Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Suryakumar Yadav comments on Indias 93-run win over Namibia1
వారిద్ద‌రూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అద‌ర‌గొట్టారు: సూర్య

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో నమీబియాను 93 ప‌రుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ సూర్య‌కుమార్ స్పందించాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లోనూ విజయం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని సూర్య తెలిపాడు."ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జ‌ట్టు విజ‌యంలో ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ వంతు పాత్ర పోషించారు. వాంఖ‌డే వికెట్‌పై బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు. పిచ్ బ్యాటింగ్‌కు అంత‌ అనుకూలంగా లేన‌ప్ప‌టికి ఇషాన్, సంజూ మాత్రం మా ఇన్నింగ్స్‌ను ఘ‌నంగా ఆరంభించారు. అదేవిధంగా వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా నెల‌కొల్పిన భాగ‌స్వామ్యం మాకు చాలా కీల‌కంగా మారింది.క్లిష్ట స‌మ‌యంలో వారిద్ద‌రూ బ్యాటింగ్ చేసిన విధానం నిజంగా ప్రశంసనీయం. ఒక దశలో 240-250 పరుగులు దాటుతామనిపించినా, నమీబియా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి మ‌మ్మ‌ల్ని క‌ట్ట‌డి చేశారు. జ‌స్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన కోటా 4 ఓవర్లను పూర్తి చేయడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా జ‌స్ప్రీత్ త‌న రిథ‌మ్‌ను కొన‌సాగిస్తాడ‌ని ఆశిస్తున్నాము. అలాగే స్పిన్ ద్వ‌యం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ప్ర‌త్య‌ర్దుల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. వారిద్ద‌రిది అద్భుతమైన కాంబినేషన్. హార్దిక్ పాండ్యా గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.కొత్త బంతితో, పాత బంతితో గానీ బౌలింగ్ చేసేందుకు పాండ్యా ఎప్పుడు సిద్దంగా ఉంటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మా త‌దుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తాము" అని సూర్య పోస్ట్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 15న కొలంబో వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.భార‌త్ ఆల్‌రౌండ్ షో..ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. అనంత‌రం భారీ ల‌క్ష్య చేధ‌న‌లో 116 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

India Create History With Win Against Namibia, Become First Team In The World2
చ‌రిత్ర సృ‍ష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ టీమిండియా త‌న జోరును కొన‌సాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా నమీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ స‌త్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న‌మీబియా 18.2 ఓవ‌ర్ల‌లో 116 పరుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును త‌మ‌పేరిట లిఖించుకుంది.టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచ‌క‌ప్‌-2024లో టీమిండియా వ‌రుస‌గా 8 విజ‌యాలు సాధించి ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఇప్పుడు వ‌రుస‌గా రెండు విజ‌యాలు న‌మోదు చేయ‌డంతో ఈ అరుదైన భార‌త్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర్వాత ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌రుస‌గా 8 విజ‌యాలు న‌మోదు చేశాయి.టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వరుస‌గా అత్య‌ధిక విజ‌యాలు న‌మోదు చేసిన జ‌ట్లు ఇవేభార‌త్‌-10ఆస్ట్రేలియా-8ద‌క్షిణాఫ్రికా-8ఇంగ్లండ్‌-7చ‌ద‌వండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌

India beat Namibia by 93 runs in T20 World Cup3
ఇషాన్, పాండ్యా చెలరేగగా...

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు కాబట్టి భారత జట్టు ఈసారి ‘300’ కొడుతుందా అనే చర్చ మధ్య నమీబియాతో మ్యాచ్‌ మొదలైంది. ఆరంభంలో ఆట చూస్తే అది సాధ్యమే అని కూడా అనిపించింది. చివరకు వచ్చేసరికి ఇది జరగకపోయినా గత మ్యాచ్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్‌ పదును పెరిగింది. అమెరికాతో ఆశించిన స్కోరుకంటే చాలా తక్కువగా నమోదు చేసిన టీమిండియా ఈసారి మాత్రం 200 దాటింది. ఆపై సమష్టి ప్రదర్శనతో బలహీన ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు తమ టి20 ప్రపంచకప్‌ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్‌ మెరుపులు, వరుణ్‌ చక్రవర్తి పొదుపైన బౌలింగ్, హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన జట్టును గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. న్యూఢిల్లీ: టి20 వరల్డ్‌కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించారు. నమీబియా కెప్టెన్, ఆఫ్‌స్పిన్నర్‌ గెరార్డ్‌ ఎరాస్మస్‌ (4/20) పొదుపైన బౌలింగ్‌ సహా 4 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌ చివరి 11 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు చేజార్చుకుంది. అనంతరం నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. లౌరెన్‌ స్టీన్‌కాంప్‌ (20 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా...వరుణ్‌ చక్రవర్తి 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్‌ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు సామ్సన్‌కు అవకాశం దక్కగా... బుమ్రా తిరిగి రావడంతోసిరాజ్‌ను తప్పించాల్సి వచ్చింది. తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ ఈ నెల 15న కొలంబోలో పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఇషాన్‌ 6, 6, 6, 6, 4... అభిషేక్‌ గైర్హాజరులో అదృష్టవశాత్తూ మ్యాచ్‌ అవకాశం దక్కించుకున్న సంజు సామ్సన్‌ (8 బంతుల్లో 22; 1 ఫోర్, 3 సిక్స్‌లు) సిక్స్‌తో స్కోరింగ్‌ మొదలు పెట్టినా అది ఎక్కువసేపు సాగలేదు. షికోంగో ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ఇషాన్‌ తన జోరును మొదలు పెట్టాడు. 8 బంతుల వ్యవధిలో 4 ఫోర్లు కొట్టిన అతను... స్మిట్‌ వేసిన ఓవర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 4 బాదిన అతను 20 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. పవర్‌ప్లే ముగిసేసరికి 86 పరుగులు చేసిన భారత్‌... 6.5 ఓవర్లలోనే 100 పరుగులను అందుకుంది. టి20 వరల్డ్‌ కప్‌లో అతి తక్కువ బంతుల్లో (35 బంతుల్లో) వంద పరుగులు సాధించిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఇషాన్‌ అవుటైన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌ (12), హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) కూడా తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే పాండ్యా, శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) భారీ భాగస్వామ్యంతో స్కోరు 200 దాటింది. వీరిద్దరు 39 బంతుల్లో 81 పరుగులు జత చేశారు. షికోంగో ఓవర్లో వరుసగా సిక్స్, 2 ఫోర్లు కొట్టిన హార్దిక్‌ పాండ్యా 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. చివర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. టపటపా... ఛేదనలో దాదాపు సగం ఓవర్ల వరకు నమీబియా ప్రదర్శన మెరుగ్గానే ఉంది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. స్టీన్‌కాంప్‌తో పాటు ఫ్రైలింగ్‌ (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఎరాస్మస్‌ (11 బంతుల్లో 18; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. 9.1 ఓవర్లలో జట్టు 86/2 వద్ద నిలిచింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిది. భారత బౌలర్లు చెలరేగడంతో నమీబియా బ్యాటర్లు ఎవరూ నిలవలేకపోయారు. 8 పరుగుల వ్యవధిలో తర్వాతి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్‌ కోలుకోలేకపోయింది. ఒకే స్కోరు వద్ద జట్టు చివరి 3 వికెట్లు పడ్డాయి. ఎరాస్మస్‌ ‘డెడ్‌ బాల్‌’ భారత్‌తో మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్‌ బౌలింగ్‌ శైలి చర్చకు దారి తీసింది. బౌలింగ్‌ క్రీజ్‌ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే అతను బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అతని తొలి ఓవర్లో దీనిని అంపైర్‌ టకర్‌ ‘డెడ్‌ బాల్‌’గా ప్రకటించాడు. దాంతో అంపైర్‌కు ఎరాస్మస్‌కు మధ్య కాస్త వాదన జరిగింది. అయితే అతని మరుసటి ఓవర్లో అంపైర్‌ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్‌ వెనక నుంచి బౌలింగ్‌ చేసిన ఎరాస్మస్‌ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్‌ చేయడంతో సమస్య రాలేదు. ఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్‌ ఆఫ్‌ స్పిన్‌...రౌండ్‌ ఆర్మ్‌...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్‌ఫ్యూజన్‌కు గురి చేసిన ఎరాస్మస్‌ నాలుగు వికెట్లు బుట్టలో వేసుకున్నాడు. స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) షికోంగో (బి) ఎరాస్మస్‌ 61; సామ్సన్‌ (సి) స్టీన్‌కాంప్‌ (బి) షికోంగో 22; తిలక్‌ (సి) స్మిట్‌ (బి) ఎరాస్మస్‌ 25; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) గ్రీన్‌ (బి) స్కాల్‌ 12; పాండ్యా (సి) (సబ్‌) లీషర్‌ (బి) ఎరాస్మస్‌ 52; దూబే (రనౌట్‌) 23; రింకూ (సి) ఎరాస్మర్‌ (బి) స్మిట్‌ 1; అక్షర్‌ (బి) ఎరాస్మస్‌ 0; వరుణ్‌ (నాటౌట్‌) 1; అర్‌‡్షదీప్‌ (రనౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–25, 2–104, 3–120, 4–124, 5–205, 6–205, 7–206, 8–206, 9–209. బౌలింగ్‌: రూబెన్‌ 4–0–38–0, షికోంగో 3–0–41–1, స్మిట్‌ 4–0–50–1, హీన్‌గో 1–0–18–0, ఎరాస్మస్‌ 4–0–20–4, స్కాల్‌ 4–0–41–1. నమీబియా ఇన్నింగ్స్‌: స్టీన్‌కాంప్‌ (బి) వరుణ్‌ 29; ఫ్రైలింక్‌ (సి) దూబే (బి) అర్‌‡్షదీప్‌ 22; జాన్‌ నికోల్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 13; ఎరాస్మస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 18; స్మిట్‌ (బి) వరుణ్‌ 0; గ్రీన్‌ (హిట్‌వికెట్‌) (బి) దూబే 11; క్రూగర్‌ (సి) బుమ్రా (బి) అక్షర్‌ 5; రూబెన్‌ (బి) బుమ్రా 6; స్కాల్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 4; షికోంగో (ఎల్బీ) (బి) పాండ్యా 0; హీన్‌గో (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 116. వికెట్ల పతనం: 1–33, 2–67, 3–86, 4–86, 5–88, 6–94, 7–111, 8–116, 9–116, 10–116. బౌలింగ్‌: హార్దిక్‌ పాండ్యా 4–0–21 –2, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3–0–36–1, శివమ్‌ దూబే 2.2–0–11–1, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–20–1, వరుణ్‌ చక్రవర్తి 2–0–7–3, అక్షర్‌ పటేల్‌ 3–1–20–2. టి20 ప్రపంచకప్‌లో నేడుఆ్రస్టేలియా x జింబాబ్వేవేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి కెనడా x యూఏఈవేదిక: న్యూఢిల్లీ; మ.గం. 3 నుంచి నెదర్లాండ్స్‌ x అమెరికావేదిక: చెన్నై; రాత్రి గం. 7 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

India clean sweeps 50m rifle three positions event4
మూడు పతకాలూ మనవే

న్యూఢిల్లీ: స్వదేశంలో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆసియా షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో గురువారం సీనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. వ్యక్తిగతవిభాగంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతోపాటు టీమ్‌ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు స్కోరును సాధించాడు. స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. భారత్‌కే చెందిన నీరజ్‌ కుమార్‌ 361.8 పాయింట్లతో రజతం కైవసం చేసుకోగా... అఖిల్‌ షెరాన్‌ 343.5 పాయింట్లతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఐశ్వర్య ప్రతాప్, నీరజ్, అఖిల్‌లతో కూడిన భారత బృందం 1769 పాయింట్లతో టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. జూనియర్‌ పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు అడ్రియన్‌ కర్మాకర్‌ 353.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... మానవేంద్ర సింగ్‌ షెఖావత్‌ 338.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని నెగ్గారు. అడ్రియన్‌ కర్మాకర్, మానవేంద్ర సింగ్, ప్రిన్స్‌లతో కూడిన భారత బృందం టీమ్‌ విభాగంలో 1741 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత షూటర్లు 38 స్వర్ణాలు, 16 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి 70 పతకాలు సాధించారు.

Rashmika Jodi in the semis5
సెమీస్‌లో రష్మిక జోడీ

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక–అంకిత రైనా (భారత్‌) ద్వయం 7–6 (9/7), 6–3తో భారత్‌కే చెందిన వైష్ణవి–వైదేహి జంటపై గెలుపొందింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక–అంకిత రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశారు. హైదరాబాద్‌కే చెందిన సహజ యామలపల్లికి మాత్రం నిరాశ ఎదురైంది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సహజ (భారత్‌)–జుజానా పావ్లీకౌస్కా (పోలాండ్‌) జంట 6–4, 3–6, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో పొలీనా బఖ్‌ముత్కినా (బెల్జియం)–మరియా గొలోవినా (రష్యా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది.

Snehit makes a good start at the World Table Tennis Chennai Star Contenders Tournament6
స్నేహిత్‌ శుభారంభం

చెన్నై: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) చెన్నై స్టార్‌ కంటెండర్‌ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ ప్లేయర్‌ సూరావజ్జుల స్నేహిత్‌ శుభారంభం చేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్‌ స్నేహిత్‌ 9–11, 11–8, 8–11, 11–7, 11–6తో భారత్‌కే చెందిన దివ్యాంశ్‌ శ్రీవాస్తవపై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. భారత్‌కే చెందిన ఆకాశ్‌ పాల్, అంకుర్, హర్మీత్‌ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

T20 World Cup 2026: Team India Huge Victory over Namibia7
T20 World Cup 2026: నమీబియాపై టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్‌గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది.నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్‌మెన్స్‌ తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్‌లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. తొలుత టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోర్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. తుది జట్లు..భారత్‌: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రానమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

T20 WC 2026, IND VS NAM: Arshdeep Singh completes 250 T20 wickets8
T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్‌ సింగ్‌

భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్‌ మొత్తంలో (అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌, దేశవాలీ) 250 వికెట్లు పూర్తి చేసిన కొద్ది మంది బౌలర్ల సరసన నిలిచాడు. అర్షదీప్‌ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. జాన్‌ ఫ్రైలింక్‌ వికెట్‌ అర్షదీప్‌కు 250వ వికెట్‌.అర్షదీప్‌ కెరీర్‌ సగటు 22 లోపే ఉండగా, ఎకానమీ రేట్ 8పైగా ఉంది. టీ20 కెరీర్‌ మొత్తంలో అర్షదీప్‌ ఐదు సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అర్షదీప్‌ తన టీ20 కెరీర్‌లో ఎక్కువ శాతం భారత్, పంజాబ్, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అర్షదీప్‌ అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున (121) అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు. ఐపీఎల్‌లో అర్షదీప్‌ 97 వికెట్లు తీశాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. నమీబియాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీలు బాది భారత్‌కు ఈ స్కోర్‌ అందించారు.మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12; సిక్స్‌) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు.ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.భారీ లక్ష్య ఛేదనలో నమీబియా ఓటమి దిశగా సాగుతుంది. 11 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 88-5గా ఉంది. వరుణ్‌ చక్రవర్తి 3, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌ తలో వికెట్‌ తీసి నమీబియాను దెబ్బకొట్టారు.

T20 WC 2026: team india set 210 runs target to namibia9
ఇషాన్‌ విధ్వంసం, హార్దిక్‌ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఇషాన్‌, హార్దిక్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌ ఇంకా భారీ స్కోర్‌ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌ (8 బంతుల్లో 22; ఫోర్‌, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. తిలక్‌ వర్మ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు, 3 ఫోర్లు), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 12; సిక్స్‌) ఆచితూచి ఆడారు. శివమ్‌ దూబే (16 బంతుల్లో 23; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (6 బంతుల్లో 1) బంతులు వృధా చేశాడు. అక్షర్‌ పటేల్‌ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటాయ్యడు. అర్షదీప్‌ సింగ్‌ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.నమీబియా బౌలర్లలో కెప్టెన్‌ గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (4-0-20-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రూబెన్‌ ట్రంపల్‌మెన్‌ (4-0-38-0), షికోంగో (3-0-41-1) కూడా పర్వాలేదనిపించాడు. స్మిట్‌ (4-0-50-1), బెర్నాల్డ్‌ స్కోల్జ్‌పై (4-0-41-1) భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మ్యాక్స్‌ హెంగో (1-0-18-0) ఒక్క ఓవర్‌తోనే చాలించుకున్నాడు.

Ishan becomes the first Indian WK batter to score a fifty in T20 World Cup history10
T20 WC 2026: ఊచకోత.. చరిత్ర సృష్టించిన ఇషాన్‌ కిషన్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా నమీబియాతో ఇవాళ (ఫిబ్రవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌.. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు ఏ భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ కూడా ఈ ఘనత సాధించలేదు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ఛాంపియన్‌ (2007, 2024) అయినా, ఓ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం​ నిజంగానే ఆశ్చర్యకరం.20 బంతుల్లో హాఫ్‌ సెంచరీఈ రికార్డు హాఫ్‌ సెంచరీని ఇషాన్‌ కేవలం 20 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి, నమీబియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడాడు. మూడో ఓవర్లో అతను సహజ మోడ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ఇషాన్‌.. ఆమరుసటి ఓవర్‌లో మరో బౌండరీ కొట్టాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. స్మట్స్‌ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు, ఓ బౌండరీ బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో వరుసగా మరో సిక్సర్‌, బౌండరీ కొట్టాడు. అనంతరం 7వ ఓవర్‌ తొలి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఇషాన్‌ ధాటికి భారత్‌ 7 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.అంతకుముందు సంజూ శాంసన్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజూ సైతం హ్యాట్రిక్‌ సిక్సర్లు, బౌండరీ ​కొట్టి, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు. సంజూ 8 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్ల సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్‌ ఔటయ్యాక భారత స్కోర్‌ కాస్త నెమ్మదించింది.హార్దిక్‌ లైన్‌లోకి వచ్చాడుఅయితే హార్దిక్‌ పాండ్యా రాకతో భారత స్కోర్‌ మళ్లీ జోరందుకుంది. హార్దిక్‌ కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్‌, ఆమరుసటి బంతికే ఔటయ్యాడు.18.2 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 205/5గా ఉంది. శివమ్‌ దూబే (23), రింకూ సింగ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement