Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Dhoni Becomes The Highest Taxpayer Across Jharkhand and Bihar1
రెండు రాష్ట్రాల టాపర్‌గా ఎంఎస్‌ ధోని

టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అయిన ఎంఎస్‌ ధోని, ఓ ఆర్దికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా రికార్డు నెలకొల్పాడు.ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిహార్-ఝార్ఖండ్ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹20,000 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేశాయి. ఇందులో ₹12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు మీడియాకు వెల్లడించారు.ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆధారంగా సుమారు ₹38 కోట్ల పన్ను చెల్లించినట్లు అంచనా వేస్తున్నారు.ధోని నికర సంపద మరియు ఆదాయాలు: 2026 మే నాటికి ధోని నికర సంపద సుమారు ₹1,060 కోట్లుగా అంచనా వేయబడింది. సంవత్సరానికి సుమారు ₹75 కోట్లు వివిధ వనరుల ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో కార్స్‌24, గరుడ ఏరోస్పేస్‌, ఖటాబుక్‌ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా, ఇన్వెస్టర్‌గా ఉన్నాడు.ఫుడ్ & బెవరేజెస్ రంగంలో సెవెన్‌ ఇంక్‌ బ్రివ్స్‌, హౌస్‌ ఆఫ్‌ బిర్యాని, షాకా హ్యారీ (ప్లాంట్ బేస్డ్ మీట్) వంటి బ్రాండ్లతో ముడిపడి ఉన్నాడు. క్రీడా యాజమాన్యంలో చెన్నైయిన్ ఎఫ్‌సి (ISL ఫుట్‌బాల్), మహి రేసింగ్ టీమ్ ఇండియా (సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్)కు కో-ఓనర్‌గా ఉన్నాడు.ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్‌ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..?(2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా)- విరాట్ కోహ్లీ : ₹66 కోట్లు - ఎంఎస్ ధోని : ₹38 కోట్లు - సచిన్ టెండూల్కర్ : ₹28 కోట్లు - సౌరవ్ గాంగూలీ : ₹23 కోట్లు - హార్దిక్ పాండ్యా : ₹13 కోట్లు

Punjab Kings Coach To Join Indian Team After IPL2
టీమిండియాతో జతకట్టనున్న పంజాబ్‌ కింగ్స్‌ కోచ్‌

టీమిండియాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ అందుతోంది. ఐపీఎల్‌ 2026 ముగిసిన వెంటనే పంజాబ్‌ కింగ్స్‌ స్నిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సాయిరాజ్‌ బహుతులే టీమిండియా కోఠరిలో అదే హోదాలో జాయిన్‌ కానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌ ఓ కథనంలో పేర్కొంది.బహుతులే.. ఈ విషయమై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్ గంభీర్‌తోనూ చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గంభీర్ హెడ్ కోచ్‌గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా, టెన్ డస్కట్ అసిస్టెంట్ కోచ్‌గా, మోర్నీ మార్కెల్ బౌలింగ్ కోచ్‌గా, దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ కోచ్ పదవి గతకొంత​కాలంగా ఖాళీగా ఉంది. ఈ ఖాళీని బహుతులేతో భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.53 ఏళ్ల బహుతులే దేశీయ క్రికెట్‌లో మంచి లెగ్ స్పిన్నర్‌గా పేరు సంపాదించాడు. 343 దేశీయ మ్యాచ్‌ల్లో 837 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడు 9 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 6176 పరుగులు సాధించాడు. దేశవాలీ క్రికెట్‌ను ముంబై, మహారాష్ట్ర, అస్సాం జట్ల తరఫున ఆడిన బహుతులే.. అంతర్జాతీయంగా 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు.కోచింగ్ అనుభవం:- 2021లో ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. - బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నాలుగు సంవత్సరాలు బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. - రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లతో పాటు కేరళ, బెంగాల్, గుజరాత్ జట్లకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశాడు.రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్‌లో బహుతులే స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా మంచి సేవలందిస్తున్నాడు. అతడి మార్గదర్శకత్వంలో పంజాబ్‌ స్పిన్‌ విభాగం (యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్) అద్భుతంగా రాణిస్తుంది. ఈ అనుభవం భారత జాతీయ జట్టు స్పిన్నర్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.

IPL 2026: when even 200 plus score is not enough explainer3
బాదుడే బాదుడు.. కార‌ణం ఇదేనా?

ఒకప్పుడు 180 పరుగులు చేస్తే చాలు మ్యాచ్‌ గెలిచేసినట్లే అనే నమ్మకం ఉండేది! ఇక 200 మార్క్‌ దాటితే ఛేదన అసాధ్యమనిపించేది!! కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఐపీఎల్‌ 19వ సీజన్‌లో అయితే 220 పరుగులు చేసిన జట్లకు కూడా... విజయంపై ధీమా ఉండటం లేదు.బ్యాటింగ్‌కు అనుకూలించే ఫ్లాట్‌ పిచ్‌లు... అంతర్జాతీయ మ్యాచ్‌లతో పోలిస్తే చిన్న బౌండరీలు... పవర్‌ప్లేలోనే బౌలర్ల భరతం పట్టే ఓపెనింగ్‌ జోడీలు.. మధ్య ఓవర్‌లలో పరుగుల వరద పారించే మిడిలార్డర్‌ బ్యాటర్లు... డెత్‌ ఓవర్స్‌లో బంతిని చీల్చిచెండాడే ఫినిషర్లు... అవసరమైతే అదరగొట్టే ‘ఇంపాక్ట్‌ ప్లేయర్లు’...వెరసి ఎన్ని పరుగులు చేస్తే మ్యాచ్‌ గెలవొచ్చు అనే సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా సీజన్‌లో 41 సార్లు రెండొందలకు పైగా పరుగులు నమోదు అయ్యాయంటే బాదుడు ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా పరాజయం పాలైన జట్లు చాలా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అయితే అరాచకానికి అర్థం మార్చింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ 264 పరుగులు రికార్డు స్కోరు చేస్తే... దాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించి వారెవ్వా అనిపించింది. ఈ సీజన్‌లో సాగుతున్న పరుగుల ఊచకోతను ఓసారి పరిశీలిస్తే... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 49 మ్యాచ్‌ల్లో 41 సార్లు రెండొందల పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. బౌలింగ్‌ చేస్తున్నది గల్లీ బౌలర్లా అన్నట్లు... బ్యాటింగ్‌ చేయడం ఇంత సులువా అనిపించేలా బ్యాటర్ల వీరవిహారం కొనసాగుతోంది. గతేడాది ఐపీఎల్‌లో 200పైగా లక్ష్యాన్ని 9 సార్లు ఛేదించగా... ఈ సీజన్‌లో ఇంకా లీగ్‌ మ్యాచ్‌లు ముగియకముందే ఈ సంఖ్య 12గా ఉంది. ఈ ఏడాది సాగుతున్న విధ్వంసకాండ చూస్తుంటే ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమే. ఒకప్పుడు భారీ స్కోరులా కనిపించిన 200 పరుగుల మార్క్‌ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు రెండొందల పైచిలుకు పరుగులు చేయడం పరిపాటిగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.తొలి 10 ఓవర్లే... టి20ల్లో చేజింగ్‌ చేసే జట్టుకు గెలుపు సులభం అనేది జగమెరిగిన సత్యం. చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతులపై స్పష్టమైన అవగాహన ఉండటంతో చేజింగ్‌ జట్లు దాన్ని బట్టి ముందుకు సాగుతుంటాయి. ఈ సీజన్‌లో 12 సార్లు రెండొందలకు పైగా లక్ష్యాలను ఛేదించగా... వాటిలో 10 సార్లు సగం ఓవర్లకు ముందే లక్ష్యంలోని సగం పరుగుల కన్నా ఎక్కువ సాధించాయి. అది కూడా రెండు కంటే తక్కువ వికెట్లు మాత్రమే కోల్పోయి. దీంతో చేజింగ్‌ జట్లకు మంచి శుభరంభాలు దక్కాయి. సాధించాల్సిన రన్‌రేట్‌ పదికి లోపు ఉన్న ప్రతి సందర్భంలో చేజింగ్‌ జట్లు సునాయాసంగా గెలుపొందుతున్నాయి. ‘ఇంపాక్ట్‌’ ప్లేయర్‌... సాధారణంగా క్రికెట్‌లో ఒక్కో జట్టు తరఫున 11 మంది మాత్రమే బరిలోకి దిగాల్సి ఉన్నా... ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనతో ఆ సంఖ్య 12కు మారింది. మైదానంలో 11 మందే ఉన్నా... ఒక అదనపు బ్యాటర్‌ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడే ఈ నిబంధన భారీ స్కోర్లకు కారణంగా నిలుస్తోంది. ‘బ్యాటింగ్‌ చేసేందుకు జట్టులో ఒక అదనపు ఆటగాడు ఉన్నాడు అని తెలిస్తే... టాపార్డర్‌ మరింత స్వేచ్ఛగా ఆడుతుంది’ అని కోహ్లి అన్నట్లు... ఈ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ భారీగా పరుగులు చేయకున్నా... అతడున్నాడనే నమ్మకంతో మిగిలినవాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ నిబంధన సరిగ్గా లేదని ఇప్పటికే పలువురు దిగ్గజాలు ఆరోపించినా... నిర్వాహకులు మాత్రం దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. చిన్న బౌండరీలు... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల మైదానాలతో పోల్చుకుంటే... మన దగ్గర బౌండరీలు చిన్నవి. అందులోనూ ఐపీఎల్‌లో అవి మరింతగా కుచించుకుపోతున్నాయి. హ్యాపీడేస్‌ సినిమాలో ‘టచ్‌ చేస్తే ఫోర్‌ రా’ అన్న తరహాలో బంతి బ్యాట్‌కు తాకిందే తడువు బౌండరీ వైపు పరుగులు తీస్తోంది. దీనికి వేగవంతమైన ఔట్‌ ఫీల్డ్‌ కూడా ఒక కారణమే. తాజా ఐపీఎల్‌లో కొన్ని సందర్భాల్లో 60 మీటర్ల కంటే తక్కువ దూరం వెళ్లిన బంతి సైతం సిక్స్‌గా మారిందంటే మన గ్రౌండ్‌లు బ్యాటర్లకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని వల్లే కొన్ని మ్యాచ్‌ల్లో ఫోర్‌ల కంటే ఎక్కువ సిక్స్‌లు నమోదవుతున్నాయి.‘పవర్‌’ ప్లే ఈ ఏడాది నమోదైన రికార్డు లక్ష్యఛేదనలను గమనిస్తే... ‘పవర్‌ ప్లే’ (1–6 ఓవర్లు)లో దంచికొట్టిన జట్టుదే పైచేయి అనేది స్పష్టమవుతోంది. ఫీల్డింగ్‌ నిబంధనలు భారీ షాట్‌లకు అనుకూలంగా ఉండే ఈ సమయంలో భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రతీ జట్టు ప్రయత్నిస్తోంది. పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాన్‌‡్ష ఆర్య తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాలనే కసితో బాదేస్తుంటే... సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌ ‘పవర్‌ ప్లే’లోనే మ్యాచ్‌ను డిసైడ్‌ చేస్తున్నారు. మిగిలిన జట్లు కూడా ఇలా పవర్‌ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ‘‘పవర్‌ ప్లే’లో 30 గజాల సర్కిల్‌ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండటంతో... ఈ దశలోనే భారీ షాట్‌లు ఆడాలని ఓపెనర్లు నిర్ణయించుకుంటున్నారు. బంతి కాస్త అనుకూలంగా ఉన్నా... దాన్ని గీత దాటించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఐపీఎల్‌–2025లో పవర్‌ ప్లేలో ఓవర్‌కు 10.48 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టగా... ఈ ఏడాది అది 11.78గా ఉంది. అంటే పవర్‌ప్లే 12 శాతం దూకుడు పెరిగినట్లు లెక్క. బ్యాటింగ్‌ పిచ్‌లు... టెస్టు క్రికెట్‌ మాదిరిగా అటు బ్యాటింగ్‌కు ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించే పిచ్‌ల సంఖ్య తగ్గిపోయింది. అభిమానులను అలరించాలనే ఉద్దేశమే తప్ప... ఆటలో బ్యాలెన్స్‌ పాటించాలనే సోయి లేకుండా పోతోంది. దీంతో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లే దర్శనమిస్తున్నాయి. బుమ్రా, కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం... పిచ్‌ నుంచి ఏమాత్రం సహకారం లభించక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారంటే అందుకు తారు రోడ్‌ల లాంటి ‘ఫ్లాట్‌ పిచ్‌’లు కూడా ఒక కారణమే. చ‌ద‌వండి: భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..!ఆ మ్యాచ్‌ పరాకాష్ట! తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అయితే దూకుడుకు అర్థం మార్చింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో అజేయంగా 152 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అతడికి నితీశ్‌ రాణా సహకారం తోడవడంతో ఢిల్లీ కొండంత స్కోరు చేసింది.తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం ఆనందంగా కనిపించిన రాహుల్‌... ఛేదన ప్రారంభమైన ఆరు ఓవర్లలోనే నీరసించిపోయాడు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే పరమావధి అన్నట్లు పంజాబ్‌ ఓపెనర్లు చెలరేగిపోతుంటే... కేఎల్‌ రాహుల్‌ నిచ్చేష్టుడిలా వికెట్ల వెనక నిలబడిపోయాడు. ప్రియాన్ష్‌ ఆర్య (priyansh arya) 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 43 పరుగులు చేస్తే... ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సక్స్‌లతో 76 పరుగులు చేశాడు. చివర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (shreyas iyer) 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 71 పరుగులు చేయడంతో పంజాబ్‌ జట్టు సునాయాసంగా మ్యాచ్‌ గెలిచేసేంది. ఈ మ్యాచ్‌ గణాంకాలు పరిశీలిస్తే... ఛేదనలో పంజాబ్‌ ‘పవర్‌ ప్లే’లోనే మ్యాచ్‌ను లాగేసుకుంది. తొలి ఆరు ఓవర్‌లలోనే 116 పరుగులు చేసి లక్ష్యంలోని 43.8 శాతం పరుగులను ఖాతాలో వేసుకుంది. దీంతో మిగిలిన పని మరింత సులువైంది. – సాక్షి క్రీడావిభాగం

Shreyas Iyer Gets Green Signal For India Captaincy After IPL4
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌..!

భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ శ్రేయస్‌ అయ్యర్‌కు మెసేజ్‌ కూడా పంపినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ నేతృత్వంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్‌ను గెలిచినప్పటికీ, అతని ఇటీవలి బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో బీసీసీఐ లాంగ్ టర్మ్ ప్లానింగ్‌తో (2028 టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని) కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది. వయసు మరియు జట్టులో యంగ్ కోర్‌ను బలోపేతం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.శ్రేయస్సే ఎందుకు..? ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ ఐపీఎల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలతోనూ సెలెక్టర్లను మెప్పించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో 333 రన్స్ సాధించి 47.57 సగటు, 164.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ప్రశాంతంగా జట్టును నడిపించే విధానం శ్రేయస్‌ కెప్టెన్సీ కేసును బలపరిచాయి.శ్రేయస్‌కు గతంలో భారత టెస్ట్ మరియు వన్‌డే జట్లకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అతని కామ్ అండ్ కూల్ అప్రోచ్, మెచ్యూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ భారత టీ20 జట్టుకు కావాల్సిన లక్షణాలుగా పరిగణించబడుతున్నాయి.పేలవ ఫామ్‌లో సూర్యప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (145.52) కూడా చాలా దారుణంగా ఉంది. ప్రస్తుత బ్యాటింగ్‌ ఫామ్‌ కారణంగా సూర్య టీమిండియా కెప్టెన్సీ స్థానం ప్రమాదంలో పడింది.కెప్టెన్సీ పోయినా జట్టులో ఉంటాడు..!సూర్య భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయినా, సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. వాటిలో ఫామ్‌ను నిరూపించుకుంటే, తప్పక త్వరలో జరుగబోయే ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ సిరీస్‌లకు ఎంపిక కావచ్చు.

Vaibhav Sooryavanshi's Retirement Date Stamped By England Legend5
వైభవ్‌ సూర్యవంశీ 21 ఏళ్లకే రిటైరవుతాడు..!

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ 15 ఏళ్ల వయసుకే దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌ లాంటి మెగా లీగ్‌లో వైభవ్‌ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ బుడ్డోడి బీభత్సం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. త్వరలో ఇతగాడిని టీమిండియాకు ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్‌ టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణం అంటూ వేనోళ్లు కొనియాడుతున్నాయి.తాజాగా ఇంగ్లండ్‌ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్‌ను పొగుడుతూనే, ఓ సరదా కామెంట్ చేశాడు. వైభవ్‌ ఇదే జోరును కొనసాగిస్తే 21 ఏళ్లకే బర్నౌట్ అవుతాడని అన్నాడు. ఆ వయసుకే కావాల్సినంత డబ్బు సంపాదించుకొని రిటైరవుతాడని చమత్కరించాడు. ‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్‌లో టఫ్నెల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.మైఖేల్ వాన్‌, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్‌ లాంటి ఇతర ఇంగ్లండ్‌ దిగ్గజాలతో కలిసి పాల్గొన్న ఈ షోలో టఫ్నెల్‌ వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతడి ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలను కొనియాడాడు.తరుచూ టీమిండియా క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కే మైఖేల్‌ వాన్‌ కూడా వైభవ్‌ను ఈ సందర్భంగా ప్రశంసించాడు. క్రిస్‌ గేల్‌ లాంటి విధ్వంసకర యోధుడు కెరీర్‌ మధ్యలో 30 బంతుల్లో సెంచరీ చేస్తే వైభవ్‌ కెరీర్‌ ప్రారంభంలో, అదీ 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతక్కొట్టాడని కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వైభవ్‌ ఇప్పటికే 37 సిక్సర్లు కొట్టి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడని అన్నాడు.మరో ఇంగ్లండ్‌ దిగ్గజం అలిస్టర్‌ కుక్‌ వైభవ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ సిక్స్‌ హిట్టర్‌ అని ఆకాశానికెత్తాడు. మొత్తంగా తొలిసారి ఇంగ్లండ్‌ దిగ్గజాలంతా వైభవ్‌ను ముక్తకంఠంతో కొనియాడారు.కాగా, 2011 మార్చి 27న జన్మించిన వైభవ్‌.. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్‌లో చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అతడి విధ్వంసం తారాస్థాయిలో కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్‌.. 40.40 సగటున, 237.65 స్ట్రయిక్‌రేట్‌తో ఓ సెంచరీ, రెండు అర్ద సెంచరీల సాయంతో 404 పరుగులు చేసి, తన జట్టు (రాజస్థాన్‌ రాయల్స్‌) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

BCCI warns IPL teams over honey trap risks, tighten hotel room access rules6
ఐపీఎల్‌లో హనీ ట్రాప్‌..?

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో 'హనీ ట్రాప్' ప్రమాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అప్రమత్తమైంది. ఆటగాళ్ల భద్రత, టోర్నీ సమగ్రత దృష్ట్యా అన్ని ఫ్రాంచైజీలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా సంతకంతో ఏడు పేజీల అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం.ఐపీఎల్‌ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి హోటళ్లలో ఉండటం, ప్రయాణాలు చేయడం పట్ల బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఉన్న వ్యక్తుల ద్వారా జట్టు వ్యూహాలు, అంతర్గత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఈ నేపథ్యంలో అన్ని జట్ల మేనేజ్‌మెంట్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లను కలిసే అతిథుల వివరాలు, హోటల్‌ కదలికలన్నిటినీ రికార్డు చేయాలని సూచించింది. అవసరమైతే అకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో షోకాజ్‌ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్‌ లేదా డిస్‌క్వాలిఫికేషన్‌ వంటి చర్యలు ఉండొచ్చని తెలిపింది. చట్టపరమైన ఉల్లంఘనలు ఉంటే పోలీసు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.కాగా, ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను అప్రమత్తం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులు, భాగస్వాముల ప్రయాణాలపై పరిమితులు విధించింది.ముఖ్యంగా 2024-25 బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఓటమి తర్వాత బోర్డు మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్‌ నిర్వహణలో ఆఫ్‌ఫీల్డ్‌ వ్యవహారాలపై కూడా బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టడం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదో జరుగుతుందని ఫ్యాన్స్‌ గుసగుసలాడుకుంటున్నారు.

Lucknow Super Giants to beat Royal Challengers Bengaluru by 9 runs7
బ్యాటింగ్‌లో మార్ష్‌ బౌలింగ్‌లో ప్రిన్స్‌

మ్యాచ్‌లో ఓడితే ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో మైదానంలోకి దిగిన లక్నో తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటింది. చక్కటి ఆటతో బెంగళూరును చిత్తు చేసింది. మార్ష్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు...ప్రిన్స్‌ పదునైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని కట్టడి చేయగలిగింది. పాటీదార్, డేవిడ్‌ దూకుడు డిఫెండింగ్‌ చాంపియన్‌ను గెలిపించడానికి సరిపోలేదు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఈ గెలుపు దక్కడం విశేషం. లక్నో: ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కాస్త ఊరట లభించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ సమష్టి ప్రదర్శన కనబర్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 9 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటకు పదే పదే అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్ (56 బంతుల్లో 111; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఐపీఎల్‌లో తన రెండో సెంచరీని నమోదు చేయగా...నికోలస్‌ పూరన్‌ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (10 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడిపోయింది. రజత్‌ పాటీదార్‌ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు. పంత్‌ జోరు... లక్నో ఓపెనర్‌ మార్ష్ దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగా, సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన అర్షిన్‌ కులకర్ణి (17) తడబడ్డాడు. ఏకపక్షంగా మార్ష్ బౌండరీల జోరు సాగింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్ష్...కృనాల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. ఆ తర్వాత సలామ్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో పాటు హాజల్‌వుడ్‌ ఓవర్లో కూడా మార్ష్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 68 పరుగులకు చేరగా, 20 బంతుల్లోనే మార్ష్ అర్ధసెంచరీ పూర్తయింది. అర్షిన్‌ వెనుదిరిగిన తర్వాత పూరన్‌ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మరో వైపు షెఫర్డ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదిన మార్ష్ 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను సెంచరీ అందుకునే సమయానికి జట్టు స్కోరు 139 పరుగులు అంటే మార్ష్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. మార్ష్, పూరన్‌ తక్కువ వ్యవధిలో అవుటైనా...పంత్‌ మెరుపులతో స్కోరు 200 దాటింది. హాజల్‌వుడ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను...సలామ్‌ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 4, 6తో ముగించాడు. కోహ్లి డకౌట్‌... ఛేదనలో ఆర్‌సీబీకి సరైన ఆరంభం లభించలేదు. బెతెల్‌ (4) వైఫల్యం కొనసాగగా...ప్రిన్స్‌ వేసిన అద్భుత బంతికి విరాట్‌ కోహ్లి (0) డకౌటయ్యాడు. 2023 సీజన్‌ తర్వాత కోహ్లి డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఈ దశలో పాటీదార్‌ సిక్సర్లతో చెలరేగిపోగా, పడిక్కల్‌ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 53 బంతుల్లోనే 95 పరుగులు జోడించడంతో బెంగళూరుకు విజయావకాశాలు కనిపించాయి. అయితే ఎనిమిది పరుగుల తేడాతో వీరిద్దరితో పాటు జితేశ్‌ (1) కూడా అవుట్‌ కావడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో డేవిడ్‌ దూకుడైన ఆటతో టీమ్‌లో ఆశలు రేగాయి. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్‌ను షహబాజ్‌ అవుట్‌ చేయడంతో ఆర్‌సీబీకి గెలుపు కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) బెతెల్‌ (బి) హాజల్‌వుడ్‌ 111; అర్షిన్‌ (సి) పాటీదార్‌ (బి) కృనాల్‌ 17; పూరన్‌ (సి) కృనాల్‌ (బి) సలామ్‌ 38; పంత్‌ (నాటౌట్‌) 32; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–95, 2–165, 3–194. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–34–0, హాజల్‌వుడ్‌ 4–0–49–1, కృనాల్‌ 4–0–31–1, సలామ్‌ 4–0–53–1, సుయాశ్‌ 2–0–21–0, షెఫర్డ్‌ 1–0–16–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: బెతెల్‌ (సి) ప్రిన్స్‌ (బి) షమీ 4; కోహ్లి (బి) ప్రిన్స్‌ 0; పడిక్కల్‌ (సి) అండ్‌ (బి) ప్రిన్స్‌ 34; పాటీదార్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షహబాజ్‌ 61; జితేశ్‌ (సి) పంత్‌ (బి) ప్రిన్స్‌ 1; డేవిడ్‌ (సి) రాఠీ (బి) షహబాజ్‌ 40; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 28; షెఫర్డ్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–104, 4–106, 5–112, 6–167. బౌలింగ్‌: షమీ 4–0–33–1, ప్రిన్స్‌ 4–0–33–3, మయాంక్‌ 4–0– 50–0, రాఠీ 4–0–50–0, షహబాజ్‌ 3–0–33–2.

IPL 2026: Lucknow Super Giats Beat Royal Challengers Bangalore By 9 Runs8
ఆర్సీబీ ఓట‌మి.. వ‌రుస ఓట‌ముల‌కు ల‌క్నో చెక్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వ‌రుస ఓట‌ముల‌కు పుల్‌స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వ‌ర్షం అంత‌రాయంతో మ్యాచ్‌ను 19 ఓవ‌ర్ల‌కు కుదించారు. 213 ప‌రుగుల రివైజ్డ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు న‌ష్టాపోయి 203 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ ప‌టీదార్ (61) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, ప‌డిక్క‌ల్ (34) ప‌ర్వాదలేద‌నిపించాడు. ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్‌) ప‌ర్వాలేద‌నిపించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ మూడు వికెట్ల‌తో మెర‌వ‌గా, ష‌మీ, షాబాజ్ అహ్మ‌ద్‌లు చెరొక వికెట్ తీశారు.అంత‌క‌ముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ నిర్ణీత 19 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. పూర‌న్ (29) రాణించాడు. ఆఖ‌ర్లో కెప్టెన్‌ రిష‌బ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధ‌నాద‌న్ ఇన్నింగ్స్‌తో అల‌రించాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హాజిల్‌వుడ్‌, ర‌సిక్ స‌లామ్‌, కృనాల్ పాండ్యా త‌లా ఒక వికెట్ తీశారు. కాగా ల‌క్నో ఆరు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత గెలుపును అందుకోవ‌డం విశేషం.

Suryakumar Yadav and wife Devisha Shetty welcome baby girl9
కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌.. తండ్రిగా ‍ప్రమోషన్‌!

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సూర్యకుమార్‌ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్‌ తెలిపారు. ‘ కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

Mitchell Marsh 1st Cricketer Hits-Fastest Century-For-LSG In IPL History10
తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. త‌ద్వారా ల‌క్నో త‌ర‌ఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ బాదిన తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. రొమారియో షెప‌ర్డ్ వేసిన యార్క‌ర్ బంతిని బౌండ‌రీ త‌ర‌లించ‌డం ద్వారా ఐపీఎల్‌లో రెండో సెంచ‌రీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచ‌రీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. అయితే గ‌తంలో ల‌క్నో త‌ర‌ఫున అత్యంత వేగ‌వంత‌మైన సెంచ‌రీ రిష‌బ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శ‌త‌కం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచ‌రీతో ఆ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఓవ‌రాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచ‌రీ. తొలి సెంచ‌రీ కూడా ల‌క్నో త‌ర‌ఫునే సాధించాడు. గ‌తేడాది సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 ప‌రుగులు సాధించాడు. ఇక ల‌క్నో త‌ర‌ఫున రెండు సెంచ‌రీలు సాధించిన రెండో ఆట‌గాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్‌, స్టోయినిస్‌, పంత్‌లు త‌లా ఒక సెంచ‌రీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement