Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Today Mumbai Indians face Chennai Super Kings1
స్టార్స్‌ ఆడతారా?

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడినా మహేంద్ర సింగ్‌ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడగా... తొలి నాలుగు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య వాంఖెడే మైదానంలో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే గత మ్యాచ్‌కు ముందు కూడా సాధన చేసినా... చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈసారి వారి పునరాగమనం మళ్లీ ఆసక్తిగా మారింది. టోర్నీలో ఇరు జట్లు ప్రస్తుతం చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ముంబై ఏడో స్థానంలో, చెన్నై ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. నాలుగు వరుస పరాజయాల తర్వాత తిలక్‌ వర్మ మెరుపులతో గత మ్యాచ్‌లో నెగ్గిన ముంబై సొంతగడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డికాక్, నమన్‌ ధీర్‌లతో పాటు సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా, అశ్వని కుమార్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇద్దరు విదేశీ స్పిన్నర్లు సాంట్నర్, ఘజన్‌ఫర్‌ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. మరోవైపు వరుసగా రెండు విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్‌ చేతిలో ఓడి మళ్లీ వెనుకబడింది. సంజూ సామ్సన్‌ ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రుతురాజ్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. పైగా సత్తా చాటిన యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రే గాయంతో టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. టాపార్డర్‌లో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి.

India set a target of 193 runs for South Africa in the third T20I2
మెరిసిన షఫాలీ, హర్మన్‌

జొహనెస్‌బర్గ్‌: సిరీస్‌ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు 193 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి షఫాలీ తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 68 పరుగులు జోడించింది. స్మృతి, జెమీమాలను మలాబా వరుస బంతుల్లో అవుట్‌ చేసింది. జెమీమా స్థానంలో క్రీజులో వచ్చిన హర్మన్‌తో కలిసి షఫాలీ మూడో వికెట్‌కు 73 పరుగులు జత చేసింది. షఫాలీ వెనుదిరిగాక వచ్చిన రిచా ఘోష్‌ (10 బంతుల్లో 18 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడింది. అంతకుముందు వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. శ్రీచరణి, అనుష్క శర్మ, క్రాంతి గౌడ్‌ స్థానాల్లో భారతి ఫుల్మాలి, కాశ్వీ గౌతమ్, రేణుక సింగ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోయింది.

India to host South Asian Womens Football Tournament3
పదేళ్ల తర్వాత... దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం

ఢాకా: దశాబ్దం తర్వాత భారత్‌ వేదికగా దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ జరగనుంది. ఈ ఏడాది మే 25 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి గోవా రాష్ట్రం ఆతిథ్యమిస్తుంది. భారత్‌లో చివరిసారి 2016లో (సిలిగురి, పశ్చిమ బెంగాల్‌) దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీని నిర్వహించారు. ఈ టోర్నీకి సంబంధించి గ్రూప్‌ వివరాలను బుధవారం ఢాకాలోని దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య కార్యాలయంలో విడుదల చేశారు. గ్రూప్‌ ‘ఎ’లో నేపాల్‌ (87వ ర్యాంక్‌), శ్రీలంక (162), భూటాన్‌ (164)... గ్రూప్‌ ‘బి’లో భారత్‌ (69వ ర్యాంక్‌), బంగ్లాదేశ్‌ (112), మాల్దీవులు (167) జట్లున్నాయి. భారత్‌ తమ లీగ్‌ మ్యాచ్‌లను మే 25న మాల్దీవులతో, మే 31న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. లీగ్‌ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ జూన్‌ 3న జరుగుతాయి. ఫైనల్‌ను జూన్‌ 6న నిర్వహిస్తారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఆ జట్టు ఈ టోర్నీలో ఆడటం లేదు. అత్యధికంగా ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) భారత జట్టు దక్షిణాసియా టోర్నీ టైటిల్స్‌ సాధించింది.

Mohsin Khan bowls first ever maiden to Vaibhav Sooryavanshi4
వైభ‌వ్‌కు చుక్క‌లు చూపించిన‌ మొన‌గాడు.. ఎవ‌రంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్ అద్భుత ప్రదర్శన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా రాజస్తాన్ డేంజరస్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి మోహ్సిన్ తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు.జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కొన్న వైభవ్‌.. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వైభవ్‌కు వేసిన మొహ్షిన్ ఖాన్‌.. ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా మలిచాడు.తొలి ఐదు బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ సూర్యవంశీ, ఆరో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో వైభవ్‌కు మెయిడెన్ ఓవర్ వేసిన తొలి బౌలర్‌గా మొహ్సిన్ ఖాన్ నిలిచాడు. అతడి ధాటి​కి వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.చదవండి: PSL 2026: హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

Jofra Archer stars as Rajasthan defend 159 against lacklustre Lucknow5
రాజస్తాన్‌ గెలుపు బాట.. లక్నోపై ఘన విజయం

ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. బుధవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక లక్నో చతికలపడింది. పంత్ సేన లక్ష్య చేధనలో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు రవీంద్ర జడేజా, బిష్ణోయ్‌ తలా వికెట్‌ సాధించారు. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

Steve Smith Bags Maiden PSL Century Against Hyderabad6
హైద‌రాబాద్‌పై స్మిత్ విధ్వంసకర సెంచరీ

పాకిస్తాన్ సూపర్ లీగ్‌-2026లో ముల్తాన్ సుల్తాన్స్ స్టార్‌ ఓపెనర్ స్టీవ్ స్మిత్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్స్‌తో మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ ఆస్ట్రేలియన్ లెజెండ్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కరాచీ నేష‌న‌ల్ స్టేడియంలో స్మిత్‌ బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు.హునైన్ షా వేసిన ఒకే ఓవర్‌లో స్మిత్ ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ క్ర‌మంలో స్మిత్ కేవలం 47 బంతుల్లోనే తన తొలి పీఎస్ఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా కేవ‌లం 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న స్మిత్‌.. 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. అదేవిధంగా స్మిత్‌కు ఇది తన టీ20 కెరీర్‌లో మూడువ అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. సిడ్నీ సిక్సర్స్ తరపున చేసిన 125 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌..231 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. కోహ్లికి కూడా సాధ్యం కాలేదు

Vaibhav Sooryavanshi Shatters Long-Standing IPL Record,7
చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ నిరాశ‌ప‌రిచాడు. వైభవ్‌ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మోహ్షిన్ ఖాన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను సూర్యవంశీ కోల్పోయాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ సింగిల్ డిజిత్ స్కోరే పరిమితమైనప్పటికి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ కొట్టడంతో వైభవ్ ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ కేవలం 222 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (260 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాక్సీ ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.చదవండి: 'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

Vaibhav Sooryavanshi "Demigod": Ajit Agarkar Sent Selection Plea8
'అగార్కర్.. వెంటనే అతడిని టీమిండియాలోకి తీసుకో'

క్రికెట్ ప్ర‌పంచానికి ప్ర‌స్తుతం ఒకే ఒక్క గాడ్ ఉన్నాడు. అత‌డే భార‌త క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్. అయితే రాజస్తాన్ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో 'సెమీ-గాడ్'గా అవతరిస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జోస్యం చెప్పాడు. అదేవిధంగా 15 ఏళ్ల వైభవ్‌ను వీలైనంత త్వరగా జాతీయ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మెన్ అజిత్ అగార్కర్‌ను అతడు సూచించాడు."వైభవ్ సూర్యవంశీ నిజంగా ఒక అద్భుతం. అతడి టాలెంట్‌కు ఫిదా అయిపోయాను. ఇలాంటి ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా అరుదుగా ఉంటారు. అతడు బ్యాట్ స్పీడ్‌, షాట్ సెలక్షన్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. అజిత్ తొందరగా ఆ కుర్రాడిని జాతీయ జట్టులోకి తీసుకో. అతడు భారత్ ఆడబోయే తదుపరి సిరీస్‌కు వైభవ్ జట్టులో కచ్చితంగా ఉండాలి. నిజానికి ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ జట్టులోనే అతడు ఉండాల్సింది.ప్లేయింగ్ ఎలెవన్‌లో కాకపోయినా, కనీసం జట్టుతో ట్రావిల్ చేసి ఉన్న బాగుండేది. అతడికి అంతర్జాతీయ క్రికెట్‌పై ఒక అవగాహన వచ్చేది. వైభ‌వ్‌కు జాతీయ జ‌ట్టు త‌ర‌పున కూడా రాణించే స‌త్తాఉంది. బుమ్రా లాంటి బౌల‌ర్‌కు మొద‌టి బంతికి వైభ‌వ్ సిక్స్ బాదాడు. ఆ త‌ర్వాత హేజిల్‌వుడ్‌ను ఓ ఆడుకున్నాడు. బౌలర్ ఎవరనేది అతడికి సంబంధం లేదు. నేను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు 16 ఏళ్ల యంగ్ టాలెంటెడ్ క్రికెట‌ర్ భార‌త జ‌ట్టులోకి వ‌చ్చాడు. అతనే సచిన్ టెండూల్క‌ర్‌. ఈ రోజు అత‌డిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తున్నారు. వైభ‌వ్‌కు క్రికెట్‌లో తదుపరి 'సెమీ-గాడ్' అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి" అని దీ వీక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో వైభ‌వ్ కేవ‌లం 7 మ్యాచ్‌ల్లో 220.87 స్ట్రైక్ రేట్‌తో 254 ప‌రుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఆ టీమ్‌కు భారీ షాక్‌.. ఉన్న‌ప‌ళంగా ఇంటికి వెళ్లిపోయిన విధ్వంసకర ప్లేయర్‌

Nawaz Loses County Contract After Testing Positive For Recreational Drugs: Report9
డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన స్టార్‌ క్రికెటర్‌.. భారీ షాకిచ్చిన పీసీబీ!

పాకిస్తాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పాక్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ మొహ్మద్ నవాజ్ ప‌ట్టుబడ్డాడు. అత‌డు వినోదం కోసం వాడే మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది.ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. దీంతో అతడిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఈ విష‌యాన్ని పీసీబీ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలియ‌జేశారు. నవాజ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు న‌వాజ్ దూరం కానున్నాడు.న‌వాజ్‌కు భారీ షాక్‌..అదేవిధంగా న‌వాజ్‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది. వాస్త‌వానికి న‌వాజ్ వ‌చ్చే నెల‌లో ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో స‌ర్రే క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాల్సి ఉంది. ఇప్ప‌టికే పీసీబీ అత‌డికి నిరభ్యంతర పత్రం (NOC) కూడా మంజారు చేసింది. కానీ ఈ వివాదం కార‌ణంగా పీసీబీ ఎన్‌వోసీని నిలిపివేసిన‌ట్లు స‌మాచారం. కాగా న‌వాజ్ పాక్ జ‌ట్టులో కీల‌క స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.భార‌త్‌, శ్రీలంక వేదిక‌ల‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఓవ‌రాల్‌గా టీ20 ఫార్మాట్‌లో నవాజ్‌కు ఘనమైన రికార్డు ఉంది. టీ20ల్లో పాకిస్తాన్ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసిన జాబితాలో న‌వాజ్‌(101) నాలుగో స్ధానంలో ఉన్నాడు. టీ20ల్లో రెండుసార్లు 5 వికెట్ల ఘనత సాధించిన ఏకైక పాక్ బౌల‌ర్ కూడా న‌వాజ్‌నే కావ‌డం గ‌మ‌నార్హం. ఒకవేళ విచారణలో నవాజ్ దోషిగా తేలితే పీసీబీ కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. కాంట్రాక్ట్ రద్దుతో పాటు నిషేధం విధించే ఛాన్స్ ఉంది.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ నుంచి ఇషాన్‌ కిషన్‌ అవుట్‌?

IPL 2026: Rajasthan royals vs Lucknow super giants Live updates10
లక్నోను చిత్తు చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌

IPL 2026 RR vs LSG Live updates: లక్నోపై రాజస్తాన్‌ ఘన విజయంఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 18 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌(55) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా రెండేసి వికెట్లు పడగొట్టాడు.లక్నో ఏడో వికెట్ డౌన్‌ముకుల్ చౌదరి రూపంలో లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ముకుల్ ఔటయ్యాడు. లక్నో విజయానికి 23 బంతుల్లో 49 పరుగులు కావాలి.లక్నో ఆరో వికెట్ డౌన్‌లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌.. బర్గర్ బౌలిం‍గ్‌లో ఔటయ్యాడు.లక్నో ఐదో వికెట్‌ డౌన్‌లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన హిమత్‌ సింగ్‌.. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లక్నో విజయానికి 33 బంతుల్లో 69 పరుగులు కావాలి.రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌54 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన నికోలస్‌ పూరన్‌.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు లక్నో స్కోర్‌: 74/4నిలకడగా ఆడుతున్న మార్ష్‌, పూరన్‌7 ఓవర్లకు లక్నో 3 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌(24), పూరన్‌(14) ఉన్నారు.కష్టాల్లో లక్నోఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.లక్నోకు భారీ షాక్‌160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. లక్నో కేవలం 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌ పంత్‌(0), బదోని(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.రాణించిన జడేజా.. ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్తాన్‌ను జడేజా(29 బంతుల్లో 43) ఆదుకున్నాడు. అతడితో పాటు ఫెరీరా(20), శుభమ్‌ దూబే(19), హెట్‌మైర్‌(22) రాణించారు. లక్నో బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, మోహ్షిన్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు సాధించారు.19 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోరెంతంటే?19 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌రాజస్తాన్‌ రాయల్స్‌ వికెట్ల పతనం కొనసాగుతోంది. 22 పరుగులు చేసిన షిమ్రాన్‌ హెట్‌మైర్‌.. మోహ్షిన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10.4 ఓవర్లలో రాయల్స్‌ స్కోర్‌: 78-5రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌20 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 62/4రాజస్తాన్‌ మూడో వికెట్‌రాజస్తాన్‌ రాయల్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో షిమ్రాన్‌ హెట్‌మైర్‌ వచ్చాడు. 4 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 32/3నిప్పులు చెరుగుతున్న షమీరాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ నిప్పులు చెరుగుతున్నాడు. మూడో ఓవర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో రాజస్తాన్‌ వరుస బంతుల్లో జైశ్వాల్‌(22), ధ్రువ్‌ జురెల్‌(0) పెవిలియన్‌కు చేరారు.ఐపీఎల్‌-2026లో ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ కీలక పోరులో లక్నో రెండు మ్యాచ్‌లతో బరిలోకి దిగింది.అవేష్‌ ఖాన్‌, సిద్దార్ధ్‌ స్ధానాల్లో దిగ్వేష్‌, మయాంక్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న నికోలస్‌ పూరన్‌కు లక్నో మరో అవకాశమిచ్చింది. ఇక రాజస్తాన్‌ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(వికెట్ కీపర్‌), నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, మొహసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మయాంక్ యాదవ్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement