ప్రధాన వార్తలు
టీమిండియా క్లీన్స్వీప్
శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో టీ20లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టును విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ,అరుంధతి రెడ్డి, స్నేహ్ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్ జ్యోత్ కౌర్లు తలో వికెట్ తీసి విజయంలో సహకరించారు.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది.
హర్మన్ప్రీత్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్కప్లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది.
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి
న్యూ ఇయర్కి ముందు టీమిండియాకు ఊహించని షాక్..!
మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుండగా.. భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్లో ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన శ్రేయస్.. న్యూజిలాండ్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే శ్రేయస్ కూడా ఫిట్నెస్ సాధించి, ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 30) శ్రేయస్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి ఫిట్నెస్ క్లియెరెన్స్ లభించాల్సి ఉండింది. అయితే శ్రేయస్ అనూహ్యంగా 6 కిలోలు బరువు తగ్గినట్లు CoE వైద్య బృందం గుర్తించింది. దీని వల్ల శ్రేయస్కు బ్యాటింగ్ చేయడంలో ఎలాంటి సమస్య లేకపోయినా, మసిల్ మాస్ బాగా క్షీణించి, శక్తి స్థాయిలు తగ్గాయని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో శ్రేయస్కు రిటర్న్ టు ప్లే (RTP) సర్టిఫికేట్ ఇవ్వలేమని పరోక్షంగా చెప్పారు. దీంతో శ్రేయస్ రీఎంట్రీ మరో వారం వాయిదా పడనుంది.ఒకవేళ శ్రేయస్కు ఇవాళ RTP సర్టిఫికేట్ లభించి ఉంటే జనవరి 3, 6 తేదీల్లో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడు. తాజా పరిస్థితి ప్రకారం.. శ్రేయస్ న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. జట్టును 2 లేదా 3 తేదీల్లోగా ప్రకటించే అవకాశం ఉంది.ఆ సమయానికి శ్రేయస్కు ఫిట్నెస్ క్లియరెన్స్ లభించడం అసాధ్యంగా కనిపిస్తుంది. వన్డే జట్టులో కీలకమైన శ్రేయస్ విషయంలో CoE అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునే సాహసం చేయలేరు. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ను మిస్ అయితే, విజయ్ హజారే ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది.
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్, కోహ్లికి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
ఆర్సీబీకి భారీ షాకిచ్చిన ఆస్ట్రేలియా ఆల్రౌండర్
వచ్చే ఏడాది (2026) జనవరి 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్ 2026కు ముందు 2024 ఎడిషన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికి దూరం కానుంది. పెర్రీ స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం దేశీయ ఆల్రౌండర్ సయాలీ సత్ఘరేతో భర్తీ చేసింది.సత్ఘరే గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. ఈ సీజన్ వేలంలో సత్ఘరేను (30 లక్షలు) ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. తాజాగా ఎల్లిస్ లీగ్ నుంచి తప్పుకోవడంతో సత్ఘరేను అదృష్టం వరించింది. ఎల్లిస్ వైదొలిగిన తర్వాత ఆర్సీబీలో నడినే డి క్లెర్క్ మాత్రమే నాణ్యమైన విదేశీ ఆల్రౌండర్గా ఉంది.ఎల్లిస్ ఆర్సీబీ 2024లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఎల్లిస్కు డబ్ల్యూపీఎల్ మొత్తంలోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్లో 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్ ఎల్లిసే. ఈ లీగ్లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడిన ఈ వెటరన్ ఆల్రౌండర్.. 8 హాఫ్ సెంచరీల సాయంతో 972 పరుగులు చేసి, 8.25 ఎకానమీతో 14 వికెట్లు తీసింది.ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా..!డబ్ల్యూపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్, ఆసీస్ ప్లేయరే అయిన అన్నాబెల్ సదర్ల్యాండ్ కూడా వ్యక్తిగత కారణాల చేత సీజన్ మొత్తానికే దూరం కానుంది. సదర్ల్యాండ్ స్థానాన్ని డీసీ యాజమాన్యం అలానా కింగ్తో భర్తీ చేసింది.
ఒమన్ వరల్డ్కప్ జట్టు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల ఒమన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు జతిందర్ సింగ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ కూడా భారత సంతతి ఆటగాడే (వినాయక్ శుక్లా) కావడం మరో విశేషం. ఈ జట్టులో వీరే కాక మరో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కరణ్ సోనావాలే, జయ్ ఒడేడ్రా, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రామనంది భారత్లో జన్మించిన వారే.ఈ జట్టుకు డిప్యూటీ కోచ్ కూడా భారతీయుడే. ముంబై మాజీ హెడ్ కోచ్గా పని చేసిన సులక్షన్ కులకర్ణి ప్రపంచకప్లో ఒమన్ డిప్యూటీ కోచ్గా వ్యవహరిస్తాడు. మొత్తంగా చూస్తే ప్రపంచకప్ బరిలోకి దిగబోయే ఒమన్ బృందం భారతీయులతో నిండుకొని ఉంది.2026 టీ20 వరల్డ్కప్ కోసం ఒమన్ జట్టు..జతిందర్ సింగ్ (c), వినాయక్ శుక్లా (vc), మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మిర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహ్మూద్, జయ్ ఓడేడ్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఓడేడ్రా, జితేన్ రమనంది, హస్నైన్ అలీ షా కాగా, ఒమన్ జట్టు ఆసియా క్వాలిఫయర్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్కు అర్హత సాధించింది. కరీబియన్ దీవులు, యూఎస్ఏ వేదికలుగా జరిగిన 2024 వరల్డ్కప్కు కూడా ఒమన్ క్వాలిఫై అయ్యింది. ఈసారి ప్రపంచకప్లో ఒమన్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఒమన్ ఫిబ్రవరి 9న తమ తొలి మ్యాచ్లో ఆడనుంది. కొలొంబో వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్తో ఐదు టీ20లు సహా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ తదుపరి మ్యాచ్లలో పంజాబ్కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
సూర్య చరిష్మా సంచలనం
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప...
బాలాజీ కీలక ఆటగాడు
న్యూఢిల్లీ: అనుభవజ్ఞుడైన శ్రీరామ్ బాలాజీ భారత టెన...
ఐవరీకోస్ట్ గెలుపు బోణీ
రబాట్ (మొరాకో): ఆఫ్రికా కప్ ఫుట్బాల్ టోర్నమెంట...
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
దోహా: ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్షి...
ఒమన్ వరల్డ్కప్ జట్టు కెప్టెన్గా భారత సంతతి ఆటగాడు
వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయు...
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాం...
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్...
సూర్యకుమార్ యాదవ్పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై బా...
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
వీడియోలు
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
