Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: Pakistan created history despite losing match Vs India1
భారత్‌ చేతిలో ఓడినా.. చరిత్ర సృష్టించిన పాక్‌

టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్‌ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.స్పిన్‌ దళంపైనే నమ్మకంటీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న పాక్‌.. తమ స్పిన్‌ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీయగా.. అబ్రార్‌ అహ్మద్‌ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.ఇక బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు సల్మాన్‌ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్‌ ఖాన్‌ ఒక ఓవర్‌ వేసి 17 రన్స్‌, మొహమ్మద్‌ నవాజ్‌ 4 ఓవర్లలో 28 రన్స్‌ ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.షాహిన్‌ ఆఫ్రిది విఫలంఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్‌ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్‌ ఇలా స్పిన్‌ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్‌ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్‌.తద్వారా పొట్టి వరల్డ్‌కప్‌ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్‌ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్‌ నిలిచింది. కాగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.టీమిండియా ఇలాఈ మ్యాచ్‌లో పాక్‌ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్‌ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌ యాదవ్‌ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్‌ పడగొట్టగా.. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు తిలక్‌ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్‌ తీయగా.. రింకూ సింగ్‌ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ యూఎస్‌ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్‌ బౌలింగ్‌ వేయించడం గమనార్హం.చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

Ranji Trophy Semis UTK vs KAR: Padikkal smashes maiden First Class 2002
భీకర ఫామ్‌.. ఈసారి డబుల్‌ సెంచరీ

రంజీ ట్రోఫీ ఎలైట్‌ 2025-26 సెమీ ఫైనల్లో కర్ణాటక కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి సెమీస్‌ మ్యాచ్‌లో కర్ణాటక- ఉత్తరాఖండ్‌ (karnataka vs uttarakhand) తలపడుతున్నాయి. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలుకాగా.. మాజీ చాంపియన్‌ కర్ణాటక కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది.తొలిరోజే ఆధిపత్యంఇక ఈ దేశీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ తొలిసారి సెమీఫైనల్‌ చేరిన ఉత్తరాఖండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. టీమిండియా స్టార్లు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul- 141; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (148 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో అదరగొట్టారు.ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal- 5) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... రాహుల్, పడిక్కల్‌ రెండో వికెట్‌కు 278 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రాహుల్‌ అవుటయ్యాక వచ్చిన కరుణ్‌ నాయర్‌ (37 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా నిలకడ కనబరిచాడు.రెండో రోజు కెప్టెన్‌ డబుల్‌ సెంచరీ పూర్తిఈ నేపథ్యంలో 355/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కర్ణాటక.. 125 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ పడిక్కల్‌ 330 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 232 పరుగులు చేశాడు.పడిక్కల్‌ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో డబుల్‌ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కరుణ్‌ నాయర్‌ అర్ధ శతకం (105 బంతుల్లో 60) బాదగా.. శ్రేయస్‌ గోపాల్‌ డకౌట్‌ (0) అయ్యాడు. మిగిలిన వారిలో స్మరణ్‌ రవిచంద్రన్‌ 33, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కృతిక్‌ క్రిష్ణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్యా రావత్‌ మూడు వికెట్లు తీయగా.. అభయ్‌ నేగి, లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని తలా ఒక వికెట్‌ పడగొట్టారు.సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్న పడిక్కల్‌టీమిండియాకు దూరమైన పడిక్కల్‌ దేశీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో పుదుచ్చేరి, త్రిపుర జట్లపై వరుస శతకాలు బాదిన ఈ కర్ణాటక స్టార్‌.. అనంతరం రాజస్తాన్‌ (91), ముంబై (81 నాటౌట్‌) జట్లపై కూడా రాణించాడు. ఇక రంజీ ఎడిషన్‌లో చివరగా పంజాబ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన పడిక్కల్‌.. తాజాగా సెమీ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై ‘ద్వి’శతక్కొట్టం విశేషం.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్‌ కెప్టెన్‌A captain’s masterpiece! 🎨Watch the moment Devdutt Padikkal brings up his maiden First-Class double ton 💯💯He soaks in the applause as the dressing room rises to acknowledge a special knock 👏Updates ▶️ https://t.co/SztwjvwUiI#RanjiTrophy @IDFCFIRSTBank @devdpd07 pic.twitter.com/0Qaa5DNU9z— BCCI Domestic (@BCCIdomestic) February 16, 2026

Ravi Shastri Advice To Abhishek Sharma Form revival after PAK failure3
అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అడుగుపెట్టిన భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన అభిషేక్‌.. వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో పరుగుల ఖాతా తెరవనే లేదు.అగ్రస్థానంలో అభిషేక్‌పసికూన అమెరికాతో మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. తాజాగా పాకిస్తాన్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని సున్నా చుట్టాడు. పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (Salman Agha) బౌలింగ్‌లో షాహిన్‌ ఆఫ్రిదికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ ఇలా విఫలం కావడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే, టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌-8కు దూసుకెళ్లడంతో అభిషేక్‌ వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. లేదంటే అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి అభిషేక్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రవిశాస్త్రి సూచనలు‘‘అతడి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. అందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఆటగాడి కెరీర్‌లో ఇలాంటివి సహజమే. అయితే, ఇందుకోసం ముందుగా అతడు తన పొరపాట్లు సరిచేసుకోవాలి.క్రీజులో నిలదొక్కుకునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే.. డాట్‌ బాల్స్‌ను బౌండరీలు, సిక్సర్లుగా మలచడం అతడికి కొత్తేమీ కాదు. ఇందుకు అతడు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.ఏదేమైనా క్రీజులో కుదురుకున్న తర్వాతే పని మొదలుపెట్టాలి’’ అని రవిశాస్త్రి అభిషేక్‌ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. పాక్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సూపర్‌-8లో అడుగుపెట్టింది.అంతకు ముందు తొలుత అమెరికా.. అనంతరం నమీబియా జట్లపై టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ దూరమయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చి డకౌట్‌ అయి నిరాశపరిచాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. కాగా అభిషేక్‌ శర్మ కెరీర్‌లో ఇదే తొలి వరల్డ్‌కప్‌ అన్న సంగతి తెలిసిందే.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్‌ కెప్టెన్‌

Jahil: Shoaib Akhtar Lambasts Mohsin Naqvi After Pak Defeat Vs IND4
పనికిరాని వ్యక్తిని నమ్ముకుంటే ఇంతే: అక్తర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ తీరుపై ఆ దేశ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. అసమర్థులైన వ్యక్తులను అందలం ఎక్కిస్తే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆట పట్ల కనీస అవగాహన లేని వ్యక్తిని చైర్మన్‌ చేయడం అన్నిటికంటే పెద్ద నేరం అంటూ ఘాటు విమర్శలు చేశాడు.61 పరుగుల తేడాతో చిత్తుకాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు గత కొంతకాలంగా మిశ్రమ ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌-2026లో పసికూనలు నెదర్లాండ్స్‌, అమెరికాలపై గెలిచిన సల్మాన్‌ ఆఘా బృందం.. టీమిండియా ముందు మరోసారి తలవంచింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో చిత్తు ఓడిపోయింది.ఫలితంగా తదుపరి నమీబియాపై భారీ విజయం సాధిస్తేనే సూపర్‌-8 అవకాశాలను పాక్‌ సజీవం చేసుకోగలదు. ఈ నేపథ్యంలో పాక్‌ దిగ్గజ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పీసీబీ చైర్మన్‌, మంత్రి మొహ్సిన్‌ నక్వీ (Mohsing Naqvi) విధానాలను ఘాటుగా విమర్శించాడు.పనికిరాని వ్యక్తులు.. వీరిని నమ్ముకుంటే ఇంతే‘‘షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi) గంటకు 125 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. ఆధునిక క్రికెట్‌లో ఇలాంటి చెత్త టాలెంట్‌ అవసరం లేదు. ఇక ఇంకో ప్లేయర్‌ (బాబర్‌ ఆజం)ను సూపర్‌ స్టార్‌ చేస్తారు. కానీ అతడు మీకోసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేడు.ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయనకు అసలు తాను పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ని అన్న విషయం గుర్తుందో లేదో కూడా తెలియదు. అలాంటి పనికిరాని వ్యక్తులు జట్టును ఎలా రన్‌ చేయగలరు? ఈ ప్రపంచంలో అసమర్థ వ్యక్తిని అందలం ఎక్కించడమే అన్నిటికంటే పెద్ద నేరం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది.ఆయనొక అసమర్థుడు.. ఆట పట్ల ఏమాత్రం అవగాహన లేని వాడు. గత 15-20 ఏళ్లుగా పాక్‌ క్రికెట్‌ను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. టీమిండియాను ఓడించడం మనకు ఓ కలగానే మిగిపోయింది’’ అని అక్తర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.గతేడాది అలాఅదే విధంగా.. సీనియర్లు బాబర్‌ ఆజం, షాహిన్‌ ఆఫ్రిది, షాదాబ్‌ ఖాన్‌ వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇవ్వడం ఏమిటని అక్తర్‌ ప్రశ్నించాడు. కాగా పాక్‌పై గెలుపుతో హ్యాట్రిక్‌ విజయం అందుకున్న టీమిండియా సూపర్‌-8కు చేరగా.. పాక్‌ రాత తదుపరి మ్యాచ్‌ ఫలితంతో తేలుతుంది. కాగా గత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో పాకిస్తాన్‌ సూపర్‌-8 కూడా చేరకుండానే గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.చదవండి: నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్‌ యాదవ్‌పై హార్దిక్‌, సూర్య ఫైర్"THEY CANNOT PLAY HIM!" 🔥Jasprit Bumrah gets Saim Ayub & Salman Agha out in the same over! Pakistan are 3 down 🥶ICC Men’s #T20WorldCup | #INDvPAK | LIVE NOW 👉https://t.co/SpqYo6n3dL pic.twitter.com/2mVlsnJBqI— Star Sports (@StarSportsIndia) February 15, 2026

Pakistan Captain Salman Ali Agha Reacts AfterT20 WC Loss To India5
అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్‌ కెప్టెన్‌

టీమిండియా చేతిలో పాకిస్తాన్‌కు మరోసారి పరాభవమే ఎదురైంది. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ గొప్పలకు పోయి.. ఆ తర్వాత దిగివచ్చిన దాయాదికి సూర్య సేన దిమ్మతిరిగేలా షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్‌-2026లో పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది.ప్రధాన కారణం వాళ్లేఈ నేపథ్యంలో పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అలీ ఆఘా (Salman Ali Agha) స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మా స్పిన్నర్లపైనే నమ్మకం ఉంచాము. కానీ వారు రాణించలేకపోయారు. ప్రణాళికలను అమలు చేయడంలో మా వాళ్లు సఫలం కాలేదు. గత ఆర్నెళ్లుగా వారు విజయవంతమైన దళంగా కొనసాగుతున్నారు.కానీ ఇప్పుడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. ఇక మా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. పవర్‌ ప్లేలోనే 3-4 వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది.పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందనే టాస్‌ గెలిచిన తర్వాత నేను బౌలింగ్‌ ఎంచుకున్నాను. బంతిపై గ్రిప్పింగ్‌ కూడా బాగానే ఉంది. కానీ మా వాళ్లు తమ వ్యూహాల్ని అమలు చేయలేకపోయారు. పరిస్థితికి తగ్గట్లు మా వాళ్లు బౌలింగ్‌ చేయలేదు.బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా విఫలంమా బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా విఫలమైంది. ఇలాంటి మ్యాచ్‌లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం సహజమే. అయితే, మేము ఇప్పటికే ఎంతో క్రికెట్‌ ఆడాము. మాకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. తదుపరి మ్యాచ్‌లో గెలిచి సూపర్‌ 8కు చేరాలని పట్టుదలగా ఉన్నాము’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు. సమిష్టి వైఫల్యం కారణంగానే తాము పరాజయం పాలయ్యామని పొరపాట్లను అంగీకరించాడు.వికెట్లు తీసినా..కాగా కొలంబోలో టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బౌలింగ్‌ చేయగా.. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు సయీమ్‌ ఆయుబ్‌ మూడు వికెట్లు తీయగా.. సల్మాన్‌ ఆఘా ఒక వికెట్‌ తీశాడు, ఆఫ్‌ స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌, పేసర్‌ , షాహిన్‌ ఆఫ్రిది ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అయితే, పాక్‌ స్పిన్నర్లు వికెట్లు తీసినా కూడా పరుగులు కూడా ఎక్కువే ఇచ్చుకోవడం గమనా ర్హం.పెవిలియన్‌కు క్యూ కట్టిన బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్‌ డకౌట్‌ కాగా.. సయీబ్‌ ఆయుబ్‌ 6.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సల్మాన్‌ ఆఘా 4, తర్వాతి స్థానాల్లో వచ్చిన బాబర్‌ ఆజం 5 పరుగులకే పెవిలియన్‌ చేరారు.BIGGEST WIN FOR INDIA OVER PAKISTAN IN T20Is (61 runs)! 🤯With that, they make it 8-1 in #INDvPAK in the ICC Men's T20 World Cup and qualify for the Super 8! 👏Watch them next in ICC Men's #T20WorldCup | #INDvNED | WED, 18 FEB, 6 PM! pic.twitter.com/na6yc5i7Pz— Star Sports (@StarSportsIndia) February 15, 2026వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ (44) మెరుగ్గా రాణించగా.. షాహిన్‌ ఆఫ్రిది 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా తేలిపోయారు. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు, కుల్దీప్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ తలా ఒక వికెట్‌ తీశారు. పేసర్లు హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా చెరో రెండు వికెట్లు కూల్చారు.చదవండి: అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య

Hardik Suryakumar Fumes At Kuldeep Yadav Post Match Scenes Worry Fans6
నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్‌పై హార్దిక్‌, సూర్య ఫైర్

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. గ్రూప్‌-ఎలో తొలుత అమెరికా.. తర్వాత నమీబియాలను ఓడించిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చిత్తు చేసింది. దాయాదిపై ఏకంగా 61 పరుగుల తేడాతో నెగ్గి సూపర్‌-8 దశకు అర్హత సాధించింది.తటస్థ వేదికైన కొలంబోలో ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్య సేన ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. టాస్‌ ఓడి తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌ను 114 పరుగులకే ఆలౌట్‌ చేసింది.మొదలుపెట్టి.. తానే ముగించాడుభారత బ్యాటర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77) అదరగొట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో వికెట్ల వేట మొదలుపెట్టిన హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)నే.. చివరి వికెట్‌ కూల్చి విజయంతో ముగించాడు. పాక్‌ ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (0)ను వచ్చీరాగానే వెనక్కి పంపిన హార్దిక్‌.. ఆఖరిగా ఉస్మాన్‌ తారిఖ్‌ (0)ను పెవిలియన్‌కు పంపి టీమిండియాను గెలుపును ఖరారు చేశాడు.క్యాచ్‌లు డ్రాప్‌ చేసిన ఇషాన్‌, కుల్దీప్‌ ఈ క్రమంలో టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)పై హార్దిక్‌ పాండ్యా సీరియస్‌ అయ్యాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో పదిహేడో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌కు దిగగా.. తొలి బంతి వైడ్‌ అయింది. అనంతరం షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi) ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్‌ డ్రాప్‌ చేశాడు.దీంతో లైఫ్‌ పొందిన ఆఫ్రిది.. హార్దిక్‌ బౌలింగ్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నిజానికి లాంగాన్‌ వద్ద ఫీల్డింగ్‌ పొజిషన్‌లో ఉన్న కుల్దీప్‌ దానిని జారవిడిచాడు. చేతుల్లో పడిన బంతిని డ్రాప్‌ చేశాడు. దీంతో హార్దిక్‌ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.Hardik pandya didn’t spare Kuldeep yadav after that dropped the catch ! The frustration on Kuldeep yadav face says it all. pic.twitter.com/4qazJi9M1d— Indian First (@MaheshJain68174) February 16, 2026మీకసలు బుద్ధి ఉందా?ఇషాన్‌తో పాటు కుల్దీప్‌ వైపు చూపిస్తూ.. ‘ఏం జరిగినా మీ ఇద్దరే కారణం.. మీకసలు బుద్ధి ఉందా?’ అన్నట్లుగా ఫైర్‌ అయ్యాడు. ఇక ఆ ఓవర్లో ఐదో బంతికి ఆఫ్రిది ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి పాండ్యా తారిఖ్‌ను బౌల్డ్‌ చేయడంతో పాక్‌ కథ ముగిసిపోయింది. టీమిండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.ये गलत है ! Feeling bad for Kuldeep Yadav 😭#IshanKishan #INDvsPAK pic.twitter.com/Z7BfPy85Fc— Amrita Yadav (@AmritaYada60221) February 15, 2026సూర్య సైతంఇక విజయానంతరం కరచాలనం చేసుకునే సమయంలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం కుల్దీప్‌ యాదవ్‌ను గట్టిగానే మందలించాడు. ఈ చైనామన్‌ స్పిన్నర్‌ సులువైన క్యాచ్‌ను వదిలేశాడన్న కోపంతో సూర్య.. అతడిని చులకన చేసి మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.కాగా పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ చెరో వికెట్‌ పడగొట్టారు. పాక్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 44 పరుగులతో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs PAK: తిల‌క్ వ‌ర్మ‌పై గంభీర్ సీరియ‌స్‌

This is for India: Suryakumar Lauds Ishan And Team Win Over Pakistan7
అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య

పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. కొలంబోలో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి సల్మాన్‌ బృందం చిత్తు కాగా.. సూర్య సేన టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశకు అర్హత సాధించింది.ఇది సార్‌ మా బ్రాండ్‌ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. దాయాదిపై గెలుపు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ విజయం ఇండియా కోసం. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలని ప్రణాళికలు రచించామో వాటిని పక్కాగా అమలు చేశాము. మా బ్రాండ్‌ను కొనసాగించాము.అతడు అత్యద్భుతంగా ఆడాడుఈ వికెట్‌ మీద తొలుత బ్యాటింగ్‌ చేయడం మంచిదని అనుకున్నాం. అనుకున్నట్లుగానే టాస్‌ ఓడినా మాకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే వచ్చింది. ఇక ఇషాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్‌.. టీమిండియా తరఫునా అదే విధంగా రాణిస్తున్నాడు.ఈరోజు అతడు అత్యద్భుతంగా ఆడాడు. ఊహించని రీతిలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తిలక్‌, రింకూ, శివం కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ 175 పరుగులు చేయడం మంచి విషయం. చేయాల్సిన దానికంటే ఇంకో 15-20 పరుగులు ఎక్కువే చేశామనుకుంటున్నాం.బౌలర్లు సమిష్టిగా రాణించారుఇక పవర్‌ ప్లేలో అక్షర్‌ పటేల్‌ బాధ్యత తీసుకున్నాడు. వరుణ్‌, కుల్దీప్‌ కూడా రాణించారు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల సూర్యకుమార్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. గ్రూప్‌-ఎలో భాగంగా భారత్‌- పాక్‌ ఆదివారం కొలంబో వేదికగా తలపడ్డాయి. ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.ఇషాన్‌ విధ్వంసంఓపెనర్లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ కాగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ మెరుపు అర్ధ శతకం (40 బంతుల్లో 77)తో రాణించాడు. తిలక్‌ వర్మ (25), కెప్టెన్‌ సూర్య (32), శివం దూబే(27) ఫర్వాలేదనిపించారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్‌ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా.. తిలక్‌ వర్మ, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. పేసర్లలో బుమ్రా, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.చదవండి: IND vs PAK: తిల‌క్ వ‌ర్మ‌పై గంభీర్ సీరియ‌స్‌

 Indian Hockey Team lost again8
హాకీలో మళ్లీ ఓడిన భారత్‌

రూర్కెలా: సొంతగడ్డపై భారత పురుషుల హాకీ జట్టు తమ నిరాశాజనక ప్రదర్శన కొనసాగించి వరుసగా నాలుగో పరాజయం చవిచూసింది. భారత అంచె పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన చివరిదైన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 2–4 గోల్స్‌ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. భారత్‌ తరఫున ఆదిత్య లలాగే (50వ నిమిషంలో), సంజయ్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. అర్జెంటీనా జట్టుకు టడియో మారుకి (28వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించగా... టొమాస్‌ డొమెనె (18వ నిమిషంలో), లూసియో మెండెజ్‌ (43వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా తదుపరి మ్యాచ్‌ల కోసం భారత జట్టు ఆ్రస్టేలియాకు వెళుతుంది. హోబర్ట్‌ వేదికగా ఈనెల 21న స్పెయిన్‌తో, 22న ఆ్రస్టేలియాతో... 24న స్పెయిన్‌తో, 25న ఆ్రస్టేలియాతో భారత్‌ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది.

USA cruise to 31-run victory over Namibia in T20 World Cup9
సంజయ్, మోనాంక్‌ మెరుపులు

చెన్నై: భారత సంతతి ఆటగాళ్లు సంజయ్‌ కృష్ణ మూర్తి (33 బంతుల్లో 68; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెపె్టన్‌ మోనాంక్‌ పటేల్‌ (30 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ షోతో అదరగొట్టారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో అమెరికా జట్టు రెండో విజయం అందుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆదివారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అమెరికా 31 పరుగుల తేడాతో నమీబియాపై గెలిచింది. టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. మోనంక్, జహంగీర్‌ (22) ఓపెనింగ్‌ వికెట్‌కు 68 పరుగులు జోడించి మెరుపు ఆరంభమిచ్చారు. తర్వాత సంజయ్, మిలింద్‌ కుమార్‌ (28; 1 ఫోర్, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 87 పరుగులు జతచేశారు. ఈ రెండు భాగస్వామ్యాలు అమెరికా భారీస్కోరుకు బాట వేశాయి. నమీబియా బౌలర్లపై ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజయ్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నమీబియా బౌలర్లలో విలెమ్, ఎరాస్మస్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి ఓడింది. లారెన్‌ స్టీన్‌కాంప్‌ (39 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. స్మిత్‌ (31; 1ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. షాడ్లే వాన్‌కు 2 వికెట్లు దక్కాయి. నిరీ్ణత నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అమెరికా రెండు విజయాలు, రెండు పరాజయాలతో నాలుగు పాయింట్లు సాధించి గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానానికి చేరింది.

T20 World Cup 2026: Ishan Kishan comes out of syllabus for Pakistan as India win by 61 Runs10
T20 World Cup 2026: భారత్‌ ‘రుద్ర’ రూపం

‘విక్రమార్కుడు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ శవాన్ని భుజాన వేసుకొని మళ్లీ నడక సాగించాడు... చందమామ కథలో బేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు సరైన సమాధానం ఇవ్వగానే బేతాళుడు మళ్లీ చెట్టెక్కటం... ‘బేతాళ పంచ విశతి’లో మళ్లీ మళ్లీ ఇదే దృశ్యం, ఇదే సంవాదం... భారత్, పాకిస్తాన్‌ మధ్య వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌ అంటే దీనికి సరిగ్గా సరిపోతుంది! ఐసీసీ టోర్నీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ తేదీ ప్రకటనతో హడావిడి మొదలు... ప్రత్యక్షంగా మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఏర్పాట్లు ఒక వైపు... ప్రసారకర్తల ప్రకటనలు మరోవైపు... వ్యాఖ్యాతలు, విశ్లేషకుల తీవ్ర చర్చ... మ్యాచ్‌ సమీపిస్తున్న కొద్దీ ఎన్నో కథలు, కథనాలు, వివాదాలు... ఈ మ్యాచ్‌ లేకపోతే క్రికెట్‌ లేదన్నట్లుగా ఏమార్పు... ఒక రకమైన యుద్ధ వాతావరణం... ఇరు జట్ల బలాబలాల మధ్య ఉన్న అంతరం గురించి అందరికీ తెలుసు... ఫలితం ఎలా రావచ్చో కూడా అంచనాకు రావచ్చు... అయినా సరే మ్యాచ్‌ గురించి హంగామా... చివరకు ఎప్పటిలాగే భారత్‌దే విజయం.పిచ్‌ బ్యాటింగ్‌కు తగినంత అనుకూలంగా లేదు... బంతి ఆగుతూ నెమ్మదిగా వస్తోంది. భారత్‌ ఇన్నింగ్స్‌ రెండో అర్ధభాగంలో ఇది కనిపించింది కూడా. కానీ ఆరంభంలో ఇషాన్‌ కిషన్‌ చూపించిన దూకుడు పిచ్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మిగతా జట్టంతా కలిసి ఎక్స్‌ట్రాలు సహా 80 బంతుల్లో 98 పరుగులు రాబడితే... ఇషాన్‌ ఒక్కడే మిగిలిన 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్‌లో అసలు తేడా ఏంటో చూపించాడు. టి20 వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసిన తర్వాత ప్రత్యరి్థని నిలువరించడం భారత్‌కు ఏమాత్రం కష్టం కాలేదు. ఆరుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ అయినా పడగొట్టగా, సమష్టి ప్రదర్శనతో పాక్‌ను టీమిండియా కుప్పకూలి్చంది. ఐదు ఓవర్ల లోపే టాప్‌–4 వికెట్లు కోల్పోయిన పాక్‌ కోలుకోలేకపోయింది. అసలు పాకిస్తాన్‌ తమకు ఏమాత్రం పోటీ కాదన్నట్లుగా నిరూపిస్తూ భారత్‌ ఏకపక్షంగా ఘన విజయం అందుకుంది. కొలంబో: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు 7–1తో పైచేయి ఉండగా ఇప్పుడు ఎనిమిదోసారి పాక్‌ను విశ్వవేదికపై మట్టికరిపించింది. భారత్‌ ముందు పాక్‌ ఏమాత్రం నిలవలేకపోవడంతో ఊహించిన ఫలితమే వచి్చంది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో పాకిస్తాను చిత్తు చేసింది. టి20ల్లో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. టాస్‌ గెలిచి పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పాక్‌ బౌలర్లలో సయీమ్‌ అయూబ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్తాన్‌ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్‌ ఖాన్‌ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో విజయంతో భారత్‌ ‘సూపర్‌ ఎయిట్స్‌’కు అర్హత సాధించింది. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడుతుంది. ఆసియా కప్‌ తరహాలోనే తమ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ కెపె్టన్‌ సల్మాన్‌ ఆఘాకు భారత సారథి సూర్యకుమార్‌ ‘షేక్‌ హ్యాండ్‌’ ఇవ్వలేదు. భారత్‌ చేతిలో భారీ ఓటమితో పాకిస్తాన్‌ ‘సూపర్‌–8’ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తప్పనిసరిగా గెలిస్తేనే ‘సూపర్‌–8’ దశకు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్‌ ఓడిపోతే అమెరికా ‘సూపర్‌–8’కు చేరుతుంది. అభిశేక్‌ మళ్లీ డకౌట్‌... పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ సల్మాన్‌ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు బంతులు పరుగు తీయలేకపోయిన అభిశేక్‌ శర్మ (0) తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. టోర్నీలో అతనికి ఇది వరుసగా రెండో డకౌట్‌. అయితే ఇషాన్‌ చెలరేగిపోవడంతో జట్టు దూసుకుపోయింది. షాహీన్‌ అఫ్రిది ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అబ్రార్‌ ఓవర్లోనూ 6, 4 కొట్టాడు. పవర్‌ప్లేలో భారత్‌ 52 పరుగులు చేసింది. అనంతరం అబ్రార్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్‌ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన ఇషాన్‌ను ఎట్టకేలకు 9వ ఓవర్లో పాక్‌ అవుట్‌ చేయగలిగింది. ఆ సమయంలో భారత్‌ స్కోరు 88 అయితే ఇషాన్‌ ఒక్కడే 76 బాదడం విశేషం! మరోవైపు తిలక్‌ వర్మ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ కాస్త తడబడుతూనే సాగింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అతను ఒకే స్కోరు (25) చేశాడు. తిలక్, పాండ్యా (0)లను అయూబ్‌ వరుస బంతుల్లో అవుట్‌ చేశాడు. ఈ దశలో సూర్య, శివమ్‌ దూబే (17 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా పిచ్‌ అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 38 పరుగులు జోడించేందుకు 34 బంతులు పట్టాయి. అఫ్రిది వేసిన చివరి ఓవర్లో దూబే, రింకూ సింగ్‌ (11 నాటౌట్‌) కలిసి 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాబట్టారు. భిన్నమైన యాక్షన్‌తో తీవ్ర చర్చను రేకెత్తించిన ఉస్మాన్‌ తారిఖ్‌ (1/24) 2 ఫోర్లు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ఉస్మాన్‌ ఖాన్‌ మినహా... తొలి ఓవర్‌ నాలుగో బంతికి ఫర్హాన్‌ (0) అవుట్‌ కావడంతో మొదలైన పాక్‌ పతనం వేగంగా సాగింది. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో అయూబ్‌ (6), సల్మాన్‌ (4) వెనుదిరగ్గా, అక్షర్‌ తన తొలి ఓవర్లోనే బాబర్‌ ఆజమ్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 38/4కు చేరింది. ఉస్మాన్‌ ఒక్కడే కాస్త పోరాడుతూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే 57 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉస్మాన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో షాహిన్‌ అఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు సాధించినా లాభం లేకపోయింది. గత మ్యాచ్‌ ఆడిన తుది జట్టులో భారత్‌ రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిశేక్‌...సామ్సన్‌ స్థానంలో రాగా, అర్‌‡్షదీప్‌కు బదులుగా అదనపు స్పిన్నర్‌ కుల్దీప్‌ను మేనేజ్‌మెంట్‌ ఎంచుకుంది.స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (బి) అయూబ్‌ 77; అభిశేక్‌ (సి) అఫ్రిది (బి) సల్మాన్‌ 0; తిలక్‌ (ఎల్బీ) (బి) అయూబ్‌ 25; సూర్యకుమార్‌ (సి) అయూబ్‌ (బి) తారిఖ్‌ 32; పాండ్యా (సి) బాబర్‌ (బి) అయూబ్‌ 0; దూబే (రనౌట్‌) 27; రింకూ (నాటౌట్‌) 11; అక్షర్‌ (సి) అయూబ్‌ (బి) అఫ్రిది 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–1, 2–88, 3–126, 4–126, 5–159, 6–175, 7–175. బౌలింగ్‌: సల్మాన్‌ 2–0–10–1, షాహిన్‌ అఫ్రిది 2–0–31–1, సయీమ్‌ అయూబ్‌ 4–0–25–3, అబ్రార్‌ 3–0–38–0, షాదాబ్‌ 1–0–17–0, నవాజ్‌ 4–0–28–0, తారిఖ్‌ 4–0–24–1. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) రింకూ (బి) పాండ్యా 0; అయూబ్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 6; సల్మాన్‌ (సి) పాండ్యా (బి) బుమ్రా 4; బాబర్‌ (బి) అక్షర్‌ 5; ఉస్మాన్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) అక్షర్‌ 44; షాదాబ్‌ (సి) దూబే (బి) తిలక్‌ 14; నవాజ్‌ (సి) దూబే (బి) కుల్దీప్‌ 4; ఫహీమ్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 10; అఫ్రిది (నాటౌట్‌) 23; అబ్రార్‌ (ఎల్బీ) (బి) వరుణ్‌ 0; తారిఖ్‌ (బి) పాండ్యా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్‌) 114. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–13, 4–34, 5–73, 6–78, 7–78, 8–97, 9–97, 10–114. బౌలింగ్‌: పాండ్యా 3–1–16–2, బుమ్రా 2–0–17–2, అక్షర్‌ 4–0–29–2, వరుణ్‌ 3–0–17–2, కుల్దీప్‌ 3–0–14–1, తిలక్‌ 2–0–11–1, రింకూ 1–0–9–0.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement