Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

England defeated Nepal by 4 runs in the T20 World Cup1
ఇంగ్లండ్‌ను వణికించిన నేపాల్‌

ముంబై: ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో చిన్న జట్ల జోరు సాగుతోంది. తొలి రోజు పాకిస్తాన్‌పై నెదర్లాండ్స్‌ గెలిచినంత పనిచేయగా... స్టార్‌లతో నిండి ఉన్న టీమిండియాను అమెరికా భయపెట్టింది. రెండో రోజు ఇదే తరహాలో రెండుసార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టును నేపాల్‌ వణికించింది. చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. నేపాల్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు చక్కటి షాట్‌లు ఆడుతూ జట్టులో ఆశలు రేపిన లోకేశ్‌ బామ్‌... స్యామ్‌ కరన్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌లు ఆడలేకపోయాడు. ఫలితంగా ‘చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు’ ఇంగ్లండ్‌ 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. జాకబ్‌ బెథెల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెపె్టన్‌ హ్యారీ బ్రూక్‌ (32 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఆఖర్లో మెరుపు షాట్‌లు ఆడగా... జోస్‌ బట్లర్‌ (26; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఫిల్‌ సాల్ట్‌ (1), టామ్‌ బాంటన్‌ (2), స్యామ్‌ కరన్‌ (2) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్‌ (29 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ రోహిత్‌ పౌడెల్‌ (34 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోకేశ్‌ బామ్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ (29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడారు. నేపాల్‌ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో... ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో లోకేశ్‌ రెండు సిక్స్‌లతో కలిపి 22 పరుగులు వచ్చాయి. తదుపరి ఓవర్‌లో మరో రెండు ఫోర్‌లతో లోకేశ్‌ 14 పరుగులు రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులకు చేరగా... స్యామ్‌ కరన్‌ ఆఖరి ఓవర్‌లో 5 పరుగులే ఇచ్చి నేపాల్‌ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుస్కాట్లాండ్‌ X ఇటలీవేదిక: కోల్‌కతా; ఉదయం 11 గంటల నుంచిజింబాబ్వే X ఒమన్‌వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గంటల నుంచిదక్షిణాఫ్రికా X కెనడా వేదిక: అహ్మదాబాద్‌; రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Gold medal for the Elavenil Arjun pair2
ఇలవేనిల్‌–అర్జున్‌ జోడీకి స్వర్ణ పతకం

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వలారివన్‌–అర్జున్‌ బబూతా ద్వయం భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఇలవేనిల్‌–అర్జున్‌ జోడీ 505 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 10 మీటర్ల జూనియర్‌ ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాన్షు–శాంభవి ద్వయం 502.4 పాయింట్లు స్కోరు చేసి భారత్‌ ఖాతాలో పసిడి పతకాన్ని చేర్చింది. ముకేశ్‌కు రజతం, తనిష్క్ కు కాంస్యం 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ సీనియర్‌ పురుషుల ఈవెంట్‌లో భారత షూటర్లు గుర్‌ప్రీత్‌ (575 పాయింట్లు), హర్‌‡్ష (571), అమన్‌ ప్రీత్‌ (569) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు. 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ జూనియర్‌ పురుషుల ఈవెంట్‌లోనూ భారత షూటర్లు క్లీన్‌స్వీప్‌తో అదరగొట్టారు. సూరజ్‌ శర్మ (576 పాయింట్లు)స్వర్ణం నెగ్గగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ నేలవల్లి (559) రజతం... తెలంగాణకు చెందిన కొడవలి తనిష్క్‌ మురళీధర్‌ నాయుడు (557) కాంస్య పతకం సాధించారు. సీనియర్, జూనియర్‌ విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు భారత షూటర్లు 30 స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 50 పతకాలు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Indias sensational victory over the Netherlands3
దక్షిణేశ్వర్‌ ధమాకా

బెంగళూరు: దేశం కోసం ఆడే సమయంలో భారత టెన్నిస్‌ ఆటగాళ్ల ర్యాంక్‌లను పట్టించుకోవద్దని మరోసారి నిరూపితమైంది. దక్షిణేశ్వర్‌ సురేశ్‌... ప్రపంచ సింగిల్స్‌లో 465వ ర్యాంక్‌... భారత్‌లో నాలుగో ర్యాంక్‌... ప్రపంచ డబుల్స్‌లో 457వ ర్యాంక్‌... అయినా సొంతగడ్డపై ఈ ఆజానుబాహుడు అద్భుత ఆటతీరు ప్రదర్శించాడు.నెదర్లాండ్స్‌ లాంటి పటిష్ట జట్టుతో జరిగిన వరల్డ్‌ గ్రూప్‌ తొలి రౌండ్‌లో అన్నీతానై ఈ తమిళనాడు ప్లేయర్‌ భారత్‌కు 3–2తో సంచలన విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితంగా డేవిస్‌కప్‌ పురుషుల ప్రపంచ టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో టీమిండియా వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. 2004లో జపాన్‌ జట్టుపై లియాండర్‌ పేస్‌ తర్వాత భారత్‌ నుంచి ఒక ప్లేయర్‌ రెండు సింగిల్స్‌లో, ఒక డబుల్స్‌లో ఆడి గెలవడం ఇదే ప్రథమం. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 78 కేజీల బరువున్న దక్షిణేశ్వర్‌ ఆదివారం ముందుగా డబుల్స్‌ మ్యాచ్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్, ప్రపంచ 20వ ర్యాంకర్‌ యూకీ బాంబ్రీతో జతకట్టి బరిలోకి దిగాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌–యూకీ ద్వయం 7–6 (7/0), 3–6, 7–6 (7/1)తో సాండెర్‌ అరెండ్స్‌–డేవిడ్‌ పెల్‌ జోడీని ఓడించింది. దాంతో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం రివర్స్‌ సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ 7–5, 1–6, 4–6తో ప్రపంచ 73వ ర్యాంకర్‌ జెస్పెర్‌ డి జాంగ్‌ చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన రివర్స్‌ సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో దక్షిణేశ్వర్‌ బరిలోకి దిగాడు. సాధికారిక ఆటతీరును ప్రదర్శించి 99 నిమిషాల్లో 6–4, 7–6 (7/4)తో ప్రపంచ 160వ ర్యాంకర్‌ గయ్‌ డెన్‌ ఉడెన్‌ను ఓడించి భారత్‌కు 3–2తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Uttarakhand team enters Ranji Trophy semi finals for the first time4
ఉత్తరాఖండ్‌ సంచలనం

జంషెడ్‌పూర్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో ఉత్తరాఖండ్‌ జట్టు సంచలనం సృష్టించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి ఉత్తరాఖండ్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. జార్ఖండ్‌ జట్టుతో ఇక్కడి కీనన్‌ స్టేడియంలో ఆదివారం ముగిసిన క్వార్టర్‌ ఫైనల్లో ఉత్తరాఖండ్‌ జట్టు ఇన్నింగ్స్‌ ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం నమోదు చేసుకుంది. 136 పరుగుల తేడాతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జార్ఖండ్‌ జట్టు ఒకదశలో 100/2తో పటిష్టంగానే కనిపించింది. అయితే ఉత్తరాఖండ్‌ వెటరన్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మిశ్రా మాయాజాలానికి... అభయ్‌ నేగి పేస్‌ ధాటికి జార్ఖండ్‌ జట్టు చివరి 8 వికెట్లను 30 పరుగుల తేడాలో కోల్పోయింది. చివరకు 130 పరుగులకే ఆలౌటై ఇన్నింగ్స్‌ ఓటమిని చవిచూసింది. జార్ఖండ్‌ కెప్టెన్‌ విరాట్‌ సింగ్‌ (55; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కుమార్‌ కుశాగ్ర (34; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. మయాంక్‌ మిశ్రా 22 పరుగులిచ్చి 5 వికెట్లు, అభయ్‌ నేగి 36 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ఉత్తరాఖండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 282/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ జట్టు 122.3 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటై 136 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కెపె్టన్‌ కునాల్‌ చండేలా (68; 8 ఫోర్లు), జగదీశ సుచిత్‌ (70; 6 ఫోర్లు), అభయ్‌ నేగి (46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌ చేరిన ఉత్తరాఖండ్‌ జట్టుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి అభినందనలు తెలిపారు. కర్ణాటక లక్ష్యం 325 ముంబై జట్టుతో ముంబైలో జరుగుతున్న మరో క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు విజయానికి 212 పరుగుల దూరంలో నిలిచింది. ముంబై నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (60 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. మయాంక్‌ అగర్వాల్‌ (3), కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (39; 5 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ చేరుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 189/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై జట్టు 98.3 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటైంది. తనుశ్‌ కొటియాన్‌ (48 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), తుషార్‌ దేశ్‌పాండే (47; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరి బ్యాటింగ్‌ కారణంగా ముంబై జట్టు కర్ణాటకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కష్టాల్లో మధ్యప్రదేశ్‌ జమ్మూ కశ్మీర్‌ జట్టుతో ఇండోర్‌లో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ కష్టాల్లో పడింది. 291 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌ గెలవాలంటే మరో 204 పరుగులు చేయాలి. ప్రస్తుతం శుభం శర్మ (11 బ్యాటింగ్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. జమ్మూకశ్మీర్‌ బౌలర్లలో ఆఖిబ్‌ నబీ 3 వికెట్లు, ఆబిద్‌ ముస్తాక్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జమ్మూకశ్మీర్‌ జట్టు 70.3 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.

Services team emerges champions in prestigious Santosh Trophy5
సర్వీసెస్‌ సూపర్‌...

గువాహటి: జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రతిష్టాత్మక సంతోష్‌ ట్రోఫీలో సర్వీసెస్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్‌ 1–0 గోల్స్‌ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్‌ ట్రోఫీలో సర్వీసెస్‌ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్‌ స్ట్రయికర్‌ అభిõÙక్‌ పవార్‌ (109వ నిమిషంలో) మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్‌ సత్తా చాటింది. 2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లోనూ నిర్ణీత సమయంలో గోల్స్‌ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్‌లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్‌ గోల్‌కీపర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్‌ గోల్‌తో సర్వీసెస్‌ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్‌ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిõÙక్‌ ఏకైక గోల్‌ చేసి సర్వీసెస్‌ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్‌ రిపీట్‌ చేశాడు.

Two gold medals for india in the Asian Lacrosse Tournament6
భారత్‌ డబుల్‌ ధమాకా

సాక్షి, హైదరాబాద్‌: లాస్‌ ఏంజెలిస్‌ 2028 ఒలింపిక్స్‌ క్రీడల్లో చోటు సంపాదించిన లాక్రోస్‌ క్రీడలో భారత్‌ తమ సత్తా చాటుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘డబుల్‌ ధమాకా’ సృష్టించింది. సౌదీ అరేబియాలోని రియాద్‌ ఆసియా లాక్రోస్‌ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. తెలంగాణకు చెందిన అనుదీప్‌ రెడ్డి నాయకత్వంలో భారత పురుషుల జట్టు 9–2 స్కోరుతో ఇరాక్‌ జట్టును ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనుదీప్‌ రెడ్డి నాయకత్వ పటిమతో భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. మరోవైపు భారత మహిళల జట్టు ఫైనల్లో 22–5తో పాకిస్తాన్‌పై గెలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది.

Warm welcome to the Indian cricket team for the Under 19 World Cup7
యువ జట్టుకు ఘనస్వాగతం

ముంబై: అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత క్రికెట్‌ జట్టుకు ఘనస్వాగతం లభించింది. ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత అండర్‌–19 జట్టు జింబాబ్వే నుంచి ఆదివారం నేరుగా ముంబై చేరుకోగా... విమానాశ్రయం వద్ద ప్లేయర్ల కుటుంబ సభ్యులు, అభిమానులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో యువ భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అద్భుత ఆటతీరు కనబర్చిన ‘యంగ్‌ ఇండియా’ ఆడిన ఆన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా ట్రోఫీ కైవసం చేసుకుంది. దీంతో యువ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. విధ్వంసక ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే, హెడ్‌ కోచ్‌ కనిత్కర్‌పై పూల వర్షం కురిపించారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేకపోతున్నాం. ఇన్నాళ్ల నుంచి వాళ్లు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ఆయుశ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అతడి శ్రమ ఫలించింది’ అని ఆయుశ్‌ మాత్రే తండ్రి యోగేశ్‌ మాత్రే అన్నారు. ఆరోసారి అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన వెంటనే జట్టుకు బీసీసీఐ ఏడున్నర కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించగా... త్వరలోనే ఆటగాళ్లను సన్మానించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరుగుతుండంతో... వీలును బట్టి ఈ కార్యక్రమం నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీంతో ఆటగాళ్లు ముంబై నుంచి స్వస్థలాలకు వెళ్లారు. ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నీ’లో వైభవ్‌ దుబాయ్‌: అండర్‌–19 ప్రపంచకప్‌లో అదరగొట్టిన భారత యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ... ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ 14 ఏళ్ల ఓపెనర్‌... 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు లీగ్‌ దశలోనూ మెరుపులు మెరిపించిన వైభవ్‌... తుదిపోరులో ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డులు దక్కించుకున్నాడు. వరల్డ్‌ కప్‌ ప్రదర్శన ఆధారంగా... ఐసీసీ ఆదివారం 12 మందితో కూడిన ‘టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ను ఎంపిక చేసింది. అందులో భారత్‌ నుంచి వైభవ్‌ సూర్యవంశీ సహా ముగ్గురికి అవకాశం దక్కింది. కనిష్క్ చౌహాన్, హెనిల్‌ పటేల్‌ ఈ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ఆరోసారి ప్రపంచ టైటిల్‌ నెగ్గిన ‘యంగ్‌ ఇండియా’కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్‌ మాత్రేకు మాత్రం ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. వరల్డ్‌కప్‌ రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్‌కు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఈ జట్టులో ఉండగా... ఇంగ్లండ్‌ సారథి థామస్‌ ర్యూ ఈ జట్టుకు వికెట్‌ కీపర్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వరల్డ్‌కప్‌లో భారీ సెంచరీ బాదిన శ్రీలంక ప్లేయర్‌ విరాన్‌ చముదితకు కూడా ఈ జట్టులో చోటు దక్కగా... అఫ్గానిస్తాన్‌ జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఫైసల్‌ ఖాన్, నూరిస్తాని ఓమర్‌జాయ్‌ కూడా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌ నుంచి ఒక్కో ప్లేయర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. ఇయాన్‌ బిషప్, ఆండీ ఫ్లవర్, గ్రీన్‌వే, టెల్‌ఫోర్డ్‌తో కూడిన సెలెక్షన్‌ ప్యానల్‌ ఈ జట్టును ఎంపిక చేసింది. ఐసీసీ అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌: థామస్‌ ర్యూ (కెప్టెన్‌), బెన్‌ మైస్, లమ్స్‌డెన్‌ (ఇంగ్లండ్‌), వైభవ్‌ సూర్యవంశీ, కనిష్క్ చౌహాన్, హెనిల్‌ పటేల్‌ (భారత్‌), విరాన్‌ చముదిత (శ్రీలంక), ఫైసల్‌ ఖాన్, నూరిస్తాని ఒమర్‌జాయ్‌ (అఫ్గానిస్తాన్‌), ఒలీవర్‌ పీక్‌ (ఆ్రస్టేలియా), విటెల్‌ లావెస్‌ (వెస్టిండీస్‌), అలీ రజా (పాకిస్తాన్‌).

Sri Lanka Won Against Ireland T20 World Cup8
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం

కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు.

dasun shanaka bags Most ducks in T20 Internationals9
శ్రీలంక కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ దసున్‌ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ‍ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్‌ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్‌ స్టిర్లింగ్‌ (158 మ్యాచ్‌ల్లో 14) ఉన్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ ఓవర్‌ తర్వాత ఐర్లాండ్‌ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఐరిష్‌ బౌలర్లలో జార్జియా డాక్రెల్‌ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మార్క్‌ అదైర్‌ (4-0-33-1), గెరాత్‌ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్‌ (4-0-44-0), బ్యారీ మెక్‌ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ మెండిస్‌ (56 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆఖర్లో కుసాల్‌ మెండిస్‌ (44) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్‌ మిషారా 14, పవన్‌ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు.

KL Rahul steady fifty vs Mumbai takes Karnataka closer to Ranji Trophy semi final10
రాణించిన కేఎల్‌ రాహుల్‌

ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్‌ రాహుల్‌ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (3), ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట​్‌ తీశారు.అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement