Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

WC 2025 Ind vs Aus Semi Final 2: Shafali Verma replaces Injured Pratika Rawal1
World Cup 2025: ఆసీస్‌తో సెమీ ఫైనల్‌.. భారత​ జట్టులో కీలక మార్పు

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC Women's ODI WC)లో సెమీ ఫైనల్‌ చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్‌ బ్యాటర్‌ ప్రతికా రావల్‌ (Pratika Rawal) గాయం వల్ల జట్టుకు దూరమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది.ప్రతికా రావల్‌ స్థానంలో అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌​ కెప్టెన్‌ జట్టులోకి వచ్చింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఇంతకీ ఎవరా ప్లేయర్‌ అంటే?!...కుడికాలి చీలమండకు గాయంసొంతగడ్డపై న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్‌ సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్‌ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ సత్తా చాటి గెలుపొందాలని భావించింది. అయితే, నవీ ముంబై వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసి పోయింది.వాన వల్ల 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. అయితే, ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ప్రతికా రావల్‌ కుడికాలి చీలమండకు గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతూ ఆమె మైదానం వీడింది. ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌కు రాలేదు.మంధానకు జోడీగా అమన్‌జోత్‌ కౌర్‌ ప్రతికా రావల్‌ స్థానంలో స్మృతి మంధాన (34 నాటౌట్‌)కు ఓపెనింగ్‌ జోడీగా అమన్‌జోత్‌ కౌర్‌ (15 నాటౌట్‌) వచ్చింది. అయితే, వర్షం ఎక్కువ కావడంతో 8.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి హర్మన్‌ సేన వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.కాగా ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌ తుది అంకానికి చేరుకుంది. గువాహటిలో అక్టోబరు 29న తొలి సెమీస్‌ మ్యాచ్‌ జరుగనుండగా.. ఇందులో ఇంగ్లండ్‌- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. మరోవైపు.. భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్‌ (అక్టోబరు 30) జరుగనుండగా.. ఇందుకు నవీ ముంబై వేదిక.లేడీ సెహ్వాగ్‌ వచ్చేసిందిఅయితే, పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో కీలక సెమీస్‌కు ముందు ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ ప్రతికా సేవలను భారత్‌ కోల్పోవడం ఆందోళన కలిగించే అంశం. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్‌’గా పేరొందిన షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది.కాగా సెమీస్‌ మ్యాచ్‌లో జట్టు మార్పు నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఈవెంట్‌ టెక్నికల్‌ కమిటీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకుంది. ఇక భారత జట్టు ఓపెనర్‌గా కొంతకాలం వెలుగొందిన షఫాలీ వర్మ.. తర్వాత ఫామ్‌లేమితో సతమతమైంది.527 పరుగులు సాధించి..అదే సమయంలో ప్రతికా రావల్‌ రావడం.. నిలకడగా ఆడటంతో జట్టులో షఫాలీ స్థానం గల్లంతైంది. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. కాగా షఫాలీ చివరగా 2024, అక్టోబరులో భారత్‌ తరఫున వన్డే ఆడింది.ఇక గతేడాది హర్యానా తరఫున దేశీ వన్డే క్రికెట్‌లో షఫాలీ మెరుగ్గా రాణించింది. 75.28 సగటుతో 527 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబరులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ప్రతికా రావల్‌.. 23 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కు అందుకుంది.తద్వారా మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్‌ 1000 రన్స్‌ చేసిన క్రికెటర్‌గా నిలిచింది. మంధానతో కలిసి 23 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్‌ వికెట్‌కు ప్రతికా ఏకంగా 1799 పరుగులు జతచేసి రికార్డు సృష్టించడం గమనార్హం. ఏదేమైనా చాంపియన్‌ జట్టు ఆసీస్‌తో పోరులో ప్రతికా లేని లోటు స్పష్టంగా తెలుస్తుందనడంలో సందేహం లేదు. కాగా సారథిగా షఫాలీ భారత్‌కు అండర్‌-19 ప్రపంచకప్‌-2023 అందించిన విషయం తెలిసిందే.చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్‌- గిల్‌ సూపర్‌: గంభీర్‌

Failures Are Inevitable: Gambhir Unbothered By Suryakumar Dip In Form2
ఫెయిల్‌ అయితే ఏంటి?!.. నాకైతే అలాంటి భయాలు లేవు: గంభీర్‌

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1 (Ind Loss ODI Series To Aus)తో ఓడిపోయింది. ఫలితంగా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం మిగిలింది.ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు, వన్డే ఫార్మాట్లలో తిరుగులేని ఆస్ట్రేలియా.. పొట్టి ఫార్మాట్లో మాత్రం అంత గొప్పగా రాణించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా టీమిండియాతో ఆడిన 32 మ్యాచ్‌లలో కంగారూ జట్టు కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందడం ఇందుకు నిదర్శనం.బ్యాటింగ్‌ పరంగా విఫలంముఖాముఖి రికార్డు పరంగా భారత్‌ పటిష్ట స్థితిలోనే ఉన్నా సొంతగడ్డపై ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయలేము. మరోవైపు.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav).. బ్యాటింగ్‌ పరంగా విఫలం కావడం కలవరపెట్టే అంశం.గతేడాది జూలైలో టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సూర్య.. 20 మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండే హాఫ్‌ సెంచరీలు బాదాడు. సగటు 18 కంటే తక్కువ. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఇంకా కేవలం మూడు నెలల సమయమే ఉన్న వేళ సూర్య ఫామ్‌ ఆందోళనకు గురి చేస్తోంది. 72 పరుగులేఇటీవల కెప్టెన్‌గా ఆసియా టీ20 కప్‌-2025 టైటిల్‌ గెలిచిన సూర్య.. ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 72 పరుగులే చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై విమర్శలు వస్తుండగా.. టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ తనదైన శైలిలో స్పందించాడు.ఎలాంటి భయాలు లేవుఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ఆరంభం నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘సూర్య బ్యాటింగ్‌ ఫామ్‌ నన్ను ఏమాత్రం ఆందోళనకు గురిచేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి భయాలు లేవు. అల్ట్రా- అగ్రెసివ్‌గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లో నిర్ణయించుకున్నాం. దూకుడుగా ఆడటమే మాకు ఇష్టం.ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకున్నపుడు వైఫల్యాలను కూడా ఆమోదించగలగాలి. ఇలాంటి అప్రోచ్‌ కారణంగా ఒక్కోసారి విఫలమైనా సరే.. మేము దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని గంభీర్‌ తెలిపాడు.ఒక్కసారి లయ అందుకుంటేఇక టీమిండియా యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌ ఫామ్‌ కనబరిచాడు. ఏదేమైనా సూర్య ఒక్కసారి లయ అందుకుంటే బాధ్యత తన భుజం మీదు వేసుకోవడానికి ఏమాత్రం సందేహించడు.టీ20 క్రికెట్‌లో మేము వ్యక్తిగత పరుగుల కంటే కూడా మా క్రికెట్‌ బ్రాండ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడతాం. దూకుడైన శైలితోనే ముందుకు సాగుతాం. బ్యాటర్లు తరచూ వ్యక్తిగతంగా విఫలమైనా.. జట్టు రాణిస్తే అది పెద్దగా లెక్కలోకి రాదు’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌లోనూ తమ దూకుడు కొనసాగుతుందంటూ ఆస్ట్రేలియా జట్టుకు గౌతీ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా అక్టోబరు 29- నవంబరు 8 వరకు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్‌- గిల్‌ సూపర్‌: గంభీర్‌

Khichdi Rs 620, Rice Rs 318: Virat Kohli One8 Commune Menu Will Leave You Stunned3
కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318.. ఒక్క నాన్‌ 118!.. ఈ రేట్లు ఎక్కడంటే..

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అభిమానులను అలరించాడు. పెర్త్‌, అడిలైడ్‌లో డకౌట్లతో నిరాశపరిచిన ఈ రన్‌మెషీన్‌.. సిడ్నీలో మాత్రం సత్తా చాటాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆఖరి ఆస్ట్రేలియా టూర్‌ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (121 నాటౌట్‌)తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 168 పరుగులు జోడించిన కోహ్లి.. విన్నింగ్‌ షాట్‌గా ఫోర్‌ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్‌లో ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్‌ కానుంది. దీంతో అభిమానులతో పాటు కింగ్‌ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఎట్టకేలకు సిడ్నీలో మరోసారి తన విలువను చాటుకుని ఆసీస్‌ పర్యటనను ముగించాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కోహ్లి పేరు వైరల్‌గా మారింది.ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయంతో కోహ్లి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ క్రికెట్‌ సూపర్‌స్టార్‌ వన్‌8 కమ్యూన్‌ పేరిట రెస్టారెంట్‌ చైన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో 2022లో తొలి రెస్టారెంట్‌ తెరిచిన కోహ్లి.. జుహులోనూ ఓ బ్రాంచ్‌ పెట్టాడు.ఐకానిక్‌ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్‌బాలీవుడ్‌ లెజెండరీ సింగర్‌ కిషోర్ కుమార్‌కు చెందిన ఐకానిక్‌ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్‌ నడుస్తోంది. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల ధరలు తాజాగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యాయి.కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318జుహులోని వన్‌8 రెస్టారెంట్లో పావ్‌ భాజీ ధర రూ. 650. అదే విధంగా.. ఉడకబెట్టిన అన్నం ధర రూ. 318. సింగిల్‌ సర్వింగ్‌ ఫ్రైస్‌ ధర ఏకంగా రూ. 348. వీటి సంగతి ఇలా ఉంటే.. కిచిడీ, తందూరీ రోటీ, బేబీ నాన్‌ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.విరాట్‌ రెస్టారెంట్లో ఒక తందూరీ రోటీ ధర రూ. 118. ఇక కిచిడీ ధర ఏకంగా అక్షరాలా 620 రూపాయలు. కాగా వన్‌8 రెస్టారెంట్లో మొక్కల ఆధారిత వంటకాలతో పాటు మాంసం, సీ ఫుడ్‌ కూడా అందుబాటులో ఉంటాయి.విరాట్‌ ఫేవరెట్స్‌అంతేకాదు.. ‘విరాట్‌ ఫేవరెట్స్‌’ పేరిట ప్రత్యేక వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. టోఫు స్టీక్‌, మష్రూమ్‌ డంప్లింగ్స్‌ విత్‌ ట్రఫోల్‌ ఆయిల్‌, సూపర్‌ఫుడ్‌ సలాడ్‌ ఇక్కడి వెజిటేరియన్‌ స్పెషల్స్‌. ఇక పెంపుడు జంతువుల కోసం వన్‌8లో ఫుడ్‌ అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 518- 818 వరకు ఉంటుంది.ఇక అభిమానులను ఆకర్షించేందుకు వన్‌8 కమ్యూన్‌ ఎంట్రన్స్‌లోనే కోహ్లి క్రికెట్‌ ప్రయాణాన్ని సూచించేలా ఫొటోలు ఉంటాయి. కోహ్లి జెర్సీ (నంబర్‌ 18)ని అక్కడి గోడపై వేలాడదీసి ఉంచారు. గ్లాస్‌ రూఫ్‌ ద్వారా సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ‘‘చక్కటి, ఆహ్లాకరమైన పరిసరాలు ఉండటం అత్యంత ముఖ్యం. భోజన నాణ్యత ఎలాగూ బాగానే ఉంటుంది. ప్రతి వంటకాన్ని శ్రద్ధ పెట్టి తయారు చేస్తాం. కానీ అన్నింటికంటే ఆంబియన్స్‌ బాగుంటేనే ఎవరైనా ఇక్కడి వరకు వస్తారు’’.. ఆతిథ్య రంగంలో రాణిస్తున్న కోహ్లి తరచూ చెప్పే మాట ఇది!!చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్‌- గిల్‌ సూపర్‌: గంభీర్‌ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)

World champion Gukesh looks forward to be in Goa for the FIDE World Cup 20254
గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌

ఫిడే ప్రపంచకప్‌-2025 (FIDE World Cup 2025) టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ మెగా చెస్‌ ఈవెంట్‌కు వేదిక కాగా.. గోవాలో అక్టోబరు 31- నవంబరు 27 వరకు టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఉత్తర గోవాలోని ఓ రిసార్టులో టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్‌ క్రీడాకారులు ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్‌ ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో టాప్‌-3లో నిలిచిన వాళ్లు 2026 క్యాండిడేట్స్‌ ఈవెంట్‌కు అర్హత సాధించారు. విజేతకు ప్రైజ్‌మనీ 20,00,000 డాలర్లు.గోవాతో నాకెన్నో జ్ఞాపకాలుఈ నేపథ్యంలో వరల్డ్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ (D Gukesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. స్వదేశంలో ఎక్కడ ఆడినా ఈ టోర్నీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.ముఖ్యంగా గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్‌ లెవల్‌ ఈవెంట్లలో ఆడాను’’ అంటూ ఈ టాప్‌ సీడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గుకేశ్‌ 2019లో గోవా వేదికగా ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. నాడు కేటగిరీ- ‘ఎ’ నుంచి పోటీపడిన గుకేశ్‌​ పదో స్థానంతో ముగించాడు.ఫేవరెట్‌గా అనిశ్‌ గిరి కూడా..అయితే, ఈసారి ఏకంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో గుకేశ్‌ బరిలోకి దిగనుండటం విశేషం. ఇక గుకేశ్‌తో పాటు.. నేపాల్‌ సంతతికి చెందిన డచ్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనిశ్‌ గిరినీ టోర్నీలో ఫేవరెట్‌గా పోటీలో నిలిచాడు. ఇప్పటికే అతడు ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌-2025కి అర్హత సాధించాడు. కాగా 2005 నుంచి నాకౌట్‌ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఫిడే వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌తో పాటు అర్మేనియాకు చెందిన లెవాన్‌ ఆరోనియన్‌ మాత్రమే రెండుసార్లు టైటిల్‌ గెలవగలిగారు.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!

Gambhir Praises Rohit Gill In Dressing Room Later Says This On Kohli5
అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్‌- గిల్‌ సూపర్‌: గంభీర్‌

టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ (Rohit Sharma)- విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత భారత జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం ఆటగాళ్లు.. ఆసీస్‌తో మూడో వన్డేలో దుమ్ములేపారు.168 పరుగులు భాగస్వామ్యంఓపెనర్‌ రోహిత్‌ శర్మ అజేయ శతకం (125 బంతుల్లో 121*)తో చెలరేగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి 74 పరుగులతో చెలరేగి.. ఫోర్‌ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ వెటరన్‌ బ్యాటర్లు తమ వింటేజ్‌ ఇన్నింగ్స్‌ను గుర్తుచేస్తూ.. ఏకంగా 168 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.తప్పిన గండంమరోవైపు.. అంతకు ముందు కెప్టెన్‌, ఓపెనర్‌ గిల్‌ (24)తో కలిసి రోహిత్‌ 69 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నిర్మించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక వికెట్‌ కోల్పోయి 38.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. తద్వారా సిడ్నీ వన్డేలో గెలుపొంది ఆసీస్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది.మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించి పరువు కాపాడుకుంది. మరోవైపు.. ఆఖరిదైన ఈ మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా తన కెరీర్‌లో తొలిసారి నాలుగు వికెట్ల హాల్‌ నమోదు చేసి.. ఆసీస్‌ను 236 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.రోహిత్‌- గిల్‌ సూపర్‌ఈ నేపథ్యంలో డ్రెసింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘‘శుబ్‌మన్‌, రోహిత్‌ మధ్య భాగస్వామ్యం అద్భుతం. ఛేదనలో వికెట్‌ కోల్పోకుండా 60కి పైగా పరుగులు చేయడం కలిసి వచ్చింది.ఆ తర్వాత రోహిత్‌-విరాట్‌ పార్ట్‌నర్‌షిప్‌ అత్యద్భుతం. ముఖ్యంగా రోహిత్‌ సెంచరీని ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి. అతడి ఆట తీరు అమోఘం. మ్యాచ్‌ను ముగించిన తీరు ప్రశంసనీయం. రోహిత్‌తో పాటు విరాట్‌ పని పూర్తి చేశాడు’’ అని గంభీర్‌ కొనియాడాడు.అహంకారం వద్దుఅంతకుముందు.. ‘‘బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. హర్షిత్‌ అవుట్‌స్టాండింగ్‌ స్పెల్‌ వేశాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒద్దికగా.. ఒదిగి ఉండాలి. మరింత కష్టపడాలి. అహంకారం వద్దు’’ అని గంభీర్‌ తన ప్రియ శిష్యుడు హర్షిత్‌ రాణాకు సూచించాడు. ఇక ఆఖర్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును రోహిత్‌ శర్మ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.కాగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ తప్పించిన టీమిండియా యాజమాన్యం.. అతడి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఇక ఆసీస్‌ టూర్‌లో కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే గిల్‌ విఫలమయ్యాడు.మూడు వన్డేల్లో గిల్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 10, 9, 24. ఇక కెప్టెన్‌గానూ సిరీస్‌ను ఆసీస్‌కు 1-2తో కోల్పోయాడు. మరోవైపు.. రోహిత్‌ శర్మ 8, 73, 121* పరుగులతో రాణించి మూడో వన్డేలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలవడంతో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)

South Africa Announces Test Squad For India Tour Bavuma Returns To Lead6
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

టీమిండియాతో టెస్టు సిరీస్‌ (IND vs SA Tests)కు సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తమ కెప్టెన్‌ తెంబా బవుమా (Temba Bavuma) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. భారత్‌లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బవుమా కెప్టెన్సీలో టీమిండియాతో టెస్టులు ఆడబోయే జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది.భారత్‌తో రెండు టెస్టులుప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్టుల్లో తలపడనుంది. భారత్‌ వేదికగా జరిగే ఈ సిరీస్‌ నిర్వహణకు నవంబరు 14- 26 వరకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జట్టును ప్రొటిస్‌ బోర్డు తాజాగా ప్రకటించింది.ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన జట్టులో స్వల్ప మార్పులతోనే టీమిండియాతోనూ సఫారీలు బరిలో దిగనున్నారు. బవుమా తిరిగి రావడంతో డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ జట్టులో చోటు కోల్పోయాడు. కాగా పాక్‌తో ఇటీవల సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టులు ఆడింది.పాక్‌తో టెస్టు సిరీస్‌ సమంబవుమా గైర్హాజరీలో ఐడెన్‌ మార్క్రమ్‌ సారథ్యంలో డబ్ల్యూటీసీ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగిన సౌతాఫ్రికా.. అనూహ్య రీతిలో పాక్‌తో తొలి టెస్టులో ఓడింది. ఆ తర్వాత రావల్పిండి వేదికగా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేయగలిగింది. తతదుపరి పాక్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో బాగంగా టీమిండియాతో తొలుత రెండు టెస్టులు ఆడనున్న సఫారీలు.. తదుపరి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనున్నారు. విండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన టీమిండియాఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో ఓటమి చవిచూసింది. తదుపరి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ పూర్తి చేసుకుని.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇక డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో గిల్‌ సేన తొలుత ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసి జోరు మీదుంది.టీమిండియాతో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు ఇదేతెంబా బవుమా (కెప్టెన్‌), ఐడెన్‌ మార్క్రమ్‌, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైలీ వెరెన్నె, డెవాల్డ్‌ బ్రెవిస్‌, జుబేర్‌ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్‌ బాష్‌, వియాన్‌ ముల్దర్‌, మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, సెనురాన్‌ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్‌ హార్మర్‌. చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!

PV Sindhu Announces Ends 2025 season early Know The Reason7
పీవీ సింధు కీలక నిర్ణయం.. ప్రకటన విడుదల

భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం, ఒలింపిక్‌ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు తెలిపింది. గాయం బెడద కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటన విడుదల చేసింది.కీలక టోర్నీలకు పీవీ సింధు దూరంకాగా గత రెండు నెలలుగా కీలక టోర్నీలకు పీవీ సింధు దూరంగానే ఉంది. ఆర్కిటిక్‌ ఓపెన్‌, డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రూపంలో మేజర్‌ టోర్నీలను మిస్‌ అయింది. చివరగా చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నమెంట్లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన సింధు.. ఆ తర్వాత పాదం నొప్పి (Foot Injury) కారణంగానే మరే టోర్నీల్లోనూ సింధు ఆడలేకపోయింది.ఇదే వాస్తవంఈ క్రమంలోనే 2025 సీజన్‌ను ముందుగానే ముగించాలని పీవీ సింధు నిర్ణయించుకుంది. ఈ మేరకు.. ‘‘యూరోపియన్‌ లెగ్‌కు ముందు మడిమకు గాయమైంది. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అథ్లెట్ల కెరీర్‌లో గాయాలు భాగం. ఈ విషయాన్ని అంత తేలికగా అంగీకరించలేము. కానీ ఇదే వాస్తవం.క్రీడాకారుల సామర్థ్యం, ఓపికను గాయాలు పరీక్షిస్తూ ఉంటాయి. అయితే, అంతే వేగంగా.. మరింత బలంగా తిరిగి రావాలనే కసిని కూడా రగిలేలా చేస్తాయి. కోలుకునే ప్రక్రియ కొనసాగుతోంది.బలంగా తిరిగి వస్తాడాక్టర్‌ వైన్‌ లామ్‌బార్డ్‌, నిషా రావత్‌, చేతన పర్యవేక్షణలో.. నా కోచ్‌ ఇర్వాన్‌స్యా మార్గదర్శనం.. నా టీమ్‌ సహాయంతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా. వారి నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తోంది.మున్ముందు మరిన్ని విజయాలు సాధించేందుకు పట్టుదలగా ఉన్నా. నాపై ప్రేమను కురిపిస్తూ.. మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలు. మాటల్లో చెప్పలేని భావన ఇది. నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది’’ అని పీవీ సింధు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.కాగా ముప్పై ఏళ్ల సింధు గత నాలుగేళ్లలో ఇలా సీజన్‌ను ముందుగానే ముగించడం ఇది మూడోసారి. 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ సమయంలోనూ సింధు గాయపడింది. ఇక ఐదుసార్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో మెడల్‌ గెలిచిన సింధు.. మూడేళ్ల తర్వాత 2024లో తొలి టైటిల్‌ గెలిచింది. సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ సూపర్‌ 300లో విజేతగా నిలిచింది. కానీ ఈ ఏడాది ఈ టోర్నీలో సింధు కార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకు వెళ్లలేకపోయింది.వైవాహిక జీవితంలో..కాగా సింధు గతేడాది డిసెంబరులో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో సింధు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా ఏడడుగులు వేసింది. భర్త ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సింధు.. గాయం కారణంగా ఈసారి సీజన్‌ను ముందుగానే ముగించినా.. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి రావాలని పట్టుదలగా ఉంది. ఇక రియో ఒలింపిక్స్‌-2016లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో రజతం గెలిచిన సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!🙏❤️ pic.twitter.com/oiZLLl2TPj— Pvsindhu (@Pvsindhu1) October 27, 2025

Shreyas Iyer In ICU: Parents Seek Urgent Visas To Join Him In Sydney: Report8
Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!

టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్‌ ప్రస్తుతం ఇంటెన్సిక్‌ కేర్‌ యూనిట్‌ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్‌ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్‌ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్‌ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్‌ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్‌ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్‌ అయ్యర్‌ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్‌ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్‌ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్‌ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్‌ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీ మిడాఫ్‌/ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్‌ డైవ్‌ కొట్టి మరీ సంచలన క్యాచ్‌ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్‌ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్‌ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్‌ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఆసీస్‌ టూర్‌ సందర్భంగా వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్‌స్వీప్‌ గండం నుంచి గట్టెక్కింది.చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

PRITHVI SHAW SMASHED DOUBLE HUNDRED IN RANJI TROPHY FROM JUST 141 BALLS9
ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ

వివాదాస్పద బ్యాటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్‌లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) కేవలం 141 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్‌ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 14వ సెంచరీ.ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని డబుల్‌ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్‌ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్‌ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్‌ బిష్ణోయ్‌ (54), పదో నంబర్‌ ఆటగాడు నిషంక్‌ బిర్లా (56 నాటౌట్‌) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఆరోగ్య పరిస్థితి

Shreyas Iyer injury turns serious: Internal bleeding leads to ICU admission in Sydney10
పక్కటెముకల్లో రక్తస్రావం.. ఐసీయూలో శ్రేయస్‌ అయ్యర్‌

భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు. మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా స్పందించారు. శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్‌ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్‌ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్‌.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్‌ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.తాజాగా గాయం కారణంగా శ్రేయస్‌ త్వరలో (నవంబర్‌ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్‌ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్‌ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్‌ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్‌ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement