Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India cruise past South Africa to book semi-final berth1
సెమీఫైనల్లో భారత్‌

చెన్నై: ఆతిథ్య భారత జట్టు స్క్వాష్‌ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–0తో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. జోష్నా చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్‌ రసెల్‌పై గెలుపొందగా, అభయ్‌ సింగ్‌ 7–1, 7–6, 7–1తో డెవాల్స్‌ వాన్‌ నికెర్క్‌పై గెలిచాడు. అనాహత్‌ సింగ్‌ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో ఈజిప్‌్టతో భారత్‌ తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఈజిప్ట్‌ 3–0తో ఆ్రస్టేలియాపై గెలుపొందింది. లీగ్‌ దశలో భారత జట్టు స్విట్జర్లాండ్, బ్రెజిల్‌లపై విజయంతో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ 2023లో గెలిచిన కాంస్య పతకమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

Indian team lost to Spain in the classification match2
భారత్‌కు పదో స్థానం

సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు పదో స్థానంతో ముగించింది. శుక్రవారం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో జ్యోతి సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 1–2 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ చేతిలో పరాజయం పాలైంది. భారత్‌ తరఫున కనిక సివాచ్‌ (41వ నిమిషంలో) ఏకైక గోల్‌ సాధించగా... స్పెయిన్‌ తరఫున నటాలియా విలనోవా (16వ నిమిషంలో), ఎస్తెర్‌ కనాలెస్‌ (36వ నిమిషంలో) చెరో గోల్‌ కొట్టారు. మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఇరు జట్ల ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా... ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే నటాలియా గోల్‌ చేయడంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు నుంచి కొన్ని చక్కటి ప్రయత్నాలు కనిపించినా... ఫినిషింగ్‌ లోపం కారణంగా అవి గోల్స్‌గా మారలేకపోయాయి. మూడో క్వార్టర్‌లో సోనమ్‌ చక్కటి గోల్‌ సాధించినా... స్పెయిన్‌ వీడియో రిఫరల్‌ ద్వారా ఆ గోల్‌ నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. ఈ క్రమంలోనే స్పెయిన్‌ మరో గోల్‌తో ఆధిక్యాన్ని మరింత పెంచుకోగా... కాసేపటికి కనిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌ ఖాతా తెరిచింది. ఇక ఆఖరి క్వార్టర్‌లో స్పెయిన్‌ ఆధిక్యాన్ని కాపాడుకోగా... భారత జట్టు మరో గోల్‌ సాధించలేక ఓటమి వైపు నిలిచింది.

Jharkhand team defeated Punjab by 6 wickets3
సలీల్‌ అరోరా సూపర్‌ సెంచరీ

అంబి (మహారాష్ట్ర): పంజాబ్‌ యువ బ్యాటర్‌ సలీల్‌ అరోరా (45 బంతుల్లో 125 నాటౌట్‌; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీతో చెలరేగినా... పంజాబ్‌ జట్టుకు పరాజయం తప్పలేదు. దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ‘సూపర్‌ లీగ్‌’ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... అతడు లేని లోటును అరోరా భర్తీ చేశాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్న చందంగా చెలరేగిపోయాడు. మిగిలిన వారి నుంచి చెప్పుకోదగ్గ తోడ్పాటు లభించకపోయినా... అరోరా ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అతడు 39 బంతుల్లోనే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. కెపె్టన్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (10), హర్‌నూర్‌ సింగ్‌ (13), సాన్‌వీర్‌ సింగ్‌ (10), రమణ్‌దీప్‌ సింగ్‌ (8) విఫలం కాగా... అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (23), నమన్‌ ధిర్‌ (27) ఫర్వాలేదనిపించారు. జార్ఖండ్‌ బౌలర్లలో సుశాంత్‌ మిశ్రా, బాలకృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జార్ఖండ్‌ జట్టు 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెపె్టన్‌ ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ సింగ్‌ (18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చారు. సాధించాల్సిన రన్‌రేట్‌ కొండంత ఉన్న జార్ఖండ్‌ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కుమార్‌ కుశాగ్ర (42 బంతుల్లో 86 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... చివర్లో అనుకూల్‌ రాయ్‌ (17 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పంకజ్‌ కుమార్‌ (18 బంతుల్లో 39 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. జార్ఖండ్‌ బ్యాటర్లలో రాబిన్‌ మింజ్‌ (2) మినహా తక్కిన వాళ్లంతా రెండొందల పైచిలుకు స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. ఐపీఎల్‌ మినీ వేలానికి ముందు యువ ఆటగాళ్లు తమ పవర్‌హిట్టింగ్‌తో ఫ్రాంచైజీల దృష్టిలో పడే ప్రయత్నంలో ఉన్నారు. అంకిత్‌ కుమార్‌ అర్ధసెంచరీ ‘సూపర్‌ లీగ్‌’ గ్రూప్‌ ‘బి’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హరియాణా జట్టు 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మహిపాల్‌ లోమ్రర్‌ (39 బంతుల్లో 37 నాటౌట్‌; 1 ఫోర్‌), శుభమ్‌ గర్వాల్‌ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దీపక్‌ హుడా (0), కునాల్‌ సింగ్‌ రాథోడ్‌ (4), కరణ్‌ లాంబా (1), కెపె్టన్‌ మానవ్‌ సుతార్‌ (15) విఫలమయ్యారు. హరియాణా బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాంత్‌ భరద్వాజ్, అన్షుల్‌ కంబోజ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హరియాణా 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. కెప్టెన్ అంకిత్‌ కుమార్‌ (41 బంతుల్లో 60; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో మెరవగా... అర్ష్ రంగా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్‌ వత్స్‌ (29 బంతుల్లో 27; 1 ఫోర్‌ 1 సిక్స్‌) రాణించారు. ఆదివారం జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో ముంబైతో హరియాణా, ఆంధ్రతో పంజాబ్, హైదరాబాద్‌తో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్‌ తలపడతాయి.

Hockey World Cup Qualifiers in Hyderabad4
హైదరాబాద్‌లో హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే క్వాలిఫయింగ్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఇందులో భాగంగా క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌ సహా మూడు నగరాలు శాంటియాగో (చిలీ), ఇస్మయిలియా (ఈజిప్ట్‌)లలో నిర్వహిస్తారు. ప్రపంచకప్‌కు అర్హత సంపాదించేందుకు భారత్‌కు ఇది ఆఖరి అవకాశం. ఇంగ్లండ్, స్కాట్లాండ్, కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలతో భారత్‌ క్వాలిఫయింగ్‌ పోటీలు ఆడనుంది.హైదరాబాద్‌ అంచెలో ఎనిమిది జట్ల మధ్య క్వాలిఫయింగ్‌ పోటీలు మార్చి 8 నుంచి 14 వరకు జరుగుతాయి. ఈ క్వాలిఫయర్స్‌ నుంచి టాప్‌–3 జట్లు ప్రధాన ప్రపంచకప్‌కు అర్హత పొందుతాయి. బెల్జియం, నెదర్లాండ్స్‌ జట్లు ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. పురుషుల విభాగంలో ఇదివరకే భారత్‌ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆసియా కప్‌లో విజేతగా నిలువడంతోనే భారత్‌కు ప్రపంచకప్‌ బెర్తు లభించింది.

Tarun lost in Odisha Masters Open5
తరుణ్‌ పరాజయం

కటక్‌: ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్, టాప్‌ సీడ్‌ తరుణ్‌ మన్నేపల్లి పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తరుణ్‌ 9–21, 20–22తో మొహమ్మద్‌ యూసుఫ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తరుణ్‌ తొలి గేమ్‌లో తేలిపోయినా... రెండో గేమ్‌లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చాడు. భారత్‌కే చెందిన రౌనక్‌ చౌహాన్, కిరణ్‌ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో రౌనక్‌ 21–19, 22–20తో శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌)పై, కిరణ్‌ జార్జి 21–11, 21–17తో రితి్వక్‌ (భారత్‌)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు టైటిల్‌ ఖాయమైంది. భారత్‌కు చెందిన నలుగురు క్రీడాకారిణులు ఉన్నతి హుడా, ఇషారాణి బారువా, తాన్యా హేమంత్, తస్నిమ్‌ మీర్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

Argentina superstar Messi is coming to India6
హైదరాబాద్‌కు మెస్సీ ‘కిక్‌’

ఓ మారడోనా... ఓ పీలే... ఓ డుంగా... ఓ రొనాల్డిన్హో... వీళ్ల సరసన నిలిచేందుకు తాజాగా అర్జెంటీనా సూపర్‌స్టార్‌ మెస్సీ ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (జీఓఏటీ) టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో ఓ పండుగలా దిగి వస్తున్నాడు. అభిమానుల్ని ‘కిక్‌’ ఎక్కించనున్నాడు. అతి కొద్దిమంది ఎంపిక చేసిన వారితో కలిసి విందు కూడా చేయబోతున్నాడు. ఫొటోలు దిగబోతున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఇంత తీరిగ్గా భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. గతంలో 14 ఏళ్ల క్రితం వచ్చాడు. కానీ వచ్చిన పని మాత్రమే చూసుకొని (అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడి) వెళ్లాడు. కానీ ఇప్పుడలా కాదు... పని గట్టుకొని మరీ తన భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకే వస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్‌: మెస్సీ... మెస్సీ... మెస్సీ... కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే, స్టాక్‌ మార్కెట్‌ సూచీల కంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. అందరి నోటా ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్‌ బందోబస్తు (4 నగరాలకు సంబంధించి) ఏర్పాట్లు కూడా అతని కోసమే! అయితే ఎవరీ మెస్సీ! ఎందుకంత క్రేజ్‌? క్రికెట్‌ మతమైన భారత్‌లో ఓ ఫుట్‌బాల్‌ స్టార్‌ను ఇంతలా తలకెక్కించుకుంటారా! అంటే... అవును మరి... అతను ఆడే ఆట ఫుట్‌బాల్‌కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు. కానీ అతను ఆడే మ్యాచ్‌లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంతో సంబంధం లేకుండా అభిమాన హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమూ ఉన్నాం. అందుకే ఆ క్రేజ్‌!గతంలో వచ్చి ఏం చేశాడు జగద్విఖ్యాత ఫుట్‌బాలర్‌ మెస్సీ 2011లోనూ భారత్‌కు వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్‌ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్‌ క్రేజీ భారత్‌లో ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు లయోనల్‌ వచ్చాడు. కోల్‌కతాలో సాల్ట్‌లేక్‌ మైదానంలో వెనుజులాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ టీమ్‌ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది. ఈ అంతర్జాతీయ ‘ఫిఫా’ మ్యాచ్‌ ముగిసిన వెంటనే మరే కార్యక్రమం పెట్టుకోకుండానే అక్కడి (కోల్‌కతా) నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. అప్పటికి, ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు జట్టులో ఒకడు. ఇప్పుడు అతడొక్కడే ఆకాశమంత ఆనందం!డే–1 ఫస్ట్‌ హాఫ్‌ కోల్‌కతా మెస్సీ ఈవెంట్‌కు పెట్టిన పేరు ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’. నాలుగు నగరాల్లో ముందుగా అడుగు పెట్టేది కోల్‌కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్‌ కట్‌ లాంటివి కాకుండా... వర్చువల్‌గా బస చేసిన హోటల్‌ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్‌’ సత్కారానికి వెళ్తాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనూ కాసేపు ముచ్చటిస్తాడుఎవరిని కలుస్తాడు: ‘బాలీవుడ్‌ బాద్‌షా’ షారుఖ్‌ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్సౌరభ్‌ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్‌లేక్‌ మైదానాన్ని మోతేక్కిస్తాడు.డే–1 సెకండ్‌ హాఫ్‌ హైదరాబాద్‌ మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజిబిజీగా షెడ్యూల్‌ ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్‌ కప్‌’ ఫుట్‌బాల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ ఆడతాడు. ఎవరిని కలుస్తాడు: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు, సీనియర్‌ రాజకీయ నాయకులు హాజరవుతారు. డే–2 ముంబై పర్యటనలో రెండో రోజంతా వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీబిజీగా గడుపుతాడు. వాంఖెడేలో చారిటీ మ్యాచ్‌ ఆడతాడు. ఇందులో క్రికెట్‌ స్టార్స్‌ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్‌ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్‌ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్‌–2022 ప్రపంచకప్‌ సాకర్‌కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్‌లో వేసుకున్న జెర్సీలు, కిట్‌లను వేలం వేయనున్నారు. ఎవరిని కలుస్తాడు: సచిన్‌ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌లతో చారిటీ మ్యాచ్, బాలీవుడ్‌ స్టార్స్‌ జాన్‌ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్‌ తదితరులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తాడు.డే–3 ఢిల్లీ మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు. ఇక్కడ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్‌ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభావంతులైన భారత చిన్నారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగమవుతాడు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఢిల్లీ వాసుల్ని అలరించనున్నాడు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్‌ షోలో పాల్గొంటాడు. సాకర్‌ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్‌లలో భాగమవుతాడు. ఎవరిని కలుస్తాడు: ప్రముఖ సెలబ్రిటీలను కలిసాక... మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఫుట్‌బాల్‌ ముచ్చటలో భాగమవుతాడు.» దేశంలో సాకర్‌ దిగ్గజం గడిపేది 72 గంటలే! కానీ.... ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్‌ చేయడమే అతిపెద్ద విశేషం. » కోల్‌కతా (తూర్పు), హైదరాబాద్‌ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) నగరాల్లో ఊపిరి సలపని బిజీ బిజీ షెడ్యూల్‌లో పాల్గొననున్నాడు. » నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాటామంతీ కలిపాక ఆఖర్లో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో ఈ పర్యటన ముగుస్తుంది. » భారత టెస్టు, వన్డే కెప్టెన్శుబ్‌మన్‌ గిల్‌... దర్మశాలలో 14న మ్యాచ్‌ ముగిసిన వెంటనే తన ఫేవరెట్‌ ఫుట్‌బాలర్‌ను కలుసుకోనున్నాడు. » ఈ పర్యటన పూర్తిగా భారత సాకర్‌ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్‌ ఫుట్‌బాల్‌ మ్యాచో, లేదంటే ఫ్రెండ్లీ మ్యాచో ఆడేందుకు మాత్రం కాదు. » ఫ్యాన్స్‌కు ఇది కాస్త లోటే అయినా... బోలెండత వినోదాన్ని ఈ నాలుగు నగరాల్లో పంచనున్నాడు. » కోల్‌కతాలో 78 వేల సీటింగ్‌ సామర్థ్యమున్న సాల్ట్‌లేక్‌ స్టేడియం కిక్కిరిసిపోనుంది. »‘గోట్‌ టూర్‌’ మొదలవుతోందే బెంగాల్‌లో... శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్‌ ముమ్మాటికి సాకర్‌ క్రేజీ బెంగాలీలను ఊపేయనున్నాయి. 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి...సింగరేణి ఆర్‌ఆర్‌9, అపర్ణ మెస్సీ ఆల్‌ స్టార్స్‌ ఈ రెండు జట్ల మధ్య 15 నిమిషాల పాటు సరదా మ్యాచ్‌ జరుగుతుంది. 39 వేల సీటింగ్‌ సామర్థ్యమున్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 27 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నేటి ఉదయం కల్లా హౌజ్‌ ఫుల్‌ అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మెస్సీతో ఫొటో సెషన్‌ కోసం ఇప్పటికే 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్‌ చేయించుకున్నారని..., ఈ 60 మందితో మెస్సీ ఫొటోలు దిగుతారని హైదరాబాద్‌ గోట్‌ టూర్‌ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు.

SMAT 2025: Siraj Shines, Hyderabad upsets defending champ Mumbai7
నిప్పులు చెరిగిన సిరాజ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు చుక్కలు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చెలరేగిపోయాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగాడు. 3.5 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.సిరాజ్‌ విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 18.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్‌తో పాటు చామా మిలింద్‌ (4-0-36-2), త్యాగరాజన్‌ (4-0-27-2), నితిన్‌ సాయి యాదవ్‌ (3-0-26-1), అర్ఫాజ్‌ అహ్మద్‌ (1-0-7-1) సత్తా చాటారు.స్టార్లతో నిండిన ముంబై ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (29), హార్దిక్‌ తామోర్‌ (29), సూర్యాంశ్‌ షేడ్గే (28), సాయిరాజ్‌ పాటిల్‌ (12 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. రహానే (9), సర్ఫరాజ్‌ ఖాన్‌ (5), రఘువంశీ (4), అంకోలేకర్‌ (3), తనుశ్‌ కోటియన్‌ (2), తుషార్‌ దేశ్‌పాండే (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ డకౌటయ్యాడు.అనంతరం స్వల్ప ఛేదనలో హైదరాబాద్‌ ఓపెనర్లు అమన్‌ రావ్‌ (29 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్‌ అగర్వాల్‌ (40 బంతుల్లో 75; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరి ధాటికి హైదరాబాద్‌ 11.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సూపర్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా జరిగింది.

Bahrain's Ali Dawood records second best T20I figures with 7 for 198
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం.. ప్రపంచ రికార్డు

అంతర్జాతీయ టీ20ల్లో బహ్రెయిన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అలీ దావూద్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో రెండో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసి రికార్డుల్లోకెక్కాడు. తాజాగా నేపాల్‌లో జరిగిన మ్యాచ్‌లో దావూద్‌ 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు మలేసియా బౌలర్‌ స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ పేరిట ఉన్నాయి. ఓ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇద్రుస్‌ కేవలం 8 పరుగులే ఇచ్చి దావూద్‌ లాగే 7 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇద్రుస్‌, దావూద్‌ మాత్రమే ఇప్పటివరకు ఓ మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెహ్రెయిన్‌, భూటాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లోనే దావూద్‌ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెహ్రెయిన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన భూటాన్‌.. దావూద్‌ ధాటికి లక్ష్యానికి 36 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో బెహ్రెయిన్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ బెహ్రెయిన్‌ ఘన విజయాలు సాధించింది. తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో గెలుపొందింది.

Venkatesh Iyer back to KKR in Ashwin IPL 2026 mock auction9
భారీగా తగ్గిన ధర!.. మళ్లీ కేకేఆర్‌కే వెంకటేశ్‌ అయ్యర్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలానికి సమయం ఆసన్నమైంది. అబుదాబి వేదికగా డిసెంబరు 16న వేలంపాట నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈసారి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) అత్యధికంగా రూ. 63.30 కోట్ల పర్సుతో రంగంలోకి దిగనుంది.పదమూడు ఖాళీలువేలానికి ముందు తమ జట్టులోని అత్యంత ఖరీదైన ఆల్‌రౌండర్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (27.75 కోట్లు), ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు)ను వదులుకోవడంతో కేకేఆర్‌ పర్సులో భారీగా సొమ్ము చేరింది. ఇక ఆ జట్టులో పదమూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆరు విదేశీ ప్లేయర్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.మాక్‌ వేలంఇదిలా ఉంటే.. గతంలో మాదిరే టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈసారి కూడా మాక్‌ వేలం నిర్వహించాడు. ఇందులో పది ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ అభిమానులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్‌ అయ్యర్‌ పేరు వేలంలోకి రాగానే... చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ అతడి కోసం పోటీపడ్డాయి.భారీగా తగ్గిన ధర!.. ఇంతలో కేకేఆర్‌ కూడా రంగంలోకి దిగింది. చెన్నై, ముంబైలతో పోటీపడి ఎట్టకేలకు వెంకటేశ్‌ అయ్యర్‌ను దక్కించుకుంది. అయితే, గతేడాది పేలవ ప్రదర్శన దృష్ట్యా ఈసారి వెంకీ ధర ఆరు కోట్లు తగ్గిపోయింది. మాక్‌ వేలంలో కేకేఆర్‌ అతడిని రూ. 17.5 కోట్లకు కొనుక్కుంది. కాగా 2025లో పదకొండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 142 పరుగులే చేశాడు. సీజన్‌ మొత్తంలో ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయలేదు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను కేకేఆర్‌ ఏకంగా రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. గతేడాది అతడు ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) తరఫున పేలవంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి 90 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. అయితే, ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు మాక్‌ వేలంలో కేకేఆర్‌ లివింగ్‌స్టోన్‌ను కొనుక్కోవడం గమనార్హం.చదవండి: ఆసియా కప్‌- 2025: భారత్‌ ఘన విజయం

Messi In Hyderabad 2025 Dec 13: Intresting Facts About Personal Life10
వేల కోట్ల సంపాదన.. అతడికి ఆ పేరెలా వచ్చిందంటే?

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీకి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అతడు ఆరాధ్య ఆటగాడు. భారత్‌లో క్రికెట్‌ మతంలాంటిదే అయినా.. మెస్సీకి కూడా ఇక్కడ చాలా మందే అభిమానులు ఉన్నారు.హైదరాబాద్‌ పర్యటన ఇలా‘ది గోట్‌ టూర్‌’లో భాగంగా మెస్సీ భారత్‌కు రానుండటంతో వారంతా అతడిని నేరుగా చూడాలని ఆశపడుతున్నారు. ఇక ముందుగా ప్రణాళికలో లేకపోయినా.. చివరి నిమిషంలో మెస్సీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఈ లెజెండరీ ప్లేయర్‌ స్వయంగా వెల్లడించాడు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చి.. అక్కడి నుంచి తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. రాత్రి ఏడు గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వచ్చి ఫ్యాన్స్‌ను కలవడంతో పాటు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో మెస్సీ వ్యక్తిగత జీవితంలోని ఆసక్తిర విషయాలు మీకోసం..ఆమె గుర్తుగా ఆకాశంలోకి చూస్తూ..👶అర్జెంటీనాలోని సాంటా ఫేలో గల రొసారియోలో 1987, జూన్‌ 24న మెస్సీ జన్మించాడు.👶నాలుగేళ్ల వయసులోనే తన మొదటి క్లబ్‌ గ్రాండోలిలో జాయిన్‌ అయ్యాడు. అన్నట్లు అక్కడ కోచ్‌ మెస్సీ వాళ్ల నాన్న జోర్జ్‌ మెస్సీ.👶ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా మెస్సీ ఎదగడంలో వాళ్ల నానమ్మ సెలియా ప్రభావం ఎక్కువ. అతడితో పాటు మ్యాచ్‌లకు హాజరవుతూ అతడిని ప్రోత్సహించేవారామె. ఆమె గుర్తుగా గోల్‌ సాధించిన ప్రతిసారి ఆకాశం వైపు చూపిస్తూ మెస్సీ తన ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాడు.👶ఏడేళ్ల వయసులో మెస్సీ వెనెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్లబ్‌లో చేరాడు.👶పదేళ్ల వయసులో మెస్సీకి హార్మోన్‌ డెఫిషియెన్సీ ఉన్నట్లు తేలగా.. చికిత్సతో దానిని అధిగమించాడు.వారిద్దరు.. వారికి ముగ్గురు 👩‍❤️‍💋‍👨తన చిన్ననాటి స్నేహితురాలు అంటోనెలా రొకజోను మెస్సీ పెళ్లి చేసుకున్నాడు. 👨‍👩‍👦‍👦ఈ జంటకు ముగ్గురు కుమారులు థియాగో, మెటేయో, సీరో సంతానం.🫂అర్జెంటీనా ఫుట్‌బాల్‌ జట్టులోని సహచరుడు సెర్గియో అగురో మెస్సీకి ప్రాణ స్నేహితుడుఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?🖤మెస్సీ ఒంటిపై పచ్చబొట్లు ఎక్కువే. అయితే, ఇవన్నీ అతడి కుటుంబ సభ్యులకు చెందినవే. భార్య కళ్లు, కుమారుల పేర్లు, వారి హస్త ముద్రలు, తన తల్లి చిత్రాన్ని టాటూలుగా వేయించుకున్నాడు మెస్సీ.💰ప్రపంచంలోని సుసంపన్న అథ్లెట్లలో మెస్సీ ఒకడు. అతడి నెట్‌వర్త్‌ విలువ 2025 నాటికి రూ. ఏడు వేల కోట్ల రూపాయలు అని అంచనా!🎶అన్నట్లు లియోనల్‌ మెస్సీకి ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?.. అతడి తల్లి ఫేవరెట్‌ సింగర్‌ లియోనల్‌ రిచ్చీ పేరు మీదుగా లియోనల్‌గా మెస్సీకి ఆమె నామకరణం చేశారు.చిరస్మరణీయ విజయం🌟మెస్సీ అత్యధికంగా ఎనిమిదిసార్లు బాలన్‌ డిఓర్‌ అవార్డులు గెలుచుకున్నాడు.🥇2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ గోల్డ్‌ మెడల్‌ గెలిచాడు.⚽🏆మెస్సీ కెరీర్‌లో చిరస్మరణీయ విజయం.. అర్జెంటీనా సారథిగా 2022లో ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవడం.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement