ప్రధాన వార్తలు
చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 'డబుల్ సూపర్ ఓవర్' సమరాలు ఇవే..!
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 11) ఓ చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఓ మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో గెలుపు కోసం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెగ్యులర్ మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా గెలుపు కోసం ఇరు జట్లు చివరి బంతి వరకు వేచి చూశాయి. అంతిమంగా సౌతాఫ్రికా చివరి బంతికి (రెండో సూపర్ ఓవర్) గెలుపు ఖరారు చేసుకొని విజేతగా నిలిచింది. ఒకవేళ ఈ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమై ఉంటే, మ్యాచ్ మూడో సూపర్కు కూడా వెళ్లేది.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సూపర్ ఓవర్ను 2008లో పరిచయం చేశారు. అప్పటివరకు స్కోర్లు సమమైన సందర్భాల్లో బౌల్ ఔట్ పద్దతి అమల్లో ఉండేది. సూపర్ ఓవర్ రాకతో బౌల్ ఔట్ పద్దతికి చరమగీతం పాడారు.అప్పటి నుంచి రెగ్యులర్ మ్యాచ్ల్లో స్కోర్లు సమమైన సందర్భంలో గెలుపును నిర్దేశించేందుకు సూపర్ ఓవర్ను ఉపయోగిస్తున్నారు. ఈ సూపర్ ఓవర్లో ఒక్కో జట్టుకు ఒక్కో ఓవర్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. బౌలర్ ఒక్కడే అయినా, ముగ్గురు బ్యాటర్లకు అవకాశం ఉంటుంది. ఇద్దరు ఔటైతే, బంతులు మిగిలున్నా సంబంధిత టీమ్ ఆలౌట్గా పరిగణించబడుతుంది. సూపర్ ఓవర్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు చేస్తుందో ఆ జట్టే విజేతగా నిర్దారించబడుతుంది. సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే రెండో సూపర్ ఓవర్ జరుగుతుంది. రెండో సూపర్ ఓవర్లోనూ సేమ్ రూల్స్తో ఇరు జట్లకు ఓ ఓవర్ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా స్కోర్లు సమమైతే మూడో సూపర్ ఓవర్కు కూడా ఆస్కారముంటుంది. ఒకవేళ మూడో సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమమైతే టోర్నమెంట్ పరిస్థితులు, షెడ్యూల్ ఆధారంగా బౌండరీ కౌంట్ రూల్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) లేదా బౌలింగ్ కౌంట్ రూల్ (తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు) ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మూడే మూడు సందర్భాల్లో డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో ఓ మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు కూడా వెళ్లింది. 2025 జూన్ 16న నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ట్రిపుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మూడో సూపర్ వరకు ఓటమిని ఒప్పు కోలేదు. అంతిమంగా నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో తొలి ట్రిపుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా చరిత్రకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2024 జనవరి 17న జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ గెలుపు కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాడాయి. అంతిమంగా టీమిండియానే విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో రెండో డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ 2026 ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి గెలుపొందింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది.అంతర్జాతీయ టీ20ల్లో కాకుండా మరో మ్యాచ్ కూడా డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. అది ఐపీఎల్ 2020లో భాగంగా జరిగింది. ఆ ఎడిషన్లో అక్టోబర్ 18న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గెలుపు కోసం రెండో సూపర్ ఓవర్ వరకు పోరాడాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ అంతిమ విజేతగా నిలిచింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలి డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్గా నిలిచింది. ఇవే కాకుండా మొత్తం టీ20 ఫార్మాట్లో చాలా సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. ప్రత్యేకించి ప్రపంచకప్ను తీసుకుంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 సూపర్ ఓవర్ మ్యాచ్లు జరిగాయి. 2012 ఎడిషన్లో న్యూజిలాండ్-వెస్టిండీస్.. అదే ఎడిషన్లో న్యూజిలాండ్-శ్రీలంక.. 2024 ఎడిషన్లో నమీబియా-ఒమన్.. అదే ఎడిషన్లో పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి.
న్యూజిలాండ్కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రేస్వెల్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్వెల్ ప్రపంచకప్కు ముందు భారత్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్ సమయానికంతా ఫిట్నెస్ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. వార్మప్ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్వెల్కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్కాంచీని బ్రేస్వెల్కు రీప్లేస్మెంట్గా ప్రకటించారు. మెక్కాంచీ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్లో న్యూజిలాండ్ అండర్ డాగ్గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్ (డి) మ్యాచ్లో కెనడాతో తలపడనుంది.
గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీ ఈ పిల్లాడు!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ మార్క్ బుచర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పద్నాలుగేళ్ల ఈ పిల్లాడిని దిగ్గజ గ్యారీ సోబర్స్తో పోల్చాడు. కాగా ఫార్మాట్లకు అతీతంగా ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు వైభవ్.ధనాధన్హర్యానాకు చెందిన ఈ కుర్రాడు గతేడాది ఐపీఎల్లో సత్తా చాటాడు. అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డ మీద భారత అండర్-19 జట్టు తరఫున అదరగొట్టాడు. యూత్ వన్డేలు, యూత్ టెస్టుల్లో విధ్వంసకర శతకాలు బాది రికార్డులు నెలకొల్పాడు.ఫైనల్లోనూ భారీ శతకంఇక ఇటీవల ఐసీసీ అండర్-19 వరల్డ్కప్-2026 ఫైనల్లోనూ ఇంగ్లండ్పై భారీ శతకం (175) బాది టీమిండియాకు టైటిల్ అందించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆట తీరు తనకు వెస్టిండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ను గుర్తుకు తెస్తోందన్నాడు.గ్యారీ సోబర్స్కి కార్బన్ కాపీవిజ్డన్ క్రికెట్ వీక్లీ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. “వైభవ్ను చూడగానే నాకు తొలుత గ్యారీ సోబర్స్ జ్ఞప్తికి వచ్చాడు. విధ్వంసకర రీతిలో బ్యాట్ను స్వింగ్ చేయడం.. ఆ టైమింగ్, పరిపూర్ణత సూపర్. అతడి హ్యాండ్ స్పీడ్, క్రీజులో కదిలే విధానం అన్నీ ఆ దిగ్గజం మాదిరే ఉంటాయి.అచ్చం సోబర్స్ లాగే అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ తరంలోని ఆటగాడు కూడా ఇలా సోబర్స్ను నాకు గుర్తుచేయలేదు. అయితే, వైభవ్ మాత్రం తన బ్యాటింగ్ తీరుతో నన్ను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యంగా బ్యాట్ స్వింగ్ కోసం అతడు కాళ్లను కదిలించే విధానం సూపర్’’ అని మార్క్ బుచర్ వైభవ్ సూర్యవంశీని కొనియాడాడు. చదవండి: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు.. నెటిజన్స్ ఫైర్
రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం.. ఆఫ్ఘనిస్తాన్ వీరోచిత పోరాటం
అంతర్జాతీయ పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యంత రసవత్తర సమరం టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ కొదమ సింహాల్లా పోరాడాయి. రెండు జట్లు ఒక్క పట్టాన ఓటమిని అంగీకరించలేదు. అంతిమంగా సౌతాఫ్రికానే పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘన్ తమ వీరోచిత పోరాటంతో యావత్ క్రికెట్ ప్రపంచం మనసులు గెలుచుకుంది.తొలుత రెగ్యులర్ మ్యాచ్లో స్కోర్లు సమం కాగా.. సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లోనూ స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇక్కడ కూడా ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు చివరి బంతి వరకు పోరాడాయి. ఫైనల్గా సౌతాఫ్రికా రెండో సూపర్ ఓవర్ చివరి బంతికి విజయం సాధించింది.రెగ్యులర్ మ్యాచ్సౌతాఫ్రికా 187-6 (20 ఓవర్లు)ఆఫ్ఘనిస్తాన్ 187-10 (19.4 ఓవర్లు)ఫ్రీ హిట్కు రనౌట్రెగ్యులర్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలుపును కాలదన్నుకుంది. 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి పరుగు పూర్తి చేసి, రెండో పరుగు ప్రయత్నంలో రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే ఆ బంతి ఫ్రీ హిట్. ఆఫ్ఘన్ కోల్పోయి వికెట్ చివరిది. దీంతో ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే ఒక్క పరుగు చేయలేక చేతుల్లోకొచ్చిన గెలుపును వదిలేసుకుంది.తొలి సూపర్ ఓవర్ఆఫ్ఘనిస్తాన్- 4, 6, 1, 1, 4, 1 (17 పరుగులు)సౌతాఫ్రికా- 1, 6, W, 4, 0, 6 (17 పరుగులు)రెండో సూపర్ ఓవర్సౌతాఫ్రికా- 6, 1, 2, 6, 6, 2 (23 పరుగులు)ఆఫ్ఘనిస్తాన్- 0, W, 6, 6, 6, Wd1, W (19 పరుగులు)ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ సౌతాఫ్రికాను 187 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. కెప్టెన్ రషీద్ ఖాన్ (4-0-28-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ (4-0-41-3) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీశాడు. ఫజల్ హక్ ఫారూకీ (4-0-32-1) పర్వాలేదనిపించాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ (3-0-30-0), మొహమ్మద్ నబీ (2-0-20-0), నూర్ అహ్మద్ (3-0-25-0) వికెట్లు తీయలేకపోగా.. పరుగులు దండిగా సమర్పించుకున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (59), ర్యాన్ రికెల్టన్ (61) అర్ద సెంచరీలతో రాణించారు. డెవాల్డ్ బ్రెవిస్ (23), డేవిడ్ మిల్లర్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ (5), స్టబ్స్ (1) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఆఖర్లో జన్సెన్ (16) బ్యాట్ ఝులిపించాడు.188 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (84) చెలరేగిపోయాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా, తన జోరును తగ్గించకుండా ఆఫ్ఘన్ను లక్ష్యం వైపు తీసుకెళ్లాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (22), రషీద్ ఖాన్ (20), నూర్ అహ్మద్ (15 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో ఆఫ్ఘన్ స్కోర్లు సమం చేసుకొని, లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. మిగతా ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇబ్రహీం జద్రాన్ 12, దర్విష్ రసూల్ 15, నబీ 5 పరుగులు చేయగా.. గుల్బదిన్ నైబ్, సెదిఖుల్లా అటల్, ముజీబ్, ఫజల్ హక్ డకౌట్లయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీసి ఆఫ్ఘన్కు గెలుపును దూరం చేశాడు. జన్సెన్, రబాడ, లిండే, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.
వరల్డ్కప్ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్కు ముందు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటంతో స్టీవ్ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.బిగ్బాష్లో అద్భుత ఫామ్లో ఉన్నా, స్టీవ్ను ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్కు అవకాశం లభించింది. స్టీవ్ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.కాగా, ఐర్లాండ్తో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్ హెడ్ ఆసీస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసీస్ వేధిస్తున్న గాయాలుప్రస్తుత ప్రపంచకప్లో ఆసీస్ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.ప్రపంచకప్ గ్రూప్ దశలో ఆసీస్ షెడ్యూల్ - ఐర్లాండ్తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11 - జింబాబ్వేతో – ఫిబ్రవరి 13 - శ్రీలంకతో – ఫిబ్రవరి 16 - ఒమాన్తో – ఫిబ్రవరి 20 ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.తుది జట్లు.. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా
అది లీగల్: పాక్ స్పిన్నర్కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్బాల్లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్టైమ్ టెస్టింగ్ టూల్ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్కు మద్దతుగా.. అశ్విన్ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026
ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి వైదొలగడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.కాగా భారత్- బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వరల్డ్కప్ టోర్నీ ఆడేందుకు రాలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. భారత్లో తమకు భద్రత ఉండదని.. మరో వేదికైన శ్రీలంకకు తమ మ్యాచ్లు మార్చాలని అభ్యర్థించింది.ప్రభుత్వ నిర్ణయానుసారమే..అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తమ బృందం తేల్చించిందన్న ఐసీసీ.. పునరాలోచన చేయాల్సిందిగా బీసీబీకి చెప్పింది. కానీ.. తమ ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోవడం లేదని.. ప్రభుత్వ నిర్ణయానుసారం టోర్నీ నుంచి తప్పుకునేందుకైనా తాము సిద్ధమని బీసీబీ ఐసీసీకి స్పష్టం చేసింది.ఈ విషయం గురించి జనవరి 22న బంగ్లాదేశ్ క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు అర్థమయ్యేలా చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశాము.నాకు తెలిసి వాళ్లు అర్థం చేసుకునే ఉంటారు. ఐసీసీలో మాకు న్యాయం దొరకదనే అనిపించింది. టోర్నీలో మేము ఆడేది.. లేనిది అంతా ప్రభుత్వ నిర్ణయమే’’ అని పేర్కొన్నాడు. ఇక బంగ్లా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించి.. ర్యాంకింగ్ ఆధారంగా స్కాట్లాండ్ను అనుమతించింది ఐసీసీ.పాక్ యూటర్న్ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచి.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది. అయితే, ఐసీసీతో పాటు శ్రీలంక, యూఏఈ తదితర సభ్య దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో పాక్ యూటర్న్ తీసుకుంది. కొలంబోలో ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్ ఆడతామని స్పష్టం చేసింది.ఆటగాళ్లే నిర్ణయం తీసుకున్నారంటూ..ఇక బంగ్లాదేశ్ బోర్డుకు సైతం ఎలాంటి పెనాల్టీలు విధించబోమని ఐసీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్ నజ్రుల్ తమ మాటల్ని పూర్తిగా మార్చేశాడు. ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఆడలేకపోయినందుకు మాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.టోర్నీలో ఆడకూడదన్నది పూర్తిగా బీసీబీ, ఆటగాళ్ల నిర్ణయమే. దేశ క్రికెట్ను రక్షించేందుకు వారు త్యాగాలు చేశారు. బంగ్లాదేశ్ ప్రజలను కాపాడుకునేందుకు.. జాతీయ సమగ్రతను చాటేందుకు వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అంటూ అర్థంపర్థం లేకుండా మరీ దారుణంగా నాలుక మడతేశాడు.ఛీ.. మరీ ఇంత దారుణమా?దీంతో బంగ్లాదేశ్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యూటర్న్లు తీసుకోవడంలో బంగ్లా పాకిస్తాన్నే మించిపోతుందని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని సోషల్ మీడియా వేదికగా ఛీత్కరించుకుంటున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేసి ఆటగాళ్ల కలలను నీరుగార్చారని బంగ్లా ప్రభుత్వంపై మండిపడుతున్నారు.కాగా భారత క్రికెట్, ఐసీసీతో సత్సంబంధాలు కొనసాగించి సమస్య పరిష్కరించుకోవాలని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వంటి ఆటగాళ్లు బీసీబీకి సూచించారు. అయితే, బంగ్లా బోర్డులోని ఓ అధికారి అతడిని భారత ఏజెంట్ అంటూ విమర్శించాడు. ఈ నేపథ్యంలో క్రికెటర్ల సంఘం సమావేశం ఏర్పాటు చేసి అతడితో రాజీనామా చేయించేలా ఒత్తిడి తెచ్చారు.ఆటగాళ్లపై నెపంబంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ సైతం తమకు వరల్డ్కప్లో ఆడాలని ఉందని.. అయితే, ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటామని స్పష్టం చేశాడు. కానీ నజ్రుల్ మాత్రం ఇలా ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారంటూ యూటర్న్ తీసుకోవడం గమనార్హం. కాగా బంగ్లాదేశ్లో కొన్నాళ్లుగా మైనారిటీ హిందువుల మీద హత్యాకాండ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్- బంగ్లా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న భారత్-శ్రీలంక వేదికగా రల్డ్కప్ టోర్నీ మొదలైన సంగతి తెలిసిందే.చదవండి: పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్
T20 WC 2026: కివీస్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్ రికార్డు విజయం సాధించింది. చెన్నై వేదికగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడింది కివీస్. చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లోయూఏఈని ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు సత్తా చాటడంతో న్యూజిలాండ్కు ఈ విజయం సాధ్యమైంది. వరల్డ్కప్ టోర్నీ తాజా ఎడిషన్ తొలి పోరులో అఫ్గనిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్కు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. తద్వారా సూపర్ ఎయిట్కు కివీస్ మరింత చేరువైంది.77 బంతుల్లోనే 107 పరుగులుకాగా న్యూజిలాండ్తో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగింది యూఏఈ. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (45 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), అలీషాన్ షరఫు (47 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్కు 77 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు.మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీకి 2 వికెట్లు తీయగా.. జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రపంచ రికార్డు అనంతరం న్యూజిలాండ్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.సీఫెర్ట్ 42 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లు బాది 89 పరుగులు.. అలెన్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 84 రన్స్తో అజేయంగా నిలిచారు. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.తద్వారా తొలి వికెట్కు 92 బంతుల్లోనే 175 పరుగులు జత చేసి చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఏ వికెట్కైనా అత్యధిక స్కోరు సాధించిన జోడీగా సీఫెర్ట్- అలెన్ ప్రపంచ రికార్డు సాధించారు. తమ అద్భుత ప్రదర్శనతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే యూఏఈపై జట్టుకు విజయం అందించారు.టీ20 ప్రపంచకప్లో అత్యధిక భాగస్వామ్యం (ఏ వికెట్కైనా)🏏టిమ్ సీఫెర్ట్- ఫిన్ అలెన్ (న్యూజిలాండ్): 2026లో యూఏఈ మీద 175 నాటౌట్🏏జోస్ బట్లర్- అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్): 2022లో టీమిండియా మీద 170 నాటౌట్🏏క్వింటన్ డికాక్- రిలీ రొసోవ్ (సౌతాఫ్రికా): 2022లో బంగ్లాదేశ్ మీద 168 🏏మహేళ జయవర్దనే- కుమార్ సంగక్కర (శ్రీలంక): 2010లో వెస్టిండీస్ మీద 166🏏ఇబ్రహీం జద్రాన్- రహ్మనుల్లా గుర్బాజ్ (అఫ్గనిస్తాన్): 2024లో ఉగాండా మీద 154న్యూజిలాండ్ వర్సెస్ యూఏఈ స్కోర్లు👉యూఏఈ: 173/6(20)👉న్యూజిలాండ్: 175/0(15.2)👉ఫలితం: యూఏఈపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జయభేరి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..Absolute carnage 🔥New Zealand shatter records with the highest partnership and the highest successful chase without losing any wickets in ICC Men’s T20 World Cup history. 🇳🇿ICC Men’s #T20WorldCup | #PAKvUSA | LIVE NOW 👉 https://t.co/97PRnnpgoP pic.twitter.com/KjichpPvP0— Star Sports (@StarSportsIndia) February 10, 2026
పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స వార్తల్లోకెక్కాడు. గతేడాది నవంబరులో చివరగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు ఈ లెఫ్టాండర్. పేలవ ప్రదర్శనల కారణంగా టీ20 ప్రపంచకప్-2026 శ్రీలంక జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు.అదనంగా ఓ రబ్బరు పొర అయితే, ఆటతో కాకుండా భారత బ్యాటర్ల గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా భనుక రాజపక్స పేరు తెరమీదకు వచ్చింది. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా ఆటగాళ్లు వాడే బ్యాట్లు మిగతా జట్లు వాడే బ్యాట్ల కంటే ఎంతో మిన్నగా ఉంటాయని అన్నాడు. వారి బ్యాట్లపై అదనంగా ఓ రబ్బరు పొర కూడా ఉంటుందని పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలో భనుక రాజపక్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పాకిస్తాన్ జట్టు అభిమానులు నెట్టింట రచ్చ చేశారు. భారత బ్యాటర్ల ఆటను కించపరిచేలా పోస్టులు పెట్టారు. దీంతో భనుక రాజపక్స స్పందించాడు.ప్రశంసించాలని అనుకున్నాతన మాటల్ని వక్రీకరించి ఇష్టారీతిన ప్రచారం చేయడం సరికాదని హితవు పలికాడు. ‘‘అందరికీ హాయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారు. వారు తోచిన విధంగా మలచుకుని ప్రచారం చేస్తున్నారు. బహుశా అనువాదం చేయడంలో వారు పొరపడి ఉంటారు.నేను భారత బ్యాటర్లను ప్రశంసించే క్రమంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. భారత క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందింది. వారి వద్ద అడ్వాన్స్డ్ సిస్టమ్స్, మౌలిక సదుపాయాలు, అత్యున్నత ప్రమాణాలు కలిగిన క్రికెట్ పరికరాలు ఉన్నాయి.ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల కోసం బ్యాట్లు తయారుచేసే మ్యాన్ఫ్యాక్చరర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వారు. ఈ విషయంలో స్పష్టత వచ్చిందనే అనుకుంటున్నా.కౌంటర్ అదుర్స్నాకు వారి పట్ల గౌరవం తప్ప ఇంకేమీ లేదు’’ అని భనుక రాజపక్స సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. దీంతో షాకవ్వడం పాక్ ఫ్యాన్స్ వంతైంది. మరోవైపు.. టీమిండియా అభిమానులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన వారికి భనుక రాజపక్స మంచి కౌంటర్ ఇచ్చాడని పేర్కొంటున్నారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్తో కలిసి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఇదిలా ఉంటే.. భనుక రాజపక్స తన కెరీర్లో 5 వన్డేలు, 45 టీ20 ఆడాడు. 34 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఖాతాలో 89 వన్డే, 744 టీ20 పరుగులు ఉన్నాయి.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాక్
భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెప్పినట్లుగానే పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడతామని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో విధిలేని పరిస్థితుల్లో ఇందుకు అంగీకరించింది.అయితే, కిందపడినా తమదే పైచేయి అన్నట్లుగా పాక్ ప్రగల్బాలు పలుకుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ చైర్మన్ నజామ్ సేథి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తమ ముందు ఐసీసీ చిన్నబోయిందని.. వెనక్కి తగ్గి తమతో రాజీకి వచ్చిందని అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఐసీసీ భయపడింది.. అందుకే రాజీ‘‘ఈ విషయంలో ఐసీసీ వెనకడుగు వేసింది. అందుకే పాక్ చెప్పినట్లుగా బంగ్లాదేశ్ పట్ల సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ బంగ్లాకు మద్దతుగా గొప్ప నిర్ణయం తీసుకుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే.. భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే తమపై ఐసీసీ ఆంక్షలు విధించలేదని తెలుసుకున్న పాక్ ఇంటాబయటా లాయర్లను సంప్రదించి బాయ్కాట్ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.ఐసీసీకి కూడా తాము ఈ విషయంలో ఏమీ చేయలేమని తెలుసు. అందుకే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. పాకిస్తాన్ భారత్తో మ్యాచ్ ఆడాలని కోరారు. అలా పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్కు కూడా న్యాయం జరిగింది.ఐసీసీ మీద ఆధాపడే స్థితిలో లేముమిగతా అన్ని బోర్డుల మాదిరే గతంలో పాక్ కూడా ఐసీసీ మీద ఆధారపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్ సూపర్ లీగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం కంటే ఈ లీగ్ నుంచే ఎక్కువ డబ్బు వస్తోంది. కాబట్టి పాక్ తన సొంత వనరులపైనే ఆధారపడుతోంది.కాబట్టి ఐసీసీ చెప్పినట్లు వినాల్సిన పనిలేదు. మార్చిలో పాకిస్తాన్కు అనుకూలంగా మరిన్ని నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది’’ అని నజామ్ సేథి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్కు ప్రధానంగా ఆదాయం ఐసీసీ నుంచే వస్తోంది.అన్నివైపులా ఒత్తిడి అంతేకాదు.. పీఎస్ఎల్లో అంతర్జాతీయ క్రికెటర్లు ఆడాలన్నా ఆయా సభ్య దేశాల బోర్డుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ పాక్ భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తే.. సభ్య దేశాలు పాక్ లీగ్లో ఆడే క్రికెటర్లకు నో ఆబ్జక్షన్ లెటర్ ఇవ్వకుండా ఆపే అవకాశం ఉందని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి.అదే విధంగా.. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం పాక్లో తమపై జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేస్తూ లేఖ రాసింది. అయినా సరే తాము పాక్తో క్రికెట్ సంబంధాలు కొనసాగిస్తున్న తీరును ప్రస్తావించింది. యూఏఈ, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్కు భారత్తో ఆడాలని విజ్ఞప్తి చేశాయి. అన్నింటికీ మించి గత్యంతరం లేకే భారత్తో ఆడలేమని పాక్ లేవనెత్తిన అంశం సబబుగా లేదు కాబట్టి.. ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించే పరిస్థితి వచ్చింది.మొదటికే మోసం వస్తుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన పాక్.. అయినా సరే తామే గొప్ప అంటూ ఇలా మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకుంది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ కూడా తాము భారత్లో కాకుండా శ్రీలంకలో ఆడతామని పట్టుబట్టింది.ఇందుకు ఐసీసీ నిరాకరించగా.. తాము టోర్నీలో ఆడలేమని బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో మధ్యలోకి వచ్చిన పాక్.. తాము కూడా బంగ్లాకు మద్దతుగా టోర్నీ ఆడమని తొలుత సంకేతాలు ఇచ్చి బెదిరింపులకు దిగింది. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశంతో భారత్తో మ్యాచ్ మాత్రమే ఆడమని నాటకాలు ఆడింది.అయితే, ఈ మ్యాచ్ జరుగకపోతే సభ్య దేశాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉన్నందున ఐసీసీ పాక్కు మరో అవకాశం ఇచ్చింది. లాహోర్లో పీసీబీతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పాక్ గొంతెమ్మ కోరికలను తిరస్కరించిన ఐసీసీ.. బంగ్లాదేశ్ విషయంలో తాము ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా ఆంక్షలు, పెనాల్టీలు విధించబోమని ప్రకటించింది.చదవండి: T20 WC: టీమిండియాకు భారీ షాక్!.. ఈసారి..
దక్షిణేశ్వర్ ధమాకా
బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్ ఆటగా...
సర్వీసెస్ సూపర్...
గువాహటి: జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రతిష్టాత్మ...
భారత్ డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స...
ఇలవేనిల్కు రెండు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్...
ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాట మార్చింది. టీ20 ప్రపంచకప్-2026 టో...
T20 WC 2026: కివీస్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్ రికార్డ...
పాక్ ఫ్యాన్స్కు షాకిచ్చిన శ్రీలంక క్రికెటర్
శ్రీలంక క్రికెటర్ భనుక రాజపక్స వార్తల్లోకెక్కాడు....
ICC భయపడింది.. మాదే పైచేయి: బుద్ధి చూపించిన పాక్
భారత మాజీ క్రికెటర్లు ముందు నుంచి చెప్పినట్లుగానే ...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
