Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mohit Sharma announces retirement from all formats1
రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌

టీమిండియా వెట‌ర‌న్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. మోహిత్‌ త‌న నిర్ణ‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక‌గా బుధ‌వారం వెల్ల‌డించాడు. భారత్ త‌రపున 34 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌.. ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వహించాడు."హర్యానాకు ప్రాతినిధ్యం వహించడం మొదలు భారత్ జట్టు, ఆపై ఐపీఎల్‌లో ఆడటం వరకు నా ప్రయాణం ఒక అద్భుతం. ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నన్ను సరైన మార్గంలో నడిపించిన అనిరుధ్ సర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. బీసీసీఐ, కోచ్‌లు, సహచరులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, సపోర్ట్ సిబ్బంది, అభిమానులందరికి ధన్యవాదాలు ఉంటూ తన రిటైర్మెంట్ నోట్‌లో మోహిత్ రాసుకొచ్చాడు. ఈ హ‌ర్యానా పేస‌ర్ చివ‌ర‌గా భార‌త త‌ర‌పున 2015లో ఆడాడు. అప్ప‌టి నుంచి జాతీయ దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌లో మాత్రం రెగ్యూల‌ర్‌గా ఆడుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్‌-2025 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ఆడాడు. అయితే మినీ వేలానికి ముందు అత‌డిని గుజ‌రాత్ విడిచిపెట్టింది. అంత‌లోనే అత‌డు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.భార‌త్ త‌రుపున అతడు 26 వ‌న్డేలు, 8 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 31 వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు సాధించాడు. అతడు 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 120 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్ 134 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Mohitmahipal Sharma (@mohitsharma18)

Ruturaj Gaikwad Scripts History Becomes 1st Player In World To2
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్‌..సఫారీ పేసర్‌ ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో రుతురాజ్‌ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టుకుని.. రుతురాజ్‌కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్‌పై వేటు వేసి.. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్‌మెంట్‌ రుతుకు మరో అవకాశం ఇ‍చ్చింది. రాయ్‌పూర్‌ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్‌ ఎలెవన్‌కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్‌ గైక్వాడ్‌ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్‌... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో టోనీ డి జోర్జికి క్యాచ్‌ ఇవ్వడంతో రుతురాజ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే రుతురాజ్‌ను మేనేజ్‌మెంట్‌.. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్‌ గైక్వాడ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్‌పూర్‌లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్‌గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షాహీద్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌లు జరుగగా.. కివీస్‌తో వన్డేలో నాటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్‌ శతకం సాధించి.. రోహిత్‌ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్‌.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్‌ పఠాన్‌ 2011లో ప్రొటిస్‌ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్‌ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

BCCI launches Team Indias jersey for T20 World Cup 2026,3
భారత జెర్సీ అదిరిపోయిందిగా..

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 కోసం టీమిండియా జెర్సీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రిలీజ్ చేసింది. రాయ్‌పూర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డే సంద‌ర్భంగా ఈ కొత్త‌ జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.వీరితో పాటు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మలు కూడా పాల్గోన్నారు. వీరిద్ద‌రూ భార‌త కొత్త జెర్సీ కిట్‌ల‌తో ఫోటోల‌కు పోజులిచ్చారు. అదేవిధంగా భార‌త్, శ్రీలంక వేదిక‌ల‌గా జరిగే ఈ మెగా ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శ‌ర్మ ఎంపిక‌య్యాడు.అనంత‌రం రోహిత్ మాట్లాడుతూ.. భార‌త జ‌ట్టుకు నా ఆశీస్సులు ఎల్ల‌ప్పుడూ ఉంటాయి చెప్పుకొచ్చాడు. ఈ జెర్సీలో భారత జెండాలోని మొత్తం మూడు రంగులు ఉన్నాయి. ఎక్కువ‌గా ముదురు నీలం రంగు ఉండ‌గా.. ఇరు వైపులా ఆరెంజ్ రంగు ఉంది. కాలర్‌ దగ్గరలో తెలుపు రంగు ఉంది జెర్సీ మధ్యలో స్పాన్సర్‌ అపోలో టైర్స్‌, ఇండియా అని పేరు రాసి ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.గ్రూపు-ఎలో భారత్‌ఇక ఈ పొట్టి ప్రపంచకప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భారత్ ఉంది. భారత్‌తో పాటు పాక్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, అమెరికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న అమెరికాతో వాంఖడే వేదికగా తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్తాన్‌-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.India's jersey for #t20worldcup2026 #TeamIndia #INDvsSA pic.twitter.com/376CAa3eDY— Aakash Biswas (@aami_aakash) December 3, 2025

BCCI Announces India squad for IND vs SA T20I series Gill To Be4
BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని టీమిండియాలో మొత్తంగా పదిహేను మంది సభ్యులకు చోటిచ్చినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.హార్దిక్‌ రీఎంట్రీ.. రింకూపై వేటుఇక వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఫిట్‌నెస్‌ ఆధారంగా అందుబాటులో ఉంటాడని బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది. అదే విధంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరినట్లు తెలిపింది. అయితే, చాన్నాళ్లుగా టీ20 జట్టుతో కొనసాగుతున్న రింకూ సింగ్‌ (Rinku Singh)పై ఈసారి వేటుపడటం గమనార్హం. ఇవి తప్ప రెగ్యులర్‌ టీ20 జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే బీసీసీఐ జట్టును ప్రకటించింది.టెస్టులలో వైట్‌వాష్‌.. వన్డేలలో జోరుకాగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌లో సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తొలి వన్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.ఈ క్రమంలో డిసెంబరు 6న మూడో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ముగియనుండగా.. డిసెంబరు 9- 19 వరకు టీ20 సిరీస్‌ నిర్వహిస్తారు. ఇక ప్రొటిస్‌ జట్టుతో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పితో క్రీజును వీడిన టెస్టు సారథి గిల్‌.. రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం కోలుకుంటున్న గిల్‌.. టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదేసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుబ్‌‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌- ఫిట్‌నెస్‌కు లోబడి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా టీ20 సిరీస్‌ షెడ్యూల్‌🏏తొలి టీ20: డిసెంబరు 9- కటక్‌, ఒడిశా🏏రెండో టీ20: డిసెంబరు 11- ముల్లన్‌పూర్‌, చండీగఢ్‌🏏మూడో టీ20: డిసెంబరు 14- ధర్మశాల, హిమాచల్‌ ప్రదేశ్‌🏏నాలుగో టీ20: డిసెంబరు 17- లక్నో, ఉత్తరప్రదేశ్‌🏏ఐదో టీ20: డిసెంబరు 19- అహ్మదాబాద్‌, గుజరాత్‌.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

IND vs SA 2nd ODI: Nandre Burger struggles with injury5
సౌతాఫ్రికాకు భారీ షాక్‌

రాయ్‌పూర్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. ఆ ఓవర్‌లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్‌.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్‌ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేం‍దుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.భారత్ భారీ స్కోర్‌..ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్‌(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్‌(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

IND vs SA 2nd ODI: Ruturaj Kohli Centuries Rahul Slams 50 Ind Score6
శతక్కొట్టిన రుతురాజ్‌, కోహ్లి.. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) విఫలం కాగా.. విరాట్‌ కోహ్లి (102), రుతురాజ్‌ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్‌ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (1) రనౌట్‌ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌ రెండు, నండ్రీ బర్గర్‌, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్‌.. ప్రొటిస్‌పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్‌ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్‌-5 జాబితా🏏గ్వాలియర్‌ వేదికగా 2010లో 401/3🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

IND vs SA: Virat Kohli Equals Kane Williamson World Record Check7
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్‌పూర్‌లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్‌టేజ్‌’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్‌ దిగ్గజ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్‌ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్‌ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్‌పూర్‌లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్‌లో.. ఐడెన్‌ మార్క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్‌ స్టార్‌ కేన్‌ విలియమ్సన్‌.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్‌ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్‌కతా వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ 2023లో 101 నాటౌట్‌🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్‌పూర్‌ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌

IND vs SA 2nd Odi: Virat kohli slams 53 odi century8
విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీ.. సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టాడు. కింగ్‌ కోహ్లి 90 బంతుల్లోనే తన 53వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా విరాట్‌కు ఇది 84వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు.ఆరంభంలోనే రోహిత్‌ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో మూడో వికెట్‌కు 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లి ఓ వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.సచిన్‌ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌..వ‌న్డేల్లో అత్య‌ధిక సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంలో పాలుపంచుకున్న‌ ఆట‌గాడిగా కోహ్లి రికార్డులెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 32 సార్లు 150కు పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మ‌రొక ఆట‌గాడితో క‌లిసి నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్క‌ర్ (31) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ వ‌ర‌ల్డ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.టీమిండియా భారీ స్కోరుఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు సాధించింది. తద్వారా సఫారీ జట్టుకు 359 పరుగుల భారీ లక్ష్యం విధించింది. కాగా భారత బ్యాటర్లలో కోహ్లి, రుతురాజ్‌ సెంచరీలు కొట్టగా.. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మెరుపు అర్ధ శతకం (43 బంతుల్లో 66 నాటౌట్‌) సాధించాడు.Play it on loop ➿Just like Virat Kohli 😎💯Yet another masterful knock! 🫡 Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/WYbSDLEQRo— BCCI (@BCCI) December 3, 2025

Ruturaj Gaikwad slams maiden International odi century9
గంభీర్ నమ్మక‌మే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్‌

సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్‌ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్‌.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడురుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత భార‌త వ‌న్డే జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వ‌న్డేలో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.దీంతో అత‌డిని రెండో వ‌న్డేకు ప‌క్క‌న పెట్టాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కోహ్లి(102) కూడా శతక్కొట్టాడు.భారీ స్కోర్‌ దిశగా భారత్‌..రాయ్‌పూర్‌ వన్డేలో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 45 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(43), జడేజా(9) ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

IND vs SA 2nd ODI: Kohli Slams 50 Continuous form Scripts History10
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్‌లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్‌) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్‌పూర్‌ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్‌ నమోదు చేయగా.. సచిన్‌ టెండుల్కర్‌ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్‌మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్‌ గెలిచిన ప్రొటిస్‌ జట్టు.. తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, నాలుగో నంబర్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (22), రోహిత్‌ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్‌ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement