ప్రధాన వార్తలు
సన్రైజర్స్పై విమర్శలు.. అబ్రార్ అహ్మద్ షాకింగ్ రియాక్షన్!
ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' (The Hundred) వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం పెను వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఈ వేలంలో అబ్రార్ను సన్రైజర్స్ లీడ్స్ జట్టు 1.90 లక్షల పౌండ్ల (సుమారు రూ.2.3 కోట్లు)కు కొనుగోలు చేసింది.ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్, సన్రైజర్స్ లీడ్స్ ఓనర్ ఒక్కరే. దీంతో సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్లో తీవ్ర వ్యతిరేకత ఎదురువుతోంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం తీవ్రంగా స్పందించారు. ఇది పరోక్షంగా పాకిస్తాన్ మిలిటరీకి నిధులు సమకూర్చినట్లే అని ఆయన వ్యాఖ్యనించారు. అది భారత సైనికుల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ఆయన మండిపడ్డారు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ అండర్-19 కెప్టెన్ అజీమ్ రఫీక్ తప్పుపట్టారు. మీరు ఎన్ని పరుగులు చేశారన్నది ముఖ్యం కాదు, ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఆమోదయోగ్యం కాదు" అని రఫీక్ పేర్కొన్నాడు.అయితే ఈ వివాదాన్ని అబ్రార్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. "అబ్రార్ ఒప్పందంపై ఈ రకమైన విమర్శలు ముందే ఊహించాం. కానీ అబ్రార్ ఈ వివాదంపై ఏ మాత్రం ఆందోళన చెందడం లేదు. అబ్రార్ ప్రపంచవ్యాప్తంగా లీగ్స్లో ఆడేందుకు సిద్ధంగా ఉండటంతో ది హండ్రెడ్ కోసం తన పేరును నమోదు చేసుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్లో టాప్-3లో ఉండడంతో వేలంలో అతడు భారీ ధర దక్కింది. అతడు అందుకు కచ్చితంగా అర్హుడు. సన్రైజర్స్ లీడ్స్ కోచ్ డేనియల్ వెట్టోరి అబ్రార్ ఫోన్ చేసి తనను కొనుగోలు చేసిన విషయాన్ని తెలియజేశాడు. తమతో టచ్లో ఉండాలని సూచించారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు టెలికామ్సియానెట్కు వెల్లడించాయి.చదవండి: భార్య మాట... బంగారు బాట!
భార్య మాట... బంగారు బాట!
టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టడం... సొంతగడ్డపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా వరల్డ్కప్ ఆడటం... మెగా టోర్నమెంట్కు ముందు అనూహ్యంగా ఇషాన్ కిషన్పై భరోసా పెట్టడం... కీలక మ్యాచ్ల్లో సంజూ సామ్సన్కు అండగా నిలవడం నుంచి మొదలుకొని... భార్య సలహాలతో ఆలోచన విధానాన్నే మార్చుకొని టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు... టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెరీర్లోని పలు కీలక దశలపై ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. ఐపీఎల్తోనే సరిపెట్టుకోవాలనుకున్న తాను... భార్య సూచనలతో భారత జట్టు కెప్టెన్గా ఎదగడం... తరగతి గదిలో సాధించలేనిది మైదానంలో చేసి చూపడం ఇలా సూర్యకుమార్ పంచుకున్న విశేషాలు అతడి మాటల్లోనే... న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్రైడర్స్కు ఆడుతున్న సమయంలో దివిశతో నా వివాహం జరిగింది. జీవితం సాఫీగా సాగిపోతున్నట్లే అనిపించింది. రెండేళ్ల తర్వాత 2018లో ముంబై ఇండియన్స్తో జతకట్టా. అదే సమయంలో నా భార్య ఒక ప్రశ్న వేసింది. ‘ఏజ్ గ్రూప్ క్రికెట్లో నీతో కలిసి ఆడిన వాళ్లు చాలా మంది ఇప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నీ మనసులో ఏం ఉంది’ అని సీరియస్గా అడిగింది. ఆ సమయంలో నాకు కూడా టీమిండియా తరఫున ఆడాలని ఉంది అని చెప్పా. అయితే అందుకు నీ ప్రయత్నాలు ఏవి అని నేరుగా ప్రశ్నించింది. ఇలా ఇద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ నా ఆలోచన ధోరణి ని మార్చింది. అప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే విషయంపై మరింత దృష్టి సారించా. ఆలోచనల నుంచి ఆహారం వరకు మొత్తం మార్చేశా. సినిమాలు, షికార్లు అన్నీ పక్కన పెట్టి తీవ్రంగా శ్రమించా. ఆ ఫలితం త్వరలోనే కనిపించింది. 2018లో ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబర్చా... అలాగే దేశవాళీల్లోనూ భారీగా పరుగులు చేశా. అలా వరుసగా మూడేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో మంచి ఇన్నింగ్స్లు ఆడా. 2020లో ఫినిషర్గా బాగా రాణించా... దీంతో మరుసటి ఏడాది టీమిండియా తరఫున పిలుపు వచ్చింది. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మరవలేను. భార్య అడిగిన చిన్న ప్రశ్న నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అలా అని తను నా కెరీర్లో జోక్యం చేసుకోదు. ఎలా ఆడాలి అనే విషయాల గురించి అసలు మాట్లాడదు. కానీ నా ఆలోచన విధానాల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అందుకే నా విజయాల్లో అగ్రభాగం ఆమెకే దక్కుతుంది. అలా అని ఇంట్లో ఎప్పుడూ క్రికెట్ చర్చే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఆటను గేటు బయటే పట్టి ఇంట్లోకి రమ్మని అంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు సూర్యకుమార్ యాదవ్ కాదు... కేవలం సూర్య మాత్రమే అంటూ చమత్కరిస్తుంది. అప్పటికి ఇప్పటికి అదే తేడా... 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో... తాజాగా ట్రోఫీ చేజిక్కించుకున్న జట్టులో చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉన్నాయి. 2024 టీమ్లో అనుభవంతో కూడిన జోరు ఉండేది... ఇప్పుడు జట్టులో యువరక్తం ఉరకలు వేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రూపంలో జట్టులో అనుభవజు్ఞలు ఉండేవారు. ఎవరి బాధ్యతలు వారికి పక్కాగా ఉండేవి. ప్రస్తుత జట్టులో అనుభవం ఎక్కువగా లేకున్నా... ఉత్సాహం మాత్రం కావల్సినంత ఉంది. స్వదేశంలో ఆడటంపై... ప్రపంచకప్ అంటే అంచనాలు భారీగా ఉండటం సహజం. ద్వైపాక్షిక సిరీస్ల్లో ఉత్తమ ప్రదర్శన చేస్తుండటంతో పాటు... డిఫెండింగ్ చాంపియన్గా మాపై విపరీతమైన అంచనాలు ఉంటాయని మాకూ తెలుసు. టీమిండియాపై అది ఎప్పుడైనా సహజమే. భావోద్వేగాల విషయంలో గత టోర్నీకి ఇప్పటకీ పెద్ద తేడా లేదు. కానీ... సొంతగడ్డపై మ్యాచ్లు ఆడుతుండటంతో అది మరి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. అర్ష్ దీప్–మిచెల్ వివాదంపై.. న్యూజిలాండ్తో టి20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా డారిల్ మిచెల్పైకి అర్‡్షదీప్ సింగ్ బంతి విసిరిన సందర్భంలో నేను కివీస్ ప్లేయర్కు క్షమాపణలు చెప్పా. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో కొన్నిసార్లు అలా జరిగిపోతూ ఉంటుంది. అర్ష్ దీప్ కూడా క్షణికావేశంలో జరిగిపోయిందని అన్నాడు. వెంటనే మిచెల్కు క్షమాపణ చెప్పాడు. మ్యాచ్ అనంతరం అర్ష్ దీప్ బహిరంగంగా సైతం ఇదే పనిచేశాడు. సారథిగా ప్రత్యర్థి ప్లేయర్లను సైతం గౌరవించడం నా బాధ్యత. కెప్టెన్గా డిస్టింక్షన్ చదువుకునే రోజుల్లో 80 శాతం మార్కులు వస్తే బాగుండు అని ఎంతో అనుకునేవాడిని కానీ... అది ఎప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు క్రికెట్లో అది జరిగింది. టీమిండియా కెప్టెన్గా అంతర్జాతీయ టి20ల్లో 80 శాతం విజయాలు సాధించగలిగాను. 2024 టి20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నా. అప్పటి నుంచి 52 మ్యాచ్లు ఆడితే అందులో 42 మ్యాచ్ల్లో జట్టు విజయం సాధించింది. స్కూల్లో ఎప్పుడూ నా మార్కులు 50 శాతానికి మించలేదు. చిన్నప్పుడు నాకు మంచి మార్కులు రావాలని కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడేవారు. కానీ నాకు చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. దీంతో ఆటలపై ఉన్న ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించారు. దీంతో క్రికెట్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. టి20ల్లో చేయితిరిగిపోయింది జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేశవాళీల్లో 10–12 ఏళ్లు ఆడాను. ముంబైలో క్రికెట్ ప్రారంభించిన వాళ్లు ఎవరైనా... ఎర్ర బంతితోనే ప్రాక్టీస్ చేస్తారు. నేను అంతే! అయితే టీమిండియా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడా. వన్డేల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ అదీ సాధ్యపడలేదు. టి20 ఫార్మాట్లో మాత్రం చేయితిరిగిపోయింది. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జితేశ్ శర్మను కాదని ఇషాన్ను ఎంపిక చేశాం. అప్పుడే అతడితో ట్రోఫీ గెలిపిస్తావా అని అడిగాను. ముందు నమ్ము అని అన్నాడు. అదే జరిగింది. సామ్సన్ను తుది జట్టులోకి తీసుకున్న తర్వాత టోర్నమెంట్లో మా జట్టు ఆటతీరే మారిపోయింది.
కమిన్స్ లేకుండానే..
హైదరాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లలో తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సేవలు కోల్పోనుంది. చాలా కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆ్రస్టేలియా స్టార్ పేసర్ కమిన్స్... ఈ సీజన్ మొదలయ్యే సమయానికి కోలుకుంటాడని భావించినా అది సాధ్యం కాలేదు. అతను ఇంకా రీహాబిలిటేషన్లోనే కొనసాగుతున్నాడని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో ఇంగ్లండ్పై ఒకే ఒక యాషెస్ టెస్టు ఆడిన తర్వాత కమిన్స్ మళ్లీ మైదానంలోకే రాలేదు.సీజన్లో ఏ మ్యాచ్ నుంచి అతను అందుబాటులో వస్తాడో ఇప్పుడే చెప్పలేని స్థితి. 2024లో కెప్టెన్గా సన్రైజర్స్ను కమిన్స్ రన్నరప్గా నిలిపాడు. గత ఏడాది టీమ్ ఆరో స్థానంలో నిలిచింది. రెండు సీజన్లలో కలిపి 30 మ్యాచ్లలో కమిన్స్ 34 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ దూరం కావడంతో హైదరాబాద్ ఒకవైపు రెగ్యులర్ పేస్ బౌలర్తో పాటు కెప్టెన్ను కూడా కొత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆటగాడికే కెప్టెన్సీ అవకాశం కాబట్టి ఆ్రస్టేలియాకే చెందిన విధ్వంసక ఓపెనర్ ట్రవిస్ హెడ్ను ఎంపిక చేసే ఆలోచన ఉంది. కమిన్స్ తిరిగి వచ్చే వరకు తాత్కాలికమే కాబట్టి హెడ్ ఆసక్తి చూపించకపోతే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లేదా మరో ఓపెనర్ అభిషేక్ శర్మకు నాయకత్వ బాధ్యతలు దక్కుతాయి. బౌలింగ్లో హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్లపై అదనపు భారం తప్పదు. ఆర్సీబీకి హాజల్వుడ్ గాయాల సమస్య! ఐపీఎల్లో మరో ఫ్రాంచైజీ కూడా ఆసీస్ పేసర్ గాయం సమస్యను ఎదుర్కొంటోంది. గత ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన పేసర్ జోష్ హాజల్వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. కండరాలు, మడమ గాయాలతో ఇబ్బంది పడుతున్న హాజల్వుడ్ టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరం కావడం ఖాయమైంది. హాజల్వుడ్ కూడా గత నవంబర్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడలేదు. అతని రీహాబిలిటేషన్ పూర్తయిన తర్వాత ఐపీఎల్లో పాల్గొనడంపై స్పష్టత రావచ్చు. హాజల్వుడ్ గైర్హాజరు ఆర్సీబీని బలహీనంగా మార్చడం ఖాయం. భువనేశ్వర్, యశ్ దయాళ్, నువాన్ తుషార రూపంలో జట్టుకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. జాకబ్ డఫీ కూడా జట్టుకు ఉపయోగపడగలడు. హర్షిత్ రాణా కష్టమే! ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)కు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రధాన పేసర్ హర్షిత్ రాణా ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. టి20 వరల్డ్ కప్ జట్టులో ఉండి చివరి నిమిషంలో టోర్నీకి దూరమైన హర్షిత్... ఎప్పటి వరకు ఫిట్గా మారతాడనే విషయంపై టీమ్ మేనేజ్మెంట్కు కూడా స్పష్టత లేదు. గత రెండు సీజన్లుగా రాణా కేకేఆర్ టీమ్లో కీలక బౌలర్గా సత్తా చాటాడు. రాణాతో పాటు మహీశా పతిరణ కూడా గాయంతో బాధపడుతుండగా, ముజరబాని ఏమాత్రం ప్రభావం చూపగలడనేది ఆసక్తికరం. అయితే వైభవ్ అరోరా, ఆకాశ్దీప్, ఉమ్రాన్ మలిక్ రూపంలో పేస్ ప్రత్యామ్నాయాలు జట్టుకు ఉన్నాయి.
రోహిత్ సాధన షురూ...
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు టెటిల్స్తో అగ్ర స్థానంలో ఉన్నాయి. అయితే గత ఐదు సీజన్లలో ముంబై ప్రదర్శన ఆశించినంత మెరుగ్గా లేదు. 2020లో ట్రోఫీని అందుకున్న తర్వాత టీమ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్’కు చేరడంలో విఫలమైన జట్టు... మిగిలిన రెండు సందర్భాల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత జట్టుతో 2026లోనైనా జట్టు రాత మారుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో ముంబై స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీమ్తో కలిసి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ చివరి సారి మైదానంలోకి దిగాడు. ఆ సిరీస్లో అతను వరుసగా 26, 24, 11 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ బ్యాట్ పట్టి ఐపీఎల్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాధనలో అతను సుదీర్ఘ సమయం పాటు నెట్స్లో గడిపాడు. బౌలర్లందరినీ అలవోకగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా రోహిత్ గతంలో కంటే పూర్తి ఫిట్గా, చురుగ్గా కనిపిస్తుండటం విశేషం. 2025 సీజన్లో రోహిత్ 15 ఇన్నింగ్స్లలో 149.28 స్ట్రయిక్ రేట్తో 418 పరుగులు సాధించాడు. టీమ్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే పర్యవేక్షణలో జట్టు ఆటగాళ్ల ప్రాక్టీస్ సాగింది.
ఒకే గ్రూప్లో భారత్, పాకిస్తాన్
లుసానే (స్విట్జర్లాండ్): హాకీ వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూప్ల వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వెల్లడించింది. రెండు ఒలింపిక్ స్వర్ణాలు, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉన్న డచ్ హాకీ క్రీడాకారిణి నవోమీ వాన్ ఆజ్ సహా పలువురు మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో ఒకేసారి ప్రపంచకప్లను నిర్వహిస్తుండటం విశేషం. బెల్జియం, నెదర్లాండ్స్లలో ఆగస్టు 14 నుంచి 30 వరకు పోటీలు జరుగుతాయి. రెండు మెగా టోరీ్నలకు సంబంధించిన వేర్వేరు మస్కట్లను కూడా ఎఫ్ఐహెచ్ విడుదల చేసింది. వరల్డ్ కప్లో మొత్తం 16 జట్ల చొప్పున పాల్గొంటున్నాయి. ఒక్కో పూల్ నుంచి టాప్–2 జట్లు ముందంజ వేస్తాయి. ఎనిమిది టీమ్లతో రెండో దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. పురుషుల విభాగంలో పూల్ ‘డి’లో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ పూల్లో భారత్తో పాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. మహిళల విభాగంలో భారత్ పూల్ ‘డి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చైనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టోర్నమెంట్ మ్యాచ్ల పూర్తిస్థాయి షెడ్యూల్ను నేడు ప్రకటిస్తారు. 2022లో జరిగిన వరల్డ్ కప్లో జర్మనీ, నెదర్లాండ్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచాయి. పూల్ల వివరాలు పురుషుల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్; పూల్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా; పూల్ ‘సి’: ఆ్రస్టేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వేల్స్. మహిళల విభాగం: పూల్ ‘ఎ’: నెదర్లాండ్స్, ఆ్రస్టేలియా, చిలీ, జపాన్; పూల్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్; పూల్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్; పూల్ ‘డి’: భారత్, ఇంగ్లండ్, చైనా, దక్షిణాఫ్రికా.
మరిన్ని టెస్టులు... మరింత మెరుగు...
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్లోనూ క్రమం తప్పకుండా టెస్టు మ్యాచ్లు జరిగితేనే జట్టు మెరుగవుతుందని భారత బ్యాటర్ ప్రతీక రావల్ చెప్పింది. ఇటీవల ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన ఏకైక డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టులో ఆమె అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంప్రదాయ టెస్టు క్రికెట్నే అందమైన ఫార్మాట్గా అభివరి్ణంచింది. పరిపూర్ణ క్రికెటర్ అయ్యేందుకు పరీక్ష పెడుతుందని చెప్పుకొచ్చింది. పురుషుల విభాగంతో పోలిస్తే మహిళల క్రికెట్లో టెస్టు మ్యాచ్లు అరుదుగా జరుగుతున్నాయి. 1976లో తొలి టెస్టు ఆడిన భారత మహిళల జట్టు 2026 వరకు మొత్తం 42 టెస్టుల్లో మాత్రమే పోటీపడింది. ఇందులో 8 టెస్టుల్లో గెలిచి, 7 టెస్టుల్లో ఓడిపోయింది. 27 టెస్టులను ‘డ్రా’గా ముగించింది. న్యూఢిల్లీలో జాతీయ క్రీడా పాత్రికేయుల సమాఖ్య కాన్ఫరెన్స్లో పాల్గొన్న 25 ఏళ్ల ప్రతీక ఈ సందర్భంగా చెప్పిన కబుర్లు ఆమె మాటల్లోనే... జగజ్జేతలుగా నిలవడం వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవడం అన్నింటికంటే మించిన అద్భుతమైన అనుభవం. నా కెరీర్లో అదెప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుంది. ఇన్ని రోజులైనా... ఆ విజయం, కప్ ఎత్తుకున్న మా బృందం చేసిన సందడి, సంబరం కళ్లముందు కదలాడుతూనే ఉంది. బహుశా ఎప్పటికీ ఇలానే ఉండిపోతుందేమో చెప్పలేను. ఎందుకంటే మేం గెలిచింది... ఎప్పుడూ తలచుకునే ప్రపంచకప్ను. అసలైన క్రికెట్ అదే క్రికెట్లో టెస్టే అసలైన ఫార్మాట్. చిన్నప్పుడు మా నాన్న, కోచ్ ఇదే విషయాన్ని చెప్పారు. ఈ సంప్రదాయ ఫార్మాటే ప్రధానమైందని, ఇందులో రాణిస్తేనే క్రికెట్లో రాటుదేలుతామని, తద్వారా ఆ ఫార్మాట్ మన అభిమాన ఆటగా మారుతుందన్నారు. ఇప్పుడు టెస్టు ఆడుతుంటే నాక్కూడా అదే అనుభవం కలిగింది. సచిన్, లారా వీడియోల్ని చూసి పరిమిత ఓవర్ల క్రికెట్ పూర్తి భిన్నమైంది టెస్టు ఫార్మాట్. అందుకే ఈ సంప్రదాయ ఆటను ఒంటబట్టించుకునేందుకు దిగ్గజాలు ఆడిన తీరును అదేపనిగా చూశాను. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), వివియన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా (వెస్టిండీస్)లు ఎలా ఆడారో తదేకంగా చూసేదాన్ని. గంటల తరబడి క్రీజులో నిలబడిన వారి బ్యాటింగ్ నాకు ప్రేరణగా ఉపయోగపడింది. నా ఆటకు ఉ్రత్పేరకంగా పనిచేసింది. ఈ ఏడాది కీలకం అమ్మాయిల జట్టుకు ఈ సీజన్ అత్యంత కీలకం. ఈ ఏడాది మహిళల టి20 ప్రపంచకప్తో పాటు ఆసియా క్రీడలు కూడా జరుగనున్నాయి. ఏషియాడ్లో కూడా టి20 ఫార్మాట్లోనే క్రికెట్ పోరు జరుగుతుంది. అందుకే ప్రస్తుతం జట్టు కోసం శ్రమించేందుకు, జట్టు విజయాల్లో భాగం కావాడమే లక్ష్యంగా నేను కసరత్తు చేస్తున్నాను. అంతేతప్ప భవిష్యత్తుపై అదేపనిగా అతిగా ఆలోచించను. గుర్తింపే కదా ఎవరైనా ఆశించేది బీసీసీఐ వార్షిక నమన్ అవార్డుల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇదే తొలి వేడుక (బోర్డుకు సంబంధించి). ఎక్కడైనా... ఎవరైనా కోరుకునేది గుర్తింపునే. మన శ్రమను గుర్తించి ఇచ్చే అవార్డులు మనల్ని మరింత కష్టపడేందుకు దోహదపడతాయి. మనదేశంలో కొన్నేళ్లుగా మహిళల క్రికెట్ కూడా పురుషుల క్రికెట్లా దూసుకెళుతోంది.
దిగ్గజ క్రికెటరన్న గౌరవం లేదా?
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ పాకిస్థాన్ క్రికెటర్లను కొనుగోలు చేయడంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ సన్రైజర్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు తీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే సునీల్ గావస్కర్ వ్యాఖ్యలను పాక్ సంతతికి చెందిన ఇంగ్లీష్ క్రికెటర్ అజీమ్ రఫిక్ ఖండించడం వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక దిగ్గజ క్రికెటర్ అనే కనీసం గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడి కొత్త వివాదానికి తెరలేపాడు. ‘సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు ఖండించదగినవే. అసలు ఆయన మాట్లాడిన మాటలను ఎవరైనా అంగీకరించగలరా చెప్పండి? అయినా మీరు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్ని పరుగులు చేశారన్నది నాకు అనవసరం. కానీ సునీల్ గావస్కర్ వ్యాఖ్యలు మాత్రం అర్థరహితం’ అని పేర్కొన్నాడు. అయితే అజీమ్ రఫిక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం లేదన్న విషయం నిరూపించగలవా? అక్కడ నాన్ ముస్లింలనే లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించడం ఎంతవరకు సమంజసం’..‘భారత్పై పడి ఏడ్వడం మానండి. సునీల్ గావస్కర్ ఒక దిగ్గజ క్రికెటర్ అన్న కనీస మర్యాద కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. ఆయన అనుభవమంత వయసు కూడా నీకు లేదు. ముందు ఇతరులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆ తర్వాత ఉపన్యాసాలు ఇవ్వొచ్చు’.. ‘పాక్ క్రికెటర్లు సుద్దపూసలైతే ఆసియా కప్లో ఆ జట్టు బోర్డు చైర్మన్ ప్రవర్తించిన తీరు సరైనదేనా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది?’ అని కామెంట్లు పెట్టారు.This is absolutely ridiculous & should be condemned ..How are these comments acceptable? I don’t care how many runs you have scoredVile stuff from Gavaskar https://t.co/sLYtUKmGnZ— Azeem Rafiq (@AzeemRafiq30) March 16, 2026చదవండి: క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్!
క్రికెట్ చరిత్రలో అతిపెద్ద నోబాల్ వేసిన ఘనతను పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అసద్ అక్తర్ మూటగట్టుకున్నాడు. విషయంలోకి వెళితే.. పాకిస్థాన్ దేశవాలీ టీ20 క్రికెట్ పోటీల సందర్భంగా పెషావర్ వేదికగా కరాచీ బ్లూస్, లాహోర్ బ్లూస్కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కరాచీ బ్లూస్ తరఫున ఆడిన అసద్ అక్తర్ అతిపెద్ద నోబాల్ వేశాడు. క్రీజు లైన్ దాటిన అసద్ తన కాలిని చాలా ముందుకు పెట్టి బంతిని విసిరాడు. కావాలని విసిరాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ ఈ వింత నోబాల్ మాత్రం ఇప్పుడు వివాదంగా మారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. అంతేకాదు ఇదే ఓవర్లో అసద్ రెండు నోబాల్స్, రెండు వైడ్స్ కలిపి మొత్తం 21 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. అయితే చాలా మంది అసద్ అక్తర్ వేసిన నోబాల్ను 2010లో ఇంగ్లండ్పై పాక్ బౌలర్ మహ్మద్ ఆమిర్ వేసిన నోబాల్తో పోల్చుతున్నారు. అయితే అది స్పాట్ ఫిక్సింగ్లో భాగమని తర్వాత తేలడంతో ఆమిర్ సహా అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్లపై ఐసీసీ నిషేధం విధించింది. ఈ ముగ్గురికీ తర్వాత జైలుశిక్ష కూడా పడింది. తాజాగా అసద్ అక్తర్ వేసిన నోబాల్తో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మరోసారి తెరమీదకు వచ్చింది. A 25 year old Pakistani pacer, Asad Akhtar, bowled a shocking no ball in their ongoing premium domestic T20 tournament and it looked ridiculously suspicious. Spot fixing again. pic.twitter.com/zFRzScLFLx— Kakarot (@MidOffMind) March 15, 2026ఈ ఘటన నేపథ్యంలో 2010 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం గురించి అబ్దుల్ రజాక్ ఓ పాకిస్థానీ టీవీ షోలో మాట్లాడుతూ కీలక విషయాలు బయటపెట్టాడు. ఆ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర ఒక మొబైల్ ఫోన్ రిపేర్ వల్ల యాదృచ్ఛికంగా ఎలా తెలిసిందో ఆయన వివరించాడు."లండన్లో నాకు తెలిసిన ఒక స్నేహితుడు పార్ట్టైమ్గా మొబైల్ ఫోన్లు రిపేర్ చేసేవాడు. స్పాట్ ఫిక్సింగ్ సూత్రధారి మజార్ మజీద్ తన ఫోన్ను రిపేర్ కోసం నా స్నేహితుడికి ఇచ్చాడు. ఆ ఫోన్ను బాగు చేసిన తర్వాత అందులో మజార్కు, ముగ్గురు పాక్ ఆటగాళ్లకు మధ్య జరిగిన మెసేజ్లను నా స్నేహితుడు చూశాడు. మ్యాచ్లో స్పాట్ ఫిక్సింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ మెసేజ్లలో ఉన్నాయి" అని రజాక్ తెలిపాడు.చదవండి: ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది!
ఫ్యాన్ ఆర్మీ భారత క్రికెట్ను నాశనం చేస్తోంది!
భారత క్రికెట్లో ఇటీవలి కాలంలో ఫ్యాన్ ఆర్మీ,సూపర్ హీరో సంస్కృతి బాగా పెరిగిపోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇది భారత క్రికెట్ను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపాడు. ఆటగాళ్ల కంటే వారి పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని, దీనివల్ల ఫ్యాన్వార్ పెరిగిపోతుందన్నాడు. కోల్కతాలో జరిగిన రేవ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ కార్యక్రమానికి హాజరైన అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ ఆటగాడికి ఆ ఆటగాడితో సమస్య ఉంది. అందుకే ఆ ఆటగాడు జట్టులో లేడు.. ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో చదువుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటివే తరచుగ2ఆ కనబడితే సహజంగానే ఏదో జరుగుతుందన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది మానవసహజం. కోచ్ గౌతమ్ గంభీర్ చేయాల్సిన పని చాలా ఉంది. జట్టులో నుంచి నేను, కోహ్లీ, రోహిత్ వెళ్లిపోవాలని అతడు భావించినా పర్వాలేదు. అది అతడి పని. నేను ఎప్పుడూ అహాన్ని వదిలించుకోవాలనే చూశాను. ఇక 25 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాపై వీవీఎస్ లక్ష్మణ్ ఆడిన 281 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ మ్యాచ్లో భారత్ గెలిచింది కాబట్టి లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. అది కేవలం లక్ష్మణ్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు.. జట్టు విజయం కూడా. అభిమానులు క్రికెటర్లను ఆరాధించవచ్చు, కానీ డ్రెస్సింగ్రూమ్లో వ్యక్తులకన్నా జట్టుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది’ అని అశ్విన్ వెల్లడించాడు. చదవండి: అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
అలా చేస్తే ధోనితో ప్రయోజనముండదు!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ను కేవలం జట్టుకు ఉపయోగిస్తే సరిపోదని, అతన్ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చి ముందుకు పంపితేనే ప్రయోజనం ఉంటుందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు సంజూ శాంసన్ లాంటి క్రికెటర్ సీఎస్కేలో చేరడం ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చనుందని, ధోని స్థానంలో ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగల సత్తా శాంసన్కు ఉందని తెలిపాడు. ‘సీఎస్కేకు ధోని పేరు అదనపు బ్రాండ్ అని చెప్పొచ్చు. సీఎస్ేపేరు చెప్పగానే అందరి నోటి నుంచి వచ్చే మొదటి పేరు ధోనిదే. అయితే గత కొన్నేళ్లుగా ధోని తూతూమంత్రంగానే జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ లోరావడంతో ఎక్కువగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని బ్యాట్తో ఇప్పటికీ ప్రభావం చూపగలడు. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో 8,9వ స్థానంలో ధోని బ్యాటింగ్కు దిగితే జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్లో కచ్చితంగా ముందుగానే క్రీజులోకి రావాలి. కనీసం ఆరో స్థానంలో అయినా బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది.నేనైతే మాత్రం ధోని నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా. గత సీజన్ల మాదిరి ఈసారి అలా జరగకూడదని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తన తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 3న ఆర్సీబీతో, ఏప్రిల్ 5న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: పెషావర్కు వెళ్లొద్దు.. ఆసీస్ ఆటగాళ్లకు హెచ్చరిక!
అల్కరాజ్కు మెద్వెదెవ్ షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స...
అల్కరాజ్కు ఊహించని షాక్!
స్పెయిన్ టెన్నిస్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్వ...
ట్రంప్పై నిషేధం యోచనలో ఫిఫా!
పశ్చిమాసియాలోని ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదు...
గాయంతో వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ...
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్...
కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్...
టీమిండియా టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్ట...
టీ20 క్రికెట్ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్గా జహీర్ ఖాన్
టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ కొత్త ప్రయాణం...
క్రీడలు
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
వీడియోలు
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
SRH ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ
భారత్ దెబ్బకు షివరింగ్ వచ్చేసింది.. ఆఫ్రిది కామెంట్స్ వైరల్
ధోని, రోహిత్ తర్వాత శ్రీయాస్ అయ్యరే బెస్ట్ కెప్టెన్..
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
