Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026 Match 40: Rajasthan Royals beat Punjab Kings1
ఫెరియెరా ఊచకోత.. పంజాబ్‌కు ఓటమి రుచి చూపించిన రాజస్థాన్‌

ఐపీఎల్‌ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతున్న పంజాబ్‌ కింగ్స్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమి రుచి చూపించింది. సొంతగడ్డ ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఖర్లో స్టోయినిస్‌ (22 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్‌ శర్మ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్‌సిమ్రన్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్‌ ఆటగాళ్లలో ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో యశ్‌ రాజ్‌ పుంజా 2, ఆర్చర్‌, బర్గర్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్‌ ఫెరియెరా (52 నాటౌట్‌), షుభమ్‌ దూబే (31 నాటౌట్‌) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు యశస్వి జైస్వాల్‌ (51), వైభవ్‌ సూర్యవంశీ (43) తమ సహజశైలిలో రెచ్చిపోయి రాయల్స్‌ గెలుపుకు గట్టి పునాది వేశారు. ఆతర్వాత వచ్చిన ధృవ్‌ జురెల్‌ (16) కాస్త తడబడినప్పటికీ.. అతని తర్వాత వచ్చిన రియాన్‌ పరాగ్‌ (29) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇతని తర్వాత క్రీజ్‌లో కుదురుకున్న ఫెరియెరా, షుభమ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్‌ బౌలర్లలో చహల్‌ 3, అర్షదీప్‌ ఓ వికెట్‌ తీశారు.

HCA TG20 League Logo Unveiling on April 292
ఏప్రిల్ 29న హెచ్‌సీఏ TG20 లీగ్ లోగో ఆవిష్కరణ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన ప్రతిష్ఠాత్మక T20 లీగ్ ‘TG20’ ను ఏప్రిల్ 29న నగరంలో ఘనంగా ఆవిష్కరించనుంది. ఈ లీగ్ రాష్ట్రంలోని దేశీయ క్రికెట్‌కు కొత్త దిశను చూపే కీలక అడుగుగా భావిస్తున్నారు.గ్రాస్‌రూట్ స్థాయి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ వరకు వారధిగా TG20 రూపుదిద్దుకుంటోంది. పారదర్శకత, పోటీ వాతావరణం, ప్రతిభా వికాసం అనే లక్ష్యాలతో ఈ లీగ్ రూపొందించబడింది. Board of Control for Cricket in India (BCCI) దృష్టికోణానికి అనుగుణంగా, జిల్లా స్థాయి ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి ఉన్నత స్థాయి వేదికల వరకు చేరుకునే మార్గాన్ని ఇది సృష్టిస్తుంది.ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) ప్రక్రియకు కార్పొరేట్ వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. తొలి సీజన్ జూన్–జూలై 2026లో ప్రారంభం కానుంది. మ్యాచ్ షెడ్యూల్ మరియు జట్ల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.అగ్రశ్రేణి లీగ్‌ల తరహాలో రూపొందించిన TG20, ఆటగాళ్లకు అధిక స్థాయి పోటీ వాతావరణాన్ని కల్పిస్తూ, వారి ప్రతిభను మెరుగుపరచడానికి మరియు గుర్తింపు పొందడానికి సహాయపడుతుంది.TG20 vs డొమెస్టిక్ లీగ్స్•​పోటీ స్థాయి: TG20 – అధికం | క్లబ్ క్రికెట్ – మధ్యస్థం​•​మ్యాచ్ ఒత్తిడి: ప్రొఫెషనల్ | సెమీ-ప్రొఫెషనల్​•​గుర్తింపు (Exposure): విస్తృతం | పరిమితం​•​ఆటగాళ్ల అభివృద్ధి: వేగంగా | క్రమంగాఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొని, 32 మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. అన్ని మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రౌండ్-రోబిన్ మరియు ప్లేఆఫ్ పద్ధతిలో జరుగుతాయి.హెచ్‌సీఏ అధికారులు TG20 ను కేవలం లీగ్‌గా కాకుండా, జిల్లా స్థాయి ప్రతిభను గుర్తించి, పెంపొందించి, ప్రదర్శించే ఒక సమగ్ర ప్రతిభా వేదికగా అభివర్ణించారు.పారదర్శకత, నిష్పక్షపాతత, ప్రొఫెషనలిజం వంటి విలువలతో ఈ లీగ్ నిర్వహించబడనుంది. ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, మరియు ఇతర భాగస్వాముల నుంచి విస్తృత స్పందన లభించే అవకాశముంది.క్రికెట్‌కే పరిమితం కాకుండా, ప్రేక్షకులకు ఉత్సాహభరితమైన మ్యాచ్‌లు, వినోదాత్మక కార్యక్రమాలతో పండుగ వాతావరణాన్ని TG20 అందించనుంది. ఈ లీగ్‌లో విజయాన్ని సాధించాలంటే ప్రొఫెషనల్ సిద్ధత, క్రమశిక్షణ, మరియు స్థిరత్వం అత్యంత ముఖ్యమైనవి.ధన్యవాదాలుఎచ్ సి ఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి

Babar Azam sets all time PSL record during Qualifiers against United3
విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌

ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో ఆ దేశ స్టార్‌ బ్యాటర్‌, పెషావర్‌ జల్మీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (ఏప్రిల్‌ 28) మరో సెంచరీ బాదాడు. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో బాబర్‌ ఉగ్రరూపం దాల్చాడు. 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఫలితంగా అతని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మిగతా పెషావర్‌ బ్యాటర్లలో మొహమ్మద్‌ హరీస్‌ (35), కుసాల్‌ మెండిస్‌ (41), ఆరోన్‌ హార్డీ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బ్రేస్‌వెల్‌ (2), అబ్దుల్‌ సమద్‌ (0), ఫర్హాన్‌ (0) నిరాశపరిచారు. ఇస్లామాబాద్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌ గ్లీసన్‌ 2, సల్మాన్‌ మీర్జా, ఫహీమ్‌ అష్రాఫ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.ఇదిలా ఉంటే, ఈ సెంచరీతో బాబర్‌ ఓ ఆల్‌టైమ్‌ పీఎస్‌ఎల్‌ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్‌ చరిత్రలో నాలుగు సీజన్లలో (2021, 2023, 2024, 2026) 500 ప్లస్‌ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకు సంబంధించి బాబర్‌ తర్వాతి స్థానంలో మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఉన్నాడు. రిజ్వాన్‌ పీఎస్‌ఎల్‌లో మూడు సీజన్లలో (2021, 2022, 2023) 500 ప్లస్‌ పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ 598 పరుగులు చేసి, పీఎస్‌ఎల్‌ చరిత్రలో ఓ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు లాహోర్‌ ఖలందర్స్‌ ప్లేయర్‌ ఫకర్‌ జమాన్‌ పేరిట ఉండేది. జమాన్‌ 2022 ఎడిషన్‌లో 588 పరుగులు చేశాడు.

Why Are Punjab Kings Players Wearing Black Armbands vs Rajasthan Royals?4
పంజాబ్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌ ధరించడం వెనుక హృదయ విదారక కారణం

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు నల్లటి ఆర్మ్‌ బ్యాండ్స్‌ ధరించి కనిపించారు. దీని వెనుక హృదయ విదారక కారణం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ నిన్న తన తల్లిని కోల్పోయారు.ఇందుకు సంతాపంగా పంజాబ్‌ కింగ్స్‌ బృంద సభ్యులు మొత్తం నల్ల బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్‌ టాస్‌ సందర్భంగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒమర్‌జాయ్‌ తల్లి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పంజాబ్‌ కింగ్స్‌ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్‌ చేసింది."అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి మరణం పట్ల మా ప్రగాఢ సానుభూతి. ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ కింగ్స్ కుటుంబం మొత్తం అతనితో పాటు అతని కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది" అని పేర్కొంది.ఒమర్‌జాయ్‌ తన తల్లి అంత్యక్రియల నిమిత్తం స్వదేశానికి వెళ్లాడు. జట్టు కూర్పు సమస్యల కారణంగా ఒమర్‌జాయ్‌కు ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. గత సీజన్‌లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు.ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే, ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ 18 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ (59), ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔట్‌ కాగా.. స్టోయినిస్‌ (24), సూర్యంశ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ అజేయ జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Preity Zinta Epic Response For Chahal Wants-To Open For Punjab Kings5
ప్రీతి జింటా దిమ్మతిరిగే కౌంటర్‌.. షాక్‌లో చాహల్‌!

ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ క్యాంపులో ప్రస్తుతం సందడి నెలకొంది. ఈ క్రమంలో ఆ జట్టు స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహల్, ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండటంతో, య‌జ్వేంద్ర చాహల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రీతి జింటాను ఉద్దేశించి స‌ర‌దాగా పోస్టు పెట్టాడు. ‘మేడమ్.. నాకు ఒక మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తారా?’ అని సరదాగా అడిగాడు. దీనికి ప్రీతి జింటా తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘తప్పకుండా చాహల్‌.. నీ కోసం ఏదైనా చేస్తాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత నీకు నచ్చిన మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయొచ్చు. అప్పుడు ప్రబ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ఆర్య కూడా ఏమీ అనుకోరని నాకు తెలుసు’ అంటూ లాఫింగ్‌ ఎమోజీ జత చేస్తూనే తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇవ్వడంతో చాహల్‌ షాక్‌ తినక తప్పలేదు.ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో 265 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసిన పంజాబ్ పలు రికార్డులు తన పేరిట లిఖించింది. ఇప్పటికే పట్టికలో టాప్ స్థానంలో కొనసా గుతున్న పంజాబ్ ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే తొలి జట్టుగా కూడా నిలవనుంది. గతేడాది ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైన పంజాబ్ ఈసారి టైటిల్ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది.Mam ek match mein open batting karne ka chance mil jaaye toh 🥹🤣🤣😁 #pzchat— Yuzvendra Chahal (@yuzi_chahal) April 27, 2026చదవండి: వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

IPL 2026 Match 40: Punjab Kings vs Rajasthan Royals Updates6
పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపు

పంజాబ్‌పై రాజస్థాన్‌ గెలుపుఅనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. డొనోవన్‌ ఫెరియెరా (52 నాటౌట్‌), షుభమ్‌ దూబే (31 నాటౌట్‌) ఊచకోత కోసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌13.6వ ఓవర్‌- 151 పరుగుల వద్ద రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్‌ ఇచ్చి రియాన్‌ పరాగ్‌ (29) ఔటయ్యాడు.మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌11.2వ ఓవర్‌- 123 పరుగుల వద్ద రాజస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో షెడ్గేకు క్యాచ్‌ ఇచ్చి జైస్వాల్‌ (51) ఔటయ్యాడు. రెండో వికెట్‌ కోల్పోయిన రాజస్థాన్‌9.4వ ఓవర్‌- 105 పరుగుల వద్ద రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. చహల్‌ బౌలింగ్‌లో జన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి జురెల్‌ (16) ఔటయ్యాడు. వైభవ్‌ సూర్యవంశీ ఔట్‌3.2వ ఓవర్‌- 51 పరుగుల వద్ద రాజస్థాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అర్షదీప్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అ‍య్యర్‌ క్యాచ్‌ పట్టడంతో వైభవ్‌ సూర్యవంశీ (43) ఔటయ్యాడు.పంజాబ్‌ భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ భారీ స్కోర్‌ (222-4) చేసింది. ఆఖర్లో స్టోయినిస్‌ (22 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ప్రత్యర్ది బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా బ్రిజేష్‌ శర్మ వేసిన చివరి ఓవర్‌లో స్టోయినిస్‌ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 6, 6, 4, 4 సాధించాడు. అంతకుముందు ప్రభ్‌సిమ్రన్‌ (59) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా పంజాబ్‌ ఆటగాళ్లలో ప్రియాంశ్‌ ఆర్య (29), కూపర్‌ కన్నోల్లీ (30), శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో యశ్‌ రాజ్‌ పుంజా 2, ఆర్చర్‌, బర్గర్‌ తలో వికెట్‌ తీశారు. నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌17.6వ ఓవర్‌- 181 పరుగుల వద్ద పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. బర్గర్‌ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి శ్రేయస్‌ అయ్యర్‌ (30) ఔటయ్యాడు. మూడో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌13.6వ ఓవర్‌- 144 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రాజ్‌ పుంజా బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్‌ (59) ఔటయ్యాడు.రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌8.2వ ఓవర్‌- 96 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. యశ్‌ పుంజా బౌలింగ్‌లో ఫెరియెరాకు క్యాచ్‌ ఇచ్చి కూపర్‌ కన్నోల్లీ (30) ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత 80-17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 80-1గా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ 27, కూపర్‌ కన్నోల్లీ 19 పరుగులతో అజేయంగా ఉన్నారు. తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌2.5వ ఓవర్‌- క్రీజ్‌లో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించిన ప్రియాంశ్‌ ఆర్మ (29) ఆర్చర్‌ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 28) జరుగనున్న 40వ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడుతున్నాయి. పంజాబ్‌ హోం గ్రౌండ్‌ అయిన ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.ప్రస్తుత ఎడిషన్‌లో ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్‌ (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, వర్షం కారణంగా ఓ మ్యాచ్‌ రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్‌ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ కోసం​ రాజస్థాన్‌ రెండు మార్పులు చేసింది. హెట్‌మైర్‌ స్థానంలో షనక, రవి బిష్ణోయ్‌ స్థానంలో యశ్‌ రాజ్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు పంజాబ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేసింది. సూర్యంశ్‌ షెడ్గే, లోకీ ఫెర్గూసన్‌ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజాపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (సి), కూపర్ కొన్నోలీ, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Women's cricket: All round show helped Sri Lanka go 1-0 up Vs Bangladesh in T20 Series7
టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టిన శ్రీలంక

మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్‌ తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్‌ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్‌ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్‌ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్‌ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సల్తానా ఖాతూన్‌ 2, మరుఫా అక్తెర్‌, నహిద అక్తెర్‌ తలో వికెట్‌ తీశారు.బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో షోర్నా అక్తెర్‌ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్‌ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్‌ 23, జుయారియా ఫిర్దోస్‌ 16, షిర్మన్‌ అక్తెర్‌ 1, కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా డకౌట్‌, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్‌ 6, సుల్తానా ఖాతూన్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్‌ 30న జరుగనుంది.

Jitesh shows Respect Rowards DC Flag Became Viral During Match8
వైరల్‌గా మారిన జితేశ్‌ శర్మ చర్య!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కనబరుస్తోంది. సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 6 విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడి చేతిలో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి జెండా గాలిలో ఎగురుకుంటూ మైదానంలోకి వచ్చింది. దీనిని గమనించిన ఆర్సీబీ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ ఆ జెండాను అందుకొని తన జేబులో పెట్టుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. The way Jitesh shows respect towards DC flag he is pure soul 🥺❤️ pic.twitter.com/1nyd5XpPN3— Ankur (@flick_class) April 28, 2026చదవండి: ‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

 Ex-India Player Shows Support KL Rahul Decision Vs RCB9
‘కేఎల్ రాహుల్‌పై విషం చిమ్మ‌డం ఆపండి!’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సోమ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో దారుణ ఓట‌మిని చ‌విచూసింది. 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఢిల్లీ 9 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేఎల్ రాహుల్ విధ్వ‌సంక‌ర సెంచ‌రీతో పంజాబ్‌పై భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ, ఆ మ్యాచ్‌ను కూడా కాపాడుకోవ‌డంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ విఫ‌ల‌మైంది. అయితే పంజాబ్‌తో మ్యాచ్‌లో 152 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఆర్సీబీతో మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అయితే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా డెబ్యు ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు చాన్స్ ఇవ్వ‌డంపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే కేఎల్ రాహుల్‌కు భార‌త మాజీ క్రికెటర్‌ దొడ్డ గ‌ణేశ్ అండ‌గా నిల‌బ‌డ్డాడు. ‘ఆర్సీబీతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. డెబ్యూ ఆట‌గాడు సాహిల్ ప‌రాక్‌కు స్ట్రైక్ ఇవ్వ‌డంపై కొంతమంది జ‌ర్న‌లిస్టులు విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశారు. అయితే సాహిల్ ప‌రాక్ టెయిలెండ‌ర్ కాదు, అత‌డొక బ్యాట‌ర్‌. అందుకే అత‌డిని ఓపెన‌ర్‌గా ఎంచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌క రాహుల్‌ను అకార‌ణంగా తిడుతున్నారు. పిచ్ ప‌రిస్థితులపై అవ‌గాహ‌న‌లేమి ఢిల్లీ క్యాపిట‌ల్స్ దారుణ ఆట‌తీరుకు కార‌ణ‌మ‌య్యింది. కానీ కేఎల్ రాహుల్ ఏదో త‌ప్పు చేసిన‌ట్లు అంద‌రూ అత‌డిపై క్రూర‌త్వం ప్రద‌ర్శించ‌డమేంటనేది నాకు అర్థం కావ‌డం లేదు. అత‌డిపై విషం చిమ్మ‌డం ఆపండి’ అని చెప్పు కొచ్చాడు.మ్యాచ్ విష‌యానికొస్తే సొంత‌గ‌డ్డ‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 75 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. అభిషేక్ పొరేల్ 30 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్ 4, భువ‌నేశ్వ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం ఛేద‌న‌లో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. ప‌డిక్క‌ల్ (34 నాటౌట్‌), కోహ్లి (23 నాటౌట్) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఈ విజ‌యంతో ఆర్సీబీ 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను మే1న రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆడనుంది. ఇక దొడ్డ గణేశ్‌ టీమిండియా తరఫున ఒక వన్డే, నాలుగు టెస్టులు ఆడాడు.Saw a couple of journalists’ tweet yesterday where they blamed KL Rahul for exposing the debutant from ball one.FYI guys, that kid is no tail ender; he’s a proper batter and that’s why he was chosen to open. Can’t understand this toxicity around KL Rahul #IPL2026— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) April 28, 2026చదవండి: భార‌త్‌కు తప్పని చైనా గండం!

Son Of Virat Kohli’s Massive Fan From West Indies Breaks Multiple Records10
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌ అభిమాని కొడుకు

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్‌ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్‌ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్‌ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్‌మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్‌ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ బిహేవియర్‌ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్‌ దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్‌ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్‌లో సంచలనంగా మారింది.వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్‌పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్‌ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్‌తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్‌ తరఫున చేశాడు.వెస్టిండీస్‌ తరఫున అడపాదడపా టెస్ట్‌ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement