Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

RCB Captain Rajat Patidar False Decisions Leads To Match Lost Vs DC1
తలతిక్క నిర్ణయాలతో కొంపముంచిన పటీదార్‌!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఓటమిని కొనితెచ్చుకుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తలా తోక లేని నిర్ణయాలతో జట్టు ఓటమికి బాటలు వేశాడు. అదెలాగంటే 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో అక్షర్ పటేల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్‌, హాజిల్‌వుడ్ ప్రధాన బౌలర్లు. మ్యాచ్‌లో గెలిచే దశలో ఉన్న సమయంలో ప్రధాన బౌలర్లను చివరి ఓవర్లలో బౌలింగ్ చేయించాలి. కానీ ఇక్కడే పటిదార్ తెలివితక్కువ పని చేశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు ముగిసేరికి 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరోవైపు హాజిల్‌వుడ్ వికెట్లేమీ తీయకపోయినప్పటికీ 3 ఓవర్ల వరకు ఎకానమీ రేటు బాగానే ఉంది. అయితే పటీదార్ డెత్ ఓవర్ల వరకు వీరిని అంటిపెట్టుకోకుండా మధ్యలోనే కోటా పూర్తి చేయించాడు. ఇదే ఆర్సీబీని దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. భువనేశ్వర్‌, హాజిల్‌వుడ్ కోటా పూర్తవ్వడం, సుయాశ్ శర్మ ప్రభావం చూపించకపోవడంతో పటీదార్ రసిక్ సలామ్ చేతిలో బంతిని పెట్టాడు.గత మ్యాచ్‌లో మెరిసిన రసిక్ సలామ్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి వికెట్ తీయకపోగా 40 పరుగులిచ్చాడు. ఆఖరి ఓవర్ వేసిన షెపర్డ్ ఒత్తిడిలో సరిగ్గా బౌలింగ్ చేయలేక 17 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. అదే భువనేశ్వర్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరితో చివరి ఓవర్ వేయించి ఉంటే ఆర్సీబీ గెలిచి ఉండేదేమో. ఏది ఏమైనా పటీదార్ తన తిక్క నిర్ణయంతో చేజేతులా ఆర్సీబీకి ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

RCB Worst Record-Lost 1st-50th-100th Match In Chinnaswamy Stadium2
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెత్త రికార్డు

ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్యావరణ పరిరక్షణ హితం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. అయితే గ్రీన్ జెర్సీ ఆర్సీబీకి కలసిరాదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఈ సంగతి పక్కనబెడితే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ఆర్సీబీకి వందోది కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తాము ఆడిన తొలి మ్యాచ్‌తో పాటు 50వ మ్యాచ్‌, తాజాగా వందో మ్యాచ్‌లోనూ ఓటమిపాలవ్వడం గమనార్హం. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనే మెక్‌కల్లమ్ సెంచరీ బాదాడు. ఇక 2016లో ఇదే చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆర్సీబీ 50వ మ్యాచ్ ఆడింది. తాజాగా యాదృశ్చికంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో తన వందో మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి మరోసారి ఓటమే ఎదురయ్యింది. ఇక 2011 నుంచి ప్రతీ సీజన్‌లో ఒక మ్యాచ్‌కు ఆర్సీబీ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగడం ఆనవాయితీగా చేసుకుంది. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు గ్రీన్ జెర్సీలో 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట ఓడి కేవలం ఐదింట మాత్రమే నెగ్గింది.

Delhi Capitals Batter David Miller Played Key Role In RCB Match 3
వారెవ్వా మిల్లర్‌.. ఆరోజు ఏడ్చి.. ఈరోజు న‌వ్వి!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్ అది. కేవ‌లం ఒక్క ప‌రుగుతో గుజ‌రాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోవ‌డానికి డేవిడ్ మిల్ల‌ర్ ప్ర‌ధాన కార‌ణ‌మయ్యాడు. ఆఖ‌రి బంతికి రెండు పరుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో అన‌వ‌స‌ర ఒత్తిడికి పోయిన మిల్ల‌ర్ ఢిల్లీకి చేజేతులా ఓట‌మిని అందించాడు. ఈ చ‌ర్య మిల్ల‌ర్‌ను కంట‌త‌డి పెట్టేలా చేసింది. మ‌రో అవ‌కాశం వ‌స్తే ఢిల్లీకి విజ‌యాన్ని అందించి త‌న త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని మిల్ల‌ర్ పేర్కొన్నాడు. అయితే త‌న త‌ప్పు స‌రిదిద్దుకునే రోజు ఇంత తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని బ‌హుశా మిల్ల‌ర్ కూడా ఊహించి ఉండ‌డు. ఇవాళ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆడిన‌ మ్యాచ్‌ మ‌రోసారి ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు వెళ్లింది. 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ఆఖ‌రి ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. క్రీజులో మిల్ల‌ర్‌తో పాటు స్ట‌బ్స్ ఉన్నాడు. తొలి బంతికి మిల్ల‌ర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి స్ట‌బ్స్ సింగిల్ తీశాడు. ఇక 4 బంతుల్లో 13 ప‌రుగులు అవ‌స‌రం. స్ట్రైక్‌లో ఉన్న మిల్ల‌ర్ ఈసారి ఢిల్లీని గెలిపించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు. షెప‌ర్డ్ వేసిన మూడో బంతిని మిల్ల‌ర్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స‌ర్ కొట్టాడు. ఇక మ‌రుస‌టి బంతిని ఈసారి మిల్ల‌ర్ ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్ మీదుగా మ‌రో సిక్స‌ర్ సంధించాడు. దీంతో స‌మీక‌ర‌ణం రెండు బంతుల్లో ఒక ప‌రుగుకు మారిపోయింది. గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో చేసిన పొర‌పాటును మ‌ళ్లీ చేయ‌కుండా షెప‌ర్డ్ వేసిన ఐదో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశ‌గా బౌండ‌రీ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. మొత్తం మీద గుజరాత్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమికి తానే కారణమని ఏడ్చిన మిల్లర్ ఇవాళ మాత్రం తన జట్టును గెలిపించి లెక్క సరిచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 63, టిమ్ డేవిడ్ 26 పరుగులు చేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 6,6,4 BY DAVID MILLER WHEN DELHI NEEDED 13 FROM 4 🥶- DC got David Miller for Base Price. pic.twitter.com/9HVbfezmuI— Johns. (@CricCrazyJohns) April 18, 2026చదవండి: సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌!

 IPL 2026: Miller takes Delhi to penultimate-ball win4
ఉత్కంఠ పోరు.. ఢిల్లీని గెలిపించిన డేవిడ్‌ మిల్లర్‌

ఐపీఎల్‌-2026 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌(63) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడీ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. ముఖేష్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.మిల్లర్‌.. కిల్లర్‌అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే భారీ షాకిచ్చాడు. భువీ ధాటికి ఢిల్లీ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్‌(57), ట్రిస్టన్ స్టబ్స్‌(60 నాటౌట్‌) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రాహుల్ ఔటయ్యాక ఆర్సీబీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌(26 రిటైర్డ్ హార్ట్‌) భారీ షాట్ల ఆడడంలో విఫలమయ్యాడు.అతడితో పాటు స్టబ్స్ కూడా కాస్త నెమ్మదించాడు. దీంతో ఢిల్లీ కావాల్సిన రన్‌రేట్ పెరుగుతూ వచ్చింది. అయితే అక్షర్ పటేల్ తొడ కండరాలు పట్టేయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్ కూడా బంతిని స్ట్రైక్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. రషీక్ ధార్ సలాం వేసిన 19 ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 6 బంతుల్లో 15 పరుగులగా మారింది.ఆర్సీబీ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను రొమోరియా షెఫర్డ్‌కు అప్పగించాడు. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి నాలుగు బంతుల్లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. వరుసగా మూడు, నాలుగు బంతులను భారీ సిక్సర్లగా మిల్లర్ మలిచాడు. ఐదో బంతిని బౌండరీ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. మిల్లర్ 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లతో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Ravichandran Ashwin Predicts Sanju Samson Will Lead Chennai Super Kings5
సీఎస్‌కే కొత్త కెప్టెన్ సంజూ శాంస‌న్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆరంభంలో వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బంది ప‌డిన‌ప్ప‌టికీ వ‌రుస‌గా రెండు విజ‌యాలు సాధించి సీఎస్‌కే గాడిన ప‌డింది. కానీ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఈ నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ సీఎస్‌కే కెప్టెన్సీ విష‌య‌మై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. సంజూ శాంస‌న్ సీఎస్‌కేకు కొత్త కెప్టెన్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. అది ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డాడు. ఒక‌వేళ ఈ సీజ‌న్‌లో కాకపోయినా భ‌విష్య‌త్తులో మాత్రం శాంస‌న్ సీఎస్‌కేను శాసిస్తాడ‌ని జోస్యం చెప్పాడు. ప్ర‌స్తుతం వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సీఎస్‌కేకు కెప్టెన్సీ అనుభ‌వం ఉన్న ఆట‌గాడు అవ‌స‌రమ‌ని, ఈ విష‌యంలో సీఎస్‌కేకు మొద‌టి చాయిస్ సంజూనే అని తెలిపాడు. ఇప్ప‌టికే సంజూ శాంస‌న్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఫైన‌ల్ చేర్చిన‌ట్లు గుర్తుచేశాడు. దీంతో సీఎస్‌కే యాజ‌మాన్యం ఈ సీజ‌న్ మ‌ధ్య‌లోనే రుతురాజ్‌ను త‌ప్పించి శాంస‌న్‌కు బాధ్య‌త‌లు అప్పగించినా ఆశ్చ‌ర్చ‌పోన‌వ‌స‌రం లేద‌ని తెలిపాడు. ఫామ్‌లేమితో స‌త‌మ‌త‌మ‌వుతున్న రుతురాజ్ ఈ సీజ‌న్‌లోనే కెప్టెన్సీ వ‌దిలేసే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని జోస్యం చెప్ప‌డం గ‌మ‌నార్హం.ప్ర‌స్తుతం అశ్విన్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక ఎంఎస్ ధోని సార‌ధ్యంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఐదుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ధోని కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాక సీఎస్‌కే ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు. ధోని త‌ర్వాత కెప్టెన్లు ఎంద‌రు మారినా సీఎస్‌కే మ‌రో టైటిల్ కొట్ట‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌య్యింది. 2022 సీజ‌న్‌లో ధోని స్థానంలో ర‌వీంద్ర జ‌డేజాను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ కెప్టెన్‌గా ఒత్తిడిని త‌ట్టుకోలేక జ‌డేజా దానిని మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు. దీంతో గత్యంత‌రం లేక మ‌ళ్లీ ధోనికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అలా 2023 సీజ‌న్‌లోనూ సీఎస్‌కేను న‌డిపించిన ధోని ఐదోసారి చాంపియ‌న్‌గా నిలిపాడు. ఆ త‌ర్వాత 2024 సీజ‌న్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియ‌మించింది. కానీ ఆ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్ చేర‌డంలో విఫ‌ల‌మైంది. ఇక 2025 సీజ‌న్‌లో రుతురాజ్ సార‌థ్యంలోని సీఎస్‌కే దారుణ ఆట‌తీరుతో అట్ట‌డుగు స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది.చదవండి: పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌!

HCA launches EOI process for TG20 franchise ownership ahead of 2026 debut6
ఐపీఎల్ తరహాలో తెలంగాణ టీ20 లీగ్‌.. జట్ల కోసం టెండర్లు ఆహ్వానం

మొట్ట మొద‌టి తెలంగాణ టీ20 లీగ్ ఎడిష‌న్‌ను నిర్వ‌హించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స‌న్న‌ద్ద‌మైంది. జూన్‌లో జ‌ర‌గ‌నున్న ఈ టోర్నమెంట్‌లో జట్ల యాజమాన్యం కోసం టెండర్ ప్రక్రియను హెచ్‌సీఏ ప్రారంభించింది. జట్టు యాజమాన్య హక్కులు మొదటి 5 ఏళ్ల కాలానికి ఇవ్వబడతాయి.ఆ త‌ర్వాత ప్రతి 3 ఏళ్లకు ఒకసారి రెన్యూవ‌ల్ చేస్తారు. ఒక్కో జట్టుకు కనీస బిడ్ ధర రూ. 3 కోట్లుగా నిర్ణ‌యించారు. ఆటగాళ్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు, వసతి, జెర్సీల ఖర్చులను ఫ్రాంచైజీ యజమానులే భరించాలి. కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ఏప్రిల్ 28లోపు టెండర్‌ పత్రాలు సమర్పించాలి. ఏప్రిల్ 30న షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలను ప్రకటించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గోనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్ ,మహబూబ్‌నగర్ ప్రాంతాలను ప్రాతిపాదించారు. ఆఖరికి బిడ్డింగ్ ద్వారా 8 జట్లను ఖరారు చేస్తారు. ఈ టోర్నీ 21 రోజులు పాటు ఉప్పల్ మైదానం వేదికగా జరగనుంది. మొత్తంగా 32 మ్యాచ్‌లు జరుగుతాయి.

IPL 2026: Sunrisers Hyderabad Vs Chennai Super Kings Match Live Updates7
IPL 2026: బ్రెవిస్‌ డకౌట్‌.. ఐదో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే

SRH Vs CSK Updatesబ్రెవిస్‌ డకౌట్‌113 పరుగుల వద్ద సీఎస్‌కే ఐదో వికెట్‌ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ను శివాంగ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్‌ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్‌కేఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్‌ మాత్రే (30), రుతురాజ్‌ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్‌కే టార్గెట్ 195 ప‌రుగులుసీఎస్‌కేతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (59), క్లాసెన్ (59) అర్థ‌సెంచ‌రీలతో రాణించారు. వీరిద్ద‌రు రాణించిన‌ప్ప‌టికీ మిగ‌తావారు విఫ‌లం కావ‌డంతో ఎస్ఆర్‌హెచ్ 200 స్కోరును దాట‌లేక‌పోయింది. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో జేమి ఓవ‌ర్ట‌న్‌, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్‌నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్‌ఆర్‌హెచ్‌ 177 పరుగుల వద్ద 6వ వికెట్‌ కోల్పోయింది. 18వ ఓవర్‌లో క్లాసెన్‌ (59) కంబోజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్‌ఆర్‌హెచ్‌ 150 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. 13వ ఓవర్‌లో నితీష్‌కుమార్‌ (12) ఓవర్‌టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్‌ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ జేమీ ఓవర్టన్‌ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ముకేశ్‌ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్‌ రుతురాజ్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ..సీఎస్‌కేతో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్‌ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్ట‌పోకుండా 38 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ 26, హెడ్ 11 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్‌ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడు తున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ముఖాముఖి పోరులో ఇరుజ‌ట్లు 22 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఇందులో సీఎస్‌కే 15 విజ‌యాలలు, ఎస్ఆర్‌హెచ్ 7 విజ‌యాలు సాధించాయి. చివ‌రి ఐదు మ్యాచ్‌ల విష‌యానికొస్తే ఎస్ఆర్‌హెచ్ 3, సీఎస్‌కే రెండింట నెగ్గాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్‌ కీపర్‌), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట​ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్

Former Afghan cricketer Shapoor Zadran hospitalised in India8
పరిస్థితి విషమం.. ఐసీయూలో మాజీ స్టార్‌ క్రికెటర్‌!

38 ఏళ్ల అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షాపుర్ జద్ర‌న్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లర‌క్త క‌ణాల సంఖ్య ప‌డిపోవ‌డంతో ప్ర‌స్తుతం షాపుర్ జ‌ద్ర‌న్‌ భార‌త్‌లోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో ఐసీయూలో ఉన్నాడు. తెల్ల‌ర‌క్త క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో అత‌డి ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు పేర్కొన్నారు. మ‌రో 18 గంట‌లు గ‌డిస్తే కానీ షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి ఏంట‌నేది చెప్పలేమ‌ని వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అఫ్గానిస్తాన్ క్రికెట్ అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. సోష‌ల్‌మీడియాలో కూడా షాపుర్ జ‌ర్ద‌న్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే కొన్ని వారాల కింద‌టే తీవ్ర అనారోగ్యానికి గురైన షాపుర్ జ‌ద్ర‌న్ చాలా రోజుల ఆసుప‌త్రిలోనే చికిత్స పొందాడు. ఇటీవ‌లే డిశ్చార్జి అయిన అత‌డు మ‌రోసారి ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న షాపుర్ జ‌ద్ర‌న్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోన‌య్యాడు. జ‌ద్ర‌న్ త‌న‌కు మంచి మిత్రుడ‌ని, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. పాక్‌కు చెందిన మ‌రో మాజీ క్రికెట్ షాహిద్ అఫ్రిది కూడా షాపుర్ జ‌ద్ర‌న్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌యం తెలుసుకొని బాధ‌ప‌డ్డాడు. అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడిన షాహిద్ అఫ్రిది త‌న చిర‌కాల మిత్రుడు షాపుర్ జ‌ద్ర‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ ఎదుగుద‌ల‌లో షాపుర్ జ‌ద్ర‌న్ కీల‌క పాత్ర పోషించాడు. ద‌శాబ్దానికి పైగా ఆఫ్గ‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన షాపుర్ జ‌ద్ర‌న్ నిప్పులు చెరిగే బంతుల‌తో ప్ర‌పంచ మేటి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. స్టీవ్ స్మిత్‌, కేన్ విలియ‌మ్స‌న్‌, డేవిడ్ వార్న‌ర్ వంటి బ్యాట‌ర్ల‌ను త‌న స్వింగ్ బౌలింగ్‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టి పెవిలియ‌న్ చేర్చాడు. 2009లో స్కాట్లాండ్‌తో వ‌న్డే మ్యాచ్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షాపుర్ జ‌ద్ర‌న్ అప్గానిస్తాన్ త‌ర‌ఫున 43 వ‌న్డేల్లో 43 వికెట్లు, 32 టీ20ల్లో 27 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అఫ్గానిస్తాన్ త‌ర‌ఫున మూడు టీ20 ప్ర‌పంచ‌క‌ప్పుల్లో పాల్గొన్న షాపుర్ జ‌ద్ర‌న్ 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో స్కాట్లాండ్‌పై విజ‌యం సాధించి ఐసీసీ టోర్నీల్లో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసిన అఫ్గానిస్తాన్ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు.Zardan brother is like a buddy to me. I am wishing him speedy recovery. Ameen🤲 pic.twitter.com/8oGPUVwHai— Umar Akmal (@Umar96Akmal) April 17, 2026చదవండి: స్టేడియంలో కనిపించని ప్రీతిజింటా.. అసలేమైంది?

I Was Clueless: Shreyas Iyer On Sarpanch Title At Punjab Kings9
సర్పంచ్‌ సాబ్‌!.. అర్థమేంటో తెలియదు: శ్రేయస్‌ అయ్యర్‌

శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకుంటోంది. ఐపీఎల్‌-2025లో ఫైనల్‌కు చేరిన పంజాబ్‌.. ఈ ఏడాది వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన నాలుగూ గెలిచింది.అగ్రస్థానంలోతద్వారా తొమ్మిది పాయింట్లు సాధించి.. ప్రస్తుతానికి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా శ్రేయస్‌ అయ్యర్‌ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు 2024లో టైటిల్‌ అందించిన శ్రేయస్‌.. 2025లో పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. గతేడాది 604 పరుగులు సాధించిన ఈ ముంబైకర్‌.. ఈ ఏడాది ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 203 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్‌ పంజాబ్‌ ఫ్రాంఛైజీతో చేరిననాటి నుంచి ఆ జట్టు అభిమానులు తమ కెప్టెన్‌ను ముద్దుగా సర్పంచ్‌ సాబ్‌ అని పిలుచుకుంటున్నారు.అర్థం ఏమిటో తెలియదుఅయితే, ఫ్యాన్స్‌ తనను అలా ఎందుకు పిలిచేవారో ముందుగా అర్థం కాలేదన్నాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఆ తర్వాత జట్టు సభ్యులను అడిగితే అసలు విషయం తెలిసిందన్నాడు. జియోస్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘ఆ పిలుపు నాకెంతగానో నచ్చింది. అయితే, పంజాబ్‌ కింగ్స్‌తో ప్రయాణం మొదలుపెట్టినపుడు సర్పంచ్‌ సాబ్‌ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు.అప్పడు నా సహచర ఆటగాళ్లను అడుగగా.. ‘సర్పంచ్‌ అంటే.. ఇంటి పెద్ద లేదంటే ఓ సమూహానికి పెద్ద అని అర్థం.. జిల్లా పెద్దను ఇలాగే పిలుస్తారు’ అని చెప్పారు. అప్పటి నుంచి ఈ బిరుదును మరింత ఎక్కువగా ఆస్వాదిస్తున్నాను’’ అని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘విరాట్‌ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’

RCB become first team to play 100 IPL matches in Chinnaswamy Stadium10
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. తొలి జట్టుగా రికార్డు

ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు అరుదైన మైలు రాయిని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఇది వందో మ్యాచ్‌. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా బెంగళూరు రికార్డులకెక్కింది. ఐపీఎల్‌ తొట్ట తొలి సీజన్‌(2008) ఆర్సీబీ హోం గ్రౌండ్‌గా చిన్నస్వామి స్టేడియం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంలో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 46 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ టై కాగా.. మరో నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి.ఈ మైదానంలో ఆర్సీబీకి అద్భుతమైన రికార్డు ఉంది. 2013 సీజన్‌లో ఇదే స్టేడియంలో పూణే వారియర్స్‌పై ఆర్సీబీ 263 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఆర్సీబీ తర్వాత స్ధానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఉంది. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లు ఆడింది.ఇక ఈ ఏడాది సీజన్‌ విషయానికి వస్తే.. ఆర్సీబీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ నాలుగింట విజయాలు సాధించగా, ఓ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో కొనసాగుతోంది.చదవండి: IPL 2026: సీఎస్‌కేతో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌ జట్టులోకి యార్కర్ల కింగ్‌?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement