Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

New Zealand beat Pakistan by 60 runs to win 1st match of ICC Champions Trophy 20251
Champions trophy 2025: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌..

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025ను ఆతిథ్య పాకిస్తాన్ ఓట‌మితో ఆరంభించింది. క‌రాచీ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 60 ప‌రుగుల తేడాతో పాక్ ఓట‌మి పాలైంది. 321 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్‌.. 47 ఓవ‌ర్ల‌లో 260 ప‌రుగుల‌కు ఆలౌటైంది.పాకిస్తాన్‌ బ్యాటర్లలో కుష్దిల్‌ షా(69) టాప్‌​ స్కోరర్‌గా నిలవగా.. బాబర్‌ ఆజం(90 బంతుల్లో 6 ఫోర్లు, ఒక​ సిక్సర్‌తో 64 పరుగులు) సల్మాన్‌​ అగా(42), పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్‌ శాంట్నర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్‌, మాట్‌ హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రేస్‌వెల్‌, నాథన్‌ స్మిత్‌ చెరో వికెట్‌ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 316 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్‌(107), టామ్ లాథ‌మ్(118) అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెలరేగారు. ఆఖరిలో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు.ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్‌, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్‌​ పడగొట్టారు. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో తలపడనుంది.చదవండి: PAK vs NZ: వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైరల్‌

Glenn Phillips Takes A Blinder In Champions Trophy Opener2
వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే సూప‌ర్ క్యాచ్‌! వీడియో వైరల్‌

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత‌మైన క్యాచ్‌తో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మ‌ద్ రిజ్వాన్‌ను ఫిలిప్స్ పెవిలియ‌న్‌కు పంపాడు. అత‌డి క్యాచ్ చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.పాక్ ఇన్నింగ్స్ ప‌దో ఓవ‌ర్ వేసిన కివీ స్పీడ్ స్టార్ విలియం ఓ'రూర్క్ ఆఖ‌రి బంతిని రిజ్వాన్‌కు కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. వెడ్త్ దొర‌క‌డంతో పాయింట్ దిశగా రిజ్వాన్ క‌ట్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. అయితే క‌ట్ షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ అయిన‌ప్ప‌టికి, పాయింట్‌లో ఉన్న ఫిలిప్స్ మాత్రం అద్బుతం చేశాడు.ఫిలిప్స్ తన ఎడమవైపున‌కు డైవ్ చేసి సింగిల్ హ్యాండ్‌తో స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌(3) ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయాడు. గ్లెన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వ‌స్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 320 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్‌, టామ్ లాథ‌మ్ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెలరేగారు. 73 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను లాథమ్‌, యంగ్ త‌మ అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు. విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్‌ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్ బ్యాట్‌తో సైతం స‌త్తాచాటాడు. 39 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔట‌య్యాడు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్‌, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్‌​ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తడబడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.చదవండి: ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్‌ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc)

Rohit Sharma reveals Team Indias different approach for Champions Trophy 20253
ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్‌ శర్మ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గురువారం(ఫిబ్ర‌వ‌రి 19)న దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో భార‌త్‌ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) విలేక‌రుల స‌మావేశంలో పాల్గోన్నాడు. ఈ సంద‌ర్భంగా హిట్‌మ్యాన్ ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీని గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్ర‌తీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్య‌మైన‌దే. ట్రోఫీ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ఇక్క‌డకు వ‌చ్చాము. అయితే ప్ర‌స్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ‍ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్‌, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్‌లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్‌ను మార్చుకోవాలి" అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్‌కప్‌నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్‌​ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్‌పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్‌లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్‌ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎ‍క్కువే!

Will Young, Tom Latham Hits Tons, New Zealand Post Big Total 4
లాథమ్‌, యంగ్‌​ సెంచరీలు.. పాక్‌ ముందు భారీ టార్గెట్‌?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో కరాచీ వేదిక‌గా పాకిస్తాన్‌(Pakistan)తో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 320 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్‌, టామ్ లాథ‌మ్ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెలరేగారు.73 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను లాథమ్‌, యంగ్ త‌మ అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెలకొల్పారు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన ఈ కివీ ద్వయం.. క్రీజులో సెటిల్ అయ్యాక పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్‌ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే(10), డార్లీ మిచెల్‌(10), విలియమ్సన్‌(1) విఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్‌, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్‌​ పడగొట్టారు.అఫ్రిదిని ఉతికారేశారు..తన 10 ఓవర్ల కోటాలో అఫ్రిది 68 పరుగులిచ్చి వికెట్‌ ఏమీ సాధించలేకపోయాడు. గాయం నుంచి తిరిగి వచ్చాక అఫ్రిది తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అతడి బౌలింగ్‌లో పేస్‌ కూడా తగ్గింది. అంతేకాకుండా బంతిని స్వింగ్‌ చేయడంలో కూడా అఫ్రిది విఫలమవుతున్నాడు. మరోవైపు హ్యారీస్‌ రౌఫ్‌ రెండు వికెట్లు పడగొట్టినప్పటికి.. తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు.తుది జట్లుపాకిస్తాన్‌ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: PAK vs NZ: అత‌డెందుకు దండగ అన్నారు.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ సెంచ‌రీ

Will Young slams his 4th century in ODIs5
అత‌డెందుకు దండగ అన్నారు.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ సెంచ‌రీ

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో మొద‌టి సెంచ‌రీ న‌మోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెన‌ర్ విల్ యంగ్ (Will Young) అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కాన్వే, విలియ‌మ్స‌న్‌, మిచెల్ వంటి స్టార్‌ ఆట‌గాళ్లు విఫ‌ల‌మైన చోట‌.. యంగ్ త‌న సూప‌ర్ సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. 107 బంతుల్లో యంగ్ త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.విల్ యంగ్‌కు ఇది నాలుగో వన్డే సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఓవరాల్‌గా 112 బంతులు ఎదుర్కొన్న యంగ్‌.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 107 పరుగులు చేసి ఔటయ్యాడు.జీరో టూ హీరో..కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ వేదిక‌గా జ‌రిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో యంగ్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ సిరీస్‌లో యంగ్‌ మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 28 ప‌రుగులు మాత్రమే చేశాడు.దీంతో అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అత‌డిని ఎందుకు ఎంపిక చేశారని ప‌లువ‌రు మాజీ క్రికెట‌ర్లు పెద‌వి విరిచారు. కానీ యంగ్ త‌నపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు సూప‌ర్ సెంచ‌రీతో స‌మాధాన‌మిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన యంగ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెంచ‌రీ చేసిన నాలుగో న్యూజిలాండ్ ఆట‌గాడిగా నిలిచాడు. 38 ఓవ‌ర్లు ముగిసే స‌రికి న్యూజిలాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. క్రీజులో లాథ‌మ్‌(57), ఫిలిప్స్‌(1) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచ‌రీలు చేసిన కివీస్ ప్లేయ‌ర్లు వీరే..145* - నాథన్ ఆస్టిల్ vs అమెరికా, ది ఓవల్, 2004102* - క్రిస్ కెయిర్న్స్ vsభార‌త‌, నైరోబి, 2000 ఫైనల్100 - కేన్ విలియమ్సన్ vs ఆస్ట్రేలియా, ఎడ్జ్‌బాస్టన్, 2017100* - విల్ యంగ్ vs పాకిస్తాన్‌, కరాచీ, 2025ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు పాక్, కివీస్ తుది జ‌ట్లే ఇవే..పాకిస్తాన్‌ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌

CT 2025: Favorites India Pakistan Who Will Win Title Predictions Analysis6
CT 2025: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎ‍క్కువే!

సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా. ఆసీస్‌కు ఎదురుదెబ్బలుఅయితే, ఈ టెస్టు సిరీస్‌ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్‌ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్‌ బోర్డు.ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ గాయాల వల్ల వైదొలిగారు. ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.అంత సులువు కాక పోవచ్చుఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్‌ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్‌ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.భారత్: ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాఇంగ్లండ్‌లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టెస్ట్‌లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్‌తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)వన్డే ర్యాంకింగ్: 3ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్‌ రిజ్వాన్‌ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను చేజిక్కించుకుంది.ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.న్యూజిలాండ్చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)వన్డే ర్యాంకింగ్: 4ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్‌ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది. పాకిస్తాన్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఫామ్‌ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్‌ కోరుకుంటేనే అతడికి ఛాన్స్‌

Naseem Shah removes Kane Williamson for 1 with a peach in PAK vs NZ 7
పాక్ బౌల‌ర్ సూప‌ర్ బాల్‌.. పాపం కేన్ మామ‌! ఐదేళ్ల త‌ర్వాత‌?

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా క‌రాచీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న‌తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్( Kane Williamson) తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. పాక్ పేస‌ర్ నసీమ్ షా అద్బుత‌మైన బంతితో విలియ‌మ్స‌న్‌ను బోల్తా కొట్టించాడు. అత‌డి దెబ్బ‌కు కేన్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి పెవిలియన్‌కు చేరాడు. కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్ వేసిన న‌సీమ్ షా.. తొలి బంతిని కేన్ మామ‌కు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివ‌రీగా ఆఫ్‌సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియ‌మ్స‌న్ బ్యాక్‌ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంట‌నే అత‌డి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీప‌ర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. దీంతో కేన్ మామ హెడ్‌ను షేక్ చేస్తూ నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు. ఇంద‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా విలియ‌మ్స‌న్ సింగిల్ డిజిట్ స్కోర్‌కు అవుట్ కావ‌డం 2019 త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.రవీంద్ర దూరం..కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్‌ విల్‌ యంగ్‌(88 నాటౌట్‌) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.29 ఓవర్లకు న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్‌లో గాయపడిన కివీస్‌ స్టార్‌ ఓపెనర్‌ రచిన్‌ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓపెనర్‌ ఫఖార్‌ జమాన్‌ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్‌ను వీడి బయటకు వెళ్లిపోయాడు.తుదిజట్లుపాకిస్తాన్‌ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ WHAT A BALL FROM NASEEM SHAH ⚡⚡ pic.twitter.com/ghHOFkiSlU— Johns. (@CricCrazyJohns) February 19, 2025

Unless You Are Rich: Pullela Gopichand Advice To Parents Goes Viral8
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్‌ ‘షాకింగ్‌’ కామెంట్స్‌

భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం, ఆల్‌ ఇంగ్లండ్‌ మాజీ చాంపియన్‌ పుల్లెల గోపీచంద్‌(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్‌లో బ్యాడ్మింటన్‌(Badminton) సూపర్‌ పవర్‌గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్‌ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్‌లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్‌ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్‌, మేడమ్‌ అని సంబోధిస్తూ ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్‌, ఆర్బీఐ , ఇన్‌కమ్‌ టాక్స్‌, పోలీస్‌ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్‌ కలిగిన జాబ్స్‌ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్‌ సర్వెంట్‌ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్‌ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్‌, మేడమ్‌ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్‌పర్సన్‌ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్‌ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్‌ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్‌ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్‌ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్‌ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్‌, పీవీ సింధు వంటి ఒలింపిక్‌ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్‌ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్‌ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌

Fakhar Zaman walk off the field in the first over vs New Zealand in Champions Trophy opener9
తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్‌..

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(Champions Trophy)కి బుధ‌వారం(ఫిబ్ర‌వ‌రి 19) తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.గాయం కార‌ణంగా ట్రైసిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగిన స్టార్ పేస‌ర్ హ్యారిస్ ర‌వూఫ్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే అదే సిరీస్‌లో గాయపడిన కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.ఇక తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ ఫఖర్ జమాన్ గాయ‌ప‌డ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ఓవ‌ర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడో బంతికి విల్ యంగ్ క‌వ‌ర్స్ దిశ‌గా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జ‌మాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ క్ర‌మంలో అత‌డి కూడి కాలికి గాయ‌మైంది. దీంతో అత‌డు నొప్పితో విల్లవిల్లాడు. వెంట‌నే అత‌డు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. అత‌డి స్దానంలో క‌మ్రాన్ గులాం స‌బ్‌స్ట్యూట్‌గా మైదానంలోకి వ‌చ్చాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌మాన్ తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌లేదుకాగా అతడి గాయంపై పీసీబీ తాజాగా అప్‌డేట్‌ ఇచ్చింది. "ఫఖర్ జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని" పీసీబీ ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఒక‌వేళ అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది అయితే పాకిస్తాన్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్ప‌టికే స్టార్ ఓపెన‌ర్ సైమ్ అయూబ్ సేవ‌ల‌ను పాక్ కోల్పోయింది.తుదిజట్లుపాకిస్తాన్‌ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌

Goosebumps: Sam Curran after his Brother Maiden ODI century For Zimbabwe10
శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్‌ బెన్‌ కరన్‌(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్‌ బెన్‌ కరన్‌ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్‌ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌లో లొర్కన్‌ టక్కర్‌ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్‌ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గరవ, ట్రెవర్‌ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్‌ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెన్‌ కరన్‌ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (59 బంతుల్లో 69 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్‌ కరన్‌ ఎక్స్‌ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్‌ ఏ బాయ్‌!.. అద్బుత ఇన్నింగ్స్‌’’ అని ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్‌ కెవిన్‌ కరన్‌కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్‌ కరన్‌ పెద్దవాడు కాగా.. బెన్‌ కరన్‌ రెండోవాడు. ఇక సామ్‌ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్‌ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్‌, సామ్‌ మాత్రం ఇంగ్లండ్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్‌ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్‌ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్‌కే దక్కింది. 28 ఏళ్ల బెన్‌ స్పెషలిస్టు బ్యాటర్‌ కాగా.. 26 ఏళ్ల సామ్‌ కరన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. లెఫ్టార్మ్‌పేస్‌ మీడియం బౌలర్‌ అయిన అతడు లెఫ్టాండర్‌ బ్యాటర్‌. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్‌ కరన్‌ కూడా బౌలింగ్‌ ఆల్‌రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్‌ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగనుంది.చదవండి: సచిన్‌ కాదు!.. నంబర్‌ వన్‌ వన్డే బ్యాటర్‌ అతడే: సెహ్వాగ్‌

క్రీడలు పోల్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement