Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Thunderstorms and Rain may Impact SRH vs DC match1
వర్ష సూచన.. సన్‌రైజర్స్‌-ఢిల్లీ మ్యాచ్‌ జరిగేనా..?

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 21) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ చేయడానికి మొగ్గు చూపవచ్చు.వాతావరణ నివేదికఈ మ్యాచ్‌కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది.

Shubman Gill, Jasprit Bumrah Out Of Selectors Radar For Upcoming India Vs Afghanistan Series2
సెలెక్టర్ల పరిధిలో లేని గిల్‌, బుమ్రా

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎంపికను భారత సెలెక్టర్లు ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నారు. జూన్‌ 6 నుంచి న్యూ చంఢీఘడ్‌లో జరుగబోయే ఈ మ్యాచ్‌ కోసం సీనియర్లకు విశ్రాంతినివ్వాలని వారు యోచిస్తున్నారు. సీనియర్ల జాబితాలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవడంతో సెలెక్టర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్‌ మరో కారణంగా తెలుస్తుంది.భారత పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్‌ టెస్ట్‌ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆతర్వాత భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఐర్లాండ్‌కు వెళ్లనుంది. అనంతరం భారత్‌ 5 టీ20లు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఇంగ్లండ్‌ సిరీస్‌ నేపథ్యంలో భారత సెలెక్టర్లు గిల్‌, బుమ్రాకు విశ్రాంతినివ్వాలని అనుకుంటున్నారు. టీమిండియా-ఇంగ్లండ్‌ సిరీస్‌ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది.ఆఫ్ఘనిస్తాన్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లకు గిల్‌, బుమ్రాకు విశ్రాంతినివ్వడానికి సెలెక్టర్ల వద్ద మరో కారణం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు వీరిద్దరు కీలకం కాబటి, మెగా టోర్నీకి ముందు వీలైనంత విశ్రాంతినివ్వవచ్చు. గిల్‌, బుమ్రా ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు వీరి విషయంలో రిస్క్‌ తీసుకునే సాహసం చేయరు. ఒకవేళ ప్రపంచకప్‌ దృష్ట్యా వన్డేల్లో ఆడించాలని అనుకుంటే మాత్రం ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు ఎంపిక చేయవచ్చు.బుమ్రా, గిల్‌ గైర్హాజరీలో ఆకిబ్‌ నబీ, దేవదత్‌ పడిక్కల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తదితర పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో నబీ పేరు ఖరారైందని సమాచారం.

BCCI Springs Into Action, Initiates Massive Call On Auqib Nabi's India Debut3
టీమిండియాలోకి సంచలన ఫాస్ట్‌ బౌలర్‌

రాబోయే అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత (జూన్‌లో) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే సిరీస్‌ (టెస్ట్‌, మూడు వన్డేలు) కోసం సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అకిబ్‌ నబీని ఎంపిక​ చేయనున్నట్లు తెలుస్తోంది. నబీ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. నబీ ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో విశేషంగా రాణించి 60 వికెట్లు తీసి, లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. నబీ సంచలన ప్రదర్శనల కారణంగా జమ్మూ కశ్మీర్‌ తమ తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. నబీ స్థిరమైన వేగంతో పాటు బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సమర్దుడు. 41 మ్యాచ్‌ల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో అతను 156 వికెట్లు తీశాడు.భారత టెస్టు జట్టులో గత కొంతకాలంగా పేస్ బౌలింగ్ భారం ఎక్కువగా బుమ్రాపైనే పడుతుంది. ఇతర బౌలర్లు కూడా కొంతమేరకు సహకరించినప్పటికీ, స్థిరమైన ప్రత్యామ్నాయం అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నబీ వంటి యువ బౌలర్ జట్టులోకి వస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గడమే కాకుండా బౌలింగ్ విభాగానికి లోతు పెరుగుతుంది.అందుకే భారత సెలెక్టర్లు నబీని సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది. నబీ బౌలింగ్‌ శైలి సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పనికొచ్చేలా కనిపిస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఐపీఎల్‌ ఛాన్స్‌ కొట్టేసిన నబీ.. ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అతను 2 మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరి సెలెక్టర్లు నబీని టెస్ట్‌లకే పరిమితం చేస్తారో లేక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ అవకాశాలు ఇస్తారో చూడాలి.

Dasun Shanaka banned from PSL by PCB4
రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌పై నిషేధం

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌, శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనకపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోని లాహోర్‌ ఖలందర్స్‌ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఒక సంవత్సరం నిషేధం విధించింది. దీంతో షనక వచ్చే పీఎస్‌ఎల్‌ సీజన్ (2027)లో పాల్గొనలేరు.పీసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాహోర్ ఖలందర్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని షనక ఉల్లఘించాడు. మార్చి 21న టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇందుకు అతను చూపించిన కారణాలు ఒప్పంద పరిధిలో చెల్లుబాటు కావు. కాబట్టి లీగ్ ప్రతిష్ఠను కాపాడేందుకు షనకపై ఏడాది నిషేధం విధించారు.పీసీబీ తనపై విధించిన నిషేధాన్ని షనక పరోక్షంగా అంగీకరించాడు. ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన విచారాన్ని వ్యక్తం చేశాడు. "హెచ్‌బీఎల్ పీఎస్‌ఎల్ నుంచి తప్పుకోవడం నా తప్పు. పాకిస్థాన్ అభిమానులు, లాహోర్ ఖలందర్స్ అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ సమయంలో మరో టోర్నమెంట్‌లో ఆడాలనే ఉద్దేశం నాకు లేదు. పాకిస్థాన్‌లో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందమే" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, షనక పీఎస్‌ఎల్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్‌ రాయల్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. సామ్‌ కర్రన్‌ గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరం కావడంతో రాయల్స్‌ షనకను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. షనకకు రాయల్స్‌ బేస్‌ ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ సీజన్‌లో షనక రాయల్స్‌ తరఫున ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

Is Rashid Khan Going To Be Punished For Leaking BCCI Citizenship Bait5
రషీద్‌ ఖాన్‌పై చర్యలు ఉంటాయా..?

భారత్‌, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్‌ చేశాయని, వారి దేశాల తరఫున క్రికెట్‌ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకువచ్చాయని, అయితే తాను వాటిని సున్నితంగా తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ తన పుస్తకం "Rashid Khan: From Streets to Stardom" ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత పౌరసత్వం ఆఫర్‌ను బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తన ముందు ఉంచారని రషీద్‌ పేర్కొనడంతో బోర్డు పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.గోప్యంగా ఉంచాల్సిన విషయాన్ని బహిర్గతం చేసిన నేపథ్యంలో రషీద్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించగా.. రషీద్‌ చేసిన పనికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన నిబంధనలేవీ లేదని తెలుస్తుంది. అయితే బోర్డు ప్రతిష్ఠకు భంగం కలిగిందని భావిస్తే మాత్రం బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. అవసరమైతే ఆధారాలు చూపాలని కూడా కోరవచ్చు.కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా నిపుణులు కొట్టిపారేయడం లేదు. చర్యల్లో భాగంగా ఐపీఎల్‌లో పాల్గొనడంపై పరిమితులు విధించడం లేదా నిషేధం విధించడం వంటి చర్యలు ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలకు బలమైన ఆధారాలు అవసరం అవుతాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఈ అంశాన్ని పక్కను పెట్టిందని తెలుస్తుంది. ఒకవేళ పరిశీలనలోకి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. బోర్డు పెద్దల్లో చాలామందికి రషీద్‌పై సానుకూల అభిప్రాయం ఉంది కాబట్టి వార్నింగ్‌తో సరిపెట్టవచ్చు. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది.కాగా, రషీద్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో గుజరాత్‌ టైటాన్స​్‌ తరఫున బిజీగా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి, ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో వికెట్‌ తీయలేకపోయినా పొదుపుగా (31 పరుగులు) బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ముంబై చేతిలో చిత్తుగా ఓడింది.

IPL 2026: MI Captain Hardik Pandya Comments After Win Against GT6
గుజరాత్‌ను వారి ఇలాకాలో ఓడించిన అనంతరం హార్దిక్‌ వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 21) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను వారి సొంత ఇలాకాలో (అహ్మదాబాద్‌) చిత్తుగా ఓడించింది. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత గుజరాత్‌కు ఎదురైన తొలి ఓటమి ఇది. మరోవైపు ముంబైకు నాలుగు వరుస పరాజయాల తర్వాత వచ్చిన తొలి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ (101 నాటౌట్‌) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తిలక్‌ శతక్కొట్టుడుతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్య ఛేదనలో అశ్వనీ కుమార్‌ (4-0-24-4), ఘజన్‌ఫర్‌ (2.5-0-17-2), సాంట్నర్‌ (3-0-16-2) ధాటికి గుజరాత్‌ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ గెలుపుపై ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చాలా ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అహ్మదాబాద్ లాంటి కఠిన వేదికపై గెలవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మైదానంలో ముంబై ఇండియన్స్‌కు గతంలో పెద్దగా విజయాలు లేవు. ఈసారి మంచి క్రికెట్ ఆడి విజయం సాధించడం ప్రత్యేకంగా అనిపించింది. ఈ గెలుపు జట్టుకు అత్యంత అవసరమైంది.మ్యాచ్‌లో కీలక మలుపు 14వ ఓవర్ టైమ్‌ఔట్‌ తర్వాత వచ్చింది. ఆ సమయంలో తిలక్‌ వర్మకు ఓ సందేశం ఇచ్చాను. బంతిని గమనించి, ధైర్యంగా కొట్టు అని చెప్పాను. తిలక్‌ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉంది, అతను తన సహజ ఆట ఆడితే చాలు అన్న భావనతో ప్రోత్సహించాను. చివరికి తిలక్ అద్భుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు.బౌలింగ్‌లో బుమ్రా వినియోగంపై పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాను ఎప్పుడైనా ఉపయోగించవచ్చని, అతను ప్రత్యేకమైన బౌలర్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అతన్ని వినియోగించడం ముఖ్యమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో కొత్త బంతితోనే ప్రభావం చూపాలని నిర్ణయించి, బుమ్రాను ప్రారంభంలోనే బౌలింగ్‌కు తీసుకురావడం విజయానికి దోహదపడిందని తెలిపాడు.ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. అరంగేట్రం బౌలర్‌ కృష్‌ మంచి లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడని, అశ్వనీ కుమార్‌ కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. గత సీజన్‌లో కూడా అతను ఇదే తరహా ప్రదర్శన చేసినట్లు గుర్తు చేశాడు. అదనంగా ఫీల్డింగ్‌లో కూడా జట్టు మెరుగ్గా రాణించిందని, ముఖ్యంగా నమన్ ప్రదర్శనను ప్రశంసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. ఇక​ దూసుకుపోతామని పరోక్షంగా చెప్పాడు.

IPL 2026: GT Captain Shubman Gill Comments after losing to Mumbai Indians7
ముంబై చేతిలో పరాజయాన్ని బౌలర్లపై నెట్టిన గిల్‌​

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 20) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో గుజరాత్‌ టైటాన్స్‌ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్‌ వర్మ (101 నాటౌట్‌) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి. మరోవైపు గుజరాత్‌కు ఇది హ్యాట్రిక్‌ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్‌ (4-0-24-4), ఘజన్‌ఫర్‌ (2.5-0-17-2), సాంట్నర్‌ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.గిల్‌ మాటల్లో.. ఈ పిచ్‌పై 160-170 పరుగుల స్కోర్‌ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.పిచ్‌పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్‌పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్‌ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్‌ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్‌లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.మొత్తంగా, గిల్‌ ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.

Sunrisers Hyderabad and Delhi Capitals at the Uppal stadium8
సన్‌రైజర్స్‌ను ఢిల్లీ ఆపగలదా!

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ‘హ్యాట్రిక్‌’ విజయంపై గురి పెట్టింది. ఐపీఎల్‌లో భాగంగా నేడు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రైజర్స్‌ తలపడుతుంది. మరోవైపు రెండు వరుస పరాజయాల అనంతరం డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును బెంగళూరులోనే ఓడించడంతో ఢిల్లీ టీమ్‌లో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. పాయింట్ల పట్టికలో పెద్ద తేడా లేకుండా దాదాపు సమానంగా ఉన్న ఈ రెండు టీమ్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. గత రెండు మ్యాచ్‌ల ఫలితాలను బట్టి చూస్తే సన్‌రైజర్స్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిõÙక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపు బ్యాటింగ్‌తో పాటు టాప్‌–5లో హెడ్, ఇషాన్‌ కిషన్, నితీశ్‌ రెడ్డి కూడా చెలరేగితే బ్యాటింగ్‌లో తిరుగుండదు. బౌలింగ్‌లో యువ ఆటగాళ్లంతా సమష్టింగా రాణిస్తుండటం జట్టు బలం. ప్రఫుల్‌ హింగే, సాకిబ్, శివాంగ్‌లతో పాటు ఇషాన్‌ మలింగ కూడా గత మ్యాచ్‌లో సత్తా చూపించాడు. ఢిల్లీ జట్టులో కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... స్టబ్స్, డేవిడ్‌ మిల్లర్‌లతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది. ముకేశ్, ఎన్‌గిడి, కుల్దీప్‌లతో పాటు అక్షర్‌ పటేల్, నటరాజన్‌ బౌలింగ్‌ భారం మోస్తారు. గత మ్యాచ్‌లో విఫలమైనా... పేసర్‌ ఆకిబ్‌ నబీకి మరో అవకాశం దక్కవచ్చు.

Aronyak Ghosh became India 95th Grandmaster9
భారత 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్‌ ఘోష్‌

రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్‌కు చెందిన యువ చెస్‌ ప్లేయర్‌ అరోణ్యక్‌ ఘోష్‌ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా సంపాదించాడు. బ్యాంకాక్‌ చెస్‌ క్లబ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో 22 ఏళ్ల ఈ కోల్‌కతా ప్లేయర్‌ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో నార్మ్‌ను సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అరోణ్యక్‌ ఏడు పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2023లో సాంట్స్‌ ఓపెన్‌లో తొలి జీఎం నార్మ్‌ పొందిన అరోణ్యక్‌... 2024లో అనెమాస్‌ మాస్టర్స్‌ టోర్నీలో రెండో జీఎం నార్మ్‌ దక్కించుకున్నాడు. ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో జాతీయ చాంపియన్‌గా ఉన్న అరోణ్యక్‌ గత ఏడాది ప్రపంచకప్‌ టోరీ్నకి అర్హత సాధించాడు. తొలి రౌండ్‌లో మటెసుజ్‌ బార్టెల్‌ (పోలాండ్‌)ను ఓడించిన అతను రెండో రౌండ్‌లో లెవోన్‌ అరోనియన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 401వ ర్యాంక్‌లో ఉన్న అరోణ్యక్‌ ఖాతాలో 2533 ఎలో రేటింగ్‌ పాయింట్లున్నాయి.

Mumbai Indians Beat Gujarat Titans By 100 Runs IPL 202610
ముంబై చేతిలో చిత్తుగా ఓడిన గుజ‌రాత్‌

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సోమ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 99 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. 200 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ 15.5 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి దారుణ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 26 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ముంబై బౌల‌ర్ల‌లో అశ్వ‌నీ కుమార్ 4 వికెట్ల‌తో చెల‌రేగ‌గా, గ‌జ‌న్‌ఫ‌ర్‌, మిచెల్ సాంట్న‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడిన గుజ‌రాత్ ముంబై బౌల‌ర్ల ధాటికి వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. అంత‌కముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ మిడిలార్డ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ (101 నాటౌట్‌) సెంచ‌రీతో విధ్వంసం చెల‌రేగ‌గా, న‌మ‌న్ ధిర్ (45) బాధ్య‌తాయుతంగా ఆడారు. గుజ‌రాత్‌బౌల‌ర్ల‌లో ర‌బాడ 3 వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ప్ర‌సిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచ‌రీతో చెల‌రేగిన తిల‌క్ వ‌ర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో రెండో విజ‌యం సాధించిన ముంబై 4 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి ఎగ‌బాకింది. మ‌రోవైపు గుజ‌రాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజ‌యాలు, మూడు ప‌రాజ‌యాల‌తో ప‌ట్టిల‌క‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement