Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Bangladesh Government Orders Indefinite Ban On IPL Telecast1
IPL 2026: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మేటి లీగ్‌గా పేరొందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. "భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తమ జట్టు నుంచి విడుదల చేసింది.బాధ, వేదనకు గురిచేసిందిమార్చి 26, 2026 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌ నుంచి అతడిని తొలగించింది. జాతీయ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు పొంచి ఉందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. అయితే, ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌ ప్రజలను బాధ, వేదనకు గురిచేసింది.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ (IPL) ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని బ్రాడ్‌కాస్టర్లకు విజ్ఞప్తులు వచ్చాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల అనుమతితో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’’ అని బంగ్లాదేశ్‌ పేర్కొంది.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద హత్యాకాండ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.కుదరని చెప్పిన బీసీసీఐఅంతేకాదు.. టీమిండియాతో సెప్టెంబరులో ఆడాల్సిన టీ20, వన్డేల గురించి బంగ్లా బోర్డు షెడ్యూల్ విడుదల చేయగా.. బీసీసీఐ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమని బంగ్లా బోర్డు ప్రకటించింది.తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి లేఖ రాసింది. అయితే, ఇప్పటికే టోర్నీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికావడం.. బంగ్లాదేశ్‌తో ఆడే ప్రత్యర్థులు తమ టికెట్లు బుక్‌ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ వేదికలను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ సైతం బీసీసీఐ వాదనవైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?!

Gill Asks BCCI To Introduce New Test Rule Might Seek VVS Help: Report2
BCCI: శుబ్‌మన్‌ గిల్‌ డిమాండ్‌ ఇదే!

భారత టెస్టు జట్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్‌ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్నాడు శుబ్‌మన్ గిల్‌. అయితే, ఇంగ్లండ్‌ గడ్డపై బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి.. పాస్‌ మార్కులు వేయించుకున్నాడు. అనంతరం వెస్టిండీస్‌తో స్వదేశంలో 2-0తో వైట్‌వాష్‌ చేసి సత్తా చాటాడు.అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టు (IND vs SA) సిరీస్‌లో మాత్రం గిల్‌ సేన ఘోర పరాభవం చవిచూసింది. సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ విజయంతో సత్తా చాటగా.. టీమిండియాకు చేదు అనుభవం మిగిలింది.గిల్‌ డిమాండ్‌ ఇదేఈ పరిణామాల నేపథ్యంలో కెప్టెన్‌ గిల్‌ (Shubman Gill).. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) పెద్దల ముందుకు ఓ విజ్ఞప్తి తీసుకువచ్చినట్లు సమాచారం. టెస్టు సిరీస్‌ ఆరంభానికి పదిహేను రోజుల ముందు నుంచే సన్నాహకాలు మొదలుపెట్టేలా ప్రణాళికలు రచించాలని యాజమాన్యాన్ని గిల్‌ డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘టెస్టు సిరీస్‌ ఆడేందుకు ముందు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యమని గిల్‌ భావిస్తున్నాడు. మ్యాచ్‌లు ఆడటానికి కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెడితే బాగుంటుందని అతడి ఆలోచన.దీని గురించి గిల్‌ ఇప్పటికే బోర్డు ముందు ప్రతిపాదన తెచ్చాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశంపై అతడికి పూర్తి అవగాహన ఉంది. సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలతో తన డిమాండ్ల గురించి చెప్పాడు. టెస్టులతో పాటు వన్డేల్లోనూ రోహిత్‌ శర్మ తర్వాత గొప్ప సారథిగా ఎదిగేందుకు అన్ని అర్హతలు గిల్‌కు ఉన్నాయి. తన ఆలోచనలను నిక్కచ్చిగా పంచుకుంటూ జట్టును మరింత గొప్పగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.విరామం లేని షెడ్యూల్‌కాగా దుబాయ్‌లో ఆసియా కప్‌-2025 గెలిచిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్‌తో టెస్టు బరిలో దిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న ఆరు రోజుల తర్వాత సొంతగడ్డపై ప్రొటిస్‌తో టెస్టుల్లో తలపడి.. పూర్తిస్థాయి ప్రాక్టీస్‌ లేకుండా వైట్‌వాష్‌ రూపంలో భారీ మూల్యమే చెల్లించింది.ఇక గిల్‌ ఈ మేరకు ఆలోచన చేసిన నేపథ్యంలో బీసీసీఐ ఇందుకు సంబంధించి కీలక ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ‘‘హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా ఉంటాడు కాబట్టి.. టెస్టు సిరీస్‌లకు సన్నద్ధమయ్యే క్రమంలో బోర్డు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సేవలను వాడుకోవాలని భావిస్తోంది. అతడి ఆధ్వర్యంలో రెడ్‌బాల్‌ క్యాంపులను నిర్వహించే అవకాశం ఉంది’’ అని బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లతో టీమిండియా బిజీ కానుంది. అనంతరం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్‌ ఆడే జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు.చదవండి: జో రూట్‌ 41వ శతకం

ICC Not to take hasty decision on shifting Bangladesh T20 WC matches3
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ?!

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026లో బంగ్లాదేశ్‌ ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్‌బజ్‌ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.ముస్తఫిజుర్‌ రహమాన్‌ అవుట్‌ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా మెజారిటీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్‌ బౌలర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్‌ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.మ్యాచ్‌లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తిభారత్‌లో మ్యాచ్‌లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్‌లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ తమ తొలి మూడు లీగ్‌ మ్యాచ్‌లను కోల్‌కతాలో, చివరి మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది.‘బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం. బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది. తరలింపు కష్టమే! బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్‌లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్‌ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్‌లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్‌ బుక్‌ చేసుకున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్‌లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది. ప్రసారకర్తలు మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ రియల్‌ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం

Damien Martyn condition improves after being brought out of coma4
అద్భుతం.. కోమా నుంచి బయటపడిన ఆసీస్‌ దిగ్గజం

ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ దిగ్గజం​ డేమియన్‌ మార్టిన్‌ (54) ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. మెనినైటిస్‌తో బాధపడుతూ ఇటీవల కోమాలోకి వెళ్లిన ఆయన.. ఆశ్చర్యకర రీతిలో కోమా నుంచి బయటపడ్డాడు. మార్టిన్‌ ఆరోగ్యం అద్భుత రీతిలో పురోగతి సాధించింది. గంట గంటకు ఇంకా మెరుగవుతున్నాడని డాక్టర్లు చెప్పారు.మార్టిన్‌ ఆరోగ్యం ఆశ్చర్యకర రీతిలో పురోగతి సాధిస్తుండటాన్ని అతని స్నేహితుడు, ఆసీస్‌ దిగ్గజ వికెట్‌కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 'మిరాకిల్‌'గా అభివర్ణించాడు.గిల్లీ మాటల్లో.. గత 48 గంటల్లో మార్టిన్‌ ఆరోగ్యం ఊహించని విధంగా మెరుగు పడింది. అతని ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కోమా నుంచి బయట పడిన తర్వాత మార్టిన్‌ అసాధారణంగా స్పందిస్తున్నాడు. స్పందించడమే కాకుండా చక్కగా మాట్లాడగలుగుతున్నాడు. త్వరలోనే అతన్ని ICU నుంచి బయటకు తరలించే అవకాశం ఉంది. కాగా, గిల్‌క్రిస్ట్‌ గత కొన్ని రోజులుగా మార్టిన్‌ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.అభిమానులకు కృతజ్ఞతలుమార్టిన్‌ ఆశ్చర్యకర రీతిలో కోలుకుంటున్న నేపథ్యంలో అతని భార్య అమాండా తొలిసారి స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెట్ సమాజం చూపిన ప్రేమ, శ్రద్ధ వల్ల మార్టిన్‌ కోలుకుంటున్నాడని అంది. మార్టిన్‌ ఆరోగ్యం కుదుటపడటంలో అందరి పాత్ర ఉందని తెలిపింది. అభిమానుల సందేశాలు, మీడియా ద్వారా వచ్చిన మద్దతు మార్టిన్‌కు బలాన్నిచ్చాయని పేర్కొంది. కష్ట సమయంలో అండగా ఉన్న వారందకీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపింది.సొగసైన బ్యాటర్‌గా పేరొందిన డేమియన్‌ మార్టిన్‌ 1992 నుంచి 2006 మధ్యకాలంలో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. తన కెరీర్‌లో మొత్తంగా 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 4406, 5346, 120 పరుగులు సాధించాడు.మార్టిన్‌ ఇటీవల జరిగిన బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే అతడి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మార్టిన్‌ పూర్తిగా కోలుకునే క్రమంలో ఉన్నాడు.

Curran steers Desert Vipers to maiden ILT20 glory5
సామ్‌ కర్రన్‌ అద్భుత ప్రదర్శన.. డెజర్ట్ వైపర్స్‌కు తొలి ILT20 టైటిల్

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ టైటిల్‌ను డెజర్ట్ వైపర్స్‌ కైవసం​ చేసుకుంది. దుబాయ్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో MI ఎమిరేట్స్‌ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసి తమ తొలి DP వరల్డ్ ILT20 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో వైపర్స్‌ 7 లక్షల యూఎస్‌ డాలర్ల నగదు బహుమతి సహా బ్లాక్ బెల్ట్‌ను అందుకుంది. రన్నరప్‌ MI ఎమిరేట్స్‌కు 3 లక్షల యూఎస్‌ డాలర్ల నగదు బహుమతి లభించింది. కర్రన్‌ వన్‌ మ్యాన్‌ షోఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వైపర్స్‌.. కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ (51 బంతుల్లో 74 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ద సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మ్యాక్స్‌ హోల్డన్‌ (41) ఓ మోస్తరు స్కోర్‌తో రాణించగా.. డాన్‌ లారెన్స్‌ 23, ఫకర్‌ జమాన్‌ 20, జేసన్‌ రాయ్‌ 11 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో ఫజల్‌ హక్‌ ఫారూకీ 2, అరబ్‌ గుల్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో ఎం జట్టు ఆదిలోనే చేతులెత్తేసింది. నసీం​ షా (4-0-18-3), డేవిడ్‌ పేన్‌ (4-0-42-3), ఖుజామియా తన్వీర్‌ (3.3-0-22-2), ఉస్మాన్‌ తారిక్‌ (4-0-20-2) ధాటికి 18.3 ఓవర్లలో 136 పరుగులకే చాపచుట్టేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ (36) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ (28), ముహమ్మద్‌ వసీం (26), తేజిందర్‌ డిల్లాన్‌ (12), ఆండ్రీ ఫ్లెచర్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు.టోర్నీ ఆధ్యాంతం ఆల్‌రౌండర్‌ షోతో అదరగొట్టిన సామ్‌ కర్రన్‌ (97 పరుగులు, 7 వికెట్లు, 10 క్యాచ్‌లు) రెడ్ బెల్ట్ (MVP), గ్రీన్ బెల్ట్ (Best Batter) గెలుచుకున్నాడు. వకార్‌ సలాంఖిల్‌ (Dubai Capitals)– వైట్ బెల్ట్ (Best Bowler, 18 వికెట్లు), ముహమ్మద్ వసీమ్ (MI Emirates– బ్లూ బెల్ట్ (Best UAE Player, 370 పరుగులు) గెలుచుకున్నారు.

Joe Root equals Ricky Ponting with 41st Test hundred6
జో రూట్‌ 41వ శతకం

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ టెస్ట్‌ క్రికెట్‌లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్‌ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్‌, రూట్‌ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్‌ (51), సంగక్కర (45) పాంటింగ్‌, రూట్‌ కంటే ముందున్నారు.ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ (84) ఒక్కడే రూట్‌ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్‌కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.తాజా శతకంతో రూట్‌ తన సమకాలీకులు, ఫాబ్‌-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్‌ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌ 36, కేన్‌ విలియమ్సన్‌ 33, విరాట్‌ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ చివరి టెస్ట్‌లో రూట్‌ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు రూట్‌కు ఆసీస్‌ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్‌లోనే ఆసీస్‌ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్‌కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్‌ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్‌ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (84) సెంచరీకి చేరువలో ఔట్‌ కాగా.. జేమీ స్మిత్‌ (46) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో నెసర్‌ 4, స్టార్క్‌, బోలాండ్‌ తలో 2, గ్రీన్‌, లబూషేన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ మూడో సెషన్‌ సమయానికి వికెట​ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్‌ 24, వెదరాల్డ్‌ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్‌ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

gangireddypalem srivalli kabaddi national level achievement7
ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే

ఆమె ‘కూత’ పెడితే ప్రత్యర్థి జట్లు గడగడలాడాల్సిందే. సామాన్య రైతు బిడ్డ అయినా జాతీయ స్థాయి కబడ్డీలో మెరుస్తోంది. ప్రతిభకు తోడు పట్టుదల ఉంటే పల్లె సరిహద్దులు దాటడం కష్టమేమీ కాదని నిరూపిస్తోంది మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యార్థిని పెమ్మా శ్రీవల్లి. ఉత్తమ ‘రైడర్‌’గా గుర్తింపు పొందింది.యడ్లపాడు: పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని చిన్న గ్రామమైన గంగిరెడ్డిపాలెంలో రైతు దంపతులు పెమ్మా రామారావు, పద్మల కుమార్తె శ్రీవల్లి. ఆమె సోదరుడు బీటెక్‌ చదువుతున్నాడు. మద్దిరాల పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శ్రీవల్లి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. జేఎనీ్వలో సీనియర్ల పతకాలు చూసి తనకు ఇష్టమైన కబడ్డీని ఎంచుకుంది. మొదట్లో ఎంతో భయపడింది. ప్రిన్సిపల్‌ నల్లూరి నరసింహారావు, పీఈటీలు గుడిబెండ గోవిందమ్మ, ఆర్‌.పాండు రంగారావుల ప్రోత్సాహంతో నిత్యం సాధన చేసింది. ఆట మీద ఏకాగ్రత పెంచింది. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుంది. క్లస్టర్, రీజినల్, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటింది. పెరిగిన స్థాయి శ్రీవల్లీ ఏకంగా నవోదయ విద్యాసమితి హైదరాబాద్‌ రీజియన్‌ (ఐదు రాష్ట్రాల) ప్రతినిధిగా ఎంపిక కావడం విశేషం. ఇప్పుడు ఆమె పోరాటం కేవలం జేఎన్‌వీలకే పరిమితం కాదు. సీబీఎస్‌ఈ, వెల్ఫేర్, కేంద్రియ విద్యాలయాల జట్లతో ఆమె తలపడనుంది. జనవరి 18 నుంచి 23వ తేదీ వరకు ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యాన హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగే అండర్‌ –19 జాతీయ పోటీలకు జేఎన్‌వీ జాతీయ జట్టులో స్థానం పొందింది. ఇందుకోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌ జేఎన్‌వీలో వీరి జట్టు శిక్షణకు సిద్ధమైంది. మొత్తం పదిరోజుల పాటు వారు శిక్షణ పొందనున్నారు. ఎప్పటికైనా ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని, విజయం సాధించి దేశం గర్వించేలా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టాలన్నదే శ్రీవల్లి కల.అవకాశాలు వదలొద్దు: శ్రీవల్లి కబడ్డీ నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. లక్ష్యం ఏషియన్‌ గేమ్స్, ఖేలో ఇండియాలో పాల్గొనడమే. బాలికలు క్రీడల్లో రాణించడం కష్టమనే అభిప్రాయం సాధారణంగా ఉంది. దాన్ని తుడిచేయాలి. అవకాశాల్ని వదలొద్దు. క్రీడల వలన పోరాటతత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఉద్యోగం కూడా పొందొచ్చు. ఇష్టమైన రంగంలో కష్టపడాలి. ఏకాగ్రత, పట్టుదల ఉంటే మైదానంలోనే కాదు, జీవితంలోనూ విజయం సాధించవచ్చు.

Shrachi Bengal Tigers started its title defence with a 3-1 win over Soorma Hockey Club8
బెంగాల్‌ టైగర్స్‌ శుభారంభం 

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బెంగాల్‌ 3–1తో సూర్మ హాకీ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదటి రెండు క్వార్టర్లు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్‌ మొదలైన మూడు నిమిషాలకే బెంగాల్‌ టైగర్స్‌ స్ట్రయికర్‌ సుఖ్‌జీత్‌ సింగ్‌ (33వ ని.) గోల్‌తో ఖాతా తెరిచాడు. ఈ క్వార్టర్‌ ముగిసే దశలో మళ్లీ అభిషేక్‌ (45వ ని.) గోల్‌ చేయడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆఖరి క్వార్టర్‌లో ఎట్టకేలకు సూర్మ క్లబ్‌ తరఫున ప్రభ్‌జోత్‌ సింగ్‌ (54వ ని.) గోల్‌ కొట్టి 1–2తో బెంగాల్‌ ఆధిక్యానికి గండికొట్టినప్పటికీ ఆఖరి నిమిషంలో గుర్‌సేవక్‌ సింగ్‌ (60వ ని.) గోల్‌ చేయడంతో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ 3–1తో విజయం సాధించింది. తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌ 4–2తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. అంతకు ముందు జరిగిన మహిళల హెచ్‌ఐఎల్‌లో శ్రాచి బెంగాల్‌ టైగర్స్‌ 1–0తో రాంచీ రాయల్స్‌పై నెగ్గింది. నేడు జరిగే అమ్మాయిల మ్యాచ్‌లో సూర్మ క్లబ్‌... రాంచీ రాయల్స్‌తో, పురుషుల ఈవెంట్‌లో ఎస్‌జీ పైపర్స్‌... హెచ్‌ఐఎల్‌ జీసీ జట్టుతో తలపడతాయి.

India making strong efforts to host the 2036 Olympics says PM Narendra Modi9
‘2036లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తాం’ 

వారణాసి: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036లో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇప్పటికే 2030 కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ హక్కులు లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివారం వారణాసిలో సీనియర్‌ జాతీయ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌ మొదలు కాగా...వర్చువల్‌గా ప్రధాని దీనిని ప్రారంభించారు. ప్రధాన వేదికపై జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వర్ధమాన అథ్లెట్లు ఒలింపిక్స్‌లో రాణించేందుకు తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ‘ఖేలో ఇండియా’లాంటి క్రీడలు, పథకాలు ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఒక గేమ్‌ చేంజర్‌ అని మోదీ పేర్కొన్నారు. ‘2030 కామన్వెల్త్‌ క్రీడలకు భారత్‌ ఆతిథ్యమిస్తోంది. అలాగే 2036 విశ్వక్రీడల ఆతిథ్యం కోసం గట్టిగానే కృషి చేస్తున్నాం. దీనివల్ల మన భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లలో సత్తా చాటుకునే అవకాశం లభిస్తుంది. మేం ఇదివరకే ప్రారంభించిన ఖేలో ఇండియా సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతిభ గల క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేలా విస్తృత అవకాశాల్ని కల్పించింది’ అని ప్రధాని వివరించారు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌) ఎంతోమంది అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెచ్చేందుకు తోడ్పడిందన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్‌లో 20కి పైగానే మేజర్‌ క్రీడా ఈవెంట్లు జరిగాయని గుర్తుచేశారు. ‘పదేళ్లుగా వివిధ నగరాల్లో చెప్పుకోదగిన స్థాయిలో అంతర్జాతీయ ఈవెంట్లు ఎన్నో జరిగాయి. ఫిఫా అండర్‌–17 ప్రపంచకప్, హాకీ ప్రపంచకప్, అంతర్జాతీయ చెస్‌ టోర్నీలు, ప్రపంచకప్‌ చెస్‌ ఈవెంట్లు జరిగాయి. కేంద్రం కూడా ప్రతీ ఏటా క్రీడల బడ్జెట్‌ను పెంచుతూ పోతోంది. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల ప్రదర్శన మెరుగుపరిచేందుకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాం. ఎక్స్‌ప్రెస్‌ వేగంతో సంస్కరణల్ని అమలు చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు. సీనియర్‌ జాతీయ వాలీబాల్‌ పోటీలు ఆదివారం నుంచి ఈ నెల 11 వరకు జరుగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సరీ్వసెస్‌కు చెందిన 58 పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు వేయికి పైగా ఆటగాళ్లు ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఇరు విభాగాల్లో లీగ్‌ దశ పోటీలు జరుగుతాయి. గ్రూప్‌ దశ అనంతరం నాకౌట్‌ దశ మొదలవుతుంది. 11న జరిగే ఫైనల్స్‌తో ఈవెంట్‌ ముగుస్తుంది.

WPL 2026: Meg Lanning appointed as new UP Warriorz captain10
యూపీ వారియర్జ్‌కు కొత్త కెప్టెన్‌.. దీప్తి శర్మపై వేటు

మహిళల ఐపీఎల్‌ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్‌ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్‌ ఈ సీజన్‌ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌ నియామకంతో గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్‌లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్‌ వేలంలో వారియర్జ్‌ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్‌ ఓ వన్డే ప్రపంచకప్‌, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్‌ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.లాన్నింగ్‌ సారథ్యంలో వారియర్జ్‌ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్‌ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్‌ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. కాగా, డబ్ల్యూపీఎల్‌ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఓపెనర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్‌ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్‌ జెయింట్స్‌తో) ఆడనుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement