ప్రధాన వార్తలు
రూ.30 లక్షలతో ఎంట్రీ.. కట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఓ 20 ఏళ్ల యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ వంటి దిగ్గజ ఫ్రాంచైజీల సైతం పోటీ పడ్డాయి. రూ. 30ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆ యువ ఆల్రౌండర్.. నిమిషాల వ్యవధిలోనే కోటీశ్వరుడిగా మారిపోయాడు.రికార్డు ధర దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడే ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రశాంత్ వీర్. దుబాయ్ వేదికగా జరుగుతున్న మినీ వేలంలో ప్రశాంత్ వీర్ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్తో పోటీ పడి మరి అతడిని సీఎస్కే సొంతం చేసుకుంది. తొలి బిడ్ నుంచి పోటీలో ఉన్న సీఎస్కే ఆఖరి వరకు వెనక్కి తగ్గలేదు. రచిన్ రవీంద్ర, లైమ్ లివింగ్స్టోన్ వంటి విధ్వంసకర ఆల్రౌండర్లను కాదని మరి ఈ యువ ఆటగాడిని సీఎస్కే దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా ప్రశాంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్(రూ. 10 కోట్లు) పేరిట ఉండేది. తాజా వేలంతో అవేష్ రికార్డును ప్రశాంత్ బ్రేక్ చేశాడు. దీంతో ఎవరీ ప్రశాంత్ వీర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ ప్రశాంత్ వీర్..?యూపీలోని అమేథీకి చెందిన ప్రశాంత్ వీర్.. అద్భుతమైన బ్యాటింగ్ ఆల్రౌండర్. 20 ఏళ్ల ప్రశాంత్కు బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్లు ఆడడం అతడి స్పెషాలిటీ. అతడు లెఫ్మ్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. యూపీ టీ20 లీగ్-2025లో నోయిడా సూపర్ కింగ్స్ తరపున ఆడిన ప్రశాంత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడిన వీర్.. 320 పరుగులతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఈ టీ20 లీగ్లో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 169.69 ఉంది. ఈ ప్రదర్శనలతో అతడు సీఎస్కే స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అతడిని వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ట్రయల్స్కు పిలిచింది. ట్రయల్స్లో కూడా ప్రశాంత్ అద్భుతంగా రాణించాడు. రవీంద్ర జడేజాకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని సీఎస్కే అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ కోసం సీఎస్కే భారీ ధర వెచ్చించింది. అయితే అంత భారీ ధర కేటాయిస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతడు దుమ్ములేపాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో 112 పరుగుల (స్ట్రైక్ రేట్ 170)తో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచ్లో కేవలం 10 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఔరా అన్పించాడు. కాగా ప్రశాంత్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.🚨 Prashant Veer🚨A 20 year-old all-rounder from UP left-handed batter and economical left-arm spinner. He impressed in UPT20 with 320 runs and 8 wickets in 10 matches (SR 155.34). A flexible middle-overs option with both bat and ball.Let’s see which team shows interest in him pic.twitter.com/Ei1cdvOZ85— Neeraj (@NeerajY00859341) December 15, 2025చదవండి: IPL 2026 Auction: సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
సీఎస్కే వదిలేసింది.. కట్ చేస్తే! వేలంలో కోట్ల వర్షం
ఐపీఎల్-2026 మినీ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాకు జాక్ పాట్ తగిలింది. అతడిని రూ. 18 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ సొంతం చేసుకుంది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పతిరానా కోసం తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీ పోటీనుంచి తప్పుకోవడంతో కోల్కతా నైట్రైడర్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ జూనియర్ మలింగ కోసం కేకేఆర్, లక్నో మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆఖరివరకు ప్రయత్నాలు చేసింది. కానీ కేకేఆర్ మాత్రం బిడ్ను పెంచుకుంటూ పోతుండడంతో లక్నో వెనక్కి తగ్గింది. దీంతో ఈ యార్కర్ల కింగ్ కేకేఆర్ సొంతమయ్యాడు.పతిరానా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే నాలుగు సీజన్ల పాటు తమ జట్టుకు ఆడిన పతిరానాను సీఎస్కే.. ఐపీఎల్-2026 వేలంకు ముందు రిటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలోకి వచ్చిన పతిరానాపై కాసుల వర్షం కురిసింది. గత సీజన్లో సీఎస్కే నుంచి రూ.13 కోట్లు అందుకున్న పతిరానా.. ఇప్పుడు కేకేఆర్ నుంచి రూ.18 కోట్లు అందుకోనున్నాడు. కాగా పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటికి.. సీఎస్కే లెజెండ్ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్ ఓవర్లలో కూడా తన పేస్ బౌలింగ్ బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. ఈ కారణంతోనే అతడిపై కేకేఆర్ కోట్ల వర్షం కురిపించింది. మతీషా పతిరానా ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్లు ఆడి 47 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: కామెరూన్ గ్రీన్కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే?
కామెరూన్ గ్రీన్కు భారీ ధర.. ఐపీఎల్ చరిత్రలోనే! ఎన్ని కోట్లంటే?
అంతా ఊహించిందే జరిగింది. ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసింది. ఈ విధ్వంసకర ఆటగాడిని రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన ముంబై ఇండియన్స్, కేకేఆర్ పోటీ పడ్డాయి. రూ. 2.75 కోట్లతో ముంబై బిడ్ను ప్రారంభించింది. కానీ రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై పోటీ నుంచి తప్పుకోంది. ఆ తర్వాత కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొంది. అనంతరం రాజస్తాన్ కూడా రేసు నుంచి వైదొలగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. గ్రీన్ కోసం సీఎస్కే కూడా తీవ్రంగా శ్రమించింది. కానీ కేకేఆర్తో పోటీ పడలేక సీఎస్కే వెనక్కి తగ్గింది. దీంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.గ్రీన్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డులలెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75) పేరిట ఉండేది. తాజా వేలంతో స్టార్క్ను గ్రీన్ వెనక్కి నెట్టాడు. అదేవిధంగా ఓవరాల్గా ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పొందిన మూడో ప్లేయర్గా గ్రీన్ నిలిచాడు. ఈ జాబితాలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(రూ.27 కోట్లు) అగ్రస్ధానంలో ఉండగా.. శ్రేయస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు) ఉన్నాడు.గ్రీన్కు వచ్చేది ఎన్ని కోట్లంటే?అయితే గ్రీన్ దక్కించుకున్న రూ. 25.20 కోట్లలో బీసీసీఐ కోత విధించనుంది. , ఐపీఎల్ గత సీజన్లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన ప్రకారం.. విదేశీ ప్లేయర్ 18 కోట్ల కంటే ఎక్కువ పలికితే, ఆపై మిగిలిన మొత్తాన్ని బీసీసీఐ ప్లేయర్ల వెల్ఫేర్ కోసం ఖర్చు చేయనుంది. దీంతో గ్రీన్ పలికిన ధరలో 7.20 కోట్లు బీసీసీఐకి వెళ్లనున్నాయి.చదవండి: దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తాడా?.. అదే తెలివైన నిర్ణయం!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్వుడ్. గాయం కారణంగా మరికొన్ని వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. 34 ఏళ్ల ఈ ఆసీస్ ఫాస్ట్బౌలర్.. స్వదేశంలో జరిగిన గత 25 మ్యాచ్లలో 15 గాయాల వల్ల మిస్సయ్యాడు.ఇప్పుడు తాజాగా ఇంగ్లండ్తో యాషెస్ టెస్టులకూ హాజిల్వుడ్ అందుబాటులో లేకుండా పోయాడు. తన కెరీర్లో ఇప్పటికి 76 టెస్టులు ఆడిన హాజిల్వుడ్.. 295 వికెట్లు కూల్చాడు. అయితే, మూడు వందల వికెట్ల అరుదైన క్లబ్లో ఇప్పట్లో చేరడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.వేధిస్తున్న గాయాలుకెరీర్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆకట్టుకున్న హాజిల్వుడ్.. స్వదేశంలో, విదేశాల్లో తనదైన శైలిలో రాణించాడు. అయితే, ముందుగా చెప్పినట్లు గత కొన్నాళ్లుగా అతడి టెస్టుల్లో రోజుల తరబడి బౌలింగ్ చేసేందుకు సహకరించడం లేదు. పక్కటెముకల నొప్పులు, వెన్నునొప్పి, తొడ కండరాల గాయాలు తరచూ అతడిని వేధిస్తున్నాయి. తాజాగా చీలమండ వెనుక భాగం నొప్పి తీవ్రం కావడంతో హాజిల్వుడ్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.రేసులో వారంతాగత ఐదు వేసవి సీజన్లలో ఆసీస్ ఆడిన ఇరవై టెస్టుల్లో హాజిల్వుడ్ పది మాత్రమే ఆడాడు. నైపుణ్యాల పరంగా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నప్పటికీ గాయాల బెడద వల్ల అతడి టెస్టు కెరీర్ ముందుగానే ముగింపు దశకు చేరుకునేలా ఉంది. హాజిల్వుడ్ స్థాయిలో కాకపోయినా.. స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, బ్రెండన్ డాగట్, జేవియర్ బార్ట్లెల్, సీన్ అబాట్ వంటి పేసర్లు సత్తా చాటుతూ తమను తాము నిరూపించుకుంటున్నారు.టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తాడా?ఇలాంటి తరుణంలో గాయాల వల్ల హాజిల్వుడ్ తరచూ జట్టుకు దూరం కావడం.. అతడి కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టెస్టుల సంగతి పక్కనపెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో హాజిల్వుడ్కు తిరుగులేదన్నది వాస్తవం. ప్రపంచస్థాయి టీ20 అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు కొనసాగుతున్నాడు.ఆసీస్ 2021లో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవడంలో హాజిల్వుడ్దీ కీలక పాత్ర. వన్డేల్లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్కప్-2027లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగే ఆస్ట్రేలియాకు అతడి సేవలు అత్యంత ముఖ్యం.తెలివైన నిర్ణయం తీసుకుంటేనేఈ పరిణామాలను బట్టి ఫిట్నెస్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా హాజిల్వుడ్ టెస్టులకు వీడ్కోలు పలికి.. మిగిలిన రెండు ఫార్మాట్లలో కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ ఫార్మాట్కు స్వస్తి పలికి టీ20, వన్డేలలో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తేనే కెరీర్కు మరికొన్నాళ్లపాటు ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు.అయితే, పూర్తిగా టెస్టులకు వీడ్కోలు పలకపోయినా.. కొన్నాళ్ల పాటు ఆ ఫార్మాట్కు దూరంగా ఉంటే పరిస్థితి చక్కబడవచ్చని మరికొందరు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే టెస్టుల్లో తానేంటో నిరూపించుకున్న హాజిల్వుడ్.. కెరీర్ కొనసాగింపులో భాగంగా ఈ దశలో తెలివైన నిర్ణయం తీసుకుంటేనే అంతా సజావుగా సాగిపోతుందని మెజారిటీ మంది అభిప్రాయం. అయితే, హాజిల్వుడ్ మాత్రం తనలో ఇంకా మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని పేర్కొనడం కొసమెరుపు.చదవండి: Ashes: మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టు ప్రకటన.. వాళ్లిద్దరిపై వేటు
IPL 2026 Auction LIVE Updates: యూపీ ఆటగాడికి జాక్ పాట్.. ఏకంగా రూ.14.20 కోట్లు
IPL 2026 Auction LIVE Updates And Highlights: అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగుతోంది.👉నమన్ తివారీని కోటిరూపయాలకు లక్నో సొంతం చేసుకుంది.👉అన్క్యాప్డ్ ప్లేయర్లు ముకుల్ చౌదరిని రూ. 2.60 కోట్లకు లక్నో, తేజస్వీ సింగ్ను రూ.3 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.కార్తీక్ శర్మకు రూ. 14. 25 కోట్లుఐపీఎల్-2026 వేలంలో మరో అన్క్యాప్డ్ ప్లేయర్ పంట పండింది. రాజస్తాన్కు చెందిన కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.యూపీ ఆటగాడికి జాక్ పాట్.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అన్క్యాప్డ్ ఆటగాడు ప్రశాంత్ వీర్పై కాసుల వర్షం కురిసింది. రూ.14.20 కోట్ల భారీ ధరకు సీఎస్కే కొనుగోలు చేసింది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్కేతో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివరికి ఈ యువ ఆటగాడు సీఎస్కే సొంతమయ్యాడు.భారత వెటరన్ ప్లేయర్ విజయ్ శంకర్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు.అన్క్యాప్డ్ ప్లేయర్కు భారీ ధర..జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి ఊహించని ధర దక్కింది. రూ.30 లక్షల బేస్ప్రైస్తో వేలంలోకి వచ్చిన నబీని రూ.8.4 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.👉విండీస్ స్పిన్నర్ అకిల్ హోస్సేన్ను రూ.2 కోట్ల కనీస ధరకు సీఎస్కే సొంతం చేసుకుంది.బిష్ణోయ్కు భారీ ధర..భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ను రూ. 7.20 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.👉సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను రూ. 2 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.పతిరానాకు జాక్పాట్..శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరానాను రూ. 18 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఆర్సీబీలోకి కివీ స్టార్ పేసర్న్యూజిలాండ్ స్టార్ పేసర్ జాకబ్ డఫీని రూ.2 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.ఢిల్లీ క్యాపిటల్స్లోకి డకెట్..బెన్ డకెట్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా.. అలెన్ను కేకేఆర్ దక్కించుకుంది. వీరిద్దరూ రూ. 2 కోట్ల బెస్ ప్రైస్కు అమ్ముడుపోయారు.ముంబైలోకి డికాక్..సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ను రూ. కోటి రూపాయల కనీస ధరకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.👉దీపక్ హుడా, కేఎస్ భరత్ అన్సోల్డ్గా మిగిలిపోయారు.ఆర్సీబీలోకి వెంకటేశ్ అయ్యర్..భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను రూ.7 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడ్డాయి. కేకేఆర్, లక్నో పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ బెంగళూరు ఫ్రాంచైజీలోకి చేరాడు.లక్నోలోకి హసరంగశ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగాను రూ. 2 కోట్ల బెస్ప్రెస్కు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.👉ఇంగ్లండ్ క్రికెటర్ గస్ అట్కిన్సన్, కివీస్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్, లైమ్ లివింగ్ స్టోన్, అమ్ముడుపోలేదు.సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. కనీస ధర రూ.75లక్షలతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేదు.గ్రీన్కు కళ్లు చెదిరే ధర.. రూ. 25.20 కోట్లకు కేకేఆర్ సొంతంఊహించినట్లుగానే ఆసీస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్పై కాసులు వర్షం కురిసింది. గ్రీన్ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతానైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అతడిని దక్కించుకునేందుకు మొదటిలో కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత రాయల్స్ పోటీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సీఎస్కే, కేకేఆర్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ జరిగింది. ఆఖరిలో సీఎస్కే రేసు నుంచి తప్పుకోవడంతో గ్రీన్ కేకేఆర్ సొంతమయ్యాడు.పృథ్వీ షా అన్సోల్డ్..టీమిండియా ప్లేయర్ పృథ్వీ షాకు మరోసారి నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన షాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అతడితో పాటు కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం అమ్ముడు పోలేదు.ఢిల్లీకి డేవిడ్ మిల్లర్ఐపీఎల్-2026 మినీ వేలంలో అమ్ముడుపోయిన తొలి ప్లేయర్గా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. మిల్లర్ను రూ.2 కోట్ల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.మెక్గర్క్కు షాక్..ఐపీఎల్-2026 మినీ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలోకి వచ్చిన తొలి ప్లేయర్గా ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రెజర్ మెక్గర్క్ నిలిచాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.మరి కాసేపట్లో ఐపీఎల్ వేలం..ఐపీఎల్-2026 మినీ వేలం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 77 స్ధానాలను గాను ఈ వేలం జరగనుంది. ఈ వేలంలో మొత్తం 369 ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ తర్వాత స్ధానంలో చెన్నై సూపర్ కింగ్స్(43.4 కోట్లు) నిలిచింది. పది ఫ్రాంఛైజీల్లో రూ.2.75 కోట్ల పర్స్తో ముంబై ఇండియన్స్ చివరిస్థానంలో ఉంది. గ్రీన్పై అందరి కళ్లు?ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసే అవకాశముంది. గతేడాది సీజన్కు దూరంగా ఉన్న గ్రీన్ను ఈసారి తమ జట్టులోకి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ముఖ్యంగా కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ ఉంది. అతడితో రవి బిష్ణోయ్, వెంకటేష్ అయ్యర్, డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్స్టోన్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కనున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ..
మలేషియాతో మ్యాచ్లో భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్తో బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం పాతిక బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా.. మంగళవారం మలేషియాతో మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది.దుబాయ్ వేదికగా ఈ యూత్ వన్డేలో భారత ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (7 బంతుల్లో 14) నిరాశపరచగా.. వైభవ్ (Vaibhav Suryavanshi)మాత్రం తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీఅయితే, హాఫ్ సెంచరీ పూర్తైన వెంటనే వైభవ్ సూర్యవంశీ అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. మలేషియా బౌలర్ ముహమ్మద్ అక్రమ్ బౌలింగ్లో ముహమ్మద్ ఎన్ ఉర్హానిఫ్నకు క్యాచ్ ఇవ్వడంతో అతడి ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా ఆయుశ్తో కలిసి వైభవ్ తొలి వికెట్కు 9 బంతుల్లో 21... రెండో వికెట్కు విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra)తో కలిసి 26.. వేదాంత్తో కలిసి మూడో వికెట్కు 40 పరుగులు జోడించాడు.అర్ధ శతకాలు పూర్తిఇదిలా ఉంటే.. మలేషియాతో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన విహాన్ మల్హోత్రా (7) విఫలం కాగా.. మిగిలిన వారిలో వేదాంత్ త్రివేది (90) తృటిలో సెంచరీ చేజార్చున్నాడు. అభిజ్ఞాన్ కుందు ఏకంగా అజేయ డబుల్ సెంచరీ (125 బంతుల్లో 209)తో దుమ్ములేపాడు. ఫలితంగా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు సాధించింది యువ భారత్.కాగా గ్రూప్-ఎలో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో యూఏఈని 234 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అనంతరం దాయాది పాకిస్తాన్పై 90 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ క్రమంలో సెమీ ఫైనల్కు అర్హత సాధించిన భారత్.. మంగళవారం నామమాత్రపు మ్యాచ్లో మలేషియాను ఓడించి అజేయంగా నిలవాలని పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే.. యూఏఈపై శతక్కొట్టిన వైభవ్.. పాక్తో మ్యాచ్ (5)లో మాత్రం విఫలమయ్యాడు.చదవండి: సర్ఫరాజ్కు జాక్పాట్!.. మాక్ వేలంలో అమ్ముడు పోయిన ప్లేయర్లు వీరే
కోల్కతాలో అలా.. ముంబైలో ఇలా..
ఎవరైనా బాగా పనిచేస్తే ప్రశంసలు దక్కడం సహజం. మీరిక్కడ చూస్తున్న ఫొటో అలాంటి సందర్భంలోదే. ముంబై పోలీసులను ఫుట్బాల్ అభిమానులు మెచ్చుకుంటున్న దృశ్యంలోని ఫొటోలివి. వాంఖడే స్టేడియం వద్ద ఆదివారం అరుదైన దృశ్యాలు కనిపించాయి. వందలాది మంది అభిమానులు పోలీసుల ఎదుట గుమిగూడి చప్పట్లు కొడుతూ.. 'థ్యాంక్యు' అంటూ నినదించారు. అంతమంది తమను పొగుడుతుంటే ముంబై పోలీసులు చిరునవ్వులు చిందిస్తూ చూస్తుండి పోయారు.అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లయోనల్ మెస్సీ (Lionel Messi).. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు. ఆయనను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ మెస్సీ పలకరించడంతో వారంతా ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మెస్సీతో పాటు స్టేడియంలో ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ అదనపు ఆకర్షణగా నిలిచారు. వీరందరినీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.చప్పట్లు కొడుతూ.. థ్యాంక్స్కార్యక్రమాలన్నీ సజావుగా సాగడంతో వాంఖడే స్టేడియానికి వచ్చిన అభిమానులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేడియం నుంచి వెళుతూ ముంబై పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారని మెచ్చుకున్నారు. ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా (Viral) మారాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ముంబై పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై పోలీసు సిబ్బంది బాగా పనిచేస్తారని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.అర్థమవుతోందా?''శాంతిభద్రతల నిర్వహణ పరంగా ముంబై పోలీసు (Mumbai Police) వ్యవస్థ ఉత్తమమైనది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. వారు ప్రతిదీ సజావుగా నిర్వహిస్తార''ని ఓ నెటిజన్ ప్రశంసించారు. "నిస్సందేహంగా ఇది ఉత్తమ పోలీసు విభాగం, ఏడాది పొడవునా వారు ఇంత మంది ప్రజలను దారిలో పెడుతుంటారు. ఇది వారికి మామూలు రోజు లాంటిదేన''ని మరొకరు మెచ్చుకున్నారు. ''గౌరవం హృదయం లోపలి నుండి రావాలి. మీరు వారిని అర్థం చేసుకోవాలి'' అంటూ కోల్కతా పోలీసులను ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pratik Pawaskar (@pawaskarpratik)కోల్కతాలో ఏం జరిగింది?శనివారం కోల్కతాలోని సాల్ట్లేక్ సేడియంలో మెస్సీ అభిమానులు (Messi Fans) విధ్వంసం సృష్టించారు. మెస్సీ కోసం ఎంతోగానే ఎదురు చూసిన అభిమానులను నిరాశకు గురిచేయడంతో వారంతా తీవ్రంగా స్పందించారు. తమ ఆరాధ్య ఫుట్బాలర్ పట్టుమని 10 నిమిషాలు కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రశావేశాలకు లోనయ్యారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలను మైదానంలోకి విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. అభిమానుల వీరంగంతో సాల్ట్లేక్ సేడియం రణరంగంగా మారిపోయింది. అభిమానులను నియంత్రించలేక కోల్కతా పోలీసులు చేతులెత్తేశారు. మరోవైపు ఈవెంట్ నిర్వాహకుడు శరత్రు దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పౌరుల ప్రవర్తన, ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై మెస్సీకి క్షమాపణలు చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కాగా, అభిమానులకు టిక్కెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేస్తామని నిర్వహకుడు ప్రకటించడం గమనార్హం.చదవండి: మెస్సీ అందుకే ఇండియాలో మ్యాచ్లు ఆడలేదు!
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలమే హాట్టాపిక్. అబుదాబి వేదికగా మంగళవారం వేలం పాటకు రంగం సిద్ధమైంది. అన్ని ఫ్రాంఛైజీలలో కలిపి మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు పోటీలో ఉన్నారు.ఇంతకీ అసలు ఈ వేలంపాట ఎందుకు నిర్వహిస్తారు? ఆటగాళ్లను మార్చుకోకుండా.. ఆక్షన్ ద్వారానే ఎందుకు కొనుగోలు చేస్తారు? బిడ్డింగ్ ఎలా జరుగుతుంది? తదితర పన్నెండు ఆసక్తికర అంశాలు ఈ సందర్భంగా తెలుసుకుందాం!ఎందుకీ ఐపీఎల్ వేలం?లీగ్లో భాగమైన పది ఫ్రాంఛైజీలు.. వచ్చే సీజన్కు గానూ తమ జట్లను నిర్మించుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం బిడ్లు వేస్తాయి. తమ పర్సులో ఉన్న మొత్తం ద్వారా వేలంలో అందుబాటులో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.వేలం ఎవరు నిర్వహిస్తారు?భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ వేలాన్ని నిర్వహిస్తుంది. ఇండిపెండెంట్ ఆక్షనీర్ వేలంపాట పాడతారు. నిబంధనలకు అనుగుణంగా బిడ్లను పూర్తి చేసేలా చూసుకుంటారు. తొలుత పురుషులు మాత్రమే ఐపీఎల్ ఆక్షనీర్లుగా ఉండగా.. గత కొంతకాలంగా మల్లికా సాగర్ ఆక్షనీర్గా సత్తా చాటుతున్నారు.వేలానికి బదులు సింపుల్గా ఆటగాళ్లను మార్చుకోవచ్చా?ఫ్రాంఛైజీ మధ్య పోటీతత్వం, సమాన అవకాశాలు దక్కాలంటే వేలం నిర్వహణ తప్పనిసరి. పర్సులో అధిక మొత్తం కలిగిన ఫ్రాంఛైజీలు తొలుత టాప్ ప్లేయర్లందరినీ సొంతం చేసుకుంటే.. మిగతా ఫ్రాంఛైజీల జట్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.అందుకే వేలం ద్వారానే ఆటగాళ్లను సొంతం చేసుకోవడం జరుగుతుంది. అయితే, ట్రేడింగ్ ద్వారా వేలానికి ముందు ఆటగాళ్లను మార్చుకునే వెసలుబాటు కూడా ఉంటుంది.ఐపీఎల్ వేలంలోకి ఆటగాళ్లు ఎలా వస్తారు?తమ దేశ క్రికెట్ బోర్డుల అనుమతితో ఆయా దేశాల ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో కనీస ధరతో తమ పేరును నమోదు చేసుకుంటారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమకు ఆసక్తి ఉన్న ప్లేయర్ల జాబితాను సమర్పించిన తర్వాత.. అధికారికంగా ఆటగాళ్లు వేలం బరిలో నిలుస్తారు. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఆక్షన్ పూల్లోకి రాలేరు.కనీస ధర అంటే ఏమిటి?ఓ ఆటగాడు తన స్థాయికి తగిన రీతిలో కనీస ధరతో వేలంలో నమోదు చేసుకుంటాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లు సాధారణంగా రూ. 20 లక్షలతో వేలంలోకి వస్తారు.నిజానికి వేలంలో వివిధ స్లాబులు ఉంటాయి. అయితే, కనీస ధర ఎక్కువగా ఉన్న ఆటగాళ్లు (సాధారణంగా రూ. 2 కోట్లతో స్టార్లు మాత్రమే ఉంటారు) సెలక్షన్ గ్యారెంటీ అనేమీ ఉండదు. ఫామ్ దృష్ట్యా ఫ్రాంఛైజీలు ఒక్కోసారి కనీస ధర అత్యంత తక్కువగా ఉన్న ఆటగాళ్లను కూడా కొనుగోలు చేస్తాయి.అదే విధంగా తమ జట్టుకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తాయి. అంతేకాదు ఆటగాడి వయసు కూడా ఇక్కడ కీలకమే.బిడ్డింగ్ వర్క్ ఎలా జరుగుతుంది?ఆక్షనీర్ ఆటగాడి పేరు చదవగానే.. సదరు ప్లేయర్పై ఆసక్తి ఉన్న ఫ్రాంఛైజీలు తమ పెడల్స్ను ఎత్తుతాయి. ఆటగాడిని దక్కించుకోవాలని భావిస్తే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడుతూ ధరను పెంచుతూ పోతాయి. ఆఖరికి మిగతా వారితో పోలిస్తే అధిక ధర పలికిన ఫ్రాంఛైజీకే ప్లేయర్ దక్కుతాడు.పర్సు విలువ సమానమేనా?లీగ్లోని ప్రతి ఫ్రాంఛైజీ పర్సు విలువ సమానంగానే ఉంటుంది. తమకు కేటాయించిన మొత్తం నుంచే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అదే విధంగా విదేశీ ప్లేయర్ల సంఖ్యకు కూడా ఓ పరిమితి ఉంటుంది.రిటెన్షన్, రిలీజ్లు!వేలానికి ముందు తాము అట్టిపెట్టుకోవాలనుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు నిర్ణీత గడువులోగా సమర్పిస్తాయి. అదే విధంగా.. తమకు అవసరం లేదనుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదులుతాయి. ఈ క్రమంలో పర్సులో మిగిలిన మొత్తం ఆధారంగా వేలంలో తమ వ్యూహాలను అమలు చేస్తాయి.అయితే, రిలీజ్ చేసిన ఆటగాడిని తిరిగి దక్కించుకునేందుకు రైట్ టు మ్యాచ్ (RTM) నిబంధన ద్వారా ఫ్రాంఛైజీలకు వెసలుబాటు ఉంటుంది. అంటే.. తాము వదిలేసిన ఆటగాడు సరసమైన ధరకే తిరిగి తమకు దొరికే క్రమంలో.. ఇతర ఫ్రాంఛైజీ ఎంత మొత్తమైతే చెల్లిస్తుందో అదే ధరకు అతడిని తిరిగి తాము కొనుగోలు చేసుకోవచ్చు.మినీ వేలం అంటే?జట్లలో స్వల్ప మార్పుల నిమిత్తం నిర్వహించేదే మినీ వేలం. రీషఫిల్లో భాగంగా ఫ్రాంఛైజీలు డెత్ ఓవర్ బౌలర్లు, పవర్ హిట్టర్లు, మణికట్టు స్పిన్నర్లు.. వంటి కచ్చితమైన నైపుణ్యాలున్న కొంతమంది ఆటగాళ్ల కోసం పోటీపడతాయి.అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా భారీ మొత్తం ఎలా?అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉండి.. తమ జట్టులో ఇమిడిపోతాడనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్లను సైతం ఫ్రాంఛైజీలు భారీ మొత్తం వెచ్చించేందుకు వెనుకాడవు. ముఖ్యంగా ఇలాంటి యువ ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తాయి. తద్వారా వారిని తమ జట్టులో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం భాగం చేసుకునే వీలు కలుగుతుంది. ఇందుకు రాజస్తాన్ రాయల్స్ గతేడాది మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ అనే పద్నాలుగేళ్ల పిల్లాడిని రూ. 1.10 కోట్లకు కొనడం నిదర్శనం. అందుకు తగ్గట్లే విధ్వంసకర శతకంతో ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అమ్ముడుపోకుండా ఉంటారెందుకు?ఫామ్లేమి, ఆటలో నిలకడలేకపోడం.. కనీస ధర అర్హత కంటే అధికంగా ఉందని ఫ్రాంఛైజీలు భావించడం వల్ల కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతారు. ఆటగాడి వయసు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ల కొనుగోలు అంశాన్ని ప్రభావితం చేశాయి.మరి ఆ ఆటగాడి పరిస్థితి ఏమిటి?తొలి రౌండ్లలో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన ఆటగాడు.. ఫ్రాంఛైజీల ఆసక్తి దృష్ట్యా తదుపరి ఆక్సిలెరేటెడ్ రౌండ్లో వేలంలోకి వస్తారు. అప్పటికీ అమ్ముడుపోకుండా ఉంటే.. ఎవరైనా ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో వీరిని ఏ ఫ్రాంఛైజీ అయినా రీప్లేస్మెంట్గా తీసుకుంటుంది. అదీ జరగదలేదంటే.. ఆసారికి సదరు ప్లేయర్ ఐపీఎల్లో భాగం కాడు.ఇక ఐపీఎల్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉందో.. వేలానికి కూడా అంతే ఆదరణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన ఆటగాడు, జట్ల కూర్పు తదితర అంశాల దృష్ట్యా క్రికెట్ ప్రేమికులు వేలం పూర్తయ్యేవరకు స్క్రీన్లకే అతుక్కుపోతారనడంలో అతిశయోక్తిలేదు.చదవండి: IPL 2026 Auction: ఐపీఎల్ వేలంలో మనోళ్లు 17 మంది.. అదృష్టం వరించేనా
Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్తో ఆసీస్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చినట్లు తెలిపింది. 2-0తో ఆధిక్యంలోకాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా కమిన్స్ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వరుస విజయాలు అందుకున్నాడు.ఫలితంగా ఆసీస్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్ టెస్టులో నాథన్ లియోన్ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్లో జరిగిన పింక్ బాల్ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్లో పేసర్లు బ్రెండన్ డాగట్ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్ నెసర్ (Michael Neser) రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నెసర్, డాగట్లపై వేటు.. ఖవాజాకు షాక్ అయితే, మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్ లియోన్కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్, డాగట్లపై వేటు పడింది. పిచ్ స్వభావం దృష్ట్యానే నాథన్ కోసం నెసర్ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది. అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను కూడా మేనేజ్మెంట్ మరోసారి పక్కనపెట్టింది. ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- జేక్ వెదరాల్డ్ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్ వేదిక.ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టుట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో జోష్ టంగ్ ఆసీస్ జరిగే యాషెస్ సిరీస్ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్ గుస్ అట్కిన్సన్ స్థానంలో మరో బౌలర్ జోష్ టంగ్ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్కు మరోసారి నిరాశ ఎదురైంది. భారత్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన జోష్ టంగ్ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్కిది రెండో యాషెస్ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్ జరిగిన మ్యాచ్లో తొలిసారి ‘యాషెస్’ టెస్టు ఆడిన టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ జట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, విల్ జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్. చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే?
నాన్న తోడుగా నిలువగా..
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇటీవల జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ను నిలబెట్టుకున్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఎట్టకేలకు ఈ సీజన్ను సంతృప్తికరంగా మలచుకుంది. రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సెమీఫైనలిస్టుగా నిలిచిన ఈ హైదరాబాద్ జోడీకి ఈ సీజన్ ఆరంభం నుంచి కలిసిరాలేదు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఈవెంట్లో క్వార్టర్స్లోనే వెనుదిరిగిన గాయత్రి–ట్రెసా ద్వయం స్విస్ ఓపెన్లో సెమీస్లోనే ఆగిపోయింది. తర్వాత జూన్లో గాయత్రి భుజం గాయంతో ఈ జోడీ మకావు ఓపెన్ నుంచి నిష్క్రమించి, ఇంటికే పరిమితమైంది. ఎట్టకేలకు తాజా లక్నో ఈవెంట్లో లభించిన టైటిల్ వీళ్లిద్దరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దీనిపై గాయత్రి మాట్లాడుతూ ఓపిక, పట్టుదల, అంకితభావానికి లభించిన టైటిల్గా అభివర్ణించింది. పలు అంశాలపై గాయత్రి, ట్రెసా జాలీ అభిప్రాయాలు వారి మాటల్లోనే...నాన్న తోడుగా నిలువగా... ఈ ఏడాది భుజం గాయం చాలా ఇబ్బంది పెట్టింది. సీజన్లో సుదీర్ఘకాలం ఆటకు దూరం చేసింది. రెండు నెలలకు పైగా విరామం తర్వాత మళ్లీ ఆడటం ప్రారంభించాను. ఇలాంటి సమయంలో సయ్యద్ మోడీ టైటిల్ నా ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. నా ఆట సరైన దిశలో సాగుతోందనిపించేలా చేసింది. నా ప్రదర్శన, ఫామ్పై నమ్మకాన్ని రెట్టింపు చేసింది. కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైంది. ముఖ్యంగా నాన్న పుల్లెల గోపీచంద్ ఎంతో శ్రద్ధ పెట్టాడు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఎప్పటికప్పుడు తోడుగా నిలిచాడు.కోటి ఆశలతో కొత్త సీజన్కు... మా జోడీకి ఈ సీజన్ గడ్డుగా గడిచింది. కానీ ఒక్క టైటిల్ సాఫల్యం మమ్మల్ని నిలబడేలా చేసింది. కొత్త ఆశలతో వచ్చే సీజన్ను ప్రారంభించేందుకు దోహదం చేసింది. ఈ ఏడాది మేం 13 వారాలపాటు (మూడు నెలలకు పైగానే) తొమ్మిదో ర్యాంక్తో టాప్–10లో కొనసాగాం. వచ్చే ఏడాది కూడా టాప్–10లో మరెంతో కాలం నిలిచేందుకు, నిలకడైన ఆటతీరుతో రాణించేందుకు నేను ట్రెసా జాలీ కష్టపడతాం. టైటిల్, టాప్–10 ర్యాంక్ మా ప్రదర్శనకు తగిన ప్రతిఫలంగా భావిస్తాం. ట్రెసా మిక్స్డ్లోనూ రాణించేందుకు శ్రమిస్తోంది. ప్రతీ ఈవెంట్లో ‘మిక్స్డ్’ కష్టమే... గాయత్రి గాయంతో దూరమవడంతో మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగాను. ఇది ఎంతకాలం కొనసాగిస్తానో చెప్పడం కష్టం. ముఖ్యంగా మేటి టోరీ్నల్లో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలను సమన్వయం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది. కోర్టులో గాయత్రితో నా సమన్వయం చక్కగా సాగుతోంది. ప్రతి టోర్నీపై మాకు స్పష్టమైన వైఖరి ఉంది. కాబట్టే ముందు మహిళల డబుల్స్కే ప్రాధన్యమిస్తాను. దీంతో పాటే మిక్స్డ్లో కొనసాగుతాను. ఆటలో ఏదీ అంతా సులువు కాదని నాకు తెలుసు. అందుకే ప్రతీరోజు కష్టపడాల్సి ఉంటుంది. –ట్రెసా జాలీ .చదవండి: Lionel Messi Net Worth 2025: నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. మెస్సీ నెట్వర్త్ ఎంతో తెలుసా?
సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ
ముంబై: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్స...
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మె...
సింగిల్స్ చాంప్స్ ఉన్నతి, కిరణ్
కటక్: ఒడిశా మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్...
చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ జట్టు... తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సొంతం
చెన్నై: స్వదేశంలో భారత స్క్వాష్ జట్టు చిరస్మరణీయ ...
IPL: అసలు ఎందుకీ వేలం?.. పన్నెండు ఆసక్తికర అంశాలు
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ ...
Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో మూడో టెస్టుకు...
శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి భారీ షాక్!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ చిక్కుల్లో...
IPL 2026: రచిన్కు షాక్.. అత్యధిక ధర పలికింది వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలానికి ...
క్రీడలు
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
వీడియోలు
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
సానియా మీర్జా లానే స్మృతి మంధాన కూడా..!
Cricket: ఫైనల్లో దుమ్ములేపిన సాక్షి టీమ్ TV9పై ఘన విజయం
