Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Smriti Mandhana Deletes All Wedding Related Posts1
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్‌ చేసిన మంధాన

భారత మహిళా జట్టు స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌-2025లో భారత్‌ విజేతగా నిలవడంలో బ్యాటర్‌గా, వైస్‌ కెప్టెన్‌గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌, రాధా యదవ్‌లతో కలిసి తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని రీల్‌ ద్వారా రివీల్‌ చేసింది.అనంతరం పలాష్‌.. భారత్‌ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్‌ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్‌ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్‌ మీడియాలో అకౌంట్లో షేర్‌ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్‌ నుంచి డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్‌ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్‌ చేసిన మంధానఆ వెంటనే పలాష్‌ ముచ్చల్‌ కూడా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్‌ మూమెంట్స్‌ను స్మృతి మంధాన సోషల్‌ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్‌ మాత్రం డిశ్చార్జ్‌ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్‌మెంట్‌ రివీల్‌, ప్రపోజల్‌ వీడియోలు షేర్‌ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్‌ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్‌ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్‌ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్‌

IND vs SA 2nd Test Day 3 Report: Jansen Becomes 1st South African To2
చరిత్ర సృష్టించిన యాన్సెన్‌.. పట్టు బిగించిన సౌతాఫ్రికా

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్‌ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్‌ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్‌ పర్యటనకు వచ్చింది. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్‌ మిస్‌బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్‌ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్‌ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్‌లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్‌ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన యాన్సెన్‌.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్‌ జురెల్‌ (0), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్‌ చేశాడు ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.అదే విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ (19), జస్‌ప్రీత్‌ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు యాన్సెన్‌.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్‌ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్‌లో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్‌ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్‌ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్‌ కెప్టెన్‌ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ 13, ఐడెన్‌ మార్క్రమ్‌ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

Doesnt Make Sense: Gambhir Slammed for Washi Mistreatment By Ravi Shastri 3
అసలు సెన్స్‌ ఉందా?.. .. గంభీర్‌ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్‌.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్‌ సుందర్‌తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి సైతం గంభీర్‌ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.కాగా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)ను కోల్‌కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్‌లో వాషీతో ఒకే ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్‌ చేశారు.అసలు సెన్స్‌ ఉందా?ఈ పరిణామాలపై కామెంటేటర్‌ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్‌ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్‌ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.కోల్‌కతాలో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో ఒకే ఒక్క ఓవర్‌ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్‌ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి? ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?కోల్‌కతా టెస్టులో వాషీని వన్‌డౌన్‌లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. మరీ అంత లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారీ ఆధిక్యంలో సఫారీ జట్టుకాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ (288) కలుపుకొని.. భారత్‌ కంటే ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులతో రాణించాడు. చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

IND vs SA 2nd Test Day 3: Batters Fail India 201 All Out Fans Reacts4
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్‌.. ఫ్యాన్స్‌ ఫైర్‌

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆన్‌ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్‌ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్‌ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్‌ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్‌ అయిన యాన్సెన్‌ప్రొటిస్‌ ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (38), ర్యాన్‌ రికెల్టన్‌ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (49), కెప్టెన్‌ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్‌ సెనూరన్‌ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్‌తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్‌ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (58), కేఎల్‌ రాహుల్‌ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్‌ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్‌.. వాషీ ఒక్కడే..వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (15), ధ్రువ్‌ జురెల్‌ (0), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్‌ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్‌ యాదవ్‌ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్‌.. బుమ్రా (5)ను కూడా అవుట్‌ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్‌ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్‌ హార్మర్‌ మూడు, కేశవ్‌ మహరాజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్‌ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్‌ ఏంటయ్యా? అంటూ పంత్‌ సేనపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?

Smriti Mandhana Fiance Palash Muchhal Taken To Hospital After Her: Report5
ఆస్పత్రి పాలైన పలాష్‌ ముచ్చల్‌!.. స్మృతి తండ్రి హెల్త్‌ అప్‌డేట్‌ ఇదే!

ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పలాష్‌ ముచ్చల్‌తో కలిసి స్మృతి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైన వేళ... ఆమె తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యారు.తప్పనిసరి పరిస్థితుల్లో..ఊహించని ఈ పరిణామంతో స్మృతి- పలాష్‌ పెళ్లితంతును నిరవధికంగా వాయిదా (Smriti Mandhana- Palash Muchhal Wedding Postponed) వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘ఆదివారం ఉదయం శ్రీనివాస్‌ అల్పాహారం తీసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ పెళ్లి సమయం కల్లా కోలుకుంటారనే ఇరు కుటుంబసభ్యులు ఎదురుచూశారు.నాన్న చూడని వేడుక నాకొద్దుకానీ ఆశించినట్లుగా ఆరోగ్యం ఏమాత్రం మెరుగవలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది’ అని స్మృతి మేనేజర్‌ తుహిన్‌ మిశ్రా వెల్లడించారు. నాన్న గారాల పట్టి స్మృతి. అందుకే నాన్న చూడని తన కల్యాణ వేడుక నాకొద్దని స్మృతి కరాకండీగా చెప్పినట్లు తెలిసింది. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగొచ్చాకే వివాహ వేడుక ఉంటుందని స్పష్టం చేసింది.ఆస్పత్రి పాలైన పలాష్‌ ముచ్చల్‌!కాగా ముందే నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఆదివారం స్మృతి, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌ వివాహం జరగాల్సింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తండ్రి అనారోగ్యం కారణంగా ఆందోళనలో మునిగిపోయిన స్మృతి మంధానకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. స్మృతికి కాబోయే భర్త పలాష్‌ ముచ్చల్‌ కూడా ఆస్పత్రి పాలైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఎన్‌డీటీవీ అందించిన వివరాల ప్రకారం.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా పలాష్‌ ముచ్చల్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఎసిడిటీ ఎక్కువ కావడంతో అతడు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, పలాష్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. మెరుగైన చికిత్స కోసం మాత్రమే అతడు ఆస్పత్రికి వెళ్లాడని సమాచారం.స్మృతి తండ్రి హెల్త్‌ అప్‌డేట్‌ ఇదే!ఇక స్మృతి తండ్రి శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యుడు డాక్టర్‌ నమన్‌ షా పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో శ్రీనివాస్‌ మంధాన ఛాతీలో ఎడమవైపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన కుమారుడు నాకు కాల్‌ చేసి పరిస్థితి గురించి చెప్పగానే అంబులెన్స్‌ పంపించాము.వెంటనే ఆయనను ఆస్పత్రికి తీసుకువచ్చి.. చికిత్స మొదలుపెట్టాము. కార్డియాక్‌ ఎంజైమ్స్‌ పెరిగిపోయాయి. బీపీ కూడా ఎక్కువగా ఉంది. పరిస్థితిని బట్టి ఆంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. స్మృతి, ఆమె కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్టులో ఉండి.. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు’’ అని తెలిపారు. వారం రోజులుగా వేడుకలుకాగా స్మృతి స్వస్థలం సాంగ్లీలో వారం రోజులుగా ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. భారత జట్టు క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌ తదితరులు హల్దీ, సంగీత్‌ వేడుకలో ఉత్సాహంతో పాల్గొన్నారు. వధూవరులు స్మృతి- పలాష్‌ కూడా డాన్సులతో వేదికను హోరెత్తించారు. ఇక మూడు ముళ్లు పడటమే తరువాయి అనే తరుణంలో ఇలా స్మృతి తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని.. స్మృతి- పలాష్‌ల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగిపోవాలని స్మృతి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్

IND vs SA 2nd Test: Rishabh Pant Takes SHOCKING Review As India Continue To Crumble6
అస్స‌లు నీవు కెప్టెన్‌వా?

గువ‌హ‌టి వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. తొలుత బౌలింగ్‌లో విఫ‌ల‌మైన భార‌త్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే ఫ‌లితాన్ని రిపీట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 123 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 9/0 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా రాహుల్‌(22), జైశ్వాల్‌(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔట‌య్యాక టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. సాయిసుద‌ర్శ‌న్‌(15), ధ్రువ్ జురెల్‌(0) వ‌రుస ఓవ‌ర్ల‌లో పెవిలియ‌న్‌కు చేరారు.పంత్‌పై విమర్శలు..ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్‌ రిష‌బ్ పంత్ బాధ్య‌త ర‌హితంగా ఆడాడు. క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును ఆదుకోవాల్సింది పోయి ర్యాష్ షాట్ ఆట ఆడి త‌న వికెట్‌ను కోల్పోయాడు. భార‌త్ ఇన్నింగ్స్ 38 ఓవ‌ర్ వేసిన సఫారీ స్పీడ్ స్టార్ మార్కో జాన్సెసన్‌.. రెండో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఈ క్రమం‍లో పంత్ క్రీజ్ నుంచి ముందుకు వచ్చి స్లాగ్ షాట్ కోసం ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే సౌతాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. కానీ పంత్ మాత్రం రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. క్లియర్‌గా ఎడ్జ్ తాకిందని తెలిసి మరి పంత్ రివ్యూ వృథా చేశాడు. రిప్లేలో భారీ ఎడ్జ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ షాట్ అవసరమా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా 55 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 342 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్‌ ఆన్‌ గండం తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 142 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్‌ సుందర్‌(23), కుల్దీప్‌ యాదవ్‌(3) ఉన్నారు.చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?

India Enters Womens Kabaddi World Cup 2025 Finals7
ప్రపంచకప్‌ కబడ్డీ ఫైనల్‌కు భారత్‌

ప్రపంచకప్‌ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఢాకా వేదిక‌గా జ‌రిగిన సెమీఫైనల్లో భారత్‌ 33–21 పాయింట్ల తేడాతో ఇరాన్‌ జట్టును ఓడించింది. మరో సెమీఫైనల్లో చైనీస్‌ తైపీ 25–18 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది.నేడు జరిగే ఫైనల్లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడుతుంది. మొత్తం 11 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్, చైనీస్‌ తైపీ అజేయంగా ఫైనల్‌కు చేరాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్‌ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ... గ్రూప్‌ ‘బి’లో చైనీస్‌ తైపీ తాము ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాయి.చదవండి: Australian Open 2025: ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా లక్ష్య సేన్‌

BCCI explains why Rahul was named ODI captain8
పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ కారణంగా జట్టు పగ్గాలను రాహుల్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ అప్పగించింది. అయితే తొలుత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను తాత్కాలిక వన్డే కెప్టెన్‌గా నియమిస్తారని వార్తలు వచ్చాయి.పంత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మెన్ ఇన్ బ్లూకు స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దీంతో అత‌డికే జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని అంతా భావించారు. కానీ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మాత్రం రాహుల్ వైపే మొగ్గు చూపింది. అయితే పంత్‌కు కాకుండా రాహుల్‌ను నియ‌మించ‌డానికి గ‌ల కార‌ణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా వెల్ల‌డించారు."సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో మాత్ర‌మే కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. శుభ్‌మ‌న్ గిల్ తిరిగి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ స‌మ‌యానికి అందుబాటులో వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అత‌డు త‌న గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.ఇక రిష‌బ్ పంత్ సంవత్సర కాలంలో కేవలం ఒక వన్డే మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అందుకే అత‌డిని కెప్టెన్సీ ఎంపిక‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు" అని స‌ద‌రు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. కాగా పంత్ గతేడాది శ్రీలంక‌పై భార‌త్ త‌ర‌పున చివ‌ర‌గా ఆడాడు. అప్ప‌టి నుంచి వ‌న్డే జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు అతడు సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌ సందర్భంగా పున‌రాగ‌మ‌నానికి అత‌డు సిద్ద‌మ‌య్యాడు.ఇక ఈ వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా దూరమయ్యారు. అదేవిధంగా బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టులోకి రిషబ్ పంత్‌, రుతురాజ్ గైక్వాడ్‌, జైశ్వాల్ వచ్చారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.భారత వన్డే జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్‌ వర్మ, పంత్, సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ గైక్వాడ్, ప్రసిధ్, అర్ష్‌దీప్‌, ధ్రువ్‌ జురెల్‌. చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

IND vs SA 2nd Test: SA on top as bowlers take 4 before Tea9
భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో తేలిపోయిన భారత్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తోంది. లంచ్‌ సమయానికి ఏడు వికెట్ల ష్టానికి 174 పరుగులు చేసింది.పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును వాషింగ్టన్‌ సుందర్‌(33బ్యాటింగ్‌), కుల్దీప్‌(14బ్యాటింగ్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్‌ ఇంకా సౌతాఫ్రికా 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్‌ అన్‌ గండం తప్పించుకోవాలంటే మెన్‌ ఇన్‌ బ్లూ.. 116 పరుగులు చేయాలిటాపార్డర్‌ అట్టర్‌ ప్లాప్‌..9/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్‌కు రాహుల్‌(22), జైశ్వాల్‌(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్‌ ఔటయ్యాక భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్‌(15), ధ్రువ్‌ జురెల్‌(0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌(7), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(10), జడేజా(6) తీవ్ర నిరాశపరిచారు. ప్రోటీస్‌ బౌలర్లలో జాన్సెన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్మర్‌ రెండు,మహారాజ్‌ ఓవికెట్‌ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Pakistan Shaheens win super over thriller vs BAN to clinch 2025 Asia Cup Rising Stars10
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ విజయం

ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఛాంపియన్స్‌గా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఆదివారం దోహ వేదికగా బంగ్లాదేశ్‌-ఎ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడో ఆసియాకప్ కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను పాక్ కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో తొలుత ‍బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆరంభంలో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాజ్ సదాకత్ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) , అరఫాత్ మిన్హాస్( 23 బంతుల్లో 4 ఫోర్లతో 25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.ఆఖరిలో సాద్ మసూద్ (26 బంతుల్లో 38) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాదేశ్-ఎ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు పడగొట్టగా.. రకిబుల్ హసన్ రెండు, మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫ‌ర్‌ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.స్కోర్లు సమం..అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్‌ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చేజింగ్‌లో హబీబుర్ రెహమాన్ సోహన్(23) మెరుపు వేగంతో ఆడ‌డంతో మ్యాచ్ త్వ‌ర‌గా ముగిసిపోతుంద‌ని అంతా భావించారు. కానీ ఆ త‌ర్వాతే బంగ్లా వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24), అబ్దుల్ గ‌ఫ‌ర్‌(16) దూకుడుగా ఆడ‌డంతో స్కోర్లు స‌మం అయ్యాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌తో ఫ‌లితం తేల్చాల‌ని అంపైర్‌లు నిర్ణ‌యించారు.సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్ల న‌ష్టానికి 6 ప‌రుగుల‌కే చేసింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు ప‌రిగ‌ణిస్తారు. అహ్మద్ డానియల్ మ‌రోసారి అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.బంగ్లా నిర్ధేశించిన 7 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాక్ నాలుగు బంతుల్లో చేధించింది. పాక్ విజ‌యంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. ఓపెన‌ర్‌ మాజ్ సదఖత్‌ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement