Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs PAK on September 21 as Pakistan set Asia Cup 2025 Super 41
Asia Cup 2025: మ‌ళ్లీ భార‌త్-పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే?

ఆసియాక‌ప్‌-2025లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం జ‌రిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 ప‌రుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూప‌ర్ 4కు ఆర్హ‌త సాధించిన జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 21(ఆదివారం) దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సూప‌ర్‌-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాల‌ని భార‌త జ‌ట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గ‌త ఆదివారం(సెప్టెంబ‌ర్ 14) జ‌రిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫ‌లితం కంటే హ్యాండ్ షేక్ వివాద‌మే ఎక్కువ‌గా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా భార‌త ఆట‌గాళ్లు పాక్ ప్లేయ‌ర్ల‌తో క‌రాచాల‌నాన్ని తిర‌ష్క‌రించారు.దీంతో ఘోర అవ‌మానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భార‌త్ ఆట‌గాళ్ల‌తో పాటు మ్యాచ్ రిఫ‌రీ అండీ పైక్రాప్ట్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్ల‌తో హ్యాండ్ షేక్ చేయడం త‌ప్ప‌నిసారి అని లేకపోవ‌డంతో ఐసీసీ ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇప్పుడు సూప‌ర్‌-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భార‌త్ కొన‌సాగించ‌నుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

Lionel Messi gave a special gift to PM Modi2
ప్రధాని మోదీకి మెస్సీ జన్మదిన కానుక

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం (బుధవారం) సందర్భంగా క్రీడాలోకం శుభాకాంక్షలు తెలిపింది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా... అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ 2022 ఫిఫా ప్రపంచకప్‌ గెలిచిన జెర్సీని బహుమతిగా పంపించాడు. రెండు మూడు రోజుల్లో మెస్సీ అందించిన జెర్సీని ప్రధానికి బహుకరించనున్నట్లు ప్రమోటర్‌ సతాద్రు దత్తా వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో మెస్సీ భారత్‌లో పర్యటించనున్నాడు. ఇందులో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో అతడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ‘మెస్సీని కలిసినప్పుడు ప్రధాని 75వ పుట్టిన రోజు రానుందని చెప్పాను. దీంతో అతడు వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జెర్సీపై తన ఆటోగ్రాఫ్‌ చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వాల్సిందిగా నాకు చెప్పాడు’ అని సతాద్రు దత్తా తెలిపారు. మెస్సీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా–2025’ పేరిట మెస్సీ పర్యటన కోల్‌కతా నుంచి ప్రారంభం కానుంది. 2011లో చివరిసారిగా మెస్సీ భారత్‌లో పర్యటించాడు. వెనిజులాతో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు అర్జెంటీనా జట్టు అప్పట్లో కోల్‌కతాకు వచ్చింది. మరోవైపు ఈ ఏడాది నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడేందుకు కేరళాలోపర్యటించనుందని... ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అబ్దురెహమాన్‌ వెల్లడించారు.

8 Indian shooters qualify for World Cup final3
వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు మను, సురుచి, ఇషా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు భారత్‌ నుంచి 8 మంది షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 4 నుంచి 9 వరకు ఖతర్‌ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మన దేశం నుంచి పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేత మనూ భాకర్‌తో పాటు మరో ఏడుగురు షూటర్లు బరిలోకి దిగనున్నారు. 12 వ్యక్తిగత ఒలింపిక్‌ ఈవెంట్‌లలో ఈ ఏడాది అత్యుత్తమ షూటర్‌ను నిర్ణయించేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వీటిలో ఐదింట భారత షూటర్లు పోటీపడుతున్నారు. స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ రెండు విభాగాల్లో వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు ఎంపికైంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌తో పాటు, 25 మీటర్ల విభాగంలో మను పోటీపడనుంది. ఇక ఈ సీజన్‌లో చక్కటి గురితో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న టీనేజర్‌ సురుచి సింగ్‌ కూడా భారత్‌ నుంచి బరిలోకి దిగనుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో బ్యూనస్‌ ఎయిర్స్, లిమా, మ్యూనిక్‌లలో సురుచి పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇక ఇటీవల నింగ్బో ప్రపంచకప్‌లో స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్‌ షూటర్‌ ఇషా సింగ్‌ సైతం ఈ టోర్నీలో పాల్గొననుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో ఇషా పోటీపడనుంది. ప్రపంచ మాజీ చాంపియన్‌ రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్‌ బబూతా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగానికి ఎంపికయ్యారు. రుద్రాంక్ష్ బ్యూనస్‌ ఎయిర్స్‌ వరల్డ్‌కప్‌లో స్వర్ణంతో మెరవగా... ఒలింపియన్‌ అర్జున్‌ లిమా ప్రపంచకప్‌లో రజతం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్, ప్రపంచ రికార్డు హోల్డర్‌ సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా... మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌లో, ఒలింపియన్‌ విజయ్‌వీర్‌ సిద్ధూ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో పోటీ పడనున్నారు. సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలవగా... అదే పోటీలో విజయ్‌వీర్‌ పసిడి నెగ్గాడు.మహిళల 25 మీటర్ల విభాగంలో సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బ్రార్‌ కూడా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అవకాశం దక్కించుకుంది. లిమా ప్రపంచకప్‌లో రజతం నెగ్గడం ద్వారా సిమ్రన్‌కు ఈ చాన్స్‌ దక్కింది. వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి వరుసగా 5000 యూరోలు (రూ. 5 లక్షల 20 వేలు), 4000 యూరోలు (రూ. 4 లక్షల 16 వేలు), 2000 యూరోలు (రూ. 2 లక్షల 8 వేలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌ వేర్వేరు విభాగాల్లో కలిసి భారత షూటర్లు 22 పతకాలు సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.

Telugu Titans lose again in Pro Kabaddi League4
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు ‘హ్యాట్రిక్‌’ పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన తొలి పోరులో టైటాన్స్‌ 29–33 పాయింట్ల తేడాతో దబంగ్‌ ఢిల్లీ చేతిలో ఓడింది. టైటాన్స్‌కు ఇది వరుసగా మూడో పరాజయం కాగా... ఆడిన ఆరో మ్యాచ్‌లోనూ గెలిచిన దబంగ్‌ ఢిల్లీ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా వైజాగ్‌లో ‘హ్యాట్రిక్‌’ విజయాలు నమోదు చేసుకున్న తెలుగు టైటాన్స్‌ జట్టు... పోటీలు జైపూర్‌కు తరలిన తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. తాజా పోరులో టైటాన్స్‌ తరఫున కెప్టెన్ విజయ్‌ మలిక్‌ 5 పాయింట్లు సాధించగా... మన్‌జీత్, అజిత్‌ పవార్‌ చెరో 4 పాయింట్లు సాధించారు. మరోవైపు దబంగ్‌ ఢిల్లీ తరఫున నీరజ్‌ నర్వాల్‌ 9 పాయింట్లు సాధించగా... సౌరభ్, ఫజల్‌ ఐదేసి పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 13 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... ఢిల్లీ 15 ఖాతాలో వేసుకుంది. ట్యాక్లింగ్‌లో టైటాన్స్‌కు 12 పాయింట్లు దక్కగా... ఢిల్లీ 15 పాయింట్లతో ముందంజ వేసింది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌ 3 విజయాలు, 5 పరాజయాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌ 43–32 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై గెలుపొందింది. హర్యానా తరఫున శివమ్‌ 15 పాయింట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. పట్నా పైరెట్స్‌ తరఫున అయాన్‌ 7 పాయింట్లతో పోరాడాడు. లీగ్‌లో భాగంగా గురువారం జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగాల్‌ వారియర్స్, యు ముంబాతో పుణేరి పల్టన్‌ ఆడతాయి.

Today is the Javelin Throw Medal Event5
పతకంపై నీరజ్‌ గురి

టోక్యో: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఈరోజు భారత్‌ పతకాల బోణీ కొట్టనుంది. పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో భారత్‌ నుంచి డిఫెండింగ్‌ ప్రపంచ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా, రైజింగ్‌ స్టార్‌ సచిన్‌ యాదవ్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కే చెందిన మరో ఇద్దరు జావెలిన్‌ త్రోయర్లు యశ్‌వీర్‌ సింగ్, రోహిత్‌ యాదవ్‌ ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌ చోప్రా ‘హ్యాట్రిక్‌ పతకం’ లక్ష్యంగా నేడు మెడల్‌ రౌండ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుధవారం జరిగిన జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో నీరజ్‌ ఒక్క ప్రయత్నంలోనే ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్‌లో ఒక్కో జావెలిన్‌ త్రోయర్‌కు మూడు అవకాశాలు ఇస్తారు. జావెలిన్‌ను కనీసం 84.50 మీటర్ల దూరం విసిరిన వారు లేదా టాప్‌–12లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందుతారు. గ్రూప్‌ ‘ఎ’లో పోటీపడ్డ నీరజ్‌ తన మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. గ్రూప్‌ ‘ఎ’.. గ్రూప్‌ ‘బి’ నుంచి ఓవరాల్‌గా ఏడుగురు జావెలిన్‌ త్రోయర్లు మాత్రమే అర్హత ప్రమాణాన్ని అధిగమించారు. మరో ఐదుగురికి ర్యాంక్‌ ప్రకారం ఫైనల్‌ బెర్త్‌ను కేటాయించారు. అర్హత ప్రమాణాన్ని అధిగమించిన ఏడుగురిలో నీరజ్‌ చోప్రాతోపాటు ఆండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 89.53 మీటర్లు), జూలియన్‌ వెబెర్‌ (జర్మనీ; 87.21 మీటర్లు), జూలియస్‌ యెగో (కెన్యా; 85.96 మీటర్లు), వెగ్నెర్‌ (పోలాండ్‌; 85.67 మీటర్లు), పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ (పాకిస్తాన్‌; 85.28 మీటర్లు), కుర్టిస్‌ థాంప్సన్‌ (అమెరికా; 84.72 మీటర్లు) ఉన్నారు. ఓవరాల్‌గా 8 నుంచి 12 స్థానాల్లో నిలిచిన జాకుబ్‌ వెద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌; 84.11 మీటర్లు), కెషార్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో; 83.93 మీటర్లు), సచిన్‌ యాదవ్‌ (భారత్‌; 83.67 మీటర్లు), కామెరాన్‌ మెసెన్‌టైర్‌ (ఆ్రస్టేలియా; 83.03 మీటర్లు), రుమేశ్‌ థరంగ (శ్రీలంక; 82.80 మీటర్లు) కూడా ఫైనల్లో చోటు సంపాదించారు.భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి పురుషుల జావెలిన్‌ త్రో ఫైనల్‌ జరుగుతుంది. మరోవైపు ట్రిపుల్‌ జంప్‌ క్వాలిఫయింగ్‌లో భారత క్రీడాకారులు ప్రవీణ్‌ చిత్రవేల్‌ (16.74 మీటర్లు) 15వ స్థానంలో, అబూబకర్‌ (16.33 మీటర్లు) 24వ స్థానంలో నిలిచారు. 200 మీటర్లలో జాతీయ చాంపియన్‌ అనిమేశ్‌ కుజుర్‌ హీట్స్‌లోనే వెనుదిరిగాడు.

Pakistan beat UAE by 41 runs6
‘సూపర్‌–4’కు పాకిస్తాన్‌

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్‌ ‘సూపర్‌–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ 41 పరుగుల తేడాతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్‌ అయూబ్‌ (0) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్‌ (5), కెపె్టన్‌ సల్మాన్‌ ఆగా (27 బంతుల్లో 20), హసన్‌ (3), ఖుష్‌దిల్‌ (4), హారిస్‌ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్‌ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో పాక్‌ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్‌ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్‌జీత్‌ సింగ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించగా, ధ్రువ్‌ పరాశర్‌ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది, రవూఫ్, అబ్రార్‌ అహ్మద్‌ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో శ్రీలంక తలపడుతుంది.

England Beat Ireland By 4 Wickets In 1st T20I7
మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్‌.. ఈసారి పసికూన బలి

అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసకాండ కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట సౌతాఫ్రికాపై సుడిగాలి శతకంతో (60 బంతుల్లో 141 నాటౌట్‌; 15 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. ఇవాళ (సెప్టెంబర్‌ 17) పసికూన ఐర్లాండ్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సాల్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐర్లాండ్‌ నిర్దేశించిన 197 పరుగుల లక్ష్య ఛేదనలో ఆది నుంచే బ్యాట్‌ ఝులిపిస్తూ విధ్వంసం​ సృష్టించాడు. 46 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి గెలుపు ఖరారయ్యాక ఔటయ్యాడు.సాల్ట్‌ వీర ఉతుకుడు ధాటికి ఇంగ్లండ్‌ మరో 14 బంతులు మిగిలుండగానే (6 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ అంచనాలకు మించి భారీ స్కోర్‌ చేసింది. హ్యారీ టెక్టార్‌ (36 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోర్కన్‌ టక్కర్‌ (36 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్లు పాల్‌ స్టిర్లింగ్‌ (34), రాస్‌ అదైర్‌ (26) కూడా సత్తా చాటారు.ఐరిష్‌ బ్యాటర్ల ధాటికి ఇంగ్లండ్‌ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఓవర్టన్‌, డాసన్‌, ఆదిల్‌ రషీద్‌ మాత్రం తలో వికెట్‌ తీశారు.197 పరుగుల లక్ష్య ఛేదనలో సాల్ట్‌ తొలి బంతి నుంచే డ్యూటీకి ఎక్కాడు. అతనికి బట్లర్‌ (10 బంతుల్లో 28), జేకబ్‌ బేతెల్‌ (16 బంతుల్లో 24), సామ్‌ కర్రన్‌ (15 బంతుల్లో 27) తోడయ్యారు. మ్యాచ్‌ను మరింత వేగంగా ముగించే క్రమంలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు వికెట్లు కోల్పోయారు. రెహాన్‌ అహ్మద్‌ 8, టామ్‌ బాంటన్‌ 11 పరుగులకు ఔటయ్యారు. ఓవర్టన్‌ బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు. ఐరిష్‌ బౌలర్లలో హంఫ్రేస్‌, హ్యూమ్‌ తలో 2, హ్యారీ టెక్టార్‌, గెరాత్‌ డెలానీ చెరో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 సెప్టెంబర్‌ 19న డబ్లిన్‌లోనే జరుగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది.

INDW Beat AUSW By 102 Runs In 2nd ODI8
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్‌ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్‌ (29), ప్రతిక​ రావల్‌ (25), స్నేహ్‌ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్‌ డియోల్‌ (10), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17), రాధా యాదవ్‌ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్‌ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌ 3, ఆష్లే గార్డ్‌నర్‌ 2, మెగాన్‌ షట్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, తహ్లియా మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్‌ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (6.3-0-28-1), స్నేహ్‌ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్‌ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్‌ (45), ఎల్లిస్‌ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌ 20న జరుగనుంది.

ICC informs PCB its probe cleared Pycroft9
Asia Cup 2025: పాక్‌ 'బాయ్‌కాట్‌' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ

నో హ్యాండ్‌షేక్‌ ఉదంతంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్‌ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తామని బ్లాక్‌ మెయిల్‌ చేసింది. మ్యాచ్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్‌ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్‌ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్‌ క్రికెట్‌ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్‌ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్‌ అఫీషియల్స్‌ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్‌ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్‌-యూఏఈ మ్యాచ్‌ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్‌ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్‌.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. పైక్రాఫ్ట్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్‌ ఉదంతంలో పైక్రాఫ్ట్‌ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది.

Pakistan team yet to leave for stadium, set to boycott Asia Cup 2025 Says Reports10
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయనున్న పాకిస్తాన్‌..?

ఆసియా కప్‌-2025లో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్‌ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్‌ క్రికెట్‌ టీమ్‌ ఇవాళ (సెప్టెంబర్‌ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్‌ సహా ఆసియా కప్‌ మొత్తాన్ని బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్‌ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్‌ క్రికెటర్లు ఇంకా హోటల్‌ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్‌ వివాదంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీ కాసేపట్లో పాక్‌ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్‌ 14న జరిగిన మ్యాచ్‌ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్‌.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేసింది. పైక్రాఫ్ట్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వొద్దని తమ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్‌ ఉదంతంలో పైక్రాఫ్ట్‌ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్‌-4) వెళ్లాలంటే పాక్‌ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్‌-ఏలో పాక్‌ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్‌, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్‌ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్‌-4కు చేరుకుంటుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement