ప్రధాన వార్తలు

పట్టాలపై విషాదం.. రన్నింగ్ ట్రైన్లో ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగ క్రికెటర్
రైలు పట్టాలపై ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఓ దివ్యాంగ క్రికెటర్ ఛాతీ నొప్పితో మరణించాడు. అత్యవసర సాయం కోసం రైల్వే వైద్య సిబ్బంది కోసం ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చనిపోయిన క్రికెటర్ సహచరులు వాపోతున్నారు. ఈ ఘటన ఛత్తీస్ఘడ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. పంజాబ్కు చెందిన 38 ఏళ్ల దివ్యాంగ క్రికెటర్ విక్రమ్ సింగ్.. ఓ వీల్చైర్ టోర్నమెంట్ కోసం సహచరులతో కలిసి బుధవారం రాత్రి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి గ్వాలియర్కు బయల్దేరాడు. ప్రయాణంలో విక్రమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. విక్రమ్ తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. రైల్వే వైద్య సిబ్బందికి అనేక అత్యవసర కాల్స్ చేసినప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. రైలు ఢిల్లీ నుంచి మధుర స్టేషన్కు చేరుకునేలోపే విక్రమ్ మరణించాడు.కళ్ల ముందే సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో తోటి క్రికటర్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. విక్రమ్ నొప్పితో విలవిలలాడిపోయాడని ఓ క్రికెటర్ చెప్పాడు. అత్యవసర వైద్య సాయం కోసం ఎంత సేపు ప్రయత్నించినా రైల్వే సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ మిత్రుడు మరణించాడని మరో క్రికెటర్ వాపోయాడు. మధుర రైల్వే స్టేషన్లో విక్రమ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు హ్యాండోవర్ చేసుకున్నారు. అక్కడే పోస్ట్మార్టమ్ పూర్తి చేశారు. రైల్వే ఉన్నతాధికారులు తమ వైద్య సిబ్బంది ఆలసత్వంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ఘటనపై దివ్యాంగ హక్కుల సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓ దివ్యాంగ క్రీడాకారుడు ఛాతి నొప్పితో విలవిలలాడుతుంటే వైద్య సాయం అందించడానికి ఓ రైల్వే అధికారి కూడా లేకపోవడం సిగ్గు చేటని క్రీడా సమాజం దుమ్మెత్తిపోస్తుంది.

శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్లో భారత-ఏ జట్టు ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్ను నిర్మించాడు.మరో ఎండ్లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్తో కలిసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్పాండే, ఖలీల్ అహ్మద్

అందరూ అయిపోయారు.. విరాట్ కోహ్లి ఒక్కడే మిగిలాడు..!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియుశ్ చావ్లా ఇవాళ (జూన్ 6) క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడైన పియుశ్.. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాలీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. పియుశ్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం సోషల్మీడియాలో ఓ ఆసక్తికర అంశం వైరలవుతుంది. పియుశ్ రిటైర్మెంట్ తర్వాత 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టు సభ్యుల్లో ఇంకొకరు మాత్రమే ఇంకా కెరీర్ను (వన్డే) కొనసాగిస్తున్నారు. అతనెవరో కాదు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, తాజా ఐపీఎల్ విన్నర్ విరాట్ కోహ్లి.2011 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించగా.. పియుశ్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లి ఒక్కడే మిగిలి ఉన్నాడు (రిటైర్ కాకుండా). ఓసారి నాటి వరల్డ్కప్ విన్నింగ్ భారత జట్టుపై ఓ లుక్కేద్దాం. నాడు టీమిండియా మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఆ జట్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ కూడా ఉన్నాడు. సచిన్కు అదే చివరి వరల్డ్కప్.సచిన్తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, ధోని, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, పియుశ్ చావ్లా, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, శ్రీశాంత్ టీమిండియాలో ఉన్నారు. ఇవాల్టితో ఆ 15 మంది సభ్యుల్లో 14 మంది రిటైరైపోయి కోచింగ్, ఇతరత్రా బాధ్యతల్లో ఉండగా.. విరాట్ ఒక్కడే వన్డే కెరీర్ను కొనసాగిస్తున్నాడు. విరాట్ ఇటీవలే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.నాటి వరల్డ్కప్ ఫైనల్లో భారత్ శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, తమ రెండో వన్డే వరల్డ్కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. భారత్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి జగజ్జేతగా అవతరించింది. ధోని సిక్సర్ కొట్టి ఆ మ్యాచ్ను ముగించాడు. శ్రీలంక ఇన్నింగ్స్లో జయవర్దనే అజేయ సెంచరీతో కదంతొక్కగా.. భారత ఇన్నింగ్స్లో గంభీర్, ధోని 90ల్లో నిలిచారు.

సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ప్రకటన.. సీఎస్కే చిచ్చరపిడుగుకు చోటు
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపిక కాగా.. ఐదు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తొలిసారి టెస్ట్ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. అతనితో పాటు మరో విధ్వంసకర బ్యాటర్ లుహాన్-డ్రి-ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. జింబాబ్వే సిరీస్లో బ్రెవిస్, ప్రిటోరియస్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉంటారు. భారీ హిట్టర్లుగా పేరున్న వీరు టెస్ట్ ఫార్మాట్లో ఏమేరకు రాణిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో బ్రెవిస్, ప్రిటోరియస్తో పాటు లెసెగొ సెనొక్వానే (బ్యాటర్), కోడి యూసఫ్ (ఫాస్ట్ బౌలర్), ప్రెనెలన్ సుబ్రాయన్ (ఆఫ్ స్పిన్నర్) ఉన్నారు. స్పిన్నర్ జుబేర్ హంజా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉన్న జట్టులోని ఎనిమిది మందికి (బవుమా, బెడింగ్హమ్, కార్బిన్ బాష్, జోర్జి, కేశవ్ మహారాజ్, ముల్దర్, ఎంగిడి, వెర్రిన్) మాత్రమే ఈ జట్టులో చోటు దక్కింది. జన్సెన్, రబాడ, మార్క్రమ్, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్కు విశ్రాంతి కల్పించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదివరకే లండన్కు చేరుకుంది.జింబాబ్వేతో సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్-జూన్ 28-జులై 2 (బులవాయో)రెండో టెస్ట్-జులై 6-10 (బులవాయో)జింబాబ్వే సిరీస్కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రి-ప్రిటోరియస్, ప్రీటోరియస్, లెసెగొ సెనొక్వానే, ప్రెనెలన్ సుబ్రాయన్, కైల్ వెర్రిన్, కోడి యూసుఫ్.

ఐపీఎల్ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఐపీఎల్ 2025 సీజన్ జూన్ 3న జరిగిన ఫైనల్తో ముగిసింది. ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. ఐపీఎల్లో ఆర్సీబీకి ఇది తొలి టైటిల్. 18 ఏళ్ల ప్రస్తానంలో ఆ జట్టు మూడు సార్లు ఫైనల్కు చేరినా రన్నరప్తో సరిపెట్టుకుంది. నాలుగో ప్రయత్నంలో ఆ జట్టు టైటిల్ను ఎగరేసుకుపోయింది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు చేరింది. రెండో ప్రయత్నంలోనూ ఆ జట్టుకు నిరాశే మిగిలింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినా పంజాబ్ తుది మెట్టుపై బోల్తా పడింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఫైనల్లో ఓడినా పంజాబ్ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. శ్రేయస్ ఐపీఎల్లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా చరిత్రకెక్కాడు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ను తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఈ సీజన్ స్టార్లందరికీ చోటు దక్కింది. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఆర్సీబీ ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లి సహా జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, జోష్ హాజిల్వుడ్ చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్గా జితేశ్ శర్మ ఎంపికయ్యాడు. ఇంపాక్ట్ సబ్గా సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ను ఎంపిక చేశారు.ఈ జట్టుకు ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఎంపిక కాగా.. వన్డౌన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో ముంబై విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్, ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఆరో స్థానంలో జితేశ్ శర్మ, ఏడో ప్లేస్లో శశాంక్ సింగ్, ఆల్రౌండర్ల కోటాలో కృనాల్ పాండ్యా, స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, హాజిల్వుడ్, ప్రసిద్ద్ కృష్ణ ఎంపికయ్యారు. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టు ఎంపిక జరిగింది. పంజాబ్ లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్కు ఈ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. ఐపీఎల్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్: విరాట్ కోహ్లి, సాయి సుదర్శన్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, ప్రసిద్ద్ కృష్ణ, నూర్ అహ్మద్ (ఇంపాక్ట్ ప్లేయర్)

బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లిని అరెస్ట్ చేయండి..!
ఆర్సీబీ విజయోత్సవాల నేపథ్యంలో జరిగిన బెంగళూరు తొక్కిసలాట దారుణమైన మలుపు తీసుకుంది. సోషల్మీడియాలో కొందరు ఈ విషాద ఘటనకు విరాట్ కోహ్లిని బాధ్యున్ని చేస్తూ, అరెస్ట్కు డిమాండ్ చేస్తున్నారు. '#ArrestKohli' హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. బెంగళూరులో జరిగిన ప్రాణనష్టానికి విరాట్ కోహ్లీనే కారణమని ఓ వర్గం ఆరోపిస్తుంది. కోహ్లికి వ్యతిరేకంగా ట్విటర్లో 36 వేలకు పైగా ట్వీట్లు ఉన్నాయి. తమను చూడటానికి వచ్చి జనాలు ప్రాణాలు కోల్పోయారని తెలిసి కూడా కోహ్లి పట్టీపట్టనట్లు ఉన్నాడని చాలా మంది ఆరోపిస్తున్నారు. దుర్ఘటన విషయం తెలియగానే కోహ్లి బెంగళూరు వదిలి పారిపోయాడని అంటున్నారు. ఆర్సీబీ యాజమాన్యం చుట్టూ ఉచ్చుబిగుసుకున్న తరుణంలో కోహ్లి లండన్కు పారిపోవాలని చూస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోయేలోపు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ (పుష్ప-2 తొక్కిసలాట) అరెస్ట్ను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కోహ్లికి మానవత్వమే లేదని అంటున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. కోట్లకు కోట్లు సంపాదిస్తూ, బాధిత కుటుంబాలకు కనీస ఆర్దిక సాయం ప్రకటించలేదని దుయ్యబడుతున్నారు.మరోపక్క కోహ్లికి మద్దతుగా నిలుస్తున్న వారు కూడా ఉన్నారు. ఎవరూ కోరుకోని, ఊహించని ఘటనకు కోహ్లిని ఎలా బాధ్యున్ని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి అరెస్ట్ను డిమాండ్ చేయడం మూర్ఖత్వమని అంటున్నారు. కోహ్లి దేశం విడిచి పారిపోతున్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా అని నిలదీస్తున్నారు. కోహ్లి త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తాడని భరోసా ఇస్తున్నారు. అర్దిక సాయం ప్రకటించి చేతులు దులుపుకోవడం ఇష్టం లేకే, కోహ్లి ఎలాంటి ఆర్దిక సాయం ప్రకటించలేదని అంటున్నారు. కోహ్లి అంటే గిట్టని వారే ఈ రకమైన ప్రచారానికి పూనుకున్నారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ విషయంలో కోహ్లికి మద్దతుగా నిలిచే వారంతా ముందుక రావాలని పిలుపునిస్తున్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమరని అంటూనే, ప్రాణ నష్టాన్ని కోహ్లికి ఆపాదించడం కరెక్ట్ కాదని అంటున్నారు. కాగా, బెంగళూరు దుర్ఘటనకు సంబంధించి ఇవాళ (జూన్ 6) ఉదయం ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్టు చేశారు. ముంబైకి వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే విధంగా ఈ ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు.

బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్ 4న) జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించాడు. మృతులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతున్న సందర్భంగా నిన్న బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో గిల్తో పాటు పాల్గొన్న గంభీర్ విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు. ముందుగా నేను రోడ్ షోలకు వ్యతిరేకం. 11 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. విజయోత్సవాల కంటే జనం ప్రాణాలు ముఖ్యం. రోడ్ షో విజయవంతంగా నిర్వహించే సామర్థ్యం లేకపోతే నిర్వహించకుండా ఉండాల్సింది. ఈ ఘటనకు ఆర్సీబీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి.గెలుపు సంబరాలు చేసుకోవద్దని నేను అనను. కానీ దానికీ ఓ పద్దతి ఉంటుంది. ఇతరుల ప్రాణాలు రిస్క్ అయ్యే విధంగా సంబరాలు ఉండకూడదు. ఇంత ప్రాణ నష్టం కలిగించిన రోడ్ షోలను భవిష్యత్తులో నిర్వహించకూడదు.కాగా, ఆర్సీబీ 18 ఏళ్ల ఐపీఎల్ జర్నీలో తొలిసారి టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఫైనల్లో ఆ జట్టు పంజాబ్పై విజయం సాధించి, తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు గెలుపును ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది. ట్రోఫీ గెలిచిన మరుసటి రోజు బెంగళూరులో ఓపెన్ టాప్ బస్లో పరేడ్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే దీనికి పోలిసుల అనుమతి లభించకపోవడంతో చిన్నస్వామి స్టేడియంలో ఆటగాళ్ల సన్మాన కార్యక్రమానికి పూనుంది. ఇది కాస్తా విషాదాంతంగా ముగిసింది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే లక్షల సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్ద గుమికూడారు. స్టేడియం లోపలికి వెళ్లడానికి ఉచిత పాస్లు ఇస్తున్నారని ప్రచారం జరగడంతో అభిమానులు ఒక్కసారిగా ఓ ప్రాంతం వద్దకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 13 నుంచి35 ఏళ్ల మధ్య వయసు గల యువకులు, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు.

రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాలీ క్రికెట్కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్ చావ్లాకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. View this post on Instagram A post shared by Piyush Chawla (@piyushchawla_official_)ఆరంభ సీజన్ నుంచి (2008) క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న అతను 192 మ్యాచ్ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్ నరైన్ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో కెరీర్ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్లో 3 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. చావ్లా అంతర్జాతీయ కెరీర్ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్ గెలిచిన రెండు వరల్డ్కప్ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఉత్తర్ప్రదేశ్లోని అలీఘడ్లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 137 మ్యాచ్లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్లో చావ్లా బ్యాటర్గానూ రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇటీవలే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన ఇంగ్లండ్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చారు. అయితే హిట్మ్యాన్ నిర్ణయంతో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, అతడి తండ్రి గురునాథ్ శర్మ సైతం నిరాశకు లోనయ్యారంట. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్నే వెల్లడించాడు."మా నాన్న.. నేను రెడ్ బాల్తో క్రికెట్ ఆడటం ఎక్కువగా చూశారు. అందుకే ఆయనకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన కొంచెం నిరాశచెందారు. అదే సమయంలో నా సుదీర్ఘ కెరీర్ పట్ల ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు.ఈ రోజు ఈస్ధాయికి నేను చేరుకున్నానంటే అందులో కీలక పాత్ర మా నాన్నదే. తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా మనం ఏదీ సాధించలేము. నాకు కూడా టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా కెరీర్ తొలి రోజు నుంచే ఆయన టెస్టు క్రికెట్కు అభిమానిగా మారారు. నేను వన్డేలో 264 పరుగులు చేసిన రోజు నాకు ఇంకా ఇప్పటికి బాగా గుర్తుంది. ఆ రోజు మాన్న నా దగ్గరకు వచ్చి ఏదో మొక్కుబడిగా బాగా ఆడావని ప్రశంసించారు. అంతే తప్ప అతనిలో ఎటువంటి ఉత్సాహం కన్పించలేదు" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పేర్కొన్నాడు.రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: IND vs ENG; 'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'

'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'
భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్కు పయనమైంది. హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ నేతృత్వంలో మొత్తం టీమ్ సభ్యులు శుక్రవారం ముంబై విమానశ్రాయం నుంచి లండన్కు బయలు దేరారు. అక్కడకి వెళ్లాక పది రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంపులో టీమిండియా తీవ్రంగా శ్రమించనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఈ రెడ్బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా లండన్ విమానం ఎక్కేముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం భారత జట్టుకు కీలకం కానుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అది దేశవాళీ క్రికెట్కు ఉన్న ప్రాముఖ్యత. యువ ఆటగాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. డిమాస్టిక్ క్రికెట్లో మీరు అత్యున్నత ప్రదర్శన ఇస్తున్నన్ని రోజులు మీకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ పర్యటనలో కరుణ్ నాయర్ అనుభవం జట్టుకు ఎంతోగానే ఉపయోగపడనుంది. కౌంటీ క్రికెట్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా అతడికి ఉంది. కౌంటీల్లో కూడా పరుగులు సాధించాడు. అక్కడి పరిస్థితులు అతడికి బాగా తెలుసు. ఇప్పుడు ఇండియా-ఎ తరపున కూడా సెంచరీ చేశాడు. ఇటువంటి పర్యటనలకు మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆటగాళ్లు ఫామ్ను ఒకటి లేదా రెండు టెస్ట్ మ్యాచ్ల ఆధారంగా అంచనా వేయాలనుకోవడం లేదు. ఎవరైతే నిలకడగా పరుగులుసాధిస్తారో, వారు అంతర్జాతీయ క్రికెట్లో కూడా రాణించగలరు అని ప్రెస్కాన్ఫరెన్స్లో గంభీర్ పేర్కొన్నాడు. కాగా కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.

అతడి బాటలో నడుస్తా.. ప్రొఫెషనల్గా సిమ్రన్జీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సిమ్రన్జీత్ కౌర్...

శ్రీకాంత్ ముందంజ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోత...

సుమిత్ నగాల్ శుభారంభం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ క్వాలిఫయ...

నీరజ్ చోప్రాపై గగన్ నారంగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: భారత టాప్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చ...

బెంగళూరు దుర్ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై ధ్వజమెత్తిన గంభీర్
బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా (జూన్ 4న...

రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని...

నా నిర్ణయంతో మా నాన్న చాలా ఫీలయ్యారు: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ ఇటీవలే టెస్టు క్ర...

'అతడికి చాలా అనుభవం ఉంది.. ఇంగ్లండ్ టూర్లో కీలకం కానున్నాడు'
భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ క...
క్రీడలు


ఆల్ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)


విషాదం నడుమే.. ఆర్సీబీ జట్టుకు కర్ణాటక ప్రభుత్వ సన్మానం (ఫొటోలు)


Kuldeep Yadav Engagement : ఘనంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం (ఫొటోలు)


ఆర్సీబీ విజయోత్సవంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురి దుర్మరణం (ఫోటోస్)


RCB vs PBKS: ఈసాలా కప్ నమ్దూ.. నెరవేరిన ఆర్సీబీ కల (ఫోటోలు)


పంజాబ్ను మట్టికరిపించిన పాటీదార్ సేన.. ఫైనల్కు దూసుకెళ్లిన ఆర్సీబీ (ఫొటోలు)


ప్రియుడి బర్త్డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)


కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)


గోవాలో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న మను భాకర్ (ఫోటోలు)


Miss World 2025: అందాల భామల ఆటవిడుపు (ఫోటోలు)
వీడియోలు


Arun Dhumal: తొక్కిసలాట గురించి మాకు తెలీదు!


Bengaluru Stampede Case: ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే అరెస్ట్


RCB సంబరాల్లో విషాదం.. ఏడుగురు మృతి


Bangalore: చిన్నస్వామి స్టేడియంలో దారుణం


RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి


ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల


IPL 2025: శ్రేయస్ వేట..గంభీర్ విలవిల


క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం


ఫైనల్స్ కి చేరేదెవరు?


నేడు IPL 18వ సీజన్ లో మరో ఆసక్తికర పోరు