ప్రధాన వార్తలు
రికార్డు స్థాయి బిడ్.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!
ఐపీఎల్లో 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్ఫిషర్ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కోల్బెర్గ్ క్రావిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం!
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్
టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్ మ్యాచ్లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఆ తర్వాత ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్రూమ్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో 10 రోజుల సమయముంది. ఈ నేపథ్యంలో గతేడాది తన ప్రదర్శనతో అంతగా ఆకట్టుకోని కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 18వ సీజన్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలనే ధ్యేయంతో సరికొత్తగా సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ జట్టు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు కామెరున్ గ్రీన్ పై చాలా ఆశలే పెట్టుకుంది. గతేడాది జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ను కేకేఆర్ రూ.25.20 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇంత ఖర్చు చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కామెరున్ గ్రీన్ ఆకట్టుకున్న దాఖలాలు తక్కువే. ఇటీవలే టీ20 ప్రపంచకప్లోనూ గ్రీన్ అంతగా ఆకట్టుకోలేదు. మరో పది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఇది కేకేఆర్కు ఒక రకంగా బ్యాడ్న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్లో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున కామెరున్ గ్రీన్ మూడంకెల స్కోరును అందుకున్నాడు. న్యూసౌత్వేల్స్తో జరిగిన మ్యాచ్లో గ్రీన్ సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సందర్భంగా ఆసీస్ మీడియాకు చెందిన ఒక రిపోర్టర్ సెంచరీ చేయడం ఎలా అనిపిస్తోందని గ్రీన్ను అడిగాడు. ‘ఇది నాకు గ్రేట్ ఫీలింగ్ కలిగిస్తోంది. మొదటి మూడురోజులు మంచి స్టార్ట్ లభించింది. కచ్చితంగా మ్యాచ్ గెలవబోతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే దీనికి ముందు ఫామ్లేమీతో ఇబ్బంది పడడం ఎలా అనిపించిందంటూ మరో ప్రశ్న వేశాడు. దీనికి ‘నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోలేను. వేరే ప్రశ్నకు వెళ్లండి’ అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. ప్రశ్నలు లేవు అనడంతో ఇంటర్వ్యూను అక్కడితో ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో గ్రీన్ ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ అంటూ తనలో తాను గొణుక్కుంటూ వెళ్లిపోయాడని రిపోర్టర్ వాపోయాడు. ఆ తర్వాత వెస్ట్ ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ బ్యూకాసన్.. గ్రీన్ తరఫున మీడి యాకు క్షమాపణ చెప్పడం ఆసక్తి కలిగించింది.చదవండి: గొడవ పడిన బంగ్లా కెప్టెన్కు బెస్ట్ ర్యాంకు!
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’
గొడవ పడిన బంగ్లా కెప్టెన్కు బెస్ట్ ర్యాంకు!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం వన్డే, టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్ల ర్యాంకుల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ బంగ్లాదేశ్, పాకిస్థాన్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవలే పాకిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్తో రెండో వన్డే సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ నాన్ స్ట్రైక్ ఎండ్లో పాక్ బ్యాటర్ సల్మాన్ అఘాను రనౌట్ చేయడం వివాదం సృష్టించింది. అఘా కోపానికి కారణమై గొడవకు మూలకేంద్రంగా నిలవడమే గాక, బంగ్లాకు సిరీస్ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. అదే సమయంలో ఆల్రౌండర్ల జాబితాలో బంగ్లా కెప్టెన్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అఘా బ్యాటింగ్ విభాగంలో 9 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్రౌండర్ల విభాగంలోనూ సల్మాన్ అఘా ఉమ్మడిగా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ కెప్టెన్ షహీన్ అఫ్రిది ఆల్రౌండర్ల కోటాలో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాటర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత టీమిండియా మళ్లీ వన్డేలు ఆడలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (791 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ 4వ స్థానంలో (748 పాయింట్లు), శుబ్మన్ గిల్ 5వ స్థానంలో (716 పాయింట్లు), కేఎల్ రాహుల్ (664 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్యాదవ్ ఒక్కడే టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలోనూ అక్షర్పటేల్ పదో స్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్లో పురుషుల విభాగంలో భారత్ నుంచి అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్లు టాప్-10లో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి 2వ స్థానం నిలబెట్టుకోగా, బుమ్రా ఒక స్థానం మెరుగుపరుచుకొని 702 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మెరిసిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రెండో ర్యాంక్లో కొనసాగుతున్నాడు.చదవండి: ‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు!
‘కాల్ మీ’.. లలిత్ మోదీ ఆసక్తికర పోస్టు!
హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై భారత్లో పెద్ద దుమారమే రేగుతోంది. కావ్యామారన్కు చెందిన సన్రైజర్స్ యాజమాన్యంపై పాకిస్థాన్ ఆటగాళ్లను ఎలా కొనుగోలు చేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు భారత్లో సన్రైజర్స్ లీడ్స్కు చెందిన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ 190,000 పౌండ్లు (సుమారు రూ.2.34 కోట్లు) దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ సన్రైజర్స్ లీడ్స్కు ఆసక్తికర సందేశాన్ని పంపించారు. ‘పాకిస్తాన్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో పడిపోయిన ఇమేజ్ను ఎలా తిరిగి వెనక్కి తెచ్చుకోవా లనేది నాకు తెలుసు. అందుకే ఒకసారి నాకు కాల్ చేయండి’ అంటూ పోస్టు పెట్టాడు. అయితే లలిత్ మోదీ తన పోస్ట్లో ఎక్కడా కూడా కావ్య మారన్ పేరు ప్రస్తావించలేదు. అయినప్పటికీ లలిత్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశం మాత్రం సన్రైజర్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించే అని స్పష్టంగా అర్థమవుతోంది.అయితే తాజాగా భారత్లో ఐపీఎల్ ప్రారంభమవుతున్న వేళ అభిమానుల్లో సఖ్యత సాధించేందుకే లలిత్ మోదీ.. కావ్యామారన్కు ఇలాంటి సందేశాన్ని పంపించి ఉంటారని తెలుస్తోంది. 2010లో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, ఐపీఎల్ ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో లలిత్ మోదీ దేశం విడిచి వెళ్లాడు. ఈడీ ప్రకారం 2009లో ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ హక్కుల కేటాయింపులో మోదీ అవకతవకలు చేసి రూ.125 కోట్లకు పైగా లాభం పొందినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. లలిత్ మోదీ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. భారత్లో పలు ఆర్థిక అవకతవకల కేసులు కూడా ఉన్నాయి. 2008 ముంబై దాడుల తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం విధించారు. అప్పటి నుంచి విదేశీల లీగ్లలో కూడా భారతీయ ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయ ర్లను దాదాపు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే, ఈ సంప్రదాయాన్ని సన్రైజర్స్ పక్కనబెట్టి మరీ అబ్రార్ అహ్మద్ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.చదవండి: మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్
రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్దమవతున్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున హిట్మ్యాన్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది సీజన్ కోసం రోహిత్ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మంగళవారం నెట్స్లో రోహిత్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభానికి ముందు రోహిత్ అభిమానులకు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేలా జయవర్ధనే గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్-19వ సీజన్లో రోహిత్ శర్మను 'ఇంపాక్ట్ ప్లేయర్'గా ఉపయోగించే ఆలోచన లేదని, అతను పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఉంటాడని జయవర్ధనే స్పష్టం చేశాడు.కాగా గత సీజన్లో రోహిత్ చాలా మ్యాచ్లలో ఇంపార్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసి, మిగితా సమయంలో డగౌట్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఫీల్డ్లో కూడా తన అనుభవాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పంచుకోనున్నాడు."గతేడాది రోహిత్ శర్మ చిన్న చిన్న గాయాలతో బాధపడ్డాడు. అందుకే అతడిని మేము ఇంపాక్ట్ సబ్గా ఉపయోగించాము. వర్క్లోడ్ మేనెజ్మెంట్లో భాగంగానే విశ్రాంతి ఇచ్చాము. మైదానంలో ఉన్నా లేకపోయినా అతడి ప్రభావం జట్టుపై కచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్లో మాత్రం రోహిత్ను కచ్చితంగా ఎక్కువ సమయం మైదానంలోనే ఉంచుతాము.అయితే జట్టులో ఎక్కువ మంది ఆల్రౌండర్ల ఉన్నందున.. మ్యాచ్ పరిస్థితుల బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ను రోటేట్ చేస్తాము" అని ఓ ఇంటర్వ్యూలో జయవర్ధనే పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో మార్చి 29న కేకేఆర్తో తలపడనుంది.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!?
మల్టీ టాలెంటెడ్.. పైలట్ అవతారమెత్తిన గ్లెన్ ఫిలిప్స్
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్కు సాధ్యపడనిది అంటూ ఏదైనా ఉందా? అంటే లేదు అనే అన్పిస్తోంది. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్లతో సూపర్ మ్యాన్గా పేరొందిన ఫిలిప్స్.. ఇప్పుడు తనలోని పైలట్ స్కిల్స్ను బయటపెట్టాడు. ఫిలిప్స్ మంగళవారం ఆక్లాండ్లోని ఆర్డ్మోర్ ఏరోడ్రోమ్లో మినీ ఎయిర్క్రాఫ్ట్ను విజయవంతంగా ల్యాండ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫిలిప్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫిలిప్స్ ప్రస్తుతం కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఓవైపు క్రికెట్ కెరీర్ను కొనసాగిస్తూనే.. ఆర్డ్మోర్ ఫ్లయింగ్ స్కూల్లో పైలట్గా శిక్షణ పొందుతున్నాడు.ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఫిలిప్స్.. ఫ్లయింగ్ స్కూల్లో తన ఖాళీ సమయాన్ని గడపుతున్నాడు. ఫిలిఫ్స్కు విమానాలు నడపడం అంటే చిన్నతనం నుంచే మక్కువ ఎక్కవ. క్రికెటర్ కాకపోయింటే కచ్చితంగా పైలట్ అయ్యే వాడనని ఫిలిప్స్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశాడు. అంతేకాకుండా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఏవియేషన్ రంగంలోనే సెటిల్ అవుతానని గ్లెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ కివీస్ క్రికెటర్ ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.చదవండి: షేన్ వార్న్ గొప్ప బౌలర్ కాదు! వరల్డ్కప్ ఫైనల్లో అలా శ్రీలంక గెలుపు! View this post on Instagram A post shared by Glenn Phillips (@glennphillips236)
షేన్ వార్న్పై అర్జున రణతుంగ వ్యాఖ్యలు.. ఆరోజు అలా..
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం అర్జున రణతుంగ, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ మధ్య వైరం గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము ఒకరికొకరం నచ్చమని ఇద్దరూ పలు సందర్భాల్లో వెల్లడించారు.షేన్ వార్న్ గురించి అతిగా చెప్తున్నారే తప్ప.. అతడికి అంత సీన్ లేదని అర్జున రణతుంగ 1996 ప్రపంచకప్ సందర్భంగా అన్నాడు. అంతేకాదు.. యువకులు రోల్ మోడల్గా తీసుకోదగ్గ వ్యక్తికాదని విమర్శించాడు.ఇందుకు ప్రతిగా షేన్ వార్న్.. ‘షేన్ వార్న్ సెంచరీ: నా టాప్ 100 టెస్టు క్రికెటర్లు’ పేరిట రాసిన పుస్తకంలో అర్జున్ రణతుంగకు 93వ ర్యాంకు ఇచ్చాడు. ఇలా వీరి మధ్య వైరమే తప్ప మచ్చుకైనా స్నేహంగా కనిపించిన దాఖలాలు లేవు. 1996 వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లోకాగా 1996 వన్డే వరల్డ్కప్ టోర్నీ ఫైనల్లో శ్రీలంక- ఆస్ట్రేలియా తలపడ్డాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో లంక ఆసీస్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. శ్రీలంక 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన వేళ అర్జున రణతుంగ 37 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా అరవింద డి సిల్వ అజేయ శతకం (124 బంతుల్లో 107)తో అదరగొట్టగా.. అసాంక గురుసిన్హ 99 బంతుల్లో 65 పరుగులతో రాణించాడు.58 పరుగులు ఇచ్చిఫలితంగా 46.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 245 పరుగులు చేసిన శ్రీలంక.. ఆసీస్ను చిత్తు చేసి తొలిసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్లో షేన్ వార్న్ పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 58 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.అతడేమీ గొప్ప బౌలర్ కాదునాటి ఈ సంగతుల గురించి అప్పటి సెంచరీ హీరో అరవింద డిసిల్వ తాజాగా ఓ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నాడు. షేన్ వార్న్ను మైండ్గేమ్లో ఓడించి అర్జున రణతుంగ పైచేయి సాధించినట్లు తెలిపాడు. ‘‘ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం, ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో.. ఫైనల్కు ముందు రణతుంగ షేన్ వార్న్ను టార్గెట్ చేశాడు.అతడేమీ గొప్ప బౌలర్ కాదని.. అయినా సరే చాలా మంది అతడి బౌలింగ్ గురించి ఎందుకంతగా మాట్లాడతారో తనకు అర్థం కాదని అన్నాడు. ఈ మాటలతో వార్న్ తీవ్ర నిరాశ, ఒత్తిడికి గురయ్యాడు. రణతుంగ, తాను రిటైర్ తర్వాత ఇదే విషయం గురించి ప్రస్తావన రాగా షేన్ వార్న్ ఏమన్నాడంటే..నాకు ఇప్పుడు అర్థమైంది‘ఆరోజు అతడు ఎందుకలా అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను గందగోళంలోకి నెట్టేయాలని అలా అన్నాడు. ఆ సమయంలో నేను నా బౌలింగ్పై నియంత్రణ కోల్పోయాను. ప్రతిసారి అతడిని అవుట్ చేయాలనే లక్ష్యంతోనే బౌలింగ్ చేశానే తప్ప ఆటపై దృష్టి పెట్టలేకపోయాను.ఏం జరుగుతుందో అర్ధం చేసుకోలేకపోయాను. అతడు మైండ్గేమ్లో గెలిచాడు’ అని చెప్పాడు. రణతుంగ వ్యూహాలు అలా ఉంటాయి మరి’’ అని డిసిల్వ చెప్పుకొచ్చాడు. కాగా వార్న్ ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు తీయగా.. 194 వన్డేల్లో 293 వికెట్లు కూల్చాడు. 1999లో వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. మరోవైపు.. రణతుంగ శ్రీలంక తరఫున 83 టెస్టుల్లో 5105, 269 వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. లంకకు వరల్డ్కప్ అందించిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు.చదవండి: AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!“Arjuna said Warne wasn’t a great bowler…”30 years later, Aravinda reveals what happened next.“Warne told me he lost control… he only wanted Arjuna’s wicket.”Mind games. Big stage. Big impact. 🇱🇰🔥 pic.twitter.com/34ycroOb5w— NewsWire 🇱🇰 (@NewsWireLK) March 17, 2026
ఢిల్లీ క్యాపిటల్స్తో రాహుల్కు విభేదాలు?
ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మరో జట్టుకు ట్రేడ్ కానున్నాడని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం రాహుల్ను తమతోనే అంటిపెట్టుకుని ట్రేడ్ ఊహాగానాలకు చెక్ పెట్టింది. అతడి అనుభవాన్ని మరోసారి ఉపయోగించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బ్యాటింగ్ పొజిషన్ విషయంలో రాహుల్కు ఢిల్లీ మేనేజ్మెంట్కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. తన బ్యాటింగ్ స్ధానాన్ని పదే పదే మార్చడంపై కేఎల్ రాహుల్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతడు తెలిపాడు.కాగా గత సీజన్లో రాహుల్ కొన్ని మ్యాచ్లలో మిడిలార్డర్లోనూ, మరి కొన్ని మ్యాచ్లలో టాపార్డర్లోనూ బ్యాటింగ్కు వచ్చాడు. మ్యాచ్ మ్యాచ్కూ అతడి స్ధానం మరిపోయేది. అయినప్పటికి ఈ కర్ణాటక బ్యాటర్ దుమ్ములేపాడు. రాహుల్ గత సీజన్లో 150 స్ట్రైక్ రేట్తో 539 పరుగులు చేసి ఢిల్లీ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.'ప్రతీ సంవత్సరం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్కు తలనొప్పిగా మారింది. అతడిని ఏ స్ధానంలో ఆడించాలో ఆ జట్టు సరిగా తేల్చుకోలేకపోతోంది. రాహుల్ ఓపెనింగ్ చేయడం ఇష్టం. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడించాలని చూస్తోంది. ఈ విషయంలో టీమ్ మెనెజ్మెంట్, రాహుల్ మధ్య విభేదాలు ఉన్నట్లు కన్పిస్తోంది. కచ్చితంగా ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించుకోవాలి. అసలు ఢిల్లీ జట్టులో కేఎల్ సంతోషంగా ఉన్నాడో, లేదో స్పష్టత లేదు' అని తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఏడాది సీజన్లో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు ఇంగ్లండ్ స్టార్ బెన్ డకెట్ ఢిల్లీ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నట్లు సమాచారం.చదవండి: T20 WC: డీఎస్పీగా సంజూ శాంసన్!?
మెద్వదెవ్ను దెబ్బకొట్టిన సిన్నర్
‘తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకడు ఉ...
ఆంటోనెల్లి అదరహో
షాంఘై: ఈ ఏడాది ఫార్మాలావన్ (ఎఫ్1)లో మెర్సిడెస్ ...
అల్కరాజ్కు మెద్వెదెవ్ షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స...
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వ...
డీఎస్పీగా సంజూ శాంసన్!?
టీ20 వరల్డ్కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత...
’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అర్ష్దీప్ ...
‘టాప్’లోనే స్మృతి.. ఏడో ర్యాంక్కు హర్మన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ...
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా స్టార్ ప్లేయర్?
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్గా...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
