Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

South African Player Suspended By His Franchise1
మ్యాచ్‌ మధ్యలో ఫ్లైట్‌ ఎక్కి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్‌

దక్షిణాఫ్రికా దేశవాలీ క్రికెట్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. లయన్స్‌ అనే ఫ్రాంచైజీ తమ ఆల్‌రౌండర్‌ బేయర్స్‌ స్వానెపోల్‌ను సస్పెండ్‌ చేసింది. ఓ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ మధ్యలో వేదికను వదిలి వెళ్లిపోయినందుకు లయన్స్‌ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలుత బేయర్స్‌ గాయం కారణంగా మైదానాన్ని వీడాడని అంతా అనుకున్నారు. చివరికి అతను ఏకంగా వేదికనే వీడి యూకే విమానం ఎక్కినట్లు తెలిసింది. విషయం తెలిసి రిఫరి 10 మందితోనే మ్యాచ్‌ కొనసాగించాలని లయన్స్‌ను ఆజ్ఞాపించాడు. బేయర్స్‌ మైదానం వీడే సమయానికి మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. బేయర్స్‌ గైర్హాజరీలో లయన్స్‌ 10 మందితోనే మ్యాచ్‌ కొనసాగించలేక, చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో బేయర్స్‌ ఉండి ఉంటే, ఫలితం లయన్స్‌కు అనుకూలంగా వచ్చేది. ఆ మ్యాచ్‌లో బేయర్స్‌ బంతితో అద్భుతంగా రాణించి (3-44) లయన్స్‌ను మ్యాచ్‌లో నిలిపాడు. అయితే కీలక తరుణంలో హ్యాండ్‌ ఇచ్చి లయన్స్‌ ఓటమికి కారకుడయ్యాడు. ఇంతకీ బేయర్స్‌ అంత అర్జెంట్‌గా విమానం ఎక్కి యూకేకు ఎందుకు వెళ్లాడని ఆరా తీయగా.. అతను వోర్సెస్టర్‌షైర్‌ కౌంటీతో ఒప్పందంలో భాగంగా అలా చేశాడని తెలిసింది. ఆ విమానం మిస్‌ అయితే వోర్సెస్టర్‌షైర్‌తో ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందని అలా చేసినట్లు బేయర్స్‌ స్వయంగా చెప్పాడు.బేయర్స్‌ చర్యను చాలా సిరీయస్‌గా తీసుకున్న లయన్స్‌ యాజమాన్యం అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. బేయర్స్‌ అంత సాహసం ఎందుకు చేశాడని ఆరా తీయగా మరో సంచలన విషయం కూడా బయటపడింది. అతను క్రికెట్‌ సౌతాఫ్రికా నుంచి ఎన్‌వోసీ కూడా లేకుండానే యూకేకు పయనమైనట్లు తెలిసింది. ఈ చర్య వల్ల బేయర్స్‌ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం కూడా కోల్పోతాడు. బేయర్స్‌ కౌంటీ ఛాన్స్‌ కోసం చూసుకొని ఫ్రాంచైజీతో పాటు క్రికెట్‌ సౌతాఫ్రికా ఆగ్రహానికి గురయ్యాడు.ఈ మొత్తం ఉదంతంపై బేయర్స్‌ స్పందించాడు. లయన్స్‌ యాజమాన్యానికి, అభిమానులకు, క్రికెట్‌ సౌతాఫ్రికాకు క్షమాపణులు చెప్పాడు. ఈ కౌంటీ సీజన్‌ నాకు చాలా ప్రత్యేకం. అందుకే అలా చేయక తప్పలేదని వివరణ ఇచ్చాడు.

Who has done something similar for CSK: S Badrinath Slams management2
CSK యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్‌కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్‌కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్‌-2025 సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్‌-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్‌ వీర్‌, కార్తిక్‌ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్‌కే ఖర్చు చేసింది. వీరి ‍ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్‌ బదానీ, వేణుగోపాల్‌ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ప్రతి మ్యాచ్‌ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.సీఎస్‌కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్‌కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్‌మెంట్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడేఈ సందర్భంగా టీమిండియా స్టార్‌, దిగ్గజ పేస్‌ బౌలర్‌గా ఎదిగిన జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్‌ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్‌ కోచ్‌లుగా ఉన్నా.. జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్‌ రైట్‌. ఇలాంటి విషయాల్లో సీఎస్‌కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్‌ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్‌ విమర్శించాడు.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌

Mustafizur Rahman Scripts History In Pakistan After IPL Ignorance3
ఐపీఎల్‌ నిరాకరణ తర్వాత పీఎస్‌ఎల్‌లో చరిత్ర

బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ IPL 2026లో చోటు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఓ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. దాయాది లీగ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ లాహోర్‌ ఖలందర్స్‌కు ఆడుతున్న ముస్తాఫిజుర్‌.. నిన్న (ఏప్రిల్‌ 9) ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 డాట్‌ బాల్స్‌ వేయడంతో పొట్టి క్రికెట్‌లో అత్యంత అరుదైన 3000 డాట్‌ బాల్స్‌ మైలురాయిని అధిగమించాడు. తద్వారా పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ముస్తాఫిజుర్‌కు ముందు డ్వేన్‌ బ్రావో (3681), మొహమ్మద్‌ ఆమిర్‌ (3348), ఆండ్రీ రస్సెల్ (3213), సోహైల్‌ తన్వీర్‌ (3046) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముస్తాఫిజుర్‌ 3000 డాట్‌ బాల్స్‌ మైలురాయిని తాకిన మ్యాచ్‌లో అతని జట్టు లాహోర్‌ ఖలందర్స్‌ ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఖలందర్స్‌ 18.3 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఇస్లామాబాద్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఖలందర్స్‌ను కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను ఇస్లామాబాద్‌ 10.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతుపాడుతూ ఛేదించింది. డెవాన్‌ కాన్వే (59) అజేయ అర్ద సెంచరీతో ఇస్లామాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే, ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి అత్యంత సున్నితమైన పరిణామాల మధ్య తొలగించారు. 2026 సీజన్‌ కోసం​ జరిగిన వేలంలో అతన్ని కేకేఆర్‌ రూ. 9.2 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకోగా.. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జియో పొలిటిలక్‌‌ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ అతని ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దీంతో ముస్తాఫిజుర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో లాహోర్‌ ఖలందర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు.

PSL 2026: David Warner out for golden duck after drunk and drive arrest4
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌.. వార్నర్‌ పరిస్థితి ఇదీ!

స్వల్ప విరామంలో స్వదేశానికి వెళ్లి, అనూహ్య పరిణామాల మధ్య డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్టైన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌.. రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ చేతులెత్తేసి తన జట్టు ఘోర పరాజయానికి కారకుడయ్యాడు.నిన్న (ఏప్రిల్‌ 9) పెషావర్‌ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ తొలి బంతికే గోల్డెన్‌ డకౌటై నిరాశపరిచాడు. అతని జట్టు 247 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసి 87 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 159 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.డ్రింక్‌ అండ్ డ్రైవ్‌ కేసులో బెయిల్‌పై విడుదలై పాకిస్తాన్‌కు వచ్చిన వార్నర్‌ ఇంకా ఆ తాలూకా బాధలోనే ఉన్నట్లు స్పష్టంగా తెలిసింది. అతనిలో పూర్వపు జోష్‌ కనిపించలేదు. ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి. వ్యక్తిగతంగానూ డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ ఘటనకు ముందు వార్నర్‌ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ, ఓ కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు.అయితే డి అండ్‌ డి కేసులో అరెస్ట్‌ తర్వాత వార్నర్‌ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పాక్షిక ఉపశమనం పొందినప్పటికీ.. మే 7న సిడ్నీ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కొద్ది రోజుల కిందట వ్యక్తిగత పనుల నిమిత్తం స్వదేశానికి వెళ్లిన వార్నర్‌ డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో వార్నర్‌ రక్తంలో ఆల్కహాల్‌ స్థాయి 0.104గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధ పరిమితి కంటే రెండింతలు ఎక్కువ. దీంతో పోలీసులు వార్నర్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆతర్వాత కేసు నమోదు చేశారు. వార్నర్‌ అరెస్ట్‌పై క్రికెట్‌ సమాజంలో చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ డొమినిక్‌ కార్క్‌ వార్నర్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. జట్టు విజయవంతంగా ఉన్నప్పుడు ఆటగాళ్లకు సెలవులు ఇ‍వ్వకూడదని అన్నాడు. ఇది జట్టు మోమెంటమ్‌ను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు.

LSG Mukul Choudhary Creates Unprecedented IPL Records Vs KKR Match5
రికార్డులు కొల్లగొట్టిన రాజస్తాన్‌ చిన్నోడు!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా లక్నో సూపర్‌జెయిం‍ట్స్ యువ కెరటం ముకుల్ చౌదరి కూడా అదే జాబితాలో చేరాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 54 పరుగులు నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి లక్నోకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆ రికార్డులేంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముకుల్ చౌదరి ఏడు సిక్సర్లు బాదాడు. ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన తొలి లక్నో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సరసన చేరాడు. బ్రావో ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాదాడు.ఇదే మ్యాచ్‌లో ముకుల్‌ చౌదరి.. అవేశ్‌ఖాన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. తద్వారా ఐపీఎల్‌లో టార్గెట్‌ను విజయవంతంగా ఛేదించిన జట్లలో లక్నోకు 8వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం అని చెప్పొచ్చు.ఇక లక్నో సూపర్‌జెయింట్స్‌కు కేకేఆర్‌పై ఇది ఐదో విజయం. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో తలపడితే అందులో ఈడెన్ గార్డెన్స్ వేదికగానే లక్నో నాలుగు మ్యాచ్‌లు గెలవడం విశేషం.చదవండి: భార్యతో కలిసి చెట్టాపట్టాల్‌.. ఐపీఎల్‌కు డుమ్మా!

Yuvraj Singh Reacts To Stuart Broad Throwing His Signed Jersey Dustbin6
అతడికి నాపై కోపం పోలేదు: యువరాజ్‌ సింగ్‌

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. టీ20 ప్రపంచకప్‌-2007లో తన అద్భుత ప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా యువీ ఫీట్‌ నమోదు చేయగా.. అతడి బాధితుడిగా స్టువర్ట్‌ బ్రాడ్‌ అపవాదు మూటగట్టుకున్నాడు.దిగ్గజ పేస్‌ బౌలర్లలో ఒకడిగాఅయితే, ఆ తర్వాత బ్రాడ్‌ ప్రపంచంలోని దిగ్గజ పేస్‌ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. అయినప్పటికీ అతడి కెరీర్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఆ కోపంలోనే ఆరోజు బ్రాడ్‌.. యువీ సంతకం చేసిన జెర్సీని చెత్తకుండీలో పారేశాడట.ఈ విషయాల గురించి యువరాజ్‌ సింగ్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘టీ20 ఫార్మాట్లో అప్పటికి స్టువర్ట్‌ బ్రాడ్‌కు అంతగా అనుభవం లేదని అనుకుంటాను. కానీ ఆ తర్వాత అతడు దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌గా ఎదిగాడు. టెస్టు క్రికెట్‌లో 600కు పైగా వికెట్లు పడగొట్టాడు.నా కుమారుడి కెరీర్‌ నాశనంఆరోజు తనలో పెరిగిన కసితో ఉన్నత శిఖరాలకు ఎదిగాడు. స్టువర్ట్‌ వాళ్ల నాన్న క్రిస్‌ బ్రాడ్.. టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన సమయంలో నా దగ్గరికి వచ్చాడు. ‘నువ్వు నా కుమారుడి కెరీర్‌ను దాదాపుగా నాశనం చేసేశావు’ అన్నాడు.ఇందుకు బదులుగా.. ‘సర్‌.. నేను నాకోసమే సిక్సర్లు బాదాను. అయితే, బౌలర్‌కు ఆ అనుభవం ఎలా ఉంటుందో నేను ఊహించగలను’ అని చెప్పాను. అప్పుడు ఆయన.. ‘స్టువర్ట్‌ కోసం నువ్వు షర్ట్‌పై సంతకం చేయాలి’ అని కోరాడు.డస్ట్‌బిన్‌లో పడేశాడటఅప్పుడు నేను..‘నా టీమిండియాపై జెర్సీపై.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సమర్పించుకున్న ఆటగాడిగా నాకూ అనుభవం ఉంది. అయితే, నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతావు’ అని రాశాను. అయితే, క్రిస్‌ ఆ షర్టును స్టువర్ట్‌కు ఇచ్చినపుడు అతడు దానిని డస్ట్‌బిన్‌లో పడేశాడని ఇటీవలే చదివాను.అతడు కోపంలో ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి ఇది ఆమోదయోగ్యనీయమే’’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌తో యూట్యూబ్‌ చాట్‌ సందర్భంగా యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. Look out in the crowd!On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6— ICC (@ICC) September 19, 2021కాగా 2007లో ఐసీసీ తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ధోని సారథ్యంలోని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో.. తాజాగా 2026లో సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో భారత్‌ పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ముద్దాడింది.‌చదవండి: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

Pakistan Announces Historic Bilateral Series For The 1st Time vs This Team7
చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్‌

పాకిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా మహిళల ద్వైపాక్షిక సిరీస్‌ జరగనుంది. జింబాబ్వే మహిళల జట్టు 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ మహిళల క్రికెట్‌ అభివృద్ధిలో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈ సిరీస్‌లు మే 3 నుంచి 15 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వన్డే సిరీస్‌ ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ 2025-29లో భాగంగా జరుగనుండగా.. టీ20 సిరీస్‌ సాధారణంగా సిరీస్‌గా పరిగణించబడుతుంది. అన్ని (వన్డే, టీ20) మ్యాచ్‌లు కరాచీ నేషనల్‌ బ్యాంక్‌ స్టేడియంలో జరగనున్నాయి.షెడ్యూల్‌.. - మే 3 – తొలి వన్డే - మే 6 – రెండో వన్డే - మే 9 – మూడో వన్డే - మే 12 – తొలి టీ20 - మే 14 – రెండో టీ20 - మే 15 – మూడో టీ20 జింబాబ్వే తొలిసారి ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటోంది. ఈ సిరీస్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగం కావడంతో 2029 వరల్డ్‌కప్‌ అర్హతపై ప్రభావం చూపుతుంది. మహిళల ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ 8, జింబాబ్వే 11వ స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్‌ ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో సిరీస్‌ కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జింబాబ్వే ఇటీవల న్యూజిలాండ్‌ చేతిలో అన్ని మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, అట్టడుగు స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇరు జట్లు ఈ సిరీస్‌లో పాయింట్లు సాధించి, ర్యాంకింగ్స్‌ మెరుగుపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. జింబాబ్వే పరిమిత ఓవర్ల సిరీస్‌ల అనంతరం పాకిస్తాన్‌ ఐర్లాండ్‌ టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో పాక్‌, ఐర్లాండ్‌తో పాటు వెస్టిండీస్‌ భాగం కానుంది. ఈ టోర్నీ మే 28 నుంచి ప్రారంభమవుతుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ 2025-29 పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్‌ జట్లు టాప్‌-5లో ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Will Jacks Ditches Mumbai Indians His Wife Shares Cryptic Post IPL 20268
భార్యతో కలిసి చెట్టాపట్టాల్‌.. ఐపీఎల్‌కు డుమ్మా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పడుతూ లేస్తూ తన ప్రయాణం కొనసాగిస్తోంది. విజయంతో సీజన్‌ను ఆరంభించినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్‌కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఎందుకు ఆడడం లేదన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది. ఈ వారంలోపూ విల్ జాక్స్ ముంబై ఇండియన్స్‌తో చేరతాడని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విల్ జాక్స్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే విల్ జాక్స్ తన భార్య అనా బ్రుమ్‌వెల్‌తో కలిసి పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అంతేకాదు జాక్స్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎంజాయింగ్ హాలిడే ట్రిప్‌’ పేరిట స్టోరీని షేర్ చేసుకోవడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఈ లెక్కన విల్ జాక్స్ ఇప్పట్లో ఐపీఎల్‌లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్లేనని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అమెరికన్ సింగర్ అలెక్స్ వారెన్ మ్యూజిక్ కన్సర్ట్‌కు జాక్స్ తన భార్యతో కలిసి హాజరయ్యేందుకే పారిస్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఇక ఫ్రాన్స్‌లో అడుగుపెట్టడానికి ముందు మొరాకోలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేశారు. కాగా విల్ జాక్స్ ఈ ఏడాది యాషెస్ సిరీస్ సమయంలోనే తన స్కూల్ ఫ్రెండ్ అయిన అనా బ్రూమ్‌వెల్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అయితే విల్‌కు 14 ఏళ్ల వయసులోనే వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే, అసలే రెండు వరుస ఓటములతో ఢీలా పడిన ముంబై ఇండియన్స్‌కు విల్ జాక్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిస్తే ఏమవుతుందో అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే విల్ జాక్స్ విషయమై ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మహేల జయవర్దనే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం స్పందించాడు. ‘విల్ జాక్స్ త్వరలోనే జట్టుతో చేరుతాడని ఆశిస్తున్నా’ అంటూ తెలిపాడు. 2025 ఐపీఎల్ సీజన్‌లో విల్ జాక్స్ ముంబై ఇండియన్స్ తరఫున 233 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ లేకపోవడం వల్ల ముంబై జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. విల్‌ జాక్స్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్‌లో ఆఫ్గన్ ఆటగాడు అల్లాఘన్‌జఫర్‌ను ఆడించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో మ్యాచ్‌లో అతడిని తొలగించి మిచెల్ శాంట్నర్‌కు అవకాశమిచ్చారు. ఇక మూడో మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. విల్ జాక్స్ జట్టులో చేరితే మాత్రం ఆల్‌రౌండర్‌గా తన పాత్రకు న్యాయం చేయగలడని ముంబై ఇండియన్స్ ఆశిస్తోంది. ముంబై తన తదుపరి మ్యాచ్‌ ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది.No way my bruh Will Jacks is roaming in the streets of Paris 😭 https://t.co/OpZ8tjzYkw pic.twitter.com/atrDFVqePs— Mumbai Indians FC (@MIPaltanFamily) April 9, 2026చదవండి: ‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’

Langers Scariest batter in India prophecy on Mukul Choudhary comes true9
‘భారత్‌లోనే ప్రమాదకర బ్యాటర్‌.. ఈ మ్యాచ్‌తో నిరూపించాడు’

ముకుల్‌ చౌదరి.. ఒక్క మ్యాచ్‌తో భారత క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయిందీ పేరు. ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో గురువారం నాటి పోరులో.. ఈ లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో విజయానికి 32 బంతుల్లో 57 పరుగులు అవసరం కాగా... ఇందులో 54 తానొక్కడే చేశాడు.27 బంతుల్లోకోల్‌కతా విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ముకుల్‌ చౌదరి.. 27 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా లక్నోను విజయతీరాలకు చేర్చి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో లక్నో హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ముకుల్‌ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా.. ‘‘వచ్చే నాలుగు నెలల్లో ఇండియాలోనే ఆరు లేదంటే ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ముకుల్‌ ఎదగడం ఖాయం’’ అని లాంగర్‌ అన్నాడు.What JL said 🧿 pic.twitter.com/c7y4oI4Sgn— Lucknow Super Giants (@LucknowIPL) April 9, 2026ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతాతో మ్యాచ్‌ సందర్భంగా ముకుల్‌ గురించి లాంగర్‌ చెప్పిన మాటలు నిజమయ్యాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ ముకుల్‌ చౌదరి?రాజస్తాన్‌కు చెందిన 21 ఏళ్ల వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముకుల్‌ చౌదరి జైపూర్‌ అకాడమీలో శిక్షణ పొందాడు. ముందుగా పేస్‌ బౌలర్‌గా మొదలు పెట్టినా... అకాడమీలో వికెట్‌ కీపర్లు లేకపోవడంతో ఆ వైపు దృష్టి సారించాడు. అండర్‌–23 టోర్నీలో 102 సగటుతో 617 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.ఇక దేశీ టీ20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 199 స్ట్రయిక్‌రేట్‌తో 173 పరుగులు చేయడంతో ఐపీఎల్‌లో లక్నో రూ. 2.60 కోట్లకు తీసుకుంది. ‘వచ్చే నాలుగైదు నెలల్లో ఇతను ఆరు లేదా ఏడో స్థానంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్‌గా ఎదగడం ఖాయం’ అని లాంగర్‌ ఐపీఎల్‌కు ముందు వ్యాఖ్యానించగా... ఇప్పుడు తన సిక్సర్లతో ముకుల్‌ దానిని నిరూపించడం విశేషం. This is 𝐂𝐈𝐍𝐄𝐌𝐀 🫡🤯 pic.twitter.com/JTxw0DUgqM— Lucknow Super Giants (@LucknowIPL) April 10, 2026చదవండి: Yuvraj Singh: ‘ఆర్నెళ్లకు మించి బతకడం కష్టం.. గుండెపోటు రావొచ్చు’

Minerva Academy Owner- Football Coach Ranjit Bajaj Emotional Words10
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టును చూడాలి’

క్రికెట్‌తో పోలిస్తే భార‌త్‌లో ఫుట్‌బాల్‌కు ఆద‌ర‌ణ త‌క్కువే. బైచుంగ్ భుటియా, సునీల్ ఛెత్రీ.. ఈ ఇద్ద‌రే భార‌త్ ఫుట్‌బాల్‌లో కాస్త తెలిసిన ముఖాలు. అస‌లు మ‌న‌కంటూ ఒక ఫుట్‌బాల్ టీం ఉంద‌న్న సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు. పాశ్చాత్య దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఉండే క్రేజ్ వేరు. క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఎలాగూ ఫుట్‌బాల్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ కూడా అలాంటిదే. ఇంకా చెప్పాలంటే ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ కంటే ఎక్కువే అని చెప్పొచ్చు. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఒక్క‌సారైనా ఆడాల‌ని చాలా దేశాలు క‌ల‌లు కూడా కంటాయి.ఈ నేప‌థ్యంలోనే దేశ‌వాలీలో ఫుట్‌బాల్ ఆట‌కు మ‌ళ్లీ తిరిగి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు త‌న వంతు కృషి చేస్తున్న‌ట్లు మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ ఓన‌ర్‌, కోచ్‌ రంజిత్ బ‌జాజ్ వెల్ల‌డించారు. తాను చ‌నిపోయేలోగా భార‌త సీనియ‌ర్ జ‌ట్టును ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో చూస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయంగా భారత్‌ను ఫుట్‌బాల్‌లోనూ ఉన్నతస్థాయికి చేర్చడమే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు తెలిపారు.ఇటీవ‌లే అండ‌ర్‌-15 మెడిటేరియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ క‌ప్ (ఎంఐసీ)లో భార‌త్‌కు చెందిన మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది. ముఖ్యంగా ప్రిక్వార్ట‌ర్స్‌లో మిన‌ర్వా జ‌ట్టు 6-0 తేడాతో లివ‌ర్‌పూల్ జ‌ట్టును ఓడించి సంచ‌ల‌నం సృష్టించింది. ఎంఐసీ క‌ప్‌లో తొలిసారి ఆడుతున్న‌ప్ప‌టికీ ఏ బెరుకు లేకుండా ఆడిన మిన‌ర్వా జ‌ట్టు క్వార్టర్స్‌లో ఓడిన‌ప్ప‌టికీ టోర్నీని ఐదో స్థానంతో ముగించి బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న న‌మోదు చేసింది.అయితే మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ ఏర్పడడం వెనుక ఆ జ‌ట్టు కోచ్‌ రంజిత్ బ‌జాజ్ చాలా ఏళ్ల శ్ర‌మ దాగుంది. తాజాగా చందాలు పోగు చేసి మ‌రీ త‌న జ‌ట్టును స్పెయిన్‌లో జ‌రిగిన ఎంఐసీ క‌ప్ ఆడేందుకు పంపించ‌డం గ‌మ‌నార్హం. అయితే మార్చి 16న మిన‌ర్వా క్ల‌బ్ జ‌ట్టును పంపించ‌డానికి ముందు రంజిత్ బ‌జాజ్ ఒక వీడియోను పంచుకున్నారు. అందులో ఆయ‌న ఇచ్చిన సందేశం ప్ర‌తీ ఒక్క‌రిని కంట‌త‌డి పెట్టించేలా ఉంది. మొత్తం జ‌ట్టును స్పెయిన్‌కు పంపేందుకు త‌న ఆస్తులను అమ్మిన‌ప్ప‌టికీ మ‌రో కోటి రూపాయ‌లు త‌క్కువ ప‌డింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా డ‌బ్బు స‌హాయం అంద‌జేయాలని త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరారు. ఆయ‌న ఫాలోవ‌ర్లంతా ఈ విష‌యాన్ని షేర్ చేసి 27 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆయ‌న‌కు అంద‌జేశారు. మొత్తంగా ఎలాగోలా త‌న జ‌ట్టును ఎంఐసీ క‌ప్ ఆడేందుకు పంపించారు. View this post on Instagram A post shared by Ranjit Bajaj (@ranjitbajaj)మిన‌ర్వా ఫుట్‌బాల్ క్ల‌బ్ జ‌ట్టు 2022లో మెనా కప్‌, 2023లో బ్రెజిల్‌ను ఓడించి గోథియా కప్‌ను కైవ‌సం చేసుకుంది. కానీ స‌రైన ఫండ్స్ లేక‌పోవ‌డంతో 2024లో ఒక్క టోర్నీ కూడా ఆడ‌లేక‌పోయింది. ఇది భార‌త్‌లోని ప్ర‌తిభావంత‌మైన ఫుట్‌బాల్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని రంజిత్ బ‌జాజ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.ఎవ‌రీ రంజిత్ బ‌జాజ్‌?రంజిత్ బజాజ్ (Ranjit Bajaj) భారత ఫుట్‌బాల్ రంగంలో, ముఖ్యంగా గ్రాస్‌రూట్ స్థాయిలో ప్రతిభను గుర్తించి వారిని ఆటగాళ్లుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చండీగఢ్‌లో మినర్వా అకాడమీ నెలకొల్పి యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తూ భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. సందేశ్ జింగాన్‌, కమల్‌జిత్ సింగ్‌, జీక్సన్ సింగ్ (ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున మొదటి గోల్ చేసిన ఆటగాడు) వంటి ప్రముఖ ఆటగాళ్లంతా ఈయన అకాడమీ నుంచే వచ్చారు. భారత ఫుట్‌బాల్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువతకు అవకాశం కల్పించడం కోసం ఆయన తన ఆస్తులను (భార్య బంగారు ఆభరణాలు) సైతం తాకట్టు పెట్టి అకాడమీని నడిపారు. త‌న‌కు ఎవ‌రు స‌హాయం చేసేందుకు ముందుకు రానప్పటికీ 2020 నుంచి మినర్వా అకాడమీ తరఫున 250 మందికి పైగా ఆటగాళ్లకు వంద శాతం స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దారు. తాను చనిపోయేలోగా భారత సీనియర్ జట్టు ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనేలా చూడడమే తన కల అని రంజిత్ బజాజ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి ఆయన కల నెరవేరాలని ఆశిద్దాం.ఫుట్‌బాల్‌లోనూ స్వర్ణయుగం..ఒకప్పుడు ఆసియాలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించబడిన మ‌న ఫుట్‌బాల్ టీం 1950 నుంచి 1960 మ‌ధ్య స్వర్ణయుగాన్ని చూసింది. హైద‌రాబాద్‌కు చెందిన‌ సయ్యద్ అబ్దుల్ రహీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భారతదేశం 1951, 1962 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను గెలుచుకోవ‌డంతో పాటు 1956 ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి ఔరా అనిపించింది. అయితే భారత జట్టు ఎప్పుడు ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనలేదు.కానీ 1950 ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం క్వాలిఫికేషన్ గ్రూప్‌లోని ఇతర దేశాలన్నీ వైదొలగడంతో 1950 ప్రపంచ కప్‌కు డిఫాల్ట్‌గా అర్హత సాధించింది. అయితే, టోర్నమెంట్ ప్రారంభానికి ముందే భారత్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. భారత జట్టు ఆసియా ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ అయిన ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో ఐదుసార్లు పాల్గొని , 1964 లో రన్నరప్‌గా నిలిచింది .దక్షిణాసియాలో పాపులర్ టోర్నీగా పిలవబడే దక్షిణాసియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ కప్‌ (శాప్-SAFF) కప్‌లో అజేయమైన టీమ్‌గా రికార్డు ఉంది. 1993లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నమెంట్‌ను భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలుచుకుంది.🚨 India’s Minerva Football Club thrashed Liverpool FC 6–0. 🗿Man, Indian football has serious potential.Completely outplayed and knocked out Liverpool and reached the QF in the MIC Cup 2026 U-15 — pure attitude.Proud moment for India 🇮🇳 pic.twitter.com/DEibSGT7YR— Sonu (@Cricket_live247) April 3, 2026చదవండి: వారెవ్వా మినర్వా.. తొలిసారి ఆడినా అదరగొట్టింది!

Advertisement
Advertisement
 
Advertisement