Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Abhishek Sharma 7 Ducks-Most ducks Calendar year T20s by-Indian1
గోల్డెన్‌ డక్‌.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ అభిషేక్ శ‌ర్మ తొలి బంతికే వెనుదిరిగాడు. జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి ర‌వి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డ‌క్ అయ్యాడు. త‌ద్వారా అభిషేక్ శ‌ర్మ త‌న పేరిట అత్యంత చెత్త రికార్డును మూటగ‌ట్టుకున్నాడు. అదేంటంటే..2026 సీజ‌న్ టీ20 క్రికెట్‌లో అభిషేక్‌ శ‌ర్మ‌కు ఇది ఏడో గోల్డెన్ డ‌క్‌. 2026 సీజ‌న్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి 18 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు గోల్డెన్ డ‌కౌట్ అయ్యి అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాడిగా నిలిచాడు.అంత‌క‌ముందు కూప‌ర్ కన్నోలి 17 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.ఇక ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్ త‌ర‌ఫున తొలి బంతికే వెనుదిరిగిన రెండో బ్యాట‌ర్‌గా అభిషేక్ శ‌ర్మ మ‌రో చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. గ‌తంలో శిఖ‌ర్ దావ‌న్ 2018 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌తో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో తొలి బంతికే ఔట‌య్యి గోల్డెన్ డ‌క్‌ అయి తొలి బ్యాటర్‌గా నిలిచాడు.భార‌త్ త‌ర‌ఫున టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయిన ఆట‌గాళ్ల జాబితాలోనూ అభిషేక్ చోటు సంపాదించాడు. ఏడుసార్లు డ‌కౌట్ అయిన అభిషేక్ తొలి స్థానంలో ఉండ‌గా, రోహిత్ శ‌ర్మ (2018లో ఆరుసార్లు), సంజూ శాంస‌న్ (2024లో ఆరు సార్లు), గురుకీర‌త్ సింగ్ (2103లో 5 సార్లు) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఐపీఎల్‌లో తొలి బంతికే వికెట్ తీయ‌డం ఆర్చ‌ర్‌కు ఇది నాలుగోసారి. టీమిండియా వెట‌ర‌న్ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఐపీఎల్‌లో ఈ ఫీట్‌ను 5 సార్లు న‌మోదు చేయ‌డం విశేషం.ఐపీఎల్ చ‌రిత్ర‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి బంతికే వికెట్ తీయ‌డం ఇది 24వ సారి. ఐపీఎల్‌లో ఏ జ‌ట్టుకైనా ఇదే అత్య‌ధికం. ముంబై ఇండియ‌న్స్ 22సార్లు ఈ ఫీట్ న‌మోదు చేసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)

BCCI Announced GT-CSK fixtures Swapped For April 26 And May 212
ఐపీఎల్ షెడ్యూల్‌లో కీల‌క మార్పు!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో షెడ్యూల్‌కు సంబంధించి బీసీసీఐ కీల‌క మార్పు చేసింది. అహ్మ‌దాబాద్‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ్యాచ్‌ల‌కు సంబంధించి మ్యాచ్ వేదిక‌ల‌ను స్వాప్ చేస్తూ బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్‌ సైకియా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. విష‌యంలోకి వెళితే.. సీజ‌న్ తొలి ద‌శలో ఏప్రిల్ 26న అహ్మ‌దాబాద్ వేదిక‌గా మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు గుజ‌రాత్ టైటాన్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల దృష్ట్యా ఈ మ్యాచ్ వేదిక‌ను చెన్నై చిదంబ‌రం స్టేడియానికి మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ్యాచ్ స‌మ‌యంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇక మే 21 ఈ రెండు జ‌ట్లు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా రాత్రి 7.30 గంట‌ల‌కు మ‌రోసారి త‌ల‌ప‌డాల్సి ఉంది. తాజాగా ఈ వేదిక‌ను అహ్మ‌దాబాద్‌కు మారుస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 మ్యాచ్‌​ల్లో ఒక విజయంతో పట్టికలో 9వ స్థానంలో ఉండగా, గుజరాత్‌ టైటాన్స్‌ 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతుంది.చదవండి: తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌!

IPL 2026: Sunrisers Hyderabad Vs Rajasthan Royals Match Live Updates3
IPL 2026: రాజస్తాన్‌ టార్గెట్‌ 217 పరుగులు

SRH Vs RR Match Updateరాజ‌స్తాన్ ల‌క్ష్యం 217 పరుగులుఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఉప్ప‌ల్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 216 ప‌రుగులు చేసింది. ఇషాన్ కిష‌న్ 91 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా, క్లాసెన్ 40 ప‌రుగులు చేశాడు. చివర్లో సాహిల్‌ అరోరా (24 నాటౌట్‌) మెరిశాడు. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్‌లు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్ 2 వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ‌, తుసషార్ దేశ్ పాండే, ప‌రాగ్ త‌లా ఒక వికెట్ తీశారు.నాలుగో వికెట్‌ డౌన్‌హెన్రిచ్‌ క్లాసెన్‌ (40) రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. తుషార్‌ దేశ్‌ పాండే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్లాసెన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ ఔట్‌ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్‌ కిషన్‌ (91) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.13 ఓవర్లకు ఎస్‌ఆర్‌ఎస్‌ హెచ్‌ స్కోరు: 140/2హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్‌ కిషన్‌ఇషాన్ కిషన్ హఫ్‌ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్‌ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.హెడ్‌ ఔట్‌.. రెండో వికెట్‌ డౌన్‌రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో డొనొవన్‌ ఫెరీరాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 51/1రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గోల్డెన్‌ డక్‌ అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్‌ కిషన్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు​ ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్‌ (35 బ్యాటింగ్‌), హెడ్‌ (11 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్‌ కోల్పోయిన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఆదిలోనే ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి షాక్‌ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అభిషేక్‌ శర్మ రవి బిష్ణోయ్‌ క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మ‌రో ఆస‌క్తికర పోరుకు తెరలేచింది. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన రాజ‌స్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్‌మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ప్రిటోరియస్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి మ్యాచ్‌. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఉనాద్క‌ట్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లను త‌ప్పించిన‌ట్లు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయి. ఇరుజ‌ట్ల మ‌ధ్య 21 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా ఎస్ఆర్‌హెచ్ 12 మ్యాచ్‌ల్లో, రాజ‌స్తాన్ 9 మ్యాచ్‌ల్లో విజ‌యాలు సాధించాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌/ కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.

Tim David Punished For Disobeying Umpires-Hardik Pandya Fined Rs 12 Lakh4
తిక్క కుదిరింది.. ఆర్సీబీ బ్యాటర్‌కు షాక్‌!

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో తన ప్రవర్తనతో అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు కూడా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాకిచ్చింది. అంపైర్లకు బంతిని అందించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు ఐపీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా టిమ్‌ డేవిడ్‌పై చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.4 ప్రకారం టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించినట్లు ఐపీఎల్ కౌన్సిల్ తెలిపింది. జరిమానా విధించడం ద్వారా టిమ్‌ డేవిడ్‌ తిక్క కుదిరిందని అభిమానులు కామెంట్లు చేశారు. పాండ్యాకు జరిమానా..మరోవైపు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఆదివారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు చేసినందుకు పాండ్యాకు జ‌రిమానా విధిస్తూ ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టిక‌ల్ 2.22 ప్ర‌కారం హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టుకు ఇదే మొదటి తప్పిదం కావడంతో కెప్టెన్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని వెల్లడించింది.టిమ్‌ డేవిడ్‌ ఏం చేశాడంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’

Cricket Fans Slams Tim David Should Punish Worst Behaviour With Umpires5
‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) బ్యాట‌ర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక ప‌ని చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విష‌యంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. అయితే డేవిడ్ బ‌లంగా బాద‌డంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయ‌డం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాల‌ని ప‌దే ప‌దే అడిగిన‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ అత‌డిని ప‌ట్టించుకోకుండా అదే ప‌నిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేంద‌ర్ శ‌ర్మ వ‌చ్చి ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని వార్నింగ్ ఇవ్వ‌డం, ఇంత‌లో ముంబై ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫ‌న్నీ మోడ్‌లోనే చేసిన‌ప్ప‌టికీ చూసేవాళ్ల‌కు మాత్రం అత‌డి ప్ర‌వ‌ర్త‌న విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్‌ను ఏకిపారేశారు. ‘అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్‌కు ఇచ్చే మ‌ర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్ర‌శ్నించాడు. ‘అందుకే క్రికెట్‌లో యెల్లో, రెడ్ కార్డులు ప్ర‌వేశ‌పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంది’ అని మ‌రొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్ల‌ర చేష్ట‌లు చేయ‌కుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడ‌ని’ మ‌రికొంత‌మంది కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఆర్సీబీ 18 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్‌పై విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 240 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్‌, ప‌టిదార్‌లు అర్థ‌సెంచ‌రీల‌తో మెరిశారు. అనంత‌రం ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 222 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే!

SRH missing Cummins captaincy: Zaheer Khan slams Ishan Kishan6
కమిన్స్‌లా కాదు.. ఇషాన్‌ కిషన్‌పై జహీర్‌ ఖాన్‌ ఫైర్‌!

ఐపీఎల్‌-2026 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడి పరాజయంతో తాజా ఎడిషన్‌ మొదలుపెట్టింది ఎస్‌ఆర్‌హెచ్‌. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై ఘన విజయం సాధించినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది.జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలుసొంతమైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌.. చివరగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలోనూ చిత్తుగా ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ఉప్పల్‌ వేదికగా సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆస్ట్రేలియా స్టార్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ జట్టుతో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జహీర్‌ ఖాన్‌ అన్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న టీమిండియా స్టార్‌ ఇషాన్‌ కిషన్‌ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాడని విమర్శించాడు.కమిన్స్‌లా కాదు.. క్లారిటీ లేదు!ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌ ఫామ్‌లోకి వచ్చారు. ఇషాన్‌ కిషన్‌ మాత్రం బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరంభంలో బాగానే ఆడినా అదే జోరును కొనసాగించలేకపోతున్నాడు.కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్యాట్‌ కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇషాన్‌ విషయంలో అది మిస్సయ్యింది. తాను ఏమనుకుంటున్నాడో జట్టుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న ఇషాన్‌ కిషన్‌ నాయకత్వ ప్రణాళికల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొరపాటును సరిచేసుకుంటేనే సానుకూల ఫలితాలు వస్తాయి’’ అని జహీర్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌ చేసిన పరుగులు వరుసగా.. 80, 14, 1, 27.చదవండి: ‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’

IPL 2026 SRH vs RR Disallowed Items List During matches in Uppal stadium7
SRH vs RR: మ్యాచ్‌కు వెళ్తున్నారా?.. వీటిపై నిషేధం

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ను సోమవారం ఢీకొట్టనుంది. కాగా ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ ఒకటి మాత్రమే గెలిచింది.ఆసక్తికర పోరుమరోవైపు.. రాజస్తాన్‌ నాలుగు విజయాలతో టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతోంది. అయితే, సొంతమైదానంలో సత్తా చాటాలని సన్‌రైజర్స్‌ పట్టుదలగా ఉండగా.. రాజస్తాన్‌ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనుండగా.. మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు సిద్ధమైపోయారు. అటు రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. ఇటు సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతున్నారు.ఈ నేపథ్యంలో మల్కాజిగిరి కమిషనరేట్‌ ప్రేక్షకులు స్టేడియానికి తీసుకురాకూడని వస్తువుల గురించి గుర్తు చేసింది. ఇందుకు సంబంధించి ఫొటో విడుదల చేసింది. నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదని హెచ్చరించింది. స్టేడియంలో వస్తువులు భద్రపరిచేందుకు ఎలాంటి క్లాక్‌రూమ్‌ అందుబాటులో ఉండదని తెలిపింది.స్టేడియానికి తీసుకువెళ్లకూడని నిషిద్ధ వస్తువులు ఇవే👉కెమెరాలు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు👉బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌, ఎయిర్‌పాడ్స్‌👉సిగరెట్లు, లైటర్‌, అగ్గిపెట్టె👉తుపాకులు, కత్తులు, ఇతరత్రా ఆయుధాలు👉నీళ్ల బాటిళ్లు, ఆల్కహాల్‌, కూల్‌డ్రింక్స్‌👉పెంపుడు జంతువులు👉తినుబండారాలు👉బ్యాక్‌పాక్స్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌👉ల్యాప్‌టాప్స్‌, సెల్ఫీ స్టిక్కులు👉హెల్మెట్స్‌, బైనాక్యులర్స్‌👉పేలుడు పదార్థాలు, ఫైర్‌ క్రాకర్స్‌👉డ్రగ్స్‌.చదవండి: BCCI: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

Rajasthan Royals Batter Vaibhav Sooryavanshi Fears SRH Bowlers IPL 20268
ఈ లెక్క‌న ఎస్ఆర్‌హెచ్‌కు మూడిన‌ట్లే!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ భీక‌ర ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. బ‌రిలోకి దిగిందే మొద‌లు బాదుడే ల‌క్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్‌రేట్‌తో 200 ప‌రుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొన‌సాగుతున్నాడు. తాను క్రీజులో ఉంటే బౌల‌ర్ ఎవ‌రైతే నాకేంటి.. బంతిపైనే త‌న దృష్టి ఉంటుంద‌ని ఇటీవ‌లే ఆర్సీబీతో మ్యాచ్ అనంత‌రం డైరెక్ట్ స్టేట్‌మెంట్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌స్తాన్ ఆడిన ప్ర‌తీ జ‌ట్టులో ఒక ప్ర‌ధాన బౌల‌ర్‌ను వైభ‌వ్ ఒక ఆట ఆడుకున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో మాట్ హెన్రీని, గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో ర‌బాడను, ముంబైతో మ్యాచ్‌లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు. ఇక ఇవాళ వైభ‌వ్ సూర్యవంశీ ఎస్ఆర్‌హెచ్‌ను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్‌వుడ్‌, ర‌బాడ వంటి టాప్ బౌల‌ర్ల‌ను ఉతికారేసిన వైభ‌వ్ ముందు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చిన్న‌బోతోంది. క‌మిన్స్ లేక‌పోవ‌డంతో ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ బ‌ల‌హీనంగా త‌యార‌య్యింది. ఒక్కరు కూడా చెప్పుకోద‌గ్గ బౌల‌ర్ లేకపోవ‌డం మైన‌స్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్లు దారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. యావ‌రేజ్‌గా చూసుకుంటే ప్ర‌తీ ఓవ‌ర్‌కు 10.42 ప‌రుగులివ్వ‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో బౌలింగ్ ప‌రంగా అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న ఎస్ఆర్‌హెచ్‌దే. ఇక పేస‌ర్ల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా కనిపిస్తోంది. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, ఉనాద్క‌ట్‌, ఇషాన్ మ‌లింగ‌ల‌తో కూడిన పేస్ త్ర‌యం ప్ర‌తీ ఓవ‌ర్‌కు స‌గ‌టున 11.47 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. ఈ లెక్క‌న ఇవాళ్టి మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోమారు చెల‌రేగితే మాత్రం ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌కు మూడిన‌ట్లేన‌ని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ అంటేనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల బౌల‌ర్లు హ‌డ‌లెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ. ఇక ఐపీఎల్‌లో ఇరుజ‌ట్ల మధ్య జ‌రిగిన మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్‌దే పైచేయిగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఇరుజ‌ట్లు 21 సార్లు త‌ల‌పడితే ఎస్ఆర్‌హెచ్ 12 సార్లు, రాజ‌స్తాన్ 9 సార్లు విజ‌యాలు అందుకున్నాయి. సీజన్‌లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్‌ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.చదవండి: వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

Vaibhav Sooryavanshi To Be Punished For Romi Bhinders Act? 9
వైభవ్‌ సూర్యవంశీపై నిషేధం?

రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్ ఫోన్‌లో వాడడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. రోమీ భిందర్ ఐపీఎల్ యాంటీ కరప్షన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరు కూడా వినిపిస్తుడడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ ఘటనపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది. "మేనేజర్‌గా రోమీ భిందర్ ఫోన్ తీసుకెళ్లవచ్చు. కానీ దానిని డగౌట్‌లో వాడకూడదు. వీడియో ఫుటేజీని, చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఇప్పటికే రోమీ భిందర్ బీసీసీఐ అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఏమి జరిగిదంటే?ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ డగౌట్‌లో రోమీ భిందర్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాల కంట పడ్డాడు. అతడే పక్కన కూర్చున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ స్క్రీన్ చూస్తూ కన్పించాడు. ఇందుకు సబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ కూడా తీవ్రంగా స్పందించాడు.దీంతో ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ అంతర్గత విచారణ జరపనుంది. కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్‌ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్‌ ఫోన్లు వాడటం నిషిద్ధం. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో మేనేజర్ ఫోన్ ఉపయోగించవచ్చు.వైభవ్‌పై వేటు!కాగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే భిందర్‌పై జరిమానా లేదా నిషేధం పడే అవకాశం ఉంది. అలాగే ప‌క్క‌న ఉండి ఫోన్ చూసిన వైభ‌వ్ సూర్య‌వంశీపై కూడా బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకునే ఛాన్స్ ఉంది. అత‌డిపై జ‌రిమానా లేదా ఓ మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశ‌ముందని క్రికెట్ నిపుణ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

If He is not selected for Indian team: Ex India Star Fights For Shreyas Iyer10
‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో శ్రేయస్‌ అయ్యర్‌ హవా కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా ఈ టీమిండియా మిడిలార్డర్‌ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సారథిగా టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్‌. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 137 పరుగులు చేశాడు.శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా..ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్‌, ఐపీఎల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్‌ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గతంలో పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి శ్రేయస్‌ అయ్యర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతాఅయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్‌ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించారు.ఇలాంటి సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement