ప్రధాన వార్తలు
'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'
సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన స్ట్రైక్రేట్పై వస్తున్న విమర్శలకు క్లాసెన్ గట్టిగానే బదులిచ్చాడు. తన పని బ్యాటింగ్ చేయడం మాత్రమేనని, స్ట్రైక్రేట్ ఇతర విషయాలు పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. అయితే స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ఐపీఎల్ 2026 సీజన్లో ఆరు మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించిన క్లాసెస్ ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే సీఎస్కేతో మ్యాచ్ అనంతరం క్లాసెన్ మాట్లాడాడు. 'నా పని బ్యాటింగ్ చేయడమే. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వ ర్తిస్తున్నా. అయితే ఈ సీజన్లో నా స్ట్రైక్రేట్ విషయంలో విమర్శలు వస్తున్న సంగతి నాకు తెలుసు. కానీ నా బ్యాటింగ్తో జట్టుకు ఎంత ఉపయోగపడుతున్నాననేదే నాకు ముఖ్యం. స్ట్రైక్రేట్పై చింత లేదు. ఎందుకంటే క్రీజులో కుదురుకుంటేనే పరుగుల వస్తాయి. అంతేకానీ కేవలం స్ట్రైక్రేట్పైనే దృష్టి సారిస్తే పరుగులు చేయడం సంగతి అటుంచితే జట్టుకు నష్టం చేకూరుతుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతానే తప్ప ప్రతీసారి బ్యాట్ నుంచి మెరుపులు రావాలంటే కష్టమే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాలి. ఆ పనిని నేను సరిగ్గానే చేస్తున్నా. ఇక కేప్టౌన్లోని ఐ జిమ్లో కండ్లకు సంబంధించి నేను తీసుకున్న శిక్షణ ఒత్తిడిని దూరం చేసింది. కేవలం రోజు 10 నిమిషాల పాటు క్రమం తప్పకుండా శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగపడింది.' అని చెప్పుకొచ్చాడు. సీజన్లో భాగంగా ఎస్ఆర్హెచ్ మూడో విజయాన్ని నమోదు చేసకుంది. శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్, క్లాసెన్లు అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులకు పరిమితమైంది. మూడు విజయాలతో పట్టికలో నాలుగో స్థానానికి చేరిన ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 21న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. శనివారం (ఏప్రిల్ 18) చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ది కీలక పాత్ర. తన 34వ పుట్టినరోజున రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 57 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు తన పుట్టినరోజున హాఫ్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.గతంలో 2021 సీజన్లో (29వ పుట్టినరోజున) పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఢిల్లీపై హాఫ్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు తన బర్త్డే రోజున హాఫ్ సెంచరీ సాధించడంతో ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడిన రాహుల్.. 168 పరుగులు సాధించాడు.ఐపీఎల్లో పుట్టిన రోజున అర్ద సెంచరీ చేసిన ఆటగాళ్లుమైక్ హస్పీడేవిడ్ వార్నర్కేఎల్ రాహుల్(రెండు సార్లు)
బుడ్డోడి వికెట్తో మిస్టరీ స్పిన్నర్ అరుదైన రికార్డు!
టీ20 క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ వరుణ్ చక్రవర్తి మరో రికార్డు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడం ద్వారా ఈ మిస్టరీ స్పిన్నర్ తన ఖాతాలో 200వ వికెట్ జమ చేసుకున్నాడు. కాగా టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి వరుణ్ చక్రవర్తి 155 మ్యాచ్లు తీసుకున్నాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మార్క్ను చేరుకున్న రెండో భారత బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ (151 మ్యాచ్లు ఉన్నాడు. 2019లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి తొలుత పంజాబ్ కింగ్స్కు ఆడాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన ఈ మిస్టరీ స్పిన్నర్ అప్పటి నుంచి అదే జట్టులో కొనసాగుతున్నాడు. అయితే వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లోనే గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేకేఆర్ తరఫున వంద వికెట్లు సాధించాడు. కేకేఆర్ తరఫున వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గా నిలిచాడు. గతంలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్లు ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో 89 మ్యాచ్ల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా తరఫున వరుణ్ చక్రవర్తి 45 టీ20ల్లో 73 వికెట్లు పడగొట్టాడు. రెండుసార్లు ఐదు వికెట్ల హాల్ను అందుకున్నాడు.WICKET x 2️⃣!🎥 Spinners spinning #KKR back into the contest ☝️☝️Updates ▶️ https://t.co/776nTdPbPj#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/TyU5HsJuGv— IndianPremierLeague (@IPL) April 19, 2026 చదవండి: తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్!
సూర్యకుమార్పై వేటు..! టీమిండియా కెప్టెన్గా విధ్వంసకర ప్లేయర్?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటు పడనుందా? అంటే అవునానే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సారథిగా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించిన సూర్య.. బ్యాటర్గా మాత్రం అతడి ప్రదర్శన రోజు రోజుకు దిగజారుతోంది. దాదాపు ఏడాది పాటు టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ కొనసాగిన సూర్యకుమార్.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మాత్రం బ్యాటర్గా అతడు విఫలమవవుతున్నాడు.గతేడాది దాదాపు 25కు పైగా టీ20లు ఆడిన సూర్య కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్పై పడుతున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028తో పాటు తదుపరి రెండు టీ20 ప్రపంచకప్లను దృష్టిలో ఉంచుకొని బోర్డు జట్టును సిద్దం చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో సూర్య స్ధానంలో మరో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించేందుకు భారత క్రికెట్ బోర్డు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20ల్లో నంబర్ 4 స్థానానికి అయ్యర్ సరైన ప్రత్యామ్నాయమని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.శ్రేయస్ అయ్యర్కు బంపరాఫర్!శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు జాతీయ జట్టుకు సారథ్యం వహించనప్పటికి.. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది. శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్-2024 సీజన్లో కేకేఆర్ను అయ్యర్ ఛాంపియన్గా నిలిపాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలోని పంజాబ్ జట్టు అద్భుత విజయాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా శ్రేయస్ డొమాస్టిక్ క్రికెట్లో కూడా ముంబై జట్టుకు ఎన్నో సంచలన విజయాలను అయ్యర్ అందించాడు. దీంతో అయ్యర్కు జాతీయ జట్టును నడిపించే సత్తా కూడా ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.అయ్యర్ చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుత టీ20 సెటప్లో అతడు లేడు. కానీ అతడిని తిరిగి తీసుకొచ్చి నేరుగా కెప్టెన్సీ ఇచ్చే అవకాశముందని బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి.అయ్యర్ ప్రస్తుతం కేవలం వన్డే జట్టులో మాత్రమే భాగంగా ఉన్నాడు. అయితే శ్రేయస్ పొట్టి క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. కాబట్టి అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ లైవ్ అప్డేట్స్
IPL 2026 KKR vs RR Live updates: ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి.కేకేఆర్ ఐదో వికెట్ డౌన్70 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పావెల్.. జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి 54 బంతుల్లో 82 పరుగులు కావాలి. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 74/5కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన రఘువంశీ.. రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు.కేకేఆర్ మూడో వికెట్ డౌన్37 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్.. రవి బిష్ణయ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు.కేకేఆర్ రెండో వికెట్ డౌన్కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానే(0) మరోసారి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్రాజస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో టిమ్ సీఫెర్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.చెలరేగిన కేకేఆర్ బౌలర్లు.. రాజస్తాన్ స్కోరెంతంటే?ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(46) టాప్ స్కోరర్గా నిలవగా.. జైశ్వాల్(39) రాణించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.ఒకే ఓవర్లో మూడు వికెట్లు18 ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి బౌలింగ్లో రాజస్తాన్ రాయల్స్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత రవీంద్ర జడేజా(9), షిమ్రాన్ హెట్మైర్(15), బిష్ణోయ్(0) ఔటయ్యాడు.రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్124 పరుగుల వద్ద రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఫెరీరా.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్117 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్ హెట్మైర్ వచ్చాడు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 109/3రాజస్తాన్ రెండో వికెట్ డౌన్97 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ధ్రువ్ జురుల్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్81 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు.6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 63/06 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38), యశస్వి జైశ్వాల్(21) ఉన్నారు.3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 20/03 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(11), యశస్వి జైశ్వాల్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్మైర్, బ్రిజేష్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. కేకేఆర్ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్ : అజింక్యా రహానే(కెప్టెన్), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తిఇంపాక్ట్ సబ్లు: మనీష్ పాండే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, నవదీప్ సైనీరాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ఇంపాక్ట్ సబ్స్: సందీప్ శర్మ, శుభమ్ దూబే, లువాన్-డ్రే ప్రిటోరియస్, రవి సింగ్, యష్ పుంజా
చరిత్ర సృష్టించిన అభిషేక్.. సరికొత్త ప్రపంచ రికార్డు
ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గా అభిషేక్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే.తాజాగా అభిషేక్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్లో ఇది అత్యంత వేగవంతమైనది. ఈ ఇన్నింగ్స్లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సీఎస్కేపై సన్రైజర్స్ గెలుపొందింది.అభిషేక్ ఇచ్చిన మెరుపు ఆరంభం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు గట్టి పునాది వేసింది. అతను అర్ద సెంచరీ తర్వాత ఔటైనా క్లాసెన్ స్కోర్ను 200 మార్కు దగ్గరికి (194-9) తీసుకెళ్లాడు. అనంతరం ఛేదనలో సగం మ్యాచ్ వరకు గెలుపు దిశగా సాగిన సీఎస్కే, ఆతర్వాత ఎస్ఆర్హెచ్ బౌలర్లు చెలరేగడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి, 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.ఈ మ్యాచ్లో అభిషేక్ చేసిన హాఫ్ సెంచరీకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15). ఇదే ఇన్నింగ్స్తో అభిషేక్ ఐపీఎల్లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్ (1120 బంతులు) తర్వాతి స్థానంలో నిలిచాడు.
సన్రైజర్స్ మ్యాచ్లో బ్లాక్ మ్యాజిక్..! అందుకే సీఎస్కే ఓడిపోయింది?
ఐపీఎల్-2026 సన్రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది. శనివారం ఉప్పల్ మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ గెలుపొందింది. ఈ విజయంతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానానికి చేరుకుంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది.అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే.. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. సీఎస్కే బ్యాటర్ దూబే క్రీజులో ఉన్నప్పుడు గ్యాలరీలో ఉన్న ఒక ఎస్ఆర్హెచ్ అభిమాని నిమ్మకాయ చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చదువుతున్నట్లు కెమెరా కంటికి చిక్కాడు.వెంటనే శివమ్ దూబే.. సాకిబ్ హుస్సేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సదరు అభిమాని సంబరాల్లో మునిగితేలిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొంతమంది మంత్రాలకు చింతకాయలు రాలవంటూ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంఘటనపై సీఎస్కే యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.చదవండి: BCCI: అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయంpic.twitter.com/u3BSpB3sXa— gocvideo (@gocvideo) April 19, 2026
అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ చైర్మెన్గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు సిద్దమైంది. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం అగార్కర్ తన పదవిలో వన్డే వరల్డ్కప్-2027 వరకు కొనసాగనున్నాడు. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ ఈ ఏడాది చివర్లలో ముగియాల్సి ఉంది.కానీ వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్కప్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెలక్టర్గా అగార్కర్నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఈ ముంబైకర్ బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా 2023 జూలైలో బాధ్యతలు చేపట్టగా.. అప్పటి నుంచి భారత జట్టు వైట్-బాల్ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది.అతడి నేతృత్వంలో భారత్ మూడు ప్రధాన ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకుంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్(2024, 2026)లతో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. ఈ కారణాలతో అతడి కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు."అగార్కర్ హయంలో భారత జట్టు చారిత్రత్మక విజయాలను అందుకుంది. అతడి నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. జట్టులో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అతడి పని తీరు పట్ల బోర్డు సంతృప్తిగా ఉంది. అగార్కర్నే చైర్మెన్ కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. ఐపీఎల్-2026 సందర్భంగా బీసీసీఐ కార్యవర్గ సభ్యులు సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు" అని సదరు అధికారి ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.చదవండి: ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్
మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో పేలవ ఫామ్లో ఉన్న అతను.. విలేకరుల నుంచి రిటైర్మెంట్పై ఎదురైన ప్రశ్నలపై స్పందిస్తూ, తానెప్పుడు దానికి రెడీ అంటూ ఆసక్తికర సమాధానం చెప్పాడు.ఈ పీఎస్ఎల్ సీజన్లో కొత్త ఫ్రాంచైజీ రావల్పిండ్జ్కు సారథ్యం వహిస్తున్న రిజ్వాన్.. కెప్టెన్గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాల మధ్య పీఎస్ఎల్లోకి అడుగుపెట్టిన రావల్పిండ్జ్ ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగానూ నిలిచింది.రిజ్వాన్ ఈ సీజన్లో ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తాజాగా లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓటమి అనంతరం విలేకరులు రిజ్వాన్ రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. అవును నా ప్రదర్శన బాగా లేదు. ఇందుకు అంగీకరిస్తాను. నేను విమర్శలకు భయపడను. ప్రజలు నేను రిటైరవ్వాలనుకుంటే తప్పక వైదొలుగుతాను. ఈ విషయాన్ని గతంలోనూ చాలా సార్లు చెప్పాను. నేను ప్రశ్నలకు గానీ, మీడియాకు కానీ భయపడను. నా లోపం ఉంటే తప్పక అంగీకరిస్తానని అన్నాడు.కాగా, రిజ్వాన్ పీఎస్ఎల్లోనే కాక అంతర్జాతీయ స్థాయిలో సైతం గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ కారణంగా అతను టీ20 జట్టులో చోటును కూడా కోల్పోయాడు. విదేశీ లీగ్ల్లో సైతం తేలిపోతున్నాడు. రిజ్వాన్ పీఎస్ఎల్లో కెప్టెన్గా గత 17 మ్యాచ్ల్లో 16 మ్యాచ్లు ఓడిపోయాడు.
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ
ఐపీఎల్ 2026లో సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న (ఏప్రిల్ 18) ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన (hamstring tear) యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే సీజన్ మొత్తానికి దూరమయ్యాడని తెలుస్తుంది. మాత్రే గాయంపై ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ అధికారక ప్రకటన చేశాడు. మాత్రే గాయం చాలా తీవ్రమైందని ఆయన ధృవీకరించాడు. హస్సీ ప్రకటనతో మాత్రే సీజన్ మొత్తానికి దూరమవుతున్న విషయం స్పష్టమవుతుంది.ఈ సీజన్లో మాత్రే అద్భుతమైన టచ్లో ఉన్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తనవంతు కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వర్తించాడు. సీఎస్కే సాధించిన రెండు విజయాల్లోనూ తనదైన పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో అతను జట్టుకు దూరం కావడం సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనే మాత్రే చాలా ఇబ్బందిపడుతూ బ్యాటింగ్ చేశాడు.మాత్రే గాయం తీవ్రత స్కానింగ్స్లో తెలుస్తుంది. ఈ సీజన్లో మాత్రే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 178 స్ట్రయిక్రేట్తో 201 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ద సెంచరీలు, రెండు 30 ప్లస్ స్కోర్లు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో మాత్రే స్థానాన్ని ఉర్విల్ పటేల్తో భర్తీ చేసే అవకాశం ఉంది. మాత్రే గాయం సీఎస్కే గాయాల జాబితాను మరింత పెద్దది చేసింది. ఇప్పటికే ధోని, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్ ఈ జాబితాలో ఉన్నారు.నిన్నటి ఎస్ఆర్హెచ్-సీఎస్కే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో సీఎస్కే 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. హ్యాట్రిక్ పరాజయాలు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్కేకు ఎదురైన మరో పరాజయం ఇది. వాస్తవానికి ఈ మ్యాచ్లో సీఎస్కే గెలవాల్సింది. అయితే ఆ జట్టు చేజేతులా ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంది. తొలుత బౌలింగ్లో సన్రైజర్స్ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేసిన సీఎస్కే బౌలర్లు.. ఆతర్వాత ఛేదనలో సగం వరకు మ్యాచ్పై పట్టు నిలుపుకున్నారు. అయితే అనూహ్యంగా సన్రైజర్స్ బౌలర్లు మ్యాచ్పై పట్టుబిగించి సీఎస్కే గెలుపును అడ్డుకున్నారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ (3-0-22-3), జేమీ ఓవర్టన్ (4-0-37-3), ముకేశ్ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్ సింగ్ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2) సీఎస్కేకు అడ్డుకట్ట వేశారు. వీరి ధాటికి సీఎస్కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.
సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్కు చెం...
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు...
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంప...
అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
ఉసేన్ బోల్ట్.. ఈ పేరు చెప్పగానే రేసింగ్ ట్రాక్ మీద...
అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. సీనియర్ మెన...
మహ్మద్ రిజ్వాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ మహ్మద్...
సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ
ఐపీఎల్ 2026లో సీఎస్కేకు కోలుకోలేని దెబ్బ తగిలింద...
సీఎస్కే ఫ్యాన్స్ నోళ్లు మూయించిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జ...
క్రీడలు
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
హైదరాబాద్ లో వైభవ్ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్ (ఫొటోలు)
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
వీడియోలు
కలిసిరాని గ్రీన్ జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
నాకు ఫీల్డింగ్ పెట్టడం రాదు అంతా రోహితే చూసుకునేవాడు..
ముంబై పతనం: రోహిత్ నుంచి బుమ్రా వరకు.పాండ్య బలుపే కారణమా..?
హార్దిక్ ఇక చాలు..! కెప్టెన్సీ అతడికి అప్పగించేయ్
మళ్లీ అదే కథ! పరాజయాల వైపు KKR
టైగర్ కి టైం వచ్చింది.. సూర్యకి టైం దగ్గర పడింది
కెలికి మరి చితకొట్టించుకున్నారు, ముంబైను చీల్చిచెండాడిన శ్రీయస్ అయ్యర్..
శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు
ముంబై చిత్తు.. పంజాబ్ ఘనవిజయం..
15ఏళ్లుగా ధోనీకి సాధ్యం కాని రికార్డును మూడు మ్యాచుల్లో లేపేసాడు
