ప్రధాన వార్తలు
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా వదిలేశాడు.విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్ తరఫున టీమ్, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకుంది. క్రికెట్ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్ టీ20 లీగ్-2025లో జరిగింది.A RARE INCIDENT IN CRICKET 🤯- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025ఈ లీగ్లో భాగంగా నిన్న (డిసెంబర్ 9) డెజర్ట్ వైపర్స్-ఎంఐ ఎమిరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో వైపర్స్ తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్ హోల్డన్ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్కీపర్ నికోలస్ పూరన్ స్టంపౌట్ చేసే అవకాశమున్నా హోల్డన్ను ఔట్ చేయలేదు. బంతిని కనెక్ట్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్ మరికొద్ది సేపు క్రీజ్లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్.అయితే పూరన్ ప్లాన్ను పసిగట్టిన వైపర్స్ కెప్టెన్ ఫెర్గూసన్ హోల్డన్ను రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జరిగింది. అప్పటికి వైపర్స్ స్కోర్ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్ క్రీజ్ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్ స్కోర్ అంతిమంగా 159 పరుగులకు చేరింది.ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్ డైరెక్ట్ త్రోతో ఘజన్ఫర్ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మీడియా క్రికెట్లో దూసుకుపోతున్న సాక్షి టీమ్.. ఫైనల్లో టీవీ9తో అమీతుమీ
జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ పోటీలు గత నాలుగు రోజులుగా హైదరాబాద్లో సందడిగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో సాక్షి టీమ్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. తొలి రోజు బిగ్ టీవీతో జరిగిన నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన ఆటతో విజయదుందుబి మోగించారు.ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిగ్ టీవీ టీమ్.. 20 ఓవర్లలో 115 పరుగులు చేయగా సాక్షి టీమ్ కేవలం 12.5 ఓవర్లలో రెండే వికెట్లో కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాక్షి టీమ్కు చెందిన సతీష్ 48 పరుగులు చేయగా.. రమేష్ 47 పరుగులు చేసి సత్తా చాటారు. ఈ విజయంతో సాక్షి సెమీస్లోకి అడుగు పెట్టింది.బుధవారం జరిగిన సెమీస్లో సాక్షి టీమ్ మరోసారి సత్తా చాటింది. వీ6తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే విజయం సాధించి విజయపరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన వీ6ను సాక్షి 104 పరుగులకు కట్టడి చేసింది. సాక్షి బౌలర్లలో రామకృష్ణ, అనిల్, రమేష్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తలో 2 వికెట్లు తీశారు.అనంతరం చేధనకు దిగిన సాక్షి టీమ్ కేవలం 12.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. రమేష్ 83 పరుగులు చేసి ఒంటిచేత్తో సాక్షిని గెలిపించాడు. బౌలింగ్లోనూ 2 వికెట్లతో సత్తా చాటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ గెలుపుతో సాక్షి టీమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగే ఫైనల్లో సాక్షి టీమ్ టీవీ9తో అమీతుమీ తేల్చుకుంటుంది.
క్రికెట్ చరిత్రలో కవలలు.. మరో కొత్త జోడీ
క్రికెట్ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్ (స్టీవ్-మార్క్). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.పురుషుల క్రికెట్లో మరో ట్విన్స్ జోడీ జేమ్స్ మరియు హేమిష్ మార్షల్. వీర్దిదరు న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్, వన్డే క్రికెట్ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్ బ్రదర్స్ (క్రెయిగ్-జేమీ). జేమీ మరియు క్రెయిగ్ ఓవర్టన్ కలిసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్ సోదరులలాగే ఒకే స్టయిల్ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. పురుషుల క్రికెట్ తొలినాళ్లలో మరో ట్విన్స్ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్, ఎరిక్ బెడ్సర్. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ మరియు కేట్ బ్లాక్వెల్ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్ ఆసీస్ జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించింది.మహిళల క్రికెట్లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్ కాదు. ట్రిప్లెట్స్ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్, ఎస్సీ షెవిల్ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం క్రికెట్కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్ కుమారులు కావడం మరో విశేషం.బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ. ఈ ఇద్దరు త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్కప్ ఆడిన బ్యాట్స్మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే
నైతిక విలువలు పాతరేస్తున్నారు
ఒకప్పుడు ప్రేమ.. పెళ్లి.. అత్యంత వ్యక్తిగత విషయాలుగా ఉండేవి. అయితే, ఇప్పుడు సెలబ్రిటీలు మొదలు సాధారణ వ్యక్తులూ తమ జీవితంలోని అతి ముఖ్యమైన ఈ రెండు విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ ఫాలోవర్లు, అభిమానులను కూడా తమ సంతోషంలో భాగం చేయాలనే ఉద్దేశంతో కొందరు.. హోదాను, రిలేషన్షిప్ స్టేటస్ను చాటి చెప్పుకొనేందుకు మరి కొంతమంది ఇలాంటి పోకడలకు పోతున్నారు.అయితే, నెట్టింట ఇందుకు సానుకూల కామెంట్ల కంటే.. ప్రతికూల, చెత్త కామెంట్లే ఎక్కువసార్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలపై శ్రుతిమించిన స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా- ఆపై రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ ఇందుకు నిదర్శనం.కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ..ఆరేళ్లుగా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. హల్ది, సంగీత్, మెహందీ అంటూ స్మృతి- పలాష్ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. సహచర ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు కాబోయే ‘బావగారి’ని ఆటపట్టిస్తూ, అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.‘ప్రైవేటు సంభాషణ’ బహిర్గతంఅయితే, అనూహ్య రీతిలో స్మృతి- పలాష్ పెళ్లి వాయిదా పడింది. వివాహ తంతుకు కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆ వెంటనే పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ పరిణామాలు సందేహాలకు తావిచ్చాయి. ఇందుకు తోడు ఓ అమ్మాయి పలాష్ తనతో చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు సంభాషణ’ను బహిర్గతం చేసింది.ఇంకేముంది.. సోషల్ మీడియాలో చిన్నగా అంటుకున్న ఈ ‘మంట’ దావానంలా వ్యాపించింది. మెజారిటీ మంది పలాష్ను తప్పుపడితే.. మరికొంత మంది స్మృతిని కూడా ట్రోల్ చేశారు. ఆరేళ్ల ప్రేమలో అతడి గురించి ఏమీ తెలియలేదా?.. పెళ్లికి ముందు రోజు రాత్రే.. ‘అఫైర్’ ఉందని తెలిసిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.పలాష్ అక్కపైనా ట్రోలింగ్మరోవైపు.. పలాష్పై తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్లు వచ్చాయి. దెబ్బకు అతడు బృందావనంలోని ఓ ఆశ్రమానికి వెళ్లి సేదదీరాడు. ఈ విషయంలో కాబోయే వధూవరులతో పాటు ట్రోలింగ్కు గురైన మరో వ్యక్తి పాలక్ ముచ్చల్. పలాష్ అక్క, బాలీవుడ్ సింగర్గా ప్రాచుర్యం పొందిన పాలక్ సమాజ సేవలోనూ ముందే ఉంటుంది.ఎంతో మంది చిన్నారులకు తన ఎన్జీవో ద్వారా గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా నిలిచింది పాలక్. అయితే, పలాష్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తూ పాలక్ను కూడా కొంత మంది విపరీతపు వ్యాఖ్యలతో ట్రోల్ చేశారు. డబ్బు, అందం ఉందన్న కారణంగానే స్మృతి వెంటపడమని సలహా ఇచ్చిందని.. అసలు విషయం బయటపడేసరికి ఆస్పత్రి పాలయ్యాడంటూ తమ్ముడికి సానుభూతి వచ్చేలా చేయాలని చూసిందని ఇష్టారీతిన ఆమెను నిందించారు.గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తినిజానికి ప్రేమ- పెళ్లి.. స్మృతి- పలాష్లకు సంబంధించినది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు కూడా అతిగా జోక్యం చేసుకునే వీలు ఉండకపోవచ్చు. నిజానికి స్మృతి మీద ఉన్న అభిమానం.. అనేకంటే దురభిమానమే పాలక్ మీద కామెంట్ల దాడికి కారణమైందని చెప్పవచ్చు. మరోవైపు.. పలాష్కు మద్దతు పలికేవాళ్లు స్మృతిని తక్కువ చేసేలా మాట్లాడటం తెలిసిందే. ఆఖరికి తమ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇరువురూ స్పందించి.. తమ గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేసేదాకా వచ్చింది.తప్పు ఎటువైపు ఉన్నా.. బాధితులు వారేమొత్తం మీద తప్పు ఎటువైపు ఉందో తెలియకపోయినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడేది అమ్మాయిలే అన్నది ఈ ఘటన ద్వారా మరోసారి నిరూపితమైంది. నైతిక విలువలకు పాతరేసి మహిళలను కించపరిచే ఈ ‘సంస్కృతి’ని నీచమైనదిగా అభివర్ణించవచ్చు. ఇలాంటి ట్రోల్స్ వేసే వాళ్లలో చాలామందికి తమ వ్యక్తిగత జీవితంపై ఓ అవగాహనా, స్పష్టత ఉండదు.స్మృతి, సమంత, శోభితఅయినప్పటికీ పక్కవాళ్ల జీవితంలోకి చొచ్చుకుపోయి మరీ ఇలా దిగజారుడుగా వ్యవహరిస్తారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్ సమంతపై కూడా కొంతమంది నీచంగా కామెంట్లు చేశారు. ఆమె పాత జీవితాన్ని తెర మీదకు తెస్తూ మోసగత్తెగా అభివర్ణిస్తూ రాక్షసానందం పొందారు.అంతేకాదు.. సమంత మాజీ భర్త నాగ చైతన్యపై కూడా విడాకుల సమయంలో.. అతడి రెండో పెళ్లి విషయంలోనూ విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా అక్కడ చైతూ భార్య శోభిత ధూళిపాళ వాళ్లకు ప్రధాన టార్గెట్గా మారింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇటు శోభిత.. అటు సమంత.. ఇలా ఇద్దరు మహిళలు బాధితులుగా మారారు. మరోవైపు.. సెలబ్రిటీలను ఫాలో చేస్తూ వారి అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసే పాపరాజీలపై టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన ప్రేయసి, మోడల్ మహీక శర్మను తీయకూడని యాంగిల్లో ఫొటో తీశారని.. కాస్తైన బుద్ధి ఉండాలంటూ పాపరాజీలకు పాండ్యా చురకలు అంటించాడు. కాగా హార్దిక్ పాండ్యాతో డేటింగ్ మొదలుపెట్టిన నాటి నుంచి మహీకపై నెట్టింట ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. మహీక, ధనశ్రీ, నటాషామరోవైపు.. హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ను సైతం అతడి దురభిమానులు వదిలిపెట్టలేదు. డబ్బు కోసమే ప్రేమ నటించి, పిల్లాడిని కని భారీ స్థాయిలో భరణం గుంజాలనే స్కెచ్ వేసిందని ఆమెపై నిందలు వేశారు.ఇక టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మపై కూడా ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే స్త్రీ అనే అర్థంలో) అంటూ నీచస్థాయిలో ట్రోల్ చేశారు. ఇతరులతో పోల్చుకోవడం, ఈర్ష్య, అసూయ.. ముఖ్యంగా తరతరాలుగా మెదళ్లలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలమే మహిళల పట్ల సోషల్ మీడియాలో వికృత వాంతి రూపంలో బయటకు వస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కొంతమంది మహిళలు సైతం ఇలాంటి ట్రోల్స్కు మద్దతు పలకడం విషాదకరం.చదవండి: మంధానతో పెళ్లి క్యాన్సిల్.. పలాష్ ముచ్చల్ ఏమన్నాడంటే?
సెంచరీ పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా, ఓవరాల్గా 33వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు.హార్దిక్కు ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లి (124) భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేశారు. వీరిలో రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. రోహిత్ మినహా అంతర్జాతీయ టీ20ల చరిత్రలో ఒక్కరు కూడా సిక్సర్ల డబుల్ సెంచరీ చేయలేదు.హార్దిక్ విషయానికొస్తే.. నిన్న (డిసెంబర్) కటక్లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ గౌరవప్రదమైన స్కోర్ (175/6) చేయగలిగింది.అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా ఒత్తిడికిలోనై చిత్తైంది. టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌటైంది. తద్వారా భారత్ 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే చెరో వికెట్ సాధించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బ్యాట్తో పాటు బంతితోనూ రాణించిన హార్దిక్ పాండ్యాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్పూర్లో జరుగనుంది.
రెండో స్థానానికి దూసుకొచ్చిన విరాట్.. రోహిత్ తగ్గేదేలే..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేయడంతో భారీగా రేటింగ్ పాయింట్లు సాధించి రెండు స్థానాలు ఎగబాకాడు. గత వారం ర్యాంకింగ్స్లో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇదే సిరీస్లో రెండు మెరుపు అర్ద శతకాలు సాధించిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.రోహిత్కు విరాట్కు మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ ఏడాది రో-కో టాప్-2లో ముగిస్తారు. మిగతా భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 10వ స్థానంలో పడిపోయాడు.సౌతాఫ్రికా సిరీస్లో రాణించిన తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 స్థానాలు ఎగబాకి 12వ ప్లేస్కు చేరుకోగా.. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా వరుసగా 99, 100 స్థానాల్లో నిలిచారు. ఈ వారం ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లతో పాటు సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. డికాక్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి ఎగబాకగా.. మార్క్రమ్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 25వ స్థానానికి చేరాడు. బ్రీట్జ్కే ఓ స్థానం మెరుగుపర్చుకొని 29కి, బవుమా 3 స్థానాలు మెరుగుపర్చుకొని 37వ స్థానానికి చేరారు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. రషీద్ ఖాన్, ఆర్చర్ టాప్-2 బౌలర్లుగా కొనసాగుతున్నారు. కుల్దీప్ మినహా టాప్-10లో ఒక్క భారత బౌలర్ కూడా లేడు. రవీంద్ర జడేజా 16, సిరాజ్ 21, షమీ 23, అక్షర్ పటేల్ 33, వాషింగ్టన్ సుందర్ 81, హార్దిక్ పాండ్యా 95, వరుణ్ చక్రవర్తి 100 స్థానాలకు పడిపోగా.. అర్షదీప్ సింగ్ 29 స్థానాలు మెరుగుపర్చుకొని 66వ స్థానానికి, హర్షిత్ రాణా 13 స్థానాలు మెరుగుపర్చుకొని 80వ స్థానానికి ఎగబాకారు. ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్ రజా, నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా 10, 11 స్థానాల్లో ఉన్నారు.
దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి దక్కింది. ద హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ కోసం పురుషుల లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్గా ఎంపికయ్యాడు. హండ్రెడ్ లీగ్లో డీకే ఏ ఫ్రాంచైజీతో అయిన పని చేయడం (కోచ్గా) ఇదే మొదటిసారి.డీకే 2025 ఐపీఎల్ సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్గా చేరి, ఆ జట్టు మొదటి సారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే పోర్ట్ఫోలియోతో లండన్ స్పిరిట్తోనూ జతకట్టాడు.లండన్ స్పిరిట్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ (ఆర్సీబీ డైరెక్టర్ కూడా) డీకేను స్వాగతిస్తూ.. ఈ టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్ లండన్ స్పిరిట్లో చేరడం ఆనందకరం. అతని ఆలోచన విధానం ప్రత్యేకం. పొట్టి ఫార్మాట్లో డీకేకు ఉన్న అనుభవం, అతని ఉత్సాహం మా ఆటగాళ్లకు అమూల్యమవుతుందని అన్నారు. లండన్ స్పిరిట్తో ఒప్పందం అనంతరం డీకే భావోద్వేగానికి లోనయ్యాడు. లార్డ్స్లో ఇంగ్లీష్ సమ్మర్ గడపనుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే గ్రౌండ్లో నేను భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాను. చివరి టెస్ట్ కూడా ఇక్కడే ఆడాను. లండన్ స్పిరిట్తో కొత్త ప్రయాణం ప్రారంభించడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. 40 ఏళ్ల దినేశ్ కార్తీక్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 180 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అలాగే ఐపీఎల్లో ప్రారంభ సీజన్ (2008) నుంచి 2024 ఎడిషన్ వరకు ఆడాడు. ఈ మధ్యలో అతను వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 257 మ్యాచ్లు ఆడాడు.
సెలక్ట్ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్పై క్రికెటర్ల పాశవిక దాడి!
భారత క్రికెట్లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుకున్నాడనే అనుమానంతో యువ క్రికెటర్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కోచ్ను చితకబాది.. అతడిని తీవ్రంగా గాయపరిచినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పుదుచ్చేరి అండర్-19 క్రికెట్ కోచ్ వెంకటరామన్ (Venkataraman)కు తీవ్ర గాయాలయ్యాయి. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP) పరిసరాల్లోనే ముగ్గురు స్థానిక క్రికెటర్లు అతడిపై దాడికి పాల్పడ్డారు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)కి తమను ఎంపిక చేయకుండా.. సెలక్టర్లను ప్రభావితం చేశాడనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.హత్యాయత్నం కింద నిందితులపై కేసుఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. హత్యాయత్నం కింద నిందితులపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో ఆటగాళ్లకు సూచనలు ఇస్తున్న వేళ.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడికి దిగారు.విరిగిన భుజం, ఇరవై కుట్లుక్రికెట్ బ్యాట్తో కొట్టి వెంకటరామన్ను గాయపరిచారు. ఈ ఘటనలో అతడి భుజానికి (విరిగినట్లు అనుమానం), పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తలపై బలంగా కూడా కొట్టడంతో నుదుటిపై దాదాపు 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటన గురించి పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నిందితులను కార్తికేయన్, అర్వింద్రాజ్, సంతోష్ కుమారన్గా గుర్తించినట్లు తెలిపారు.అత్యంత హింసాత్మకంగాప్రస్తుతం అసోసియేషన్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని.. అయినప్పటికీ అక్కడ ఉన్నవారి సాయంతో నిందితులను గుర్తించామని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరామన్ తీవ్రంగా గాయపడ్డారని.. అత్యంత హింసాత్మకంగా అతడిపై దాడి చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని సదరు అధికారి పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.కాగా ఈ ఘటనపై క్రికెట్ వర్గాల్లో ఆందోళన రేకెత్తింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటమే కాకుండా.. కోచ్పై దాడి చేయడాన్ని పుదుచ్చేరి అసోసియేషన్ అధికారులు ఖండించారు. విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. ఏదేమైనా ఈ అనూహ్య పరిణామంతో సెలక్షన్ కమిటీలో కీలకంగా వ్యవహరించే ‘పెద్దలు’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్రస్థాయి కోచ్లకు కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.స్కామ్ చేశారా?అయితే, సెలక్షన్ విషయంలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అవకతవలకు పాల్పడిందనే ఆరోపణలూ ఉన్నాయి. స్థానిక క్రికెటర్లను కాదని.. బయటి నుంచి వచ్చిన వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు జారీ చేయించేసి.. వాటి ద్వారా లోకల్ కోటాలో ఇతరులను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంది. ఈ కారణంగా రంజీ ట్రోఫీ 2021 సీజన్ నుంచి ఐదుగురు అర్హులైన క్రికెటర్లకు అన్యాయం జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.చదవండి: Suryakumar Yadav: అతడొక అద్భుతం.. ఆ ముగ్గురూ సూపర్.. నమ్మశక్యంగా లేదు
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2025 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ (MI Emirates) మిశ్రమ ఫలితాలను చవి చూస్తుంది. తొలి మ్యాచ్లో గల్ఫ్ జెయింట్స్పై ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు.. రెండో మ్యాచ్లో షార్జా వారియర్స్పై ఘన విజయం సాధించింది. తాజాగా డెసర్ట్ వైపర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒత్తిడికిలోనై సీజన్లో రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. ఛేదనలో ఓ దశలో పటిష్టంగా ఉండిన ఎంఐ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వైపర్స్ బౌలర్ డేవిడ్ పేన్ 19వ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి 3 వికెట్లు తీసి ఎంఐని భారీ దెబ్బేశాడు. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్ ఖాన్ వరుసగా సిక్సర్, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేశాడు. అయితే చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన దశలో అర్వింద్ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే ఘజన్ఫర్ను రనౌట్ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు.19వ ఓవర్లో 3 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్ పేన్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వైపర్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ హోల్డన్ (42 రిటైర్డ్ ఔట్) టాప్ స్కోరర్ కాగా.. ఫకర్ జమాన్ (35) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఎంఐ బౌలర్లలో ఘజన్ఫర్ 2, ఫజల్ హక్ ఫారూఖీ ఓ వికెట్ తీశారు.ఎంఐ ఇన్నింగ్స్లో టామ్ బాంటన్ (34) టాప్ స్కోరర్ కాగా.. పూరన్ (31), ముహమ్మద్ వసీం (24), పోలార్డ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వైపర్స్ బౌలర్లలో పేన్ 4, తన్వీర్ 2, ఫెర్గూసన్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.
మెస్సీ ఖాతాలో మరో ట్రోఫీ
ఫ్లోరిడా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనెల్ మ...
స్వర్ణం కాదు... కాంస్యం కోసమే
చెన్నై: సొంతగడ్డపై భారత జూనియర్ పురుషుల హాకీ జట్ట...
చరిత్ర సృష్టించిన లాండో నోరిస్.. 17 ఏళ్ల నిరీక్షణకు తెర
మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ తన 17 ఏళ్ల సుదీర...
ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ లీగ్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్క్రాస్ రేసింగ్ ల...
రెండో స్థానానికి దూసుకొచ్చిన విరాట్.. రోహిత్ తగ్గేదేలే..!
ఐసీసీ తాజాగా (డిసెంబర్ 10) విడుదల చేసిన వన్డే ర్య...
దినేశ్ కార్తీక్కు మరో కీలక పదవి
టీమిండియా మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్...
సెలక్ట్ కాకుండా అడ్డుకుంటావా?.. కోచ్పై క్రికెటర్ల పాశవిక దాడి!
భారత క్రికెట్లో విస్మయకర ఘటన చోటు చేసుకుంది. తాము...
ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2025 ఎడిషన్లో డిఫెండింగ్...
క్రీడలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
రయ్ రయ్ మంటూ.. ఆకట్టుకున్న బైకర్ల విన్యాసాలు.. (ఫోటోలు)
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
రేపు హైదరాబాద్కు హీరో సల్మాన్ ఖాన్ (ఫోటోలు)
సారా టెండూల్కర్ వారణాసి ట్రిప్ (ఫొటోలు)
విశాఖ చేరుకున్న భారత్, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్ సందడి (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియం: ఇదేం అభిమానం?.. ఉలిక్కిపడ్డ హార్దిక్, అభిషేక్ (చిత్రాలు)
వరల్డ్కప్ గెలిచి నెల రోజులు.. భారత మాజీ క్రికెటర్ భావోద్వేగం (ఫోటోలు)
ఉప్పల్లో హార్దిక్ హంగామా.. పోటెత్తిన అభిమానులు (ఫోటోలు)
వీడియోలు
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
విశాఖలో క్రికెట్ ఫీవర్.. టిక్కెట్ల విక్రయాల్లో గందరగోళం
వరుస సెంచరీలతో విరాట్ విధ్వంసం.. 2027 వరల్డ్ కప్ పై ఆశలు
రాయ్ పూర్ వన్డేలో భారత్ పై సౌతాఫ్రికా విజయం
సిరీస్ పై భారత్ గురి
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
