Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Royal Challengers Bangalore are aiming for a second title in the IPL1
ఆర్‌సీబీ రె‘ఢీ’

ఒకటి కాదు రెండు కాదు పదిహేడు సీజన్ల పాటు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో విఫలమైంది. ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో బరిలోకి దిగడం చివరకు ఖాళీ చేతులతో వెనుదిరగడం జట్టుకు అలవాటులా కనిపించింది. మూడుసార్లు ఫైనల్‌ చేరినా రన్నరప్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కానీ ఆర్‌సీబీ అభిమానుల కోరిక ఎట్టకేలకు గత సీజన్‌లో తీరింది. ఎట్టకేలకు 18వ ప్రయత్నంలో బెంగళూరు ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. విజయోత్సవ వేడుకలో అపశ్రుతితో ఈ గెలుపు సంబరాలు కాస్త తగ్గినా ఇప్పుడు అంతా సర్దుకుంది. తమ సొంత మైదానంలో మళ్లీ మ్యాచ్‌లకు ఆర్‌సీబీ సిద్ధమైంది. గత ఏడాదితో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా దాదాపు అదే బృందాన్ని కొనసాగించిన టీమ్‌ మళ్లీ టైటిల్‌ కొడుతుందా లేదా వేచి చూడాలి! సాక్షి క్రీడా విభాగం తొలి టైటిల్‌ కోసం ఎంతగానో ఎదురు చూసిన తర్వాత ఆర్‌సీబీ టీమ్‌లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఒకప్పుడు కోహ్లి లేదా గేల్‌ లేదా డివిలియర్స్‌ల వ్యక్తిగత ప్రదర్శనలపైనే ఆధారపడిన జట్టు 2025 సీజన్‌లో సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. అదే మంచి ఫలితాలను ఇచ్చింది. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో 657 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే కోహ్లి ప్రదర్శనకు మించి ఇతర ఎన్నో అంశాలు జట్టును నడిపించాయి. జట్టు కష్టాల్లో నిలిచిన ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు హీరోగా నిలిచాడు.కృనాల్‌ పాండ్యా, రొమారియో షెఫర్డ్, టిమ్‌ డేవిడ్, హాజల్‌వుడ్, భువనేశ్వర్‌... ఇలా అందరూ తమ పాత్ర పోషించారు. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ ప్రశాంతంగా జట్టును నడిపించిన తీరు కూడా ప్రశంసనీయం. కెపె్టన్‌ హోదా లేకపోయినా కోహ్లి టీమ్‌లో నింపే స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి సీజన్‌లో కూడా ఆర్‌సీబీ నుంచి అభిమానులు అదే ఆశిస్తున్నారు. సరిగ్గా చెప్పాలంటే ఇతర జట్లతో పోలిస్తే వేలం సమయంలో ఆర్‌సీబీకి పెద్ద సమస్య లేకపోయింది. వేలంలో 8 మంది ఆటగాళ్లను ఎంచుకోగా... వీరిలో ఐదుగురు భారత్‌కు ఆడని ‘అన్‌క్యాప్డ్‌’ ఆటగాళ్లే. మిగతా ముగ్గురు కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాళ్లు కాదు. ముందు జాగ్రత్తగా వేలంలో జాకబ్‌ డఫీ, జోర్డాన్‌ కాక్స్, వెంకటేశ్‌ అయ్యర్‌లను తీసుకుంది. అయితే ఎవరూ ఉన్నా, లేకున్నా ఎప్పటిలాగే టీమ్‌లో జోష్‌ నింపేందుకు కోహ్లి ఉండటమే అది పెద్ద బలం. పదునైన బ్యాటింగ్‌... 2025 ఫైనల్లో ఆడిన తుది జట్టును ఈసారి మొదటి మ్యాచ్‌లో ఆడటం కోసం చూసుకుంటే ఎనిమిది మంది కచ్చితంగా జట్టులో ఉంటారు. ఆర్‌సీబీ విడుదల చేసిన లివింగ్‌స్టోన్‌కు బదులుగా ఈసారి అంతకంటే విధ్వంసకర బ్యాటర్‌ జాకబ్‌ బెతెల్‌కు తుది జట్టులో చోటు ఖాయం. గత ఏడాది అతను 2 మ్యాచ్‌ల్లో ఆడగా, అందులో ఒక అర్ధసెంచరీ ఉంది. ఇటీవలి టి20 వరల్డ్‌ కప్‌లో భారత్‌పై చెలరేగి బెతెల్‌ సాధించిన సెంచరీని చూస్తే ఆర్‌సీబీ బలం మరింత పెరిగినట్లే. మూడో స్థానంలో ఆడిన మయాంక్‌ అగర్వాల్‌ జట్టుకు దూరమయ్యాడు. ఈ స్థానం కోసం ఇద్దరు భారత బ్యాటర్లు పడిక్కల్, వెంకటేశ్‌ అయ్యర్‌ మధ్య పోటీ ఉంది. అయితే గతంలో ఇదే జట్టుతో ఆడిన అనుభవం, ఇటీవలి ఫామ్, లోకల్‌ ముద్ర కారణంగా పడిక్కల్‌కే ఎక్కువ చాన్స్‌ ఉంది. కోహ్లి, సాల్ట్‌లతో తిరుగులేని ఓపెనింగ్‌ జట్టు సొంతం. వీరిద్దరు ఇచ్చే ఆరంభాలే జట్టు విజయాలకు పునాది అవుతాయి. మిడిలార్డర్‌లో పాటీదార్, డేవిడ్, జితేశ్‌ శర్మలు ఇన్నింగ్స్‌ను ధాటిగా నడిపించగల సమర్థులు. ఈ బృందం విఫలమైనా ఆల్‌రౌండర్లు కృనాల్‌ పాండ్యా, షెఫర్డ్‌ బ్యాటింగ్‌తో ఆదుకోగలరు. గత సీజన్‌లో ఇది బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి మైదానంలో భారీ స్కోర్లు సాధిస్తే జట్టుకు తిరుగుండదు. భువీ, దయాళ్‌లపై భారం... బౌలింగ్‌కు సంబంధించి ఆర్‌సీబీని ఒకే ఒక సమస్య వెంటాడుతోంది. అదే స్టార్‌ పేసర్‌ హాజల్‌వుడ్‌ లేకపోవడం. గత సీజన్‌లో 22 వికెట్లతో జట్టుకు విజయం అందించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. హాజల్‌వుడ్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలీని స్థితిలో ప్రత్యామ్నాయంపై జట్టు దృష్టి పెట్టింది. ఇద్దరు భారత పేసర్లు భువనేశ్వర్, యశ్‌ దయాళ్‌ కీలకం కానుండగా, ఈసారి పేస్‌ విషయంలో వీరిపై అదనపు భారం ఉంది. హాజల్‌వుడ్‌కు బదులుగా డఫీ, తుషారాలలో ఒకరిని ఆడిస్తారా లేక భారత పేసర్‌ రసిఖ్‌ దార్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. స్పిన్‌లో మరోసారి సుయశ్‌ శర్మ ప్రధాన అస్త్రం కాగా, కృనాల్‌ పాండ్యా లెఫ్టార్మ్‌ స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయగలడు. షెఫర్డ్‌ కూడా బౌలింగ్‌లో జట్టు కోటా పూర్తి చేయగలడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ గణాంకాలు ఆడిన మ్యాచ్‌లు 271 గెలిచినవి 134 ఓడినవి 133 రద్దు 4 అత్యుత్తమ ప్రదర్శన: విజేత (2025), రన్నరప్‌ (2009, 2011, 2016)2026 జట్టు వివరాలు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), పడిక్కల్, కోహ్లి, సాల్ట్, జితేశ్, కాక్స్, కృనాల్, స్వప్నిల్, డేవిడ్, షెఫర్డ్, బెతెల్, వెంకటేశ్‌ అయ్యర్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్‌ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, హాజల్‌వుడ్, రసిఖ్‌ దార్, సుయాశ్, భువనేశ్వర్, నువాన్‌ తుషారా, అభినందన్‌ సింగ్, డఫీ, యశ్‌ దయాళ్‌.

Hockey World Cup Tournament Schedule Released2
ఆగస్టు 20న భారత్, పాక్‌ పోరు

న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల ప్రపంచకప్‌ ట్రోఫీ నిరీక్షణకు తెర దించాలంటే ఈసారి భారత పురుషుల హాకీ జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌ టోర్నీలో వేల్స్‌ జట్టుతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా టైటిల్‌ వేటను ఆరంభిస్తుంది. ఆగస్టు 16న నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్‌లో భారత్‌ తమ తొలి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. పూల్‌ ‘డి’లో ఉన్న భారత బృందం ఆ తర్వాత ఆగస్టు 18న ఇంగ్లండ్‌తో... ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ‘ఢీ’కొంటుంది. తదుపరి దశకు అర్హత సాధించాలంటే భారత్‌ పూల్‌ ‘డి’లోని తొలి రెండు స్థానాల్లో కచి్చతంగా ఉండాలి. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 16న చైనాతో తలపడుతుంది. పూల్‌ ‘డి’లో ఉన్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో ఆగస్టు 18న దక్షిణాఫ్రికాతో... చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో ఆడుతుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక నాలుగు పూల్స్‌ నుంచి రెండు జట్ల చొప్పున ఎనిమిది జట్లు రెండో రౌండ్‌కు చేరుకుంటాయి. రెండో రౌండ్‌లో ఎనిమిది జట్లను రెండు పూల్స్‌గా (ఒక్కో పూల్‌లో నాలుగు జట్లు) విభజిస్తారు. రెండో రౌండ్‌ ముగిశాక రెండు పూల్స్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత పురుషుల జట్టు 1975లో ఏకైకసారి ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గగా... భారత మహిళల జట్టు 1974లో అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది.

Thomas Cup and Uber Cup Draws Released3
పురుషుల జట్టుకు సులువు మహిళల జట్టుకు క్లిష్టం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్‌ కప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడం ఖాయం. గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్‌కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్‌ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటుంది. మరోవైపు ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్‌ ‘ఎ’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్‌ జట్లతో భారత్‌ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్‌ జట్లపై భారత్‌ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్‌ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి. భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టోర్నీ ఏప్రిల్‌ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్‌లోని హోర్సెన్స్‌ నగరంలో జరుగుతుంది. 2024 థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌ చేతిలో ఓడిపోయాయి.

Ruthvika Pair in the Pre Quarterfinals4
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రుత్విక జోడీ

ఓర్లియాన్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని జోడీ శుభారంభం చేసింది. ఫ్రాన్స్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ ద్వయం 21–15, 21–9తో త్సాయ్‌ ఫు చెంగ్‌–సుంగ్‌ యు సువాన్‌ (చైనీస్‌ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 12–21, 10–21తో మాగ్నస్‌ జొనాసెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన ఆయుశ్‌ శెట్టి 17–21, 21–10, 21–17తో సహచరుడు కిరణ్‌ జార్జ్‌పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్‌ 21–18, 21–14తో సుంగ్‌ షువో యున్‌ (చైనీస్‌ తైపీ)పై, ఇషారాణి బారువా 21–19, 21–19తో అమెలీ షుల్జ్‌ (డెన్మార్క్‌)పై, అన్‌మోల్‌ 21–12, 21–16తో నెష్లిహాన్‌ అరిన్‌ (టర్కీ)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్, దేవిక సిహాగ్, రక్షితశ్రీ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.

Rumours MS Dhoni Changing His Jersey Number From 7 To 85
ధోని జెర్సీ నంబర్‌ మారనుందా?

టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో తన జెర్సీ నంబర్‌ మార్చుకోనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని జెర్సీ నంబర్‌ ఎంత అని చిన్న పిల్లాడిని అడిగినా టక్కున ఏడు అని చెప్పేస్తాడు. అంతలా పాతుకుపోయింది ధోని జెర్సీ నంబర్‌. రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు ఆడిన ధోని ఏడు నెంబర్‌ జెర్సీతోనే బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్‌లోనూ సీఎస్‌కే తరఫున అదే జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగుతున్నాడు. అయితే తాజాగా ధోనినే స్వయంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా వేదికగా తాను ధరించబోయే ఎనిమిదో నెంబర్‌ జెర్సీని పంచుకున్నాడు. ‘కొన్ని నంబర్లు మనతో పాటే ఉండిపోతాయి. అందులో ఏడు అనేది ఒకటి. కానీ ఇవాళ నేను 8కి స్విచ్‌ అవుతున్నా. ఎందుకనేది మీకు త్వరలోనే తెలుస్తోంది’ అంటూ ధోని ఒక క్యాప్షన్‌ జత చేశాడు. ఇది చూసిన ధోని అభిమానులు మాత్రం ‘మా ధోని ఎప్పుడు ఏడో నంబర్‌ జెర్సీకే కట్టుబడి ఉండాలి. అది మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది’ అంటూ పేర్కొన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం అడ్వర్టైజ్‌మెంట్‌ కోసం ధోని చేసిన వీడియో అని తెలిపారు. నిజానికి ఎంఎస్‌ ధోనికి నంబర్ 7తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోనికి ఆ నంబర్‌ ఒక ఎమోషన్‌ కూడా. ధోని పుట్టిన తేదీ జూలై 7 (07/07). అందుకే కెరీర్ ఆరంభం నుంచి ధోని అదే నంబర్‌ను వాడుతున్నాడు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో నంబర్ 7 జెర్సీకి రిటైర్మెంట్‌ కూడా ప్రకటించి అతని జెర్సీని బీసీసీఐ మ్యూజియంలో ఉంచింది. ఇలాంటి తరుణంలో ధోని తనకు అచ్చొచ్చిన నంబర్‌ను ఐపీఎల్‌లో మార్చుకోవడం సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.చదవండి: ‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

PV Sindhu Opens Up On Importance Of Education For Athletes6
‘కెరీర్‌ ముగింపు మన చేతుల్లో ఉండదు’

క్రీడల్లో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, కేవలం ఒకే ఒక్క గాయంతో ఏకంగా కెరీర్‌నే ముగించాల్సి వస్తుందని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపింది. గురుగ్రామ్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధూ క్రీడలు, చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు కేవలం క్రీడలమీదే కాకుండా, చదువుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. ఒక్క గాయం కెరీర్‌నే ముగించే పరిస్థితికి తీసుకొస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేను కొన్నేళ్లుగా ఆడుతూనే ఉన్నా. అయితే, ఏదొక సమయంలో రిటైర్‌మెంట్‌ అవ్వాల్సిందే కదా.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. మనం 45 లేదా 50 ఏళ్లు వచ్చాక క్రీడలు ఆడటం కష్టం. కానీ, చదువు మాత్రం మన జీవితాంతం తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారు స్పూన్‌తో జన్మించలేరు. ఎందులోనైనా సరే కష్టపడాల్సిందే. అది చదువైనా.. క్రీడలైనా సరే అకుంఠిత దీక్షతో శ్రమించాలి. రెండింటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. నేను ఎంబీఏ పూర్తి చేశా. అయితే, ఓ వైపు క్రీడలో ఉంటూ చదువు కొనసాగించడం తేలికైన విషయం కాదని తెలుసు. ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లడం.. వచ్చాక చదువుకోవడం.. మళ్లీ సాయంత్రం సాధనకు వెళ్లడం కష్టమే. ఇక్కడే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. జీవితాంతం క్రీడల్లో కొనసాగలేం.. చదువు ఉంటే మాత్రం నిబ్బరంగా ఉండొచ్చు. క్రీడలు ముఖ్యమే కానీ, చదువును పూర్తిగా పక్కన పెట్టేసి ప్రయత్నించకూడదు. పైగా, క్రీడల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిరంతరం రిస్క్‌తో కూడుకున్నదే. ఆటలను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయొద్దు. ఆడేటప్పుడు ఒక్క పెద్ద గాయమైతే.. కోలుకుని రావడం కష్టం. ఒక్కోసారి కెరీర్‌ ముగిసే అవకాశమూ లేకపోలేదు. ప్రమాదాలు చెప్పి రావు కదా. నేను 2016 ఒలింపిక్స్‌కు ముందు తీవ్రంగా గాయపడ్డా. కొన్నిరోజులపాటు నొప్పితోనే ఆడా. వైద్యుల వద్దకు వెళ్తే వారు ఏం చెబుతారనే భయం వెంటాడేది. మళ్లీ జీవితంలో ఆడతానా? లేదా? అనే అనుమానాలు వచ్చాయి. వైద్య చికిత్స తీసుకున్నా.మళ్లీ కోలుకుని ఒలింపిక్స్‌ బరిలోకి దిగా' అని పీవీ సింధు చెప్పుకొచ్చింది.చదవండి: బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!

BCCI Likely Compensate Bumrah After Latest Decision To Pay 2 Crore7
బుమ్రాకు 2 కోట్ల నష్టపరిహారం!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు బీసీసీఐ రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ గత ఫిబ్రవరిలో 2025-26 సీజన్‌ కోసం ఆటగాళ్లకు వార్షిక ఫీజులకు సంబంధించి సెంట్రల్‌ కాంట్రాక్టు జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ‘ఏ ప్లస్‌’ గ్రేడ్‌ను బీసీసీఐ తొలగించింది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీలో రోహిత్‌, కోహ్లీ, బుమ్రా, జడేజా ఉండేవారు. వీరిలో కోహ్లీ, రోహిత్‌లు కేవలం వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతుండగా, జడేజా రెండు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. దీంతో ఈ ముగ్గురి ఫీజు చెల్లింపు విషయంలో బీసీసీఐకి పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ ఇప్పటివరకు ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉన్న బుమ్రాను ఏ గ్రేడ్‌కు మార్చింది. ఇదే ఏ గ్రేడ్‌లో బుమ్రాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, జడేజా కూడా ఉన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం గ్రేడ్-ఏ ఆటగాళ్లకు ఏటా రూ. 5 కోట్లు, గ్రేడ్-బి ఆటగాళ్లకు రూ.3 కోట్లు లభిస్తాయి. గ్రేడ్ సి ఆటగాళ్లు రూ. 1 కోటి అందుకుంటారు. ఇంతకముందు ఏ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక ఫీజు కింద రూ. 7 కోట్లు చెల్లించేవారు. దీంతో ఇప్పటివరకు ఏ ప్లస్‌లో కొనసాగిన బుమ్రా ప్రస్తుతం ఏ కేటగిరీ కింద రూ. 5 కోట్లు మాత్రమే అందుకోనున్నాడు. కానీ మూడు ఫార్మాట్లు (వన్డే, టెస్టు, టీ20లు) ఆడుతూ కూడా రూ.2 కోట్లను కోల్పోవాల్సి వస్తోంది. దీంతో బుమ్రా విషయంలో బీసీసీఐ పునరాలోచనలోన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు మిగిలిన రూ. 2 కోట్లను నష్టపరిహారంగా అందివ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. గతంలో ఏ ప్లస్‌ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా టాప్‌-10 ర్యాంకులో కొనసాగాలనే నిబంధన ఉండేది. తాజాగా ఏ ప్లస్‌ను రద్దు చేయడంతో ఆ నిబంధన కూడా తొలిగిపోయింది.చదవండి: ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan Will SRH Captain Until Cummins Recovers Injury IPL 20268
ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్‌ కిషన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ 2026 సీజన్‌లో ఆరంభం రోజునే డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే కమిన్స్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ వైస్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలవడంలో ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.అభిషేక్‌ సంగతి పక్కనబెడితే రిషబ్‌ పంత్‌,జితేశ్‌ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్‌ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్‌ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్‌ దూరమయ్యాడు. ఇక కమిన్స్‌ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కమిన్స్‌ సారథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్‌ నుంచి గేర్‌ మార్చిన ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌, లివింగ్‌స్టోన్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్‌ కమిన్స్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, ట్రావిస్‌ హెడ్‌, జీషన్‌ అన్సారీ, సలీల్‌ అరోరా, శివంగ్‌ కుమార్‌, లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్‌వర్డ్స్‌, అమిత్‌ కుమార్‌, క్రెయిన్స్‌ ఫెల్టూరా, సకిబ్‌ హుసేన్‌, ఒంకార్‌ తర్మలే, ప్రఫుల్‌ హింగే, శివమ్‌ మావి.𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨 Pat Cummins will miss a few games while recovering from injury.Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026

RCB Sale Enters Final Stage With Price Set Around 2 Billion USD9
రికార్డు స్థాయి బిడ్‌.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!

ఐపీఎల్లో 2025లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్‌ఫిషర్‌ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్‏కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ ‏పై, అమెరికా సంస్థ కోల్‌బెర్గ్‌ క్రావిస్‌ రాబర్ట్స్‌ అండ్‌ కో (కేకేఆర్‌), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్‏గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్‌సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్‌ ఖరీదైన ఆటగాడి అసహనం!

I Never Wanted To Be Selfless: Sanju Samson After T20 WC Heroics10
ఆ విషయంలో స్వార్థపరుడినే: సంజూ శాంసన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 హీరో, టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.దాగుడుమూతల మాదిరి..భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్‌.. శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్‌ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్‌ కోల్పోయాడు. దీంతో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) భర్తీ చేశాడు.నాకౌట్‌ దశలో వరుసగా హాఫ్‌ సెంచరీలుఅయితే, కీలక నాకౌట్‌ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్‌ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ డ్రెసింగ్‌ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.ఆ విషయంలో నేను స్వార్థపరుడినే‘‘మా కోచ్‌ , కెప్టెన్‌ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్‌ చెప్పుకొచ్చాడు.కాగా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్‌ రిటైర్‌ అవ్వాలని గంభీర్‌ కోరుకున్నా పర్లేదు’

Advertisement
Advertisement
 
Advertisement