Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Chahal RJ Mahvash unfollow each other I Dont Trust People Post Viral1
ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్‌.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్‌కానీ అంతకంటే ముందు నుంచే చహల్‌.. ఆర్జే మహ్‌వశ్‌ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్‌ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్‌ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్‌- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్‌వశ్‌పై దృష్టి సారించారు. చహల్‌ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్‌ చేస్తూ మహ్‌వశ్‌ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్‌’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్‌ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్‌ చేసి రూమర్స్‌ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పు​కొచ్చాడు.ఒకరినొకరు అన్‌ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్‌వశ్‌ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్‌ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్‌- మహ్‌వశ్‌ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్‌ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్‌ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్‌ షేర్‌ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

ETPL Officially sanctioned by ICC Waugh Maxwell franchise owners2
పచ్చజెండా ఊపిన ఐసీసీ

టీ20 క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌’ (ఈటీపీఎల్‌) పేరుతో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్‌ గ్లోబల్‌’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్‌ బచ్చన్‌ సైతంప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్‌ గ్లోబల్‌’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌ వా ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్‌ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్‌ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్‌బర్గ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు నాథన్‌ మెకల్లమ్, కైల్‌ మిల్స్‌ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్‌ఫాస్ట్‌ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్‌ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్‌ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్‌ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

IPL 2026 schedule Delayed BCCI seeks clarity on RCB, RR venues3
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్‌ షెడ్యూల్‌: రాజీవ్‌ శుక్లా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్‌ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్‌ రూపొందించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్‌’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్‌ విడుదల‘ఐపీఎల్‌ షెడ్యూల్‌ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్‌ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్‌ జట్లకు తమ ‘హోమ్‌ గ్రౌండ్‌’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేస్తాం’ అని రాజీవ్‌ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Miracle: Bangladesh Cricket Board Chief Reacts ICC Rejecting T20 WC Request4
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్‌

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్‌ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్‌ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్‌ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్‌ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్‌ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్‌ కప్‌ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ జట్టును బంగ్లాదేశ్‌ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్‌ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్‌ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్‌ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్‌ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్‌ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్‌ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్‌ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్‌ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్‌ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్‌ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్‌ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్‌-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌

IND vs NZ 1st T20I: Abhishek Sharma 22 Ball Fifty Shatters World Record5
అభిషేక్‌ శర్మ ప్రపంచ రికార్డు

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్‌ మీద ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఫిల్‌ సాల్ట్‌ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్‌ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌- న్యూజిలాండ్‌ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్‌పూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్‌ సోధి బౌలింగ్‌లో జెమీషన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అభిషేక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్‌ (20 బంతుల్లో 44 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్‌ 238 పరుగులు సాధించింది.కివీస్‌ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్‌ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్‌ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్‌ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్‌ సాల్ట్‌- ఏడుసార్లు🏏సూర్యకుమార్‌ యాదవ్‌- ఏడుసార్లు🏏ఎవిన్‌ లూయీస్‌- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026

KKR appoints Dishant Yagnik as fielding coach6
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా యాజ్ఞిక్‌

కోల్‌కతా: వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దిశాంత్‌ యాజ్ఞిక్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించుకుంది. దేశవాళీలతో పాటు... ఐపీఎల్‌ అనుభవం ఉన్న ఈ రాజస్తాన్‌ ప్లేయర్‌ రాకతో తమ శిక్షణ బృందం బలం మరింత పెరుగుతుందని కేకేఆర్‌ యాజమాన్యం భావిస్తోంది. ‘యాజ్ఞిక్‌కు అపార అనుభవం ఉంది. అది జట్టుకు ఉపకరించనుంది. ఈసారి ఐపీఎల్‌కు కొత్త సపోర్టింగ్‌ స్టాఫ్‌తో బరిలోకి దిగనున్నాం. హెడ్‌ కోచ్‌గా అభిషేక్‌ నాయర్, మెంటార్‌గా డ్వేన్‌ బ్రావో, అసిస్టెంట్‌ కోచ్‌గా షేన్‌ వాట్సన్, బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌతీ, పవర్‌ కోచ్‌గా ఆండ్రీ రసెల్‌ వ్యవరిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో యాజ్ఞిక్‌ చేరుతున్నాడు. అతడి కోచింగ్‌ జర్నీలో ఇది ప్రత్యేకంగా నిలవడం ఖాయం’ అని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీల్లో రాజస్తాన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యాజ్ఞిక్‌... 2011 నుంచి 2014 మధ్య 25 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం వివిధ జట్లకు శిక్షణనిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 26 నుంచి మే 31 వరకు జరగనుంది.

IND vs NZ 1st T20I: Axar Patel goes off the field due to finger injury7
టీమిండియాకు భారీ షాక్‌

టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో అక్ష‌ర్ గాయ‌ప‌డ్డాడు.కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవ‌ర్ వేసిన అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్ర‌మంలో అక్ష‌ర్ చేతి వేలికి గాయ‌మైంది. బంతి బ‌లంగా త‌గ‌ల‌డంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత‌డు తీవ్ర‌మైన నొప్పి కార‌ణంగా ఓవ‌ర్ మ‌ధ్య‌లోనే మైదానాన్ని వీడాడు.మిగిలిన ఓవ‌ర్‌ను అభిషేక్ శ‌ర్మ పూర్తి చేశాడు. అత‌డి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. అయితే అక్ష‌ర్ గాయం తీవ్ర‌మైన‌ది కాన‌ట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్ర‌మే చిట్లడం వ‌ల్ల ర‌క్త స్ర‌వ‌మైంద‌ని ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కానీ శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్‌(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: అటు గిల్‌... ఇటు జడేజా

The second phase of the Ranji Trophy matches begins today8
అటు గిల్‌... ఇటు జడేజా

రాజ్‌కోట్‌: రెండు నెలల విరామం అనంతరం దేశవాళీ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఒకవైపు భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడుతుండగా... ఈ ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని టాప్‌ ఆటగాళ్లందరూ రంజీ ట్రోఫీలో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌... పంజాబ్‌ జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సిరాజ్‌ హైదరాబాద్‌ జట్టును నడిపించనున్నాడు. వీరితో పాటు కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇలా పలువురు టీమిండియా ప్లేయర్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. నవంబర్‌ రెండో వారంలో చివరగా రంజీ మ్యాచ్‌లు జరగగా... రెండో అంచె పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజీ ట్రోఫీకి విరామం ఇచ్చిన సమయంలో ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీ, విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ జరిగాయి. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మాజీ విజేత విదర్భతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అనంతపురం వేదిక కానుంది. తొలి అంచె పోటీల్లో 5 మ్యాచ్‌లాడిన ఆంధ్ర జట్టు 3 విజయాలు, 2 ‘డ్రా’లతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. విదర్భ 25 పాయింట్లతో ‘టాప్‌’లో కొనసాగుతోంది. మొత్తం 32 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా... ఇప్పటి వరకు ఒక్కో జట్లు ఐదేసి మ్యాచ్‌లు ఆడాయి. ఇక లీగ్‌ దశలో రెండేసి మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉండగా... ఒక్కో గ్రూప్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర, విదర్భ పోరు మరింత ఆసక్తి రేపుతోంది. న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. శ్రీకర్‌ భరత్, రికీ భుయ్, షేక్‌ రషీద్‌లతో ఆంధ్ర జట్టు బలంగా ఉండగా... విదర్భ జట్టు ఇటీవలే విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ నెగ్గి ఫుల్‌ జోష్‌లో ఉంది. సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా వన్డే సిరీస్‌ కోల్పోగా... ఆ వెంటనే శుబ్‌మన్‌ గిల్‌ పంజాబ్‌ జట్టుతో చేరాడు. నేటి నుంచి సౌరాష్ట్రతో జరగనున్న గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో గిల్‌ పంజాబ్‌ జట్టును నడిపించనున్నాడు. మరోవైపు సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. కర్ణాటక తరఫున కేఎల్‌ రాహుల్, బెంగాల్‌ తరఫున మొహమ్మద్‌ షమీ కూడా మ్యాచ్‌లకు సిద్ధమయ్యారు.

Srikanth won a hard fought match in the first round of the Indonesia Masters9
శ్రమించి గెలిచిన శ్రీకాంత్‌

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్, ప్రస్తుత భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమించగా... హెచ్‌ఎస్‌ ప్రణయ్, కిరణ్‌ జార్జి, ఆయుశ్‌ శెట్టి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ప్రపంచ 24వ ర్యాంకర్‌ కోకి వతనాబె (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–15, 21–23, 24–22తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో 20–21 స్కోరు వద్ద శ్రీకాంత్‌ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన శ్రీకాంత్‌ స్కోరును 21–21తో సమం చేశాడు. ఆ తర్వాత మళ్లీ స్కోరు 22–22తో సమమైంది. ఈ దశలో శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి 24–22తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2017లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తర్వాత శ్రీకాంత్‌ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 68 నిమిషాల్లో 21–13, 16–21, 21–14తో వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 19–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, కిరణ్‌ జార్జి 17–21, 14–21తో మో జకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో, ఆయుశ్‌ శెట్టి 8–21, 13–21తో అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. సింధు శుభారంభం మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ పీవీ సింధు, రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోగా... తన్వీ శర్మ, మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. తొలి రౌండ్‌లో సింధు 53 నిమిషాల్లో 22–20, 21–18తో మనామి సిజు (జపాన్‌)పై, అన్‌మోల్‌ 21–16, 21–17తో పాయ్‌ యి పో (చైనీస్‌ తైపీ)పై గెలుపొందారు. తన్వీ శర్మ 21–18, 18–21, 16–21తో టొమోకా మియజకి (జపాన్‌) చేతిలో, మాళవిక 21–23, 12–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో, ఆకర్షి 21–8, 20–22, 17–21తో జూలీ జేకబ్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం పాలయ్యారు. రుత్విక జోడీ ఓటమి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌)... తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి. రుత్విక–రోహన్‌ ద్వయం 9–21, 20–22తో థోమ్‌ గికెల్‌–డెల్ఫిన్‌ డెల్‌ర్యూ (ఫ్రాన్స్‌) జంట చేతిలో... తనీషా–ధ్రువ్‌ జంట 23–21, 20–22, 6–21తో జూలియన్‌ మాయో–లీ పలెర్మో (ఫ్రాన్స్‌) ద్వయం చేతిలో ఓటమి చవిచూశాయి.

Carlos Alcaraz advances to the third round of the Australian Open10
అల్‌కరాజ్‌ ముందంజ...

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ అల్‌కరాజ్‌ 7–6 (7/4), 6–3, 6–2తో యానిక్‌ హాంఫ్‌మన్‌ (జర్మనీ)పై గెలిచాడు. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ స్టార్‌ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సర్వీస్‌లో 71 పాయింట్లకు 49... రెండో సర్వీస్‌లో 40 పాయింట్లకు 24 సాధించాడు. 41 విన్నర్స్‌ కొట్టిన అతను 30 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇప్పటికే ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన అల్‌కరాజ్‌... ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ కూడా సాధిస్తే ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ పూర్తి చేసుకుంటాడు. మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆరో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా), పదో సీడ్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (కజకిస్తాన్‌), 11వ సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా), 13వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌లో జ్వెరెవ్‌ 6–3, 4–6, 6–3, 6–4తో అలెగ్జాండర్‌ ముల్లర్‌ (ఫ్రాన్స్‌)పై, డిమినార్‌ 6–7 (5/7), 6–2, 6–2, 6–1తో హమాద్‌ మెజెదోవిచ్‌ (సెర్బియా)పై, బుబ్లిక్‌ 7–5, 6–4, 7–5తో ఫుచువోచిస్‌ (హంగేరి)పై, మెద్వెదెవ్‌ 6–7 (9/11), 6–3, 6–4, 6–2తో క్వెంటిన్‌ హేలిస్‌ (ఫ్రాన్స్‌)పై, రుబ్లెవ్‌ 6–4, 6–3, 4–6, 7–5తో క్వాలిఫయర్‌ జేమీ ఫారియా (పోర్చుగల్‌)పై విజయం సాధించారు.ఇతర మ్యాచ్‌ల్లో 14వ సీడ్‌ డేవిడోవిచ్‌ ఫోకినా (స్పెయిన్‌) 6–3, 7–6 (7/3), 5–7, 4–6, 6–4తో రీలీ ఒపెల్కా (అమెరికా)పై, 19వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 6–3, 6–4, 6–2తో టిరాన్‌టి (అర్జెంటీనా)పై నెగ్గారు. సబలెంకా సాఫీగా... మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండుసార్లు చాంపియన్, టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 72 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సబలెంకా 6–3, 6–1తో జావోజువాన్‌ బాయ్‌ (చైనా)పై గెలిచింది. మూడో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా), ఏడో సీడ్‌ జాస్మిన్‌ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా), 12వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) కూడా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో కోకో గాఫ్‌ 6–2, 6–2తో ఓల్గా డానిలోవిచ్‌ (సెర్బియా)పై, పావోలిని 6–2, 6–3తో మగ్ధలీనా ఫ్రీచ్‌ (పోలాండ్‌)పై, మిరా ఆంద్రీవా 6–0, 6–4తో మరియా సాకరి (గ్రీస్‌)పై, స్వితోలినా 7–5, 6–1తో లిండా క్లిమోవికోవా (పోలాండ్‌)పై గెలుపొందారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement