ప్రధాన వార్తలు
ఇటలీదే డేవిస్ కప్
బొలోగ్నా (ఇటలీ): పురుషుల టెన్నిస్ ప్రపంచకప్ టోర్నమెంట్ ‘డేవిస్ కప్’లో డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ జట్టు విజేతగా నిలిచింది. స్టార్ ప్లేయర్ జానిక్ సినెర్ బరిలోకి దిగకుండగానే ఇటలీ జట్టు వరుసగా మూడో సారి డేవిస్ కప్ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో స్పెయిన్ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో మాటియో బెర్టిని, ఫ్రావియో కొబొలి విజయాలు సాధించడంతో డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకుండానే ఇటలీ విజయం సాధించింది. ఇటలీ జట్టు డేవిస్ కప్ కైవసం చేసుకోవడం ఓవరాల్గా ఇది నాలుగోసారి కాగా... వరుసగా మూడోసారి. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ టోర్నమెంట్లో చివరగా అమెరికా జట్టు 1968 నుంచి 1972 వరకు వరుసగా ఐదు సార్లు చాంపియన్గా నిలవగా... ఆ తర్వాత మరే జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేయలేదు. గత రెండు సంవత్సరాలు ఇటలీ జట్టు డేవిస్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ రెండో ర్యాంకర్ సినెర్ ఈ సారి బరిలోకి దిగకపోయినా... బెర్టిని, కొబొలి చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు విజయం సాధించింది. తొలి సింగిల్స్ మ్యాచ్లో బెర్టిని 6–3, 6–4తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై విజయం సాధించగా... రెండో సింగిల్స్ పోరులో కొబొలి 1–6, 7–6 (7/5), 7–5తో జామె మునార్ (స్పెయిన్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియాపై 2–0తో విజయం సాధించిన ఇటలీ... సెమీఫైనల్లో బెల్జియంపై కూడా 2–0తో గెలుపొందింది. మరోవైపు ప్రపంచ నంబర్వన్ కార్లోస్ అల్కరాజ్ లేకుండానే స్పెయిన్ బరిలోకి దిగింది. 2019 తర్వాత తొలిసారి ఫైనల్ ఆడిన ఆరుసార్లు చాంపియన్ స్పెయిన్ జట్టు రన్నరప్తోనే సరిపెట్టుకుంది.
కబడ్డీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఢాకా: ప్రపంచకప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్లో భారత జట్టు విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన మెగా టోర్నిలో రీతూ నేగి సారథ్యంలోని భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకొని మట్టి ఆటలో మన ఆధిక్యాన్ని చాటింది. సోమవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు 35–28 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీని చిత్తు చేసింది. మొత్తం 11 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ సెమీఫైనల్లో పటిష్ట ఇరాన్ జట్టును మట్టికరిపించిన మన అమ్మాయిలు... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిన భారత జట్టు... అటు రైడింగ్, ఇటు ట్యాక్లింగ్లో ఆకట్టుకుంది. 2012లో భారత్ వేదికగా జరిగిన తొలి ప్రపంచకప్లో ఇరాన్పై గెలిచి చాంపియన్గా నిలిచిన టీమిండియా... ఇప్పుడు రెండో సారి ట్రోఫీ హస్తగతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం రాణించిన భారత జట్టు... ఫైనల్లో చైనీస్ తైపీపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. చక్కటి డిఫెన్స్తో పాటు... కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ పైచేయి కొనసాగించింది. కెపె్టన్ రీతూ నేగి అన్నీ తానై జట్టును నడిపించగా... వైస్ కెపె్టన్ పుష్ప తన రైడింగ్తో కట్టిపడేసింది. జట్టుకు అవసరమైనప్పుడల్లా పాయింట్లు సాధించి ట్రోఫీ కైవసం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది. హెడ్ కోచ్ తేజస్వి ఆధ్వర్యంలో బరిలోకి దిగిన టీమిండియా... చక్కటి సమన్వయం, సమష్టితత్వంతో కట్టిపడేసింది. తుది పోరు ఆరంభంలో చైనీస్ తైపీ గట్టి ప్రతిఘటన కనబర్చే ప్రయత్నం చేసింది. అయితే పట్టువదలని టీమిండియా మ్యాచ్ 13వ నిమిషంలో ప్రత్యరి్థని ఆలౌట్ చేసి 18–15తో ముందంజ వేసింది. ఈ దశలో భారత కెపె్టన్ రీతూ నేగి గాయపడటంతో ఉత్కంఠ పెరిగినా... ఎక్కడా ఒత్తిడికి గురికాని టీమిండియా ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ మ్యాచ్పై పట్టు సాధించి జగజ్జేతగా నిలిచింది. రీతూ, పుష్పతో పాటు చంపా ఠాకూర్, భావన ఠాకూర్, సాక్షి శర్మ భారత విజయాల్లో కీలకంగా వ్యవహరించారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టుకు అన్నివైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు భారత మహిళల విజయాన్ని శ్లాఘించారు.
యాన్సెన్ జోరు...
‘కోల్కతాతో పోలిస్తే ఇక్కడి పిచ్ రోడ్డులా, బ్యాటింగ్కు బాగా అనుకూలంగా ఉంది... కాబట్టి మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు’... ఆదివారం దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైన తర్వాత భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అదే పిచ్ సోమవారానికి వచ్చే సరికి బౌలింగ్కు అనుకూలించింది. ఫలితంగా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రెండో రోజు బ్యాటింగ్తో దెబ్బ కొట్టిన మార్కో యాన్సెన్ మూడో రోజు తన బౌలింగ్ పదునుతో ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చాడు. అతని ‘షార్ట్’ బంతులను ఆడలేక బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు చేరడంతో భారత్ భారీ ఆధిక్యం కోల్పోయింది. ఇప్పటికే సఫారీలు పట్టు బిగించగా...ఓటమి వెంటాడుతుండగా ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో మన జట్టు నిలిచింది.గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులోనూ భారత్ ఓటమికి చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా భారత్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ (13 బ్యాటింగ్), మార్క్రమ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 314 పరుగులు ముందంజలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్లో మరిన్ని పరుగులు జోడించి భారత్కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఓవర్నైట్ స్కోరు 9/0తో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 83.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్కో యాన్సెన్ (6/48) చెలరేగిపోగా, హార్మర్కు 3 వికెట్లు దక్కాయి. టపటపా... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (22) తొలి గంటలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే మహరాజ్ చక్కటి బంతితో రాహుల్ను వెనక్కి పంపడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 85 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఒక దశలో భారత్ 95/1తో మెరుగైన స్థితిలో కనిపించింది. సఫారీల చక్కటి బౌలింగ్తో పాటు మన బ్యాటర్ల చెత్త షాట్లు జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చాయి. 27 పరుగుల వ్యవధిలో టీమ్ 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చక్కటి షాట్లతో దూసుకుపోతున్న జైస్వాల్ ఆటకు యాన్సెన్ క్యాచ్తో తెరపడగా, సాయి సుదర్శన్ (15) విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో యాన్సెన్ బౌలింగ్ జోరు మొదలైంది. వరుసగా జురేల్ (0), పంత్ (7), నితీశ్ రెడ్డి (10), జడేజా (6)లను అతను వెనక్కి పంపించాడు. వీటిలో పంత్ మినహా మిగతా ముగ్గురు బౌన్సర్లకే వెనుదిరిగారు! పంత్ మాత్రం ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్కు క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం... 122/7 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే గత మ్యాచ్ తరహాలోనే సుందర్ మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ (19) కూడా పట్టుదలగా క్రీజ్లో నిలబడి సహకరించాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలమని ముందు రోజు చెప్పిన కుల్దీప్ నిజంగానే క్రీజ్లో ఎలా నిలబడాలో ఆడి చూపిస్తూ ఇన్నింగ్స్లో అందరికంటే ఎక్కువగా 134 బంతులు ఎదుర్కోవడం విశేషం! ఈ జోడీ ఏకంగా 34.4 ఓవర్లు ఆడి ప్రధాన బ్యాటర్లకు పాఠం నేరి్పంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 72 పరుగులు జత చేయడంతో కాస్త పరువు నిలిచింది. సుందర్ను అవుట్ చేసి హార్మర్ ఈ జంటను విడదీయగా... తర్వాతి రెండు వికెట్లు యాన్సెన్ ఖాతాలోనే చేరాయి. 6.82 అడుగుల ఎత్తు ఉన్న యాన్సెన్ షార్ట్ బంతులను సమర్థంగా వాడుకోగా, మన బ్యాటర్లు ఆ వలలో పడ్డారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 22; సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15; జురేల్ (సి) మహరాజ్ (బి) యాన్సెన్ 0; పంత్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 7; జడేజా (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 6; నితీశ్ రెడ్డి (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 10; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 48; కుల్దీప్ (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 19; బుమ్రా (సి) వెరీన్ (బి) యాన్సెన్ 5; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (83.5 ఓవర్లలో ఆలౌట్) 201. వికెట్ల పతనం: 1–65, 2–95, 3–96, 4–102, 5–105, 6–119, 7–122, 8–194, 9–194, 10–201. బౌలింగ్: యాన్సెన్ 19.5–5–48–6, ముల్డర్ 10–5–14–0, మహరాజ్ 15–1–39–1, హార్మర్ 27–6–64–3, మార్క్రమ్ 10–1–26–0, ముత్తుసామి 2–0–2–0.5: తొలి ఇన్నింగ్స్లో ఫీల్డర్గా ఎయిడెన్ మార్క్రమ్ పట్టిన క్యాచ్ల సంఖ్య. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన 15 మంది సరసన అతను చేరగా... దక్షిణాఫ్రికా తరఫున గ్రేమ్ స్మిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
పాపం రాహుల్!.. అంత దూకుడు ఎందుకు?.. కాస్త తగ్గు సిరాజ్!
టీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) మూడో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. భారత్ను 201 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీలు.. సోమవారం నాటి ఆట ముగిసే సరికి మొత్తంగా 314 పరుగుల ఆధిక్యం సంపాదించారు.గువాహటి వేదికగా రెండో టెస్టులో భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. బౌలర్ల పేలవ ఆట తీరు వల్ల సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 489 పరుగులు చేసింది. అయితే, ఇదే వేదికపై ప్రొటిస్ బౌలర్లు మాత్రం దుమ్ములేపారు.ఆరు వికెట్లతో చెలరేగి..ముఖ్యంగా పేస్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) ఆరు వికెట్లతో చెలరేగి.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశాడు. కీలక వికెట్లు తీసి.. పంత్ సేన 201 పరుగులకే కుప్పకూలడంలో ప్రధాన భూమిక పోషించాడు. దీంతో సఫారీలకు తొలి ఇన్నింగ్స్లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా మాత్రం తామే బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. దీంతో భారత్ ఊపిరి పీల్చుకోగా.. వికెట్లు తీసేందుకు యత్నించిన బౌలర్లకు ఏమాత్రం కలిసిరాలేదు.పటిష్ట స్థితిలోనే..సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. అయితే, వెలుతురు లేమి కారణంగా అంపైర్లు కాస్త ముందుగానే ఆటను ముగించారు. బర్సపరా స్టేడియంలో సోమవారం ఆట పూర్తయ్యేసరికి ప్రొటిస్ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు.కాగా అప్పటికే బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాకు.. మూడో రోజు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడంతో సహజంగానే బౌలర్లు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కాస్త దూకుడు ప్రదర్శించగా.. కేఎల్ రాహుల్ అతడిని వారించిన తీరు హైలైట్గా నిలిచింది.ఫ్రస్టేషన్లో సిరాజ్ మియా.. వైల్డ్ త్రోప్రొటిస్ రెండో ఇన్నింగ్స్లో సోమవారం నాటి ఆఖరి ఓవర్ (8)ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని రికెల్టన్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. సిరాజ్ బంతిని అందుకున్నాడు. అయితే, అప్పటికే ఫ్రస్టేషన్లో ఉన్న సిరాజ్ మియా.. వికెట్ కీపర్ రిషభ్ పంత్ వైపు వైల్డ్గా బాల్ త్రో చేశాడు.పంత్ ఆ బంతిని మిస్ కాగా.. స్లిప్స్లో అతడి వెనకే ఉన్న కేఎల్ రాహుల్ కష్టమ్మీద బంతిని ఒడిసిపట్టాడు. ఆ సమయంలో సిరాజ్ తన దూకుడు పట్ల పశ్చాత్తాపంగా నాలుక కరచుకోగా.. ‘అంత దూకుడు ఎందుకు.. కాస్త తగ్గు.. నెమ్మదిగా వెయ్’ అన్నట్లు రాహుల్ సైగ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాగా ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ రెండు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.చదవండి: ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లేpic.twitter.com/xq4i771JXV— Nihari Korma (@NihariVsKorma) November 24, 2025
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత మహిళా కబడ్డీ జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్కప్ టైటిల్ గెలిచి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు.క్రమశిక్షణ, అంకిత భావానికి నిదర్శనంవరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడం మన అమ్మాయిల క్రమశిక్షణ, ఆట పట్ల వారికి ఉన్న నిబద్ధత, సమిష్టితత్వానికి నిదర్శనమని వైఎస్ జగన్ ప్రశంసించారు. క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటూ భారత మహిళా కబడ్డీ జట్టును అభినందించారు.వరుసగా రెండోసారికాగా బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా మహిళల కబడ్డీ ప్రపంచకప్-2025 ఫైనల్లో భారత జట్టు.. చైనీస్ తైపీని ఓడించి చాంపియన్గా అవతరించింది. పన్నెండు జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్.. గ్రూప్ దశ నుంచి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ కైవసం చేసుకుంది. భారత్కు వరుసగా ఇది రెండో టైటిల్ కావడం విశేషం. Hearty congratulations to our Indian Women’s Kabaddi Team for winning the World Cup and making the nation proud. Winning the world championship for the second time in a row shows the discipline, determination and teamwork of our girls.It is truly heartening to see women in… pic.twitter.com/BFgv4u0AQg— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2025
వన్డేలకు అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?: మాజీ క్రికెటర్
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (Anil Kumble) విమర్శించాడు. సౌతాఫ్రికాతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటిచ్చిన సెలక్టర్లు.. అర్హుడైన మరో ఆటగాడిని మాత్రం ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించాడు. టెస్టుల్లో ఆడుతున్నాడనే కారణంతో ధ్రువ్ జురెల్ను వన్డేలకు కూడా సెలక్ట్ చేయడం సరికాదని విమర్శించాడు. కాగా సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదివారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో సీనియర్ బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ (KL Rahul)ను కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగుతుండగా... ఆ తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆదివారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.వాళ్లు దూరం.. వీరికి విశ్రాంతిఈ నెల 30న రాంచీలో తొలి వన్డే, డిసెంబర్ 3న రాయ్పూర్లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో మూడో వన్డే జరుగుతాయి. సఫారీలతో తొలి టెస్టు సందర్భంగా గిల్ గాయపడగా... శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా అంతకుముందే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో గతంలో 12 మ్యాచ్ల్లో జట్టుకు సారథ్యం వహించిన రాహుల్కు మరోసారి అవకాశం దక్కింది.సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు విశ్రాంతినివ్వగా... రవీంద్ర జడేజా ఎనిమిది నెలల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాన్నాళ్ల తర్వాత బ్లూ జెర్సీలో సొంత అభిమానుల ముందు మైదానంలో అడుగు పెట్టనున్నారు.సంజూకు దక్కని చోటుఅయితే, ఈ జట్టులో సంజూ శాంసన్ పేరు మాత్రం లేదు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరఫున వన్డే ఆడిన సంజూ.. సెంచరీ చేశాడు. అది కూడా సౌతాఫ్రికా గడ్డపై శతక్కొట్టాడు. కానీ ఆ తర్వాత అతడికి మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కనే లేదు. తాజాగా స్వదేశంలో ప్రొటిస్ జట్టుతో సిరీస్లో ఆడిస్తారని భావించగా.. మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ సంజూకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఈ జట్టులో ఒక పేరు కచ్చితంగా ఉండాలని నేను కోరుకున్నాను. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. దాదాపు రెండేళ్ల క్రితం వన్డే ఆడిన అతడు శతకంతో చెలరేగాడు.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?కానీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు సెలక్ట్ చేస్తారని భావించా. ఆడిన చివరి మ్యాచ్లో శతకం బాదిన ఆటగాడు జట్టులో చోటుకైనా అర్హుడు’’ అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. కాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు వికెట్ కీపర్ బ్యాటర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికయ్యారు. సీనియర్ అయిన సంజూను కాదని.. వన్డేలో టీమిండియాకు ఆడిన అనుభవం లేని జురెల్కు సెలక్టర్లు చోటు ఇవ్వడం గమనార్హం. కాగా జురెల్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 టెస్టులు, 4 టీ20 మ్యాచ్లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 457, 12 పరుగులు చేశాడు.సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టుకేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్. చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
కబడ్డీ వరల్డ్కప్ విజేతగా భారత్
మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ గెలుపు జెండా ఎగురవేసింది. చైనీస్ తైపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి చాంపియన్గా అవతరించింది.వరుసగా రెండోసారిబంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరిగిన టైటిల్ పోరులో భారత్ తొలి అర్ధ భాగంలో 20-16తో ఆధిక్యం సంపాదించింది. సంజూ దేవి సూపర్ రెయిడ్లో నాలుగు పాయింట్లు తెచ్చి సత్తా చాటగా.. సారథి రీతూ నేగి ట్యాకిల్కు యత్నించి గాయపడింది. ఇక సెకండాఫ్లోనూ భారత్ తమ పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నించింది. అయితే, చైనీస్ తైపీ కూడా అంత తేలికగా తలొగ్గలేదు.సమయం ముగియడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందన్న సమయంలోనూ చైనీస్ తైపీ పోరాట పటిమ కనబరిచింది. అయితే, భారత జట్టు వారికి మరో అవకాశం ఇవ్వలేదు. 35-28తో చైనీస్ తైపీని ఓడించి జగజ్జేతగా అవతరించింది. తద్వారా..డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. వరుసగా రెండోసారి వరల్డ్కప్ టైటిల్ సొంతం చేసుకుని సత్తా చాటింది.గుత్తాధిపత్యం మనదేకాగా భారత పురుషుల కబడ్డీ జట్టు కూడా ఇప్పటికి మూడు ప్రపంచకప్ టోర్నీలు జరుగగా.. మూడింట చాంపియన్గా నిలిచింది. మహిళా జట్టు సైతం అదే పరంపరను కొనసాగించడం విశేషం. ఇప్పటికి ఓవరాల్గా ఐదు ప్రపంచకప్ టోర్నీ (3 పురుష, 2 మహిళలు)లు జరుగగా ఐదింట భారత్దే విజయం. కబడ్డీలో మన గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నందుకు ఇరుజట్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఆఖరి వరకు అజేయంగాఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో భారత్ అన్ని మ్యాచ్లు గెలిచింది, గ్రూప్-‘ఎ’ నుంచి నాలుగుకు నాలుగు గెలిచి అజేయంగా నిలిచింది. మరోవైపు.. గ్రూప్-‘బి’లో చైనీస్ తైపీ సైతం ఐదు మ్యాచ్లలోనూ గెలిచింది. ఇక సెమీ ఫైనల్లో భారత్ ఇరాన్ను 33-21 పాయింట్ల తేడాతో ఓడించగా.. మరో సెమీస్ మ్యాచ్లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా ఇరుజట్లు ఫైనల్ చేరగా భారత్- చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది. కాగా ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొన్నాయి. ఆసియా నుంచి భారత్, ఇరాన్, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, నేపాల్, థాయ్లాండ్ భాగం కాగా.. ఆఫ్రికా నుంచి కెన్యా, ఉగాండా, జాంజిబార్.. యూరోప్ నుంచి పోలాండ్, జర్మనీ.. దక్షిణ అమెరికా నుంచి అర్జెంటీనా పాల్గొన్నాయి.మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నీ-2025లో పాల్గొన్న భారత జట్టురీతూ నేగి (కెప్టెన్), పుష్ఫ రాణా (వైస్ కెప్టెన్), సొనాలి షింగాటే, పూజా నర్వాల్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ, పూజా కజ్లా, చంపా ఠాకూర్, రీతూ షోరేన్, రీతూ మిథర్వాల్, సంజూ దేవి, ధనలక్ష్మి, అనూ కుమారి.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్🚨 THIS IS PRETTY HUGE NEWS FOLKS 💥WORLD CUP WINNING MOMENTS FOR INDIA 🏆Indian Women's Team defeated Chinese Taipei 35-28 in the Finals of Kabaddi World Cup 2025!Our Girls successfully defends the Trophy 🇮🇳💙 pic.twitter.com/rEp45Qu6aW— The Khel India (@TheKhelIndia) November 24, 2025
ఇలా ఎవరైనా చేస్తారా?: పంత్పై మండిపడ్డ కుంబ్లే
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్రంగా నిరాశపరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవాల్సిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. క్రీజులో కుదురుకుంటాడని అనుకునే లోపే.. వికెట్ పారేసుకుని పెవిలియన్ చేరాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించాడు.గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND vs SA) మధ్య శనివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు టీమిండియా ధీటుగా బదులు ఇవ్వలేకపోయింది.దారుణంగా విఫలంసఫారీ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా కేవలం 201 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (58)తో రాణించగా.. కేఎల్ రాహుల్ 22 పరుగులు చేయగలిగాడు. సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) ఇలా వచ్చి అలా వెళ్లారు.పంత్ తొందరపాటు.. రివ్యూ కూడా వేస్ట్ఇక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 48 పరుగులతో భారత టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. టెయిలెండర్ 134 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయగలిగాడు. దీంతో భారత్ కనీసం 200 పరుగుల మార్కు దాటగలిగింది. నిజానికి పంత్ అనవసరపు షాట్కు యత్నించి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది.భారత ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ప్రొటిస్ పేసర్ మార్కో యాన్సెన్ బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి ఏడు బంతులు ఎదుర్కొని ఏడు పరుగులు చేసిన పంత్.. యాన్సెన్ బౌలింగ్లో స్లాగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్ కీపర్ కైలీ వెరెన్నె చేతుల్లో పడింది.అప్పటికీ తన తప్పును గుర్తించని పంత్.. రివ్యూకి వెళ్లి మరీ ప్రతికూల ఫలితం చవిచూశాడు. అనవసరంగా రివ్యూ కూడా వృథా చేశాడు. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంత్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘ఈరోజుల్లో బ్యాటర్లంతా.. ‘నా సహజశైలిలోనే ఆడతా’ అని చెబుతూ ఉంటారు.ఇలా ఎవరైనా చేస్తారా?కానీ దాని కంటే పరిస్థితులను అర్థం చేసుకుని... దానికి తగ్గట్టుగా ఆడటం అత్యంత ముఖ్యం. ప్రత్యర్థి జట్టు కోణంలో.. పంత్ ఎంత ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. అంత ఎక్కువగా మ్యాచ్ చేజారిపోతుందనే భయం ఉంటుంది. పంత్ ఉన్నంత సేపు సౌతాఫ్రికా బౌలర్లు ఒత్తిడికి లోనవుతారు.అతడిని త్వరగా అవుట్ చేయాలని భావిస్తారు. ఏ కాస్త అవకాశం దొరికినా పంత్ మ్యాచ్ను లాగేసుకుంటాడని వారికి తెలుసు. కానీ పంత్ ఏం చేశాడు?.. కనీసం పది బంతులు ఎదుర్కొనే వరకైననా ఆగలేకపోయాడు. అందుకు తగ్గ మూల్యం చెల్లించాడు’’ అని కుంబ్లే స్టార్ స్పోర్ట్స్ షోలో పంత్ షాట్ సెలక్షన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
గిల్ కోటాలో సాయి.. సీఎస్కే ప్లేయర్ను తీసుకోరా?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తడబడింది. మొదట పసలేని బౌలింగ్తో పరుగులు సమర్పించుకున్న భారత్.. తర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా.. టీమిండియా 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఫర్వాలేదని పించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఎదురీదుతోంది. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సాయి సుదర్శన్ పేలవ ప్రదర్శన జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. సాయి 40 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ధ్రువ్ జురైల్(0), రిషబ్ పంత్(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్రెడ్డి (10) కూడా వరుసగా విఫలం కావడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.అయితే సోషల్ మీడియాలో సాయి సుదర్శన్పై నెటిజనులు ఎక్కువగా విమర్శలు కురిపిస్తున్నారు. శుబ్మన్ గిల్ (Shubman Gill) స్థానంలో అతడికి జట్టులో చోటు కల్పించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కడానికి గిల్ కోటా కారణమని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ స్నేహితుడు కాబట్టే సాయికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ స్థానంలో అదే జట్టు ఆటగాడిని తప్ప మరొకని తీసుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, గుజరాత్ టైటాన్స్కు గిల్ కెప్టెన్గా కాగా, సాయి ఓపెనర్."గిల్ స్నేహితుడు కాబట్టి సాయి సుదర్శన్కి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఒకట్రెండు మ్యాచ్ల్లో విఫలమైతే చాలు ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడినిటెస్టుల్లోకి తీసుకున్నారు. దేశవాళీ క్రికెట్లో చూపిన ప్రతిభ ఆధారంగా కాదని ఓ నెటిజన్ ఎక్స్లో కామెంట్ చేశారు. దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) లాంటి వారిని కాదని సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకున్నందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్ కనీసం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించిందని మరొక నెటిజన్ పేర్కొన్నారు. టెస్టులో సాయి ప్రదర్శన అంతంత మాత్రమేనని పెదవి విరిచారు. సీఎస్కే ఆటగాడు కాబట్టే రుతురాజ్ను జట్టులోకి తీసుకోవడం లేదని అతడి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.చదవండి: రిషబ్ పంత్పై నెటిజన్ల మండిపాటుటెస్టుల్లో విఫలంతమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ (Sai Sudharsan) గతేడాది జూన్లో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో రెండు అర్ధసెంచరీలతో 288 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 87. వెస్టిండీస్తో స్వదేశంలో జరిగిన రెండవ టెస్ట్లో ఈ స్కోరు నమోదు చేశారు. 24 ఏళ్ల ఈ ఎడంచేతి వాటం బ్యాటర్లో ఇప్పటివరకు 3 వన్డేలు ఆడి 127 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 28 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 6 సెంచరీలతో 1396 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 40 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలతో 1793 పరుగులు బాదాడు. టెస్టుల్లో అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. Sai Sudarshan * 39 avg in the domestic* 28 avg in Test * Came into test team on IPL runs * TN Ranji coach said his technique is not good enough for Test cricket * Indian Assistant coach admitted his technique against Spin is not good Playing on GT Captain Quota? #INDvSA pic.twitter.com/ul8U9pcWzJ— 𝗕𝗥𝗨𝗧𝗨 (@Brutu24) November 24, 2025 Another failure for Sai Sudharsan but still Ajit Agarkar and Gautam Gambhir are not going to pick Ruturaj Gaikwad.Because Ruturaj Gaikwad plays for CSK. pic.twitter.com/zxrGlzldfx— Abhishek Kumar (@Abhishek060722) November 24, 2025
పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసిన మంధాన
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పేరు గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. వన్డే ప్రపంచకప్-2025లో భారత్ విజేతగా నిలవడంలో బ్యాటర్గా, వైస్ కెప్టెన్గా తన వంతు పాత్ర పోషించిన ఈ మహారాష్ట్ర అమ్మాయి.. ఆ వెనువెంటనే మరో శుభవార్త పంచుకుంది.నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ..తన చిరకాల స్నేహితుడు, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే స్మృతి మంధాన ధ్రువీకరించింది. నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. సహచర ఆటగాళ్లు జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యదవ్లతో కలిసి తన ఎంగేజ్మెంట్ విషయాన్ని రీల్ ద్వారా రివీల్ చేసింది.అనంతరం పలాష్.. భారత్ విశ్వవిజేతగా నిలిచిన డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చుని స్మృతికి ప్రపోజ్ చేశాడు. ఈ రెండు వీడియోలను తన సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేసి మురిసిపోయింది మంధాన. అయితే, ప్రస్తుతం వాటిని స్మృతి మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో..కాగా స్మృతి- పలాష్ పెళ్లి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ జంట ఉత్సాహంగా గడిపింది. అయితే, ఆదివారం వీరి వివాహం జరగడానికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉండటంతో వైద్యులు ఆ మేరకు చికిత్స అందిస్తున్నారు.ఆ వీడియోలన్నీ డిలీట్ చేసిన మంధానఆ వెంటనే పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆస్పత్రిలో చేరాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తన ప్రీవెడ్డింగ్ మూమెంట్స్ను స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి తీసివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మంధాన తండ్రి ఇంకా ఆస్పత్రిలోనే ఉండగా.. పలాష్ మాత్రం డిశ్చార్జ్ అయ్యాడు.కాగా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత స్మృతి మళ్లీ తన ఎంగేజ్మెంట్ రివీల్, ప్రపోజల్ వీడియోలు షేర్ చేస్తుందని అభిమానులు అంటున్నారు. తండ్రి ఆరోగ్యం దృష్ట్యానే వాటిని తాత్కాలికంగా హైడ్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. స్మృతి- పలాష్ లాంటి చూడచక్కని జంటకు ఎవరి దిష్టి తగలవద్దని.. త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కాలని ఆకాంక్షిస్తున్నారు.చదవండి: అసలు సెన్స్ ఉందా?.. ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?!: రవిశాస్త్రి ఫైర్
భారత్ శుభారంభం
కౌలాంపూర్: సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమ...
ఆ్రస్టేలియా ఓపెన్ టైటిల్ పోరుకు లక్ష్యసేన్
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆ్రస్టేలియన్ ఓపె...
శుభారంభమే లక్ష్యంగా...
ఐపో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర...
మహిత్కు మరో స్వర్ణం
న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర...
అసలు సెన్స్ ఉందా?.. .. గంభీర్ తీరుపై రవిశాస్త్రి ఆగ్రహం
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా (IND vs SA...
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2...
ఆస్పత్రి పాలైన పలాష్ ముచ్చల్!.. స్మృతి తండ్రి హెల్త్ అప్డేట్ ఇదే!
ఆనందోత్సవాల నడుమ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైన ...
అస్సలు నీవు కెప్టెన్వా?
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో ట...
క్రీడలు
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
వీడియోలు
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
