ప్రధాన వార్తలు
భారీ విజయం కావాలి
టి20 ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీమ్ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్లు గెలవడంతో పాటు రన్రేట్పై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు మన బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్కు ఇంకా అవకాశం మిగిలి ఉంటుంది! చెన్నై: వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తమ రెండో మ్యాచ్లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు జరిగే ‘గ్రూప్–1’ పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి రన్రేట్లో బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్ ఆశలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాలపరంగా జింబాబ్వేకంటే భారత్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజేయమేమీ కాదని తేలగా... పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురి పెట్టింది. సామ్సన్కు చాన్స్! గత మ్యాచ్ ఆడిన తుది జట్టు నుంచి కనీసం రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్లో విఫలమైన సంజు సామ్సన్ను ఇప్పుడు టీమ్ వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత్ టాప్–3 ఎడంచేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్ స్పిన్నర్తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. మూడు డకౌట్ల తర్వాత గత మ్యాచ్లో అభిషేక్ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఆఫ్స్పిన్నర్కే అవుటయ్యాడు. దాంతో కుడిచేతి వాటం సామ్సన్ను టాపార్డర్లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సామ్సన్ను ఆడించేందుకు తిలక్ వర్మ లేదా రింకూ సింగ్లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో అక్షర్ పటేల్ను కాకుండా వాషింగ్టన్ సుందర్ను ఆడించి తీవ్ర విమర్శలపాలైన మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్లీ అక్షర్ను టీమ్లోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లలో ఎక్కువ మంది కుడిచేతి వాటంవారే కావడం అక్షర్ రాకకు మార్గం సుగమం చేసింది. మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు అభిషేక్కు ఇది సరైన సమయం కాగా... సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. బౌలింగ్ విషయంలో భారత్కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, అర్‡్షదీప్లతో పాండ్యా పేస్ భారం మోస్తుండగా... ప్రధానాస్త్రం వరుణ్ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంతగడ్డపై ఇప్పుడు వరుణ్ వరల్డ్ నంబర్వన్ బౌలర్గా బరిలోకి దిగనున్నాడు. రజాపై భారం... జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్కు సంబంధించి ఎలాంటి ఒత్తిడీ లేదు. లీగ్ దశలో ఆ్రస్టేలియాను, సొంతగడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తోంది. ప్రధాన పేసర్లయిన ఎన్గరవా, ముజరబాని పవర్ప్లేలో వికెట్లు తీసి శుభారంభం అందించగలరు. లెగ్ స్పిన్నర్ క్రీమర్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. టోర్నీలో జట్టు తరఫున టాప్ స్కోరర్గా ఉన్న బెన్నెట్తో పాటు ర్యాన్ బర్ల్ కీలకం కానున్నారు. జట్టులో ఇద్దరు ఆల్రౌండర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రాడ్ ఇవాన్స్ తన మీడియం పేస్తో టోర్నీలో ప్రభావం చూపించగా, ప్రధాన గెలుపు భారం కెపె్టన్ సికందర్ రజాపైనే ఉంది. బ్యాటింగ్లో ముందుండి నడిపిస్తున్న రజా, తన ఆఫ్స్పిన్తో నిలకడగా రాణించాడు. విండీస్తో గత పోరులో భారీ తేడాతో ఓడినా... జింబాబ్వే పట్టుదలగా ఆడితే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు.పిచ్, వాతావరణం చిదంబరం స్టేడియంలోని పిచ్లు ఈ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్కు బాగా అనుకూలించాయి. బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు.1 టి20 వరల్డ్ కప్లో భారత్, జింబాబ్వే మధ్య ఒకే ఒక మ్యాచ్ జరిగింది. 2022లో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 71 పరుగులతో గెలిచింది.1 భారత్లో భారత్తో టి20ల్లో జింబాబ్వే తలపడటం ఇదే తొలిసారి. గతంలో భారత గడ్డపై జింబాబ్వే 5 టెస్టులు, 19 వన్డేల్లో టీమిండియాను ఎదుర్కొంది.భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, దూబే, పాండ్యా, రింకూ/ తిలక్, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్, బుమ్రా. జింబాబ్వే: రజా (కెప్టెన్), మరుమని, బెన్నెట్, మైర్స్, బర్ల్, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎన్గరవ
శ్రీలంక ఖేల్ ఖతం
కొలంబో: టి20 ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, తాజా విజయంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే కివీస్ కూడా సెమీస్లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్ ఓడితే కివీస్కు చోటు ఖాయమవుతుంది. పాక్ గెలిస్తే అప్పుడు రన్రేట్లో పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), కోల్ మెక్కోన్కీ (23 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్కోన్కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్ 6 సిక్స్లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్... తర్వాతి వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్ కప్లో గతంలో ఏడో వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్ హస్సీ, స్టీవ్ స్మిత్ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్కోన్కీ దీనిని సవరించారు. మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కమిందు మెండిస్ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఈ మ్యాచ్పై మన కన్ను... నేడు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ సమరం
అహ్మదాబాద్: భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్కు ముందు జరిగే మరో సమరంపై కూడా టీమిండియా అభిమానుల దృష్టి నిలిచింది. ‘గ్రూప్–1’లోనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కూడా చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి. ఈ మ్యాచ్తో పాటు జింబాబ్వేపై కూడా దక్షిణాఫ్రికా గెలిస్తే భారత్కు రన్రేట్ లెక్కల అవసరం రాదు. జింబాబ్వేతో పాటు చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ గెలిస్తే సరిపోతుంది. కానీ దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే మాత్రం... మనం మిగతా రెండూ గెలిచినా సెమీఫైనల్ స్థానంపై గ్యారంటీ లేదు. మూడు జట్లూ రెండేసి విజయాలతో సమానమైతే రన్రేట్తో దక్షిణాఫ్రికా, విండీస్లకు వెనక్కి నెట్టడం భారత్కు అంత సులువు కాదు! జింబాబ్వేతో మ్యాచ్ బరిలోకి దిగడానికి ముందు టీమిండియాకు మరింత స్పష్టత వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
తగ్గేదేలే!
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ జట్టు అద్వితీయ ఆటతీరు కనబరుస్తోంది. దేశవాళీల్లో అపార అనుభవం ఉన్న కర్ణాటకతో తుదిపోరులో జమ్మూ ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఓవర్నైట్ స్కోరు 284/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు బుధవారం ఆట ముగిసే సమయానికి 156 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 527 పరుగులు చేసింది. కెప్టెన్ పారస్ డోగ్రా (166 బంతుల్లో 70; 8 ఫోర్లు), కన్హయ్య వాధ్వాన్ (109 బంతుల్లో 70; 9 ఫోర్లు), సాహిల్ లోత్రా (93 బంతుల్లో 57 బ్యాటింగ్; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ప్లేయర్లంతా బాధ్యతాయుతంగా ఆడటంతో జమ్మూ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఓవర్నైట్ బ్యాటర్లు శుభమ్ పుండిర్ (247 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్స్లు), అబ్దుల్ సమద్ (104 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయారు. బుధవారం ఆట ప్రారంభమైన కాసేపటికే శుభమ్ అవుట్ కాగా... తదుపరి ఓవర్లో అబ్దుల్ సమద్ సైతం పెవిలియన్ చేరాడు. ఈ దశలో తొలి రోజు రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన కెప్టెన్ పారస్ డోగ్రా క్రీజులోకి వచ్చాడు. సుదీర్ఘ అనుభవమున్న ఈ 41 ఏళ్ల బ్యాటర్... ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయాడు. మరోవైపు నుంచి కన్హయ్య అతడికి చక్కటి సహకారం అందించాడు. ఈ జంట చాపకింద నీరులా పరుగులు రాబడుతుండటంతో... కర్ణాటక ప్లేయర్లలో అసహనం పెరిగిపోయింది. ఇది మైదానంలో స్పష్టంగా కనిపించింది. పలుమార్లు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో కన్హయ్య 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... పారస్ డోగ్రా 140 బంతుల్లో హాఫ్సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఐదో వికెట్కు 192 బంతుల్లో 110 పరుగులు జోడించిన అనంతరం కన్హయ్య వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన జమ్మూకశ్మీర్... కర్ణాటక బౌలర్లను మరింత అసహనానికి గురిచేసింది. ఆరో వికెట్కు పారస్, సాహిల్ కలిసి 75 బంతుల్లో 54 పరుగులు జోడించగా... అబేధ్యమైన ఏడో వికెట్కు అబిద్ ముస్తాక్ (20 బ్యాటింగ్; 2 ఫోర్లు)తో కలిసి సాహిల్ 56 పరుగులు జత చేశాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా... విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే మంచి స్కోరు సాధించిన జమ్మూకశ్మీర్ జట్టు... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే పైచేయి సాధించాలనే ఉద్దేశంతో సాగుతోంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న ఆ జట్టు మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (సి) (సబ్) అనీశ్ (బి) విద్యాధర్ 121; పారస్ డోగ్రా (బి) శ్రేయస్ 70; అబ్దుల్ సమద్ (సి) కృతిక్ (బి) ప్రసిధ్ 61; కన్హయ్య (సి) రాహుల్ (బి) శిఖర్ 70; సాహిల్ (బ్యాటింగ్) 57; ఆబిద్ ముస్తాక్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 34; మొత్తం (156 ఓవర్లలో 6 వికెట్లకు) 527. వికెట్ల పతనం: 1–18, 2–157, 3–303, 4–307, 5–417, 6–471. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 29–2–104–1; విజయ్ కుమార్ వైశాఖ్ 31–10–60–0; ప్రసిధ్ కృష్ణ 29–7–90–3; శ్రేయస్ గోపాల్ 33–2–130–1; శిఖర్ షెట్టి32–1–112–1; కరుణ్ నాయర్ 2–1–1–0.అదేం పెద్ద విషయం కాదు ఫైనల్లో మా ప్లేయర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. జట్టు సమష్టిగా సత్తా చాటుతోంది. ప్రస్తుతానికి మా జట్టు మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో ఆమాత్రం కోపోద్రేకాలు సహజం. అనీశ్తో వాగ్వాదం అప్పటివరకు మాత్రమే. ఆ తర్వాత అంతా సాధారణమే. మేం తర్వాత మాట్లాడుకున్నాం కూడా. కర్ణాటక జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. వారి ముందు లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఉద్దేశం లేదు. తొలి ఇన్నింగ్స్ను వీలైనంత వరకు కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మా ప్లేయుర్లు చక్కటి ఆటతీరు కనబర్చారు. ఇక ముందు కూడా అదే స్ఫూర్తితో సాగుతాం. –పారస్ డోగ్రా, జమ్మూకశ్మీర్ కెప్టెన్ ‘తల’పడ్డ పారస్,అనీశ్కర్ణాటక ఫీల్డర్ను హెల్మెట్తో ఢీకొట్టిన జమ్మూకశ్మీర్ కెప్టెన్రంజీ ట్రోఫీలో అపార అనుభవం ఉన్న పారస్ డోగ్రా... కర్ణాటక ప్లేయర్తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు. దేశవాళీల్లో 21వ సీజన్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ సారథి... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అనీశ్తో గొడవకు దిగాడు. పారస్ సంయమనంతో షాట్లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్లో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తున్న అనీశ్... పారస్ను పదే పదే కామెంట్ చేశాడు. దీంతో ప్రసిధ్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అనీశ్ను పారస్ హెల్మెట్తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్ అంపైర్లు రోహాన్ పండిట్, ఉల్హాస్ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. మ్యాచ్ అనంతరం జమ్మూకశ్మీర్ సారథి పారస్ డోగ్రా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు మ్యాచ్ రిఫరీ నారాయణ్ కుట్టీ వెల్లడించాడు.
‘షూటౌట్’లో గెలిచాం
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్లను జూన్లో నెదర్లాండ్స్లో ఆడనుంది. హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్లను మోహిత్ అడ్డుకొని భారత్ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు. అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్లను వృథా చేసింది. ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్డామ్లో మూడో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్లో నాలుగో అంచె మ్యాచ్లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్తో... 25న ఇంగ్లండ్తో... 26న మళ్లీ పాకిస్తాన్తో... 28న మళ్లీ ఇంగ్లండ్తో తలపడుతుంది.
సౌతాఫ్రికా, విండీస్ ముందున్నాయి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా లీగ్ దశలో అజేయంగా నిలిచింది. గ్రూప్-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్లను ఓడించి టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టింది. అయితే, కీలక సమయంలో సమిష్టి వైఫల్యంతో సూర్యకుమార్ సేన చేతులెత్తేసింది.అతిపెద్ద పరాజయంసూపర్-8 గ్రూప్-1లో భాగంగా సౌతాఫ్రికా (IND vs SA)తో మ్యాచ్లో మరీ దారుణంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. తద్వారా తమ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది.అందనంత ఎత్తులో విండీస్మరోవైపు.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా టీమిండియాను 76, వెస్టిండీస్ జింబాబ్వే (WI vs ZIM)ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాలు సాధించాయి. చెరో విజయంతో రెండేసి పాయింట్లు సంపాదించాయి. అయితే, సఫారీల (+3.800)తో పోలిస్తే విండీస్ (+5.350)నెట్రన్రేటు పరంగా అత్యంత పటిష్ట స్థితిలో నిలిచి టాపర్గా ఉంది.మరోవైపు భారత్ (-3.800) ఘోర పరాజయంతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం నాటి మ్యాచ్లో.. అదే విధంగా ఆదివారం విండీస్తో మ్యాచ్లో తప్పక భారీ తేడాతో గెలవాలి. లేదంటే సెమీస్ చేరకుండానే నిష్క్రమించాల్సి వస్తుంది.గెలుపు ముఖ్యం.. ఆ తర్వాతే ఏదైనాఅయితే, జింబాబ్వేతో మ్యాచ్లో నెట్రన్రేటు కంటే కూడా గెలుపే ముఖ్యంగా ఆడాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ‘‘జింబాబ్వేతో మ్యాచ్లో మొదట విజయం గురించి మాత్రమే ఆలోచించాలి. గెలిస్తేనే కదా నెట్రన్రేటు లెక్కలోకి వచ్చేది. ఇప్పుడు మనకు గెలుపు పాయింట్లు అత్యంత ముఖ్యం.ఏదేమైనా ఇప్పుడు నెట్రన్రేటు పరంగా వెస్టిండీస్ను మనం ఓడించడం అసాధ్యం. టీ20 క్రికెట్లో జింబాబ్వే, వెస్టిండీస్ వంటి జట్లపై 100 పరుగుల తేడాతో విజయాలు సాధించడం కష్టం. కాబట్టి తదుపరి రెండు మ్యాచ్లలో గెలుపు ఒక్కటే మనకు ముఖ్యం. ఆ తర్వాతే నెట్రన్రేటు గురించి ఆలోచించాలి.ఇంత చెత్తగా ఆడతారా?సౌతాఫ్రికాతో మ్యాచ్లో మూడు విభాగాల్లో భారత్ విఫలమైంది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. అందువల్లే భారీ తేడాతో ఓడి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్నాం. ఏదేమైనా ప్రస్తుతం వెస్టిండీస్, సౌతాఫ్రికా నెట్రన్రేటు పరంగా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. మనం మూడు విభాగాల్లో రాణిస్తేనే ముందడుగు వేయగలం’’ అని ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు.చదవండి: IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. ఆ ముగ్గురిలో ఒకరిపై వేటు!
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్ ధనాధన్ దంచికొట్టగా..
శ్రీలంకతో మ్యాచ్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్ కకావికలమైనా లోయర్ ఆర్డర్ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 మ్యాచ్లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్ గెలిచిన శ్రీలంక.. కివీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్కు పంపాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23)ను మహీశ్ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్లో హేమంతకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్కు క్యూఅయితే, టాపార్డర్ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం పెవిలియన్కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిఫ్స్ (18), డారిల్ మిచెల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్ చాప్మన్ డకౌట్ అయ్యాడు.సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్ నీషమ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్ ఆల్రౌండర్ కోల్ మెకాంచీ సాంట్నర్కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలగే ఒక వికెట్ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఇషాన్ హిట్.. అభిషేక్ ఫ్లాప్కాగా ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్- అభిషేక్ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్కప్ టోర్నీలో ఇషాన్ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో తొలి మూడు మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు.ఇక సూపర్-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్ డకౌట్ కాగా.. అభిషేక్ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.తిలక్ వర్మపై విమర్శలుఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్రేటుపై విమర్శలు వస్తున్నాయి. ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్లు ఇషాన్- అభిషేక్.. వన్డౌన్లో వచ్చే తిలక్.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసంఇలాంటి తరుణంలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం టీమిండియా టాపార్డర్లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.సంజూ వస్తాడని సంకేతంజింబాబ్వేతో మ్యాచ్ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్డౌన్లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్ తెలిపాడు.ఎవరిపై వేటు?ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్డౌన్లో ఆడించి.. తిలక్ను డిమోట్ చేయడం ఓ ఆప్షన్. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్ తెలిపాడు.రింకూ, తిలక్, అభిషేక్!అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్ అయ్యేందుకు.. లెఫ్ట్-రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. అభిషేక్- ఇషాన్ జోడిని కొనసాగిస్తే.. తిలక్ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్ చెప్పినట్లు మ్యాచ్ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చదవండి: T20 WC 2026: రింకూ సింగ్కు సంబంధించి బిగ్ అప్డేట్
NZ vs SL: సూపర్-8 మ్యాచ్.. లైన్ క్లియర్!
న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్య సూపర్-8 మ్యాచ్కు మార్గం సుగమమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశలో బుధవారం నాటి మ్యాచ్లో కివీస్-లంక తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇరజట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేశాయి.అయితే, కొలంబోలో ప్రస్తుతం వర్ష సూచన లేదు. దీంతో మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ కాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక కివీస్తో మ్యాచ్లో లంక తమ తుదిజట్టులో ఒక మార్పు చేసింది. ఒక మార్పుతో బరిలోకికమాల్ మిశారా స్థానంలో చరిత్ అసలంకకు అవకాశం ఇచ్చింది. టాపార్డర్ను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ దసున్ షనక వెల్లడించాడు. ఇంగ్లండ్ మ్యాచ్లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.మా జట్టులోనూ ఓ మార్పుమరోవైపు.. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. శ్రీలంకతో మ్యాచ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు వెల్లడించాడు. లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలిపాడు. జిమ్మీ నీషమ్ స్థానంలో కోల్ మెకాంచీ తుదిజట్టులోకి వచ్చినట్లు సాంట్నర్ తెలిపాడు. మధ్య ఓవర్లలో అదనపు స్పిన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్
ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదు: పాకిస్తాన్ కెప్టెన్ భార్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైంది. సూపర్-8 దశలో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిపాలైంది. పల్లెకెలె వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.సెమీస్ అవకాశాలు సంక్లిష్టంఫలితంగా పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతడి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో పాక్ ఓటమికి సల్మాన్ను బాధ్యుడిని చేస్తూ.. అతడి భార్య, కుమారుడిని అభ్యంతరకర రీతిలో పాక్ జట్టు అభిమానులు తిడుతూ పోస్టులు పెట్టారు.అంతేకాదు.. పాక్ గనుక సెమీస్ చేరకుంటే సల్మాన్తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదుఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆఘా భార్య సబా మంజర్ ట్రోల్స్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘‘పాకిస్తానీ అభిమానులారా!... నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.కాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత సల్మాన్తో పాటు పాక్ జట్టులోని ఆటగాళ్లందరిపై నెట్టింట తిట్ల వర్షం కురుస్తోంది. ఇక పాక్ అభిమానులకు ఇదేమీ కొత్తకాదు. ముఖ్యంగా 1996 వరల్డ్కప్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత.. పాక్ క్రికెటర్ల నివాసాలపై దాడులు జరిగాయి. నాటి కెప్టెన్ వసీం అక్రం ఇంటి మీద కూడా నిరసనకారులు దాడికి దిగారు.సెమీస్లో తొలి అడుగు ఇంగ్లండ్దేఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7న మొదలైన టీ20 ప్రపంచకప్-2026లో సూపర్-8 దశ నడుస్తోంది. గ్రూప్-1 నుంచి టీమిండియా, సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్.. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక బరిలో ఉన్నాయి.సూపర్-8లో భాగంగా పాక్ తొలుత న్యూజిలాండ్తో తలపడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ రద్దైపోయింది. దీంతో ఇరుజట్లకు చెరోపాయింట్ వచ్చింది. ఇక ఇంగ్లండ్తో మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్కు దిగి 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. గత మ్యాచ్లో శ్రీలంకపై.. తాజాగా పాక్పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్.చదవండి: NZ vs SL: కివీస్, శ్రీలంకలకు భారీ షాక్!.. పాక్కు గుడ్న్యూస్?
ఢిల్లీ మారథాన్ దిగ్గజాలతో షురూ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రతిష్టాత్మక ‘ఢిల్...
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తె...
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
IND vs ZIM: తుదిజట్టులో సంజూ.. అతడిపై వేటు!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో కీలక మ్యాచ్కు ట...
NZ vs SL: సూపర్-8 మ్యాచ్.. లైన్ క్లియర్!
న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు శుభవార్త. ఇరుజట్ల మధ్...
ఇలా అయితే పాక్ వరల్డ్కప్ గెలవదు: పాకిస్తాన్ కెప్టెన్ భార్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్కు ఘోర పర...
శిఖర్ ధావన్ మాజీ భార్యకు షాకిచ్చిన కోర్టు.. గబ్బర్కు రిలీఫ్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఊరట లభిం...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
