాబ్వేభారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 137 పరుగులకే ఆలౌటైంది. ఫాతిమా సనా (6-0-15-3), మొమినా రియాసత్‌ (8-0-39-2), రమీన్‌ షమీమ్‌ (8-2-20-2), సయ్యదా అరూబ్‌ షా (6-1-18-2), డయానా బేగ్‌ (7-1-23-1) జింబాబ్వే పతనాన్ని శాశించారు. ఆ జట్టు తరఫున కెలిస్‌ (32), బిజా (29), పసిపనోద్యా (33 నాటౌట్‌), లిండోకుహ్లే (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

Ahmedabad, not Bengaluru to host IPL 2026 final4
ఐపీఎల్‌ ఫైనల్‌ పోయింది

బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్‌ ఫైనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ మరోచోటుకు మారింది. గుజరాత్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎంఅహ్మదాబాద్‌లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్‌ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు.

Shreyas Iyer considered among the best captains of IPL5
శ్రేయస్‌ అయ్యర్‌ మరో టైటిల్‌ గెలిస్తే...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సారథిగా శ్రేయస్‌ అయ్యర్‌ రెండో టైటిల్‌ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్‌ ‘అవుట్‌ ఆర్‌ నాటౌట్‌’ కార్యక్రమంలో అయ్యర్‌ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు. ‘శ్రేయస్‌ అయ్యర్‌ మరో సీజన్‌లో తన టీమ్‌ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్‌... ఎక్కడ కెప్టెన్‌గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్‌ల సరసన శ్రేయస్‌ చేరతాడు’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు.

IPL 2026: SRH Take-Revenge Beating Punjab Kings By 33 Runs6
ప్రతీకార విజయం.. టేబుల్‌ టాపర్‌గా ఎస్‌ఆర్‌హెచ్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) పంజాబ్ కింగ్స్‌పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్‌) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్‌, శివాంగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్‌కుమార్‌, మలింగ, సాకిబ్ హుస్సేన్‌ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.ఇషాన్‌, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్‌కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్‌, నితీశ్‌రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్‌..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్‌లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్‌ ప్లేస్‌కుఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026

Abhishek-Travis Head Record Most Partnership Runs In IPL 20267
ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 235 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు అభిషేక్‌, హెడ్‌లు శుభారంభం ఇవ్వ‌గా.. ఆ త‌ర్వాత మిడిలార్డ‌ర్‌లో ఇషాన్ కిష‌న్‌, క్లాసెన్‌, నితీశ్ కుమార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌ జంట ఒక అరుదైన ఫీట్‌ సాధించింది. ఈ సీజ‌న్‌లో అభిషేక్‌, ట్రావిస్ హెడ్ జంట 627 ప‌రుగులు సాధించింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌కు ఈ జంట 54 ప‌రుగులు జోడించ‌డం ద్వారా 600 ప్ల‌స్ మార్కును దాటింది. త‌ద్వారా ఒక సీజ‌న్‌లో 500కు పైగా ప‌రుగులు సాధించిన జోడీగా అభిషేక్‌-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్లు య‌శ‌స్వి జైస్వాల్‌-వైభ‌వ్ సూర్య‌వంశీ (457 ప‌రుగులు), గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌-సాయి సుద‌ర్శ‌న్ జంట (402 ప‌రుగులు) సాధించి మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026

Heinrich Klaasen Scripts History Most 50-Plus Scores for SRH In IPL8
రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన క్లాసెన్‌

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 43 బంతుల్లో 69 ప‌రుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున క్లాసెస్‌కు ఇది 14వ అర్థ‌శ‌త‌కం కాగా.. అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచ‌రీల‌తో కేన్ విలియ‌మ్స‌న్ మూడో స్థానంలో, 19 అర్థ‌శ‌త‌కాల‌తో శిఖ‌ర్ దావ‌న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొద‌టి స్థానంలో డేవిడ్ వార్న‌ర్ 42 అర్థ‌శ‌త‌కాల‌తో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మ‌రో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి దాకా 5 హాఫ్ సెంచ‌రీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌, కేఎల్ రాహుల్‌, సాయి సుద‌ర్శ‌న్‌, ప్ర‌బ్‌సిమ్ర‌న్‌, అయ్య‌ర్‌లు నాలుగు హాఫ్ సెంచ‌రీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

Abhishek Sharma BlockBuster Innings Vs Punjab Kings In IPL History9
పంజాబ్ అంటేనే అభిషేక్‌కు పూన‌కం!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌రోసారి చెల‌రేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచ‌రీతో భారీ స్కోరు సాధించిన‌ప్ప‌టికీ ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంత‌గ‌డ్డ‌పై ఎలాగైనా పంజాబ్‌పై పైచేయి సాధించాల‌ని భావిస్తున్న ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ విధ్వంస‌కర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పంజాబ్‌తో మ్యాచ్‌లో మ‌రోసారి చెల‌రేగాడు. పంజాబ్‌తో మ్యాచ్ అంటేనే పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా చెల‌రేగిపోతున్నాడు. మ్యాచ్‌లో ఎక్కువ సేపు నిల‌వ‌న‌ప్ప‌టికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ద‌డ‌ద‌డ‌లాడించాడు. 👉 ఈ నేప‌థ్యంలో పంజాబ్‌పై గ‌త నాలుగు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. అభిషేక్ వ‌రుస‌గా 66, 141, 74, 35 ప‌రుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 200 ప్ల‌స్ స్కోరు సాధించ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియ‌న్స్ కూడా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఎనిమిది సార్లు 200 ప్ల‌స్ స్కోర్లు సాధించ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్‌లో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్‌లో 220 ప్లస్‌ స్కోరు చేయడం ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్‌ఆర్‌హెచ్‌నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విష‌యానికొస్తే.. ఎస్ఆర్‌హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 235 ప‌రుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిష‌న్ (55) అర్థ‌సెంచ‌రీతో రాణించారు. అంత‌క‌ముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివ‌ర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్‌) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్‌, చాహ‌ల్‌, ఫెర్గూస‌న్‌, విజ‌య్‌కుమార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

Shreyas Iyer Might Pips-Dhoni-Gambhir-Rohit Legacy As IPL Captain10
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్‌ను శ్రేయస్‌ సాధిస్తాడు’

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌, గౌత‌మ్ గంభీర్‌లు విజ‌య‌వంత‌మైన కెప్టెన్లుగా ముద్ర‌ప‌డ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సార‌థ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి స‌ర‌స‌న చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. 2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయ‌స్ ల‌క్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జ‌ట్లు మారిన‌ప్ప‌టికీ త‌న కెప్టెన్సీ, ఆట‌తీరుతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా అయ్య‌ర్ పేరు సంపాదించాడు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్య‌ర్ విజేతగా నిల‌బెడితే ధోని, రోహిత్ శ‌ర్మ‌ను కూడా అధిగ‌మిస్తాడ‌ని మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ అభిప్రాయ‌ప‌డ్డాడు. జియో హాట్‌స్టార్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చిన ప‌ఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్‌, గంభీర్ వంటి అత్యుత్త‌మ ఐపీఎల్ కెప్టెన్ల‌ను దాటుకొని మ‌రీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్‌, గంభీర్‌లు ఒకే జ‌ట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్య‌ర్ మాత్రం ఇప్ప‌టికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జ‌ట్ల‌కు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్య‌ర్ నిల‌వ‌నున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కేకేఆర్‌, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జ‌ట్ల‌ను కూడా ఐపీఎల్‌లో ఫైన‌ల్ చేర్చిన ఘ‌న‌త అయ్య‌ర్ సొంతం. ఒక‌వేళ అయ్య‌ర్ ఈ సీజ‌న్‌లో అది సాధిస్తే మాత్రం అత‌డి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని ప‌ఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న అయ్య‌ర్ 2020 సీజ‌న్‌లో ఆ జ‌ట్టును ర‌న్న‌ర‌ప్‌గా నిలిపాడు. ఆ త‌ర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్‌లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 2025 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్‌లోనూ ఆ జట్టును టైటిల్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ‌!’

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement