ప్రధాన వార్తలు
రేపటి నుంచి మరో క్రికెట్ పండుగ
రేపటి నుంచి (నవంబర్ 18) మరో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్ అబుదాబీ టీ10 లీగ్ మొదలుకానుంది. ఈ సీజన్లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అన్ని జట్ల మధ్య 32 మ్యాచ్లు జరుగనున్నాయి. విండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ నేతృత్వంలోని డెక్కన్ గ్లాడియేటర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పండుగలో ప్రపంచవ్యాప్తంగా ఉండే విధ్వంకర బ్యాటర్లు పాల్గొనున్నారు. ఈ లీగ్లో భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, మురళీ విజయ్ లాంటి వారు పాల్గొంటున్నారు.అబుదాబీ టీ10 లీగ్ 2025 వివరాలు..ఫ్రాంచైజీలు:డెక్కన్ గ్లాడియేటర్స్ (నికోలస్ పూరన్), అజ్మన్ టైటాన్స్ (మొయిన్ అలీ), అస్పిన్ స్టాల్లియన్స్ (సామ్ బిల్లింగ్స్), ఢిల్లీ బుల్స్ (రోవ్మన్ పావెల్), నార్త్రన్ వారియర్స్ (షిమ్రోన్ హెట్మైర్), క్వెట్టా క్వావల్రీ (లియామ్ లివింగ్స్టోన్), రాయల్ ఛాంప్స్ (జేసన్ రాయ్), విస్టా రైడర్స్ (ఫాఫ్ డుప్లెసిస్)ఎక్కడ వీక్షించవచ్చంటే..?ఈ లీగ్ను భారత్లోని అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ద్వారా వీక్షించవచ్చు. ఫ్యాన్కోడ్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.జట్ల వివరాలు..అజ్మాన్ టైటాన్స్: మొయిన్ అలీ, రిలీ రోసౌవ్, పీయూష్ చావ్లా, విల్ స్మీడ్, జాసన్ బెహ్రెన్డార్ఫ్, డాన్ లారెన్స్, అలీషాన్ షరాఫు, అలెక్స్ హేల్స్, ఆసిఫ్ అలీ, క్రిస్ గ్రీన్, అకిఫ్ జావేద్, జమాన్ ఖాన్, అన్యూరిన్ డొనాల్డ్, హైదర్ అలీ, వసీమ్ అక్రమ్, లూక్ బెంకెన్స్, లూక్ బెన్కెన్స్టైన్, టామ్ అస్పిన్వాల్, జో క్లార్క్, ఆసిఫ్ ఖాన్ఆస్పిన్ స్టాలియన్స్: సామ్ బిల్లింగ్స్, టైమల్ మిల్స్, హర్భజన్ సింగ్, ఆండ్రీ ఫ్లెచర్, అవిష్క ఫెర్నాండో, బినురా ఫెర్నాండో, జోహైర్ ఇక్బాల్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, సైఫ్ హసన్, ర్యాన్ బర్ల్, అఖిలేష్ బొడుగుం, అలీ ఖాన్, బెన్ కట్టింగ్, ఎస్సామ్ ముతీ ఉర్ రబ్, హఫీజ్ ఉర్ రెహ్మాన్, అష్మీద్ నెడ్, మాథ్యూ హర్స్ట, మోనాంక్ పటేల్, హర్షిత్ సేథ్డెక్కన్ గ్లాడియేటర్స్: నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ఉస్మాన్ తారిఖ్, ఇబ్రార్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, లాహిరు కుమార, జోర్డాన్ థాంప్సన్, దిల్ప్రీత్ సింగ్ బజ్వా, జేక్ బాల్, ముహమ్మద్ జవదుల్లా, అజయ్ కుమార్, అలీ రజా, వఫివుల్లా తారఖిల్, లారీ ఎవాన్స్, మార్క్ చాప్మన్ఢిల్లీ బుల్స్: రోవ్మన్ పావెల్, ఫిల్ సాల్ట్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, సునీల్ నరైన్, సల్మాన్ ఇర్షాద్, ముహమ్మద్ రోహిద్, బ్లెస్సింగ్ ముజారబానీ, జేమ్స్ విన్స్, టామ్ మూర్స్, కైస్ అహ్మద్, మీర్ హంజా, జేమ్స్ కోల్స్, జునైద్ సిద్ధిక్, ఫర్హాన్ ఖాన్, బ్రియాన్ బెన్నెట్, అరబ్ గుల్, రొమారియో షెపర్డ్, ఫజల్ హక్ ఫారూకీనార్తర్న్ వారియర్స్: షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, తిసర పెరీరా, జాన్సన్ చార్లెస్, కోలిన్ మున్రో, అజ్మతుల్లా ఒమర్జాయ్, తబ్రైజ్ షమ్సీ, ఒడియన్ స్మిత్, షానవాజ్ దహానీ, దినేష్ చండిమాల్, హజ్రతుల్లా జజాయ్, అసిత ఫెర్నాండో, సాగర్ కళ్యాణ్, యయిన్ కిరణ్ రాయ్, ఇక్బాల్ భుట్టా, బిలాల్ సమీ, ఫరీదూన్ దావూద్జాయ్, ప్రబాత్ జయసూర్య, కదీమ్ అలీనేక్వెట్టా కవాల్రీ: లియామ్ లివింగ్స్టోన్, జాసన్ హోల్డర్, మహ్మద్ అమీర్, సికందర్ రజా, ఆండ్రీస్ గౌస్, ఇమ్రాన్ తాహిర్, ముహమ్మద్ వసీమ్, ఎవిన్ లూయిస్, ఫాబియన్ అలెన్, అబ్బాస్ అఫ్రిది, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, జార్జ్ స్క్రిమ్షా, ఖవాజా నఫాయ్, అబ్దుల్ గఫార్, ఖుజాయిమా బిన్ తన్వీర్, అరాఫత్ మిన్హాస్, ఉమర్ లోహ్యా, గుడాకేష్ మోతీ, అలీ నసీర్రాయల్ చాంప్స్: జాసన్ రాయ్, ఏంజెలో మాథ్యూస్, షకీబ్ అల్ హసన్, క్రిస్ జోర్డాన్, డేనియల్ సామ్స్, నిరోషన్ డిక్వెల్లా, రాహుల్ చోప్రా, మహ్మద్ షెహజాద్, రిషి ధావన్, లియామ్ డాసన్, బ్రాండన్ మెక్ముల్లెన్, ఇసురు ఉదానా, క్వెంటిన్ సాంప్సన్, హైదర్ రజాక్, జహిద్ అలీ, కెల్విన్ పిట్మ్యాన్, విషన్ హలంబే, జియా ఉర్ షరాఫీ, ఆరోన్ జోన్స్విస్టా రైడర్స్: ఫాఫ్ డు ప్లెసిస్, మాథ్యూ వేడ్, ఎస్ శ్రీశాంత్, డ్వైన్ ప్రిటోరియస్, భానుక రాజపక్స, ఉన్ముక్త్ చంద్, హర్షిత్ కౌశిక్, ఆండ్రూ టై, బెన్ మెక్డెర్మాట్, దిల్షాన్ మధుశంక, నహిద్ రాణా, ఏంజెలో పెరెరా, సీన్ డిక్సన్, అన్ష్ టాండన్, తీసీ రిజ్వాన్, నవీద్, అకీమ్ అగస్టీ, మురళీ విజయ్, షరాఫుద్దీన్ అష్రఫ్
పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్
పాకిస్తాన్లో రేపటి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కాబోయే ముక్కోణపు సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వే కూడా పాల్గొంటున్న ఈ టోర్నీకి ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) దూరమయ్యాడు (అనారోగ్యం కారణంగా). అసలంక తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్గా షనక నియామకాన్ని లంక క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది.అసలంకతో పాటు మరో లంక బౌలర్ కూడా పాక్ ట్రై సిరీస్కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కూడా అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఈ ట్రై సిరీస్లో శ్రీలంక తమ తొలి మ్యాచ్ను నవంబర్ 20న ఆడనుంది. రావల్పిండి వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది.పాక్ ట్రై సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.షనక నాయకత్వ అనుభవంషనక లంక కెప్టెన్సీ బాధ్యతలు మోయడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్లో తొలిసారి శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి 2023 వరకు జట్టును ముందుండి నడిపించాడు. షనక నాయకత్వంలో శ్రీలంక 48 T20I మ్యాచ్లలో 22 విజయాలు సాధించి, 24 ఓటములను ఎదుర్కొంది. రెండు మ్యాచ్లు టై అయ్యాయి.పాక్ చేతిలో చిత్తుట్రై సిరీస్కు ముందు పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్లో వన్డే సిరీస్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.నిన్ననే ముగిసిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్
మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్
మహిళా క్రికెట్ అభిమానులకు శుభవార్త. నాలుగో ఎడిషన్ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) వచ్చే ఏడాది జనవరి 7 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగనున్నట్లు తెలుస్తుంది. వేదికలుగా ముంబై, బరోడా నగరాలు ఖరారైనట్లు సమాచారం. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీజన్ ప్రారంభ మ్యాచ్లు (తొలి అర్ద భాగం) జరగనున్నాయని తెలుస్తుంది. ఇటీవల మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్కు వేదికైన ఈ స్టేడియం, భారత మహిళా క్రికెటర్లకు అచ్చొచ్చిన మైదానంగా పేరుగాంచింది.బరోడాలోని కోటంబి స్టేడియంలో ఫైనల్ సహా రెండో అర్ద భాగం మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. జనవరి 11న భారత్–న్యూజిలాండ్ పురుషుల వన్డే తర్వాత బరోడా లెగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. పై విషయాలపై అధికారిక సమాచారాన్ని నవంబర్ 27న న్యూఢిల్లీలో జరిగే వేలం సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. వేదికల కోసం లక్నో, బెంగళూరు నగరాలు కూడా పోటీపడినప్పటికీ, ముంబై, బరోడాకే అవకాశం దక్కిందని తెలుస్తుంది.కాగా, గత ఎడిషన్ డబ్ల్యూపీఎల్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన ఆ ఫ్రాంచైజీ రెండో టైటిల్ను కైవసం చేసుకుంది. గత సీజన్ మ్యాచ్లు వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో జరిగాయి. ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగాయి.గత ఎడిషన్ మ్యాచ్లు ఫిబ్రవరి, మార్చినెలల్లో జరగ్గా, ఈసారి జనవరి విండోను ఫిక్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే పురుషుల టీ20 వరల్డ్ కప్-2026 ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
పసికూనపై శ్రీలంక ప్రతాపం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 17) జరిగిన మ్యాచ్లో శ్రీలంక-ఏ, హాంగ్కాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంగ్కాంగ్.. ట్రవీన్ మాథ్యూ (4-0-21-3), కెప్టెన్ దునిత్ వెల్లాలగే (3-0-24-2), విజయ్కాంత్ వియాస్కాంత్ (4-0-11-2), మిలన్ రత్నాయకే (3-0-19-1), గురక సంకేత్ (1-0-11-1), రమేశ్ మెండిస్ (4-0-18-0) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.హాంగ్కాంగ్ ఇన్నింగ్స్లో శివ్ మథుర్ (26) టాప్ స్కోరర్గా నిలువగా.. అన్షుమన్ రథ్ (21), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (20), ఎహసాన్ ఖాన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో (47 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకను గెలిపించాడు. ఓపెనర్ నిషాన్ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో విషెన్ హలంబగే 4, లసిత్ క్రూస్పుల్లే 13, సహాన్ అరఛ్చిగే 14 పరుగులు (నాటౌట్) చేశారు. హాంగ్కాంగ్ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇవాళ రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
ఐపీఎల్-2026 వేలానికి ముందు ఓ దేశవాలీ బౌలర్ పిచ్చెక్కించే ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో అదిరిపోయే గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సర్వీసస్ స్పిన్నర్ అమిత్ శుక్లా 20 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఓ దశలో శుక్లా (Amit Shukla) పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.ఈ సంచలన ప్రదర్శనతో శుక్లా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరుగబోయే వేలంలో ఫ్రాంచైజీలు ఇతగాడి కోసం ఎగబడే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావడం శుక్లా అదనంగా కలిసి రావచ్చు. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చెందిన శుక్లా అడపాదడపా బ్యాటింగ్ (కుడి చేతి) కూడా చేయగలడు. 22 ఏళ్ల శుక్లా అండర్-19 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన శుక్లా 32 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 138 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శుక్లా కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 23 వికెట్లు తీసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసస్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.అంతకుముందు అమిత్ శుక్లా మాయాజాలం దెబ్బకు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా కెరీర్లో అత్యుత్తమ గణాంకాలతో హర్యానా నడ్డి విరిచాడు. దీనికి ముందు సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే ఆలౌటైంది. చదవండి: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు
షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ (India vs Pakistan) మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. క్రికెట్లో అయితే ఇరు దేశాల జట్లు కనీసం షేక్ ఇచ్చుకోవాడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ 'నో హ్యాండ్ షేక్' ఆనవాయితీని ముందుగా టీమిండియా మొదలుపెట్టింది. ఆసియా కప్-2025లో పాక్తో తలపడిన మూడు సందర్భాల్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇదే తంతు మహిళల వన్డే ప్రపంచకప్, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలోనూ కొనసాగింది. అయితే భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఈ ఆనవాయితీకి పుల్స్టాప్ పెట్టింది.Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025నిన్న కొలొంబోలో (శ్రీలంక) జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్, పాక్ ఎదురెదురుపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు క్రీడాస్పూర్తిని చాటుకుంటూ.. పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తుంటే.. అంధుల జట్టు ఇలా చేసిందేంటని చాలామంది అభిమానులు కోప్పడుతున్నారు. కొందరేమీ ఇది శుభపరిణామమే అని అంటున్నారు. అయితే ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్, పాక్ కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోకపోవడం గమనార్హం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 135 పరుగులకే ఆలౌటైంది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురు పాక్ ప్లేయర్లను రనౌట్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్ పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి భారత్కు సునాయాస విజయాన్నందించారు. ఈ టోర్నీలో భారత్కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో భారత్ సెమీఫైనల్కు కూడా చేరింది.చదవండి: పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సరికొత్త చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్, అంతర్జాతీయ వన్డేలు సహా) అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా-ఏ నిన్న (నవంబర్ 16) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అజేయ అర్ద సెంచరీ (83 బంతుల్లో 68 నాటౌట్) సాధించిన తర్వాత రుతురాజ్ లిస్ట్-ఏ సగటు 57.80కి చేరింది. తద్వారా చతేశ్వర్ పుజారాను (57.01) అధిగమించి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన భారత ఆటగాడిగా అవతరించాడు.ఓవరాల్గా.. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో రుతురాజ్ కంటే ముందు కేవలం ఒకే ఒక ఆటగాడు ఉన్నాడు. ఆస్ట్రేలియా వైట్ బాల్ దిగ్గజం మైఖేల్ బెవాన్ (57.86) మాత్రమే రుతురాజ్ కంటే ముందున్నాడు.లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన టాప్-5 బ్యాటర్లు..మైఖేల్ బెవాన్-57.86 (427 ఇన్నింగ్స్లు)రుతురాజ్ గైక్వాడ్-57.80 (85 ఇన్నింగ్స్లు)సామ్ హెయిన్-57.76 (64 ఇన్నింగ్స్లు)చతేశ్వర్ పుజారా-57.01 (130 ఇన్నింగ్స్లు)విరాట్ కోహ్లి-56.66 (339 ఇన్నింగ్స్లు)ఇప్పటివరకు కెరీర్లో 85 లిస్ట్-ఏ ఇన్నింగ్స్లు ఆడిన రుతురాజ్ 17 శతకాలు, 18 అర్ద శతకాల సాయంతో 4509 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతని అత్యధిక స్కోర్ 220 నాటౌట్గా ఉంది.భీకర ఫామ్ప్రస్తుతం సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న మూడు అనధికారిక వన్డే సిరీస్లో రుతురాజ్ భీకర ఫామ్లో ఉన్నాడు. రెండో వన్డేలో అజేయ అర్ద శతకంతో భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అతను.. అంతకుముందు తొలి వన్డేలో అద్భుత శతకం (129 బంతుల్లో 117) బాదాడు. రెండో వన్డేలో గెలుపుతో భారత్, మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 19న రాజ్కోట్లో జరుగనుంది. చదవండి: పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను రేపు (నవంబర్ 18) ఒమన్తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.మాటలోనూ చిచ్చరపిడుగే..!14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిరూపించాడు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉబైద్ షా వైభవ్వైపు సీరియస్గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్కు తన దమ్మును చూపాడు. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
'గంభీర్ వ్యాఖ్యలు సరికాదు.. నేను బౌలింగ్ చేసినా వికెట్ వచ్చేది'
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0 తేడాతో వెనకంజలో నిలిచింది. అయితే తొలి టెస్టు జరిగిన ఈడెన్ గార్డెన్స్ పిచ్పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటువంటి పిచ్లు వల్ల టెస్టు క్రికెట్ అంతరించిపోతుందని భారత మాజీ స్పిన్నర్ హార్బజన్ సింగ్ మండిపడ్డాడు. భజ్జీ ఒక్కడే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు ఈడెన్ పిచ్పై విమర్శలు గుప్పించారు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈడెన్ గార్డెన్స్ పిచ్ను సమర్ధించాడు. పిచ్లో భూతాలు ఏమి లేవని, మంచి డిఫెన్స్ టెక్నిక్ ఉంటే పరుగులు సాధించవచ్చని గంభీర్ అన్నాడు. అంతేకాకుండా తామే ఇటువంటి పిచ్ కావాలని కోరుకున్నట్లు అతడు తెలిపాడు.అయితే పిచ్ను సమర్ధించిన గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైరయ్యాడు. అస్సలు టెస్టు క్రికెట్కు సరిపోయే పిచ్ కాదు అని శ్రీకాంత్ అన్నాడు."సొంత గడ్డపై మనకు ఘోర పరాభావం ఎదురైంది. పూర్తి స్దాయి జట్టుతో ఆడుతున్నప్పటికి టీమిండియా ఇంత దారుణ ఓటమిని ఎదుర్కొవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గంభీర్ ఇటువంటి పిచ్ కావాలని క్యూరేటర్ను అడిగాడు. వికెట్ ప్రవర్తించిన తీరును చూసిన తర్వాత కూడా అతడు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. ఇది అస్సలు టెస్టు క్రికెట్కు సరిపోయే పిచ్ కాదు. మొదటి రోజు నుంచే పిచ్లో టర్న్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా ఇదే తప్పు చేస్తున్నాం. టర్నింగ్ పిచ్లు కావాలని అడుగుతున్నాము. కానీ ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇదొక చెత్త ట్రాక్. ఇటువంటి వికెట్పై ఆటగాళ్లు మంచి టెక్నిక్తో ఆడాలని గంభీర్ చెప్పడం సరికాదు. నేను బౌలింగ్ చేసినా కూడా ఓ వికెట్ వచ్చి ఉండేది.రెండు జట్లలో ఒక టీమ్ కూడా 200 పరుగుల మార్క్ దాటకపోతే.. అదెలా మంచి వికెట్ అవుతుంది? గంభీర్ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడు. ప్రతీ ఒక్క బ్యాటర్ ఈ వికెట్పై కష్టపడి ఆడాడు. రెండు జట్లు కూడా ఇబ్బంది పడ్డాయి. గంభీర్ ఒత్తిడిలో ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ, భారత జట్టు మాత్రం ఒత్తిడిలో ఉంది” అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. బవుమా తన అద్భుత కెప్టెన్సీతో 13 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్లో భారత్కు ఓటమి రుచిని చూపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఆతిథ్య జట్టును ఓడించడంలో సఫారీ బౌలర్లు ఎంత కీలక పాత్ర పోషించారో.. బవుమా ఆడిన ఇన్నింగ్స్ కూడా అంతే విలువైనది. బ్యాటింగ్కు కష్టతరమైన పిచ్పై బవుమా.. బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడతున్నప్పటికి బవుమా మాత్రం తన ఏకాగ్రాతను కోల్పోకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కెప్టెన్ అంటే బవుమాలా ఉండాలని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆఖరికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా బవుమా ఆడిన ఇన్నింగ్స్కు ఫిదా అయిపోయాడు.కెప్టెన్సీ రికార్డు అదుర్స్..2021 మార్చిలో క్వింటన్ డికాక్ నుంచి సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్గా బవుమమా బాధ్యతలు స్వీకరించాడు. తద్వారా దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఫుల్టైమ్ కెప్టెన్గా నియమితులైన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ఆటగాడిగా టెంబా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత 2022లో ప్రోటీస్ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు.వైట్ బాల్ క్రికెట్లో కెప్టెన్గా బవుమా పర్వాలేదన్పించినప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అతడి కెప్టెన్సీలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గెలుచుకున్న తొలి ఐసీసీ ట్రోఫీవరల్డ్ రికార్డు..టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా 11 టెస్టు మ్యాచ్లు ఆడింది. అందులో 10 విజయాలు, ఒక్క డ్రా ఉంది. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 11 టెస్టుల్లో పది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్గా టెంబా వరల్డ్ రికార్డు సృష్టించాడు.చదవండి: గంభీర్.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
చరిత్ర సృష్టించిన ధీరజ్, అంకిత
ఢాకా: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత స్టార్స్...
ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం
ఆమె ఒక ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం.. ఆ...
విజయోస్తు!
బెంగళూరు: కొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల ట...
సురేఖ ‘డబుల్ ధమాకా’
ఢాకా: ప్రపంచ రెండో ర్యాంకర్ వెన్నం జ్యోతి సురేఖ మ...
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj ...
పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్...
'గంభీర్ వ్యాఖ్యలు సరికాదు.. నేను బౌలింగ్ చేసినా వికెట్ వచ్చేది'
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రిక...
చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే
టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా...
క్రీడలు
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్కప్ విన్నర్ శ్రీచరణి (ఫొటోలు)
అక్షర్ పటేల్ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)
కోట్ల విలువైన కారు కొన్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)
నా హ్యాపీ బర్త్డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
వరల్డ్ కప్ ట్రోఫీతో మంధాన, పలాష్ ముచ్చల్ జంట (ఫోటోలు)
కడప నుంచి వరల్డ్ కప్ దాకా.. శ్రీ చరణి కీలక పాత్ర (ఫొటోలు)
వీడియోలు
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల
క్రీడా కీర్తి కిరీటం
ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించడం ఆనందంగా ఉంది: అరుంధతి
మోదీని కలిసిన భారత మహిళల క్రికెట్ జట్టు
Women's World Cup Final 2025: మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
ఫైనల్ కు చేరిన భారత్
ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు
