ప్రధాన వార్తలు
టీమిండియాకు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలుత జూన్ 6 నుంచి 10 ముల్లాన్పూర్ వేదికగా భారత్-అఫ్గాన్ టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.స్టార్ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా ఈ ఏకైక టెస్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే అతడు ఐపీఎల్-2026 సీజన్ నుంచి కూడా తప్పుకొన్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో అతడిని రూ.కోటికి కేకేఆర్ సొంతం చేసుకుంది.కానీ అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా వైదొలిగాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవాడనికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి శ్రీలంకతో టెస్టు సిరీస్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. భారత టెస్టు సెటాప్లో ఆకాష్ దీప్ కీలక సభ్యుడు.జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ తర్వాత టెస్టుల్లో మూడో పేసర్గా ఆకాష్ దీప్ ఉన్నాడు. చివరగా ఇంగ్లండ్ పర్యటనలో కూడా అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సిరీస్లో 3 టెస్టులు ఆడిన ఆకాష్ దీప్..13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. మరి ఇప్పుడు అతడు గాయం కారణంగా దూరం కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడి స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
‘వైభవ్పై అనుమానముంది.. డోపింగ్ టెస్ట్ చేయాల్సిందే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన సంచనల బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను చితక్కొడుతున్న వైభవ్ సూర్యవంశీ అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదేస్తున్నాడు. పనిలో పనిగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో శతకంతో రెచ్చిపోయాడు. ఇప్పటికే ఆడిన 8 మ్యాచ్ల్లో వైభవ్ సూర్యవంశీ 234 స్ట్రైక్రేట్తో 357 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. వైభవ్ ఇలాగే ఆడుతూ పోతే ఆరెంజ్ క్యాప్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అగ్రశ్రేణి బౌలర్లందరినీ ఉతికారేస్తున్న వైభవ్ సూర్యవంశీ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా లేక అతడి మెదడులో ఏఐ చిప్ పెట్టారా అని పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ సరదా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది. వైభవ్ సూర్యవంశీ బుర్రలో ఏఐ చిప్ను ఏమైనా ఇన్స్టాల్ చేశారేమోనని తనకు అనుమానంగా ఉందని తెలిపారు. టీనేజీ వయసులో ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు ఎలా కొడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. వైభవ్కు డోపింగ్ టెస్టు చేయాల్సిందే అని పేర్కొన్నాడు. నౌమన్ నియాజ్ మాట్లాడుతూ.. ‘వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఒకసారి వైభవ్ను చెక్ చేస్తే బాగుంటుంది. అతడి బుర్రలో ఏదైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేసారా అన్నది తెలుసుకోవడానికి ఏదో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షించాల్సిందే. వైభవ్ నాకు మనిషిలా అనిపించడం లేదు. అయితే అతడి మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అతడి బ్యాటింగ్ నాకు కొంచెం స్లో అనిపించింది. ఇక ఒక టీనేజీ కుర్రాడు కండలు తిరిగిన దేహంతో ఉంటాడా? కానీ సూర్యవంశీ 18 ఏండ్లు నిండకుండానే అతడి దేహదారుఢ్యం బలంగా కనిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో వైభవ్ ఆటలో మరింత రాటు దేలడం ఖాయం. ఇప్పుడు వైభవ్కు 15 ఏళ్లు. త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశముంది.నిజానికి అతడి బ్యాటింగ్లో పెద్దగా టెక్నిక్స్ కనిపించవు. కానీ అతడి మణికట్టు బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కుల చూపిస్తూ డేంజరస్ బ్యాటర్గా తయారయ్యాడు’ అని చెప్పుకొచ్చారు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లాడి 5 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. లీగ్లో రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ను మే 1న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 111 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,889 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
‘మా మామ గారికి అంకితం’
చాన్నాళ్ల తర్వాత ఐపీఎల్-2026లో కోల్కతా రైట్ రైడర్స్ స్టార్ రింకూ సింగ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఈ యూపీ ఆటగాడు అదరగొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.కోల్కతా విజయంలో అంతా తానే..రింకూ ప్రదర్శన కారణంగానే కోల్కతా 155 పరుగుల మార్కు అందుకోగలిగింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా కోల్కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నాలుగు సిక్స్లు.. ఫీల్డింగ్లో నాలుగు క్యాచ్లు, సూపర్ ఓవర్లో నాలుగు పరుగులు ఇలా... జట్టు విజయంలో రింకూనే కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.మా మామ గారికే అంకితంఇక ఈ మ్యాచ్ను వీక్షించేందుకు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj) లక్నోలోని ఏకనా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా రింకూ ప్రదర్శన పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. రింకూ మా మామ గారి కోసం ఆడాడు. ఈరోజు ఆయనను మేము ఎంతగానో మిస్సవుతున్నాము. రింకూ ప్రదర్శన మా మామ గారికే అంకితం’’ అని ప్రియా సరోజ్ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)చిన్న పిల్లలా గంతులేశారుకాగా రింకూ సిక్సర్లు బాదుతున్న వేళ ప్రియా సరోజ్ చిన్న పిల్లలా గంతులేశారు. నవ్వులు చిందిస్తూ కాబోయే భర్త విజయాన్ని సెలబ్రేట చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ప్రియా సరోజ్.. ఉత్తరప్రదేశ్లోని మచ్లిచహర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ తరఫున లోక్సభకు ఎంపికయ్యారు. రింకూతో పరిచయం ప్రేమగా మారగా.. గతేడాది పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే రింకూ తండ్రి మరణించిన విషయం విదితమే. చదవండి: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders)
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే?
ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్పై సూపర్ ఓవర్లో లక్నో ఓటమి పాలైంది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్నోకు ఏదీ కలిసిరావడం లేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన లక్నో.. ఆరింట ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానానికి చేరుకుంది. దీంతో లక్నో దాదాపుగా ప్లే ఆఫ్స్కు రేసు నుంచి నిష్క్రమించినట్లే. ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోతున్నాడు. డగౌట్లో ప్లాన్లు నిమిష నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఇలాంటి లోపాలే స్పష్టంగా కన్పించాయి. ఆఖరి ఓవర్లో దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించడం, సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్ను బ్యాటింగ్కు పంపడం వంటి నిర్ణయాలు లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంతపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్కు అప్పగించాలని జాఫర్ సూచించాడు. "లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది. వారి నుంచి ఇలాంటి ప్రదర్శలు అస్సలు ఊహించలేదు. ఒకవేళ నేనే లక్నో కోచింగ్ స్టాప్లో భాగమైంటే వెంటనే కెప్టెన్సీ మార్పు చేస్తాను. పంత్ను కెప్టెన్సీ బాధ్యతలను తప్పించి మార్క్రమ్కు అప్పగించేవాడని. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేసేవాడిని.మార్క్రమ్, మిచెల్ మార్ష్లతో ఓపెనింగ్ చేయిస్తాను. . మూడో స్థానంలో నికోలస్ పూరన్, ఆ తర్వాత నాలుగో స్థానంలో రిషబ్ పంత్, ఐదో స్థానంలో ఆయుష్ బదోని. ఆరో స్థానంలో అబ్దుల్ సమద్, ఏడో స్థానంలో ముకుల్ చౌదరిలను బ్యాటింగ్కు పంపేవాడిని. పంత్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ సెట్ కాదు. అతడు కేవలం బ్యాటర్గా గానే ఆడాలి. అప్పుడే అతడు పూర్తి స్వేఛ్చతో ఆడి మ్యాచ్లను గెలిపిస్తాడు. కాబట్టి కెప్టెన్సీ విషయంలో లక్నో పునరాలోచన చేయాలి. కెప్టెన్సీ బారంపై పంత్పై మోపొద్దు. అతడి స్ధానంలో మార్క్రమ్ను కెప్టెన్గా చేయండి. మార్క్రమ్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో సౌతాఫ్రికాను అతడు నడిపిస్తున్నాడు. అతడు అన్ని విధాలగా సమర్ధుడు అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. అయితే జాఫర్ ఒక్కడే కాదు చాలా మంది మాజీలు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. పంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.పంత్ ఈ ఏడాది సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొగలనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా అతడి కెప్టెన్సీలోని లక్నో గత సీజన్లో కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు. ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తోంది.
అంగ్క్రిష్ రఘువంశీపై కఠిన చర్యలు
కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్కతా జట్లు తలపడ్డాయి. అనూహ్య రనౌట్ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కతా బ్యాటింగ్కు దిగింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. ఇక వన్డౌన్లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ముందుకొచ్చాడు.అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్అయితే మరో ఎండ్లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది.KKR ತಂಡಕ್ಕಂತೂ ಇದು ನಿಜಕ್ಕೂ ನುಂಗಲಾರದ ತುತ್ತು! 'Obstruction of Field' ಅಂತ Raghuvanshi ಗೆ ಔಟ್ ಕೊಡಲಾಗಿದೆ.☝️ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಇದು Out? ಅಥವಾ Not Out? 👀 ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #LSGvsKKR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL #AngkrishRaghuvanshi pic.twitter.com/cPsuy1J2p7— Star Sports Kannada (@StarSportsKan) April 26, 2026తీవ్ర అసంతృప్తిదీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.జరిమానాతో పాటు..ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్లో కోల్కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కోల్కతా విజయం సాధించింది.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం
వీరేంద్ర సెహ్వాగ్ ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన రింకూ సింగ్
రింకూ సింగ్.. ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడు. మరోసారి అతడిలోని ఫినిషర్ బయటకు వచ్చాడు. ఐపీఎల్-2026 సీజన్లో ఆదివారం ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తన సూపర్ బ్యాటింగ్, ఫీల్డింగ్తో కేకేఆర్కు సంచలన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రింకూ వీరోచిత పోరాటం కనబరిచాడు. చివరి రెండో ఓవర్లలో రింకూ లక్నో బౌలర్లను ఉతికారేశాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన స్పిన్నర్ దిగ్వేష్ రాఠీకి ఈ యూపీ క్రికెటర్ చుక్కలు చూపించాడు. వరుసగా నాలుగు సిక్స్లు బాది ఐపీఎల్-2023 సీజన్ను రింకూ గుర్తు చేశాడు. ఆఖరి బంతిని రింకూ మిస్స్ చేసుకున్నాడు. లేదంటే మూడేళ్ల కిందట సీన్ రిపీట్ అయ్యి ఉండేది. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ను సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 29 పరుగులు అవసరమవ్వగా.. రింకూ వరుసగా ఐదు సిక్స్లు బాది తమ జట్టును విజయతీరాలకు తేచ్చాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు ఛేజ్ చేయడం అదే మొదటిసారి. అప్పటిలో రింకూ ఇన్నింగ్స్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఆఖరి ఓవర్లో ఇన్ని పరుగులు చేయడం అంత సులుభం కాదు. విజయానికి 5 సిక్సర్లు కావాల్సినప్పుడు రింకూ ఇలా చేయడం నిజంగా అద్భుతం. కానీ రింకూ సింగ్ మళ్ళీ ఎప్పటికీ దీన్ని రిపీట్ చేయలేడు" అని క్రిక్బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే సెహ్వాగ్ అంచనా తప్పిందని నెటిజన్లు అంటున్నారు. రింక్ దాదాపుగా మరోసారి చివరి ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టేంత పనిచేశాడని పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: Virender Sehwag: వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదుRINKU SINGH SMASHED 4 SIXES IN THE FINAL OVER AGAINST DIGVESH RATHI. - An iconic 83* (50) by Rinku. pic.twitter.com/V6dFUvtBWl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2026
‘అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.రెండేళ్లుగా పంజాబ్ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్కు ఇప్పుడు అమితమైన క్రేజ్ ఏర్పడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.రూ. 26.75 కోట్ల భారీ ధరకుకాగా 2024లో కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్ను కొనుగోలు చేసింది. పంజాబ్ కోచ్ రిక్కీ పాంటింగ్ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.పైసా వసూల్ ప్రదర్శనపాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్ అయ్యర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడిన పంజాబ్.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 71 నాటౌట్)తో మెరిశాడు.అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాంఈ నేపథ్యంలో హెడ్కోచ్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఐపీఎల్ వెబ్సైట్తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.శ్రేయస్ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు. ‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్ శ్రేయస్పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టాWho would have thought chasing 264 in T20 Cricket. 🤷- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026
వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు దేవ్దత్త్ పడిక్కల్, రజిత్ పాటిదార్ అద్బుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీని సూచిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ స్వయంగా పడిక్కల్ను భారత జట్టు ఎంపిక చేయాలని సిఫారస్సు చేశాడు.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతీ సీజన్లోనూ చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తారని, అందరిని జాతీయ జట్టులోకి తీసుకోవాలంటే కుదరదని సెహ్వాగ్ అన్నాడు. కాగా పడిక్కల్ ఎప్పుడో ఐదేళ్ల కింద భారత తరపున రెండు టీ20లు ఆడగా.. పాటిదార్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు."పడిక్కల్ను కచ్చితంగా మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలని దినేష్ కార్తీక్ అంటున్నాడు. అయితే ప్రతీ సీజన్లోనూ చాలా మంది అత్యుత్తమ ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు ఆశిస్తుంటారు. ఐపీఎల్లో బాగా ఆడిన ప్రతీ ఒక్కరికి తీసుకోవాలంటే ఎక్కడ అవుతోంది? భారత జట్టులో ప్రస్తుతం అస్సలు ఖాళీ ఉందా? భారత టీ20 సెటాప్ ప్రస్తుతం అద్భుతంగా ఉంది.ఇటీవలే వారు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. కాబట్టి రజత్ పటిదార్, శ్రేయస్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లకు ప్రస్తుతం జట్టులో స్థానం లేదు. వీరికే కాదు యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్కు కూడా చోటు లేదు. ఈ ఐదుగురికి అవకాశమివ్వాలంటే ఎవరిని జట్టు నుంచి తీసేయాలి చెప్పండి?" అంటూ క్రిక్బజ్ చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: Rishabh Pant: ఐపీఎల్కే దిక్కు లేదు.. ఇంకా టీమిండియా కెప్టెన్ కావాలా?
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ఐపీఎల్లో ఒకే ఒక్కడు
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో పద్దెమినిదేళ్లుగా ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ 2017లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు.144వ మ్యాచ్దాదాపు ఆరేళ్ల పాటు సన్రైజర్స్తో కొనసాగిన రషీద్ ఖాన్ (Rashid Khan).. 2022లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరాడు. అప్పటి నుంచి గుజరాత్కే ఆడుతున్న ఈ స్పిన్ బౌలర్... ఐపీఎల్-2026లో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ భాగమయ్యాడు. తద్వారా ఐపీఎల్లో తన 144వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు రషీద్ ఖాన్.ఏకైక ఆటగాడిగా రషీద్కాగా అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి దాకా రషీద్ ఖాన్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. తద్వారా ఐపీఎల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా.. అత్యధికంగా 144 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడిగా రషీద్ రికార్డులకెక్కాడు. తద్వారా భారత క్రికెటర్ సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.రైనా రికార్డు బద్దలుకాగా రైనా ఐపీఎల్లో మొత్తంగా 205 మ్యాచ్లు ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2008లో అరంగేట్రం చేసిన అతడు 2016లో తొలిసారి మ్యాచ్ మిస్ అయ్యాడు. తనకు కూతురు జన్మించిన సందర్భంగా అతడు జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అప్పుడు రైనా గుజరాత్ లయన్స్ కెప్టెన్గా ఉన్నాడు. నాడు ఆర్సీబీతో మ్యాచ్ అతడు మిస్సయ్యాడు.గుజరాత్ అలవోకగా..మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చచ్చీ చెడి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ల ధాటికి 12 ఓవర్లలో 50 పరుగుల మార్క్ దాటిన సూపర్ కింగ్స్... 16వ ఓవర్లో మూడంకెల స్కోరు అందుకుంది. ఫుల్ ఫామ్లో ఉన్న గుజరాత్ ముందు ఈ లక్ష్యం మరీ చిన్నదైపోయింది. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సాయి సుదర్శన్ మరోసారి దంచికొట్టడంతో 20 బంతులు మిగిలుండగానే టైటాన్స్ జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ వికెట్లేమీ తీయలేకపోయాడు. ఒక్క ఓవర్లోనే ఏకంగా 21 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్లో అరంగేట్రం నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు🏏రషీద్ ఖాన్- 144 మ్యాచ్లు- 2017-2026*- సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్🏏సురేశ్ రైనా- 143 మ్యాచ్లు- 2008-2016- చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ 🏏యూసఫ్ పఠాన్- 95 మ్యాచ్లు- 2008-2014- రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్🏏సుబ్రమణ్యం బద్రీనాథ్- 74 మ్యాచ్లు- 2008-2012- చెన్నై సూపర్ కింగ్స్🏏జితేశ్ శర్మ- 62 మ్యాచ్లు- 2022-2026*- పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్లో లేకున్నా అందుకే అతడిని పంపించాం🎥 High & handsome from Jos Buttler to seal victory for @gujarat_titans 💙An emphatic chase and a very important 2⃣ points 👏Scorecard ▶️ https://t.co/zJBovAaCoM #TATAIPL | #KhelBindaas | #CSKvGT pic.twitter.com/rcc3CD7gqM— IndianPremierLeague (@IPL) April 26, 2026
ప్రత్యక్ష ప్రసారం చూడలేమా!
టీమిండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు... అభి...
దివ్యాంశు–శాంభవి జోడీకి పసిడి పతకం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్...
ఫ్రెంచ్ ఓపెన్కు అల్కరాజ్ దూరం
పారిస్: కుడి మణికట్టు గాయం కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ...
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం...
వీరేంద్ర సెహ్వాగ్ ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన రింకూ సింగ్
రింకూ సింగ్.. ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఫ...
‘అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం’
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్...
వైభవ్, శ్రేయస్ కాదు.. ఎవరికీ టీమిండియాలో చోటు లేదు: సెహ్వాగ్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ...
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. ఐపీఎల్లో ఒకే ఒక్కడు
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరి...
క్రీడలు
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
వీడియోలు
SRHపై బుడ్డోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్
GTపై RCB ఘన విజయం
మ్యాచ్ మధ్యలోనే లేచి వెళ్లిపోయిన ఆకాష్ అంబానీ..
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
చేటా దెబ్బకి చేతులెత్తిసిన ముంబై.. IPL చరిత్రలోనే MIకి ఘోర ఓటమి
సామ్సన్ జిగేల్.. ముంబై ఢమాల్
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
