Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sarfaraz Khan joins ODI race with fastest List A half-century by an Indian1
చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు

విజ‌య్ హ‌జారే ట్రోఫీ 2025-26లో టీమిండియా ఆటగాడు, ముంబై స్టార్ సర్ఫరాజ్ ఖాన్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ విధ్వంసం సృష్టించాడు. ఈ ముంబైకర్ తన సంచలన బ్యాటిం‍గ్‌తో టీ20 మ్యాచ్‌ను తలపించాడు. ప్రత్యర్ది బౌలర్లను ఉతికారేశాడు.ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మకు సర్ఫరాజ్‌చుక్కలు చూపించాడు. అభిషేక్ వేసిన 16 ఓవర్‌లో సర్ఫరాజ్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.త‌ద్వారా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ సాధించిన భార‌త ప్లేయ‌ర్‌గా స‌ర్ఫ‌రాజ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అబిజిత్ కాలే, అటిత్ షేత్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. తాజా మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధ శతకం బాది ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్‌ టెండూల్కర్‌, కోహ్లి, రోహిత్‌ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ .. ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 62 పరుగులు సాధించాడు. అయితే దురదృష్టవశాత్తూ ముంబై కేవలం​ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 217 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ముంబై జట్టులో టాపర్డర్ రాణించినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.సర్ఫరాజ్ రీ ఎంట్రీ ఇస్తాడా?దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్‌. ఇంగ్లండ్‌పై తన అరంగేట్రంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. తర్వాత మ్యాచ్‌లలో నిలకడ లేకపోవడంతో అతడిని టెస్టు జట్టు నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు సర్ఫరాజ్‌ తన అద్భుత ప్రదర్శనలతో కేవలం టెస్టులకే కాకుండా పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు తన సిద్దమేనని సవాల్ విసురుతున్నాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ సర్ఫరాజ్ దుమ్ములేపాడు.చదవండి: ENG vs NZ: మద్యం మత్తులో దురుసు ప్రవర్తన..! ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌

Rohit Sharma wife Ritika Sajdeh buys an apartment for Rs 26 Cr: Report2
అపార్టుమెంటు కొనుగోలు చేసిన రితికా.. ధర ఎన్ని కోట్లంటే?

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన అపార్టుమెంట్‌ కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో రూ. 26.30 కోట్ల విలువ గల నివాస స్థలాన్ని ఆమె కొన్నారు. దీని విస్తీర్ణం 2760.40 చదరపు అడుగులు అని తెలుస్తోంది.అదే విధంగా.. మూడు కార్లు పార్కింగ్‌ చేసుకునే వెసలుబాటు కూడా ఉన్నట్లు సమాచారం. ‘స్క్వేర్‌ యార్డ్స్‌’ అందించిన వివరాల ప్రకారం.. ఈ అపార్డుమెంటు కొనుగోలు సమయంలో రితికా సజ్దే (Ritika Sajdeh).. రూ. 1.13 కోట్లు స్టాంపు డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలకు రూ. 30 వేలు ఖర్చు అయ్యాయి. గతేడాది డిసెంబరు 12న రిజిస్ట్రేషన్‌ పూర్తైంది.స్పోర్ట్స్‌ మేనేజర్‌అజింక్య డీవై పాటిల్‌, పూజా అజింక్య పాటిల్‌ నుంచి రితికా సజ్దే ఈ అపార్డుమెంటును కొనుగోలు చేశారు. కాగా భారత దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన రోహిత్‌ శర్మ.. రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తొలుత తన స్పోర్ట్స్‌ మేనేజర్‌గా పనిచేసిన రితికాను జీవిత భాగస్వామి చేసుకున్నాడు.నికర ఆస్తి విలువ ఎంతంటే?ఇక టీమిండియా సంపన్న క్రికెటర్లలో ఒకడైన రోహిత్‌ శర్మ (Rohit Sharma) నికర ఆస్తుల విలువ 2025 నాటికి రూ. 230 కోట్లు అని సమాచారం. వర్లీలో అతడికి దాదాపు రూ. 30 కోట్ల విలువైన అపార్టుమెంట్‌ ఉంది. అతడి దగ్గర లంబోర్గిని ఉరుస్‌, బీఎండబ్ల్యూ ఎం5 వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.ఓవైపు ఆటగాడిగా కొనసాగుతూనే క్రికెట్‌ అకాడమీ స్థాపించాడు రోహిత్‌ శర్మ. కాగా రోహిత్‌- రితికా దంపతులకు కుమార్తె సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం. ఇదిలా ఉంటే.. మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ లభిస్తుందట. ఇక మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుందని తెలుస్తోంది.చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..Rohit Sharma: కోహ్లి కంటే సన్నబడ్డాడే!.. కింగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్‌!

England captain Harry Brook fined INR 36 lakh by ECB for engaging in a fight before Ashes3
ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు రూ. 33 లక్షల ఫైన్‌.. ఎందుకంటే?

ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 1న వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేకు ముందు బ్రూక్‌ ఓ నైట్ క్ల‌బ్ బౌన్స‌ర్‌తో దురుసగా ప్ర‌వ‌ర్తించాడు.నైట్‌క్లబ్‌లోకి వెళ్లేందుకు బ్రూక్‌ ప్రయత్నించగా.. మద్యం సేవించి ఉన్నాడనే అనుమానంతో అక్కడ ఉన్న బౌన్సర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ సదరు బౌన్సర్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే ఆ గొడవలో బౌన్సర్ బ్రూక్‌ను కొట్టినట్లు సమాచారం. ఈ విషయం రెండు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది.సారీ చెప్పిన బ్రూక్‌..ఈ ఘటనపై బ్రూక్ స్పందించాడు. యాషెస్ ఐదో టెస్టు ముగిసిన తర్వాత అతడు బహిరంగ క్షమాపణలు తెలిపాడు. నేను ఆ రోజు హద్దులు మీరి ప్రవర్తించాను. అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యలతో నా జట్టుకు, దేశానికి తలవంపులు తీసుకొచ్చాను. అందుకు చాలా చాలా బాధపడుతున్నాను.ఇంగ్లండ్ క్రికెట్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఇకపై మైదానంలోనూ, బయటా ఇటువంటి తప్పులు చేయనని హామీ ఇస్తున్నాను. మరోసారి అందరికి క్షమాపణలు అడుగుతున్నాను అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో బ్రూక్ పేర్కొన్నాడు.ఈసీబీ సీరియస్‌ఇక ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంది. బ్రూక్‌కు 30,000 పౌండ్ల ( భారత కరెన్సీలో దాదాపు 33 లక్షల రూపాయలు) భారీ జరిమానా ఈసీబీ విధించింది. అంతేకాకుండా ఇదే చివరి వార్నింగ్ అంటూ ఈసీబీ హెచ్చరించింది. కాగా యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ ఘోర ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ను 4-1 తేడాతో ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఘోర పరాభావానికి ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యమే కారణమని ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విమర్శిస్తున్నారు. ఈ సిరీస్ మధ్యలో ఇంగ్లండ్ వెళ్లిన 'నూసా' (Noosa) ట్రిప్ కూడా విమర్శలకు దారితీసింది.చదవండి: అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్‌.. వీరబాదుడు.. ఒకే ఓవర్లో..

VHT: Sarfraz Shreyas Innings Goes In Vain Punjab Won 1 Run Thriller4
నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..

ముంబైకి ఊహించని షాకిచ్చింది పంజాబ్‌. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆఖరికి అభిషేక్‌ శర్మ సేన పైచేయి సాధించడంతో.. శ్రేయస్‌ అయ్యర్‌ బృందానికి నిరాశ తప్పలేదు.పంజాబ్‌ టాపార్డర్‌ కుదేలుదేశీ వన్డే టోర్నీ తాజా ఎడిషన్‌ ఎలైట్‌ గ్రూపులో భాగంగా గురువారం ముంబై- పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. జైపూర్‌ వేదికగా టాస్‌ ఓడిన పంజాబ్‌.. ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్ల దెబ్బకు పంజాబ్‌ టాపార్డర్‌ కుదేలైంది.ఆదుకున్న అన్మోల్‌, రమణ్‌దీప్‌టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌, పంజాబ్‌ కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (8), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11), హర్నూర్‌ సింగ్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట దశలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ (75 బంతుల్లో 57) ఆడగా.. నమన్‌ ధిర్‌ (22) ఫర్వాలేదనిపించాడు.216 పరుగులుఆరో స్థానంలో వచ్చిన రమణ్‌దీప్‌ సింగ్‌ అర్ధ శతకం (74 బంతుల్లో 72) సాధించగా.. బౌలర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (15), సుఖ్‌దీప్‌ బజ్వా (17) తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా 45.1 ఓవర్లలో పంజాబ్‌ 216 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్లలో ముషీర్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. శశాంక్‌ అట్రాడే, ఓంకార్‌ తుకారాం టర్మాలే, శివం దూబే తలా రెండు వికెట్లు తీశారు. సాయిరాజ్‌ పాటిల్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకంనామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు అంగ్‌క్రిష్‌ రఘువన్షి (23), ముషీర్‌ ఖాన్‌ (21) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మెరుపు అర్ధ శతకం (20 బంతుల్లో 62) సాధించాడు.శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ ఇక కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ దంచికొట్టగా (34 బంతుల్లో 45).. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ (15) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయస్‌ అవుటైన తర్వాత ముంంబై వేగంగా వికెట్లు కోల్పోయింది. శివం దూబే (12), హార్దిక్‌ తామోర్‌ (15) విఫలం కాగా.. సాయిరాజ్‌ పాటిల్‌ (2), శశాంక్‌ (0), ఓంకార్‌ (0) కనీస పోరాటపటిమ కనబరచలేకపోయారు. షామ్స్‌ ములానీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు.ఒకే ఒక్క పరుగు తేడాతోఅయితే, పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ముంబై చాపచుట్టేసింది. దీంతో పంజాబ్‌ ఒకే ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. పంజాబ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే, పేసర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గుర్నూర్‌ బ్రార్‌ చెరో నాలుగు వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించారు. మిగతా వారిలో హర్‌ప్రీత్‌ బ్రార్‌, హర్నూర్‌ సింగ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్‌.. సెలక్టర్లు పట్టించుకోరుగా!

Sarfaraz Khan Takes Abhishek Sharma To Cleaners 30 Runs In Over5
అభిషేక్‌ శర్మ ఓవర్లో సర్ఫరాజ్‌ విశ్వరూపం.. 15 బంతుల్లోనే..

ముంబై బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ మరోసారి బ్యాట్‌ ఝులిపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పంజాబ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ముఖ్యంగా పంజాబ్‌ కెప్టెన్‌, పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మకు చుక్కలు చూపించాడు.15 బంతుల్లోనేఅభిషేక్‌ శర్మ (Abhishek Sharma) వేసిన ఓవర్లో సర్ఫరాజ్‌ వరుసగా 6,4,6,4,6,4 బాదాడు. వన్‌డౌన్‌లో వచ్చి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఓవర్లో ఏకంగా ముప్పై పరుగులు పిండుకున్నాడు. వన్డే మ్యాచ్‌లో టీ20 తరహాలో విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం.. 15 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.మార్కండే బౌలింగ్‌లోపంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfraz Khan).. 62 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే, మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరగడంతో సర్ఫరాజ్‌ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.అభిషేక్‌ ఫెయిల్‌దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 ఎలైట్‌ గ్రూపులో భాగంగా.. జైపూర్‌ వేదికగా పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (8) సహా మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (11).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్నూర్‌ సింగ్‌ డకౌట్‌ కావడంతో ఆదిలోనే పంజాబ్‌కు షాక్‌ తగిలింది.అన్మోల్‌, రమణ్‌ అర్ధ శతకాలుఈ క్రమంలో అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ అర్ధ శతకం (57)తో రాణించగా.. నమన్‌ ధిర్‌ (22) అతడికి సహకరించాడు. ఇక రమణ్‌దీప్‌ సింగ్‌ సైతం హాఫ్‌ సెంచరీ (72)తో ఆకట్టుకున్నాడు. అయితే, మిగతా వారంతా తేలిపోవడంతో 45.1 ఓవర్లలో కేవలం 216 పరుగులు చేసి పంజాబ్‌ ఆలౌట్‌ అయింది.ముంబై బౌలర్లలో సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ మూడు వికెట్లతో చెలరేగగా.. శివం దూబే, శశాంక్‌ అట్రాడే, ఓంకార్‌ తుకారాం టర్మాలే తలా రెండు వికెట్లు కూల్చారు. సాయిరాజ్‌ పాటిల్‌కు ఒక వికెట్‌ దక్కింది. నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ధనాధన్‌ బ్యాటింగ్‌తో విజయం దిశగా పయనించిన ముంబై.. అనూహ్య రీతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.చదవండి: మరోసారి శతక్కొట్టిన రుతురాజ్‌.. సెలక్టర్లు పట్టించుకోరుగా!

4 players who can replace injured Tilak Varma in India's T20I squad6
తిలక్‌కు గాయం.. గిల్‌కు కలిసొస్తుందా..?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మకు గాయమైందని తెలుస్తుంది. విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌ కోసం (జమ్మూ అండ్‌ కశ్మీర్‌తో) రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్‌కు ఉన్నట్టుండి వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. సమీపంలోని గోకుల్‌ ఆసుపత్రికి తరలించి స్కాన్స్‌ తీయించగా.. "టెస్టిక్యులర్‌ టోర్షన్‌" అని నిర్ధారణ అయ్యింది.దీంతో హుటాహుటిన శస్త్రచికిత్ర చేశారు. చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తిలక్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. అతని తదుపరి క్రికెట్‌ షెడ్యూల్‌ సందిగ్దంలో పడింది. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌లో అతను పాల్గొనడం​ అనుమానంగా మారింది.ఈ నేపథ్యంలో తిలక్‌ ప్రత్యామ్నాయం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. లిస్ట్‌లో నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు భారత టెస్ట్‌, వన్డే జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ది. ఫామ్‌లో లేని కారణంగా గిల్‌కు న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కలేదు.తిలక్‌ గాయం పుణ్యమా అని అతడి​​​కి సువర్ణావకాశం​ లభించినా లభించవచ్చు. టీ20 బెర్త్‌పై ఆశలు వదులుకున్న గిల్‌కు తిలక్‌ రూపంలో అదృష్టం వరించేలా ఉందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. బీసీసీఐలో గిల్‌కు ఉన్న పలుకుబడికి న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు ప్రపంచకప్‌ బెర్త్‌ కూడా దక్కవచ్చు.అయితే అవకాశాలు గిల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. రేసులో శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌ లాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. తిలక్‌ వన్‌డౌన్‌లో లేదా నాలుగో స్థానంలో బరిలోకి దిగే బ్యాటర్‌. గిల్‌ను ఈ స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపడమంటే ప్రయోగమవుతంది. కాబట్టి సెలెక్టర్లు వన్‌డౌన్‌లో లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న రుతురాజ్‌, పడిక్కల్‌, శ్రేయస్‌ పేర్లను పరిశీలించవచ్చు.పైగా వీరంతా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా పడిక్కల్‌, రుతురాజ్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పడిక్కల్‌ 6 మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు చేసి పీక్స్‌లో ఉండగా.. రుతురాజ్ తాజాగా ఓ సెంచరీ చేయడంతో పాటు గత నాలుగు మ్యాచ్‌ల్లో మరో సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.వీరితో పాటు శ్రేయస్‌కు కూడా అవకాశాలు లేకపోలేదు. మిడిలార్డర్‌లో తిలక్‌ స్థానానికి అతడు సరైన న్యాయం చేయగల సమర్థుడు. మొత్తంగా తిలక్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు దూరమైతే, ఆ బెర్త్‌ భర్తీ చేసేందుకు నలుగురు పోటీలో ఉంటారు. తిలక్‌ గాయంపై బీసీసీఐ అధికారిక​ అప్‌డేట్‌ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

National Coach Suspended Over These Allegations By 17 YO Female Shooter7
షూటర్‌పై దారుణానికి తెగబడిన కోచ్‌!.. సస్పెన్షన్‌ వేటు

జాతీయ షూటింగ్‌ కోచ్‌ అంకుశ్‌ భరద్వాజ్‌పై వేటు పడింది. తనపై అతడు లైంగిక దాడికి పాల్పడినట్లు భారత షూటర్‌, పదిహేడేళ్ల అమ్మాయి హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫరీదాబాద్‌ హోటల్‌లో అంకుశ్‌ భరద్వాజ్‌ తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది.రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడిన్యూఢిల్లీలో డాక్టర్‌ కర్ణి సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న వేళ.. ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. పోటీలో తన ప్రదర్శను విశ్లేషిస్తున్నట్లుగా నటిస్తూ అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. తొలుత హోటల్‌ లాబీలో తనను కలవాలని ఆదేశించిన కోచ్‌ అంకుశ్‌.. ఆ తర్వాత రూమ్‌కు రావాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు తెలిపింది.అతడు చెప్పినట్లు వినకపోయినా.. ఈ విషయం గురించి బయటకు చెప్పినా తన కెరీర్‌ నాశనం చేస్తానని.. కుటుంబాన్ని కూడా వదిలిపెట్టనని అతడు బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు సదరు మైనర్‌ షూటర్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. అంకుశ్‌ భరద్వాజ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణ చేపట్టాముఈ విషయం గురించి ఫరీదాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనపై విచారణ చేస్తున్నాము. ఘటన జరిగిన నాటి సీసీటీవీ ఫుటేజీ, ఇతర వివరాలు ఇవ్వాల్సిందిగా హోటల్‌ అధికారులను అడిగాము’’ అని తెలిపారు. కాగా నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI) నియమించిన 13 మంది జాతీయ కోచ్‌లలో అంకుశ్‌ ఒకడు.ఈ ఘటన నేపథ్యంలో NRAI సెక్రటరీ జనరల్‌ పవన్‌ కుమార్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘‘మీడియా ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. విచారణ పూర్తయ్యేంతవరకు అంకుశ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నాం. అతడికి ఇకపై ఎలాంటి పనులు అప్పగించబోము’’ అని తెలిపారు.కాగా ఘటన తర్వాత బాధితురాలు భయంతో హోటల్‌ వీడగా.. ఇంట్లో వాళ్లు ఆరా తీయడంతో విషయం మొత్తం వారికి చెప్పినట్లు సమాచారం. తనతో పాటు మరో మహిళా షూటర్‌ను కూడా అంకుశ్‌ ఇబ్బందిపెట్టాడని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.చదవండి: భారత క్రికెటర్‌కు ‘గిఫ్ట్‌’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!

Steve Smith drops shocking hint at early retirement after Ashes triumph8
స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి షాకింగ్‌ న్యూస్‌

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు సంబంధించి షాకింగ్‌ వార్త తెలుస్తుంది. త్వరలో అతను టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానన్న సంకేతాలు ఇచ్చాడు. కమిన్స్‌ గైర్హాజరీలో తాత్కాలిక సారధిగా వ్యవహరించి స్వదేశంలో యాషెస్‌ సిరీస్‌ (4-1) గెలిచిన అనంతరం స్టీవ్‌ తన భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఫాక్స్‌ టీవీతో మాట్లాడతూ ఇలా అన్నాడు. స్వదేశంలో మరోసారి యాషెస్‌ గెలిచినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇదే సిరీస్‌ను ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో గెలవలేకపోయాను. అది సాధించాలని ఉంది. కానీ, వచ్చే ఏడాది (2027) అక్కడ ఉంటానో లేదో తెలీదంటూ పరోక్షంగా తన రిటైర్మెంట్‌పై సంకేతాలు పంపాడు. స్టీవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌ సర్కిల్స్‌లో దుమారం రేపుతున్నాయి. స్టీవ్‌ టెస్ట్‌ ప్రస్తానంపై మరో రెండు, మూడేళ్లు ఆశలు పెట్టుకున్న ఆసీస్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్టీవ్‌ రిటైర్మెంట్‌ ఇప్పట్లో ఆలోచన పెట్టుకోవద్దంటూ ఫ్యాన్స్‌ నెట్టింట సందేశాలు పంపుతున్నారు. మొత్తంగా స్టీవ్‌ ఎడిసోడ్‌ ఆసీస్‌ అభిమానులకు యాషెస్‌ గెలిచామన్న సంతోషాన్ని మిగలకుండా చేస్తుంది.కాగా, స్వదేశంలో యాషెస్‌ సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌పై మరోసారి ఆధిపత్యాన్ని చాటింది. ఈ సిరీస్‌లో ఆసీస్‌ ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లో పైచేయి సాధించి తిరుగులేని జట్టుగా నిలిచింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా, ఉన్న వాళ్లతో స్టీవ్‌ అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు. ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ స్టార్క్‌, అలెక్స్‌ క్యారీ ఈ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్టీవ్‌ స్వయంగా కూడా రాణించాడు.యాషెస్‌ ట్రోఫీ అందుకున్న తర్వాత స్టీవ్‌ తమ రెగ్యులర్‌ కెప్టెన్‌ కమిన్స్‌ చేతికి దాన్ని అందించి అభిమానుల హృదయాలను గెలిచాడు. సిరీస్‌ ఆధ్యాంతం రాణించిన స్టార్క్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌.. ఇవాళ ముగిసిన చివరి టెస్ట్‌లో సత్తా చాటిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు లభించాయి.ఈ సిరీస్‌తో ఆసీస్‌ తమ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరి సేవలు కోల్పోనుంది. వెటరన్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ సిరీస్‌లో ఆసీస్‌ హాజిల్‌వుడ్‌ (5 టెస్ట్‌లు), కమిన్స్‌ (4 టెస్ట్‌లు), నాథన్‌ లియోన్‌ (3 టెస్ట్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (ఒక టెస్ట్‌) సేవలు వినియోగించుకోకుండానే ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం విశేషం.

VHT 2025 26: Ruturaj Gaikwad Slams Century Vs Goa Fans Reacts9
మరోసారి శతక్కొట్టిన రుతురాజ్‌.. సెలక్టర్లు పట్టించుకోరుగా!

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి శతక్కొట్టాడు. గోవాతో మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలమైన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రుతు.. మొత్తంగా 131 బంతులు ఎదుర్కొని 134 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.రుతురాజ్‌ (Ruturaj Gaikwad) శతక ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాగా దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 279 పరుగులు సాధించాడు. తాజాగా గోవాతో గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మహారాష్ట్ర కెప్టెన్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.గోవా బౌలర్ల దెబ్బకు టాపార్డర్‌ కుదేలుజైపూర్‌ వేదికగా గోవాతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ చేసింది. గోవా పేసర్‌ వాసుకి కౌశిక్‌ అర్షిన్‌ కులకర్ణిని డకౌట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (1)ను అర్జున్‌ టెండుల్కర్‌ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన కౌశిక్‌.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అంకిత్‌ బావ్నే(0), సిద్ధార్థ్‌ మాత్రే (27 బంతుల్లో 3)లను కూడా వెనక్కి పంపాడు.🚨 Ruturaj Gaikwad Show in Vijay Hazare TrophyRuns - 134Balls - 1314/6 - 8/6Maharastra was 5 down on Just 25 runs and then he scored valuable century.He deserved the part of Indian ODI squad but he got dropped due to politics of Gautam Gambhir 💔pic.twitter.com/Ts0ubxdo1b— Tejash (@Tejashyyyyy) January 8, 2026ఆదుకున్న రుతురాజ్‌ఈ క్రమంలో సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన మహారాష్ట్రను రుతురాజ్‌ అజేయ శతకం (134)తో ఆదుకున్నాడు. అతడికి తోడుగా లోయర్‌ ఆర్డర్‌లో విక్కీ ఓస్త్వాల్‌ హాఫ్‌ సెంచరీ (53)తో మెరవగా.. రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌ (19 బంతుల్లో 32 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టాడు. ఫలితంగా మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగలిగింది.శతకాలు బాదుతున్నా.. సెలక్టర్లు పట్టించుకోరుగా!ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రుతురాజ్‌ శతకం సాధించాడు. ఆ తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌పై, తాజాగా గోవాపై శతక్కొట్టాడు. అయితే, సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డేలు ఆడే భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు.గత సిరీస్‌లో సెంచరీతో అలరించినా సెలక్టర్లు రుతురాజ్‌కు మొండిచేయి చూపారు. గాయం నుంచి కోలుకుని మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి రావడంతో అతడిపై వేటు పడింది. మరోవైపు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు వన్డేల్లో మెరుగైన రికార్డు లేకపోయినా మరోసారి అతడికి జట్టులో చోటు దక్కింది.వికెట్‌ కీపర్‌గానూ సత్తా చాటితేనేఈ నేపథ్యంలో మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. వికెట్‌ కీపర్‌గానూ రుతురాజ్‌ సత్తా చాటితేనే తిరిగి అతడు టీమిండియాలో అడుగుపెట్టగలడని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. రుతుకు టీమిండియా తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే కనిపిస్తోందని మరో మాజీ క్రికెటర్‌ సదగోపన్‌ రమేశ్‌ అన్నాడు. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 9 వన్డేలు ఆడిన రుతు.. 28.5 సగటుతో 228 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. అయితే, రుతు బ్యాటింగ్‌ సగటు తక్కువగా ఉండటం వల్ల బ్యాకప్‌ ఓపెనర్‌గా అయినా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయిందని చెప్పవచ్చు.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

HARDIK PANDYA SMASHED 75 RUNS FROM JUST 31 BALLS IN VIJAY HAZARE TROPHY10
హార్దిక్‌ పాండ్యా మహోగ్రరూపం

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో తానాడిన తొలి మ్యాచ్‌లోనే (విదర్భపై 92 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు) విధ్వంసకర శతకం బాదిన అతను.. ఇవాళ (జనవరి 8) తన రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్‌పై మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేశాడు.మొత్తంగా ప్రస్తుత విజయ్‌ హజారే ట్రోఫీలో 125 బంతులు ఎదుర్కొన్న హార్దిక్‌.. 21 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 208 పరుగులు చేసి మహోగ్రరూపంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం ​కానున్న న్యూజిలాండ్‌ సిరీస్‌లో హార్దిక్‌ ఇదే జోరును కొనసాగిస్తే పర్యాటక జట్టుకు తిప్పలు తప్పవు. జనవరి 21 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో హార్దిక్‌ కీలక సభ్యుడు. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టే ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగుతుంది. హార్దిక్‌ ఇదే ఫామ్‌లో ఉంటే ప్రపంచకప్‌లో టీమిండియాకు తిరుగుండదు. గత వరల్డ్‌కప్‌లోనూ హార్దిక్‌ టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఛత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న బరోడా 36.5 ఓవర్ల అనంతరం 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఓపెనర్లు నితిన్‌ పాండ్యా (2), అమిత్‌ పాసి (5) నిరాశపర్చినా.. ప్రయాన్షు మోలియా (79 నాటౌట్‌), విష్ణు సోలంకి (54), హార్దిక్‌ పాండ్యా (75), జితేశ్‌ శర్మ (64 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. మోలియా, జితేశ్‌ ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్‌ అన్న కృనాల్‌ పాండ్యా (20) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement