Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mumbai Indians won the Match Against Delhi Capitals1
డబ్ల్యూపీఎల్‌లో బోణి కొట్టిన ముంబయి.. ఢిల్లీపై ఘన విజయం

ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్‌ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ ‍టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్‌ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్‌ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.

Harmanpreet Kaur and Nat Sciver-Brunt took MI to a Huge Total2
హర్మన్‌ ప్రీత్‌ విధ్వంసం.. ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌

డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్‌ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్‌ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్‌ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్: షఫాలీ వర్మ, లిజెల్ లీ(వికెట్‌కీపర్‌), లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్(కెప్టెన్‌), మారిజాన్ కాప్, నికి ప్రసాద్, చినెల్లే హెన్రీ, స్నేహ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మముంబై ఇండియన్స్: అమేలియా కెర్, జి కమలిని(వికెట్ కీపర్‌), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), నికోలా కారీ, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి

Rishabh Pant suffers injury before IND vs NZ 1st ODI, leaves practice abruptly3
టీమిండియాకు ఊహించని షాక్‌

భారత్‌-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయ‌ప‌డ్డాడు. మొద‌టి వ‌న్డే కోసం భార‌త జ‌ట్టు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో శ‌నివారం త‌మ చివ‌రి ప్రాక్టీస్ సెష‌న్‌లో పాల్గోంది.అయితే త్రోడౌన్ స్పెషలిస్టుల ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అత‌డు నొప్పితో విలవిలాడాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించాడు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిషబ్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్ గాయపడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్ శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అంతలోనే పంత్ గాయప‌డ‌డం టీమ్ మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. పంత్ ప్ర‌స్తుతం జ‌ట్టులో కేఎల్ రాహుల్‌కు బ్యాక‌ప్‌గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ మొత్తానికి అత‌డు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి స్ధానంలో ఇషాన్‌ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్‌ వైపే మొగ్గు చూపారు.కివీస్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.చదవండి: WPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శ‌ర్మ‌

Who is Anushka Sharma? Gujarat Giants cricketer who slammed 30-ball 44 on WPL debut4
అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శ‌ర్మ‌

మహిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ నుంచి మ‌రో యువ సంచ‌ల‌నం క్రికెట్ ప్రపంచానికి ప‌రిచ‌య‌మైంది. డ‌బ్ల్యూపీఎల్‌-2026 సీజ‌న్‌లో శ‌నివారం యూపీ వారియ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున బ‌రిలోకి దిగిన అనుష్క శ‌ర్మ‌.. త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టింది.బెత్ మూనీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన 22 ఏళ్ల అనుష్క తన సంచలన బ్యాటింగ్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. శిఖా పాండే, డాటిన్ వంటి అంతర్జాతీయ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఔరా అన్పించింది. అస్సలు తొలి మ్యాచ్ ఆడుతున్నాన్న ఒత్తడి కొంచెం కూడా ఆమెలో కన్పించలేదు. కెప్టెన్ యాష్లీ గార్డరన్‌తో కలిసి 103 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అనుష్క నెలకొల్పింది. గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారింది. అనుష్క 30 బంతులు ఎదుర్కొని 7 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసింది. ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనుష్క గురుంచి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ అనుష్క శర్మ..?ఆమె అసలు పేరు అనుష్క బ్రిజ్మోహన్ శర్మ. అనుష్క దేశవాళీ క్రికెట్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. ఆమెకు చిన్న‌త‌నం నుంచి క్రికెట్‌పై మ‌క్కువ ఎక్కువ‌. అనుష్క త‌న అన్నయ్య ఆయుష్ శర్మను చూసి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆయుష్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ కావ‌డం గ‌మ‌నార్హం.అత‌డు త‌న బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం త‌న సోద‌రితో బౌలింగ్ చేయించేవాడంట‌. అనుష్క కుడిచేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలదు. దేశవాళీ క్రికెట్‌లో ఆమె ఇప్పటివరకు 620 పరుగులతో పాటు 22 వికెట్లు పడగొట్టింది. అనుష్క‌ మధ్యప్రదేశ్ జట్టుతో పాటు ఇండియా-బి, ఇండియా-సి, సెంట్రల్ జోన్ వంటి జట్లకు కూడా ప్రాతినిథ్యం వ‌హించింది. అనుష్క‌ సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ-2025లో 207 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి స‌త్తాచాటింది.వేలంలో రికార్డు ధ‌ర‌..ఈ క్ర‌మంలోనే గ‌తేడాది నవంబ‌ర్‌లో జ‌రిగిన మెగా వేలంలో అనుష్క‌పై కాసుల వ‌ర్షం కురిసింది. ఆమెను గుజరాత్ జెయింట్స్ రూ. 45 ల‌క్ష‌ల భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. త‌ద్వారా ఈ ఏడాది సీజ‌న్ వేలంలో అత్యధిక ప‌లికిన అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ఆమె నిలిచింది. ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌లు చేస్తే అనుష్క త్వ‌ర‌లోనే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

WPL 2026, GG vs UPW: Gujarat Giants win by 10 runs5
గుజ‌రాత్ జెయింట్స్ బోణీ.. పోరాడి ఓడిన యూపీ

మ‌హిళల ప్రీమియ‌ర్ లీగ్‌-2026లో గుజరాత్ జెయింట్స్ శుభారంభం చేసింది. శనివారం డివై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది.గుజరాత్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ యాష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. కేవలం 41 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆమెతో పాటు అరంగేట్ర ప్లేయర్ అనుష్క శర్మ (44), సీనియర్ సోఫీ డివైన్(38) రాణించారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, డియాండ్రా డాటిన్ తలో వికెట్ పడగొట్టారు.దుమ్ములేపిన ఫీబీ..అనంతరం భారీ లక్ష్య చేధనలో యూపీ వారియర్స్ ఆఖరి వరకు పోరాడింది. ఓ దశలో గెలిచేలా కన్పించిన యూపీ జట్టు.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. యూపీ యువ ‍బ్యాటర్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.లిచ్‌ఫీల్డ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న లిఛ్‌ఫీల్డ్‌.. సోఫీ డివైన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌(30), ఆశా శోభన(27) పర్వాలేదన్పించారు. భారత స్టార్‌ ప్లేయర్లు హర్లీన్‌ డియోల్‌(0), దీప్తీ శర్మ(1) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రేణుకా సింగ్‌, సోఫీ డివైన్‌, జార్జియా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్‌, గార్డనర్‌ తలా వికెట్‌ సాధించారు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

PV Sindhus brilliant run ends after semi-final loss to Wang6
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్‌లో ఓట‌మి

మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు ఓట‌మి పాలైంది. గాయం తర్వాత పునరాగమనం చేసిన సింధు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడింది. కానీ సెమీస్‌లో మాత్రం చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 క్రీడాకారిణి వాంగ్ జియి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది.ఆమె చేతిలో 16-21, 15-21 తేడాతో సింధు ఓట‌మి చ‌విచూసింది. రెండో గేమ్‌లో సింధు 11-6తో ఆధిక్యంలో ఉన్న‌ప్ప‌టికి, వ‌రుస త‌ప్పిదాల వ‌ల్ల విజయాన్ని చేజార్చుకుంది. అంత‌కుముందు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఓట‌మిపాలైంది. ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్ - ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ జోడీ చేతిలో 10-21, 21-23తో ఈ భార‌త అగ్రశ్రేణి ద్వయం ఓట‌మి పాలైంది.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Will Young dreams of winning another series in India7
IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'

భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆదివారం(జ‌న‌వ‌రి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొద‌టి వ‌న్డేకు వ‌డోద‌ర‌లోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్‌ను టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన కివీస్‌.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పున‌రావృతం చేయాలని పట్టుదలతో ఉంది.ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్‌ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.మూడు టెస్టుల సిరీస్‌ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్‌ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఇ‍ప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు."ఈసారి భిన్నమైన ఫార్మాట్‌లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్‌కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డేల్లో విజయం సాధించాము.గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్‌లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో చివ‌రి మెట్టుపై బోల్తా ప‌డ్డాము. కానీ ఆ ఓట‌మిని మేము ఎప్పుడో మ‌ర్చిపోయాము.ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గ‌తేడాది మార్చిలో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో భార‌త్ చేతిలో కివీస్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భార‌త ప‌ర్య‌ట‌కు కేన్ విలియ‌మ్స‌న్, టామ్ లాథ‌మ్‌,ర‌చిన్ ర‌వీంద్ర వంటి స్టార్ ప్లేయ‌ర్లు దూర‌మ‌య్యారు. వ‌న్డే సిరీస్‌కు కివీస్ కెప్టెన్‌గా మైఖ‌ల్ బ్రెస్‌వెల్ వ్య‌వ‌హ‌రించనున్నాడు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Vaibhav Suryavanshi smokes 50-ball 968
వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో

భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న సూపర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. 14 ఏళ్ల సూర్యవంశీ స్కాట్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. దాదాపు 192 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడు సాధించిన స్కోర్‌లో 78 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రావడం గమనార్హం. అతడితో పాటు ఆరోన్‌ జార్జ్‌ 61 పరుగులతో రాణించారు. 33 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం అభిజ్ఞాన్ కుండు(10), విహాన్ మల్హోత్రా(46) ఉన్నారు. అయితే గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన కెప్టెన్ అయూష్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మాత్రే కేవలం 22 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా వార్మాప్ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లోనూ వైభవ్ అద్భుతాలు చేశాడు. రెండో వన్డేలో కేవలం 74 బంతుల్లో 127 పరుగులు చేసిన వైభవ్‌.. మూడో వన్డేలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక వరల్డ్‌కప్‌ ప్రధాన టోర్నీ జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్‌, అమెరికా జట్లు తలపడనున్నాయి.చదవండి: WPL 2026: ఈ ఐదుగురు ప్లేయర్లపైనే కళ్లన్నీ.. గొంగడి త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?

WPL 2026: Debutants to watch out for Include Trisha Deeya9
ఈ ఐదుగురిపైనే కళ్లన్నీ.. త్రిషకు మంచి రోజులు వచ్చినట్లేనా?

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై గెలుపొంది శుభారంభం అందుకుంది.ఆర్సీబీ తరఫున అరంగేట్రంనవీ ముంబైలో జరిగిన ఈ మ్యాచ్‌ ద్వారా ఆర్సీబీ తరఫున ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు లారెన్‌ బెల్‌, లిన్సీ స్మిత్‌ అరంగేట్రం చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ బెల్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటింది.మరోవైపు.. లెఫ్టార్మ్‌ పేసర్‌ లిన్సీ స్మిత్‌ మాత్రం రెండు ఓవర్లలో ఏకంగా 23 పరుగులు ఇచ్చి నిరాశపరిచింది. అయితే, అంతర్జాతీయ టీ20లలో సత్తా చాటిన ఈ ఇద్దరు ఎవరికి ఎవరూ తక్కువకారు. తొలి మ్యాచ్‌లో విఫలమైనా లిన్సీ తిరిగి పుంజుకోగలదు. ఇందుకు గణాంకాలే కారణం.ఎన్ని వికెట్లు తీశారంటేబెల్‌ ఇప్పటికి 36 అంతర్జాతీయత టీ20లలో 50 వికెట్లు కూల్చగా.. లిన్సీ 22 మ్యాచ్‌లు ఆడి 6.6 ఎకానమీతో 22 వికెట్లు తీసింది. వుమెన్స్‌ 100లో బెల్‌ ఖాతాలో 60 (41 మ్యాచ్‌లలో), లిన్సీ ఖాతాలో 42 (37 మ్యాచ్‌లలో) వికెట్లు ఉన్నాయిఇక బెల్‌, లిన్సీలతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వారు మరెవరో కాదు లిజెలి లీ, గొంగడి త్రిష, దీయా యాదవ్‌.లిజెలి లీసౌతాఫ్రికా ఓపెనింగ్‌ బ్యాటర్‌ లిజెలి లీ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికి 82 మ్యాచ్‌లు ఆడింది. 33 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో 1896 పరుగులు ఉన్నాయి.ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి వైదొలిగినా.. తన విధ్వంసకర బ్యాటింగ్‌ కారణంగా గత దశాబ్దకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ లిజెలిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇప్పటికి 104 మ్యాచ్‌లు ఆడి ఐదు సెంచరీలు బాది.. 2770 పరుగులు చేసిన లిజెలి డబ్ల్యూపీఎల్‌నూ వాచౌట్‌ ప్లేయర్‌.గొంగడి త్రిషతెలంగాణ ఆల్‌రౌండర్‌, టీమిండియా అండర్‌-19 స్టార్‌ గొంగడి త్రిష. అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీలో మొట్టమొదటి సెంచరీ చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె చరిత్రకెక్కింది.టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడంతో పాటు.. పార్ట్‌టైమ్‌ లెగ్‌ స్పిన్నర్‌గా రాణించడం ఆమెకు ఉన్న అదనపు బలం. అయితే, గత రెండు సీజన్లలో వేలంలో పేరు నమోదు చేసుకున్నా ఫ్రాంఛైజీలు ఆమెను పట్టించుకోలేదు.ఈసారి యూపీ వారియర్స్‌ మాత్రం రూ. 10 లక్షల కనీస ధరకు 20 ఏళ్ల త్రిషను కొనుగోలు చేసింది. కీలక మ్యాచ్‌లలో ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడగల సత్తా ఉన్న త్రిషకు ఒక్క అవకాశం వచ్చినా తనను తాను నిరూపించుకోగలదు. ఇప్పటి వరకు 33 టీ20 మ్యాచ్‌లు ఆడిన త్రిష 583 పరుగులు సాధించింది.దీయా యాదవ్‌పదహారేళ్ల దీయా యాదవ్‌ను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. తద్వారా అత్యంత పిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌ కాంట్రాక్టు పొందిన ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. అండర్‌ 15 వన్డే కప్‌లో డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన దీయా.. దేశీ టీ20 క్రికెట్‌లోనూ నిలకడైన ఆటతో ఆకట్టుకుంటోంది. ఈమె కూడా ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.చదవండి: T20 WC: వేటు వేసిన సెలక్టర్లు.. తొలిసారి స్పందించిన శుబ్‌మన్‌ గిల్‌

UP Warriorz wins toss, opts to bowl against Gujarat Giants10
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ.. అనుష్క అరంగేట్రం

డ‌బ్ల్యూపీఎల్‌-2026లో భాగంగా న‌వీ ముంబై వేదిక‌గా జ‌ర‌గుతున్న రెండో మ్యాచ్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌, యూపీ వారియ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లానింగ్ యూపీ త‌ర‌పున ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కుముందు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు లానింగ్ సార‌థ్యం వ‌హించింది.కానీ డ‌బ్ల్యూపీఎల్‌-2026 వేలానికి ముందు ఢిల్లీ ఆమెను విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వ‌చ్చిన లానింగ్‌ను యూపీ వారియ‌ర్స్ సొంతం చేసుకుని త‌మ జ‌ట్టు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయ‌ర్లు సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్ గుజ‌రాత్ జెయింట్స్ త‌ర‌పున అరంగేట్రం చేశారు. వీరిద్ద‌రూ గ‌త సీజ‌న్ వ‌ర‌కు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వ‌హించారు. వీరితో పాటు అనుష్క శర్మ కూడా గుజరాత్‌ తరపున డెబ్యూ చేసింది.తుది జట్లుగుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (వికెట్ కీప‌ర్‌), సోఫీ డివైన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్‌), జార్జియా వేర్‌హామ్, అనుష్క శర్మ, కనికా అహుజా, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్యుపీ వారియర్జ్: మెగ్ లానింగ్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, కిరణ్ ప్రభు నవ్‌గిరే, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్ (వికెట్ కీపర్‌), సోఫీ ఎక్లెస్టోన్, ఆశా శోబన, క్రాంతి గౌడ్, శిఖా పాండే

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement