Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Irfan Pathan Surprise Pick Team India T20I star for 2027 ODI WC plans1
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!

టీమిండియా టీ20 ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌.1199 పరుగులుఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్‌ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్‌ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్‌ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్‌ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్‌ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్‌- గిల్‌ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్‌ గిల్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్‌ విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈసారి కూడా హాట్‌ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్‌ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Bangladesh Wont Play T20 WC In India After ICC Rejects Request2
ICC: మా తుది నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్‌ సంచలన ప్రకటన

బంగ్లాదేశ్‌ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.శ్రీలంకకు మార్చాలని కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్‌ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్‌ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీమరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్‌ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.నమ్మకాన్ని కోల్పోవడం లేదుఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.కచ్చితంగా ఐసీసీ వైఫల్యమేఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్‌ నిర్ణయాలు తీసుకున్నారు.ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్‌ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Ranji Trophy 2026 Pun Vs Saur: Jadeja Fails Gill 2 ball Duck Fans Reacts3
శుబ్‌మన్‌ గిల్‌ ఫెయిల్‌.. జడ్డూ విఫలమైనా..

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడాడు గిల్‌. అనంతరం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో బిజీ అయ్యాడు.ఈ సిరీస్‌లో గిల్‌ సేన కివీస్‌ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్‌ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్‌ కెప్టెన్‌గా రంజీ సెకండ్‌ లీగ్‌ బరిలో దిగాడు.పంజాబ్‌ తొలుత బౌలింగ్‌రాజ్‌కోట్‌ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్‌ సింగ్‌ రెండు, సన్వీర్‌ సింగ్‌, ప్రేరిత్‌ దత్తా చెరో వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ అయింది.జడ్డూ విఫలంసౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ జై గోహిల్‌ 82 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. ప్రేరక్‌ మన్కడ్‌ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్‌, కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ దెబ్బకు పంజాబ్‌ ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.అయితే, మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉదయ్‌ సహారన్‌ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ నేహాల్‌ వధేరా (6)ను పార్థ్‌ భూట్‌ అవుట్‌ చేశాడు.గిల్‌ డకౌట్‌ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ను సైతం పార్థ్‌ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్‌ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ (LBW)గా పెవిలియన్‌ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్‌కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్‌ తరఫున గిల్‌ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.పంజాబ్‌ ఆలౌట్‌.. సౌరాష్ట్రకుకు ఆధిక్యంకాగా పంజాబ్‌ తరఫున ప్రభ్‌సిమ్రన్‌ (44), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్‌ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్‌ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్‌లో మాత్రం ఫర్వాలేదనిపించాడు.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!During today’s Ranji match, Shubman Gill was actually not out. It was clearly bat first, but since there is no DRS in domestic matches, he was given out. BCCI, if you can’t provide DRS or even a proper live stream, then don’t conduct tournaments like this. pic.twitter.com/0LEZFFANgd— MARCUS (@MARCUS907935) January 22, 2026

Why Shashi Tharoor Praises Gautam Gambhir details inside4
ప్ర‌ధాని త‌ర్వాత క‌ష్ట‌మైన జాబ్ చేస్తున్నాడు

టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రూ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అస‌మ్మ‌తి నాయ‌కుడు, తిరువ‌న‌తంపురం ఎంపీ శ‌శిథ‌రూర్ మాత్రం ప్ర‌శంస‌లు కురిపించారు. దేశంలో రెండో క‌ష్ట‌త‌ర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బ‌రంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్‌పూర్‌లో బుధవారం భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి టి20 మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. అంత‌కుముందుకు గంభీర్‌తో ఆయ‌న భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్‌'లో పోస్ట్ చేసి, త‌మ ఫొటోను షేర్ చేశారు.''నాగ్‌పూర్‌లో నా పాత స్నేహితుడు గౌత‌మ్ గంభీర్‌తో జ‌రిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది త‌న‌ను విమ‌ర్శిస్తున్నా ప్ర‌శాంతంగా ప‌నిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్‌ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్ర‌శంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు ద‌క్కాల‌ని కోరుకుంటున్నాన''ని ఎక్స్‌లో రాసుకొచ్చారు. శ‌శిథ‌రూర్ ట్వీట్‌కు ధ‌న్య‌వాదాలు అంటూ గంభీర్ స‌మాధానం ఇచ్చారు.కివీస్ ర‌న్స్ కంటే నా సెల్పీలే ఎక్కువ‌త‌న నాగ్‌పూర్‌లో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆంత్ర‌ప్రెన్యూర్స్ ఆర్గ‌నైజేష‌న్‌(ఈవో) నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో శ‌శిథ‌రూర్ పాల్గొన్నారు. బుధ‌వారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భార‌త్‌- న్యూజిలాండ్ టి20 మ్యాచ్‌ను ఆయ‌న వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహ‌లం న‌డుమ మ్యాచ్ చూడ‌డం ఎంతో బాగుంద‌ని పేర్కొంటూ.. త‌న ఫొటోల‌ను 'ఎక్స్‌'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడ‌డంతో త‌న నాగ్‌పూర్ ప‌ర్య‌ట‌న పూర్త‌యింద‌న్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చాన‌ని చ‌మ‌త్క‌రించారు. టీమిండియా (Team India) విజ‌యాన్ని పూర్తిగా ఆస్వాదించాన‌ని పేర్కొన్నారు.చ‌ద‌వండి: బెంగ‌ళూరు ఎన్నిక‌లు.. రంగంలోకి బీజేపీ కీల‌క నేత‌కాగా, శ‌శిథ‌రూర్ కొంత‌కాలంగా సొంత పార్టీతో అంటిముట్ట‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శంసలు కురిపించి హ‌స్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌ను క‌ల‌వ‌డంతో పాటు ఆయ‌న‌ను పొడ‌గ్త‌ల‌తో ముంచెత్తారు. గంభీర్ హెడ్‌కోచ్‌గా వ‌చ్చిన త‌ర్వాతే టీమిండియా ఎన్న‌డూ చవిచూడ‌ని ప‌రాజ‌యాలు పొందింద‌ని అంద‌రూ విమ‌ర్శిస్తుంటే.. థ‌రూర్ మాత్రం ఆయ‌న‌ను వెనుకేసుకురావ‌డం గ‌మ‌నార్హం. వీరిద్ద‌రి భేటీపై కాంగ్రెస్ నాయ‌కులు ఇంకా స్పందించ‌లేదు. In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026

SC Dismisses plea restrain Prasar Bharati from calling BCCI squad Team India5
BCCI: మీ సమస్య ఏంటి?: సుప్రీంకోర్టు ఆగ్రహం

భారత క్రికెట్‌ జట్టును టీమిండియా అని పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో పిటిషనర్‌కు ఉన్న సమస్య ఏమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. హైకోర్టు కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేసినందునే పిటిషనర్‌ ఇక్కడి వరకు వచ్చే సాహసం చేశారని మండిపడింది.పూర్వాపరాలు ఇవేప్రైవేట్‌ సంస్థ అయిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక చేసే జట్టును టీమిండియా, జాతీయ జట్టు అని పిలవకూడదని రీపక్‌ కన్సాల్‌ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేని బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు దేశం పేరు వాడుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.టీమిండియా అనకూడదుప్రసార్‌ భారతి తన కార్యక్రమాల్లో క్రికెట్‌ జట్టును టీమిండియా అని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రీపక్‌ కన్సాల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే, ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విశ్వవేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు టీమిండియా లేదంటే భారత జట్టు అని ఎందుకు పిలవకూడదని ప్రశ్నించింది.దేశం పేరు, జాతీయ చిహ్నాల వాడకం కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని.. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని మందలించింది. అయితే, సదరు పిటిషన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఈ క్రమంలో గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్‌కు గట్టిగానే అక్షింతలు వేసింది. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.మీ సమస్య ఏమిటి?ఈ సందర్భంగా.. ‘‘మీరు ఇంట్లో కూర్చుని ఇలాంటి పిటిషన్లు డ్రాఫ్ట్‌ చేయడం మొదలుపెట్టారు. అయినా ఇందులో (టీమిండియా) మీకు సమస్య ఏమిటి? జాతీయ క్రీడా ట్రిబ్యునల్‌లో అద్భుతమైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి విషయాల కోసం కోర్టుపై భారం మోపకండి’’ అని సీజేఐ సూర్యకాంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు ఈ విషయంలో తప్పు చేసింది అదే విధంగా.. ‘‘మీ విషయంలో హైకోర్టు తప్పు చేసినట్లు అనిపిస్తోంది. ఇలా కోర్టు సమయం వృథా చేస్తున్నందుకు మీకు జరిమానా వేయాల్సింది. అలా చేయకుండా హైకోర్టు తప్పు చేసింది. అందుకే మీరు ఇలాంటి పనికిరాని పిటిషన్లతో సుప్రీం కోర్టు వరకు వచ్చారు’’ అని సీజేఐ మండిపడ్డారు.ఈ క్రమంలో ధర్మాసనం సదరు పిటిషనర్‌ను రూ. 10 లక్షలు కట్టాల్సిందిగా ఆదేశించగా.. తన క్లైంట్‌ పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని న్యాయవాది కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

PV Sindhu scripts history Enters Indonesia Masters quarter Finals6
చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నమెంట్లో అద్భుత విజయం సాధించింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌ షట్లర్‌ ఫో లినే హోజ్‌మార్క్‌ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించింది. నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు పైచేయి సాధించి.. క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.500వ విజయంఈ క్రమంలోనే పీవీ సింధు అరుదైన మైలురాయికి చేరుకుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా తన కెరీర్‌లో 500వ విజయాన్ని ఆమె నమోదు చేసింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన భారత తొలి షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సింధు.. ఓవరాల్‌గా ఆరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలిచింది.ఇక ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 13వ ర్యాంకర్‌ అయిన సింధు.. వరల్డ్‌ నంబర్‌ 4, చైనాకు చెందిన చెన్‌ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది. వీరిద్దరు ఇప్పటి వరకు పదమూడు సార్లు ముఖాముఖి తలపడగా 7-6తో చెన్‌ ఆధిక్యంలో ఉంది. చివరగా 2019లో చెన్‌ను సింధు ఓడించింది.లక్ష్య సేన్‌ సైతంమరోవైపు.. లక్ష్య సేన్‌ సైతం ఇండోనేషియా మాస్టర్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అరగంటకు పైగా సాగిన పోరులో హాంకాంగ్‌ షట్లర్‌ జేసన్‌ గునావన్‌పై 21-20, 21-11 తేడాతో గెలిచి లక్ష్య సేన్‌ ముందుడుగు వేశాడు.

IND s NZ Suryakumar Yadav Praises Team And Abhishek Sharma knock7
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్‌ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్‌ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్‌ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్‌ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్‌లో నేను చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్‌ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్‌లో.. టీమ్‌ బస్‌లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్‌ ప్లాన్‌ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది’ మ్యాచ్‌ అభిషేక్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్‌- కివీస్‌ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు రాయ్‌పూర్‌ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026

Chahal RJ Mahvash unfollow each other I Dont Trust People Post Viral8
ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌కు విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. కొరియోగ్రాఫర్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చహల్‌.అయితే, వివాహమైన కొన్ని నెలలకే తమ మధ్య గొడవలు జరిగాయని.. విడాకులు తీసుకోవడమే ఉత్తమమని భావించినట్లు కోర్టును ఆశ్రయించింది ఈ జంట. గతేడాది అధికారికంగా వీరికి విడాకులు మంజూరయ్యాయి.ఆర్జేతో చెట్టాపట్టాల్‌కానీ అంతకంటే ముందు నుంచే చహల్‌.. ఆర్జే మహ్‌వశ్‌ (RJ Mahvash)తో కలిసి చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా ఆమెతో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోలు షేర్‌ చేసి తమ మధ్య స్నేహ బంధం ఉందని చహల్‌ స్పష్టం చేశాడు.కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. ఈ ఘటన తర్వాత కొన్నాళ్లకే చహల్‌- ధనశ్రీలకు విడాకులు మంజూరు కావడంతో.. అప్పటిదాకా ధనశ్రీని తిట్టినవారంతా ఆర్జే మహ్‌వశ్‌పై దృష్టి సారించారు. చహల్‌ కాపురాన్ని ఆమే కూల్చేసిందని.. భార్యభర్తల మధ్య దూరి విడాకులకు కారణమైందని పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.మరోవైపు.. చహల్‌కు మద్దతుగా పరోక్షంగా ధనశ్రీని టార్గెట్‌ చేస్తూ మహ్‌వశ్‌ సైతం పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు మరోసారి ‘‘హోం బ్రేకర్‌’’ అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల చహల్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి కనిపిస్తే చాలు వదంతులు వ్యాప్తి చేస్తారు.ఏడుస్తూ కూర్చోలేము కదా!అంతమాత్రాన మేము ఏడుస్తూ కూర్చోలేము కదా!.. జనాలు ఏమనుకుంటున్నారో అదే అనుకోనివ్వండి. మాకేం తేడా ఉండదు. మా కాపురాన్ని కూల్చిందని ఆమెను ఆడిపోసుకున్నారు. ఇంకా ఎన్నెన్నో మాటలు అన్నారు. ఓ మహిళను ఎన్ని రకాలుగా కించపరచవచ్చో అన్ని రకాలుగా మాట్లాడారు.యుజీ ఆమెతో ఎందుకు ఉన్నాడని చాలా మంది అన్నారు. కష్టకాలంలో నాకు సహాయంగా నిలబడ్డ నా స్నేహితురాలిని అలా నిందించడం నాకు బాధ కలిగించింది. ఫ్రెండ్స్‌ అందరితో కలిసి వెళ్లినా మా ఫొటోలు మాత్రమే క్రాప్‌ చేసి రూమర్స్‌ వ్యాప్తి చేశారు. అందుకే కలిసి బయటకు వెళ్లడం కూడా మానేశాము’’ అని చెప్పు​కొచ్చాడు.ఒకరినొకరు అన్‌ఫాలోమరోవైపు.. ఆర్జే మహ్‌వశ్‌ సైతం అబ్బాయితో కలిసి బయటకు వెళ్తే చాలు డేటింగ్‌ అంటున్నారని.. అసలు మనం ఏ కాలంలో ఉన్నామంటూ మండిపడింది. పరోక్షంగా చహల్‌తో తనకు స్నేహం మాత్రమే ఉందని స్పష్టం చేసింది. అయితే, తాజాగా వీరిద్దరు సోషల్‌ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం గమనార్హం.నేను ఎవరినీ నమ్మనుదీంతో చహల్‌- మహ్‌వశ్‌ మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారంటూ నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చహల్‌ ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘నేను ఎవరినీ నమ్మను’’ అని పోస్ట్‌ పెట్టడం ఇందుకు బలమిచ్చింది. మరో స్టోరీలో ‘‘బాధ, ఆశల వలయంలో చిక్కుకుపోకుండా.. బంధాల్లో మునిగిపోకుండా.. కోపం, భయాన్ని వదిలేసి ముందుకు సాగేవాడే తెలివైన మనిషి’’ అన్న భవద్గీత పంక్తులను కూడా చహల్‌ షేర్‌ చేయడం విశేషం.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

ETPL Officially sanctioned by ICC Waugh Maxwell franchise owners9
ఫ్రాంఛైజీ యజమానిగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌

టీ20 క్రికెట్‌లో పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్న దేశవాళీ లీగ్‌లలో మరో కొత్త టోర్నీ చేరింది. ‘యూరోపియన్‌ టీ20 ప్రీమియర్‌ లీగ్‌’ (ఈటీపీఎల్‌) పేరుతో ఈ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ‘రూల్స్‌ గ్లోబల్‌’ అనే సంస్థతో కలిసి ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది.అభిషేక్‌ బచ్చన్‌ సైతంప్రముఖ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌తో పాటు పలువురు ఇతర వ్యాపారవేత్తలు ‘రూల్స్‌ గ్లోబల్‌’లో భాగస్వాములుగా ఉన్నారు. లీగ్‌కు సంబంధించి ఇప్పటికే మూడు జట్ల కొనుగోలు పూర్తయింది. దిగ్గజ క్రికెటర్‌ స్టీవ్‌ వా ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్రాంచైజీకి యజమాని కాగా... మూడు ఒలింపిక్‌ పతకాలు, రెండుసార్లు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడైన ఆ్రస్టేలియా హాకీ దిగ్గజం జేమీ డ్వేయర్‌ కూడా స్టీవ్‌వాతో పాటు సహ యజమానిగా ఈ జట్టుతో చేతులు కలపడం విశేషం.యజమానిగా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ఇక ఎడిన్‌బర్గ్‌ టీమ్‌ను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్లు నాథన్‌ మెకల్లమ్, కైల్‌ మిల్స్‌ కలిసి సొంతం చేసుకున్నారు. బెల్‌ఫాస్ట్‌ టీమ్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో లీగ్‌ జరుగుతుంది. ఇటీవలి కాలంలో యూరోప్‌లో కూడా క్రికెట్‌ బాగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో ఈటీపీఎల్‌ విజయవంతం అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

IPL 2026 schedule Delayed BCCI seeks clarity on RCB, RR venues10
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్‌ షెడ్యూల్‌: రాజీవ్‌ శుక్లా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-19వ సీజన్‌ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్‌ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్‌ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్‌ రూపొందించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్‌ రాయల్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్‌’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్‌ విడుదల‘ఐపీఎల్‌ షెడ్యూల్‌ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్‌ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్‌ జట్లకు తమ ‘హోమ్‌ గ్రౌండ్‌’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేస్తాం’ అని రాజీవ్‌ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement