Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

With Tears In Eyes Gambhir Never Seen Before Avatar Stuns Fans Video Viral1
కన్నీటిపర్యంతమైన గంభీర్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న వీడియో!

‘‘గౌతమ్‌ గంభీర్‌.. వన్డే, టీ20 ఫార్మాట్లకు కోచ్‌గా ఫర్వాలేదు. కానీ టెస్టులకు మాత్రం అతడు పనికిరాడు. అతడు హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత పసికూన బంగ్లాదేశ్‌పై సిరీస్‌ విజయాన్ని మినహాయిస్తే.. టీమిండియా అత్యంత ఘోరమైన పరాజయాలు చవిచూసింది.సొంతగడ్డపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా న్యూజిలాండ్‌ (IND vs NZ)తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌ అయింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలోనూ దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (IND vs AUS)ని చేజార్చుకుంది.ఇదంతా ఒక ఎత్తైతే.. ఇంగ్లండ్‌ టూర్‌కు ముందే దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి గంభీర్‌ కూడా ఓ కారణం. అంతేకాదు.. యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ కావడంలోనూ గౌతీదే కీలక పాత్ర.దిగ్గజాలు లేకుండా గిల్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ గడ్డ మీద గెలవాల్సిన తొలి జట్టులో టీమిండియా ఓడిపోవడానికి కోచ్‌, కెప్టెన్‌ వ్యూహాలు సరిగ్గా లేకపోవడమే కారణం’’.. ఇటీవలి కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై వచ్చిన విమర్శలూ, ఆరోపణలూ ఇవీ. టెస్టుల్లో భారత్‌ వరుసగా విఫలం కావడంతో అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి.ఈ సిరీస్‌ కూడా సమర్పయామి అంటూ..అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత గౌతీపై విమర్శల దాడికి కాస్త బ్రేక్‌ పడింది. కానీ ఆ తర్వాత మళ్లీ పాత కథే పునరావృతమైంది.లార్డ్స్‌ టెస్టులో ఓటమి.. మాంచెస్టర్‌లో మ్యాచ్‌ డ్రా కావడం.. ఆఖరిగా ఓవల్‌లో ఐదో టెస్టులోనూ ఆఖరి రోజు వరకు ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో ఉండటంతో .. ఇక ఈ సిరీస్‌ కూడా సమర్పయామి అంటూ మళ్లీ గంభీర్‌పై విమర్శలు మొదలయ్యాయి.అయితే, చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ టెస్టులో భారత్‌ సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ విజయానికి 17 పరుగులు.. టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నవేళ ప్రసిద్‌ కృష్ణ జోష్‌ టంగ్‌ను బౌల్డ్‌ చేసి తొమ్మిదో వికెట్‌ పడగొట్టాడు.అద్భుతం చేసిన సిరాజ్‌ఇక విజయ సమీకరణాలు 7 పరుగులు.. ఒక వికెట్‌గా మారగా మహ్మద్‌ సిరాజ్‌ మరోసారి అద్భుతమే చేశాడు. అద్భుతమైన డెలివరీతో గస్‌ అట్కిన్సన్‌ను బౌల్డ్‌ చేసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ దృశ్యాల్ని చూస్తున్న సగటు అభిమానులతో పాటు కోచ్‌ గంభీర్‌ హృదయం ఉప్పొంగిపోయింది.గంభీర్‌ కన్నీటి పర్యంతంగతంలో ఎన్నడూ లేనివిధంగా గౌతీ కంట నీరొలికింది. తీవ్ర భావోద్వేగానికి లోనైన గంభీర్‌.. సహచర సిబ్బందిని గట్టిగా ఆలింగనం చేసుకుని వారిని ఆప్యాయంగా ముద్దాడాడు. ఆనందభాష్పాలు రాలుస్తూ టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. గంభీర్‌కు ఈ గెలుపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో తెలియజేయడానికి ఈ దృశ్యాలు చాలు!!ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘‘నిజంగా ఈ వీడియో గూప్‌బంప్స్‌ తెప్పిస్తోంది భయ్యా. టీమిండియాకు, గంభీర్‌కు శుభాకాంక్షలు’’ అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవల్‌లో విజయంతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-2తో సమం చేసింది.భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్‌- 224 & 396👉ఇంగ్లండ్‌- 247 & 367✊ఆరు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్‌.చదవండి: న‌న్ను న‌మ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్‌ సిరాజ్‌𝗕𝗲𝗹𝗶𝗲𝗳. 𝗔𝗻𝘁𝗶𝗰𝗶𝗽𝗮𝘁𝗶𝗼𝗻. 𝗝𝘂𝗯𝗶𝗹𝗮𝘁𝗶𝗼𝗻!Raw Emotions straight after #TeamIndia's special win at the Kennington Oval 🔝#ENGvIND pic.twitter.com/vhrfv8ditL— BCCI (@BCCI) August 4, 2025

IND VS ENG 2025: Team India Created History, Scored Second Highest Runs In A Test Series2
టీమిండియా సరికొత్త చరిత్ర.. రికార్డుల జాతర

ఇంగ్లండ్‌తో జరిగిన టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ-2025 రికార్డులకు అడ్డాగా మారింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చాలా రికార్డులు తిరగరాయబడ్డాయి. వీటిలో సింహభాగం భారత్‌, భారత్‌ ఆటగాళ్ల ఖాతాలో పడ్డాయి. జట్టు పరంగా టీమిండియా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది.ఓ టెస్ట్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా తర్వాత రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ సిరీస్‌లో భారత్‌ 42.32 సగటున 3809 పరుగులు చేసింది. 1989 యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా అత్యధికంగా 3877 పరుగులు చేసింది. తాజా సిరీస్‌లో భారత్‌ కేవలం 5 టెస్ట్‌ల్లోనే ఈ పరుగులు చేయగా.. ఆసీస్‌ నాటి యాషెస్‌ సిరీస్‌లో 6 టెస్ట్‌లు ఆడి భారత్‌ కంటే కేవలం 68 పరుగులే ఎక్కువ చేసింది.ఈ రికార్డుతో పాటు టెండూల్కర్‌-ఆండర్సన్‌ సిరీస్‌ మరిన్ని రికార్డులకు వేదికైంది. ఆ రికార్డులపై ఓ లుక్కేద్దాం.భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు- శుభ్‌మన్‌ గిల్‌ (5 మ్యాచ్‌ల్లో 754 పరుగులు). గతంలో ఈ రికార్డు గ్రహం గూచ్‌ (752) పేరిట ఉండేది.ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌- శుభ్‌మన్‌ గిల్‌. గతంలో ఈ రికార్డు సునీల్‌ గవాస్కర్‌ (732) పేరిట ఉండేది.SENA దేశాల్లో జరిగిన సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌: శుభ్‌మన్‌ గిల్‌, గతంలో ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (692) పేరిట ఉండేది.టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన భారత కెప్టెన్‌: శుభ్‌మన్‌ గిల్‌ (269 ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో). గతంలో ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (254) పేరిట ఉండేది.SENA దేశాల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సిన ఆసియా కెప్టెన్‌: శుభ్‌మన్‌ గిల్‌. గతంలో ఈ రికార్డు తిలకరత్నే దిల్షన్‌ (193) పేరిట ఉండేది.ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక బ్యాటర్‌: శుభ్‌మన్‌ గిల్‌ (430, ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో 269+161). గతంలో ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ (426) పేరిట ఉండేది.ఒకే టెస్ట్‌లో సెంచరీ, 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి ఇంగ్లండ్‌ కెప్టెన్‌: బెన్‌ స్టోక్స్‌ (నాలుగో టెస్ట్‌)ఒకే టెస్ట్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌: రిషబ్‌ పంత్‌ (హెడింగ్లే టెస్ట్‌)టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకిన జో రూట్‌: ఈ సిరీస్‌లో రూట్‌ ద్రవిడ్‌, కల్లిస్‌, రికీ పాంటింగ్‌లను అధిగమించి టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లిస్ట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ టాప్‌లో ఉన్నాడు.వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో 6000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌: జో రూట్‌SENA దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌: బుమ్రా (61 ఇన్నింగ్స్‌ల్లో)ఓ సిరీస్‌లో రెండో అత్యధిక పరుగులు (ఇరు జట్లు): ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ కలిపి 7000 పైచిలుకు పరుగులు నమోదు చేశాయి. 1993 యాషెస్‌ సిరీస్‌లో మాత్రమే ఈ ఘనత నమోదైంది.భారత్‌ అత్యల్ప, అతి భారీ విజయాలు (పరుగుల పరంగా): భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప, అతి భారీ విజయాలు ఈ సిరీస్‌లోనే నమోదయ్యాయి. ఈ సిరీస్‌లోని ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందగా.. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో 336 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

Team India Climbs To Third Place In WTC Points Table After Oval Test Win Against England3
చిరస్మరణీయ విజయం.. ఇంగ్లండ్‌ను వెనక్కు నెట్టిన టీమిండియా

ఓవల్‌ టెస్ట్‌ విజయానంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (2025-27) పాయింట్ల పట్టికలో భారత్‌ ఇం​గ్లండ్‌ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ మూడో ప్లేస్‌లో ఉండింది.ఈ మ్యాచ్‌‌ విజయానంతరం భారత్‌ విజయాల శాతం 46.67గా ఉండగా.. ఇంగ్లండ్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 43.33కు పడిపోయింది. ఆస్ట్రేలియా (100), శ్రీలంక (66.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 16.67 విజయాల శాతంతో బంగ్లాదేశ్‌ ఐదో ప్లేస్‌లో ఉంది. వెస్టిండీస్‌ ఈ సైకిల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఆరో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఈ సైకిల్‌లో ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-2తో సిరీస్‌ను సమం చేసుకుంది. 1, 3 టెస్ట్‌ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌ గెలువగా.. భారత్‌ 2, 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. డబ్ల్యూటీసీలో భారత్‌ తదుపరి టెస్ట్‌ సిరీస్‌ వెస్టిండీస్‌తో ఆడనుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ భారత్‌ వేదికగా ఆక్టోబర్‌ 2 నుంచి ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్‌ అహ్మదాబాద్‌లో, రెండో టెస్ట్‌ (అక్టోబర్‌ 10 నుంచి) ఢిల్లీలో జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, హోరాహోరీగా సాగిన ఓవల్‌ టెస్ట్‌లో భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ చివరి రోజు భారత్‌ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. భారత బౌలర్లలో సిరాజ్‌ మ్యాజిక్‌ చేసి ఇంగ్లండ్‌‌ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్‌ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్‌ సహకరించాడు. వీరిద్దరు కలిపి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Country Means Everything: Pant Wins Hearts With Emotional Post After Oval Test Glory4
దేశమే సర్వస్వం.. దేనికి వెనకాడం.. పంత్‌ భావోద్వేగ పోస్ట్‌

క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్‌ మ్యాచ్‌లలో ఇది ఒకటి. ఓవల్‌ వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్‌పై భారత్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్‌ చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్‌ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్‌ కృష్ణ తన వంతుగా ఓ వికెట్‌ తీశాడు.374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్‌ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్‌ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్‌ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్‌ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్‌ పంత్‌ స్పందించాడు. ఇన్‌స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్‌ పెట్టాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్‌ సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్‌కు దూరంగా ఉన్న పంత్‌.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదని ‍స్పష్టం చేశాడు.పంత్‌ మాటల్లో.. ఈ ఇంగ్లండ్‌ పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్‌ ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్‌ తర్వాత భారత క్రికెట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.కాగా, ఈ సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ టీమిండియాకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అతను అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్‌లో క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ చేయబోగా పంత్‌ పాదం​ ఫ్రాక్చర్‌కు గురైంది. పాదం ఫ్రాక్చర్‌ అయినా పంత్‌ ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్‌లో పంత్‌ కుంటుతూనే హాఫ్‌ సెంచరీ చేయడం విశేషం. ఓవల్‌ టెస్ట్‌లో విజయంతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.

ENG VS IND: Gautam Gambhir Emotional Post After Oval Test Win5
కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. ‍కానీ, ఎప్పటికీ లొంగిపోము: గంభీర్‌

ఓవల్‌ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించిన అనంతరం జట్టు హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తుతూ సోషల్‌మీడియాలో ఓ కదిలించే పోస్ట్‌ పెట్టాడు. కొన్ని గెలుస్తాం.. కొన్ని ఓడతాం.. కానీ, ఎప్పటికీ లొంగిపోము. వెల్‌డన్‌ బాయ్స్‌ అంటూ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ మెసేజ్‌తో పాటు గంభీర్‌ టీమిండియా ఆటగాళ్లు విజయదరహాసంతో ఉన్న పలు ఫోటోలను పోస్ట్‌ చేశాడు. గంభీర్‌ చేసిన ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతోంది.కాగా, ఇంగ్లండ్‌ సిరీస్‌ ఆధ్యాంతం టీమిండియా చూపించిన పోరాటస్పూర్తిలో గంభీర్‌ ప్రధానపాత్ర పోషించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆశలు వదులుకోకూడదంటూ (Never give up) ఆటగాళ్లలో కసిని రగిల్చాడు. మనది యంగ్‌ టీమ్‌ కాదు, గన్‌ టీమ్‌ అంటూ ఆటగాళ్లలో ఉత్తేజాన్ని నింపాడు. ఆటగాళ్లను ప్రతి విషయంలో దగ్గరుండి ప్రోత్సహించాడు. కొందరు ఆటగాళ్లు (ఆకాశ్‌దీప్‌, జైస్వాల్‌) విఫలమైప్పుడు వెనకేసుకొచ్చి సత్ఫలితాలు రాబట్టాడు.అవసరమైనప్పుడు దండించాడు. మంచి ప్రదర్శన చేసినప్పుడు ముద్దులతో ముంచెత్తాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు స్పూర్తిదాతగా నిలిచాడు. ఓవల్‌ టెస్ట్‌ విజయం తర్వాత గంభీర్‌లోని చిన్నపిల్లాడు బయటికి వచ్చాడు. విజయగర్వంతో ఊగిపోతూ ఎగిరి గంతులేశాడు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ముద్దులతో ముంచెత్తాడు. టీమిండియా మొత్తాన్ని తీవ్ర భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు. ముఖ్యంగా సిరాజ్‌పై ప్రశంసలపై వర్షం కురిపించాడు. అతన్ని కెప్టెన్‌తో పాటు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కూర్చోబెట్టి కొత్త ఆనవాయితీకి తెరలేపాడు.ఓవల్‌ టెస్ట్‌లో సిరాజ్‌ చారిత్రక స్పెల్‌తో భారత్‌కు అపురూప విజయాన్నందించాడు. చివరి రోజు 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్‌ మియా మ్యాజిక్‌ చేశాడు. ఇంగ్లండ్‌ చేతిలో 4 వికెట్లుండగా.. 3 వికెట్లు తీసి వారి నోటి కాడి విజయాన్ని లాక్కున్నాడు.ఈ మ్యాచ్‌ మొత్తం అద్బుతమైన పోరాటాలతో సాగింది. తొలుత భారత్‌ స్వల్ప స్కోర్‌కే ఔటైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లండ్‌ను కూడా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ బ్యాటర్లు అద్భుతమే చేశారు. జైస్వాల్‌, ఆకాశ్‌దీప్‌, జడేజా, సుందర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు భారీ స్కోర్‌ అందించారు. అనంతరం 374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలను వదులుకోకుండా పోరాడారు. ఇంగ్లండ్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లపై ప్రతాపం చూపించారు. సిరాజ్‌, ప్రసిద్ద్‌ నిరుత్సాహపడకుండా వారు చేయాల్సిందంతా చేసి సత్పలితాన్ని రాబట్టారు. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది.

Mohammed Siraj The Hero As India Clinch Famous Win vs England Series6
IND Vs ENG: జో జీతా వహి సిరాజ్‌

సిరీస్‌లో ఐదు టెస్టులూ చివరి వరకు ఆడిన ఏకైక పేస్‌ బౌలర్‌. ఏకంగా 1113 బంతులు... సిరీస్‌ తొలిరోజు నుంచి చివరిరోజు వరకు బౌలింగ్‌లో అదే వేగం, అంతే తీవ్రత... ప్రతీ బంతి వేసే సమయంలో 100 శాతం ఇవ్వాలనే తపన... చేసే పని భారంగా అనిపించలేదు... సుదీర్ఘ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోలేదు. గాయంతో తప్పుకోలేదు, మ్యాచ్‌ మధ్యలో ఫిట్‌నెస్‌ సమస్యలతో ఒక్కసారి కూడా బౌలింగ్‌కు దూరం కాలేదు... చివరకు అద్భుత రీతిలో మ్యాచ్‌ను గెలిపించే వరకు ఆగిపోలేదు... ఇలాంటి పోరాటతత్వం, పట్టుదల హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కే సాధ్యమైంది. 185.3 ఓవర్ల బౌలింగ్‌ తర్వాత కూడా అతను అలసిపోకుండా ఇప్పుడు మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండి ‘సై’ అంటున్నాడు. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శనను ప్రశంసించనివారు లేరు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్లు అథర్టన్, మైకేల్‌ వాన్, నాసిర్‌ హుస్సేన్‌ మాటల్లో చెప్పాలంటే సిరాజ్‌ సింహంలా పోరాడిన ఒక ‘లయన్‌ హార్ట్‌’ బౌలర్‌. అసలు అతను సిరీస్‌ ఆసాంతం ఒకే తరహాలో అంతే దూకుడుతో ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడో వారికి కూడా ఆశ్చర్యపర్చింది. ‘దేశం తరఫున ఆడటం అనేదే ఒక ఆటగాడికి లభించే ఎంతో గొప్ప అవకాశం. అలాంటప్పుడు నేను ఎన్ని ఓవర్లు వేశాను, ఎంత ఎక్కువగా కష్టపడుతున్నాను అన్నది అస్సలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు. నాలో సత్తా ఉన్నంత వరకు బౌలింగ్‌ చేస్తూనే ఉంటాను. అదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా నేను ఫిట్‌గా ఉన్నాను’... చివరి టెస్టు ముగిసిన తర్వాత భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ వ్యాఖ్య ఇది. ముందుండి నడిపిస్తూ... టాప్‌ పేసర్‌ బుమ్రా మూడు టెస్టులే ఆడతాడని ఖాయమయ్యాక సహజంగానే సీనియర్‌ అయిన సిరాజ్‌పై ఎక్కువ బాధ్యత నిలిచింది. దానిని అతను సమర్థంగా నిర్వర్తించాడు. జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ సిరాజ్‌ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. కొత్త బంతి ఇస్తే దానిని సమర్థంగా ఉపయోగించాడు. కాస్త పాతబడిన బంతిని అప్పగిస్తే డ్యూక్‌ బంతులను వాడుకుంటూ స్వింగ్‌లో చెలరేగడం అతనికే చెల్లింది. కెప్టెన్‌ గిల్‌ అయితే ఇక చాలు బౌలింగ్‌ చేయలేడు అనిపించిన సమయాల్లో కూడా మళ్లీ సిరాజ్‌కే బంతిని అప్పగించాడు. కాస్త ఘాటుగా చెప్పాలంటే చెరకు మిషన్‌లో చెరకు గడను చివరి వరకు వాడుతూ పిప్పి చేసినట్లుగా సిరాజ్‌ను గిల్‌ ఉపయోగించుకున్నాడు. అయినా సరే ఎక్కడా తగ్గకుండా కీలక సమయాల్లో కీలక వికెట్లతో భారత్‌ మ్యాచ్‌లో పైచేయి సాధించేలా చేశాడు. బుమ్రా ఆడని రెండు టెస్టుల్లో భారత్‌ గెలిచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో 7 వికెట్లు తీసిన సిరాజ్, ఓవల్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అతను రెండుసార్లు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. రెండో టెస్టులో వరుస బంతుల్లో రూట్, స్టోక్స్‌లను అవుట్‌ చేయడం, క్రాలీని డకౌట్‌ చేయడం కీలక మలుపులు కాగా... ఓవల్‌ తొలి ఇన్నింగ్స్‌లో అతను తీసిన పోప్, రూట్, బ్రూక్‌ వికెట్లతోనే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కలేదు. మూడో రోజు క్రాలీని బౌల్డ్‌ చేసిన బంతిని ఎవరూ మర్చిపోలేరు. చివరి రోజు బౌలింగ్‌ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిలకడగా సత్తా చాటుతూ... మాంచెస్టర్‌ టెస్టులో 30 ఓవర్లలో 140 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్‌ తీసినప్పుడు సిరాజ్‌ బౌలింగ్‌లో పదును తగ్గినట్లు అనిపించింది. అయితే తర్వాతి మ్యాచ్‌తోనే అతను తనపై వచ్చిన సందేహాలను పటాపంచలు చేశాడు. చాలా సందర్భాల్లో బుమ్రా నీడలో ఉన్నట్లుగా కనిపించిన సిరాజ్‌ అవకాశం దక్కిన ప్రతీసారి తానేంటో చూపిస్తున్నాడు. బుమ్రాతో కలిసి ఆడిన టెస్టుల్లోకంటే అతను లేని టెస్టుల్లో చెలరేగిపోతున్నాడు. ఏడాదిన్నర క్రితం కేప్‌టౌన్‌ టెస్టులో దక్షిణాఫ్రికాపై 15 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసినప్పుడే టెస్టు బౌలర్‌గా సిరాజ్‌ స్థాయి ఎంతో పెరిగింది. ఆ్రస్టేలియాతో సిరీస్‌లోనూ 20 వికెట్లు పడగొట్టినా... బుమ్రా అసాధారణ 32 వికెట్ల బౌలింగ్‌తో పాటు భారత్‌ సిరీస్‌ ఓడటంతో అతని ప్రదర్శనకు గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఓడిపోతుందనుకున్న సిరీస్‌ను సమం చేయడంలో సిరాజ్‌ పోషించిన పాత్ర అతడిని మరో మెట్టు పైకి ఎక్కించింది. చివరగా... నాలుగో రోజు హ్యారీ బ్రూక్‌ క్యాచ్‌ వదిలేయడంతో సిరాజ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని అద్భుత బౌలింగ్‌నూ పట్టించుకోకుండా కొందరు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ ఓడి ఉంటే అది అతడిని ఎప్పటికీ వెంటాడేది. కానీ ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న ఈ బౌలర్‌ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్‌ను గెలిపించాడు. తానూ గెలిచాడు. ప్రశంసల వెల్లువటెస్టు క్రికెట్‌కు వన్నెతెచి్చన సిరీస్‌ ఇది. ఆఖరి మ్యాచ్‌ అయితే అద్భుతం. నిజంగా రోమాలు నిక్క»ొడుచుకునేలా చేసింది. సిరీస్‌ ఫలితం 2–2 అయి వుండొచ్చు. కానీ... ప్రదర్శనతో 10కి 10 మార్కులు తెచ్చుకున్నారు. టీమిండియన్స్‌ అంతా సూపర్‌గా ఆడారు. –భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌భారత జట్టు అద్భుత విజయం సాధించింది. సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో కనబరిచిన నిబద్ధత, అంకితభావానికి హ్యాట్సాఫ్‌. సిరాజ్‌కు నా ప్రత్యేక అభినందనలు. జట్టు కోసం ఏదైనా చేసేందుకు ముందువరుసలో సిద్ధంగా ఉంటాడు. –విరాట్‌ కోహ్లిసంప్రదాయ క్రికెట్‌కు ఉన్న మ్యాజిక్‌ను ఆవిష్కరించిన మ్యాచ్‌ ఇది. ఓవల్‌ క్రికెట్‌ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చింది. అసాధారణ ఆటతీరుతో టెస్టు ఇమేజ్‌ పెంచిన భారత్, ఇంగ్లండ్‌ జట్ల సభ్యులకు నా ప్రత్యేక ప్రశంసలు. –ఐసీసీ చైర్మన్‌ జై షాఅసాధారణ సిరీస్‌. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్‌ సుందర్, రిషభ్‌ పంత్, సిరాజ్‌... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు.–మాజీ కెప్టెన్‌ గంగూలీ సాక్షి క్రీడా విభాగం

India beat England by six runs to win fifth Test Series7
IND Vs ENG: సమంగా... సగర్వంగా...

35 పరుగులా... 4 వికెట్లా... ఓవల్‌ మైదానంలో అన్ని వైపులా తీవ్ర ఉత్కంఠ... ప్రసిధ్‌ కృష్ణ వేసిన తొలి రెండు బంతుల్లో ఒవర్టన్‌ 2 ఫోర్లు కొట్టడంతో చేయాల్సిన దాంట్లో 20 శాతం పరుగులు ఇంగ్లండ్‌కు వచ్చేశాయి... కానీ ఆ తర్వాత సిరాజ్‌ బౌలింగ్‌ మొదలు పెట్టడంతో ఆట మళ్లీ మలుపు తిరిగింది. లక్ష్యం ఛేదించగల సత్తా ఉన్న జేమీ స్మిత్‌తోపాటు ఒవర్టన్‌ను వరుస ఓవర్లలో సిరాజ్‌ వెనక్కి పంపాడు. ఒకవైపు వాన పెద్దదిగా మారుతోంది... మళ్లీ ఆట ఆగిపోతుందా అనే సందేహాల నడుమ జోష్‌ టంగ్‌ను ప్రసిధ్‌ అవుట్‌ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును కాపాడేందుకు వోక్స్‌ చేతికి కట్టుతోనే క్రీజ్‌లోకి వచ్చాడు. ఒంటిచేత్తో సహచరుడికి అండగా నిలిచేందుకు అతను సిద్ధమయ్యాడు. సిరాజ్‌ ఓవర్లో అట్కిన్సన్‌ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఆకాశ్‌దీప్‌ సరిగా అంచనా వేయక పోవడంతో అది సిక్స్‌గా మారింది. తర్వాతి ఓవర్లో మరో 3 పరుగులు రావడంతో లక్ష్యం ఇంకా తగ్గిపోయింది. కానీ మరుసటి ఓవర్‌ వేసిన సిరాజ్‌ తొలి బంతికే అద్భుతం చేశాడు. లో ఫుల్‌టాస్‌ బంతి అట్కిన్సన్‌ స్టంప్‌ను పడగొట్టడంతో భారత బృందం సంబరాల్లో మునిగిపోయింది. లార్డ్స్‌ టెస్టులో 23 పరుగులు చేయాల్సిన సమయంలో అనూహ్య రీతిలో చివరి వికెట్‌గా అవుటై గుండె పగిలిన సిరాజ్‌ ఇప్పుడు విజయానికి బాగా చేరువైన ప్రత్యరి్థని చివరి వికెట్‌గా అవుట్‌ చేసి జట్టును గెలిపించడం సినిమా స్క్రిప్‌్టకు ఏమాత్రం తగ్గని క్లైమాక్స్‌... సిరీస్‌ ఆద్యంతం 25 రోజుల పాటు (ఐదు టెస్టులు) రసవత్తరంగా సాగిన పోరును భారత్‌ సగర్వంగా ముగించింది. ఎన్నో మలుపులతో ఆధిపత్యం చేతులూ మారుతూ వచి్చన 73 సెషన్లలో చివరి క్షణాల్లో ఒత్తిడిని అధిగమించిన టీమిండియా ఈ సిరీస్‌ను సమం చేయడం విశేషం. లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనను భారత్‌ ఘనంగా ముగించింది. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ను 2–2తో సమం చేసింది. సోమవారం ఓవల్‌ మైదానంలో ముగిసిన చివరిదైన ఐదో టెస్టులో భారత్‌ 6 పరుగుల అతి స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. విజయం కోసం రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయాల్సిన ఇంగ్లండ్‌... ఓవర్‌నైట్‌ స్కోరు 339/6తో చివరి రోజు ఆటలో బరిలోకి దిగింది. అయితే ఆ జట్టు మరో 8.5 ఓవర్ల ఆటలో మరో 28 పరుగులు చేసి మిగిలిన వికెట్లు కోల్పోయింది. చివరకు 85.1 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. చివరి నాలుగు వికెట్లలో మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారత్‌ తరఫున శుబ్‌మన్‌ గిల్‌ (754 పరుగులు), ఇంగ్లండ్‌ తరఫున హ్యరీ బ్రూక్‌ (481 పరుగులు) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాలు అందుకున్నారు. ఈ సిరీస్‌లో లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ గెలవగా... బరి్మంగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టును భారత్‌ గెలుచుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 224; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 247; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 396; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (బి) సిరాజ్‌ 14; డకెట్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 54; పోప్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 27; రూట్‌ (సి) జురేల్‌ (బి) ప్రసిధ్‌ 105; బ్రూక్‌ (సి) సిరాజ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 111; బెతెల్‌ (బి) ప్రసిధ్‌ 5; స్మిత్‌ (సి) జురేల్‌ (బి) సిరాజ్‌ 2; ఒవర్టన్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 9; అట్కిన్సన్‌ (బి) సిరాజ్‌ 17; టంగ్‌ (బి) ప్రసిధ్‌ 0; వోక్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (85.1 ఓవర్లలో ఆలౌట్‌) 367. వికెట్ల పతనం: 1–50, 2–82, 3–106, 4–301, 5–332, 6–337, 7–347, 8–354, 9–357, 10–367. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 20–4–85–1, ప్రసిధ్‌ కృష్ణ 27–3–126–4, సిరాజ్‌ 30.1–6–104–5, వాషింగ్టన్‌ సుందర్‌ 4–0–19–0, రవీంద్ర జడేజా 4–0–22–0.రెండు జట్లూ తమ అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తూ అద్భుతంగా ఆడాయి. సిరాజ్, ప్రసిద్‌లాంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ సులువవుతుంది. వీరిద్దరు ఈ రోజు చాలా బాగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లండ్‌ ఒత్తిడిలో ఉందని మాకు నాలుగో రోజే తెలుసు. దానినే కొనసాగించాలని భావించాం. సిరీస్‌లో ఆట జరిగిన తీరును బట్టి చూస్తే 2–2 సరైన ఫలితం. బ్యాటర్‌గా నేను అత్యధిక పరుగులు చేయాలని సిరీస్‌కు ముందు లక్ష్యంగా పెట్టుకున్నాను. దానిని సాధించడం కూడా సంతృప్తిగా ఉంది. ఎన్నడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ సిరీస్‌ జరిగిన ఆరు వారాల్లో నేర్చుకున్నాను. – శుబ్‌మన్‌ గిల్, భారత జట్టు కెప్టెన్‌

Bangladesh Annoucnce Strong Preliminary Squad For Asia Cup 20258
ఆసియాక‌ప్‌-2025కు బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

ఆసియాకప్‌-2025 కోసం బంగ్లాదేశ్‌క్రికెట్ బోర్డు 25 మంది సభ్యులతో కూడిన తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఎంపికయ్యాడు. సీనియర్‌, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా గత రెండేళ్లగా జట్టుకు దూరం ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ నూరల్ హసన్‌కు బంగ్లా సెలక్టర్లు తిరిగి పిలపునిచ్చారు.నూరల్ చివరగా బంగ్లాదేశ్ తరపున 2022లో టీ20 మ్యాచ్ ఆడాడు. అంతేకాకుండా పాకిస్తాన్ సిరీస్‌లో భాగం కాని నజ్ముల్ హుస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.కాగా ఆసియాకప్‌నకు ముందు బంగ్లాదేశ్ స్వదేశంలో నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ అగ్రశ‍్రేణి క్రికెటర్ల కోసం మీర్పూర్‌లో స్పెషల్ టైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 నుంచి బంగ్లా ఆటగాళ్ల స్పెషల్ ట్రైనింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది ఆసియాక‌ప్ సెప్టెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 11న అబుదాబి వేదిక‌గా హాంకాంగ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.ఆసియాకప్‌నకు బంగ్లాదేశ్‌ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, ఎండి నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, మహ్మద్ పర్వేజ్ హోస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, షమీమ్ హుస్సేన్, నజ్ముల్ హోస్సేన్, రిషాద్ హొస్సేన్, షాక్ మహేదీ హసన్, తన్వీర్ ఇస్లాం,నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, సైఫుద్దీన్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాం, సయ్యద్ ఖలీద్ అహ్మద్, నూరుల్ హసన్ సోహన్, మహిదుల్ ఇస్లాం భుయాన్ అంకోన్, మహ్మద్ సైఫ్ హసన్.

Mohammed Siraj thanks Virat Kohli for believing in him9
న‌న్ను న‌మ్మినందుకు థాంక్యూ విరాట్ భయ్యా: మహ్మద్‌ సిరాజ్‌

"నేను జస్సీ భాయ్ (జస్ప్రీత్ బుమ్రా) మాత్రమే నమ్ముతాను. ఎందుంటే అతడొక గేమ్ ఛేంజర్‌". టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2024 విజ‌య‌నంత‌రం మ‌హ్మ‌ద్ సిరాజ్ చెప్పిన మాట‌లు ఇవి. ఆ సంద‌ర్భంగా సిరాజ్‌ ఇంగ్లీష్ స‌రిగ్గా మాట్ల‌డ‌క‌పోవ‌డంతో చాలా మంది ట్రోలు చేశారు.కానీ ఇప్పుడు అవే మాట‌లు సిరాజ్‌కు స‌రిపోతాయి. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచంలో సిరాజ్ పేరు మారు మ్రోగుపోతుంది. ఓవ‌ల్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టులో సిరాజ్ మియా సంచ‌ల‌నం సృష్టించాడు. బుమ్రా పక్కన లేకపోయినప్పటికి ప్రత్యర్ధులను బెంబెలెత్తించాడు.భారత పేస్ ధళ నాయకుడిగా నిప్పులు చెరిగాడు. ఓటమి కోరుల్లో చిక్కుకున్న తన జట్టును వారియర్‌లా విజయతీరాలకు చేర్చాడు. విశ్రాంతి, విరామం లేకుండా ఓ యోదుడులా పోరాడాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ క్రమంలో సిరాజ్‌పై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు."ఓవల్‌లో టీమిండియా గొప్ప విజయం సాధించింది. సిరాజ్, ప్రసిద్ద్‌ల పట్టుదల, దృఢ సంకల్పం వల్లే భారత్‌కు ఈ అద్బుతమైన విజయం దక్కింది. జట్టు కోసం ప్రతీసారి ముందుండి పోరాడే సిరాజ్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది " అని విరాట్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా కోహ్లి ట్విట్‌పై సిరాజ్ స్పందించాడు. నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు భయ్యా అంటూ సిరాజ్ రిప్లే ఇచ్చాడు.చదవండి: అత‌డొక సంచ‌ల‌నం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్‌

Mohammed Siraj Bags Historic Feat With Jamie Smith's Wicket In Oval Test10
చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్‌.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌

ది ఓవ‌ల్ మైదానం వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. త‌న సంచ‌ల‌న బౌలింగ్‌తో భార‌త్‌కు చిరస్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగాడు. మొత్తంగా 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సిరాజ్‌ సాధించిన రికార్డులు ఇవే..👉ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది.కపిల్ దేవ్ తన టెస్టు కెరీర్‌లో ఇంగ్లండ్ గడ్డపై 43 వికెట్లు సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌లో స్మిత్‌ను ఔట్ చేసి ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జస్ప్రీత్ బుమ్రా(51), ఇషాంత్ శ‌ర్మ‌(51) సంయుక్తంగా ఆగ్ర‌స్ధానంలో ఉన్నారు.👉అదేవిధంగా ఇంగ్లండ్‌లో జ‌రిగిన ఒక టెస్టు సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా బుమ్రా రికార్డును సిరాజ్ స‌మం చేశాడు. బుమ్రా 2021-22 ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లండ్‌పై 23 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మ‌రో వికెట్ తీసి ఉంటే బుమ్రాను ఆధిగమించేవాడు.👉వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ హిస్టరీలో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన నాలుగో బౌలర్‌గా అక్షర్ పటేల్ రికార్డును సిరాజ్ సమం చేశాడు. అక్షర్ ఇప్పటివరకు 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించగా.. సిరాజ్ కూడా సరిగ్గా ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక త్యధిక సార్లు ఫైవ్ వికెట్ హల్ సాధించిన బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (12) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అశ్విన్ (11), రవీంద్ర జడేజా (6) జడేజా కొనసాగుతున్నారు.ఇక ఈ సిరీస్‌లో సిరాజ్(23 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.చదవండి: అత‌డొక సంచ‌ల‌నం.. ప్రాణం పెట్టి ఆడాడు! ఎంత చెప్పిన తక్కువే: గిల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement