Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Two IPL teams are now up for sale says Harsh Goenka1
అమ్మ‌కానికి మ‌రో ఐపీఎల్ టీమ్‌!

మెగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో మ‌రో జ‌ట్టు యాజ‌మాన్యం మార‌నుందా? ఇప్ప‌టికే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(ఆర్సీబీ) టీమ్‌ను అమ్మ‌కానికి పెట్టారు. తాజాగా మ‌రో జ‌ట్టు కూడా ఇదే బాట‌లో ప‌యనిస్తోంద‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంతకీ ఆ రెండో జ‌ట్టు ఏది? ఈ రెండు జ‌ట్ల‌ను ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డుతున్న కొనుగోలుదారులు ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఉందా?ఒకటి కాదు, రెండు ఐపీఎల్‌ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త హ‌ర్ష్ గోయంకా (Harsh Goenka) ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఆర్సీబీతో పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్‌ఆర్‌) జ‌ట్టును విక్ర‌యించ‌నున్న‌ట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ రెండు టీమ్‌ల‌ను ద‌క్కించుకునేందుకు న‌లుగురైదుగురు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలిపారు. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా అమెరికా చెందిన వారు ఈ జ‌ట్ల‌ను ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ నాటికి ఆర్సీబీ, ఆర్‌ఆర్ జ‌ట్ల యాజ‌మాన్యం మారే అవ‌కాశాలు ఉన్న‌ట్టు దీన్నిబ‌ట్టి స్ప‌ష్ట‌మ‌వుతోంది.రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీకి మనోజ్ బాదాలే య‌జ‌మానిగా ఉన్నారు. ఆయ‌న‌కు చెందిన ఎమర్జింగ్ మీడియా IPL లిమిటెడ్‌కు ఈ జట్టులో దాదాపు 65% వాటా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్, మీడియా-వ్యాపార దిగ్గజం లాచ్లాన్ ముర్డోచ్ మైనారిటీ వాటాదారులుగా కొన‌సాగుతున్నారు. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ సుమారు 15% వాటాను కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గ‌జం దివంగత షేన్ వార్న్ కుటుంబానికి కూడా చిన్న షేర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ‌మైప్ప‌టి నుంచి రాజస్థాన్ రాయల్స్ కార్య‌క‌లాపాలు, వ్యూహాత్మక నిర్ణయాలలో మనోజ్ బాదాలే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, 2008లో ఐపీఎల్ తొలి టైటిల్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలిచిన సంగ‌తి క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండే ఉంటుంది.మార్చి నాటికి ఆర్సీబీ అమ్మ‌కం పూర్తి2025 ఐపీఎల్ టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు ముందే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను నవంబర్ 5న అధికారికంగా ప్రారంభించినట్లు ప్ర‌స్తుత యాజ‌మాన్యం డియాజియో ధ్రువీకరించింది. అమ్మకపు ప్రక్రియ వ‌చ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలిపింది. చ‌ద‌వండి: స్మృతి పెళ్లి వివాదం.. చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?— Harsh Goenka (@hvgoenka) November 27, 2025

PC: WPL2
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్‌ ఏంటి?

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్‌ లీగ్‌ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్‌ గెలవాలని యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్‌ జిందాల్‌ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్‌ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్‌ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్‌ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్‌ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్‌ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్‌ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్‌ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్‌ జిందాల్‌ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్‌ సీజన్‌లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Messi in Hyderabad: CM Revanth Reddy Post3
మెస్సీ రాకపై సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ భారత పర్యటనకు సమయం ఆసన్నమైంది. డిసెంబరు 13- 15 వరకు అతడు కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ సోషల్‌ మీడియా వేదికగా భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇండియా నుంచి లభిస్తున్న ప్రేమకు నేను ముగ్ధుడినైపోయాను. GOAT టూర్‌ త్వరలోనే ఆరంభం కానుంది. తొలుత కోల్‌కతా, ముంబై, ఢిల్లీలకే నా పర్యటన పరిమితం కాగా.. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా జాబితాలో చేరింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నా’’ అంటూ మెస్సీ హర్షం వ్యక్తం చేశాడు.ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘‘ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ డిసెంబరు 13న హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.మెస్సీ వంటి దిగ్గజాన్ని చూడాలని మన సిటీతో పాటు ప్రతి ఒక్క ఫుట్‌బాల్‌ అభిమాని కోరుకుంటారు. ఆయన మన గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. గర్వం, సంతోషంతో నిండిన మనసుతో హైదరాబాద్‌ ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. మన ఆతిథ్యమే ఇక్కడి ప్రజల మనసు ఏమిటో ఆయనకు తెలియజేస్తుంది’’ అంటూ రేవంత్‌ రెడ్డి ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. కాగా మెస్సీ తన టూర్‌లో భాగంగా ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఫుట్‌బాల్‌ క్లినిక్‌లు ప్రారంభిస్తాడు. మ్యూజిక్‌ కన్సర్ట్‌తో పాటు సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

India to host Sri Lanka for 5 women T20Is Schedule Announced4
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల

భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్‌ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది.ఈ సిరీస్‌కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్‌- బంగ్లాదేశ్‌ మహిళా జట్ల మధ్య సిరీస్‌ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్‌ను వాయిదా వేశారు.టీ20 ప్రపంచకప్‌-2026కి సన్నాహకంగాఈ క్రమంలో శ్రీలంకతో భారత్‌ (IND vs SL T20Is) మ్యాచ్‌లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా కానున్నారు.మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేదికలు ఇవేనవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్‌ టోర్నీ ఆడనుంది.భారత్‌ వర్సెస్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

BCCI Unhappy With Gambhir Press Conference Remarks If He: Report5
గంభీర్‌ తీరుపై బీసీసీఐ ఆగ్రహం!?.. ఇంకోసారి ఇలా చేస్తే..

భారత క్రికెట్‌ వర్గాల్లో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్‌ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్‌ కోచింగ్‌ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ అకస్మాత్‌ రిటైర్మెంట్‌ ప్రకటనల వెనుక గంభీర్‌ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.విమర్శలు.. రాజీనామాకు డిమాండ్‌అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్‌లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్‌ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, అశ్విన్‌ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్‌ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.అండగా ఉంటామని చెప్పినా..ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్‌కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గంభీర్‌ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్‌ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్‌ అలా తయారు చేయించానని గంభీర్‌ అంగీకరించిన విషయం తెలిసిందే.అదే విధంగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుల గురించి, యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఆడించే విషయమై గంభీర్‌ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులుఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్‌ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన ఆ క్రెడిట్‌ మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపితేనే గంభీర్‌ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!చదవండి: Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్‌ కీలక ప్రకటన

SMAT: Ignored Prithvi Shaw Sends Big IPL Message Fiery 23 Ball Fifty6
పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌.. ఐపీఎల్‌ జట్లకు సందేశం!

భారత క్రికెటర్‌, మహారాష్ట్ర కెప్టెన్‌ పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 23 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. పృథ్వీకి తోడు మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి భారీ హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. ఫలితంగా మహారాష్ట్ర.. హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దేశవాళీ టీ20 టోర్నరమెంట్లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో భాగంగా ఎలైట్‌ గ్రూప్‌-‘బి’లో ఉన్న మహారాష్ట్ర- హైదరాబాద్‌ (Hyderabad vs Maharashtra) శుక్రవారం తలపడ్డాయి. కోల్‌కతా వేదికగా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.రాణించిన హైదరాబాద్‌ బ్యాటర్లుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (12), అమన్‌ రావు (11) నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ప్రజ్ఞయ్‌ రెడ్డి (17 బంతుల్లో 26), రాహుల్‌ బుద్ధి (31) ఓ మోస్తరుగా రాణించారు.మిగిలి వారిలో భవేశ్‌ సేత్‌ (19) విఫలం కాగా.. తనయ్‌ త్యాగరాజన్‌ (17 బంతుల్లో 32), కెప్టెన్‌ సీవీ మిలింద్‌ (20 బంతుల్లో 35 నాటౌట్‌), మొహ్మద్‌ అర్ఫాజ్‌ అహ్మద్‌ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్‌ సక్సేనాకు రెండు, ఆర్‌ఎస్‌ హంగ్రేగ్కర్‌, విక్కీ ఓస్త్వాల్‌, రామకృష్ణ ఘోష్‌ ఒక్కో వికెట్‌ తీశారు.దుమ్ములేపిన ‘మహా’ ఓపెనర్లుఇక హైదరాబాద్‌ విధించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లలో కెప్టెన్‌ పృథ్వీ షా (Prithvi Shaw) 23 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 36 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 66 పరుగులు సాధించాడు.మరోవైపు... అర్షిన్‌ కులకర్ణి సైతం ధనాధన్‌ దంచికొట్టాడు. మొత్తంగా 54 బంతులు ఎదుర్కొని.. పన్నెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 89 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అజిమ్‌ కాజీ (8) విఫలం కాగా.. రాహుల్‌ త్రిపాఠి 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచి అర్షిన్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఐపీఎల్‌ జట్లకు సందేశం!​కాగా సచిన్‌ టెండుల్కర్‌ స్థాయికి చేరుకుంటాడంటూ నీరాజనాలు అందుకున్న పృథ్వీ షా.. అనతికాలంలోనే టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. దేశీ క్రికెట్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్‌నెస్‌ లేమి, క్రమశిక్షణా రాహిత్యం కారనంగా ఆటపై దృష్టి పెట్టలేకపోయిన పృథ్వీ షాను గతేడాది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు.ఫలితంగా పృథ్వీ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. తర్వాత సొంత జట్టు ముంబైని కూడా వీడి.. ఈ దేశీ సీజన్‌ ఆరంభంలోనే మహారాష్ట్రతో చేరాడు. తన తప్పుల్ని తెలుసుకుని ఆటపై దృష్టి సారించానన్న పృథ్వీ.. ఫార్మాట్లకు అతీతంగా అదరగొడుతున్నాడు. తాజా ప్రదర్శనతో ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలకు తానూ రేసులో ఉంటాననే సందేశం ఇచ్చాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

No Cummins Australia Name Unchanged Squad For 2nd Ashes Test7
Ashes: ఊహించిందే జరిగింది.. ఆసీస్‌ కీలక ప్రకటన

ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తొలి టెస్టు ఆడిన జట్టుతోనే తాము రంగంలోకి దిగుతామని స్పష్టం చేసింది. కాగా సొంతగడ్డపై ఆసీస్‌ ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక​ యాషెస్‌ సిరీస్‌ (The Ashes 2025-26)లో తలపడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పెర్త్‌ వేదికగా నవంబరు 21న ఇరుజట్ల మధ్య మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్‌.. ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక డిసెంబరు 4-8 వరకు ఇంగ్లండ్‌- ఆసీస్‌ మధ్య రెండో టెస్టు జరుగనుంది. డే- నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించే ఈ పింక్‌ బాల్‌ టెస్టు (Pink Ball Test) కంటే ముందు ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది.కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ అవుట్‌ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల యాషెస్‌ తొలి టెస్టుకు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins).. రెండో టెస్టుతో తిరిగి వస్తాడనే ప్రచారం జరిగింది. జట్టుతో పాటు అతడు బ్రిస్బేన్‌కు వచ్చి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేయడం ఇందుకు కారణం. అయితే, అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.ఫలితంగా కమిన్స్‌ గైర్హాజరీలో స్టీవ్‌ స్మిత్‌ మరోసారి జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇక కమిన్స్‌తో పాటు మరో పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల నొప్పి నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. దీంతో తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రెండో టెస్టు బరిలోనూ దిగుతున్నట్లు ఆసీస్‌ ప్రకటించింది. కాగా పింక్‌ బాల్‌ టెస్టుకు బ్రిస్బేన్‌లోని గాబా మైదానం వేదిక.సత్తా చాటిన స్టార్క్‌కాగా తొలి టెస్టులో కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ లేని లోటును మిచెల్‌ స్టార్క్‌ పూడ్చాడు. మొత్తంగా పది వికెట్లతో సత్తా చాటి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. కామెరాన్‌ గ్రీన్‌, స్కాట్‌ బోలాండ్‌, బ్రెండన్‌ డాగెట్‌ అతడికి తోడుగా నిలిచారు. ఇక.. ఇంగ్లండ్‌ విధించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 83 బంతుల్లో 123 పరుగులతో హెడ్‌ సత్తా చాటగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ లబుషేన్‌ అజేయ అర్ధ శతకం (51)తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో ఓపెనర్‌ వెదర్లాడ్‌ 23 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ఇదేస్టీవ్ స్మిత్ (కెప్టెన్‌), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్‌రాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

BCCI Announced India U19 squad for Asia Cup, Vaibhav Suryavanshi In8
భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబరు 14న భారత్‌- పాక్‌ మ్యాచ్‌గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌ 1 విజేత, క్వాలిఫయర్‌ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్‌-‘బి’ నుంచి బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, క్వాలిఫయర్‌-2 విజేత రేసులో ఉన్నాయి.ఇక అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్‌-1 విజేతతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్‌’లో క్వాలిఫయర్‌-3 విజేతతో తలపడుతుంది.కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్‌ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్‌’ వేదికగా రెండో సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌- ‘బి’ గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌ విజేతల మధ్య టైటిల్‌ పోరు జరుగుతుంది.సెమీస్‌లోనే ఇంటిబాటఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్‌ మండలి టీ20 రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్‌ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్‌ ఫైనల్‌ చేరింది. టైటిల్‌ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్‌), ​వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), యువరాజ్‌ గోహిల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఎ.పటేల్‌, నమన్‌ పుష్పక్‌, డి. దీపేశ్‌, హెనిల్‌ పటేల్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ఉద్ధవ్‌ మోహన్‌, ఆరోన్‌ జార్జ్‌.స్టాండ్‌ బై ప్లేయర్లు: రాహుల్‌ కుమార్‌, హేముచుందేశన్‌ జె, బీకే కిషోర్‌, ఆదిత్య రావత్‌.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Gambhir Is Not My Relative: R Ashwin Lambasts Indian Players Loss To SA9
గంభీర్‌ నా బంధువు కాదు.. తప్పంతా వాళ్లదే: అశ్విన్‌ ఆగ్రహం

టీమిండియా సిరీస్‌ పరాజయానికి హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్‌వాష్‌ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ​కోచ్‌ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.అది సరైంది కాదు‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్‌ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.తప్పంతా వాళ్లదేభారత క్రికెట్‌ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్‌ బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.కోచ్‌, కెప్టెన్‌ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?గంభీర్‌ నా బంధువు కాదు.. గంభీర్‌ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్‌ వివరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్‌కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఇక భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్‌ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయిన విషయం తెలిసిందే. చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Dono Takleef Mein Hain, Shaadi Jaldi: Palash Muchhal Mother On Wedding Row10
త్వరలోనే నా కుమారుడి పెళ్లి: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్‌తో చాట్‌ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.స్మృతి తన ఆరాధ్య క్రికెటర్‌ అని, అలాంటి అమ్మాయికి పలాష్‌ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్‌ కూడా చాన్నాళ్ల ‍క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.మానసిక వేదన వర్ణనాతీతంహిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్‌ కలలు కన్నాడు.తొందర్లోనే పెళ్లి!నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్‌ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్‌ల పెళ్లి విషయమై స్పందించలేదు.ఘనంగా వేడుకలుకాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్‌.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్‌, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్‌ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్‌ మీడియాలో గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లారు.ఆ వీడియోలు డిలీట్‌ చేసిన స్మృతిఈ నేపథ్యంలో పలాష్‌ తల్లి అమిత ముచ్చల్‌ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్‌ చేయడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement