ప్రధాన వార్తలు
ఇంపాక్ట్గా వచ్చి ఇరగదీశాడు.. ఎవరీ సమీర్ రిజ్వీ?
'ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నాకు నచ్చదు.. అందుకు నేను బిగ్ ఫ్యాన్ కాదు'.. ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే యాదృచ్చికంగా అదే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఢిల్లీకి తొలి విజయాన్ని అందించింది. ఐపీఎల్-19వ సీజన్లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తమ మొదటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ విజయంలో యువ ఆటగాడు సమీర్ రిజ్వీది కీలక పాత్ర. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.సమీర్ సంచలనం..ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. లుంగీ ఎంగిడీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, టి. నటరాజన్ తమ బౌలింగ్తో లక్నో పతనాన్ని శాసించారు. అయితే 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ సులువుగా సాధిస్తుందని అంతా భావించారు. కానీ లక్నో తరపున అరంగేట్రం చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. ఢిల్లీ ఇన్నింగ్స్ మొదటి బంతికే కేఎల్ రాహుల్ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత దాదాపు 15 నెలల తర్వాత బరిలోకి దిగిన మొహ్సిన్ ఖాన్.. తన మొదటి ఓవర్లోనే నితీష్ రాణాను ఔట్ చేసి ఢిల్లీని బ్యాక్ఫుట్లో ఉంచాడు. ఆ ఓవర్లో కనీసం ఒక్క పరుగు కూడా అతడు ఇవ్వలేదు. అనంతరం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ తన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్తో ఒకే ఓవర్లో పాతుమ్ నిస్సంకను, అక్షర్ పటేల్ను పెవిలియన్కు పంపాడు. దీంతో ఢిల్లీ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ మేనెజ్మెంట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపింది. వాస్తవానికి ఆరంభంలో వికెట్లు పడకపోయింటే గత సీజన్లో రాణించిన అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేవాడు. కానీ త్వరగా వికెట్లు పడిపోవడంతో రిజ్వీని ఇంపాక్ట్ సబ్గా పంపాల్సి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన రిజ్వీ.. లక్నో పేసర్లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా శ్రమించాడు. అతడు తను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపి ఢిల్లీ తప్పు చేసిందా? అన్న భావన అందరిలోనూ కలిగింది. కానీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ ఆఖరి బంతికి నోకియా బౌలింగ్లో సిక్సర్ బాదిన సమీర్ రిజ్వీ.. ఆ తర్వాత మరి ఆగలేదు. ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి స్కోర్ బోర్డులో వేగం పెంచాడు. స్పిన్నర్లను ఓ ఆట ఆడుకున్నాడు. షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో 3 ఫోర్లు బాదిన సమీర్ రిజ్వీ.. ఐడైన్ మార్క్రమ్ బౌలింగ్లో 6,4 బాది 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్న రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్స్లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. దీంతో ఎవరీ సమీర్ రిజ్వీ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు.ఎవరీ సమీర్ రిజ్వీ?ఐపీఎల్-2024 మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సమీర్ రిజ్వీని రూ. 8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఒక అన్-క్యాప్డ్ ప్లేయర్ కోసం సీఎస్కే ఇంత భారీ మొత్తం వెచ్చించడం అప్పటిలో సంచలనంగా మారింది. ఐపీఎల్లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచిన రిజ్వీ.. తర్వాత తన జోరును కొనసాగించలేకపోయాడు. ఆ ఏడాది 8 మ్యాచ్లు ఆడిన రిజ్వీ కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు సీఎస్కే అతడిని విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ. 95 లక్షలకే సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం 121 పరుగులు చేశాడు. అయినప్పటికి అతడిపై నమ్మకం ఉంచిన ఢిల్లీ యాజమాన్యం తిరిగి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు మేనెజ్మెంట్ నమ్మకాన్ని రిజ్వీ నిలబెట్టుకున్నాడు.22 ఏళ్ల సమీర్ రిజ్వీ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్తో వెలుగులోకి వచ్చాడు. యూపీ టీ20 లీగ్ అరంగేట్ర సీజన్(2024)లో రిజ్వీ దుమ్ములేపాడు. కాన్పూర్ సూపర్స్టార్స్ తరపున ఆడిన రిజ్వీ.. కేవలం 49 బంతుల్లోనే 104 అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే అతడిని సీఎస్కే అంత భారీ ధరకు సొంతం చేసుకుంది. అతడిని అందరూ "రైట్ హ్యాండెడ్ సురేష్ రైనా" అని పిలుస్తారు.రైనా లాగే మిడిల్ ఓవర్లలో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడం, భారీ షాట్లు ఆడడం సమీర్ స్పెషాలిటీ. రైనా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఒక స్టార్ క్రికెటర్గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రిజ్వీ కూడా నడుస్తున్నాడు. సమీర్ రిజ్వీ ఫస్ట్ క్రికెట్లో యూపీ తరపున ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడాడు. కానీ రెడ్బాల్ క్రికెట్లో అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ లిస్ట్-ఎ, టీ20 క్రికెట్లో మాత్రం తన హవాను కొనసాగిస్తున్నాడు.చదవండి: KKR vs SRH: సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఎవరిదో తొలి విజయం!
కోల్కతా: ఐపీఎల్లో మాజీ చాంపియన్లు అయిన రెండు జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్లో నేడు జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి మ్యాచ్లలో ఓడిన నేపథ్యంలో మొదటి గెలుపుపై దృష్టి పెట్టాయి. సొంత మైదానంలో ప్రత్యరి్థకంటే కేకేఆర్దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. 201, 220... తమ మొదటి మ్యాచ్లో బెంగళూరుపై హైదరాబాద్, ముంబైపై కోల్కతా చేసిన స్కోర్లు ఇవి. అయినా సరే వాటికి ఓటమి తప్పలేదు. బౌలింగ్ బలహీనతల కారణంగా పరాజయం ఎదుర్కొన్న టీమ్లు ఎలా వ్యూహరచన చేస్తాయనేది ఆసక్తికరం. ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఇప్పటికే హైదరాబాద్ బౌలింగ్లో పస తగ్గింది. జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్, హర్‡్ష దూబే బౌలింగ్తో కోల్కతాను ఏమాత్రం నిలువరించగలరో చూడాలి. తొలి మ్యాచ్లో విఫలమైన హెడ్, అభిõÙక్ శర్మ చెలరేగితే తిరుగుండదు. ఇషాన్, క్లాసెన్ తమ ఫామ్ను ఇప్పటికే చూపించు కున్నారు. మరోవైపు కేకేఆర్ బౌలింగ్ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. వైభవ్ తేలిపోగా, ముజరబానికి తగినంత అనుభవం లేదు. వరుణ్ కూడా భారీగా పరుగులివ్వడంతో టీమ్లో ఆందోళన రేపే అంశం. బ్యాటింగ్లో రహానే, అలెన్ శుభారంభం అందించాల్సి ఉంది. ఐపీఎల్లో కోల్కతా, హైదరాబాద్ మధ్య 30 మ్యాచ్లు జరిగాయి. 20 మ్యాచ్ల్లో కోల్కతా, 10 మ్యాచ్ల్లో హైదరాబాద్ గెలిచింది. కోల్కతాపై హైదరాబాద్ అత్యధిక స్కోరు 278 కాగా, అత్యల్ప స్కోరు 113. హైదరాబాద్పై కోల్కతా అత్యధిక స్కోరు 208 కాగా, అత్యల్ప స్కోరు 101గా ఉంది.
ఢిల్లీ గెలుపు సమీరం
ఐపీఎల్లో మరో మ్యాచ్ స్వల్ప స్కోర్లతో ఉత్కంఠభరితంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్తో 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఒకదశలో 26/4తో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరకు గట్టెక్కింది. యువ ఆటగాడు సమీర్ రిజ్వీ ముందుండి నడిపించగా, ట్రిస్టన్ స్టబ్స్ అతనికి అండగా నిలిచాడు. అంతకుముందు ఢిల్లీ బౌలర్ల ముందు నిలవలేక టాప్–5లో ముగ్గురు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో లక్నో ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్ల తర్వాత ఒక టీమ్కు ‘హోం గ్రౌండ్’లో ఓటమి ఎదురైంది. లక్నో: అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ సమద్ (25 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్స్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఎన్గిడి, నటరాజన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 76 బంతుల్లో అభేద్యంగా 119 పరుగులు జోడించారు. టపటపా... మార్ష్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను మొదలు పెట్టినా... రిషభ్ పంత్ (7), మార్క్రమ్ (11) విఫలం కావడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 48/2కు చేరింది. ఆ తర్వాత బదోని (0), పూరన్ (8) కూడా విఫలమయ్యారు. కుల్దీప్ చక్కటి బంతితో మార్ష్ ను బోల్తా కొట్టించడంతో సగం ఓవర్ల లోపే లక్నో సగం వికెట్లు చేజార్చుకుంది. 23 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకుంది. ముకుల్ (14) ప్రభావం చూపలేకపోగా, ఈ స్థితిలో సమద్ ఒక్కడే కాస్త పట్టుదలగా నిలబడి కొన్ని పరుగులు సాధించాడు. అయితే నటరాజన్ ఒకే ఓవర్లో సమద్, షమీ (1)లను అవుట్ చేయగా, ఎన్గిడి తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్నో ఇన్నింగ్స్ ముగిసింది. కీలక భాగస్వామ్యం... ఛేదనలో ఢిల్లీ తడబడింది. మొదటి బంతికే కేఎల్ రాహుల్ (0) వెనుదిరగ్గా... ఐదు పరుగుల వ్యవధిలో నితీశ్ రాణా (15), నిసాంక (1), అక్షర్ పటేల్ (0) అవుటయ్యారు. 4.3 ఓవర్లకే స్కోరు 26/4 కావడంతో క్యాపిటల్స్ కష్టాలు పెరిగాయి. అయితే రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా నిలబడి 17 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. లక్నో ఏకంగా 16 వైడ్లు సహా 20 అదనపు పరుగులిచ్చి ప్రత్యర్థికి ఇతోధిక సహకారం అందించింది. రెండు సిక్సర్లతో మొదలు పెట్టి... 2024 ఐపీఎల్లో రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.8.40 కోట్లకు ఎంచుకుంది. ఈ యూపీ ఆటగాడు దూకుడైన బ్యాటింగ్తో ‘కుడిచేతి వాటం సురేశ్ రైనా’గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో తాను ఆడిన తొలి 4 బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించినా... ఐదు ఇన్నింగ్స్లలో కలిపి 51 పరుగులే చేయగలిగాడు. దాంతో చెన్నై వదులుకోగా, గత సీజన్లో ఢిల్లీ రూ.95 లక్షలకు తీసుకుంది. చివరి మ్యాచ్లో 25 బంతుల్లో 58 పరుగులతో జట్టును గెలిపించగా... ఈసారి అదే మొత్తానికి ఫ్రాంచైజీ అతడిని తమతో కొనసాగించింది. ఎట్టకేలకు జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో హీరోలా కీలకమైన హాఫ్ సెంచరీతో తన స్థాయిని పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ను కూడా రిజ్వీ తడబడుతూనే ప్రారంభించాడు. తొలి 8 బంతుల్లో అతను సింగిల్ కూడా తీయలేకపోయాడు. తొలి 13 బంతుల్లో చేసినవి 5 పరుగులే! అయితే నోర్జే బౌలింగ్లో డీప్ థర్డ్మాన్ దిశగా కొట్టిన సిక్స్తో అతని జోరు మొదలైంది. షహబాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన తర్వాత పరిస్థితికి తగినట్లుగా ఆటను మార్చుకున్నాడు. మార్క్రమ్ ఓవర్లో 6, 4 కొట్టి 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. షమీ తొలి బంతికే... ఐపీఎల్లో తొలిసారి లక్నో జట్టు తరఫున బరిలోకి దిగిన సీనియర్ పేసర్ షమీ వచ్చీ రాగానే ప్రభావం చూపించాడు. మొదటి బంతికే రాహుల్ను అతను అవుట్ చేశాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే షమీ వికెట్ తీయడం ఇది ఐదోసారి కావడం విశేషం. గతంలో ఏ బౌలర్ మూడుసార్లకు మించి ఈ ఫీట్ను నమోదు చేయలేదు.స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) స్టబ్స్ (బి) కుల్దీప్ 35; పంత్ (రనౌట్) 7; మార్క్రమ్ (బి) అక్షర్ 11; బదోని (సి) రాహుల్ (బి) నటరాజన్ 0; పూరన్ (బి) ఎన్గిడి 8; సమద్ (సి) మిల్లర్ (బి) నటరాజన్ 36; ముకుల్ (సి అండ్ బి) కుల్దీప్ 14; షహబాజ్ (నాటౌట్) 15; షమీ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 1; నోర్జే (సి) స్టబ్స్ (బి) ఎన్గిడి 0; మొహసిన్ (సి) ముకేశ్ (బి) ఎన్గిడి 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 141. వికెట్ల పతనం: 1–19, 2–48, 3–49, 4–65, 5–71, 6–105, 7–138, 8–140, 9–141, 10–141. బౌలింగ్: ముకేశ్ కుమార్ 3–0–17–0, ఎన్గిడి 3.4–0–27–3, అక్షర్ 3–0–17–1, నటరాజన్ 4–0–29–3, కుల్దీప్ 4–0–31–1, విప్రాజ్ 1–0–8–0. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) మొహసిన్ (బి) షమీ 0; నిసాంక (సి) పంత్ (బి) ప్రిన్స్ 1; నితీశ్ (సి) సమద్ (బి) మొహసిన్ 15; రిజ్వీ (నాటౌట్) 70; అక్షర్ (బి) ప్రిన్స్ 0; స్టబ్స్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 20; మొత్తం (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1–0, 2–21, 3–25, 4–26. బౌలింగ్: షమీ 4–0–28–1, ప్రిన్స్ 3–0–20–2, మొహసిన్ 4–1–19–1, నోర్జే 4–0–39–0, షహబాజ్ 1–0–16–0, మార్క్రమ్ 1–0–13–0, సమద్ 0.1–0–6–0.
లక్నో బౌలర్ల పోరాటం వృధా.. ఢిల్లీని గెలిపించిన రిజ్వి, స్టబ్స్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బ్యాటింగ్కు పెద్దగా సహకరించని పిచ్పై సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ (4-0-28-1), మొహిసిన్ ఖాన్ (4-1-19-1), ప్రిన్స్ యాదవ్ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్కే పరిమితం చేశారు. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు.
ఐపీఎల్లోనూ కొనసాగుతున్న షమీ హవా
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ హవా ఐపీఎల్లోనూ కొనసాగింది. 2026 ఎడిషన్లో లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ (ఎస్ఆర్హెచ్ నుంచి) అయిన అతను.. ఈ ఫ్రాంచైజీ తరఫున తొలి బంతికే వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న మ్యాచ్లో తొలిసారి లక్నో తరఫున బరిలోకి దిగిన షమీ.. 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు. షమీ దెబ్బకు ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గోల్డన్ డకౌటయ్యాడు.కడపటి వార్తలు అందే సరికి 142 పరుగుల ఛేదనలో ఢిల్లీ తడబడుతుంది. 8 ఓవర్లలో 53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. షమీ తన కోటాలో 3 ఓవర్లు పూర్తి చేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీపై లక్నో బౌలర్లు ముప్పేట దాడి చేస్తున్నారు. షమీ ఓ పక్క.. ప్రిన్స్ యాదవ్ (2-0-14-2), మొహిసిన్ ఖాన్ (2-1-2-1) ఎండ్ నుంచి ఢిల్లీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలంటే మరో 72 బంతుల్లో 89 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సమీర్ రిజ్వి (11), ట్రిస్టన్ స్టబ్స్ (12) ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిస్సంక (1), అక్షర్ పటేల్ (0) వికెట్లు ప్రిన్స్ యాదవ్ తీయగా.. నితీశ్ రాణాను (15) మొహిసిన్ ఖాన్ బోల్తా కొట్టించాడు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు.దేశవాలీ క్రికెట్లో షమీ హవాటీమిండియా బెర్త్ లక్ష్యంగా షమీ దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్నాడు. తాజా సీజన్లో అతను రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్ల్లో 37 వికెట్లు.. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లు తీశాడు.
IPL 2026: గ్రీన్ నుంచి పైసా వసూల్కు సిద్దమైన కేకేఆర్
ఐపీఎల్ 2026లో భాగంగా రేపు (ఏప్రిల్ 2) సన్రైజర్స్తో జరుగబోయే మ్యాచ్కు ముందు కేకేఆర్కు గుడ్ న్యూస్ అందుతుంది. ఆ జట్టు అత్యంత ఖరీదైన ఆటగాడు కెమరూన్ గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. Cameron Green has resumed bowling in nets. pic.twitter.com/YaJJPHKyky— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2026గ్రీన్ను కేకేఆర్ యాజమాన్యం ఆల్రౌండర్ కోటా రూ. 25 కోట్ల భారీ మొత్తం వచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలిసి కేకేఆర్ అభిమానులు చాలా ఫీలయ్యారు. అంత భారీ మొత్తం వెచ్చించి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఏంటని బహిరంగ విమర్శలు చేశారు.గత మ్యాచ్లో (ముంబై ఇండియన్స్) గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ను మ్యాచ్ కోల్పోయేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత గ్రీన్ జాతీయ జట్టు క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చి అతనికి మద్దతుగా నిలబడింది. గ్రీన్కు శస్త్రచికిత్స జరిగింది. అతను మరికొంతకాలం కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని సర్ద చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యానికి ముందే చెప్పామని వివరణ ఇచ్చింది. మరో 10-12 రోజుల్లో గ్రీన్ బౌలింగ్ ప్రారంభిస్తాడని ఓ ప్రకటన విడుదల చేసింది.అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఈ ప్రకటన వెలువడని రెండు రోజుల్లోనే గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ఒక రకంగా కేకేఆర్కు శుభవార్తే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయం. గ్రీన్ హడావుడిగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కేకేఆర్ యాజమాన్యం ఒత్తిడి కారణమని తెలుస్తుంది. వారు కూడా ఈ విషయంలో తమ అభిమానుల డిమాండ్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది.గ్రీన్ బౌలింగ్ విషయమై కేకేఆర్ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీ వ్యక్తిగతమే అయినా, ఇలాంటి విషయాల్లో అభిమానుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా జట్టు గెలుపు కోసమే తహతహలాడుతుంటారు కాబట్టి, ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదు.ఏదిఏమైనా గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం కేకేఆర్కు శుభపరిణామం. తొలి మ్యాచ్లో ఆ జట్టు 220 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా సరైన బౌలింగ్ వనరులు లేకపోవడం చేత దాన్ని కాపాడుకోలేకపోయింది. రేపటి సన్రైజర్స్ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేస్తే, ఆ జట్టు విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
నసీమ్ షాకు రూ.67 లక్షల ఫైన్.. పీసీబీపై యూనిస్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ క్రికెట్ బోర్డు రూ.67 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ చర్యపై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయని యూనిస్ మండిపడ్డాడు.అసలు ఏం జరిగిందంటే?మార్చి 27న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. దీన్ని నసీమ్ తప్పుపడుతూ.. ‘‘ఆమెను లార్డ్స్లో రాణిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’’ అని మరియంను ఉద్దేశించి వ్యంగ్యంగా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశాడు. వెంటనే అతడు ఆ పోస్టను తొలిగించినప్పటికి, పీసీబీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పీసీబీ క్రమశిక్షణ కమిటీ కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నసీమ్ షాకు 20 మిలియన్ల పాక్ రూపాయల జరిమానా విధించింది. ఈ క్రమంలోనే పీసీబీ నిర్ణయాన్ని యూనిస్ తప్పుబట్టాడు.నసీమ్ షా ఆ ట్వీట్కు క్షమాపణ కూడా చెప్పాడు. తన సోషల్ మీడియా మేనేజర్ పొరపాటున చేశాడని నసీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి కూడా తప్పించాడు. అలాంటప్పుడు హెచ్చరికతో వదిలేయాల్సింది. లేదంటే తక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సింది. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తాయి అని యూనిస్ పేర్కొన్నాడు.చదవండి: KKR vs SRH: సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
గొయెంకా-రాహుల్ వివాదంపై స్పందించిన షమీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య ఐపీఎల్ 2024 ఎడిషన్లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.వివాదం నేపథ్యంఐపీఎల్ 2024 ఎడిషన్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్ రాహుల్ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్ను అలా పబ్లిక్గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.ఎల్ఎస్జీలోకి షమీఐపీఎల్ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2013లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జీ ఇవాళ (ఏప్రిల్ 1) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitalsతో తలపడుతుంది. ఈ మ్యాచ్తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు.
సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి పాలైన సన్రైజర్స్.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ పరంగా ఎంత పటిష్టంగా ఉందో, బౌలింగ్ పరంగా అంతే బలహీనంగా కన్పిస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.అంతేకాకుండా కొత్తగా జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ డేవిడ్ పేయిన్, గత సీజన్లో అదరగొట్టిన ఎషాన్ మలింగ సైతం విఫలమయ్యారు. దీంతో కేకేఆర్తో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.డేవిడ్ పేయిన్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి తొలి మ్యాచ్లోనే కార్స్ ఆడాల్సి ఉండేది. కానీ ప్రాక్టీస్ సెషన్లో చిన్నపాటి గాయం కారణంగా అతడు మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అదేవిధంగా హర్ష్ దూబే స్ధానంలో జీషాన్ అన్సారీని ఆడించాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు మరోసారి నిరాశే ఎదరయ్యే అవకాశముంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో లివింగ్స్టోన్కు చోటు దక్కడం లేదు. ఒకవేళ లివింగ్స్టోన్ ఆడించాలంటే ఎషాన్ మలింగ లేదా పేయిన్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఎవరూ ఉండరు. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అంత భారీ ధర చెల్లించినప్పటికి అతడిని ఎస్ఆర్హెచ్ ఉపయోగించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్,ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీఇంపాక్ట్ ప్లేయర్: పేయిన్/ ఎషాన్ మలింగచదవండి: ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్కు సహకరించని పిచ్పై సమీర్ రిజ్వి (70 నాటౌట్) అద్బుతంగా ఆది ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) సహకరించాడు. లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసిన ప్రిన్స్4.3వ ఓవర్- ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. తొలుత నిస్సంకను ఔట్ చేసిన అతను.. ఆతర్వాత అక్షర్ పటేల్ను (0) కూడా పెవిలియన్కు పంపాడు. మూడో వికెట్ డౌన్4.2వ ఓవర్-25 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (1) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ3.3వ ఓవర్- 21 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది.మొహిసిన్ ఖాన్ బౌలింగ్లో అబ్దుల్ సమద్కు క్యాచ్ ఇచ్చి నితీశ్ రాణా (15) ఔటయ్యాడు.తొలి బంతికే వికెట్ తీసిన షమీ142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. లక్నో తరఫున తొలి బంతికే షమీ వికెట్ తీశాడు. చెలరేగిన ఢిల్లీ బౌలర్లు.. 141 పరుగులకే కుప్పకూలిన లక్నోటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే కుప్పకూలింది. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు. ఆరో వికెట్ కోల్పోయిన లక్నో13.1వ ఓవర్- 105 పరుగుల వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ముకుల్ ఛౌదరిని (14) కుల్దీప్ యాదవ్ క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు.పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ట్రస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ ...
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ...
సూపర్ సబలెంకా
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప...
ఆంటోనెల్లి మళ్లీ...
సుజుకా: ఇటలీ టీనేజర్ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ముల...
నసీమ్ షాకు రూ.67 లక్షల ఫైన్.. పీసీబీపై యూనిస్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ క్రికెట్...
గొయెంకా-రాహుల్ వివాదంపై స్పందించిన షమీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, ఆ ...
సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ త...
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపులక్నోపై ఢిల్లీ క...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో RCBతో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ
