ప్రధాన వార్తలు
'రెహ్మాన్ దకైత్' స్టయిల్లో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా
ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్వాగతం పలికింది. ఇటీవల సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్'లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ దకైత్’ పాత్రను పోలి ఉండేలా ఓ స్పెషల్ వీడియోను రూపొందించి సోషల్మీడియాలో రిలీజ్ చేసింది. 𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 202684 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. 'ఖమ్మా ఘనీ, రాజస్థాన్' అంటూ అభిమానులను పలకరించాడు. ఇది ధురంధర్ సినిమాలో రెహ్మాన్ దకైత్ 'అస్సలాం వాలేకుం, లియారీ' అన్న సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్మీడియాలో వైరలవుతుంది.జడేజాను 2026 ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రూ. 14 కోట్లకు సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఈ మూవ్ జడేజాకు హోం కమింగ్ లాంటిది. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్ను 2008లో రాజస్థాన్ రాయల్స్తోనే ప్రారంభించాడు. ఆతర్వాత సీఎస్కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్తో 2 సీజన్లు ఆడి తిరిగి రాయల్స్ గూటికే చేరాడు. 2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు తీశాడు. ప్రస్తుత రాయల్స్ జట్టు జడేజా చేరికతో మరింత బలపడింది. సంజూ శాంసన్ రాయల్స్ను వీడటంతో ఈ సీజన్తో రియాన్ పరాగ్ ఫుల్టైమ్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. జడేజాతో పాటు ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ కూడా సీఎస్కే నుంచి రాయల్స్కు ట్రేడ్ అయ్యాడు. మరో ఆల్రౌండర్ డొనొవన్ ఫెరియెరా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాయల్స్లోకి వచ్చాడు.అప్పటికే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హెట్మైర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లాంటి విధ్వంసకర వీరులతో రాయల్స్ బ్యాటింగ్ విభాగం కలకలలాడుతుండింది. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, క్వేనా మఫాకా లాంటి బౌలర్లతో సమతూకంగా ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్కు మరో కీలక పదవి
ఢిల్లీ క్యాపిటల్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హేమంగ్ బదానీకి మరో కీలక పదవి దక్కింది. హండ్రెడ్ లీగ్లోని సదరన్ బ్రేవ్ పురుషుల ఫ్రాంచైజీ కూడా అతన్నే హెడ్ కోచ్గా నియమించింది. ఈ రెండు ఫ్రాంచైజీలకు GMR గ్రూప్ సహ యజమానిగా ఉంది. బ్రేవ్ యాజమాన్యం బదానీకి డిప్యూటీగా (అసిస్టెంట్ కోచ్) ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్ను ఎంపిక చేసింది.GMR గ్రూప్కు ఐపీఎల్ హండ్రెడ్ లీగ్తో పాటు మేజర్ లీగ్ క్రికెట్ (Seattle Orcas), ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (Dubai Capitals) కూడా ఫ్రాంచైజీలు ఉన్నాయి.సదరన్ బ్రేవ్ గత ప్రదర్శనలుసదరన్ బ్రేవ్ ఫ్రాంచైజీ హండ్రెడ్ లీగ్ తొలి ఎడిషన్లో విజేతగా నిలిచింది. ఆతర్వాత 2024 ఎడిషన్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్లో మాత్రం సగం మ్యాచ్లు ఓడి, నాకౌట్స్కు కూడా చేరలేకపోయింది.కాగా, హండ్రెడ్ లీగ్ 2026 ఎడిషన్ జులై 21 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఎంఐ లండన్, సన్రైజర్స్ లీడ్స్ పోటీపడనున్నాయి. జులై 22న జరిగే మ్యాచ్లో సదరన్ బ్రేవ్ వెల్ష్ ఫైర్తో తలపడుతుంది.తొలిసారి వేలంహండ్రెడ్ లీగ్లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్ల ఎంపిక జరుగనుంది. ఈ వేలం మార్చి 11, 12 తేదీల్లో జరుగనుంది. 18 దేశాలకు చెందిన 400 మంది ఆటగాళ్లు వేలానికి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ వేలంలో మొత్తం 8 ఫ్రాంచైజీలు పోటీపడతాయి.
ఊహకందని విధంగా పెరిగిన బీసీసీఐ నజరానా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచకప్ విజేతకు నగదు బహుమతి ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించింది. తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టుకు రూ. 131 కోట్లు రివార్డుగా ప్రకటించింది. ఈ మొత్తం 2007 పొట్టి ప్రపంచకప్ విజేత అయిన నాటి టీమిండియాతో పోలిస్తే ఏకంగా 1091.67 శాతం ఎక్కువ.2007 పొట్టి ప్రపంచకప్ గెలిచినప్పుడు ధోని నేతృత్వంలోని భారత జట్టుకు బీసీసీఐ రూ. 12 కోట్ల నగదు నజరానాను ప్రకటించింది. ప్రత్యేక బహుమతిగా ఇంగ్లండ్పై ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్కు రూ. 1 కోటి అందించింది. అలాగే సపోర్ట్ స్టాఫ్లో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇచ్చింది.అదే 2026 ప్రపంచకప్కు వచ్చేసరికి.. సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టుకు రూ. 131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 19 ఏళ్లలో బహుమతి మొత్తం 13 రెట్లు పెరిగింది.ఈ మధ్యలో 2024 పొట్టి ప్రపంచకప్ గెలిచిన రోహిత్ శర్మ సేనకు బీసీసీఐ రూ. 125 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. 2007తో పోలిస్తే ఈ మొత్తం రూ. 113 కోట్లు ఎక్కువ.భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భాల్లో బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతి..- 2007లో రూ. 12 కోట్లు- 2024లో రూ. 125 కోట్లు- 2026లో రూ. 131 కోట్లుఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన 2026 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.
బుమ్రాపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్లో జన్మించి, యూఏఈ తరఫున ఆడిన జహూర్ ఖాన్ అనే పేస్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు తానే కోచింగ్ ఇచ్చానంటూ గొప్పలకు పోయాడు. స్లో డెలివరీ వేరియేషన్ను బుమ్రా తన వద్దనే నేర్చుకున్నాడని అన్నాడు.జహూర్ మాటల్లో.. 2019లో నేను ఓ టీ10 లీగ్లో లెండిల్ సిమ్మన్స్కు ఐదు స్లో డెలివరీలతో మెయిడిన్ ఓవర్ వేసాను. ఆ వీడియో చూసిన బుమ్రా.. ఇవి ఎలా వేసావు.. హ్యాండ్ గ్రిప్ ఎలా ఉంటుందని నన్ను అడిగాడు. ఆతర్వాత ముంబై ఇండియన్స్ కోచింగ్ క్యాంప్లో నేను ఆయనకు అలాంటి బంతులే వేసి చూపించాను. జహూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. జహూర్కు అంత సీన్ లేదని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. బుమ్రా నిరంతర అభ్యాసంతో ప్రపంచంలో అత్యుత్తమ పేసర్గా ఎదిగాడని కితాబునిస్తున్నారు.వాస్తవానికి స్లో బాల్ అనేది బుమ్రా అమ్ములపోదిలో ఓ అస్త్రం. స్లో బంతులను అతను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో ఇలాంటి బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. ఈ స్లో బాల్స్ను కూడా బుమ్రా అందరికీ భిన్నంగా వేస్తాడు. మణికట్టు సాయంతో సంధిస్తాడు. బ్యాటర్లు వీటిని పసిగట్టడం కష్టమవుతుంది. తాజాగా జరిగిన ప్రపంచకప్లోనూ బుమ్రా ఇలాంటి బంతులను చాలాసార్లు ప్రయోగించాడు. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో జేకబ్ బేతెల్ జోరు మీద ఉన్నప్పుడు వీటితోనే అతని ఆట కట్టించాడు. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లోనూ యార్కర్లతో పాటు ఈ స్లో డెలివరీలను ప్రయోగించాడు. ఫైనల్లో బుమ్రా అద్వితీయ ప్రదర్శన (4 వికెట్లు) కారణంగా భారత్ వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ సాధించింది. ఈ ప్రపంచకప్లో బుమ్రా 8 మ్యాచ్ల్లో 12.43 సగటున, 6.21 ఎకానమీతో 14 వికెట్లు తీసి భారత్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు.
అర్షదీప్ సింగ్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
భారత నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజ్లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అర్షదీప్ డారిల్ మిచెల్పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్ మిచెల్పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్ను బలంగా తాకింది. Final Hungama : Daryl Mitchell 🆚 Arshdeep Singh Surya ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲವೂ ಶಾಂತ... SKY Handle ಮಾಡಿದ ರೀತಿ ನಿಜಕ್ಕೂ ಅದ್ಬುತ!👏🏻🤝🏻ವೀಕ್ಷಿಸಿ | ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#T20WorldCup2026Final pic.twitter.com/K4ECnGh9ra— Star Sports Kannada (@StarSportsKan) March 8, 2026ఆ సమయంలో మిచెల్ సైతం సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్-మిచెల్ కరచాలనం చేసుకున్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్ చెల్లించుకున్నాడు.కాగా, ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.
ఇంగ్లండ్ యువ కెరటానికి జాక్పాట్
టీ20 ప్రపంచకప్-2026 సెమీఫైనల్లో భారత్పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్ యువ కెరటం జేకబ్ బేతెల్కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్లో బర్మింగ్హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్ కోసం అతన్ని కెప్టెన్గా నియమించింది. లియామ్ లివింగ్స్టోన్ స్థానంలో బేతెల్కు కెప్టెన్గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్ యాజమాన్యం ప్రకటించింది. 22 ఏళ్ల బేతెల్కు గతంలో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్గా పని చేసిన రికార్డు బేతెల్ వశమైంది.ఫీనిక్స్ కెప్టెన్గా ఎంపిక కావడంపై బేతెల్ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. బేతెల్ తాజాగా భారత్తో జరిగిన పొట్టి ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్లో బేతెల్ 8 ఇన్నింగ్స్ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.ఐపీఎల్లో సవాలుహండ్రెడ్ లీగ్లో బేతెల్కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్లో బేతెల్ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి.
ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్పై బిగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్ను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 2026 ఎడిషన్ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్తో ముగుస్తుంది.ఓపెనింగ్ మ్యాచ్లో ఎవరెవరు..? సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్ కింగ్స్ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్లో ఐపీఎల్ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్ అనే సాంప్రదాయానికి బ్రేక్ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
పెళ్లిపీటలెక్కనున్న స్టార్ స్పిన్నర్.. ఎప్పుడంటే?
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. మార్చి 14న తన చిన్ననాటి స్నేహితురాలైన వనిష్కను కుల్దీప్ వివాహమాడనున్నాడు. కాగా వీరి వివాహం ఉత్తరాఖండ్లోని ముసోరిలో ఒక రిసార్ట్ వేదికగా జరగనుంది. గతేడాది జూన్ 4న లక్నోలోని ఒక హోటల్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవ్వగా మార్చి 13న ప్రీ-వెడ్డింగ్ జరగనుంది. అయితే వీరి పెళ్లి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. ఇక మార్చి 17న లక్నోలోని హోటల్ సెంట్రమ్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బోర్డు సభ్యులు సహా ఉత్తర్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా హాజరు కానున్నారు. అయితే వాస్తవానికి కుల్దీప్ వివాహం గతేడాని నవంబర్లోనే జరగాల్సి ఉండగా, టీ20 ప్రపంచకప్ జట్టులోకి కుల్దీప్ ఎంపిక కావడంతో పెళ్లి వాయిదా పడింది. ఇక కుల్దీప్ యాదవ్ టీ20 ప్రపంచకప్లో కేవలం పాకిస్థాన్తో మ్యాచ్లో మాత్రమే ఆడాడు. ఇక భారత క్రికెట్ జట్టు ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. చదవండి: 30 ఏళ్ల క్రితమే పుట్టిన దూబే!
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు నమోదైంది. ఈ అమిత్ మిశ్రా అందరికీ తెలిసిన టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కాదు. ఇతను ఉత్తరప్రదేశ్కు చెందిన 34 ఏళ్ల పేసర్ అమిత్ మిశ్రా. ఈ అమిత్ మిశ్రా భారత్ తరఫున ఎప్పుడూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఐపీఎల్లో మాత్రం ఆడాడు.2013-14 రంజీ సీజన్లో ఉత్తర్ప్రదేశ్ తరఫున రెండో మ్యాచ్లోనే 7 వికెట్లు తీసి గుర్తింపు పొందిన ఈ అమిత్ మిశ్రాను 2014 ఐపీఎల్ ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆతర్వాత గుజరాత్ లయన్స్లో చేరినా, కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు. 2018లో ఆంధ్రపై చివరి మ్యాచ్ ఆడిన తర్వాత క్రికెట్కు గుడ్బై చెప్పిన మిశ్రా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందాడు. ఈ అమిత్ మిశ్రాపై అతని భార్య గరిమా తివారి గృహహింస ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గృహహింస, వేధింపులు, దౌర్జన్యం అలాగే ఆత్మహత్యకు ప్రేరేపించే పరిస్థితులు సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొంది. మోడల్ అయిన గరిమాకు 2019లో ఇన్స్టాగ్రామ్ ద్వారా అమిత్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గరిమా ఆరోపణల ప్రకారం.. పెళ్లి తర్వాత అమిత్ మిశ్రా, అత్తమామలు నిరంతరం వేధింపులకు గురి చేశారు. రూ.10 లక్షలు, హోండా సిటీ కారు రూపంలో కట్నం కోరారని, ఆమె కుటుంబం రూ.2.5 లక్షలు ఇచ్చినా, మరింత డబ్బు కోసం వేధింపులు కొనసాగించారని తెలిపారు. మిశ్రా తరచూ మద్యం తాగి వచ్చి దుర్భాషలాడేవాడని, తిండి కూడా పెట్టకుండా వేధించేవాడని పేర్కొన్నారు. తాను మోడలింగ్ చేసిన సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా లాక్కునేవాడని, అతని కారణంగా మోడలింగ్ కెరీర్ను కూడా వదిలేయాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ వేధింపుల కారణంగా ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించానని ఆవేదన చెందారు. కాగా, గరిమా అమిత్ మిశ్రాపై ఇప్పటికే పలు కేసులు వేసింది. ఏప్రిల్ 21, 2025న గృహహింస కేసు, ఏప్రిల్ 23న నెలకు రూ.50,000 భరణం, రూ.1 కోటి పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, మిశ్రా ప్రభావం వల్ల కేసులు ముందుకు సాగలేదని ఆరోపించారు. ప్రస్తుతం వేసిన కేసు విచారణ దశలో ఉంది.
‘అడాలజ్ స్టెప్వెల్’ చరిత్ర తెలుసా?
అహ్మదాబాద్: ప్రపంచకప్తో భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాంధీనగర్ సమీపంలోని మోనుమెంట్ కాంప్లెక్స్కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్ వారసత్వ కట్టడం ‘అడాలజ్ స్టెప్వెల్’ వద్ద అధికారిక ఫొటో సెషన్ నిర్వహించగా.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ ప్రపంచకప్తో సందడి చేశాడు. అతను కప్తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్ కట్టడం వద్ద కప్ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్... కిస్సిక్...’ మోత మోగాయి.సుప్రసిద్ధ ‘అడాలజ్ స్టెప్వెల్’ (Adalaj Stepwell) 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్ను నిర్మించింది. ఆమె వాఘెలా సంస్థానధీశుడు రాణా వీర్ సింగ్ భార్య. రాణా వీర్ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్ స్టెప్వెల్ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్ సందర్భంగా విన్నర్స్ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫొటోలు దిగారు.𝐄𝐭𝐜𝐡𝐞𝐝 𝐈𝐧 𝐆𝐥𝐨𝐫𝐲 🏆📸 Captain Surya Kumar Yadav with the prestigious ICC Men’s T20 World Cup Trophy 😍💙#TeamIndia | #T20WorldCup | #MenInBlue | @surya_14kumar pic.twitter.com/oxK2VVPMYe— BCCI (@BCCI) March 9, 2026 ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్ ఆలయానికి ప్రపంచకప్ను తీసుకువెళ్లి పూజలు చేశారు. పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు ప్రపంచకప్తో దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.#WATCH | Gujarat | Team India Skipper Surya Kumar Yadav, offered prayers at the Hanuman Temple in Ahmedabad after winning the #icct20worldcup2026 pic.twitter.com/QoCBEa6vPm— ANI (@ANI) March 8, 2026
సెమీస్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపి...
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యా...
మళ్లీ ఓడిన గుకేశ్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ప్రాగ్ చెస్ ఫెస్టివల...
సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపి...
ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇం...
క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు
భారత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రాపై గృహహింస కేసు ...
‘అడాలజ్ స్టెప్వెల్’ చరిత్ర తెలుసా?
అహ్మదాబాద్: ప్రపంచకప్తో భారత టి20 జట్టు కెప్టెన్...
గుజరాత్ జెయింట్స్ కోచ్గా ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ఐపీఎల్-2026 సీజన్కు ముందు గుజరాత్ జెయింట్స్ ఫ్రా...
క్రీడలు
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వీడియోలు
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
చరిత్ర సృష్టించిన భారత్
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
