Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: CSK Captain Ruturaj Blames Himself After Match Lost To RCB1
ఆర్సీబీతో మ్యాచ్‌.. ఓట‌మికి పూర్తి బాధ్యత నాదే!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఓట‌ముల ప‌రంప‌ర కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఆదివారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో పరాజ‌యం పాలైన సీఎస్‌కే హ్యాట్రిక్ ఓట‌ముల‌ను మూట‌గ‌ట్టుకుంది. అంతేకాదు ప‌ర‌మ చెత్త ఆట‌తీరుతో (-2.157) దారుణ‌మైన నెట్ ర‌న్‌రేట్‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్ ఓట‌మిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. మ్యాచ్ ఓట‌మికి తానే మొత్తం బాధ్య‌త తీసుకుంటాన‌ని రుతురాజ్ పేర్కొన్నాడు. బ్యాట‌ర్‌గా, కెప్టెన్‌గా విఫ‌ల‌మ‌య్యాన‌ని, అందుకే ఓట‌మికి పూర్తి బాధ్య‌త తానే తీసుకుంటాన‌ని చెప్పుకొచ్చాడు. రుతురాజ్ మాట్లాడుతూ.. ‘బిగ్ టార్గెట్ మన కళ్లముందు ఉన్నప్పుడు బాధ్యతగా ఆడాల్సిన అవసరముంది. టాపార్డర్‌లో నేను ఎక్కువ పరుగులు చేయాల్సింది. మా బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్‌, ప్రశాంత్ వీర్‌, జేమీ ఓవర్టన్‌తో పాటు శివమ్ దూబే తమ పోరాటం చేశారు. కానీ నేను బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే ఓటమిని నన్ను నేను బాధ్యుడిగా చేసుకుంటున్నా. అన్షుల్ కాంబోజ్ దాదాపుగా అత‌డి వికెట్ తీశాడు. మేం ఆనందంలో ఉన్నాం. అయితే.. ఆ బాల్ నోబాల్ కావ‌డం మా దుర‌దృష్ట‌క‌రం. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న డేవిడ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. మైదానం న‌లువైపులా బంతిని బాదాడు. అత‌డు బ్యాటింగ్ చేసిన విధానానికి ఖ‌చ్చితంగా హ్యాట్సాఫ్. గతంలో భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలున్నాయి. హ్యాట్రిక్ ఓటములు బాధ కలిగిస్తున్నప్పటికీ తర్వాతి మ్యాచ్‌ల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటాం’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 3 బంతుల్లో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రుతురాజ్ అప్పటి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలమవుతూనే వస్తున్నాడు. కెప్టెన్సీ అనే బాధ్యత రుతురాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నట్లుగా అనిపిస్తోంది. మ్యాచ్‌ విషయానికొస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్‌ పటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

Bhuvneshwar Scripts IPL History Reached 200 Wickets Milestone Vs CSK2
భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలిసారి

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్‌లోనూ ప‌దును పెంచుకుంటున్న భువ‌నేశ్వ‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఘ‌న‌త సాధించిన తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గానూ భువ‌నేశ్వ‌ర్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్‌కేతో మ్యాచ్ సంద‌ర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీమిండియా త‌ర‌ఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన‌ రెండో బౌల‌ర్‌గా నిలిచిన భువ‌నేశ్వ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల జాబితాలో మాత్రం అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్న తొలి ఆట‌గాడిగా స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ నిలిచాడు. చాహ‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు 176 మ్యాచ్‌ల్లో 224 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజాగా భువ‌నేశ్వ‌ర్ 192 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. భువ‌నేశ్వ‌ర్ త‌ర్వాత కేకేఆర్ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ 191 మ్యాచ్‌ల్లో 193 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మ‌రో అరుదైన రికార్డును కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఫాస్ట్ బౌల‌ర్ల‌కు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్‌ను అధిగ‌మించిన తొలి బౌల‌ర్‌గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడ‌స్ట‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం ల‌సిత్ మ‌లింగ‌లు కూడా భువ‌నేశ్వ‌ర్ కంటే వెనుక‌బ‌డి ఉన్నారు. ఇక మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 4 ఓవ‌ర్లు వేసి 41 ప‌రుగులిచ్చి 3 కీల‌క వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ ఖాతాలో మ‌రో రికార్డు..రికార్డులు పెట్ట‌డానికే కోహ్లీ పుట్టిన‌ట్లున్నాడు. తాజ‌గా సీఎస్‌కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మ‌రో టీమిండియా సీనియ‌ర్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో 28 ప‌రుగులు చేయ‌డం ద్వారా కోహ్లీ ఆ జ‌ట్టుపై 1,174 ప‌రుగులు సాధించాడు. త‌ద్వారా ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇంత‌క‌ముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శ‌ర్మ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై 1,161 ప‌రుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్‌ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!

ksca-officially-unveils-rahul-dravid-anil-kumble-stands-at-m-chinnaswamy-stadium3
ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం!

భారత క్రికెట్‌ దిగ్గజాలు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లేలను కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) సముచిత స్థాయిలో గౌరవించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని రెండు ఎండ్‌లకు ఈ ఇద్దరి పేర్లు పెట్టింది. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ద్రవిడ్, కుంబ్లే ఎండ్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేఎస్‌సీఏ ప్రతినిధులతో పాటు... ద్రవిడ్, కుంబ్లే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ... ‘ఈ స్టేడియం నాకు రెండో ఇల్లు లాంటిది. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే అంతా ఈ మైదానం వల్లే. కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు’ అని అన్నాడు. సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు సేవలందించిన ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 24, 177 పరుగులు చేయగా... కుంబ్లే ఓవరాల్‌గా 956 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్‌ విషయానికొస్తే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. రజత్‌ పటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, పడిక్కల్‌లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.చదవండి: సీఎస్‌కే అంటే కోహ్లీకి పూన‌క‌మే!

Bangalore beat Chennai Super Kings by 43 runs4
బెంగళూరు వీరంగం

బెంగళూరు: టాపార్డర్‌ దుమ్మురేపడంతో... ఐపీఎల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా రెండో విజయం సాధించింది. ఐదుసార్లు విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 43 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (25 బంతుల్లో 70 నాటౌట్‌; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు), కెప్టెన్ రజత్‌ పాటీదార్‌ (19 బంతుల్లో 48 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... దేవదత్‌ పడిక్కల్‌ (29 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫిల్‌ సాల్ట్‌ (30 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కొండంత లక్ష్యఛేదనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నై చివరకు 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటై ఈ సీజన్‌లో వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 50; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సత్తా చాటగా... కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ (7), సంజూ సామ్సన్‌ (9), ఆయుశ్‌ మాత్రే (1), కార్తీక్‌ శర్మ (6), శివమ్‌ దూబే (18) విఫలమయ్యారు. ప్రశాంత్‌ వీర్‌ (29 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్‌), జేమీ ఓవర్టన్‌ (16 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లలో 91/1 ఇన్నింగ్స్‌ ఆరంభంలో బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో బెంగళూరు నెమ్మదిగా ఆడింది. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి (18 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసిన బెంగళూరు... సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 91/1తో నిలిచింది. కాసేపటికే సాల్ట్‌ కూడా అవుట్‌ కాగా... ఆ తర్వాత ఆర్‌సీబీ విధ్వంసం మొదలైంది. చివరి 5 ఓవర్లలో 97 పరుగులు నూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో పాటీదార్, పడిక్కల్‌ చెరో సిక్స్‌తో 16 పరుగులు రాబట్టగా... దూబే వేసిన తదుపరి ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌ అవుట్‌ కాగా... టిమ్‌ డేవిడ్‌ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఒకవైపు పాటీదార్‌ సిక్స్‌ల వర్షం కురిపిస్తుంటే... మరోవైపు డేవిడ్‌ బౌలర్లపై యుద్ధం ప్రకటించాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన 17వ ఓవర్‌లో ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లు బాదిన అతడు... తదుపరి ఓవర్‌లో 4, 6 కొట్టాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా... అన్షుల్‌ వేసిన ఆ బంతి నోబాల్‌ కావడంతో బతికిపోయాడు. ఓవర్టన్‌ వేసిన 19వ ఓవర్‌లో డేవిడ్‌ వరుసగా 6, 2, 4, 6, 6, 6 కొట్టడంతో స్టేడియం మోత మోగిపోయింది. డేవిడ్‌ 21 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్‌ చేరాడు. చివరి ఓవర్‌లో మరో 6, 4తో బెంగళూరు ఈ సీజన్‌లో తొలిసారి 250 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. పాటీదార్, పడిక్కల్‌ మూడో వికెట్‌కు 21 బంతుల్లో 58 పరుగులు జోడించగా... పాటీదార్, డేవిడ్‌ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 99 పరుగులు జతచేశారు. బెంగళూరు చివరి 5 ఓవర్లలో 97 పరుగులు రాబట్టడం విశేషం. 202 ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ తీసిన వికెట్లు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చాహల్‌ (224) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భువీ రెండో స్థానంలో ఉన్నాడు.స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) నూర్‌ (బి) దూబే 46; కోహ్లి (సి) దూబే (బి) అన్షుల్‌ 28; పడిక్కల్‌ (బి) ఓవర్టన్‌ 50; పాటీదార్‌ (నాటౌట్‌) 48; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 250. వికెట్ల పతనం: 1–37, 2–93, 3–151. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–37–0; హెన్రీ 3–0–36–0; అన్షుల్‌ 4–0–52–1; నూర్‌ 4–0–49–0; ఓవర్టన్‌ 3–0–42–1; శివమ్‌ దూబే 2–0–30–1. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 9; రుతురాజ్‌ (సి) పడిక్కల్‌ (బి) డఫీ 7; ఆయుశ్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 1; సర్ఫరాజ్‌ (స్టంప్డ్‌) జితేశ్‌ (బి) కృనాల్‌ 50; కార్తీక్‌ (సి) అభినందన్‌ (బి) కృనాల్‌ 6; శివమ్‌ దూబే (సి) జితేశ్‌ (బి) అభినందన్‌ 18; ప్రశాంత్‌ (సి) పాటీదార్‌ (బి) భువనేశ్వర్‌ 43; ఓవర్టన్‌ (సి) (సబ్‌) బెథెల్‌ (బి) సుయాశ్‌ 37; అన్షుల్‌ (నాటౌట్‌) 19; నూర్‌ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్‌ 8; హెన్రీ (సి) సాల్ట్‌ (బి) అభినందన్‌ 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 207. వికెట్ల పతనం: 1–9, 2–10, 3–30, 4–77, 5–84, 6–108, 7–165, 8–178, 9–190, 10–207. బౌలింగ్‌: డఫీ 4–0–58–2; భువనేశ్వర్‌ 4–0–41–3; అభినందన్‌ 3.4–0–30–2; కృనాల్‌ 3–0–36–2; సుయాశ్‌ 4–0–21–1; షెఫర్డ్‌ 1–0–19–0; ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X పంజాబ్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Lucknow defeated Sunrisers Hyderabad by 5 wickets5
సన్‌ రైజ్‌ కాలేదు

సొంత మైదానంలో తొలి పోరు... మధ్యాహ్నం మ్యాచ్‌... బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌... టాస్‌ ఓడినా ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కింది. అయినా సరే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 156 పరుగులకే పరిమితమైంది. 26 పరుగులకే 4 వికెట్లు పడినా... నితీశ్‌ రెడ్డి, క్లాసెన్‌ మెరుపులతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా తడబడినా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ముందుండి జట్టును గెలుపు తీరం చేర్చాడు. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను దూకుడుగా వెళ్లకుండా పరిస్థితికి తగినట్లుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ గెలుపు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కిది రెండో పరాజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33 బంతుల్లో 56; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 63 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో ఐదో వికెట్‌కు సన్‌రైజర్స్‌ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అనంతరం లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (50 బంతుల్లో 68 నాటౌట్‌; 9 ఫోర్లు), మార్క్‌రమ్‌ (27 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు కళ్లెం వేసిన లక్నో పేసర్‌ షమీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. సన్‌రైజర్స్‌ తదుపరి పోరులో ఈనెల 11న న్యూచంఢీగడ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతుంది. మెరుపు భాగస్వామ్యం... వరుసగా వికెట్లు కోల్పోవడంతో కాస్త జాగ్రత్త పడుతూ క్లాసెన్, నితీశ్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడారు. తొలి 13 బంతుల్లో క్లాసెన్‌ 8 పరుగులే చేయగా, నితీశ్‌ 13 బంతుల్లో 4 పరుగులే చేశాడు. అయితే ప్రిన్స్‌ వేసిన 11వ ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్‌ కొట్టడంతో జోరు మొదలైంది. 19 పరుగుల వద్ద ముకుల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన క్లాసెన్‌ ఆ తర్వాత అవేశ్‌ ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో ముందుగా క్లాసెన్‌ 33 బంతుల్లో, నితీశ్‌ 30 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే మరింత వేగంగా ఆడే క్రమంలో 2 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరగ్గా... మరో 12 పరుగులు జోడించి రైజర్స్‌ తర్వాతి 3 వికెట్లు కోల్పోయింది. ఆఖరి 4 ఓవర్లలో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 33 పరుగులే చేయగలిగింది. రాణించిన మార్క్‌రమ్‌... ఓపెనర్‌గా చేసిన ప్రయత్నాన్ని లక్నో సారథి పంత్‌ ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేశాడు. దాంతో మిచెల్‌ మార్ష్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు), మార్క్‌రమ్‌ లక్నో ఛేజింగ్‌ను ప్రారంభించారు. మార్ష్ తొందరగానే అవుటైనా, మార్క్‌రమ్‌ ధాటిని ప్రదర్శించాడు. ఉనాద్కట్‌ ఓవర్లో అతను 2 ఫోర్లు, 1 సిక్స్‌ కొట్టడంతో లక్నో పవర్‌ప్లేలో స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు పంత్‌ మాత్రం దూకుడుకు పోకుండా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మూడు పరుగుల వ్యవధిలో బదోని (9 బంతుల్లో 12; 1 ఫోర్‌), నికోలస్‌ పూరన్‌ (1)లను అవుట్‌ చేయడంతో పాటు పరుగుల వేగాన్ని అడ్డుకొని రైజర్స్‌ పైచేయి సాధించే ప్రయత్నం చేసింది. ఈ దశలో పంత్‌కు అబ్దుల్‌ సమద్‌ (12 బంతుల్లో 16; 2 ఫోర్లు) కొద్దిసేపు అండగా నిలిచాడు. 43 బంతుల్లో పంత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. చివర్లో ఉత్కంఠ... లక్నో విజయానికి చివరి 18 బంతుల్లో 19 పరుగులు కావాలి. దూబే 6 పరుగులే ఇచ్చి సమద్‌ను అవుట్‌ చేయగా, 19వ ఓవర్లో హర్షల్‌ 4 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. ఉనాద్కట్‌ వేసిన తొలి రెండు బంతులను ఫోర్‌లుగా మలచిన పంత్‌ తర్వాతి రెండు బంతుల్లో పరుగు తీయలేకపోయాడు. అయితే ఐదో బంతిని మళ్లీ బౌండరీకి తరలించి విజయాన్ని ఖాయం చేశాడు.షమీ సూపర్‌... సీనియర్‌ పేసర్‌ షమీ ఈ మ్యాచ్‌లోనూ తన స్థాయిని ప్రదర్శించాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి అభిషేక్‌ శర్మ (0)ను వెనక్కి పంపించిన అతను, తన రెండో ఓవర్‌ తొలి బంతికే ట్రవిస్‌ హెడ్‌ (8 బంతుల్లో 7; 1 ఫోర్‌)ను అవుట్‌ చేశాడు. ఇద్దరు విధ్వంసక ఆటగాళ్ల పని పట్టిన షమీ నాలుగు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండానే తన స్పెల్‌ను 4–0–9–2తో ముగించాడు. మరోవైపు కెప్టెన్ ఇషాన్‌ కిషన్‌ (4 బంతుల్లో 1), లివింగ్‌స్టోన్‌ (20 బంతుల్లో 14; 1 సిక్స్‌) కూడా వెనుదిరగడంతో స్కోరు 26/4 వద్ద నిలిచింది. పవర్‌ప్లేలో 22 పరుగులే చేసిన రైజర్స్‌ 10 ఓవర్లు ముగిసేసరికి 35 పరుగులకే పరిమితమైంది. ఆ మూడు సిక్స్‌లు...లక్నో స్పిన్నర్‌ దిగ్వేశ్‌ ‘నోట్‌బుక్‌’ రాఠీపై నితీశ్‌ రెడ్డి విరుచుకు పడ్డాడు. రాఠీ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో నితీశ్‌ మూడు సిక్స్‌లు బాదాడు. అప్పటికే జోరు మొదలు పెట్టిన నితీశ్‌ దూసుకుపోయాడు. లాంగాన్, లాంగాఫ్‌ దిశగా వరుసగా రెండు సిక్స్‌లు బాదిన అతను మరో మూడు బంతులకు లాంగాన్‌ వైపే అలవోకగా మరో సిక్స్‌ను మలిచాడు. ఈ షాట్లతో ఉప్పల్‌ స్టేడియం హోరెత్తిపోయింది. ఈ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. నిరంతరం శ్రమిస్తేనే...క్రికెట్‌లో కొనసాగాలంటే... ఆటతో సంబంధం కలిగి ఉండాల్సిందే. శారీరకంగా ఫిట్‌గా ఉన్నప్పుడే నైపుణ్యాలను మెరుగు పరుచుకోగలం. అందుకే నేను దేశవాళీల్లో అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్నా. నిరంతరం శ్రమిస్తూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అభిషేక్, హెడ్‌ వంటి వాళ్లకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్‌ను లాగేసుకుంటారు. అందుకే ఆ రెండు వికెట్లు ఎంతో కీలకం. టీమిండియా తరఫున ఆడుతున్న సమయం నుంచే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో చక్కటి అనుబంధం ఉంది. అదే ఇప్పుడూ కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచ్‌ కీలకమైంది. నైపుణ్యం లేకుండా ఏదీ సాధ్యం కాదు. గతంలో ఇక్కడ స్లో బంతులతో ఫలితం సాధించిన అనుభవాన్ని ఇప్పుడు ఉపయోగించా. కొత్త బంతితో బౌలింగ్‌ చేయడాన్ని ఆస్వాదిస్తా. –షమీ, ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌18 సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ వేసిన డాట్‌ బాల్స్‌. షమీ 24 బంతుల్లో కేవలం ఆరు బంతులకే సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు తొమ్మిది పరుగులు సాధించారు. షమీ ప్రదర్శనకుగాను అతనికి ‘డాట్‌ బాల్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు చాముండేశ్వరీనాథ్‌ చేతుల మీదుగా షమీ ఈ పురస్కారం అందుకున్నాడు. 5 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌పై లక్నోకిది ఐదో విజయం. ఈ ఐదింటిలో నాలుగు ఛేజింగ్‌లోనే వచ్చాయి. ఈ నాలుగింటిలో మూడింట లక్నో ఐదు వికెట్ల తేడాతో నెగ్గడం విశేషం. ఒక మ్యాచ్‌లో ఏడు వికెట్లతో గెలవగా, మరో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం అందుకుంది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) షమీ 7; అభిõÙక్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) షమీ 0; ఇషాన్‌ కిషన్‌ (బి) ప్రిన్స్‌ 1; లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) రాఠీ 14; క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 62; నితీశ్‌ రెడ్డి (సి) ప్రిన్స్‌ (బి) సిద్ధార్థ్‌ 56; అనికేత్‌ (నాటౌట్‌) 2; దూబే (బి) అవేశ్‌ 0; శివాంగ్‌ (బి) ప్రిన్స్‌ 5; హర్షల్‌ (రనౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–11, 4–26, 5–142, 6–144, 7–144, 8–151, 9–156. బౌలింగ్‌: షమీ 4–0–9–2, దిగ్వేశ్‌ రాఠీ 4–0–46–1, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–34–2, సిద్ధార్థ్‌ 4–0–29–1, అవేశ్‌ 4–0–36–2. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) శివాంగ్‌ 45; మిచెల్‌ మార్ష్ (సి) నితీశ్‌ (బి) మలింగ 14; పంత్‌ (నాటౌట్‌) 68; బదోని (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) దూబే 12; పూరన్‌ (రనౌట్‌) 1; సమద్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) దూబే 16; ముకుల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19.5 ఓవర్లలో 5 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–37, 2–77, 3–102, 4–105, 5–139. బౌలింగ్‌: హర్ష్ దూబే 4–0–18–2, నితీశ్‌ రెడ్డి 1–0–14–0, ఉనాద్కట్‌ 3.5–0–50–0, ఇషాన్‌ మలింగ 4–0–30–1, హర్షల్‌ 3–0–16–0, శివాంగ్‌ 4–0–30–1.

India secures five more medals at Asian Senior Boxing Championships6
భారత్‌కు ఐదు పతకాలు ఖాయం

ఉలాన్‌బాటర్‌ (మంగోలియా): ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో ఐదు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్స్‌ జైస్మీన్‌ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు)... పురుషుల విభాగంలో లోకేశ్‌ (85 కేజీలు), ఆకాశ్‌ (75 కేజీలు), హర్ష్చౌధరీ (90 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖరారు చేసుకున్నారు. జియి చెన్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జైస్మీన్‌ 5–0తో... యుకా సదమత్సు (జపాన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మీనాక్షి 5–0తో ఏకపక్ష విజయాలు అందుకున్నారు. లోకేశ్‌ 5–0తో గిచాయి కిమ్‌ (దక్షిణ కొరియా)పై, ఆకాశ్‌ 5–0తో యాలాస్‌ బగ్తియరోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)పై, హర్ష్5–0తో తినిస్తాన్‌ అలీబయెవ్‌ (కిర్గిస్తాన్‌)పై గెలుపొందారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మహిళల విభాగంలో బరిలోకి దిగిన 10 మంది భారత బాక్సర్లు సెమీఫైనల్‌ చేరుకోగా... పురుషుల విభాగంలో ఆరుగురు ఈ ఘనత సాధించారు.

Another draw in Srinidhi Deccan FCs account7
శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ఖాతాలో మరో ‘డ్రా’

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఐఎఫ్‌ఎల్‌)లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో మూడో ‘డ్రా’ చేరింది. ఐజ్వాల్‌ ఎఫ్‌సీ జట్టుతో సొంతగడ్డపై ఆదివారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్‌ జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. 29వ నిమిషంలో కెపె్టన్‌ డేవిడ్‌ కాస్టనెడా మునోజ్‌ చేసిన గోల్‌తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 87వ నిమిషంలో శ్రీనిధి జట్టు డిఫెండర్‌ జగ్‌దీప్‌ సింగ్‌ సెల్ఫ్‌ గోల్‌ చేయడంతో ఐజ్వాల్‌ జట్టు స్కోరును సమం చేసింది. మొత్తం పది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్‌లో ఓడి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 12న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రాజస్తాన్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి డెక్కన్‌ జట్టు పోటీపడుతుంది.

Vaishali wins second win in the womens category of the Candidates Chess Tournament8
వైశాలికి రెండో గెలుపు

పెయియా (సైప్రస్‌): క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. టాన్‌ జోంగి (చైనా)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో వైశాలి 51 ఎత్తుల్లో గెలుపొందింది. ఏడో రౌండ్‌ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనా ముజిచుక్‌ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు, భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద ఖాతాలో ఐదో ‘డ్రా’ చేరింది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌ను ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Tim David heroics help Bengaluru thrash Chennai by 43 runs9
సీఎస్‌కేపై ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా రెండో విజ‌యం నమోదు చేసింది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 250 ప‌రుగులు చేసింది.బెంగళూరు బ్యాట‌ర్ల‌లో టిమ్ డేవిడ్‌(25 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 70) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్‌(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), పాటిదార్‌(19 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో 48) విధ్వంసం. సీఎస్‌కే బౌలర్లలో ఓవర్టన్‌, కాంబోజ్‌, శివమ్‌ దూబే తలా వికెట్‌ సాధించారు.సంజూ మ‌ళ్లీ ఫెయిల్‌..251 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెన‌ర్లు సంజూ శాంసన్‌(9), రుతురాజ్‌ గైక్వాడ్‌(7) మరోసారి విఫలమయ్యారు. అయితే సర్ఫరాజ్‌ ఖాన్‌(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50), ప్రశాంత్‌ వీర్‌(29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్‌ మాత్రం(16 బంతుల్లో 37) ఆకట్టుకున్నారు.ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాకబ్‌ డఫీ, కృనాల్‌ పాండ్యా, అభినందన్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా సీఎస్‌కేకు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Bhuvneshwar Kumar Creates Historic Record10
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌

టీమిండియా వెట‌ర‌న్‌, రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌల‌ర్‌గా భువీ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అయూశ్ మాత్రేను ఔట్ చేసిన భువీ.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 200 వికెట్ల మార్కును కేవలం లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మాత్రమే అందుకున్నాడు. చాహల్ 176 మ్యాచ్‌లలో 224 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2024 సీజన్‌లో తన 153వ మ్యాచ్‌లోనే చాహల్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పుడు భువనేశ్వర్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలు పెట్టిన భువనేశ్వర్‌.. ఆ తర్వాత పుణె వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున నాలుగు సీజన్ల పాటు ఆడిన భువీ.. గతేడాది తిరిగి తన సొంత గూటి(ఆర్సీబీ)కి చేరాడు. ఐపీఎల్‌-2025లో భువీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీసి ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరేయజ్వేంద్ర చాహల్: 221 వికెట్లు భువనేశ్వర్ కుమార్: 200 వికెట్లు సునీల్ నరైన్ : 192 వికెట్లుపీయూష్ చావ్లా : 192 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ : 187 వికెట్లుచదవండి: ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Advertisement
Advertisement
 
Advertisement