ప్రధాన వార్తలు
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... నేడు శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ సెమీఫైనల్ పోరు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం రెండు సెమీఫైనల్స్ ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ జట్టు... రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. రెండో సెమీఫైనల్ను మధ్యాహ్నం గం. 12:30 నుంచి నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్3, సోనీ స్పోర్ట్స్ టెన్4 చానెల్స్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టోర్నీలో రాధా యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో యూఏఈ ‘ఎ’ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ పరాజయం నుంచి వెంటనే తేరుకున్న భారత ‘ఎ’ జట్టు తర్వాతి రెండు లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్, నేపాల్ జట్లను ఓడించింది. భారత్, పాక్, యూఏఈ జట్లు నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్తో భారత్, పాక్ సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాయి.
11 ఏళ్ల తర్వాత...
లక్నో: పరుగుల వరద పారిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఉత్తరాఖండ్ జట్టుపై 503 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన కారణంగా కర్ణాటక జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారైంది. 11 ఏళ్ల తర్వాత కర్ణాటక జట్టు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ చేరడం విశేషం. ఈనెల 24 నుంచి హుబ్లీలో జరిగే ఫైనల్లో జమ్మూకశ్మీర్ జట్టుతో కర్ణాటక తలపడుతుంది. జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి ఫైనల్ ఆడనుండగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు టైటిల్ సాధించి, నాలుగుసార్లు రన్నరప్గా నిలిచింది. ఉత్తరాఖండ్తో చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 299/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక జట్టు 74.3 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (123 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు) అజేయంగా నిలిచాడు. అనంతరం 827 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు 62 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 260 పరుగులు సాధించింది. ఫలితం తేలకపోవడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన కర్ణాటక జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక 736 పరుగులు చేయగా... ఉత్తరాఖండ్ 233 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఛేజింగ్లో తడబాటు...
కాన్బెర్రా: తొలి టి20లో ఎదురైన ఓటమి నుంచి రెండో మ్యాచ్లో ఆ్రస్టేలియా మహిళల జట్టు తేరుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి రెండో టి20లో విజయాన్ని అందుకుంది. ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత మహిళల జట్టు చివరకు 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన సోఫీ మోలినెక్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 144 పరుగులు సాధించింది. సిరీస్లోని చివరిదైన మూడో టి20 అడిలైడ్లో శనివారం జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఆసీస్ జట్టుకు ఓపెనర్లు జార్జియా వోల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) తొలి వికెట్కు 128 పరుగులు జోడించి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. 15వ ఓవర్లో బెత్ మూనీని హైదరాబాద్ బౌలర్ అరుంధతి అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్ను కట్టడి చేశారు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్ 35 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెండు వికెట్లు, రేణుక ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన (24 బంతుల్లో 31; 4 ఫోర్లు), షఫాలీ వర్మ (23 బంతుల్లో 29; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 57 పరుగులు జత చేశారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో షఫాలీ, జెమీమా, స్మృతి అవుటవ్వడంతో భారత్ ఛేజింగ్లో వెనుకబడింది. హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 36; 5 ఫోర్లు) దూకుడు కనబరిచినా 17వ ఓవర్లో ఆమె అవుటవ్వడంతో భారత్ విజయంపై ఆశలు వదులుకుంది. ఆసీస్ బౌలర్లలో యాష్లీ గార్డ్నర్ (3/22), కిమ్ గార్త్ (2/16), అనాబెల్ సదర్లాండ్ (2/18), సోఫీ మోలినెక్స్ (2/37) రాణించారు.356 అంతర్జాతీయ మహిళల క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గుర్తింపు పొందింది. హర్మన్ ఇప్పటివరకు 189 టి20లు, 161 వన్డేలు, 6 టెస్టులు ఆడింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (355 మ్యాచ్లు) పేరిట ఉన్న రికార్డును హర్మన్ బద్దలు కొట్టింది.
ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్
చెన్నై: 2024 టి20 వరల్డ్ కప్లో సెమీఫైనల్కు చేరినా... ఈ సారి లీగ్ దశకే పరిమితమైన అఫ్గానిస్తాన్ భారీ గెలుపుతో టోర్నీని ముగించింది. గ్రూప్ ‘డి’లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ల చేతిలో పరాజయంతో ‘సూపర్ ఎయిట్స్’ అవకాశాలు కోల్పోయిన అఫ్గానిస్తాన్ ... కెనడాతో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 82 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు)... సాదిఖుల్లా (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు), గుర్బాజ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) మెరిపించారు. కెనడా బౌలర్లలో జస్కరణ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. హర్ష్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), సాద్ బిన్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. నబీ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్కు 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్లూ ఓడిన రెండో జట్టుగా (నమీబియాతో పాటు) కెనడా నిలిచింది. అంతర్జాతీయ టి20ల్లో కెనడా తరఫున అత్యధిక పరుగులు (1305) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన నవనీత్ ధలివాల్ ఈ మ్యాచ్తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు గత నాలుగేళ్లుగా అఫ్గానిస్తాన్ను బలమైన జట్టుగా తీర్చిదిద్ది టీమ్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ కూడా ఈ మ్యాచ్ తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటున్నాడు. టి20 ప్రపంచకప్లో నేడుఆస్ట్రేలియా X ఒమన్వేదిక: పల్లెకెలె; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించారు. ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్లో ప్రదర్శనను విశ్లేíÙంచుకుంటూ ముందుకు పోతున్నాం. అన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్ రూమ్లో ఉత్సాహం పెరిగింది. లీగ్ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా. –సికందర్ రజా, జింబాబ్వే కెప్టెన్
జింబాబ్వేతో జర జాగ్రత్త
జింబాబ్వే.. రెండేళ్ల కిందట జరిగిన టీ20 ప్రపంచకప్నకు కనీసం అర్హత కూడా సాధించలేదు. ఆఫ్రికా క్వాలిఫయర్స్లో ఉగండా చేతిలో ఓటమి పాలై ఘోర పరాభావన్ని మూటకట్టుకుంది. కానీ సదరు అఫ్రికా జట్టు ఎక్కడా నిరాశ చెందలేదు. ఎలాగైనా తదుపరి ప్రపంచకప్లో ఆడాలన్న లక్ష్యంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. అందుకు తగ్గట్టేగానే టీ20 ప్రపంచకప్-2026కు జింబాబ్వే క్వాలిఫై అయింది.అయితే ఏ మాత్రం అంచనాలు లేకుండా పొట్టి ప్రపంచకప్ బరిలోకి దిగిన జింబాబ్వే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి వరల్డ్ క్లాస్ జట్లను చిత్తు చేసి సూపర్-8కు అర్హత సాధించింది. సికిందర్ రజా సారథ్యంలోని జింబాబ్వే అద్భుతాలు చేస్తోంది. గ్రూపు-బిలో టేబుల్ టాపర్గా సికిందర్ సేన నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక గడ్డపై సత్తాచాటిన జింబాబ్వే.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సన్నద్దం కానుంది.జింబాబ్వేతో జర జాగ్రత్త..జింబాబ్వే జట్టు గ్రూపు-1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్లతో పాటు ఉంది. సికిందర్ సేన తొలి సూపర్-8 మ్యాచ్లో ఫిబ్రవరి 3న వెస్టిండీస్తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 6న భారత్ను జింబాబ్వే ఢీకొట్టనుంది. అయితే జింబాబ్వేను భారత్ ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. జింబాబ్వే ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ ప్రతీ మ్యాచ్లోనూ తమ జట్టుకు మంచి ఆరంభాలను అందిస్తున్నారు. బెన్నెట్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఈ టీ20 ప్రపంచ కప్లో జింబాబ్వే చేసిన మొత్తం 457 పరుగులలో బెన్నెట్ దాదాపు 39% సాధించాడు. అదేవిధంగా మిడిలార్డర్లో కెప్టెన్ సికిందర్ రజా కూడా అదరగొడుతున్నారు. శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్లో రజా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. ముజరబానీ ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టి టాప్ ఫామ్లో ఉన్నాడు. గ్రూపు స్టేజిలో అసాధరణ ప్రదర్శన కనబరిచిన జింబాబ్వే.. ఇప్పుడు సూపర్-8లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.
అఫ్గాన్ అద్భుత విజయం.. ట్రాట్కు ఘన వీడ్కోలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భుతమైన విజయంతో ముగించింది. చెన్నై వేదికగా కెనడాతో జరిగిన తమ చివరి మ్యాచ్లో రషీద్ సేన ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సెదికుల్లా అటల్(44), రెహ్మనుల్లా గుర్బాజ్(30) రాణించారు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. డిలాన్ హీలిగర్ ఓ వికెట్ సాధించాడు.నబీ మ్యాజిక్అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ నాలుగు వికెట్లు పడగొట్టి కెనడాను దెబ్బ తీశాడు. అతడితో పాటు రషీద్ ఖాన్ రెండు, ముజీబ్, అజ్మతుల్లా తలా వికెట్ సాధించారు.కెనడా బ్యాటర్లలో హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్గా నిలిచాడు.మిగిలిన బ్యాటర్లు ఎవరూ అఫ్గాన్ బౌలింగ్ను ఎదుర్కొలేకపోయారు. కాగా ఇప్పటికే అఫ్గాన్ జట్టు కివీస్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్ హెడ్కోచ్గా జోనాథన్ ట్రాట్ ప్రయాణం ముగిసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ట్రాట్ ముందే ప్రకటించాడు.
T20 WC 2026: జద్రాన్ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వారిలో సెదిఖుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. గుల్బదిన్ నైబ్ (1), అజ్మతుల్లా ఒమర్జాయ్ (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దర్విష్ రసూల్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీయగా.. దిలన్ హేలిగర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కెనడా తడబడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా (13), నవ్నీత్ ధలివాల్ (0) ఔట్ కాగా.. యువ్రాజ్ సమ్రా (17), హర్ష్ ఠాకూర్ (1) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఒమర్జాయ్కు తలో వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారైపోయాయి. ఆఫ్ఘన్, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి.
అభిషేక్ శర్మ స్థానంలో సంజూకు చాన్స్?
మొట్ట మొదటి టి20 ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా విధ్వంకర ఓపెనర్ అభిషేక్ శర్మ తర్వాతి మ్యాచ్ల్లో ఆడతాడా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్కు సూపర్- 8 మ్యాచ్ల్లో ఆడే అవకాశం రాకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శామ్సన్ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడుసార్లు డకౌట్ కావడంతో అభిషేక్పై వేటు తప్పదని భావిస్తున్నారు.లీగ్ దశలో నమీబియాతో జరిగిన మ్యాచ్కు అభిషేక్ దూరం కావడంతో సంజూకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు శామ్సన్. అయితే వరల్డ్కప్ టీమ్లో చోటు దక్కించుకున్న తర్వాత సంజూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వచ్చిన ఒక అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. గత కొన్నాళ్లుగా భారీ స్కోరు చేయడంలో విఫలమవుతున్నాడు. అయితే అభిషేక్ వైఫల్యం సంజూకు కలిసొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అభిషేక్ కంటే సంజూయే కాస్త బెటరన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో సంజూకు చాన్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. కాగా, టాపార్డర్లో ముగ్గురు లెఫ్టాండర్ బ్యాలర్లే ఉండడం సమస్యేనని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే అంగీకరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్, హెడ్ కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.అటు బౌలింగ్లోనూ వరుణ్ చక్రవర్తి మినహా మిగతా స్పిన్నర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్-8 మ్యాచ్ల్లో బౌలర్లు సమిష్టిగా రాణిస్తేనే టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. తర్వాతి మ్యాచ్కు వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ (Axar Patel) జట్టులోకి వచ్చే అవకాశముంది. రింకు సింగ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా క్రీడాభిమానుల్లో నడుస్తోంది. బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్గా బ్యాటింగ్ చేయగల సత్తా వాషింగ్టన్ సుందర్కు ఉంది.చదవండి: అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?భారత జట్టు అంచనా: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన టీ20 మ్యాచ్తో ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ కలుపుకొని హర్మన్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో) 356 మ్యాచ్లు ఆడింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉండేది. సూజీ తన కెరీర్లో 355 మ్యాచ్లు ఆడింది. ఈ జాబితాలో హర్మన్, సూజీ తర్వాతి స్థానంలో ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ ఉంది. పెర్రీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 349 మ్యాచ్లు ఆడింది.హర్మన్ విషయానికొస్తే.. 2009 మార్చి 7న పాకిస్తాన్పై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు 6 టెస్టులు, 161 వన్డేలు, 189 T20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2016లో కెప్టెన్సీ చేపట్టిన హర్మన్, 2025 నవంబర్లో వన్డే వరల్డ్ కప్ గెలిపించి కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసింది. హర్మన్ తన కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 8000కిపైగా పరుగులు సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్లు జార్జియా వాల్ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవరల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. తొలుత వాల్-మూనీ ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.వాల్-మూనీ తొలి వికెట్కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్ను భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. వాల్, మూనీ మినహా ఆసీస్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. లిచ్ఫీల్డ్ 6, ఎల్లిస్ పెర్రీ 7, గార్డ్నర్ 10 (నాటౌట్), జార్జియా వేర్హమ్ డకౌటయ్యారు.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ను ఆసీస్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి ఓడించారు. ఆష్లే గార్డ్నర్ (4-0-22-3), కిమ్ గార్త్ (3-0-16-2), అన్నాబెల్ సదర్ల్యాండ్ (4-0-18-2), సోఫీ మోలినెక్స్ (4-0-37-2) ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. భారత ఇన్నింగ్స్కు షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (31) శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన వారు ఆ ఊపును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ (36) కాసేపు పోరాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.భారత ఇన్నింగ్స్లో పై ముగ్గురితో పాటు రిచా ఘోష్ (19), క్రాంతి గౌడ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (4), అమన్జోత్ (3), అరుంధతి రెడ్డి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. దీప్తి శర్మ, శ్రీచరణి ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, ఈ సిరీస్లో భారత్ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఫిబ్రవరి 21న అడిలైడ్ వేదికగా జరుగనుంది. ఈ ఆసీస్ పర్యటనలో భారత్ టీ20ల తర్వాత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్, ఆతర్వాత ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది.
అఫ్గాన్ అద్భుత విజయం.. ట్రాట్కు ఘన వీడ్కోలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భు...
T20 WC 2026: జద్రాన్ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జ...
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌ...
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంప...
క్రీడలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
వీడియోలు
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
భారత్ కు మహాశివరాత్రి.. పాక్ కు కాళరాత్రి...
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
