Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Venus Williams got married at the age of 451
వివాహబంధంలో వీనస్‌

ఫ్లోరిడా: అమెరికా సీనియర్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ వీనస్‌ విలియమ్స్‌ 45వ ఏట పెళ్లి చేసుకుంది. ఇటలీకి చెందిన నటుడు, మోడల్‌ ఆండ్రియా ప్రెటీని ఆమె వివాహమాడింది. దాదాపు ఏడాదిన్నరగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలైలో ఇద్దరి మధ్య నిశ్చితార్ధం జరిగింది. నిజానికి సెపె్టంబర్‌లోనే వీనస్, ప్రెటీ ఇటలీలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే వీనస్‌ విదేశీయురాలు కావడం ఈ పెళ్లికి ప్రభుత్వం తరఫున అధికారిక ముద్ర పొందేందుకు కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. దాంతో తన స్వస్థలం ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో వీనస్‌ మళ్లీ పెళ్లి తంతువును నిర్వహించింది. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే దీనికి హాజరయ్యారు. సోదరి సెరెనా విలియమ్సన్‌ కానుకగా ఇచ్చిన ‘యాట్‌’పైనే ఐదు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగడం విశేషం. మహిళల సింగిల్స్‌లో 7 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న వీనస్‌ విలియమ్స్‌ డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కలిపి మరో 16 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. ఇటీవలే వాషింగ్టన్‌ డీసీ ఓపెన్‌ను గెలుచుకున్న వీనస్‌ టూర్‌ టైటిల్‌ సాధించిన రెండో అతి పెద్ద వయసు్కరాలిగా నిలిచింది.

Investigation into cricketers alcohol consumption says England board2
క్రికెటర్ల ‘మద్యపానం’పై విచారణ: ఇంగ్లండ్‌ బోర్డు

మెల్‌బోర్న్‌: యాషెస్‌ సిరీస్‌ను ఇప్పటికే 0–3తో కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు సంబంధించి కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మూడో టెస్టుకు ముందు లభించిన విరామంలో బీచ్‌ రిసార్ట్‌కు వెళ్లిన ఆటగాళ్లు నియంత్రణ కోల్పోయే రీతిలో మద్యం సేవించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ ప్రకటించారు. ముఖ్యంగా ఓపెనర్‌ బెన్‌ డకెట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా ఎక్కువగా తాగేసిన అతను దారి తప్పినట్లుగా ఇందులో కనిపిస్తోంది. తిరిగి ఎలా వెళ్లాలో తెలుసా అంటూ ఒక మహిళ ప్రశ్నించగా ‘తెలీదు’ అంటూ డకెట్‌ జవాబిచ్చాడు. దీంతో పాటు మరో ఆటగాడు జాకబ్‌ బెెతెల్‌ క్లబ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. రెండో టెస్టులో పరాజయం తర్వాత మళ్లీ కొత్తగా ఉత్తేజం పొంది సిద్ధం అయ్యేందుకు వీలుగా అంటూ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ నాలుగు రోజుల పాటు ఈ రిసార్ట్‌ ప్రణాళికను రూపొందించాడు. ఈ సెలవు తర్వాత జట్టుపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ మూడో టెస్టులో ఓడి యాషెస్‌ కోల్పోవడంతో వారి షికారుపై చర్చ మొదలైంది. రిసార్ట్‌లో అంతా బాగా ప్రవర్తించారు అంటూ మొదట్లో ప్రకటించిన రాబ్‌ కీ...కారణాలు ఏమైనా అంతర్జాతీయ క్రికెటర్లు పరిమితికి మించి మద్యం తీసుకోవడం మంచిది కాదని, ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పాడు. యాషెస్‌ ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి డకెట్‌ మొత్తం 97 పరుగులే చేశాడు. 2017లో ఆ్రస్టేలియాలో జరిగిన యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా సీనియర్‌ ప్లేయర్‌ జిమ్మీ అండర్సన్‌పై మద్యం ఒలకబోయడంతో డకెట్‌ను సస్పెండ్‌ చేసిన ఈసీబీ వెంటనే స్వదేశానికి పంపించేసింది. ఆర్చర్‌ అవుట్‌... యాషెస్‌ కోల్పోయి మిగతా మ్యాచ్‌లలో పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టుపై మరో దెబ్బ పడింది. టీమ్‌ ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పక్కటెముకల గాయంతో సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే నాలుగో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో ఆర్చర్‌ స్థానంలో గస్‌ అట్కిన్సన్‌కు చోటు దక్కింది. ప్రధాన బ్యాటర్‌ ఒలీ పోప్‌పై కూడా ఈ మ్యాచ్‌లో వేటు పడింది. తాజా యాషెస్‌లో 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 125 పరుగులే చేసిన పోప్‌ గత 16 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేదు. పోప్‌ స్థానంలో జాకబ్‌ బెతెల్‌ను టీమ్‌లోకి ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌ తరఫున బెతెల్‌ ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడాడు.

Surya Charishma makes a good start in the National Senior Badminton Championship3
సూర్య చరిష్మా ముందంజ

సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో సూర్య చరిష్మా 21–11, 21–14తో శ్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్‌)పై గెలిచింది. తెలంగాణకు చెందిన వెన్నెల తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... మేఘన రెడ్డి ముందంజ వేసింది. వెన్నెల 17–21, 14–21తో ఆదర్శిని శ్రీ (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. మేఘన రెడ్డి 19–21, 21–17, 21–18తో పూర్వా భర్వే (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తనిష్‌్క, సాయి ఉత్తేజిత రావు, నవ్య కందేరి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. తని‹Ù్క 15–21, 5–21తో ఇషారాణి బారువా (అస్సాం) చేతిలో, సాయి ఉత్తేజిత 15–21, 12–21తో దీప్షిక సింగ్‌ చేతిలో, నవ్య 13–21, 21–18, 14–21తో డియాంక వాల్దియా చేతిలో ఓడిపోయారు.

Bavuma clarification on the dwarfism incident4
బుమ్రా, పంత్‌ క్షమాపణ చెప్పారు

జొహన్నెస్‌బర్గ్‌: భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో తన ఎత్తు విషయంలో ఎదుర్కొన్న వ్యాఖ్య గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత పేసర్‌ బుమ్రా, కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌ విషయంలో చర్చించుకుంటూ బవుమా గురించి ‘మరుగుజ్జు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కొంత వివాదం రేగింది. అయితే ఆ తర్వాత వారిద్దరు తనకు క్షమాపణలు చెప్పారని బవుమా స్పష్టం చేశాడు. నిజానికి ఆ సమయంలో సరిగ్గా ఏం జరిగిందో కూడా తనకు తెలీదని అతను వెల్లడించాడు. ‘నిజానికి బుమ్రా, పంత్‌ నన్ను క్షమాపణలు కోరినప్పుడు అసలు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాలేదు. మా మీడియా మేనేజర్‌ను అడిగి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. వారి భాషలో నా గురించి ఏదోలా మాట్లాడుకున్నారని అర్థమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత నా వద్దకు వచ్చి వారు సారీ చెప్పారు. మైదానంలో జరిగిన విషయాలు అక్కడే ముగిసిపోతాయి. కానీ ఏం అన్నారో మర్చిపోలేం కదా. అవి మరింత బాగా ఆడేందుకు ప్రేరణ అందిస్తాయి. అయితే నాకు ఎలాంటి విద్వేషభావం లేదు’ అని బవుమా వివరించాడు. మరోవైపు గువాహటిలో జరిగిన రెండో టెస్టు సమయంలో భారత ఆటగాళ్లను ‘మోకాళ్లపై కూర్చోబెడతాను’ అంటూ దక్షిణాఫ్రికా కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ అనడం కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయంలో షుక్రిని తప్పుబట్టిన బవుమా... అతను మరింత మెరుగైన భాషను వాడాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత గడ్డపై కఠిన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించానని...వాటిని అధిగమించి 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ గెలవడం చాలా గొప్పగా అనిపించిందని బవుమా తన ఆనందాన్ని వ్యక్తపర్చాడు.

Dhanush Srikanth and Pullela Gayatri in the race for Arjuna Award5
‘అర్జున‘ అవార్డు రేసులో ధనుశ్‌ శ్రీకాంత్, పుల్లెల గాయత్రి

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి, బధిర షూటర్‌ ధనుశ్‌ శ్రీకాంత్‌ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డును అందుకోనున్నారు. అవార్డుల ఎంపిక కోసం నియమించిన కమిటీ 24 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన గాయత్రి, శ్రీకాంత్‌లకు చోటు దక్కింది. ఈ జాబితాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర వేయడం లాంఛనమే. భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె అయిన 22 ఏళ్ల గాయత్రి కొన్నేళ్లుగా మహిళల డబుల్స్‌లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజత, కాంస్యాలు గెలిచిన భారత జట్లలో సభ్యురాలైన ఆమె...భాగస్వామి ట్రెసా జాలీతో కలిసి నాలుగు బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీలు గెలిచింది. మరో నాలుగు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 23 ఏళ్ల ధనుశ్‌ శ్రీకాంత్‌ 10 మీటర్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రెండేళ్ల క్రితం జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో స్వర్ణంతో వెలుగులోకి వచ్చాడు. 2021, 2025 డెఫ్‌ ఒలింపిక్స్‌లలో కలిపి అతను మొత్తం 4 స్వర్ణాలు సాధించాడు.

A flood of records in the Vijay Hazare Tournament6
ఒకే రోజు 22 సెంచరీలు

బంతి మీద పగబట్టినట్లు... బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు... సింగిల్స్‌ తీయడమే తెలియదన్నట్లు... బిహార్‌ బ్యాటర్లు బౌండరీలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా విజయ్‌ హజారే వన్డే టోర్నీలో బిహార్‌ జట్టు ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. 14 ఏళ్ల ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తూ త్రుటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకోగా... సకీబుల్‌ గనీ లిస్ట్‌ ‘ఎ’క్రికెట్‌లో భారత్‌ తరఫున ‘ఫాస్టెస్ట్‌ సెంచరీ’ తన పేరిట రాసుకున్నాడు. ఆయుశ్‌ లొహారుక కూడా శతకంతో విజృంభించడంతో బిహార్‌ కొండంత స్కోరు చేసింది. ఛేదనలో అరుణాచల్‌ ప్రదేశ్‌ 177 పరుగులకు ఆలౌటై 397 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. భారత దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారింది. టోర్నీ తొలి రోజు బుధవారం రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీల్లో ఆడుతున్న స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి (ఢిల్లీ), రోహిత్‌ శర్మ (ముంబై) శతకాల మోత మోగిస్తే... బిహార్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ త్రుటిలో డబుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. టి20 ప్రపంచకప్‌నకు ఎంపికైన ఇషాన్‌ కిషన్‌ (జార్ఖండ్‌) మెరుపు సెంచరీతో కదంతొక్కితే... అదే మ్యాచ్‌లో దేవదత్‌ పడిక్కల్‌ (కర్ణాటక) భారీ శతకంతో చెలరేగాడు. ఒడిశా ప్లేయర్‌ స్వస్తిక్‌ సమల్‌ ఈ టోర్నీ చరిత్రలో ఎనిమిదో డబుల్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కితే... 32 బంతుల్లోనే సెంచరీ చేసిన బిహార్‌ కెప్టెన్ సకీబుల్‌ గనీ లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. రాంచీ: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్లేట్‌ గ్రూప్‌లో భాగంగా బుధవారం జరిగిన పోరులో బిహార్‌ జట్టు రికార్డుల దుమ్ము దులిపింది. యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (84 బంతుల్లో 190; 16 ఫోర్లు, 15 సిక్స్‌లు), కెప్టెన్ సకీబుల్‌ గనీ (40 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 12 సిక్స్‌లు), ఆయుశ్‌ లొహారుక (56 బంతుల్లో 116; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన బిహార్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం లక్ష్యఛేదనలో అరుణాచల్‌ ప్రదేశ్‌ 42.1 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి 397 పరుగుల తేడాతో బిహార్‌కు విజయాన్ని అందించారు. దంచుడే దంచుడు... మెరుపులా మొదలైన బిహార్‌ ఇన్నింగ్స్‌... ఉరుములా ప్రత్యర్థులను భయపెట్టి... తుపానులా చుట్టేసి... చివరకు సునామీలా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇప్పటికే సీనియర్‌ స్థాయిలో భారీ సెంచరీలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న బిహార్‌ యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ... అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్‌... ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. మరో 11 బంతుల్లోనే 50 పరుగులు జోడించి 36 బంతుల్లో శతకం నమోదు చేసుకున్నాడు. తద్వారా లిస్ట్‌ ‘ఎ’క్రికెట్‌లో శతకం బాదిన అత్యంత పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. తొలి వికెట్‌కు 14.3 ఓవర్లలో 158 పరుగులు జతచేసిన వైభవ్‌... 59 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ అందుకొని... డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. డబుల్‌ సెంచరీకి 10 పరుగుల దూరంలో వైభవ్‌ అవుటయ్యాడు. సకీబుల్‌ విధ్వంసం... వైభవ్‌ వెనుదిరగడంతో ఊపిరి పీల్చుకుందాం అనుకున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లకు బిహార్‌ సారథి సకీబుల్‌ గనీ పట్టపగలే చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని బౌండరీకి తలరించడమే లక్ష్యంగా భారీ షాట్‌లతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో అతడు 32 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకొని లిస్ట్‌ ‘ఎ’క్రికెట్‌లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో 128 పరుగులు చేసి సకీబుల్‌ బౌండరీల ద్వారానే 112 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో బిహార్‌ ప్లేయర్లు 49 ఫోర్లు, 38 సిక్స్‌లు బాదారు. 574/6పురుషుల లిస్ట్‌ ‘ఎ’ (దేశవాళీ+అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు. 2022–23 విజయ్‌ హజారే ట్రోఫీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పైనే తమిళనాడు చేసిన స్కోరు (506/2) రెండో స్థానానికి చేరింది. 1 పురుషుల లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగంగా 150 పరుగులు చేసిన ప్లేయర్‌గా వైభవ్‌ సూర్యవంశీ నిలిచాడు. తాజా మ్యాచ్‌లో అతడు 59 బంతుల్లో ఈ మార్క్‌ అందుకున్నాడు. 2015లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా స్టార్‌ ఏబీ డివిలియర్స్‌ 64 బంతుల్లో 150 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.32 ఈ మ్యాచ్‌లో సకీబుల్‌ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో భారత్‌ తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. ఓవరాల్‌గా లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్‌ గుర్క్‌ (29 బంతుల్లో), డివిలియర్స్‌ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 38 ఈ మ్యాచ్‌లో సకీబుల్‌ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో భారత్‌ తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. ఓవరాల్‌గా లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్‌ గుర్క్‌ (29 బంతుల్లో), డివిలియర్స్‌ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1 విజయ్‌ హజారే టోర్నీలో ఒకే జట్టు తరఫున మూడు సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో 1995లో హైదరాబాద్‌తో మ్యాచ్‌లో విల్స్‌ ఎలెవన్‌ జట్టు తరఫున సచిన్‌ టెండూల్కర్, గగన్‌ ఖోడా,సంజయ్‌ మంజ్రేకర్‌ శతకాలు చేశారు.1 లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్‌ సూర్యవంశీ (14 సంవత్సరాల 272 రోజులు) రికార్డు నెలకొల్పాడు. జహూర్‌ ఇలాహీ (15 ఏళ్ల 209 రోజులు; 1986లో పాక్‌ ఆటోమొబైల్స్‌ కార్పొరేషన్‌) పేరిట ఉన్న రికార్డును వైభవ్‌ తిరగరాశాడు.ఇటు కోహ్లి... అటు రోహిత్‌‘శత’క్కొట్టిన సీనియర్‌ ప్లేయర్లు ఆంధ్రపై ఢిల్లీ; సిక్కింపై ముంబై గెలుపు బెంగళూరు: స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ సెంచరీలతో కదంతొక్కారు. సుదీర్ఘ విరామం అనంతరం విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడిన ఈ ఇద్దరూ... అది్వతీయ ఫామ్‌ కొనసాగిస్తూ తమ జట్లను గెలిపించారు. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టుపై గెలిచింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. రికీ భుయ్‌ (122; 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (101 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో కోహ్లికిది 58వ శతకం. ఈ క్రమంలో విరాట్‌ లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 391 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ అందుకోగా... కోహ్లి 330 ఇన్నింగ్స్‌లో 16 వేల పరుగుల మైలురాయి దాటాడు. రోహిత్‌ తగ్గేదేలే! ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో జైపూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో సిక్కింపై నెగ్గింది. మొదట సిక్కిం 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెటకు 237 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ శర్మ (94 బంతుల్లో 155; 18 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. జాతీయ జట్టుకు ఆడాలంటే దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేయడంతో చాన్నాళ్ల తర్వాత కోహ్లి, రోహిత్‌ విజయ్‌ హజారే టోర్నీలో బరిలోకి దిగారు.

National Sports Awards: No cricketer in shortlist, Hardik Singh sole Khel Ratna nominee7
జాతీయ క్రీడా పురస్కారాల సిఫారసుల జాబితా విడుదల

2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల కోసం సిఫారసుల జాబితాను కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ఇవాళ (డిసెంబర్‌ 24) ప్రకటించింది. ఈ జాబితాలో ఆసక్తికరంగా ఒక్క క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. భారత హాకీ జట్టు వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ సింగ్ ఒక్కడే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు కోసం సిఫారసు చేయబడ్డాడు. మరో 24 మంది క్రీడాకారుల పేర్లు అర్జున అవార్డుల కోసం సిఫారసు చేయబడ్డాయి.మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు: హార్దిక్‌ సింగ్ (హాకీ)అర్జున అవార్డు:- అథ్లెటిక్స్‌: తేజస్విన్‌ శంకర్‌, ప్రియాంక, మహ్మద్‌ అఫ్సల్‌, ఏక్తా భ్యాన్‌ (పారా)- చెస్‌: దివ్య దేశ్‌ముఖ్‌, విదిత్‌ గుజరాతి - బ్యాడ్మింటన్‌: త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్‌ - షూటింగ్‌: మెహులీ ఘోష్‌, అఖిల్‌ శెరాన్‌, ధనుష్‌ శ్రీకాంత్‌ (డెఫ్‌), రుద్రాంశ్‌ ఖండేల్వాల్‌ (పారా)- హాకీ: రాజ్‌కుమార్‌ పాల్‌, లాల్‌రెంసియామి - జిమ్నాస్టిక్స్‌: ప్రణతి నాయక్‌ - కబడ్డీ: సుర్జీత్‌, పూజా - ఇతర విభాగాలు: నరేందర్‌ (బాక్సింగ్‌), నిర్మల భాటి (ఖోఖో), పద్మనాభ్‌ సింగ్‌ (పోలో), అర్వింద్‌ సింగ్‌ (రోయింగ్‌), సుతిర్థా ముఖర్జీ (టేబుల్‌ టెన్నిస్‌), సోనం మాలిక్‌ (రెజ్లింగ్‌), ఆర్తి పాల్‌ (యోగా, ఈ విభాగంలో తొలి సిఫారసు)

History of vijay hazare trophy and records8
VHT.. విరాట్‌, రోహిత్‌ లాంటి దిగ్గజాలను వెలుగులోకి తెచ్చిన వేదిక

విజయ్‌ హజారే ట్రోఫీ (VHT).. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 50 ఓవర్ల దేశవాలీ టోర్నీ. ఈ టోర్నీని అంతర్జాతీయ వన్డేలతో కలిపి లిస్ట్‌-ఏ ఫార్మాట్‌గా పరిగణిస్తారు. 1993–94లో జోనల్‌ స్థాయిలో ప్రారంభమైన ఈ టోర్నీ.. 2002–03 నుంచి అన్ని రాష్ట్ర జట్లు పాల్గొనేలా జాతీయ స్థాయికి విస్తరించింది.తొలినాళ్లలో ఈ టోర్నీని రంజీ వన్డే ట్రోఫీగా పిలిచే వారు. 2004లో భారత క్రికెట్‌ దిగ్గజం విజయ్‌ హజారే మరణం తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీగా నామకరణం చేశాడు. 2007-08 ఎడిషన్‌ నుంచి ఇదే పేరుతో ఈ టోర్నీ కొనసాగుతుంది.ప్రస్తుతం ఈ టోర్నీలో 38 రాష్ట్ర జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌, నాకౌట్‌ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో కర్ణాటక, తమిళనాడు అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 5 టైటిళ్లు సాధించాయి. ఈ టోర్నీ విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ లాంటి అనేక మంది స్టార్‌ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది.ఇవాల్టి నుంచి (డిసెంబర్‌ 24) 2025-26 ఎడిషన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఈ టోర్నీలో అత్యుత్తమ రికార్డులు, విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా మహారాష్ట్రకు చెందిన అంకిత్‌ బావ్నే (4010 పరుగులు) కొనసాగుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక సెంచరీల రికార్డు (15) కూడా బావ్నే పేరిటే ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు ఇషాన్‌ కిషన్‌ (273) ఖాతాలో ఉంది.ఫాస్టెస్ట్‌ సెంచరీ ఇవాళే (బిహార్‌ ఆటగాడు సకీబుల్‌ గనీ-32 బంతుల్లో) నమోదైంది. టోర్నీ చరిత్రలో యంగెస్ట్‌ సెంచూరియన్‌ రికార్డు కూడా ఇవాళే నమోదైంది. బిహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ 14 ఏళ్ల వయసులో ఈ రికార్డు సాధించాడు. ఈ సెంచరీ లిస్ట్‌-ఏ చరిత్రలో ఎనిమిదో వేగవంతమైన శతకంగానూ (36 బంతుల్లో) రికార్డైంది.ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా సిద్ధార్థ్‌ కౌల్‌ (155 వికెట్లు, పంజాబ్‌) ఉన్నాడు. అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు షాబాజ్‌ నదీమ్‌ (జార్ఖండ్‌, 8/10) పేరిట ఉన్నాయి. ఓ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక వికెట్ల రికార్డు జయదేవ్‌ ఉనద్కత్‌ (2012–13 ఎడిషన్‌లో 19 వికెట్లు) పేరిట ఉంది.జట్టు రికార్డుల విషయానికొస్తే.. అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు కూడా ఇదే సీజన్‌లో నమోదైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌ రికార్డు స్థాయిలో 574 పరుగులు చేసింది. లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత భారీ స్కోర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అత్యల్ప స్కోర్‌ అస్సాం (36 పరుగులు vs ముంబై, 2012) పేరిట ఉంది.ఈ టోర్నీ విరాట్‌ కోహ్లి (2006-07 సీజన్‌లో), రోహిత్‌ శర్మ (2005-06 సీజన్‌లో) లాంటి దిగ్గజాలను వెలుగులోకి తేవడంతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, సాయి సుదర్శన్‌, కేఎల్‌ రాహుల్‌, అభిషేక్‌ శర్మ, రజత్‌ పాటిదార్‌, శుభ్‌మన్‌ గిల్‌ లాంటి టీమిండియా స్టార్లకు తమ సత్తా చాటేందుకు వేదికగా ఉపయోగపడింది.

VHT 2025-26: Karnataka completes second highest chase in List A cricket against Jharkhand9
పడిక్కల్‌ వీరోచిత పోరాటం.. ఇషాన్‌ కిషన్‌ సుడిగాలి శతకం వృధా

విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో తొలి రోజే అద్భుతాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజు లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో టాప్‌-8లోని మూడు ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదయ్యాయి. బిహార్‌ ఆటగాడు సకీబుల్‌ గనీ 32 బంతుల్లో శతక్కొట్టి, లిస్ట్‌-ఏలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అవతరించగా.. ఝార్ఖండ్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ 33 బంతుల్లో, వైభవ్‌ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి లిస్ట్‌-ఏ క్రికెట్‌లో నాలుగు, ఎనిమిదో ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.వీరు మాత్రమే కాక ఇవాళే మరో ముగ్గురు స్టార్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. టీమిండియా వెటరన్‌ స్టార్లు రోహిత్‌ శర్మ (ముంబై), విరాట్‌ కోహ్లి (ఢిల్లీ).. అప్‌కమింగ్‌ స్టార్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (కర్ణాటక) శతక్కొట్టుడు కొట్టారు. ఇవాళే ఓ అనామక ఆటగాడు డబుల్‌ సెంచరీ కూడా చేశాడు. ఒడిషాకు చెందిన స్వస్తిక్‌ సమల్‌ సౌరాష్ట్రపై ఈ ఫీట్‌ సాధించాడు. మొత్తంగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-25 ఎడిషన్‌ తొలి రోజు శతకాల మోత (22) మోగింది. పడిక్కల్‌ వీరోచిత పోరాటం.. ఇషాన్‌ కిషన్‌ 33 బంతుల శతకం వృధాఇదిలా ఉంటే, ఇవాళ కర్ణాటకపై ఇషాన్‌ కిషన్‌ చేసిన 33 బంతుల శతకం వృధా అయ్యింది. ఇషాన్‌ కిషన్‌ శతక్కొట్టుడు కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఝార్ఖండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 412 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దేవదత్‌ పడిక్కల్‌ వీరోచితంగా పోరాడి కర్ణాటకకు చారిత్రక​ విజయాన్ని అందించాడు. భారీ లక్ష్య ఛేదనలో పడిక్కల్‌ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి కర్ణాటకను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఆతర్వాత అభినవ్‌ మనోహర్‌ (56 నాటౌట్‌), ధృవ్‌ ప్రభాకర్‌ (40 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కర్ణాటకను గెలుపు తీరాలు దాటించారు. లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్‌ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

Ashes series 2025-26 ENG VS AUS 4th Test: Archer ruled out, Pope dropped for Melbourne10
ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ

మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 0-3 తేడాతో యాషెస్‌ సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయం చివరి రెండు టెస్ట్‌లకు స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే ఇంగ్లండ్‌ మరో స్టార్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ సేవలను కూడా కోల్పోయింది. వుడ్‌ మోకాలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు ముందే తప్పుకున్నాడు. తాజాగా ఆర్చర్‌ కూడా వైదొలగ డంతో ఇంగ్లండ్‌ పేస్‌ విభాగం మరింత బలహీనపడింది. ఆర్చర్‌ స్థానంలో గస్‌ అట్కిన్సన్‌ను నాలుగో టెస్ట్‌కు తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది.పోప్‌ ఔట్‌గాయం కారణంగా ఆర్చర్‌ సిరీస్‌ మొత్తానికే దూరం కాగా.. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను ఈసీబీ నాలుగో టెస్ట్‌ నుంచి తప్పించింది. పోప్‌ గత మూడు టెస్ట్‌ల్లో కేవలం 125 పరుగులే చేశాడు. పోప్‌ స్థానంలో నాలుగో టెస్ట్‌లో జేకబ్‌ బేతెల్‌ను ఆడించనున్నట్లు ఈసీబీ తెలిపింది.ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్‌ తుది యాధాతథంగా కొనసాగనుంది. రేపటి నుంచి (డిసెంబర్‌ 26) మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగో యాషెస్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన ఇంగ్లండ్‌ చివరి రెండు టెస్ట్‌లైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, ఇలాంటి సమయంలో ఆర్చర్‌ గాయం కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరం కావడం ఇంగ్లండ్‌ కష్టాలను మరింత తీవ్రం చేసింది.యాషెస్‌ నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ తుది జట్టు..జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, జేకబ్‌ బేతెల్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), జేమీ స్మిత్‌ (వికెట్‌కీపర్‌), విల్‌ జాక్స్‌, గస్‌ అట్కిన్సన్‌, బ్రైడన్‌ కార్స్‌, జోష్‌ టంగ్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement