Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

If Rohit Bhai isnt scolding you, somethings wrong1
రోహిత్ తిట్టకపోతేనే బాధపడతా.. నా డ్రీమ్‌ అదే: జైశ్వాల్‌

వైజాగ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న జైశ్వాల్‌.. సిరీస్ డిసైడర్‌లో మాత్రం తన సత్తాను చూపించాడు. తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అతడు అందుకున్నాడు.అయితే జైశ్వాల్‌ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించడంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మది కీలక పాత్రంట. ఈ విషయాన్ని జైశ్వాల్ స్వయంగా తనంతట తానే వెల్లడించాడు. రోహిత్ యువ ఆటగాళ్లకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడని, ఒకవేళ జూనియర్లను మందలించిన అందులో ప్రేమ, ఆప్యాయత ఉంటాయని జైశూ తెలిపాడు.కాగా రోహిత్ శర్మ మైదానంలో జూనియర్లు తప్పు చేస్తే అప్పుడప్పుడు తిడుతూ ఉంటాడు. ఇటువంటి సంఘటనలు చాలా అతడి కెప్టెన్సీలో చాలా చోటు చేసుకున్నాయి. మిస్ ఫీల్డ్ చేసినప్పుడు, బౌలింగ్, బ్యాటింగ్ సరిగ్గా చేయినప్పుడు రోహిత్ తన నోటికి పనిచెప్పే వాడు. కానీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరము లేదని ఓ ఇంటర్వ్యూలో జైశ్వాల్ స్పష్టం చేశాడు."రోహిత్ భాయ్‌ మమ్మల్ని మందలించిన ప్రతిసారి అందులో చాలా ప్రేమ, అప్యాయత ఉంటుంది. నిజానికి రోహిత్ తిట్టక పోతానే ఏం జరిగింది? ఎందుకు మందలించడం లేదు? నేను చేసిన పనికి ఆయన బాధపడ్డాడా? అన్న అభద్రతాభావం ఏర్పడుతుంది.రోహిత్‌, విరాట్ కోహ్లిలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండడం మాలాంటి యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేకూరుతోంది. వారు గేమ్ గురుంచి చర్చిస్తారు. వారి అనుభవాలను పంచుకుంటారు. వారు గతంలో చేసిన తప్పిదాలను మేము చేయకుండా ఉండడానికి సలహాలు ఇస్తారు.రో-కో మాతో ఉంటే మేమంతా రిలాక్స్‌డ్‌గా ఉంటాము. వైజాగ్ వ‌న్డేలో రోహిత్ భాయ్ న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేశాడు. రోహిత్ భాయ్ నన్ను ప్ర‌శాతంగా, సమయం తీసుకోమని సూచించాడు. తానే రిస్క్ తీసుకుంటాన‌ని చెప్పాడు. రోహిత్ లాంటి చాలా అరుదుగా ఉంటారు. అదేవిధంగా విరాట్ పాజీ(కోహ్లి) కూడా టార్గెట్‌ను చిన్న చిన్న ల‌క్ష్యాల‌గా చేసుకుని చేధించాల‌ని చెప్పారు. ఇక భవిష్యత్తులో టీ20 ప్రపంచకప్ ఆడాలన్నది నాకల. అంతేకాకుండా వస్తే భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి కూడా నేను సిద్దంగా ఉన్నానని 'అజెండా ఆజ్ తక్' సదస్సులో జైశ్వాల్‌ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మార‌న్ మాస్ట‌ర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?

SRH strategy for IPL 2026 auction: Pathirana as Mohammed Shamis replacement?2
కావ్య మార‌న్ మాస్ట‌ర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి సమయం అసన్నమవుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను మొత్తం పది ఫ్రాంచైజీలు సిద్దం చేసుకుంటున్నాయి.గతేడాది సీజన్‌లో ఆరోస్ధానానికి పరిమితమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం వేలంలో చాకచాక్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ మినీ ఆక్షన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ దాదాపు తమ కోర్ టీమ్‌ను అంటిపెట్టుకుంది.అయితే మహ్మద్ షమీ లాంటి కీలక పేసర్‌ను లక్నోకు సన్‌రైజర్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్‌-2025లో షమీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ కారణంతోనే అతడిని ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు వేలంలో అతడి స్ధానాన్ని మరో ఫ్రంట్ లైన్ సీమర్‌తో భర్తీ చేయాలని ఎస్‌ఆర్‌హెచ్ యోచిస్తోంది.పతిరానపై కన్ను..సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌లో 25.50 కోట్లు ఉన్నాయి. కనిష్టంగా ముగ్గురు, గరిష్టంగా పది మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే షమీ స్ధానాన్ని మినీ వేలంలో స్వదేశీ పేసర్‌తో భర్తీ చేయడం కష్టం. వేలంలో చెప్పుకోదగ్గ స్వదేశీ ఫాస్ట్ బౌలర్ ఎవరూ లేరు. అందుకే శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరానాపై ఎస్ఆర్‌హెచ్ క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌తిరానా గ‌త సీజ‌న్ వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. కానీ మినీ వేలానికి ముందు అత‌డిని సీఎస్‌కే విడిచిపెట్టింది.దీంతో అత‌డిపై వేలంలో కాసుల వ‌ర్షం కురిసే అవ‌కాశ‌ముంది. పతిరానా కోసం అవసరమైతే తమ పర్స్‌లో ఉన్న సగం మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సన్‌రైజర్స్‌ సిద్దమైనట్లు సమాచారం. ఐపీఎల్‌ పతిరానా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. పతిరానా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పటికి.. సీఎస్‌కే లెజెండ్‌ ధోని సారథ్యంలో ఎంతగానో రాటుదేలాడు. మిడిల్‌ ఓవర్లలో కూడా తన పేస్‌ బౌలింగ్‌ ‍బ్యాటర్లను కట్టడి చేయగలడు. అంతేకాకుండా ఈ జూనియర్‌ మలింగా యార్కర్లను కూడా అద్భుతంగా సంధించగలడు. దీంతో అతడిని ఎలాగైనా కొనుగోలు చేసి డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ఉపయోగించుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎస్ఆర్‌హెచ్ రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్ల జాబితావిదేశీ ఆటగాళ్లు (6): పాట్ కమిన్స్✈️ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్✈️ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్✈️, కమిందు మెండిస్✈️, ఇషాన్ మలింగ✈️, బ్రైడన్ కార్స్✈️.దేశీయ ఆటగాళ్లు (9): అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, స్మరణ్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ.SRH విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాఅభినవ్ మనోహర్, ఆడమ్ జంపా✈️, అథర్వ తైడే (వికెట్ కీపర్), రాహుల్ చాహర్, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్, వియాన్ ముల్డర్✈️.చదవండి: బీసీసీఐ కీలక సమావేశం..

Virat Kohli, Rohit Sharmas BCCI Contract Revision To Be Discussed Next Week At This Meeting3
బీసీసీఐ కీలక సమావేశం..

టీ20, టెస్టు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించి... కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న భారత స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ కాంట్రాక్ట్‌ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 22న జరగనున్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆటగాళ్ల కాంట్రాక్టులతో పాటు... మహిళల దేశవాళీ క్రికెట్‌ చెల్లింపుల విషయంలో ప్రధానంగా చర్చ సాగనుంది. మిథున్‌ మన్హాస్‌ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న తొలి ఏజీఎం ఇదే. ఇప్పటి వరకు కోహ్లి, రోహిత్‌ ‘ఏ ప్లస్‌’ కేటగిరీలో ఉండగా... ఇప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్న కారణంగా ఈ ఇద్దరినీ అందులో నుంచి తొలగించే అవకాశం ఉంది. కొత్త ‘ఏ ప్లస్‌’ కాంట్రాక్టు జాబితాలో ఏస్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో పాటు... టెస్టు, వన్డే కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ చోటు దక్కించుకోనున్నాడు. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ ఏజీఎంలో మహిళల దేశవాళీలో టోర్నీల మ్యాచ్‌ ఫీజులు, అంపైర్లు, రిఫరీల జీతభత్యాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.ఇక బోర్డు డిజిటల్‌ సొత్తుకు సంబంధించిన చర్చ కూడా జరగనుంది. ప్రస్తుతం మిథున్‌ మన్హాస్‌ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతుండగా... రఘురామ్‌ భట్‌ కోశాధికారిగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: జోరు కొనసాగించాలని...

Indias second T20 against South Africa is today4
జోరు కొనసాగించాలని...

ముల్లాన్‌పూర్‌: సొంతగడ్డపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత క్రికెట్‌ జట్టు... గురువారం దక్షిణాఫ్రికాతో రెండో టి20 ఆడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో టి20 ప్రపంచకప్‌ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో తొమ్మిది మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఇందులోనే జట్టు బలాబలాలు, కూర్పును సరిచూసుకోవాలని భావిస్తున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కటక్‌లో ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్‌లో బంతి కాస్త ఆగి వస్తున్న పిచ్‌పై మన టాపార్డర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ధనాధన్‌ ఆటతో మంచి స్కోరు చేసిన టీమిండియా... కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మెరిపించింది. దక్షిణాఫ్రికా టి20 చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుందంటే... అందులో మన బౌలర్ల ప్రతిభ ఎంతో ఉంది.ఇప్పుడు అదే జోరు సాగిస్తూ రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత ఆధిక్యం సాధించాలని సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత్‌ భావిస్తుండగా... తొలి మ్యాచ్‌లో తేలిపోయిన దక్షిణాఫ్రికా ఈ పోరులో సత్తా చాటి సిరీస్‌ సమం చేయాలని చూస్తోంది. టాపార్డర్‌ రాణించేనా! పిచ్, ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూకుడే పరమావధిగా దూసుకెళ్తున్న భారత యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై అందరి దృష్టి నిలవనుంది. ముల్లాన్‌పూర్‌లో మంచి అనుభవం ఉన్న ఈ పంజాబ్‌ చిన్నోడు సొంతగడ్డపై ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో సిక్స్‌ల వర్షం కురిపించిన అభిõÙక్‌... అదే పరాక్రమం కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత వన్డే, టెస్టు రెగ్యులర్‌ కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ గత మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన గిల్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉండగా... మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ కీలకం కానున్నారు. పరిస్థితులను బట్టి గేర్‌లు మార్చే సత్తా వీరిలో పుష్కలం. ఇక గాయం నుంచి కోలుకొని గత మ్యాచ్‌ ద్వారా పునరాగమనం చేసిన పాండ్యా... తన విలువ ఏంటో చాటుకున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో విజృంభించిన హార్దిక్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ ఇలాంటి ప్రదర్శన ఆశిస్తోంది. శివమ్‌ దూబే, జితేశ్‌ శర్మ ఫినిషర్‌ల బాధ్యత నిర్తర్తించనున్నారు. గత మ్యాచ్‌ ద్వారానే మూడు ఫార్మాట్‌లలో వంద వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు అర్ష్ దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు. మార్పుల్లేకుండా సఫారీ జట్టు... స్టార్‌లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కటక్‌ పిచ్‌పై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. ఆ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకొని రెండో మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో దుమ్మురేపాలని సఫారీలు భావిస్తున్నారు. డికాక్, మార్క్‌రమ్, స్టబ్స్, బ్రేవిస్, మిల్లర్, యాన్సెన్‌ రూపంలో ఆ జట్టులో ప్రతిభకు కొదవ లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. తొలి స్పెల్‌లో అర్ష్ దీప్‌ కట్టిపడేయడంతో వెనుకంజలో పడ్డ సఫారీలు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. దీంతో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘ప్రొటీస్‌’ కసరత్తులు ప్రారంభించారు. ఇక మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు పరుగుల వేగాన్ని నియంత్రిస్తుండటంతో... దానికి విరుగుడు కనిపెట్టాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఓపెనర్లు, మార్క్‌రమ్, డికాక్‌లో ఒకరు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడితే... మిగిలిన వాళ్లు ధనాధన్‌ షాట్‌లతో స్కోరు వేగం పెంచగల సమర్థులే. బౌలింగ్‌లో ఎంగిడి, నోర్జే, యాన్సెన్‌ మరోసారి కీలకం కానున్నారు. తొలి మ్యాచ్‌లో ఎంగిడి భారత టాపార్డర్‌ పని పట్టాడు. ఊరించే బంతులతో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి అతడిని జాగ్రత్తగా ఎదుర్కోక తప్పదు. యాన్సెన్‌ వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చాడు. ఎటొచ్చి సఫారీ స్పిన్నర్లనే మనవాళ్లు మరోసారి టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉంది. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ పురుషుల మ్యాచ్‌. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు... రెండు మహిళల మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. పిచ్‌ అటు బ్యాటర్లతో పాటు ఇటు పేసర్లకు సహకరించనుంది. మంచు ప్రభావం ఎక్కువ ఉండకపోవచ్చు.

Indian team won the bronze medal in the Mens Junior Under 21 World Cup Hockey tournament5
యువ భారత్‌కు కాంస్యం

చెన్నై: సొంతగడ్డపై జరిగిన పురుషుల జూనియర్‌ అండర్‌–21 ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రోహిత్‌ సారథ్యంలోని యువ భారత జట్టు 4–2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున అంకిత్‌ పాల్‌ (49వ నిమిషంలో), మన్‌మీత్‌ సింగ్‌ (52వ నిమిషంలో), శార్దానంద్‌ తివారి (57వ నిమిషంలో), అన్‌మోల్‌ ఎక్కా (58వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. అర్జెంటీనా జట్టుకు నికోలస్‌ రోడ్రిగెజ్‌ (3వ నిమిషంలో), సాంటియాగో ఫెర్నాండెజ్‌ (44వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఒకదశలో 0–2తో వెనుకబడి ఓటమి వైపు పయనిస్తున్న యువ భారత జట్టు చివరి 11 నిమిషాల్లో ఒక్కసారిగా విజృంభించింది. ఏకంగా నాలుగు గోల్స్‌ చేసి అద్భుత విజయాన్ని సాధించింది. భారత్‌ చేసిన నాలుగు గోల్స్‌లో మూడు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా, ఒకటి పెనాల్టీ స్ట్రోక్‌ ద్వారా రావడం విశేషం. మ్యాచ్‌ మొత్తంలో భారత్‌కు ఏడు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌... అర్జెంటీనా జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్‌లు, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ లభించాయి. 46 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత జట్టు కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి. 2001లో, 2016లో విజేతగా... 1997లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌ 2005, 2021, 2023లలో కాంస్య పతక మ్యాచ్‌ల్లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగో ప్రయత్నంలో భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో నెగ్గడం విశేషం.ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు కాంస్య పతకం సాధించిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 5 లక్షలు... కోచింగ్‌ బృందంలోని వారికి రూ. 2 లక్షల 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. జర్మనీ 8వ సారి... మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీ జట్టు టైటిల్‌ నిలబెట్టుకుంది. ‘షూటౌట్‌’కు దారితీసిన ఫైనల్లో జర్మనీ 3–2 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ జట్టును ఓడించి ఎనిమిదోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. గతంలో జర్మనీ 1982, 1985, 1989, 1993, 2009, 2013, 2023లలో కూడా విజేతగా నిలిచింది.

Smriti Mandhana participated in the Amazon Sambhav Summit held in New Delhi6
క్రికెట్‌ తర్వాతే ఏదైనా: స్మృతి

న్యూఢిల్లీ: తన జీవితంలో క్రికెట్‌ కంటే ఇష్టమైనది మరొకటి లేదని భారత మహిళల క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్‌ సంభవ్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా స్మృతి మాట్లాడుతూ ... ‘నేను క్రికెట్‌ కంటే ఎక్కువ ప్రేమించే విషయం ప్రపంచంలో మరొకటి లేదు. భారత జెర్సీ వేసుకోవడం కన్నా పెద్ద గౌరవం ఏం ఉంటుంది. అది నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. సమస్యలన్నీ పక్కనపెట్టి లక్ష్యంపై దృష్టి సారించేందుకు ఉపకరిస్తుంది. చిన్నప్పుడు బ్యాట్‌ పట్టుకున్నప్పటి నుంచి నా మదిలో ఎప్పుడూ ప్రపంచ చాంపియన్‌గా ఎదగాలనే కోరిక ఉండేది. అది ఇటీవల నిజమైంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ నెగ్గడం మా జీవితంలో అతిగొప్ప క్షణం. ట్రోఫీ హస్తగతం అయిన సమయంలో కన్నీళ్లు ఆగలేదు’ అని స్మృతి వివరించింది.

Indian stars are in the top 2 of the ICC ODI rankings7
రోహిత్‌ వెనకాలే కోహ్లి

దుబాయ్‌: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్‌లో దంచికొట్టిన భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరాడు. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు దూరమైన శుబ్‌మన్‌ గిల్‌ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో ఉండగా... కేఎల్‌ రాహుల్‌ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్‌ కుల్దీప్‌ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (710 పాయింట్లు) ‘టాప్‌’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్‌’లో ఉండగా... యాషెస్‌ సిరీస్‌లో విజృంభిస్తున్న మిచెల్‌ స్టార్క్‌ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

India defeated Uruguay in the Womens Junior World Cup Hockey tournament8
‘షూటౌట్‌’లో భారత్‌దే పైచేయి

సాంటియాగో (చిలీ): మహిళల జూనియర్‌ ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు 9–10 స్థానాల కోసం పోటీపడనుంది. నాకౌట్‌ దశకు చేరుకోవడంలో విఫలమైన జ్యోతి సింగ్‌ బృందం వర్గీకరణ మ్యాచ్‌ల్లో రాణిస్తోంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3–1 గోల్స్‌ తేడాతో నెగ్గిన టీమిండియా... ఉరుగ్వేతో జరిగిన మరో వర్గీకరణ మ్యాచ్‌లో మాత్రం ‘షూటౌట్‌’లో విజయాన్ని అందుకుంది. నిర్ణీత సమయంలోనే గెలవాల్సిన భారత జట్టు మ్యాచ్‌ చివరి నిమిషంలో గోల్‌ సమర్పించుకొని ఆటను ‘షూటౌట్‌’ వరకు తీసుకెళ్లింది. మ్యాచ్‌ 19వ నిమిషంలో మనీషా చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 60వ నిమిషం వరకు ఆధిక్యంలో ఉన్న భారత్‌ చివరి సెకన్లలో ఉరుగ్వేకు గోల్‌ ఇచ్చింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ‘షూటౌట్‌’లో భారత్‌ తరఫున పూర్ణిమ యాదవ్, ఇషిక, కనిక సివాచ్‌ వరుసగా మూడు గోల్స్‌ చేశారు. మరోవైపు ఉరుగ్వే తరఫున తొలి షాట్‌ను అగస్టీనా గోల్‌గా మలచగా... జస్టినా రెండో షాట్‌ను.. సోల్‌ మార్టినెజ్‌ తీసుకున్న మూడో షాట్‌ను... సోల్‌ మిస్కా కొట్టిన నాలుగో షాట్‌ను భారత గోల్‌కీపర్‌ నిధి అడ్డుకుంది. దాంతో భారత్‌ నాలుగో షాట్‌ను తీసుకోకుండానే విజయాన్ని ఖరారు చేసుకుంది. 9–10వ స్థానాల కోసం స్పెయిన్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. మరోవైపు క్వార్టర్‌ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌ 8–2తో ఇంగ్లండ్‌పై, బెల్జియం 4–1తో అమెరికాపై, చైనా 5–3తో ఆ్రస్టేలియాపై, అర్జెంటీనా 2–1తో జర్మనీపై గెలుపొంది సెమీఫైనల్లోకి అడుగు పెట్టాయి. సెమీఫైనల్స్‌లో బెల్జియంతో నెదర్లాండ్స్‌; చైనాతో అర్జెంటీనా పోటీపడతాయి.

Root, Smith, Williamson headline ICC Test rankings, Starc moves up after sublime Gabba spell9
కోహ్లి ఒక్కడే మిస్‌ అయ్యాడు.. మిగతా ముగ్గురూ..!

ఐసీసీ తాజాగా (డిసెంబర్‌ 10) విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌, ఇంగ్లండ్‌ ప్లేయర్ల హవా కొనసాగింది. తాజాగా ఇరు జట్ల మధ్య యాషెస్‌ రెండో టెస్ట్‌ (పింక్‌ బాల్‌) జరగడమే ఇందుకు కారణం. ఆ టెస్ట్‌లో 8 వికెట్లతో చెలరేగిన ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌ అగ్రపీఠాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనలు చేసిన ఆసీస్‌ తాత్కాలిక సారధి స్టీవ్‌ స్మిత్‌ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి ఎగబాకగా.. ఆసీస్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ క్యారీ ఓ స్థానం మెరుగుపర్చుకొని 17వ స్థానానికి చేరాడు. టాప్‌-10లో ఉండిన ఆసీస్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ట్రవిస్‌ హెడ్‌, హ్యారీ బ్రూక్‌ తలో రెండు స్థానాలు కోల్పోయి 4, 7 స్థానాలకు పడిపోయారు.తాజాగా విండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన కేన్‌ విలియమ్సన్‌ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ లెక్కన చూస్తే.. టెస్ట్‌ల్లో ఫాబ్‌-4గా పిలువబడే వారిలో విరాట్‌ కోహ్లి మినహా మిగతా ముగ్గురు టాప్‌-3లో (రూట్‌, కేన్‌, స్టీవ్‌) ఉన్నారు. విరాట్‌ టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ర్యాంకింగ్స్‌లో అతని పేరే లేదు.ఈ వారం బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారీగా లబ్ది పొందిన వారిలో రచిన్‌ రవీంద్ర, టామ్‌ లాథమ్‌, జాక్‌ క్రాలే, షాయ్‌ హోప్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, మిచెల్‌ స్టార్క్‌ ఉన్నారు. విండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో రచిన్‌, లాథమ్‌ భారీ సెంచరీలతో కదంతొక్కి 15, 34 స్థానాలకు ఎగబాకగా.. ఆదే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీతో చెలరేగిన హోప్‌, గ్రీవ్స్‌ 48, 60 స్థానాలకు ఎగబాకారు.ఇంగ్లండ్‌తో రెండో యాషెస్‌ టెస్ట్‌లో బ్యాట్‌తోనూ రాణించిన మిచెల్‌ స్టార్క్‌ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 90వ స్థానానికి ఎగబాకగా.. అదే మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించిన జాక్‌ క్రాలే 6 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.బౌలింగ్‌ విషయానికొస్తే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో స్టార్క్‌తో (3 స్థానాలు ఎగబాకి) పాటు కీమర్‌ రోచ్‌ (5 స్థానాలు ఎగబాకి), బ్రైడన్‌ కార్స్‌ (4 స్థానాలు ఎగబాకి), జకరీ ఫౌల్క్స్‌ (9 స్థానాలు ఎగబాకి) లబ్ది పొందారు. అత్యుత్తంగా న్యూజిలాండ్‌ పేసర్‌ జేకబ్‌ డఫీ 76 స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరాడు. టాప్‌-2 బౌలర్లుగా బుమ్రా, మ్యాట్‌ హెన్రీ కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్‌, జడేజా, కుల్దీప్‌ వరుసగా 12 నుంచి 14 స్థానాల్లో ఉన్నారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. రవీంద్ర జడేజా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, జన్సెన్‌, స్టోక్స్‌ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో ఇద్దరు భారత ఆల్‌రౌండర్లు వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల​్‌య తలో స్థానం మెరుగుపర్చుకొని 11, 12 స్థానాలకు ఎగబాకారు.

Rare Incident in cricket, Wicket keeper intentionally not utilize the opportunity of stumping10
క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన.. వైరల్‌ వీడియో

క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడిని ఔట్‌ చేసే అవకాశం ఉన్నా ప్రత్యర్ధి ఆటగాడు ఔట్‌ చేయకుండా వదిలేశాడు. దీనికి కారణం ఏంటంటే.. సదరు ఆటగాడు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా వదిలేశాడు.విషయాన్ని అర్దం చేసుకున్న బ్యాటర్‌ తరఫున టీమ్‌, మరో బంతి చూసి ఆ ఆటగాడిని రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకుంది. క్రికెట్‌ చరిత్రలో అరుదుగా జరిగే ఇలాంటి ఘటన ప్రస్తుతం జరుగుతున్న ఇంట్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో జరిగింది.A RARE INCIDENT IN CRICKET 🤯- Batter was struggling in the ILT20, so Nicholas Pooran decided not to get him out when he had the opportunity for a stumping. pic.twitter.com/x2Ikca0VnL— Johns. (@CricCrazyJohns) December 10, 2025ఈ లీగ్‌లో భాగంగా నిన్న (డిసెంబర్‌ 9) డెజర్ట్‌ వైపర్స్‌-ఎంఐ ఎమిరేట్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో వైపర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు మ్యాక్స్‌ హోల్డన్‌ పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇది గ్రహించిన ప్రత్యర్ది జట్టు వికెట్‌కీపర్‌ నికోలస్‌ పూరన్‌ స్టంపౌట్‌ చేసే అవకాశమున్నా హోల్డన్‌ను ఔట్‌ చేయలేదు. బంతిని కనెక్ట్‌ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న హోల్డన్‌ మరికొద్ది సేపు క్రీజ్‌లో ఉంటే బంతులు వృధా చేయించవచ్చన్నది అతని ప్లాన్‌.అయితే పూరన్‌ ప్లాన్‌ను పసిగట్టిన వైపర్స్‌ కెప్టెన్‌ ఫెర్గూసన్‌ హోల్డన్‌ను రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించుకున్నాడు. ఈ తతంగం ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో జరిగింది. అప్పటికి వైపర్స్‌ స్కోర్‌ (118/1) చాలా తక్కువగా ఉండింది. హోల్డన్‌ క్రీజ్‌ను వీడాక కాస్త పుంజుకున్న వైపర్స్‌ స్కోర్‌ అంతిమంగా 159 పరుగులకు చేరింది.ఈ స్వల్ప లక్ష్య ఛేదనలోనూ ఎంఐ ఎమిరేట్స్‌ తడబడింది. ఓ దశలో సునాయాసంగా గెలుస్తుందనుకున్న ఈ జట్టు ఒకే ఓవర్‌లో (19) మూడు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనై పరాజయంపాలైంది. ఆఖరి ఓవర్‌లో గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. రషీద్‌ ఖాన్‌ వరుసగా సిక్సర్‌, బౌండరీ కొట్టి లక్ష్యానికి చేరువ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.చివరి బంతికి 2 పరుగులు చేయాల్సిన దశలో అర్వింద్‌ అద్భుతమైన త్రోతో ఎంఐ పుట్టి ముంచాడు. తొలి పరుగు పూర్తి చేసే లోపే అర్వింద్‌ డైరెక్ట్‌ త్రోతో ఘజన్‌ఫర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. 19వ ఓవర్‌లో 3 వికెట్లు సహా మ్యాచ్‌ మొత్తంలో 4 వికెట్లు తీసిన డేవిడ్‌ పేన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement