ప్రధాన వార్తలు
హోటల్ మారితే అదృష్టం మారేనా!
అహ్మదాబాద్: నమ్మకం లేదా సెంటిమెంట్ అనుకోండి లేదా మూఢ విశ్వాసం అనుకోండి కానీ భారత క్రికెట్ జట్టుకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అనూహ్య, ఆసక్తికర విషయాలు బయటకు వస్తుంటాయి. జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వాటిని బాగా ప్రోత్సహిస్తుంటాడని సమాచారం. ఏ నగరంలో మ్యాచ్కు వెళ్లినా అక్కడి ప్రఖ్యాత దేవాలయానికి ఆటగాళ్లను తీసుకెళ్లి దర్శనం చేయించడం ఆయనకు రివాజుగా మారిపోయింది. సెమీఫైనల్కు ముందు రోజు ప్రాక్టీస్ కోసం వాంఖెడే స్టేడియానికి జట్టు వచ్చినా... ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూమ్ దాటి బయటకు రాలేదు. గ్రహణం ముగిసిన తర్వాతే గంటసేపు ఆలస్యంగా టీమిండియా సాధన మొదలైంది. ఇప్పుడు కూడా ఫైనల్ కోసం మరో సెంటిమెంట్ అంశం వినిపిస్తోంది. అహ్మదాబాద్లో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడినప్పుడు భారత జట్టు ఐటీసీ నర్మద హోటల్లో బస చేసింది. నాటి మ్యాచ్లో పరాజయం జట్టును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ ఫైనల్ కోసం అక్కడ మాత్రం ఉండరాదని జట్టు అనుకుంది. అందుకే ఈసారి తాజ్ స్కైలైన్లో భారత బృందం దిగింది. దీంతో తమ అదృష్టం మారవచ్చని టీమ్ భావిస్తున్నట్లుంది. మరోవైపు మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా ‘హోం’ కాకుండా విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ను వాడుకోవాలని కూడా టీమ్ నిర్ణయించింది. ఎర్ర మట్టి పిచ్ వాడతారా! ఫైనల్కు సంబంధించిన పిచ్ విషయంలో కూడా భారత జట్టు తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని టీమిండియా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది. అహ్మదాబాద్లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్పై దక్షిణాఫ్రికా జట్టుతో ‘సూపర్–8’ మ్యాచ్ ఆడిన భారత్ దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా సూర్యకుమార్ బృందం బ్యాటింగ్ పిచ్నే కోరుకుంటోంది. మ్యాచ్కు ముందు ‘షో’ ‘వన్, టూ, త్రీ, ఎ లిటిల్ స్టెప్ ఫార్వర్డ్, మారియా’... ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులకు ఊపేసిన రికీ మార్టిన్ పాట ఇది. ఇప్పుడు స్వయంగా మారి్టన్ వరల్డ్ కప్ వేదికపై తన పాటతో ఉర్రూతలూగించనున్నాడు. ఆదివారం ఫైనల్కు ముందు ఐసీసీ ప్రత్యేక మ్యూజిక్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో మార్టిన్తో పాటు ఫల్గుణి పాఠక్, సుఖ్వీoదర్ సింగ్ తమ పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే అధికారుల బృందాన్ని ఐసీసీ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ వ్యవహరిస్తారు. థర్డ్, ఫోర్త్ అంపైర్లుగా దక్షిణాఫ్రికాకు చెందిన అలావుద్దీన్ పలేకర్, ఆడ్రియాన్ హోల్డ్స్టాక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వరల్డ్ కప్ తుది పోరు జరుగుతుంది. సామ్సన్ నామినేట్... టి20 వరల్డ్ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఎనిమిది ఆటగాళ్ల జాబితాలో భారత్కు చెందిన సంజు సామ్సన్ పేరు కూడా ఉంది. సామ్సన్తో పాటు విల్ జాక్స్ (ఇంగ్లండ్), సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్తాన్), రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్ (న్యూజిలాండ్), షాడ్లీ వాన్ షాల్విక్ (అమెరికా), మార్క్రమ్, ఎన్గిడి (దక్షిణాఫ్రికా) ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీ పడుతున్నారు. బుమ్రా కూడా విఫలం కావచ్చు! భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒంటిచేత్తో అతను మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. ఈ విషయం న్యూజిలాండ్కు కూడా బాగా తెలుసు. అయితే ఫైనల్లో తమపై మాత్రం బుమ్రా విఫలం కావాలని కోరుకుంటున్నట్లు కివీస్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అన్నాడు. ‘బుమ్రా అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహం లేదు. అతని బౌలింగ్లో ఎంతో వైవిధ్యం ఉంది. యార్కర్లను గొప్పగా సంధించగలడు. అయితే అతను కూడా మానవమాత్రుడే. ఏదో ఒకరోజు విఫలం కావచ్చు కూడా. అది ఆదివారమే కావాలని ఆశిస్తున్నాం’ అని ఫిలిప్స్ చెప్పాడు. భారత్తో పోలిస్తే జనాభాలో ఎంతో చిన్నదైన తమ దేశం క్రికెట్లో ఇప్పటి వరకు సాధిస్తూ వచ్చిన ఘనత చిన్నదేమీ కాదని అతను అభిప్రాయపడ్డాడు. సుమారు 50 లక్షల జనాభా ఉన్న కివీస్ వరల్డ్ కప్లాంటి వేదికపై భారత్తో ఫైనల్లో తలపడే అవకాశం రావడం కూడా గొప్ప విషయమని అతను అన్నాడు.
‘రికార్డులు’ బద్దలు కొట్టిన భారత్–ఇంగ్లండ్ సెమీఫైనల్
ముంబై: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగి రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారీ పరుగులు, బౌండరీలతో రికార్డుల మోత మోగింది. అయితే దీంతో పాటు డిజిటల్ వీక్షకుల సంఖ్య విషయంలో కూడా ఈ మ్యాచ్ కొత్త రికార్డులు నెలకొల్పింది. జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల (సుమారు 6 కోట్ల 25 లక్షలు) మంది చూడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడా ఈవెంట్లోనైనా ప్రత్యక్ష ప్రసార సమయంలో ఇది అత్యధికం. తాజా గణాంకాలు క్రికెట్ స్థాయిని చూపిస్తున్నాయని, ఇది తమకు గర్వకారణమని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు. తాజా రికార్డు ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్తో చెరిగిపోతుందా అనేది ఆసక్తికరం.
భారత్ 198 ఆలౌట్
పెర్త్: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య శుక్రవారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్ (డే అండ్ నైట్)లో తొలి రోజు బౌలర్ల హవా సాగింది. పింక్ బంతితో జరుగుతున్న ఈ టెస్టులో ఇరు జట్లు కలిపి మొదటి రోజు 13 వికెట్లు చేజార్చుకున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్లో 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక తడబడింది. జెమీమా రోడ్రిగ్స్ (84 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (48 బంతుల్లో 35; 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (54 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేసి భారత్కు కొంత మేలు చేశారు. అనాబెల్ సదర్లాండ్ 4 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లూసీ హామిల్టన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా మహిళల జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 96 పరుగులు చేసింది. ఎలైస్ పెరీ (62 బంతుల్లో 43 బ్యాటింగ్; 7 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (20 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న అలీసా హీలీ (13) విఫలమైంది. సయాలీ సత్గరేకు 2 వికెట్లు లభించాయి. ప్రస్తుతం ఆ్రస్టేలియా మరో 102 పరుగులు వెనుకబడి ఉంది. నలుగురి అరంగేట్రం... భారత జట్టు తరఫున ఒకేసారి నలుగురు ప్లేయర్లు టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టడం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా కాశ్వీ గౌతమ్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సయాలీ సత్గరే టెస్టుల్లో అరంగేట్రం చేశారు. భారత్ తరఫున టెస్టు ఆడిన 95, 96, 97, 98వ ప్లేయర్లుగా వీరు నిలిచారు. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: స్మృతి (బి) హామిల్టన్ 4; షఫాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 35; ప్రతీక (సి) హామిల్టన్ (బి) సదర్లాండ్ 18; జెమీమా (సి) గార్డ్నర్ (బి) హామిల్టన్ 52; హర్మన్ప్రీత్ (బి) బ్రౌన్ 19; దీప్తి (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; రిచా (సి) అలానా కింగ్ (బి) గార్డ్నర్ 11; స్నేహ్ రాణా (సి) తాలియా (బి) హామిల్టన్ 5; కాశ్వీ (నాటౌట్) 34; సయాలీ (సి) మూనీ (బి) సదర్లాండ్ 7; క్రాంతి (సి) సదర్లాండ్ (బి) బ్రౌన్ 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (62.4 ఓవర్లలో ఆలౌట్) 198. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–61, 4–84, 5–107, 6–150, 7–150, 8–157, 9–195, 10–198. బౌలింగ్: డార్సీ బ్రౌన్ 12.4–0–41–2, హామిల్టన్ 11–3–31–3, అనాబెల్ సదర్లాండ్ 17–5–46–4, తాలియా 4–2–15–0, యాష్లీ గార్డ్నర్ 15–3–39–1, అలానా కింగ్ 3–0–23–0. ఆ్రస్టేలియా మహిళల తొలి ఇన్నింగ్స్: జార్జియా వోల్ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్ఫీల్డ్ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (బ్యాటింగ్) 43; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్ సదర్లాండ్ (బ్యాటింగ్) 20; ఎక్స్ట్రాలు 9; మొత్తం (27 ఓవర్లలో 3 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58. బౌలింగ్: సయాలీ 8–1–24–2, క్రాంతి 11–2–28–1, కాశ్వీ 7–1–29–0, స్నేహ్ రాణా 1–0–9–0.
సెమీస్లో లక్ష్య సేన్
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ లక్ష్య సేన్ విజయపరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–13, 21–16తో ప్రపంచ 6వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆద్యంతం లక్ష్య సేన్ ఆధిపత్యం చలాయించాడు. ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో లీ షి ఫెంగ్ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్గా లీ షి ఫెంగ్తో 15 సార్లు తలపడ్డ లక్ష్య సేన్ 8 సార్లు గెలిచి, 7 సార్లు ఓడిపోయాడు. కొకి వతనాబె (జపాన్), విక్టర్ లాయ్ (కెనడా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ తలపడతాడు.
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్తో ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లోకాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్లో భాగంగా బుమ్రా బౌలింగ్లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. అయితే, అతడి మీద మాకు మంచి రోజు అయ్యేది ఫైనలే ఎందుకు కాకూడదు?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
IND v AUS: భారత్ ఆలౌట్.. ఆసీస్ స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అయింది. ఆసీస్ వుమెన్ టీమ్తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాటీ20 సిరీస్ను భారత్ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్ టెస్టు మ్యాచ్ మొదలైంది. పెర్త్లోని WACA స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. వన్డౌన్లో వచ్చిన ప్రతికా రావల్ (18) సైతం నిరాశపరిచింది.హాఫ్ సెంచరీతో రాణించిన జెమీమాఇక మరో ఓపెనర్ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (19) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో కశ్వీ గౌతం (34 నాటౌట్) మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకుంది.మిగిలిన వారంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలీ సత్గరే (7), క్రాంతి గాడ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనాబెల్కు నాలుగు వికెట్లుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్ రెండు, ఆష్లే గార్డ్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్ (2)ను సయాలీ బౌల్డ్ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్ (9)ను క్రాంతి గాడ్ పెవిలియన్కు పంపింది. కెప్టెన్ అలెసా హీలీ (13) వికెట్ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్ పెర్రీ, అనాబెల్ పట్టుదలగా నిలబడ్డారు.నిలకడగా పెర్రీ, అనాబెల్శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఆసీస్ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలి రోజు ఆసీస్దే పైచేయి అని చెప్పవచ్చు. చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
నీకంత దూకుడు ఎందుకు?: అభిషేక్ శర్మపై అశ్విన్ ఆగ్రహం
అభిషేక్ శర్మ.. తొలిసారి ప్రపంచకప్ టోర్నీ ఆడుతున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 0 (1), 0 (4), 0 (3), 15 (12), 55 (30), 10 (11), 9 (7).విఫలమైనా..లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడి డకౌట్ అయినా యాజమాన్యం అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఓపెనర్గా కొనసాగించిది. అయితే, అతడి ఆట తీరు మాత్రం మారలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్తో కీలక సెమీ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తేలిపోయాడు. తొందరపడి వికెట్ పారేసుకుని తొమ్మిది పరుగులకే నిష్క్రమించాడు.సంజూ మెరుపు ఇన్నింగ్స్మరో ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మెరుపు ఇన్నింగ్స్ (42 బంతుల్లో 89) తో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ ఓపెనింగ్ బ్యాటర్ వైఖరిని తప్పుబట్టాడు.తలతిక్క బ్యాటింగ్‘‘ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అతడు తలతిక్కగా బ్యాటింగ్ చేశాడు. నిజానికి అభిషేక్ గేమ్ప్లాన్కు నేను వీరాభిమానిని. విల్ జాక్స్ బౌలింగ్లో అతడు ఎనిమిది పరుగులు రాబట్టాడు. కానీ ఈ తర్వాత అతడి ఓవర్లోనే 30 పరుగులు తీయాలి అన్నట్లు తొందరపడ్డాడు.నీకంత దూకుడు ఎందుకు?కొన్నిసార్లు బాల్ను వదిలేయాల్సి ఉంటుంది. ఓవైపు సంజూ శాంసన్ కుదురుగా ఆడుతున్నాడు కదా!.. నీకు కష్టంగా అనిపిస్తే ఒక సింగిల్ తీసి మరో ఎండ్కు వెళ్లిపోవాల్సింది. ఆ తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది కదా!.. ఏదేమైనా అంత దూకుడు పనికిరాదు’’ అని అశ్విన్ అభిషేక్పై మండిపడ్డాడు.అదే విధంగా.. న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో.. ‘‘అభిషేక్ మంచి బ్యాటర్. న్యూజిలాండ్తో ఇటీవలి సిరీస్లో సూపర్ ఫామ్ కనబరిచాడు. మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గతంలో అదరగొట్టాడు.ఒత్తిడిలో ఉన్నాడుఅయితే, ఇప్పుడు అతడు ఒత్తిడిలో ఉన్నాడు. కెప్టెన్, హెడ్కోచ్ అతడితో మాట్లాడాలి. తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి జట్టు వద్ద ఉన్న ప్రణాళికలను వివరించాలి. అతడిలో గొప్ప ప్రతిభ ఉంది. కానీ ఎందుకో తడబడుతున్నాడు.ఇలాంటి తరుణంలో అతడిపై మరింత ఒత్తిడి చేసే విధంగా మేనేజ్మెంట్ ఉండకూడదు. మానసికంగా దృఢంగా తయారయ్యేలా తీర్చిదిద్దాలి’’ అని టీమిండియా యాజమాన్యానికి అశూ సూచనలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్.. అభిషేక్ కోసం లెగ్సైడ్లో ఒకే ఒక్క ఫీల్డర్ను ఉంచాడు. అతడికి క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. మార్చి 8న భారత్- న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రంచకప్-2026 ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్ (IND vs NZ Final) మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్లలో అంపైర్గా పని చేసిన అనుభవం ఇల్లింగ్వర్త్కు ఉంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో ఆయనే అంపైర్.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ (ఇల్లింగ్వర్త్), అదే వేదిక (అహ్మదాబాద్)పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్కు అంపైర్లు వీరే👉ఆన్ ఫీల్డ్ అంపైర్లు- రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్👉థర్డ్ అంపైర్- అల్లాఉద్దీన్ పలేకర్👉ఫోర్త్ అంపైర్- అడ్రియాన్ హోల్డ్స్టక్👉మ్యాచ్ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. బుమ్రా లాంటి బౌలర్ దొరకడం భారత జట్టు చేసుకున్న అదృష్టం అని కొనియాడాడు. టీమిండియాలో ఇంత వరకు ఇలాంటి బౌలర్ను ఎన్నడూ చూడలేదంటూ ఆకాశానికెత్తాడు.టైటిల్ పోరుకు అర్హతటీ20 ప్రపంచకప్-2026లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లిన విషయం తెలిసిందే. ముంబై వేదికగా వాంఖడేలో జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై ఏడు పరుగుల తేడాతో గెలిచిన సూర్య సేన.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ మ్యాచ్లో ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) బ్యాట్తో రాణిస్తే.. బుమ్రా తన అద్భుత స్పెల్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ చిచ్చర పిడుగు జేకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వేళ.. బుమ్రా తన మ్యాజిక్ చూపించాడు.కీలక సమయంలో రాణించిపద్దెనిమిదవ ఓవర్లో 0,1,1,2,1,1 మాత్రమే ఇచ్చిన బుమ్రా.. టీమిండియా వైపు మ్యాచ్ తిప్పేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ బుమ్రాను ప్రశంసలతో ముంచెత్తాడు. ‘‘బుమ్రా గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అతడు తరానికొక్క బౌలర్. టీమిండియాలో ఇలాంటి బౌలర్ను చూడటం అరుదు.సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడుయార్కర్లు, స్లో బాల్స్ వేస్తాడు.. అవుట్ స్వింగ్, ఇన్స్వింగ్ రాబడతాడు. బౌన్సర్లు సంధిస్తాడు. ముఖ్యంగా ఒత్తిడిలోనూ ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. నా దృష్టిలో ఈ మ్యాచ్కు సంబంధించి బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సింది.ఈ పిచ్పై బౌలర్లందరి ఎకానమీ దాదాపుగా 10 దాటి పోయింది. రెండు జట్లు కలిపి 500కు పైగా పరుగులు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలా బౌలింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇంతటి కఠినమైన ఓవర్ను బుమ్రా మాత్రమే వేయగలడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ సైతంకాగా ఈ మ్యాచ్లో సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సంజూ సైతం బుమ్రానే ఈ అవార్డుకు అర్హుడు అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుమ్రా ఓవరాల్గా నాలుగు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్లతో టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Next stop: FINAL! 😍A high-scoring thriller, but #TeamIndia hold their nerve and book a spot in the final! 🔥ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/PQfdlxUEv7— Star Sports (@StarSportsIndia) March 5, 2026చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
ఇది వరల్డ్కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో.. ఏడు పరుగుల తేడాతో గట్టెక్కింది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ మ్యాచ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే.సంజూ భారీ అర్ధ శతకంటాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ భారీ అర్ధ శతకం (42 బంతుల్లో 89) తో ఆకట్టుకున్నాడు.ఇక లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో టీమిండియాకు శుభారంభం లభించింది. హార్దిక్ పాండ్యా ఫిల్ సాల్ట్ (5) రూపంలో తొలి వికెట్ దక్కించుకోగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా హ్యారీ బ్రూక్ (7)ను అవుట్ చేసి కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.బెతెల్ విధ్వంసకర శతకంఅయితే, జేకబ్ బెతెల్ విధ్వంసకర శతకం (48 బంతుల్లో 105)తో విరుచుకుపడి.. భారత శిబిరంలో గుబులు రేపాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. దీంతో ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది.ఇక ఈ మ్యాచ్లో బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాంఖడే డీజే బృందం.. ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ బుమ్రా నామస్మరణ చేయాలని ప్రేక్షకులకు పిలుపు ఇచ్చారు. దీంతో అందరూ బుమ్రా పేరును గట్టిగా పలుకుతూ స్టేడియం దద్దరిల్లేలా చేశారు.Every Team India fan after watching Jasprit Bumrah’s masterclass! 🇮🇳🔥ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | SUN, 8th MAR, 5:30 PM pic.twitter.com/My9xx2WPyt— Star Sports (@StarSportsIndia) March 6, 2026బుమ్రా ఏంటి బుమ్రా?ఈ విషయంపై స్పందిస్తూ భారత మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బుమ్రా బౌలింగ్ చేసేందుకు సిద్ధపడినపుడు.. ‘బూమ్ బూమ్ బుమ్రా’ అని అరవాలని చెప్పడం సరికాదు.బుమ్రా నామస్మరణ చేయాలనుకుంటే అతడు ఫ్రీగా ఉన్నపుడు చేయాలి. ఇది వరల్డ్కప్ అన్న విషయం గుర్తుంచుకోవాలి’’ అని గావస్కర్ ఫైర్ అయ్యాడు. కాగా కీలక సెమీ ఫైనల్లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నపుడు.. అతడి ఏకాగ్రత దెబ్బతినేలా ప్రవర్తించడం సరికాదన్నది గావస్కర్ అభిప్రాయం.ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో సూపర్-8లో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చేసిన ఏర్పాట్లపై కూడా గావస్కర్ ఇదే విధంగా స్పందించాడు. మ్యాచ్ మధ్యలో లేజర్ షో ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రవిశాస్త్రి కూడా అతడికి మద్దతు పలికాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్
WC 2026: యుద్ధం ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
యుద్ధం వేళ ఇరాన్ ఫుట్బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం ...
సురక్షితంగా భారత్కు చేరుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు భా...
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టికెట్ల అమ్మకాలు షురూ
సాక్షి, హైదరాబాద్: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయ...
కొరియా చేతిలో ఇరాన్ మహిళల జట్టు ఓటమి
గోల్డ్కోస్ట్: ఇరాన్ లక్ష్యంగా ప్రస్తుతం పశ్చిమా...
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేర...
సంజూ కాదు!.. అతడే అందుకు అర్హుడు: మాజీ క్రికెటర్
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత ...
ఇది వరల్డ్కప్.. గుర్తుందా?: గావస్కర్ ఫైర్
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత్ ఫైనల్క...
చూసుకోవా?.. హార్దిక్ కుమారుడి రియాక్షన్.. మహీక షాక్!
ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా ఆల్రౌండర్ హార...
క్రీడలు
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
వీడియోలు
రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్
ఇండియా Vs కివీస్ సన్ డే బిగ్ ఫైట్..
ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..
టీమిండియా గెలుపుకు 3 కారణాలు ఇవే
ఔటా? నాటౌటా? దుమారం రేపుతున్న మార్క్రమ్ క్యాచ్..
వాంఖడేను సైలెంట్ చేస్తామన్నారు... కానీ మనవాళ్లు మోత మోగించారు!
యుద్ధం దగ్గరగా చూశా.. దుబాయ్ లో భయంకర పరిస్థితులపై PV సింధు రియాక్షన్
గెలవాలంటే ఆ మ్యాచ్ విన్నర్ ని దింపాల్సిందే.. ఒక్కడు చాలు...
సెమీస్కు ముందే టీమిండియాకు 5 గుడ్ న్యూస్ లు
ముంబైలో హై వోల్టేజ్ మ్యాచ్..
