Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

U19 Asia Cup 2025 Ind vs Pak: Vaibhav Suryavanshi Fails After Century1
పాక్‌తో మ్యాచ్‌.. వైభవ్‌ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్‌

భారీ అంచనాల నడుమ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ విఫలమయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2025 (Asica Cup)లో భాగంగా గ్రూప్‌-‘ఎ’ లో ఉన్న భారత్‌- పాక్‌ (Ind vs Pak)మధ్య ఆదివారం మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టిన ఆయుశ్‌ఇక దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో దాయాదితో పోరులో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో యూఏఈపై విఫలమైన ఓపెనర్‌, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) ఈసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మొదలుపెట్టగా.. మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మాత్రం ఆది నుంచే తడబడ్డాడు.పాక్‌ బౌలింగ్‌ అటాక్‌ను ఆరంభించిన అలీ రెజా.. తొలి ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి ఆయుశ్‌ మాత్రే పరుగు తీశాడు. ఇక రెండో ఓవర్లో మొహమ్మద్‌ సయ్యామ్‌ బౌలింగ్‌లో ఆయుశ్‌ ఫోర్‌, సిక్స్‌, ఫోర్‌తో అలరించగా.. వైభవ్‌ మాత్రం ఇక్కడా ఖాతా తెరవలేదు.టచ్‌లోకి వచ్చినట్లే వచ్చిమూడో ఓవర్లో మళ్లీ రెజా రంగంలోకి దిగగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి వైభవ్‌ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తర్వాత ఆయుశ్‌ రెజా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది సత్తా చాటాడు. అయితే, నాలుగో ఓవర్‌లో మొహమ్మద్‌ సయ్యామ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని వైభవ్‌ స్ట్రెయిట్‌ షాట్‌ బాదగా.. అతడు బంతిని క్యాచ్‌ పట్టాడు.దీంతో ఆరు బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. ఒక ఫోర్‌ సాయంతో కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు. అతడి స్థానంలో హైదరాబాదీ స్టార్‌ ఆరోన్‌ జార్జ్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఐదు ఓవర్ల ఆటలో భారత్‌ వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. కాగా యూఏఈతో గత మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ భారీ శతకం (171) బాదిన విషయం తెలిసిందే. అయితే, సెమీస్‌ చేరడంలో కీలకమైన పాక్‌తో మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. చదవండి: IPL 2026: మా మేనేజర్‌ తప్పు వల్లే ఇలా..: కామెరాన్‌ గ్రీన్‌

U19 Asia Cup 2025 Ind vs Pak: Pakistan Won Toss Check Playing XIs2
IND vs PAK: టాస్‌గెలిచిన పాకిస్తాన్‌.. భారత్‌ బ్యాటింగ్‌

ఆసియా క్రికెట్‌ మండలి అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో.. ఆయుశ్‌ మాత్రే సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు.తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలుకాగా అండర్‌-19 ఆసియా కప్‌లో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, మలేషియా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, నేపాల్‌ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ యూఏఈ (IND vs UAE)ని.. పాక్‌ మలేషియా (PAK vs MLY)ను చిత్తుగా ఓడించి శుభారంభం అందుకున్నాయి. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో దాయాదులు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో భారత చిచ్చరపిడుగు, యూఏఈతో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలా ఒక మ్యాచ్‌ గెలిచి టాప్‌-2లో ఉండగా.. గ్రూప్‌-ఎలో పాక్‌, భారత్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ పాకిస్తాన్‌ అండర్‌-19 తుదిజట్లుభారత్‌ఆయుష్ మాత్రే(కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌ కీపర్‌), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.పాకిస్తాన్‌ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్‌), హమ్జా జహూర్(వికెట్‌ కీపర్‌), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.చదవండి: తుదిజట్టు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు!.. సౌతాఫ్రికా కోచ్‌ ఏమన్నాడంటే..

Green Blames Manager Registering IPL 2026 Auction him as pure batter3
IPL 2026: మా మేనేజర్‌ తప్పు వల్లే ఇలా..: కామెరాన్‌ గ్రీన్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్‌ కామెరాన్‌ గ్రీన్‌ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తాను బౌలింగ్‌ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్‌ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్‌ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్‌ స్లాట్‌లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్‌ బ్యాటర్‌ స్లాట్‌లో సెట్‌ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్‌ ఈ సీజన్‌లో బౌలింగ్‌ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్‌ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్‌ గ్రీన్‌ తన పేరు బ్యాటర్‌గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్‌ సిరీస్‌ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్‌గా మాత్రమే రిజిస్టర్‌ చేశారన్న విషయం మా మేనేజర్‌కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్‌ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్‌ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గ్రీన్‌.. ముంబై ఇండియన్స్‌ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్‌పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ను ట్రేడ్‌ చేసుకోగా.. 255 రన్స్‌ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్‌ గాయపడటంతో ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ: తిలక్‌ వర్మ

Changes not for sake of it: South Africa coach defends constant team Changes4
ఏదో మొక్కుబడిగా చేయను.. క్లారిటీ ఉంది: సౌతాఫ్రికా కోచ్‌

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.ఏదో మొక్కుబడిగా చేయనుమరోవైపు.. ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.స్పష్టమైన అవగాహన ఉందిటీ20 ప్రపంచకప్‌-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్‌ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్‌లోనూ మేము బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చబోము. తప్పక ఆర్డర్‌ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్‌ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్‌ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్‌ తర్వాత SA20 లీగ్‌ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.ఇక్కడ ఏది వర్కౌట్‌ అయింది.. ఏది వర్కౌట్‌ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్‌ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు భారత పర్యటనకు వచ్చింది.1-1తో సమంఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్‌వాష్‌ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్‌లో భారత్‌.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్‌ గెలిచింది. ఇక కటక్‌ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో ప్రొటిస్‌ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌, కేశవ్‌ మహరాజ్‌, అన్రిచ్‌ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్‌, జార్జ్‌ లిండే, ఓట్నీల్‌ బార్ట్‌మన్‌లను బరిలోకి దించింది. బార్ట్‌మన్‌ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.సౌతాఫ్రికారీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), ఐడెన్ మార్క్రమ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.చదవండి: భారత్‌ X పాకిస్తాన్‌

Lionel Messi Special Gesture In Hyderabad Stadium Sends Fans Into A Frenzy5
స్టాండ్స్‌లోకి కిక్‌ చేసి.. ఉప్పల్‌లో మెస్సీ చర్య వైరల్‌

సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్‌ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్‌ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా తాజ్‌ ఫలక్‌నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొన్నా రు. అనంతరం ఆయన ఉప్పల్‌ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్‌ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. స్టాండ్స్‌లోకి కిక్‌ చేసివీవీఐపీలు, ఫుట్‌బాల్‌ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్‌ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌లోకి కిక్‌ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్‌గా మారింది. ✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025మ్యూజిక్‌.. మ్యాజిక్‌.. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్‌ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. ఆస్కార్‌ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్‌ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్‌ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్‌ సాంగ్స్‌తో మంగ్లీ మెస్మరైజింగ్‌ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం..ఉప్పల్‌: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్‌ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్‌లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్‌ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. మ్యాచ్‌ను వీక్షించేందుకు వస్తున్న యువత కాగా.. గతంలో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్‌ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్‌ను ధరించి వెళ్లడం కనిపించింది.

Global Chess League 2025: 6 Teams In Race Stars In List Where To Watch6
గ్లోబల్‌ చెస్‌ లీగ్‌.. బరిలో అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు

సాక్షి, సిటీబ్యూరో: టెక్‌ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్త భాగస్వామ్యంలో గ్లోబల్‌ చెస్‌ లీగ్‌ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని రాయల్‌ ఒపెరా హౌస్‌లో నేటి నుంచి ఈ లీగ్‌ జరుగుతుంది. ఆరు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా సీజన్‌–3 విన్నర్స్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్, ఆల్పైన్‌ ఎస్‌జీ పైపర్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్‌ అధికారికంగా ఆదివారం ప్రారంభమవుతుంది. మహీంద్రా గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా, చెస్‌ దిగ్గజాలు విశ్వనాథన్‌ ఆనంద్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, అలీరెజా ఫిరూజా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లుఈ సీజన్‌ జీసీఎల్‌ లక్ష్యాలను ప్రపంచ స్థాయి ఆటగాళ్ల ఎంపిక ద్వారా సాధిస్తుందని చైర్‌పర్సన్‌ పీయూష్‌ దూబే తెలిపారు. ఈ సీజన్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ గ్రాండ్‌మాస్టర్లు ఆడనున్నారు. ప్రధాన ఆటగాళ్లలో అలీరెజా ఫిరూజా, ఫాబియానో కరువానా, హికారు నకముర, హు ఇఫాన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు విశ్వనాథన్‌ ఆనంద్‌ సహా భారత మేటి ఆటగాళ్లు పోటీపడతారు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీ భారత చెస్‌ శక్తిని చాటుతున్నారు. రెండుసార్లు విజేతలైన త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ హ్యాట్రిక్‌ సాధించాలని చూస్తోంది. 10 రోజుల పాటుమరోవైపు.. పీబీజీ అలాస్కాన్‌ నైట్స్‌ జట్టు యజమాని పునిత్‌ బాలన్, గుకేశ్‌ అర్జున్‌ వంటి ప్రతిభావంతులతో తాము బలమైన స్థితిలో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. జేసీఎల్‌ మూడో సీజన్‌ డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో 10 రోజుల పాటు జరుగుతుంది. ఇక ఈ లీగ్‌లో ప్రతి జట్టు 10 గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత డిసెంబర్‌ 23న ఫైనల్‌ జరుగుతుంది. ప్రతి మ్యాచ్‌ ఆరు బోర్డులపై పురుషులు, మహిళలు, యువ క్రీడాకారులు కలిసి పోటీపడతారు. భారత్‌లోని అభిమానులు జియో హాట్‌స్టార్‌ నెట్‌వర్క్‌లో లీగ్‌ను చూడవచ్చు. టిక్కెట్లు డిస్ట్రిక్ట్‌ యాప్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

India plays its third T20 against South Africa today7
ధర్మశాలలో దుమ్మురేపేనా!

ధర్మశాల: సొంతగడ్డపై భారత క్రికెట్‌ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టి20 ఆడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్‌ 1–1తో సమం కాగా... ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్‌ బృందం రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా... రెండో టి20లో భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌నకు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేర్పులను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుబ్‌మన్‌ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు గత మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇక్కటి చల్లటి వాతావరణం, పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌ సఫారీలకు మరింత సహాయపడనుంది. గిల్‌ రాణించేనా..! టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుబ్‌మన్‌ గిల్‌... టి20ల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచే దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్‌లో గిల్‌ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టి20ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే... టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు వ్యూహం మార్చాల్సి రావచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగగా... ఈ ఇద్దరి రిటైర్మెంట్‌ అనంతరం అభిషేక్‌ శర్మ, సంజూ సామ్సన్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సామ్సన్‌ను బెంచ్‌కు పరిమితం చేసిన మేనేజ్‌మెంట్‌... గిల్‌కు విరివిగా అవకాశాలు ఇస్తోంది. కానీ వాటిని వినియోగించుకోవడంలో మాత్రం అతడు విఫలమవుతున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్‌ పేలవంగా వికెట్‌ పారేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌కు దిగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్‌లో కూర్చోబెట్టి అక్షర్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోచ్‌ గంభీర్‌కే తెలియాలి. అడపాదడపా షాట్‌లు ఆడటం తప్ప నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్న అక్షర్‌ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఏడాది ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అభిషేక్‌ మెరుపుల మధ్య సూర్య వైఫల్యం బయటకు కనిపించడం లేదు కానీ... అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాన్నాళ్లైంది. తిలక్‌ వర్మ నిలకడగా రాణిస్తున్నా... అతడికి సహకారం కరువైంది. హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబే ఇలా స్టార్‌లకు కొదవ లేకపోయినా... వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. గత మ్యాచ్‌లో దూబేను ఎనిమిదో స్థానంలో బరిలోకి దింపడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేస్తారా లేక గంభీర్‌ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా చూడాలి. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్‌లో ప్రధాన సమస్యగా మారింది. గత మ్యాచ్‌లో అనామక బ్యాటర్‌ సైతం బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టడం అభిమానులకు ఇబ్బంది కలిగించింది. మరోవైపు అర్ష్ దీప్‌ నియంత్రణ కోల్పోతుండటం జట్టుకు మరింత భారం అవుతోంది. వరుణ్‌ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తుండగా... కుల్దీప్‌ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి. పటిష్టంగా దక్షిణాఫ్రికా... సుదీర్ఘ పర్యాటనలో భాగంగా టెస్టు సిరీస్‌ ‘క్లీన్‌ స్వీప్‌’ చేసిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. ఇప్పుడిక చివరగా జరుగుతున్న టి20 సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. ఈ టూర్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో డికాక్‌ తన దమ్మేంటో చూపగా... కెప్టెన్‌ మార్క్‌రమ్, హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, ఫెరీరా, లిండె, యాన్సెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. మెరుగైన ఆరంభం లభిస్తే చాలు... క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్‌లు ఆడగల సమర్థులే కావడం దక్షిణాఫ్రికా జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో యాన్సెన్‌ భారత జట్టుకు సింహస్వప్పంలా మారగా... ఎన్‌గిడి, సిపామ్లా, బార్ట్‌మన్‌ సమష్టిగా కదంతొక్కుతున్నారు. పిచ్‌ పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమైన పనే. అభిషేక్‌ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బతీయకపోతే... ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచగలరు.పిచ్, వాతావరణం హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చేజింగ్‌ జట్లు గెలుపొందాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై బౌలర్లకు పట్టుచిక్కడం కష్టం. పిచ్‌ పేసర్లకు సహకరించనుంది. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్, అర్ష్ దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా. దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్), డికాక్, స్టబ్స్‌/హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, డొనొవాన్‌ ఫెరీరా, యాన్సెన్, లిండె, ఎన్‌గిడి, బార్ట్‌మన్, నోర్జే/సిపామ్లా.

Indian team match against Pakistan in the Under19 Asia Cup8
భారత్‌ X పాకిస్తాన్‌

దుబాయ్‌: అండర్‌–19 ఆసియాకప్‌లో ఘనవిజయంతో బోణీ కొట్టిన యువ భారత జట్టు ఆదివారం దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ పోరులో గెలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని యంగ్‌ ఇండియా భావిస్తోంది. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు ‘హ్యాండ్‌ షేక్‌’ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పహల్గామ్‌ ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో... ఇటీవల జరిగిన పురుషుల సీనియర్‌ ఆసియాకప్, మహిళల వన్డే ప్రపంచకప్, రైజింగ్‌ స్టార్స్‌ ఆసియాకప్‌ టి20 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లు పాకిస్తాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు 234 పరుగుల తేడాతో యూఏఈపై గెలిచి మంచి జోష్‌లో ఉంది. ఐపీఎల్‌ సహా సీనియర్‌ స్థాయిలో ఆడిన పలు టోర్నమెంట్‌లలో సెంచరీలతో విజృంభించిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. యూఏఈతో పోరులో అతడు 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్స్‌లతో 171 పరుగులు చేసి అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కూడా అతడు అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే, వైస్‌కెపె్టన్‌ విహాన్‌ మల్హోత్రాతో పాటు హైదరాబాద్‌ ఆటగాడు ఆరోన్‌ జార్జి మంచి టచ్‌లో ఉన్నారు. వీరంతా సమష్టిగా సత్తాచాటితే పాకిస్తాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక మరోవైపు తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 297 పరుగుల తేడాతో మలేసియాపై గెలిచింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరీహోరీ ఖాయమే!

Tilak Varma is ready to bat at any position9
ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ: తిలక్‌ వర్మ

ధర్మశాల: భారత జట్టులో ఎక్కువ మంది ప్లేయర్లు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని... హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం మూడో మ్యాచ్‌ జరగనుండగా... దానికి ముందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తిలక్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిలక్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘జట్టులో ఓపెనర్లు తప్ప మిగిలిన వాళ్లు ఎవరైనా ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు ఇమిడిపోయే విధంగా ఉండాలి. ఏ నిర్ణయమైనా జట్టు కోసమే. ఈ అంశంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టంగా ఉంది. నా వరకైతే మూడో స్థానం నుంచి మొదలు ఎక్కడ బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే. అందరూ అలాగే ఉన్నారు. వన్‌డౌన్‌లో అక్షర్‌ ఎన్నోసార్లు ఆకట్టుకున్నాడు. అది పరిస్థితులను బట్టి తీసుకునే నిర్ణయమే’అని తిలక్‌ అన్నాడు. ధర్మశాలలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని... అందుకు తగ్గట్లే జట్లు సన్నద్ధత ఉంటుందని తిలక్‌ అన్నాడు. ‘నేను అండర్‌–19 స్థాయిలో ఇక్కడ మ్యాచ్‌లు ఆడాను. పిచ్‌ను పరిశీలిస్తే భారీ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తోంది. చలితీవ్రత అధికంగా ఉండే ధర్మశాలలో పిచ్‌ పేసర్లకు అనుకూలించనుంది. టాస్‌ మన చేతిలో ఉండదు. అందుకే దేనికైనా సిద్ధంగా ఉండాలి. బంతిపై పట్టు చిక్కించుకునేందుకు తడిచిన బంతితో సైతం ప్రాక్టీస్‌ చేస్తున్నాం.

Unnati has advanced to the final at the Odisha Masters10
ఫైనల్లో ఉన్నతి

కటక్‌: టాప్‌ సీడ్‌ హోదాకు తగ్గట్టు రాణించిన భారత బ్యాడ్మింటన్‌ రైజింగ్‌ స్టార్‌ ఉన్నతి హుడా మరో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఒడిశా మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఉన్నతి ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాకు చెందిన 18 ఏళ్ల ఉన్నతి సెమీఫైనల్లో 18–21, 21–16, 21–16తో ప్రపంచ మాజీ జూనియర్‌ నంబర్‌వన్, భారత్‌కే చెందిన తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాతో ఉన్నతి తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో అస్సాం ప్లేయర్‌ ఇషారాణి 18–21, 21–7, 21–7తో భారత్‌కే చెందిన తాన్యా హేమంత్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో కిరణ్‌ జార్జి 21–19, 8–21, 21–18తో సహచరుడు రౌనక్‌ చౌహాన్‌పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో అశ్విని భట్‌–శిఖా గౌతమ్‌ (భారత్‌) జోడీ 13–21, 16–21తో ఓంగ్‌ జిన్‌ యీ–కార్మెన్‌ టింగ్‌ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో కణపురం సాత్విక్‌ రెడ్డి–రేషిక (భారత్‌) ద్వయం 16–21, 19–21తో దెజాన్‌–బెర్నాదినె వర్దన (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement