Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Vaibhav Suryavanshi Breaks Bowling World Record1
చ‌రిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త యువ సంచ‌ల‌నం, అండ‌ర్‌-19 స్టార్ వైభ‌వ్ సూర్య‌వంశీ హ‌వా కొన‌సాగుతోంది. బెక‌న్‌హామ్ వేదిక‌గా ఇంగ్లండ్ అండ‌ర్‌-19తో జ‌రుగుతున్న తొలి యూత్ టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన వైభ‌వ్‌.. బౌలింగ్‌లో మాత్రం స‌త్తాచాటాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వైభ‌వ్ రెండు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ కెప్టెన్‌ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను వైభవ్ పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఓ యూత్ టెస్టు మ్యాచ్‌లో వికెట్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భార‌త అండ‌ర్‌-19 క్రికెట‌ర్ మ‌నిషీ పేరిట(15) ఉండేది. తాజా మ్యాచ్‌తో మ‌నిషీ రికార్డును వైభ‌వ్ బ్రేక్ చేశాడు.సూపర్‌ ఫిప్టీ..రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వైభవ్‌ బ్యాట్‌ ఝూళిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్‌ ఆయూశ్‌ మాత్రే(32) రాణించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి యువ భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.ప్రస్తుతం క్రీజులో విహాన్‌ మల్హోత్రా (34), అభిగ్యాన్‌ కుందు (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చీ వాన్‌ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగులకు ఆలౌటైంది.చదవండి: తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన వైభవ్‌ సూర్యవంశీ

Ben Stokes Etches His Name In History Books With Most POTM Awards At Lords2
బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి క్రికెట‌ర్‌గా

లార్డ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. నువ్వానేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్‌లో విజ‌యం ఆఖ‌రికి ఇంగ్లండ్‌ను వరించింది. ఇంగ్లండ్ గెలుపులో ఆ జ‌ట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ది కీల‌క పాత్ర‌. స్టోక్సీ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టాడు.ఓవ‌రాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి బ్యాటింగ్‌లో 77 ప‌రుగులు చేసిన స్టోక్స్‌.. బౌలింగ్‌లో 5 కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌క లార్డ్స్ మైదానం(టెస్టు క్రికెట్‌)లో నాలుగు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా స్టోక్స్ నిలిచాడు.ఈ మ్యాచ్ ముందు వ‌ర‌కు స్టోక్స్‌.. జో రూట్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)ల‌తో క‌లిసి చెరో మూడేసి అవార్డుల‌తో సంయుక్తంగా ఉన్నాడు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గ‌జ త్ర‌యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ అధిగ‌మించాడు.స్టోక్స్ తొలిసారిగా 2015లో లార్డ్స్ మైదానంలో ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ త‌ర్వాత 2017,2019లో ఈ అవార్డు అత‌డికి వ‌రించింది. మ‌ళ్లీ ఇప్పుడు ఆరేళ్ల త‌ర్వాత ఐకానిక్ గ్రౌండ్‌లో ప్లేయ‌ర్‌గా ఆఫ్‌ది మ్యాచ్‌గా స్టోక్స్ నిలిచాడు.ఇక భారత్‌-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుందిఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టులోకి లైమ్ డాస‌న్ వచ్చాడు. భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: భార‌త్ ఓట‌మికి కార‌ణ‌మదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గ‌వాస్క‌ర్

Samit Dravid Finds No Bidders At Maharaja Trophy KSCA T20 Auction3
రాహుల్ ద్రవిడ్ కొడుకుకు బిగ్ షాక్‌..

బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో - మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌పై కాసుల వర్షం కురిసింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్‌ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్‌ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్‌, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.సమిత్ ద్రవిడ్‌కు బిగ్ షాక్‌..కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ. 50 వేలు కనీస ధ‌ర‌తో వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. సమిత్ ద్ర‌విడ్ గ‌త ఎడిష‌న్‌లో మైసూరు వారియర్స్ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు.అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సమిత్‌.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఈ మెగా టోర్నీ బెంగ‌ళూరులోని ఐకానిక్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆగస్టు 11 నుంచి 27 వరకు జ‌ర‌గ‌నుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.ఆర్సీబీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్‌లో కరుణ్‌ నాయర్‌, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్‌ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.

Indian Team Meet King Charles After Heartbreak At Lords4
బ్రిటన్ కింగ్‌ను కలిసిన టీమిండియా.. వీడియో వైరల్‌

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త పురుష‌ల‌, మ‌హిళ‌ల జ‌ట్ల ప్లేయ‌ర్లు బ్రిట‌న్ కింగ్ చార్లెస్ IIIను క‌లిశారు. మంగళవారం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌ను శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని మెన్స్ టీమ్‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్‌, హెడ్ కోచ్‌లు గౌతం గంభీర్‌, ముజుందార్‌లు సంద‌ర్శించారు.ఈ క్ర‌మంలో హృదయపూర్వకంగా స్వాగ‌తం ప‌లికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చ‌టించారు. ప్ర‌తీ ఒక్కరితో క‌ర‌చాల‌నం చేస్తూ న‌వ్వుతూ ప‌ల‌క‌రించారు. అంద‌రితో క‌లిసి ఆయ‌న‌ గ్రూపు ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ప్లేయ‌ర్లు, కోచింగ్ స్టాప్‌తో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్‌ను క‌లిశారు. చాలా సంతోషంగా ఉంది: గిల్‌ఇక బ్రిట‌న్ కింగ్‌ను క‌ల‌వ‌డంపై భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు. "కింగ్ చార్లెస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎంతో అప్యాయ‌త‌గా ప‌ల‌కరించారు. మేము చాలా విష‌యాలు ఆయ‌న‌తో సంభాషించాము. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔటైన తీరు చాలా దురదృష్టకరమని ఆయ‌న అన్నారు.మాకు ఈ మ్యాచ్‌లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పాను" అని గిల్ పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు పోరాడనప్పటికి టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.#WATCH | The United Kingdom: King Charles III met the Indian Men's Cricket team at St. James's Palace in London. pic.twitter.com/SjZU0DL6o1— ANI (@ANI) July 15, 2025

Sunil Gavaskar Goes Hard At India After Loss At Lords vs England5
భార‌త్ ఓట‌మికి కార‌ణ‌మదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గ‌వాస్క‌ర్

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో టెస్టులో 22 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. 193 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చ‌త‌క‌ల‌ప‌డింది. ర‌వీంద్ర జ‌డేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన‌ బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో భార‌త్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చ‌ర్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బ్రైడ‌న్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓట‌మిపై మ్యాచ్‌ అనంతరం భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించారు. ల‌క్ష్య చేధ‌నలో బ్యాట‌ర్లు భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌క‌పోవ‌డం వ‌ల్ల భార‌త్ ఓటమి పాలైంద‌ని ఆయ‌న తెలిపారు."భార‌త రెండో ఇన్నింగ్స్‌లో క‌నీసం ఒక్క‌టైన 60 నుంచి 70 ప‌రుగుల భాగ‌స్వామ్యం న‌మోదైంటే ఫ‌లితం మ‌రో విధంగా ఉండేది. కానీ భార‌త బ్యాట‌ర్లు అలా చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. స్పిన్న‌ర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జ‌డేజా దూకుడుగా ఆడ‌లేద‌ని కొంత‌మంది విమ‌ర్శిస్తున్నారు. కానీ ఆ స‌మ‌యంలో అత‌డు ఆడిన తీరు స‌రైన‌దే. ఎందుకుంటే బ‌య‌ట మ‌రో వికెట్ లేదు. జ‌డేజా పోరాటానికి పూర్తి మార్క్‌లు ఇవ్వాల్సిందేన‌ని" అధికారిక బ్రాడ్‌కాస్ట‌ర్ సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌న్నీ పేర్కొన్నారు. కాగా భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ సైతం త‌మ ఓట‌మికి కార‌ణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 ప‌రుగుల భాగ‌స్వామ్యం వ‌చ్చి వున్నా తాము గెలిచే వాళ్ల‌మ‌ని గిల్ అన్నాడు. ఇక భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్ట‌ర్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టులోకి లైమ్ డాస‌న్ వచ్చాడు. భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భార‌త్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ

Updated WTC 2025-27 Points Table after ENG vs IND 3rd Test & WI vs AUS 3rd Test6
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక టాప్‌లో ఆస్ట్రేలియా.. మరి టీమిండియా?

లార్డ్స్ టెస్టులో భార‌త్‌పై ఇంగ్లండ్ సంచ‌ల‌న విజ‌యం, జ‌మైకాలో జ‌రిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేయ‌డంతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు టెస్టు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అల‌రించాయి. లార్డ్స్ వేదిక‌గా ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మూడో టెస్టులో భార‌త్‌పై 22 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించ‌గా.. జ‌మైకాలో జ‌రిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను 176 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. 204 పరుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఆసీస్ బౌల‌ర్ల ధాటికి విండీస్ కేవ‌లం 29 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండో అత్య‌ల్ప స్కోర్ చేసిన జ‌ట్టుగా విండీస్ రికార్డుల‌కెక్కింది. మ‌రోవైపు భార‌త్ మాత్రం ఆఖ‌రి వ‌ర‌కు పోరాడి ఓట‌మి పాలైంది. ఈ రెండు ఫలితాల‌తో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.టాప్‌లో ఆసీస్‌..ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా 100 విజ‌య శాతం, 36 పాయింట్ల‌తో డ‌బ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో ఓట‌మి భార‌త జ‌ట్టుపై గ‌ట్టిప్ర‌భావాన్ని చూపింది.ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా(33.33 విజ‌య శాతం) నాలుగో స్ధానానికి ప‌డిపోయింది. అయితే ఈ టెస్టుకు ముందు 50 శాతంతో నాలుగో స్దానంలో ఉన్న ఇంగ్లండ్‌.. ఇప్పుడు 66.67 విజ‌య‌శాతంతో భారత్‌ను వెనక్కి నెట్టి రెండో స్ధానానికి దూసుకెళ్లింది.శ్రీలంక‌తో స‌మానంగా విజ‌యం శాతం ఉన్న‌ప్ప‌టికి పాయింట్ల ప‌రంగా ఇంగ్లండ్ ముందుంజ‌లో ఉండ‌డంతో రెండో స్ధానానికి చేరుకుంది. మూడో స్ధానంలో శ్రీలంక కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ఖాతాలో 24 పాయింట్లు ఉండ‌గా.. శ్రీలంక వ‌ద్ద 16 పాయింట్లు ఉన్నాయి.చదవండి: IND vs ENG: భార‌త్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ

England Name Squad For 4th Test vs India, Liam Dawson Returns After Eight Years7
టీమిండియాతో నాలుగో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

టీమిండియాతో నాలుగో టెస్టుకు 14 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మంగ‌ళ‌వారం ప్ర‌క‌టింది. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టులోకి ఎడమచేతి వాటం స్పిన్నర్ లియామ్ డాసన్ పున‌రాగ‌మ‌నం చేశాడు. లార్డ్స్ టెస్టులో గాయ‌ప‌డిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌ను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ విషయాన్ని ఈసీబీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మూడో టెస్టులో బషీర్ చేతి వేలికి గాయం కావడంతో మిగిలిన రెండు టెస్టులకు బషీర్ దూరమయ్యాడు. డాసన్ చివరగా 2017లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. డొమాస్టిక్ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుండడంతో డాసన్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అతడికి బ్యాట్‌తో రాణించే సత్తా కూడా ఉంది. దీంతో తుది జట్టులో అతడికి చోటు దక్కడం దాదాపు ఖాయమన్పిస్తోంది. ఇక తొలి మూడు టెస్టులో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అదేవిధంగా ఇంగ్లండ్ టెస్టు జట్టులో భాగంగా ఉన్న జేమీ ఓవర్టన్, సామ్ కుక్, తిరిగి కౌంటీ క్రికెట్‌లోకి ఆడేందుకు వారిని ఈసీబీ రిలీజ్ చేసింది. భారత్‌-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.లార్డ్స్‌లో హార్ట్ బ్రేకింగ్‌..ఇక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యఛేదనలో 170 రన్స్‌కు గిల్ సేన ఆలౌటైంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 నాటౌట్‌) విరోచిత పోరాటం కనబరిచినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కార్స్ రెండు, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.నాలుగో టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టుబెన్ స్టోక్స్ (డర్హామ్) - కెప్టెన్, జోఫ్రా ఆర్చర్ (సస్సెక్స్), గస్ అట్కిన్సన్ (సర్రే), జాకబ్ బెథెల్ (వార్విక్‌షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), బ్రైడాన్ కార్స్ (డర్హామ్), జాక్ క్రాలే (కెంట్), లియామ్ డాసన్ (హాంప్‌షైర్), బెన్ డకెట్ (నాటింగ్‌హామ్‌షైర్), ఓలీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్‌షైర్), జేమీ స్మిత్ (సర్రే), జోష్ టంగ్ (నాటింగ్‌హామ్‌షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్‌షైర్)

2028 Olympics Cricket Schedule Announced, T20 Action Begins On July 128
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. షెడ్యూల్‌ విడుదల

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ పునఃప్రవేశించనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌తో క్రికెట్‌ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్‌ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్‌ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు లాస్‌ ఏంజెలెస్‌కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్‌ప్లెక్స్‌లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.రాబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ టీ20 ఫార్మాట్‌లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్‌ మ్యాచ్‌లు (సెమీఫైనల్స్‌ మరియు బ్రాంజ్‌, గోల్డ్‌ మెడల్స్‌ మ్యాచ్‌లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్‌ మ్యాచ్‌లు లేవు.మ్యాచ్‌ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్‌ ఒలింపిక్స్‌లో దక్కింది. నాడు గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ జరగగా.. అందులో గ్రేట్‌ బ్రిటన్‌ ఫ్రాన్స్‌ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.కాగా, 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్‌/సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లాక్రోస్‌ (సిక్సస్‌), స్క్వాష్‌ జోడించబడ్డాయి.

Hyderabad Sports Stars Breakups9
పెళ్లిళ్లు.. విడాకులు.. హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ స్టార్స్‌కి ఏమైంది..?

సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లిళ్లు ఎంత గొప్పగా ప్రచారానికి నోచుకుంటాయో విడాకులు అంతకు మించి ప్రచారం పొందుతాయి. ఒకప్పుడు సినిమా సెలబ్రిటీలే వివాహ బంధాన్ని విఛ్చిన్నం చేసుకోవడంలో ముందుంటారని ఒక అభిప్రాయం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరించింది. అదే క్రమంలో ఇప్పుడు క్రీడారంగాన్ని కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది.తాజాగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తన విడాకుల నిర్ణయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ప్రకటించారు. పారుపల్లి కశ్యప్‌తో (సైనా భర్త) విడిపోయే నిర్ణయం తాను స్వయంగా తీసుకున్నానని, ఈ ప్రయాణంలో ‘‘పీస్, గ్రోత్, హీలింగ్‌’’ కోసం ఇద్దరం ఒకే మాటతో ముందుకు వెళుతున్నామని తెలిపింది. ఇది ఓ రకంగా షాకింగ్‌ అనే చెప్పాలి.సాధారణంగా స్పోర్ట్స్‌ స్టార్స్‌కు సంబంధించిన విడాకుల అంశాలపై ముందస్తు అంచనాలు, సూచనలు ఏవీ వెలువడడం జరుగదు. అదే సినిమా రంగానికి చెందిన వాళ్లయితే విడిపోవడానికి కాస్త ముందుగానే మీడియా ఈ విషయాన్ని పసిగట్టేయగలుగుతుంది.ఇక్కడ మరో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏమిటంటే... హైదరాబాద్‌ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు, మరీ ముఖ్యంగా తమ క్రీడా విజయాలతో ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచిన మహిళలది ఇదే బాట కావడం. గతంలో ఇదే విధంగా విడిపోయిన ప్రముఖ క్రీడాకారిణుల్లో సానియా మీర్జా అందరికీ చిరపరిచితం.ఆటతోనే కాకుండా అందంతో కూడా అందరి మనసుల్నీ దోచుకున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా.. పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయెబ్‌ మాలిక్‌ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ బంధం చివరికి 2024 లో ముక్కలైంది. సానియా మీర్జా కూడా హైదరాబాద్‌ వాసే కావడం గమనార్హం.మరో క్రీడాకారిణి కూడా ఇదే నగరం నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం వరకూ బ్యాడ్మింటన్‌ కి చిరునామాగా నిలిచిన గుత్తా జ్వాల చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆమె 2005లో మరో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లకే అంటే 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.నాటి ఒక యువ టాలీవుడ్‌ హీరోతో అనుబంధం అంటూ పుకార్లకు కూడా ఎదుర్కున్న గుత్తా జ్వాల కూడా హైదరాబాద్‌ వాసే. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రతిష్టను నలుదిశలా చాటిన ఈ టాప్‌ స్పోర్ట్స్‌ స్టార్స్‌ యువతుల్లో క్రీడారంగం పట్ల ఎంతగా స్ఫూర్తి నింపారో తెలియంది కాదు.అయితే ఒకే నగరానికి చెందిన వీరంతా వ్యక్తిగత జీవితాల్లో ఒకే రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవడం విచిత్రం. కొసమెరుపు ఏమిటంటే... హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ చిత్ర పటంలో చేర్చిన మహ్మద్‌ అజారుద్దీన్‌ కూడా విడాకులు తీసుకోవడం. ఆయన 1996లో సినీనటి సంగీతా బిజిలానీని పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు.

Shoaib Bashir Ruled Out Of Remainder Of Anderson-Tendulkar Trophy 202510
గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌

ఆండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ 2025లో భాగంగా నిన్న (జులై 14) ముగిసిన మూడో టెస్ట్‌లో (లార్డ్స్‌) భారత్‌పై ఇంగ్లండ్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్‌ టెస్ట్‌లో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది.ఆ జట్టు ఏకైక స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ ఎడమ చేతి వేలి ఫ్రాక్చర్‌ కారణంగా సిరీస్‌లోని తదుపరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. బషీర్‌ చేతి వేలికి ఈ వారం చివర్లో శస్త్రచికిత్స జరుగనున్నట్లు ఈసీబీ తెలిపింది. బషీర్‌ లార్డ్స్‌ టెస్ట్‌లో మూడో రోజు తన బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజా (తొలి ఇన్నింగ్స్‌) క్యాచ్‌ అందుకోబోయి గాయపడ్డాడు. ఆ గాయం తర్వాత బషీర్‌ ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ చేయలేదు.అయితే బషీర్‌ రెండో ఇన్నింగ్స్‌లో గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్‌కు దిగాడు. 9 బంతుల్లో 2 పరుగులు చేసి వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆతర్వాత బషీర్‌ ఐదో రోజు ఎక్కువ భాగం డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు.అయితే ఛేదనలో టీమిండియా టెయిలెండర్లు అద్భుతమైన పోరాటపటిమ కనబరుస్తున్న దశలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బషీర్‌ను తిరిగి బరిలోకి దించాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని బషీర్‌.. చాలా సేపు తమ సహనాన్ని పరీక్షించిన మహ్మద్‌ సిరాజ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి ఇంగ్లండ్‌ గెలుపును ఖరారు చేశాడు. ఈ సిరీస్‌లో బషీర్‌ 3 మ్యాచ్‌ల్లో 54.1 సగటున 10 వికెట్లు తీశాడు.బషీర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఇంకా ప్రకటించలేదు. జాక్‌ లీచ్‌, రెహాన్‌ అహ్మద్‌, లియామ్‌ డాసన్‌, టామ్‌ హార్ట్లీ పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగో టెస్ట్‌ జులై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.కాగా, తాజాగా ముగిసిన లార్ట్స్‌ టెస్ట్‌ టీమిండియాకు గుండెకోత మిగిల్చింది. విజయానికి అత్యంత చేరువగా వచ్చినా భారత్‌ను ఓటమే పలకరించింది. ఐదో రోజు చేతిలో 6 వికెట్లతో 135 పరుగులు చేయాల్సిన టీమిండియా లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న పంత్, రాహుల్‌ విఫలం కాగా... 82/7 నుంచి జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచితంగా పోరాడాడు. అయినా లాభం లేకుండా పోయింది.అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వైఫల్యం భారత్‌ను దెబ్బ తీసింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement