Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

What wrong has Sanju Samson done? Uthappa questions Gautam Gambhir on live TV1
సంజూ చేసిన తప్పు ఏంటి.. ఎందుకు బలి చేస్తున్నారు?: ఉతప్ప

ఈ ఏడాది ఆసియాకప్‌తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్‌లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూను కాదని మరి గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్‌-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్‌లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.శాంసన్ చేసిన తప్పేంటి?"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అత‌డికి అవ‌కాశ‌మివ్వ‌డం లేదు? అభిషేక్ శ‌ర్మ‌, సంజూ శాంస‌న్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవ‌స‌రం ఏమి వ‌చ్చింది. ఈ సిరీస్‌కు ముందు సూర్య‌కుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవ‌కాశం రాక‌ముందే శుభ్‌మ‌న్ టీ20 జ‌ట్టులో భాగంగా ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు.ఆ విష‌యం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవ‌కాశం వ‌స్తే ఏమి చేశాడో మ‌నందరికి తెలుసు. ఓపెన‌ర్‌గా వ‌చ్చి వ‌రుస‌గా మూడు సెంచ‌రీలు బాదాడు. ప్ర‌స్తుత యువ క్రికెట‌ర్లలో అంద‌రికంటే ముందు సంజూనే చేశాడు. ఆ త‌ర్వాత అభిషేక్‌, తిల‌క్ వ‌ర్మ సెంచ‌రీలు సాధించారు. ఓపెన‌ర్‌గా సంజూ త‌న‌ను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శ‌ర్మ సంజూనే విజ‌య‌వంతమైన ఓపెన‌ర్‌గా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికి అత‌డిని ఓపెన‌ర్‌గా త‌ప్పించారు. ఆ త‌ర్వాత అత‌డిని మిడిల్ ఆర్డర్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మ‌రోసారి అడుగుతున్న అత‌డు చేసిన త‌ప్పు ఏంటి? క‌చ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అత‌డు అర్హుడు.ప్ర‌స్తుతం శుభ్‌మ‌న్ టీ20ల్లో రాణించ‌లేక‌పోతున్నాడు. త‌న శైలికి విరుద్దంగా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతున్నాడు. మొద‌టిలో అభిషేక్‌తో పోటీప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని నేను భావిస్తున్నాను. త‌డు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అత‌డు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త స‌మయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన త‌ర్వాత అత‌డిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్‌కు టీ20కు స‌రిపోతుంది" అని ఉత‌ప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.

Virat Kohli could play Vijay Hazare Trophy matches at M Chinnaswamy Stadium2
చిన్నస్వామిలో ఆడ‌నున్న విరాట్ కోహ్లి.. ఎప్పుడంటే?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్ర‌వారం జ‌రిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్ ఎంపికైన వారం రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన తొక్కిసలాటలో 11 మంది మ‌రణించారు.ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. అప్ప‌టి నుంచి ఇప్పటివరకు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా జ‌ర‌గలేదు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ చిన్న‌స్వామి మైదానంలో అభిమానులు సంద‌డి నెల‌కోనుంది.ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందే టీమిండియా స్టార్‌, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లి ఈ మైదానంలో ఆడ‌నున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజ‌న్ నుంచి చిన్న‌స్వామి మైదానంలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హాజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. వానికి వాస్త విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025-26 గ్రూపు-డి మ్యాచ్‌ల‌కు బెంగ‌ళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ఉంది. గ్రూపు-డిలో విరాట్ కోహ్లి, రిష‌బ్ పంత్ ప్రాతినిథ్యం వ‌హించే ఢిల్లీ జ‌ట్టు కూడా ఉంది. కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఆడుతుండ‌డంతో అలూర్ వంటి చిన్న వేదిక‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ ఆడే మ్యాచ్‌ల‌ను అలూర్ నుంచి చిన్న‌స్వామికి త‌రలించాల‌ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విజయ్‌ హాజారే టోర్నీ డిసెంబర్‌ 24 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే ఛాన్స్‌ ఉంది.చదవండి: IND vs SA: గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

Lionel Messi In Hyderabad: Check Complete Schedule3
కాసేపట్లో హైద‌రాబాద్‌కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్‌కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్‌కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్‌పై ఓ లుక్కేద్దాం.హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్కోల్‌కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్‌పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు.👉 8:10 నిమిషాలకు హార్డ్‌ స్టాప్‌ ఉండనుంది👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్‌👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మైదానంలో రానున్నారు.👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌ కలిసి పరేడ్‌ వాక్‌లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోనున్నాడు.చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

Captain Suryakumar Yadav under scrutiny for poor batting form4
'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు'

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో నానా తంటాలు పడుతున్నాడు. దాదాపు రెండేళ్లగా వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన సూర్య.. 2025లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ముంబై ఆటగాడు తీవ్ర నిరాశపరుస్తున్నాడు.తొలి టీ20లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన సూర్య.. రెండో టీ20లో ఐదు పరుగులే చూసి పెవిలియన్‌కు చేరాడు. టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అతడి పూర్ ఫామ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌ను తెగ కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విమర్శలు గుప్పించాడు. కెప్టెన్ అంటే టాస్‌లు వేయడం, ఫీల్డ్‌ను సెట్ చేయడం కాదని పరుగులు కూడా చోప్రా అన్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 18 అంత‌ర్జాతీయ టీ20లు ఆడిన స్కై.. 15.07 స‌గ‌టుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు."సూర్య.. భారత జట్టుకు కెప్టెన్ అన్న విషయం మర్చిపోకూడదు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం, బౌలర్లను రోటేట్ చేయడం, వ్యూహాలు రచించడమే కాదు. బ్యాట్‌తో కూడా రాణించాలి. టాప్ ఫోర్‌లో బ్యాటింగ్‌కు వస్తుందున ఖచ్చింగా పరుగులు చేయాలి. ఈ ఏడాది అతడు చాలా మ్యాచ్‌లు ఆడాడు.అయినా అతడి ఆట తీరు మారలేదు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 18 మ్యాచ్‌లు ఆడి కేవలం 15 సగటు మాత్రమే కలిగి ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా మరీ ఘోరంగా ఉంది. ఒక్క అర్థ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత కూడా అతడి ఫామ్‌లో ఎటువంటి మార్పు కన్పించలేదు. మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి పరుగులు సాధించకపోతే జట్టుకు ఎల్లప్పుడూ అదే భారంగానే ఉంటుంది. ఇదే ఫామ్‌తో టీ20 ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తారు. కాబట్టి కెప్టెన్‌తో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా తన ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరముందని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

Lionel Messi Leaves Stadium Early, Fans Agitated5
సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ ఫ్యాన్స్‌ రచ్చ..

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌క‌తా ప‌ర్య‌ట‌న ముగిసింది. అయితే సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగినప మోహన్ బగన్ మెస్సీ ఆల్ స్టార్స్ వ‌ర్సెస్‌ డైమండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ సంద‌ర్భంగా గంద‌ర‌గోళం నెల‌కొంది. మెస్సీ మ్యాచ్ ఆడ‌కుండానే త్వ‌రగా వెళ్లిపోయాడ‌ని అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్స్‌ను, కూర్చీల‌ను మైదానంలోకి విసిరి ర‌చ్చ రచ్చ చేశారు. ఫ్లెక్సీలు ద్వంసం చేస్తూ, బ్యారికేడ్ల‌ను దాటుకుంటూ మైదానంలో చొచ్చుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ గందరగోళ పరిస్ధితుల నేపథ్యంలో మెస్సీ టీమ్‌ను సొరంగం గుండా బయటకు పంపించారు. మెస్సీ మైదానంలో కేవలం ఐదు నిమిషాల మాత్రమే ఉన్నాడు. అతడిని చూసేందుకు బెంగాల్‌ పక్కరాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. వాస్తవానికి మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడాల్సి ఉండేది. కానీ మెస్సీ మ్యాచ్‌ ఆడకుండానే వెళ్లిపోవడంతో ఫ్యాన్స్‌ తీవ్రనిరాశకు గురయ్యారు. ఈవెంట్‌ నిర్వహకులపై అభిమానులు మండిపడుతున్నారు. అంతకుముందు శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా అవిష్కరించారు.

Will Sanju Samson replace Shubman Gill in 3rd T20I in Dharamsala?6
గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం..? గిల్‌కు ఊహించని షాక్‌!

ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ముల్లాన్‌పూర్‌లో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గోనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉంది. సిరీస్ ఆధిక్యం పెంచుకునేందుకు మూడో టీ20ల్లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సంజూకు చోటు!గిల్ స్దానంలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20 జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చేంత‌వ‌ర‌కు భార‌త ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ‌, శాంస‌న్‌లు ఆరంభించేవారు. ఓపెన‌ర్‌గా సంజూ మూడు సెంచ‌రీలు కూడా బాదాడు.అయితే గిల్ రీ ఎంట్రీతో శాంస‌న్ ఏకంగా జ‌ట్టులోనే చోటు కోల్పోయాడు. ప్ర‌ధాన జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి చాలా మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గిల్ కోసం సంజూను బ‌లి చేస్తారా? అని మాజీలు సైతం మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శాంస‌న్‌ను మ‌ళ్లీ తుది జ‌ట్టులోకి తీసుకు రావాల‌ని గంభీర్ నిర్ణ‌యించిన‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అంత‌ర్జాతీయ టీ20ల్లో గిల్ ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అత‌డిని టీ20ల నుంచి త‌ప్పించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తున్నాయి. మ‌రి నిజంగానే గంభీర్‌.. మూడో టీ20 నుంచి గిల్‌ను త‌ప్పిస్తాడా? అని తెలియాలంటే ఆదివారం వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.మూడో టీ20 కోసం భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా)సంజూ శాంసన్‌, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: GOAT Tour India 2025: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్‌ ఇదే!

Lionel Messi's First Reaction On His 70-Foot Statue In Kolkata7
70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్‌ ఇదే!

మెస్సీ.. మెస్సీ.. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం ది గోట్ టూర్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్‌క‌తా విమానాశ్ర‌యంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్‌కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది. ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్‌లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్‌కతా లేక్ టౌన్‌లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్‌తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు.City of Joy welcomes the G.O.A.T Lionel Messi enters a packed Salt Lake Stadium #MessiInIndia #Messi𓃵 pic.twitter.com/zGdlRFQPUL— Kamit Solanki (@KamitSolanki) December 13, 2025

Match-Fixing in Syed Mushtaq Ali Trophy? Four Assam players suspended after corruption allegations8
భారత క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం..! నలుగురిపై వేటు

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆట‌గాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఆ న‌లుగురు ప్లేయ‌ర్ల‌ను అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకుర్‌ల‌గా అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) గుర్తించింది.దీంతో వారిపై ఏసీఎ సస్పెన్ష‌న్ వేటు వేసింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన లీగ్ మ్యాచ్‌ల‌లో ఈ న‌లుగురు.. స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను ప్రభావితం చేసేందుకు ప్ర‌య‌త్నించారంట‌. ఈ విష‌యాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్య‌ద‌ర్శి సనాతన్ దాస్ ధ్రువీక‌రించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఈ న‌లుగురిపై గువ‌హతిలోని క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా న‌మైంది. ఈ విష‌యంపై బీసీసీఐ అవినీతి నిరోధ‌క విభాగం ఇప్ప‌టికే ప్రాథమిక విచారణ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. సస్పెండ్ అయిన వారిలో అభిషేక్ ఠాకూర్.. ఈ ఏడాది రంజీ సీజ‌న్‌లో అస్సాం త‌ర‌పున రెండు మ్యాచ్‌లు ఆడారు. మిగితా ప్లేయ‌ర్లు దేశీయ క్రికెట్‌లో వివిధ స్థాయిల్లో అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌ సైతం అస్సాంకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: మెస్సీ కోసం హానీమూన్ మానుకున్న జంట‌

Lionel Messi Fan cancelled honeymoon plan want to see him9
మెస్సీ వ‌స్తున్నాడ‌ని.. హ‌నీమూన్ ర‌ద్దు

కోల్‌క‌తా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అత‌డి ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగితేలుతున్నారు. శ‌నివారం ఉద‌యం ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తా చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. అత‌డు వ‌స్తున్న దారి వెంబ‌డి నిల‌బ‌డి సంద‌డి చేశారు. అత‌డు బ‌స చేసి హోట‌ల్ ముందు గుమిగూడారు. ఇక కోల్‌క‌తా న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా మెస్సీ అభిమానుల కోలాహలం క‌నిపించింది.మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు లియోనెల్ మెస్సీ.. (Lionel Messi ) సాల్ట్ లేక్ స్టేడియంలో సంద‌డి చేయ‌నున్నారు. దీంతో ఈ ఉద‌యం నుంచే అభిమానులు భారీగా ఇక్క‌డికి చేరుకుంటున్నారు. మెస్సీని చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ త‌ర‌లివ‌చ్చారు. నేపాల్ నుంచి కూడా కొంత మంది అభిమానులు కోల్‌క‌తా చేరుకోవ‌డం విశేషం. కొత్త‌గా పైళ్లైన ఓ జంట త‌మ హ‌నీమూన్‌ను సైతం వాయిదా వేసుకుని మెస్సీని చూసేందుకు వ‌చ్చింది.సాల్ట్ లేక్ స్టేడియం వ‌ద్ద కొత్త జంట ఏఎన్ఐ వార్తా సంస్థ‌ల‌తో మాట్లాడింది. "గత శుక్రవారం నా పెళ్లి జ‌రిగింది. మెస్సీ వస్తున్నాడ‌ని తెలిసి హనీమూన్ ప్లాన్‌ను రద్దు చేసుకున్నాను. మెస్సీ ప‌ర్య‌ట‌నే నాకు ముఖ్యం. నేను 2010 నుంచి అతడిని అనుసరిస్తున్నాన''ని న‌వ‌వ‌ధువు తెలిపారు. ఆమె భ‌ర్త కూడా మెస్సీ అభిమాని కావ‌డంతో ఇద్ద‌రు అత‌డిని చూడ‌టానికి వ‌చ్చారు. ''ఈ మ‌ధ్య‌నే మాకు పెళ్లయింది. మెస్సీ ఇండియా పర్యటన కారణంగా హనీమూన్ ర‌ద్దు చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా మేము మెస్సీని చూడాలనుకున్నాము. అతడిని చూడటానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ప‌ది పండేన్నేళ్లుగా అత‌డిని ఫాలో అవుతున్నామ‌''ని కొత్త పెళ్లి కొడుకు మీడియాతో త‌న సంతోషాన్ని పంచుకున్నాడు. చ‌ద‌వండి: 70 అడుగుల విగ్ర‌హం.. మెస్సీ ఫ‌స్ట్‌ రియాక్ష‌న్ ఇదే!మెస్సీని చూడటం నా కలమెస్సీని ద‌గ్గ‌ర నుంచి ప్ర‌త్య‌క్షంగా చూడ‌డం త‌న చిర‌కాల స్వ‌ప్న‌మ‌ని నేపాల్ (Nepal) నుంచి వ‌చ్చిన అభిమాని చెప్పాడు. ''నేను నేపాల్ నుండి వచ్చాను. మెస్సీని చూడటం నా కలల్లో ఒకటి. మా దేశం త‌ర‌పున భారతదేశానికి ధన్యవాదాలు. కేవలం మెస్సీని చూడటానికే టిక్కెట్లు కొన్నాను. నన్ను ఇక్కడికి రావడానికి అనుమతించి, నా కలను నిజం చేసిన నా కుటుంబ సభ్యులకు ధ‌న్య‌వాదాలు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సోదరుడికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మెస్సీని చూడటానికి కాలేజీ ఎగ్గొట్టి ఎంతో దూరం నుంచి కోల్‌క‌తాకు వ‌చ్చాను. మెస్సీని చూడటానికి అడ్డుప‌డితే నా భార్యకు విడాకులు ఇచ్చేస్తాన‌''ని అన్నాడు. #WATCH | West Bengal | Fans of star footballer Lionel Messi line up outside the Salt Lake stadium in Kolkata for the first leg of his G.O.A.T. Tour India 2025. pic.twitter.com/Fa1POGEje2— ANI (@ANI) December 13, 2025

India cruise past South Africa to book semi-final berth10
సెమీఫైనల్లో భారత్‌

చెన్నై: ఆతిథ్య భారత జట్టు స్క్వాష్‌ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–0తో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. జోష్నా చినప్ప 7–4, 7–4, 7–2తో టీజెన్‌ రసెల్‌పై గెలుపొందగా, అభయ్‌ సింగ్‌ 7–1, 7–6, 7–1తో డెవాల్స్‌ వాన్‌ నికెర్క్‌పై గెలిచాడు. అనాహత్‌ సింగ్‌ 7–3, 7–3, 7–4తో హేలీ వార్డ్‌ను చిత్తు చేసింది. సెమీస్‌లో ఈజిప్‌్టతో భారత్‌ తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఈజిప్ట్‌ 3–0తో ఆ్రస్టేలియాపై గెలుపొందింది. లీగ్‌ దశలో భారత జట్టు స్విట్జర్లాండ్, బ్రెజిల్‌లపై విజయంతో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌ 2023లో గెలిచిన కాంస్య పతకమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement