Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

South Africa beat team india by 51 runs in 2nd T20I1
డికాక్‌ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా చిత్తు

ముల్లాన్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. తొలి టీ20లో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో డొనోవన్‌ ఫెరియెరా (16 బంతుల్లో 30 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ 8, కెప్టెన్‌ మార్క్రమ్‌ 29, బ్రెవిస్‌ 14 పరుగులకు ఔటయ్యారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 2, అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఆది నుంచి తడబడింది. సఫారీ బౌలర్లు తలో చేయి వేయడంతో 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ 4, ఎంగిడి, జన్సెన్‌, సిపాంమ్లా తలో 2 వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో జితేశ్‌ శర్మ 27, అక్షర్‌ పటేల్‌ 21, హార్దిక్‌ 20, అభిషేక్‌ శర్మ 17, సూర్యకుమార్‌ 5, అర్షదీప్‌ 4, దూబే ఒక పరుగు చేశారు. శుభ్‌మన్‌ గిల్‌, వరుణ్‌ చక్రవర్తి డకౌటయ్యారు.ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్‌ (90), బౌలింగ్‌లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ సిరీస్‌లోని మూడో టీ20 ధర్మశాల వేదికగా డిసెంబర్‌ 14న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. తొందరపాటు చర్యతో..

IND vs SA 2nd T20I: Gill Fails Again Golden Duck Fans Reacts2
ఈసారి గోల్డెన్‌ డకౌట్‌.. అతడిని ఎందుకు బలి చేస్తున్నారు?

భారత టీ20 జట్టు ఓపెనర్‌గా శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి విఫలమయ్యాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో గిల్‌తో పాటు టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంజూకు ఓపెనర్‌గా మొండిచేయిఆసియా కప్‌-2025 టీ20 టోర్నీతో భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇచ్చాడు గిల్‌ (Shubman Gill). దీంతో అభిషేక్‌ శర్మ (Abhishek Sharma)కు విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న సంజూ శాంసన్‌ (Sanju Samson)ను మేనేజ్‌మెంట్‌ పక్కనపెట్టింది. వరుస మ్యాచ్‌లలో గిల్‌ విఫలమవుతున్నా.. భవిష్య కెప్టెన్‌ అనే ఒక్క కారణంతో అతడిని కొనసాగిస్తోంది.ఈసారి గోల్డెన్‌ డక్‌తాజాగా స్వదేశంలో టీ20 సిరీస్‌లోనూ సంజూకు ఓపెనర్‌గా మొండిచేయి చూపి.. యథావిధిగా గిల్‌కు పెద్దపీట వేసింది. అయితే, కటక్‌ వేదికగా తొలి టీ20లో రెండు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులకే నిష్క్రమించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో ముల్లన్‌పూర్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు.వరుసగా వైఫల్యాలుసఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే గిల్‌ మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఐదో బంతికి రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక టీమిండియా తరఫున గత ఇరవై ఇన్నింగ్స్‌లో గిల్‌ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).ఈ స్థాయిలో గిల్‌ విఫలమవుతున్నా.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడికి వరుస అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా గిల్‌ను ఆడించేందుకు సంజూను బలిచేయడాన్ని మాజీ క్రికెటర్లు సైతం ప్రశ్నిస్తున్నారు. సంజూను ఎందుకు బలి చేస్తున్నారు?టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మెరుగ్గా ఆడుతున్న గిల్‌ను రెండు ఫార్మాట్లకే పరిమితం చేయాలని.. టీ20లలో సంజూకు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి తప్పు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు.. గిల్‌ కోసం సంజూను ఎందుకు బలి చేస్తున్నారని అతడి అభిమానులు మండిపడుతున్నారు.ఇదిలా ఉంటే.. ముల్లన్‌పూర్‌ మ్యాచ్‌లో టీమిండియా పవర్‌ ప్లేలో ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది. గిల్‌తో పాటు.. అభిషేక్‌ శర్మ (17), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) విఫలమయ్యారు. అన్నట్లు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ప్రయోగం చేసింది. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను పంపింది.చదవండి: విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం!

IND vs SA 2nd T20I: De Kock 90 South Africa Set Huge Target3
డికాక్‌ విధ్వంసం.. సౌతాఫ్రికా భారీ స్కోరు

టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో.. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏకంగా 213 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగగా.. ఆదిలోనే రీజా హెండ్రిక్స్‌ (8) అవుటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి తన తొలి ఓవర్‌ తొలి బంతికే అతడిని బౌల్డ్‌ చేశాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ బాధ్యతాయుతంగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.అయితే, 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ కావడంతో డికాక్‌ సెంచరీ మిస్సయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో లేని పరుగుకు యత్నించి మూల్యం చెల్లించాడు. వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ వేగంగా స్పందించి డికాక్‌ను రనౌట్‌ చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు.ఇక డికాక్‌కు తోడుగా కెప్టెన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ (26 బంతుల్లో 29) ఓ మోస్తరుగా రాణించాడు. రెండో వికెట్‌కు డికాక్‌తో కలిసి 83 పరుగులు జోడించాడు. చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (14)విఫలం కాగా.. ఆఖర్లో డొనోవాన్‌ ఫెరీరా (16 బంతుల్లో 30), డేవిడ్‌ మిల్లర్‌ (12 బంతుల్లో 20) ధనాధన్‌ దంచికొట్టి అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. భారత్‌కు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. డికాక్‌ను వికెట్‌ కీపర్‌ జితేశ్‌​ శర్మ రనౌట్‌ చేశాడు. ఎక్స్‌ట్రాల రూపంలో సౌతాఫ్రికాకు భారత్‌ 22 పరుగులు సమర్పించుకుంది.ఇక భారత పేసర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యధికంగా నాలుగు ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చుకోగా.. పేస్‌దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా 45 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లలో 34, శివం దూబే రెండు ఓవర్లలో 18 పరుగులు ఇవ్వగా.. వరుణ్‌ పూర్తి కోటాలో 29 రన్స్‌ మాత్రమే ఇచ్చి రెండు.. అక్షర్‌ మూడు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టారు.

IND vs SA 2nd T20I: Toss De Kock Scripts History But Fails To Get Century4
చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. కానీ

సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ క్వింటన్‌ డికాక్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో భారత జట్టుపై అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే.. అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. టీమిండియాతో తాజా టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌​ సందర్భంగా డికాక్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.ముల్లన్‌పూర్‌ వేదికగారెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టుల్లో సఫారీలు 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డేల్లో టీమిండియా 2-1తో గెలిచింది. అనంతరం కటక్‌లో జరిగిన తొలి టీ20లో భారత్‌ గెలవగా.. తాజాగా గురువారం నాటి రెండో టీ20కి ముల్లన్‌పూర్‌ ఆతిథ్యమిస్తోంది.పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్‌ కాగా.. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. అయితే, ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (8) వేగంగా ఆడే ప్రయత్నంలో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.క్వింటన్‌ డికాక్‌ జోరుఫలితంగా సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ మాత్రం జోరు కొనసాగించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో తొమ్మిదో ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మూడో బంతికి ఫోర్‌ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు ముందుకుసాగాడు.12 ఇన్నింగ్స్‌లోనేఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో టీమిండియాపై అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. డికాక్‌ కంటే ముందు వెస్టిండీస్‌ స్టార్‌ నికోలస్‌ పూరన్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఈ ఘనత సాధించారు. అయితే, ఇందుకు పూరన్‌కు 20 ఇన్నింగ్స్‌.. బట్లర్‌కు 24 ఇన్నింగ్స్‌ అవసరం కాగా.. డికాక్‌ 12 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ అందుకున్నాడు. తొందరపాటు చర్యతోకానీ 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసరపు పరుగుకు యత్నించి డికాక్‌ రనౌట్‌ అయ్యాడు. పదహారో ఓవర్‌ తొలి బంతికి వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో షాట్‌ బాదేందుకు ప్రయత్నించి అతడు విఫలం కాగా.. బంతిని అందుకున్న కీపర్‌ జితేశ్‌ శర్మ స్టంప్స్‌కు గిరాటేశాడు. దీంతో డికాక్‌ రనౌట్‌ అయ్యాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ రీఎంట్రీలో డికాక్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 1, 23, 7, 0, 0, 90 (46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు). వరుస వైఫల్యాల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన డికాక్‌.. ఇలా తొందరపాటు చర్యతో భారీ మూల్యమే చెల్లించాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు.చదవండి: ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్‌ భారతి!

Vijay Hazare Trophy Virat Kohli Pant in Delhi Announce Probable List5
విరాట్‌ కోహ్లి సంచలన నిర్ణయం!

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్‌మెషీన్‌ మరోసారి బ్యాట్‌ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరుఈ విషయాన్ని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్‌ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్‌ ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరును చేర్చింది. దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్‌ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్‌ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్‌లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. రిషభ్‌ పంత్‌ కూడాఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ పేరు కూడా ప్రాబబుల్స్‌ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.గంభీర్‌- అగార్కర్‌ ఒత్తిడి వల్లేనా?కోహ్లి వరల్డ్‌క్లాస్‌ బ్యాటర్‌. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్‌ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ దేశీ క్రికెట్‌ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.ముఖ్యంగా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్‌ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్‌కప్‌ ప్లాన్‌లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్‌ చెప్పడం ఇందుకు నిదర్శనం.అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్‌ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌: ఢిల్లీ ప్రాబబుల్స్‌ జట్టువిరాట్‌ కోహ్లి, రిషభ్‌ పంత్‌, దేవ్‌ లక్రా, యుగళ్‌ సైనీ, దివిజ్‌ మెహ్రా, సుజల్‌ సింగ్‌, రజ్‌నీశ్‌ దాదర్‌, అమన్‌ భార్తి, గోవింద్‌ మిట్టల్‌, సుమిత్‌ బెనీవాల్‌, శుభమ్‌ దూబే, కేశవ్‌ దబాస్‌, రాహుల్‌ చౌదరి, సమర్థ్‌ సేత్‌, శివమ్‌ త్రిపాఠి, అన్మోల్‌ శర్మ, శివమ్‌ గుప్తా, లక్షయ్‌ తరేజా, మనన్‌ భరద్వాజ్‌, రౌనక్‌ వాఘేలా, మయాంక్‌ గుసైన్‌, కేశవ్‌ ఆర్‌సింగ్‌,, లక్ష్మణ్‌, దివాన్ష్‌ రావత్‌, ప్రణవ్‌ రాజ్‌వన్షీ, ప్రన్షు విజయరణ్‌.చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు

IND vs SA 2nd T20I: Toss Update Playing XIs Of Both Teams All Details6
దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమి

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఓటమిముల్లాన్‌పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఆదిలోనే చేతులెత్తేసిన టీమిండియా 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. సౌతాఫ్రికా తరఫున బ్యాటింగ్‌లో డికాక్‌ (90), బౌలింగ్‌లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ (4-0-24-4) చెలరేగారు. భారత ఇన్నింగ్స్‌లో తిలక్‌ వర్మ (62) ఒంటరిపోరాటం చేశాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఓటమి అంచుల్లో టీమిండియా19వ ఓవర్‌లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత శివమ్‌ దూబే (1), ఆతర్వాత అర్షదీప్‌ సింగ్‌ను (4), వరుణ్‌ చక్రవర్తి (0) ఔటయ్యారు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా14.2వ ఓవర్‌- 118 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. సిపాంమ్లా బౌలింగ్‌లో బ్రెవిస్‌కు క్యాచ్‌ ఇచ్చి హార్దిక్‌ పాండ్యా (20) ఔటయ్యాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 👉పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 81-4తిలక్‌ వర్మ 18 బంతులలో 32, హార్దిక్‌ పాండ్యా 4 పరుగులు.. విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం👉7.3: బార్ట్‌మాన్‌ బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్‌ పటేల్‌ (21). స్కోరు: 67-4 (7.4)👉పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 51-3 (6)👉 3.5: మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన సూర్య (5). స్కోరు: 32-3 (4).👉1.6: మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన అభిషేక్‌ శర్మ (8 బంతుల్లో 17). స్కోరు: 19-2 (2).👉మరో ప్రయోగం.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌👉0.5: మరోసారి శుబ్‌మన్‌ గిల్‌ విఫలం.. ఎంగిడి బౌలింగ్‌లో హెండ్రిక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌. గత మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసిన గిల్‌... భారత్‌ స్కోరు: 9-1 (1)సౌతాఫ్రికా భారీ స్కోరు.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?👉డికాక్‌ మెరుపులు (46 బంతుల్లో 90- 5 ఫోర్లు, 7 సిక్సర్లు).. రాణించిన డొనోవాన్‌ (16 బంతుల్లో 30 నాటౌట్‌), మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌)👉భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తికి రెండు, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌👉సౌతాఫ్రికా స్కోరు: 213-4.. టీమిండియా లక్ష్యం 214 టాస్‌ గెలిచిన టీమిండియా.. తొలుత సౌతాఫ్రికా బ్యాటింగ్‌👉ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌.. సౌతాఫ్రికా భారీస్కోరు: 213-4👉16.1: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి నాలుగో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన డెవాల్డ్‌ బ్రెవిస్‌ (14)👉15.1: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో 90 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డికాక్‌ రనౌట్‌. మూడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా👉15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156-2 👉11.6: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన మార్క్రమ్‌ (29) 👉10.3: వంద పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా👉పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 90-1 👉8.3: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్వింటన్‌ డికాక్‌.👉పవర్‌ ప్లేలో సౌతాఫ్రి​కా స్కోరు: 53-1👉4.1: వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో సఫారీ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ (8) అవుట్‌👉ముల్లన్‌పూర్‌ స్టేడియంలో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్టాండ్‌ ఆవిష్కరణఎలాంటి మార్పులూ లేవుటాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) మాట్లాడుతూ.. ‘‘ఈ మైదానం అద్భుతమైనది. ఇక్కడ మేము ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆడాము. పురుషుల క్రికెట్‌లో ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఇదేనని తెలిసి సంతోషంగా ఉంది.ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మేము తొలుత బౌలింగ్‌ చేస్తాం. వికెట్‌ బాగుంది. తొలి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు.సంజూకు మరోసారి మొండిచేయికాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓపెనర్‌గా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (4) విఫలమైనా యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. గిల్‌ రాకతో ఓపెనింగ్‌ స్థానం కోల్పోయిన సంజూ శాంసన్‌ (Sanju Samson).. వికెట్‌ కీపర్‌గానూ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి రాలేకపోయాడు. అతడి స్థానంలో తొలి టీ20లో ఆడిన జితేశ్‌ శర్మ (Jitesh Sharma)నే మేనేజ్‌మెంట్‌ కొనసాగింది. దీంతో సంజూకు మరోసారి మొండిచేయి ఎదురైంది.మూడు మార్పులతో బరిలోకిమరోవైపు.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తుదిజట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నట్లు కెప్టెన్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ తెలిపాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌, కేశవ్‌ మహరాజ్‌, అన్రిచ్‌ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్‌, జార్జ్‌ లిండే, బార్ట్‌మన్‌లను ఆడిస్తున్నట్లు వెల్లడించాడు. మరోసారి తేమ ప్రభావం చూపనుందని.. ఒకవేళ తాము టాస్‌ గెలిచినా తొలుత బౌలింగే చేసేవాళ్లమని పేర్కొన్నాడు. ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లుకాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. ఈ ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లలో భాగంగా తొలుత టెస్టు సిరీస్‌లో సఫారీలు దుమ్ములేపారు. అనూహ్య రీతిలో పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్‌ చేశారు. అయితే, వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచి భారత్‌ ఇందుకు ధీటుగా బదులిచ్చింది. ఇక కటక్‌ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలుపొందిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టీ20 తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు

T20 World Cup 2026 tickets to go live on Dec 11 From Rs 1007
టీ20 ప్రపంచకప్‌-2026: టికెట్ల అమ్మకం.. బిగ్‌ అలెర్ట్‌

పొట్టి క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయం గురువారం మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు టికెట్లు లైవ్‌లోకి రానున్నాయి.ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్‌ టికెట్‌ ధరను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) వంద రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి అధికారిక భాగస్వామి బుక్‌మైషోలో టికెట్ల విక్రయం జరుగనుంది.కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవనుంది. అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా భారత్‌- అమెరికాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెడుతుంది.భారత్‌లో వాంఖడేతో పాటు.. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం.. శ్రీలంకలోని ఎస్‌ఎస్‌సీ కొలంబో, ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదికలుగా ఉన్నాయి.ఈడెన్‌ గార్డెన్స్‌లో అతి తక్కువగా రూ. 100 నుంచే టికెట్‌ లభించనుండగా.. అరుణ్‌ జైట్లీ స్టేడియంలో రూ. 150తో ధర మొదలుకానుంది. అహ్మదాబాద్‌లోనూ రూ. 100 టికెట్‌ అందుబాటులో ఉంది. చెపాక్‌లో అత్యధికంగా రూ. 2 వేల ధరతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ICC U19 WC: Australia Announces Squad Include 2 Indian Origin Players8
వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌-2026 ఎడిషన్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్‌ పీక్‌ సారథ్యం వహించనున్నాడు.ఇక వరల్డ్‌కప్‌ ఆడే ఆసీస్‌ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.పాల్గొనే జట్లు ఇవేకాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్‌-19 మెన్స్‌ వరల్డ్‌కప్‌ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, జపాన్‌, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్‌-బి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా పోటీపడతాయి.కెప్టెన్‌ ఎవరంటే?ఇక గ్రూప్‌-సి నుంచి ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, స్కాట్లాండ్‌, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్‌-డి నుంచి అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఒలీవర్‌ పీక్‌ సారథిగా వ్యవహరించబోతున్నాడు.భారత్‌తో ఫైనల్లో సత్తా చాటిసౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒలీవర్‌ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవన్‌ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్‌ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్‌ కొట్టేశాడు.అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్‌ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్‌ కొడుకులు

Prasar Bharati wants to replace JioStar in ICC media rights deal: Report9
ICC: అనూహ్యం.. రేసులోకి ప్రసార్‌ భారతి!

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్‌ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్‌ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.అనూహ్య రీతిలోముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్‌ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల స్ట్రీమింగ్‌ హక్కుల కోసం రెండేళ్ల క్రితం.. నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్‌స్టార్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్‌ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.రేసులోకి ప్రసార్‌ భారతి!ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్‌ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్‌ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది. పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చుఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్‌ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్‌ విధానంలో కొన్ని మ్యాచ్‌లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్‌ల వారీగా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.దూర్‌దర్శన్‌, డీడీ ఫ్రీడిష్‌.. ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్‌ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌ వెల్లడించింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

Sachin Fulfilled promise 15 years after teammate selfless act India debut10
15 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సచిన్‌

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్‌ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్‌ ఇచ్చిన మాట ఏంటి?!ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగాటీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా తరఫున సచిన్‌ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి త్యాగంతో సెంచరీఈ విషయాన్ని సచిన్‌ టెండుల్కర్‌ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్‌ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్‌ సింగ్‌ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు. ఫలితంగా సచిన్‌ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్‌ సింగ్‌ త్యాగానికి ప్రతిగా.. సచిన్‌ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావుఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్‌ఫిట్‌ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్‌ అవుతావు. అలా నువ్వు రిటైర్‌ అయ్యి బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్‌ఫిట్‌ మ్యాచ్‌ ఆడాను.పదిహేనేళ్ల తర్వాత‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్‌ టెండుల్కర్‌ పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement