Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India and West Indies will clash today in the T20 World Cup 20261
సెమీఫైనల్‌ లక్ష్యంగా...

టి20 ప్రపంచ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తమ టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో కఠిన పరీక్షకు సిద్ధమైంది. సెమీస్‌లో చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్, హిట్టర్లకు మారుపేరైన వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లు ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తయి జింబాబ్వేపై ఘన విజయాలు సాధించి సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. 2024 టి20 వరల్డ్‌ కప్‌నుంచి ఇరు జట్ల మధ్య ఒక్క మ్యాచ్‌ కూడా జరగలేదు. అయితే అనుభవంలో మేటిగా ఉన్న టీమిండియా ఎలా పైచేయి సాధిస్తుందా అనేది ఆసక్తికరంకోల్‌కతా: టి20 వరల్డ్‌ కప్‌లో రెండు సార్లు విజేతలుగా నిలిచిన జట్లు ఈ సారి టోర్నీ కీలక దశలో ముఖాముఖీకి సన్నద్ధమయ్యాయి. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ‘క్వార్టర్‌ ఫైనల్‌’లాంటి పోరులో నేడు (ఆదివారం) వెస్టిండీస్‌ను భారత్‌ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌ చేరుకుంటుంది. ఓడిన టీమ్‌ టోర్నీనుంచి నిష్క్రమిస్తుంది. అయితే రన్‌రేట్‌లో ప్రత్యర్థికంటే భారత్‌ కాస్త వెనుకబడి ఉంది. ఒక వేళ ఊహించని విధంగా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడం జరిగితే విండీస్‌ ముందంజ వేస్తుంది. అయితే ఈ అంచనాలను పక్కనపెడితే... వరల్డ్‌ కప్‌లో రెండు టీమ్‌లూ సిక్సర్లతో చెలరేగాయి. మరోసారి మైదానంలో భారీ మోత ఖాయంగా కనిపిస్తోంది. మార్పుల్లేకుండా... జింబాబ్వేపై చెలరేగిన భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. మేనేజ్‌మెంట్‌ కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తండ్రి మరణం తర్వాత రింకూ సింగ్‌ మళ్లీ జట్టుతో చేరినా...అతనికి అవకాశం దక్కకపోవచ్చు. మరో సారి అభిషేక్, సామ్సన్‌ ఓపెనర్లుగా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గత భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించిన సామ్సన్‌ మరింత పెద్ద స్కోరు చేయాల్సి ఉంది.జింబాబ్వేపై కాస్త తగ్గి ఆడిన అభిషేక్‌ మళ్లీ తనదైన శైలిలో చెలరేగితే జట్టుకు శుభారంభం ఖాయం. తర్వాతి బ్యాటింగ్‌ భారాన్ని ఇషాన్, సూర్య మోస్తారు. పాండ్యా, దూబేల దూకుడు అదనపు బలం కాగా, అక్షర్‌ కూడా తన బ్యాటింగ్‌తో జట్టుకు కీలకం కాగలడు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉండటం జట్టు ప్రధాన బలం. బౌలింగ్‌లో కూడా మన టీమ్‌ పదునుగా ఉంది. స్పిన్‌ను పెద్దగా ఆడలేని విండీస్‌పై వరుణ్‌ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించగలడు. బుమ్రా, అర్ష్ దీప్ లు విండీస్‌ హిట్టర్లను ఆరంభంలో నిలువరిస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో రాణించేనా! వెస్టిండీస్‌ టీమ్‌ మొదటినుంచి తమ బ్యాటింగ్‌ బలాన్నే నమ్ముకుంది. ఒకరితో పోటీ పడి మరొకరు సిక్సర్లు బాదగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన మ్యాచ్‌లో కూడా ఎక్కువ పరుగులు సిక్సర్ల ద్వారానే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు ఆడే హిట్టర్లు బౌలర్లు ఎవరైనా ప్రత్యర్థి ఎవరైనా లెక్క చేయకుండా బౌండరీ దాటించడమే పనిగా ఆడుతున్నారు. హెట్‌మైర్, పావెల్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్‌... ఇలా అంతా భారీ షాట్లు ఆడేవారే. అంతా సమష్టిగా చెలరేగితే భారత్‌పై ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే భారత్‌తో పోలిస్తే విండీస్‌ బౌలింగ్‌ చెప్పుకోదగినట్లుగా లేదు. ఒక్క షామర్‌ జోసెఫ్‌ ఫర్వాలేదనిపించే బౌలర్‌ కాగా...ఫోర్డ్, మోతీ, హోల్డర్, ఛేజ్‌ మన బ్యాటర్లను నిలువరించలేరు. అందుకే జట్టు భారీ స్కోరు సాధించడంపైనే గురి పెట్టింది. 2016 టి20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత వెస్టిండీస్‌ మరే ఐసీసీ ఈవెంట్‌లో కూడా సెమీఫైనల్‌ చేరలేకపోయింది.పిచ్, వాతావరణం ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బాగా పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. రద్దు గురించి భారత అభిమానులు భయపడుతున్నా... మ్యాచ్‌ రోజున ఎలాంటి వర్ష సూచన లేదు. 1983 నుంచి మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో 11 మ్యాచ్‌లలో తలపడిన వెస్టిండీస్‌ ఒక్కటీ గెలవలేదు. 2 టెస్టులు డ్రా కాగా మిగతా 9 సార్లు (4 టి20లు) ఓడింది.తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్ , బుమ్రా, వరుణ్‌. వెస్టిండీస్‌: షై హోప్‌ (కెప్టెన్), కింగ్, హెట్‌మైర్, పావెల్, ఛేజ్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్, హోల్డర్, ఫోర్డ్, మోతీ, జోసెఫ్‌. టి20 ప్రపంచకప్‌లో నేడుజింబాంబ్వే X దక్షిణాఫ్రికావేదిక: ఢిల్లీ, మ. 3 గంటల నుంచి భారత్‌ X వెస్టిండీస్‌వేదిక: కోల్‌కతా, రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Indian womens team third ODI against Australia today 2
ఆఖరి వన్డే గెలుస్తారా!

హోబర్ట్‌: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్‌ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ సేన జోరు మీదున్న ఆసీస్‌ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్‌కు వచ్చేసరికి భారత బ్యాటింగ్‌ తడబడుతోంది. టాపార్డర్‌లో స్మృతి మంధాన, మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్‌ బౌలింగ్‌కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్‌ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్‌లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్‌ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్‌వాష్‌ ఖాయమవుతుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్‌తో కట్టడి చేసి... బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్‌’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్‌)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్‌ చాంప్‌గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్‌’లో ప్రసారం

Jammu and Kashmir team wins Ranji Trophy with collective performance3
హిమ శిఖరాన

ఒకవైపు ఆహ్లాదాన్ని పంచే మంచు కొండలు... మరోవైపు కవ్వించే శత్రు మూకలు! పర్యాటకులకు భూతల స్వర్గం... స్థానికులకు నిత్య నరకం! ఇదీ ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌ పరిస్థితి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న అక్కడి యువత... ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో సంచలనం నమోదు చేసింది. మహామహా జట్లను మట్టికరిపిస్తూ... రంజీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలిచింది. 67 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే అదేదో సోమవారం ప్రారంభమై... శనివారం ముగిసిన ప్రక్రియ మాత్రం కాదు. దాని వెనకున్న కృషిని ఓ సారి పరిశీలిస్తే...లీగ్‌ దశలో జమ్మూకశ్మీర్‌ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రాజస్తాన్, ఢిల్లీ, హైదరాబాద్‌పై విజయాలతో గ్రూప్‌ ‘డి’లో రెండో స్థానంతో నాకౌట్‌కు చేరింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ముంబై చేతిలో మాత్రమే ఓడి మూడు మ్యాచ్‌లను ‘డ్రా’చేసుకోవడం ద్వారానే ‘ఈసారి వదిలి పెట్టేదే లేదు’అనే సంకేతాలు పంపింది. ఇప్పటి వరకు క్వార్టర్‌ ఫైనల్‌ దశ దాటిన అనుభవం లేని జమ్మూకశ్మీర్‌ జట్టు... ఈ సారి పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది. ఒక్కో ప్రత్యర్థి కోసం ఒక్కో వ్యూహాన్ని రచించడమే కాకుండా... దాన్ని మైదానంలో పకడ్బందీగా అమలు చేసి ఫలితం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌ను మట్టికరిపించిన జమ్మూ... సెమీస్‌లో బెంగాల్‌ను బెంబేలెత్తించింది. ఈ రెండు జట్లలో స్టార్‌ ఆటగాళ్లు ఉన్నా... జమ్మూ సమష్టి ప్రదర్శన ముందు నిలవలేకపోయాయి. ఫైనల్లో అయితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. కేఎల్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, దేవదత్‌ పడిక్కల్, మయాంక్‌ అగర్వాల్, ప్రసిధ్‌ కృష్ణ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్న కర్ణాటకపై ఐదు రోజుల పాటు ఏ దశలోనూ వెనక్కి తగ్గని జమ్మూ... నిజమైన చాంపియన్‌గా నిలిచింది. విజయాల వెనక ఆ ముగ్గురు దేశవాళీ ట్రోఫీలో దిగ్గజ జట్లను దాటుకుంటూ... జమ్మూకశ్మీర్‌ విజేతగా నిలవడం ఒక్కరోజులో సాధ్యమైందేమీ కాదు. క్రమశిక్షణ, కఠోర దీక్ష, సరైన ప్రణాళికతో సుదీర్ఘ కాలం పాటు చేసిన కృషికి దక్కిన ఫలితం. ఆ జట్టు ఈ స్థాయికి చేరడం వెనక ప్రధానంగా ముగ్గురి కృషి ఉంది. 2011లో జమ్మూ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన బిషన్‌ సింగ్‌ బేడీ... జట్టు దృక్పథాన్ని మార్చాడు. ఆయన శిక్షణలో రాటుదేలిన జమ్మూకశ్మీర్‌ జట్టు... 2013–14 సీజన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. అప్పటి నుంచి అడపాదడపా విజయాలు సాధించడం పరిపాటిగా మార్చుకుంది... ఆ తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌ మెంటార్‌గా ఉన్న సమయంలోనూ ఆ జట్టు క్వార్టర్స్‌కు చేరింది. అయితే మెరుగైన ఫలితాలు కావాలంటే మౌలిక వసతులు క ల్పించాలని సంక ల్పించింది మాత్రం ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌. 2021లో బీసీసీఐ నియమించిన సబ్‌ కమిటీలో సభ్యుడైన మిథున్‌... ఆ దిశగా అడుగులు వేశారు. ఆటగాళ్ల కోసం జిమ్, స్విమ్మింగ్‌పూల్‌ వంటి సౌకర్యాల మొదలు... అజయ్‌ శర్మ వంటి మేటి కోచ్‌ను నియమించాడు. దీంతో జమ్మూ కశ్మీర్‌ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అడపా దడపా విజయాలు సాధించే దశ నుంచి నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి చేరుకుంది. సమష్టి కృషితో నాలుగు పదుల వయసు దాటిన కెపె్టన్‌ పారస్‌ డోగ్రా సారథ్య చతురత... జమ్మూకశ్మీర్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించింది. దేశవాళీల్లో పదివేలకు పైగా పరుగులు సాధించిన అనుభవం ఉన్న పారస్‌ జట్టును ముందుండి నడిపించడంలో సఫలీకృతమయ్యాడు. 17 ఏళ్ల పాటు హిమాచల్‌ ప్రదేశ్, పాండిచ్చేరి జట్లకు ప్రాతినిధ్యం వహించి గతేడాదే జమ్మూ పగ్గాలు అందుకున్న డోగ్రా... ఆ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేశాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు కవ్విస్తున్నా సంయమనంతో ముందుకు సాగడమే కాకుండా... అవసరమైనప్పుడు దూకుడుతో ఆకట్టుకున్నాడు. అతడికి శుభమ్‌ పుండిర్, కమ్రాన్‌ ఇక్బాల్, సాహిల్‌ లోత్రా, కన్హయ్య వాధ్వాన్, అబ్దుల్‌ సమద్, శుభమ్‌ ఖజురియా చక్కటి సహకారం అందించారు. బౌలింగ్‌లో నజీర్, ఆబిద్‌ ముస్తాక్, సునీల్‌ కుమార్‌ సహకారంతో అఖీబ్‌ నబీ ఒక్కడే జట్టును లాక్కొచ్చాడు. అతనొక్కడే! జమ్మూకశ్మీర్‌ జట్టు నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆటగాళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్వేజ్‌ రసూల్‌ గురించే. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన అతడు... జట్టు బలోపేతానికి విశేష కృషి చేశాడు. ఆ తర్వాత అబ్దుల్‌ సమద్, ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి వాళ్లు వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శన చేసినా... దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్న ఘనత మాత్రం కుడిచేతివాటం పేసర్‌ అఖీబ్‌ నబీదే. గత రంజీ సీజన్‌లో 44 వికెట్లు పడగొట్టి... అందరి దృష్టి ఆకర్షించిన నబీ... ఈ సీజన్‌లో విశ్వరూపం కనబర్చాడు. 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థుల వెన్ను విరిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ అతడే. అందులో ఏడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చాడు. జమ్మూ జట్టు నిలకడైన విజయాలు సాధించడం వెనక అతడి కృషి ఎంతో ఉంది. పేస్‌కు కచ్చితత్వాన్ని జోడిస్తూ... అతడు సంధిస్తున్న బంతులకు ప్రత్యర్థుల దగ్గర సమాధానాలే కరువయ్యాయి. హైదరాబాదీ సిరాజ్‌ మాదిరిగా వరుసగా పది ఓవర్ల పాటు అలుపెరగకుండా ఒకే తీవ్రతతో బౌలింగ్‌ చేయగల సత్తా... ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల వైవిధ్యభరిత అ్రస్తాలు అతడి సొంతం. టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అఖీబ్‌ గత రెండు సీజన్‌లలో 104 వికెట్లు పడగొట్టి... సెలెక్టర్లకు తనని ఎంపిక చేయక తప్పని పరిస్థితి నెలకొల్పాడు. ఇప్పటికే మాజీలు చేబుతున్నట్లు... టీమిండియా తదుపరి ఆడబోయే తొలి టెస్టు మ్యాచ్‌ తుది జట్టులో అఖీబ్‌కు చోటు దక్కకపోతే ఆశ్చర్యమే!

Sri Lanka helps New Zealand to qualify for T20 World Cup semifinals4
గెలిచి ఇంటికి పాక్‌... సెమీస్‌కు న్యూజిలాండ్‌

పల్లెకెలె: శ్రీలంకతో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...మ్యాచ్‌ గెలవడం మాత్రమే కాకుండా లంకను 147 పరుగుల వరకే పరిమితం చేసి ఉంటే పాక్‌ సెమీఫైనల్‌కు చేరేది. కానీ తారిఖ్‌ వేసిన 16వ ఓవర్‌ ఐదో బంతికి షనక సింగిల్‌ తీయడంతో లంక స్కోరు 148 పరుగులకు చేరింది. దాంతో పాక్‌ ఆశలు గల్లంతయ్యాయి. ‘గ్రూప్‌ 2’లో పాక్‌కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లంకపై మ్యాచ్‌లో చివరకు 5 పరుగుల తేడాతో గెలిచినా పాక్‌ టోర్నీనుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (60 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు శతకం సాధించగా, ఫఖర్‌ జమన్‌ (42 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి పోరాడి ఓడింది. కెప్టెన్‌ షనక (31 బంతుల్లో 76 నాటౌట్‌; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) విరుచుకుపడగా, పవన్‌ రత్నాయకే (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఫర్హాన్, ఫఖర్‌ ధనాధన్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్‌లు ధనాధన్‌ ఆరంభమిచ్చారు. ఇద్దరు పోటీ పడి బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ పాక్‌ స్కోరును వాయువేగంతో పెంచారు. పవర్‌ప్లేలో 64/0 స్కోరు చేసిన పాకిస్తాన్‌... పదో ఓవర్‌ ముగియక ముందే 100కు చేరుకుంది. ఫర్హాన్‌ 32 బంతుల్లో, ఫఖర్‌ 27 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. ఓవర్‌కు 10 పైచిలుకు రన్‌రేట్‌ నమోదు చేసిన పాక్‌ 14వ ఓవర్లలోనే 150 పరుగుల మార్క్‌ దాటింది. 16వ ఓవర్‌ వేసిన చమీర ఎట్టకేలకు ఫఖర్‌ను బౌల్డ్‌ చేసి 176 పరుగుల ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. తర్వాత పాక్‌ వికెట్లు పేకమేడలా కూలాయి. నాఫే (2), షాదాబ్‌ (7), నవాజ్‌ (0), కెప్టెన్ సల్మాన్‌ (0) ఇలా వరుసగా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో వైపు 59 బంతుల్లో ఫర్హాన్‌ సెంచరీ పూర్తయింది. ఆశలు రేపిన షనక భారీ లక్ష్యఛేదనలో ఆతిథ్య లంక తడబడింది. నిసాంక (3), మిశార (26), అసలంక (25) వేగంగా ఆడేందుకు యత్నించి వికెట్లు పారేసుకున్నారు. దీంతో విజయానికి ఆమడ దూరంలో నిలిచింది. అయితే రత్నాయకే రాణించగా, కెప్టెన్ షనక అనూహ్యంగా ఆఖరి ఓవర్లో చెలరేగి గెలుపు ఆశలు పెంచాడు. 6 బంతుల్లో 28 పరుగుల అసాధ్యమైన సమీకరణం ఉండగా... షాహిన్‌ అఫ్రిది చివరి ఓవర్లో షనక వరుసగా 4, 6, 6, 6లతో 22 పరుగులు పిండుకున్నాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో స్టేడియమంతా మునివేళ్లపై నిలబడింది. కానీ ఒత్తిడికి గురైన షనక ఆ రెండు బంతులకు పరుగు తీయలేకపోవడంతో పాక్‌ గెలుపు ఖాయమైంది. స్కోరు వివరాలు పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫర్హాన్‌ (సి) లియనాగే (బి) మదుషంక 100; ఫఖర్‌ (బి) చమిర 84; ఖాజా నాఫే (సి) అసలంక (బి) మదుషంక 2; షాదాబ్‌ రనౌట్‌ 7; నవాజ్‌ (సి) తీక్షణ (బి) షనక 0; సల్మాన్‌ (సి) తీక్షణ (బి) షనక 0; ఉస్మాన్‌ నాటౌట్‌ 8; షాహిన్‌ అఫ్రిది (ఎల్బీడబ్ల్యూ) (బి) మదుషంక 4; నసీమ్‌ షా రనౌట్‌ 1; అబ్రార్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–176, 2–179, 3–198, 4–199, 5–199, 6–203, 7–207, 8–210. బౌలింగ్‌: మదుషంక 4–0–33–3, చమిర 4–0–48–1, తీక్షణ 4–0–35–0, షనక 4–0–42–2, వెల్లలాగే 3–0–37–0, లియనాగే 1–0–14–0. శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసాంక (సి) నవాజ్‌ (బి) నసీమ్‌ షా 3; మిశార (బి) అబ్రార్‌ 26; అసలంక (బి) అబ్రార్‌ 25; రత్నాయకె (సి) అయూబ్‌ (బి) అఫ్రిది 58; మెండిస్‌ (బి) అబ్రార్‌ 3; లియనాగే (బి) నవాజ్‌ 5; షనక నాటౌట్‌ 76; వెలలాగే నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–8, 2–33, 3–75, 4–94, 5–101, 6–162. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–48–1, నసీమ్‌ షా 4–0–36–1, అబ్రార్‌ 4–0–23–3, ఉస్మాన్‌ 4–0–43–0, నవాజ్‌ 2–0–21–1, షాదాబ్‌ 2–0–33–0.

Sahibzada Farhan becomes 1st batter to score multiple centuries in single edition of T20 World Cup5
చ‌రిత్ర సృ‍ష్టించిన పాక్ ఓపెనర్‌.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాకిస్తాన్ యువ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ప‌ల్లెక‌లే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌లో ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ నుంచే ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.కేవ‌లం 60 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్‌తో ప‌ర్హాన్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫ‌ర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫర్హాన్ 383 ప‌రుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.👉టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక‌ ఎడిష‌న్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా షిమ్రాన్ హెట్‌మైర్‌(17)ను ఫ‌ర్హాన్(18) అధిగ‌మించాడు.👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శ‌త‌కాలు బాద‌లేదు.👉అదేవిధంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓవ‌రాల్‌గా రెండు సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ స‌మం చేశాడు.

Pakistan end with 212, need to restrict Lanka under 1476
పాక్ ఓపెన‌ర్ల విధ్వంసం.. శ్రీలంక ముందు భారీ టార్గెట్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పల్లెకలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెన‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 212 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెన‌ర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫ‌ఖార్ జ‌మాన్ ఘ‌న‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్ద‌రూ తొలి వికెట్‌కు 176 ప‌రుగుల రికార్డు భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఫర్హాన్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 100 ప‌రుగులు చేశాడు.ఫర్హాన్‌కు ఈ టోర్నీలో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా జ‌మాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఓ ద‌శ‌లో పాక్ 250 ప‌రుగుల మార్క్ సునాయ‌సంగా దాటేలా క‌న్పించింది.అయితే ఆఖ‌రిలో వికెట్లు కోల్పోవ‌డంతో పాక్ 250 ప్ల‌స్ ప‌రుగులు సాధించ‌లేక‌పోయింది. శ్రీలంక బౌల‌ర్ల‌లో దిల్షాన్ మ‌ధుశంక మూడు, ష‌న‌క రెండు, చ‌మీరా త‌లా వికెట్ సాధించారు. పాకిస్తాన్ సెమీస్‌కు అర్హ‌త సాధించాలంటే శ్రీలంక‌ను 147 ప‌రుగుల లోపు క‌ట్ట‌డి చేయాలి.

J and K lift Ranji Trophy, CM Omar Abdullah announces massive cash reward for team7
రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్‌.. భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన సీఎం

భారత దేశవాళీ క్రికెట్‌లో స‌రికొత్త చ‌రిత్ర ఆవిష్కృతమైంది. జ‌మ్మూ కాశ్మీర్‌ 67 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ మొట్ట‌మొద‌టి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్‌ను జ‌మ్మూ కాశ్మీర్ కైవ‌సం చేసుకుంది.ఫైన‌ల్లో క‌ర్ణాటక‌పై జ‌మ్మూ విజ‌యం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసిన‌ప్ప‌టికి తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యప‌రంగా జే అండ్ కేను విజేత‌గా నిర్ణ‌యించారు. ఈ విజ‌యంతో జ‌మ్మూ కాశ్మీర్ అంతటా సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి. ఈ నేప‌థ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆట‌గాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయ‌న‌ హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివ‌రి రోజు ఆట చూసేందుకు స్టేడియం వ‌చ్చి త‌మ జ‌ట్టును ఉత్స‌హ‌ప‌రిచారు. ఈ క్ర‌మంలో విజ‌యం సాధించిన అనంత‌రం త‌మ ఆట‌గాళ్ల‌ను అబ్దుల్లా అభినందించారు.ఈ ఏడాది సీజ‌న్‌లో జ‌మ్మూ కాశ్మీర్ ప్లేయ‌ర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్ల‌తో ఈ సీజ‌న్ లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. ఫైన‌ల్లో కూడా 5 వికెట్లతో స‌త్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 ప‌రుగుల‌తో జ‌ట్టును ముందుండి న‌డిపించాడు.

T20 WC 2026: Srilanka opt to bowl, Pakistan make three changes8
శ్రీలంక‌తో చావో రేవో.. జ‌ట్టులో మూడు మార్పులు చేసిన పాక్‌

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్-2026 సూప‌ర్‌-8 లో భాగంగా కొలంబో వేదిక‌గా శ్రీలంక‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక ఇప్ప‌టికే సెమీస్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. పాక్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీల‌కం.పాక్ తొలుత బ్యాటింగ్ చేయ‌నున్నందున 65 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను ఓడించాలి. అప్పుడే న్యూజిలాండ్‌ను వెన‌క్కినెట్టి పాక్ సెమీస్‌కు అర్హ‌త సాధిస్తోంది. ఈ కీల‌క మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఖవాజా నఫే, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు.తుది జ‌ట్లుపాకిస్తాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీప‌ర్‌), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీప‌ర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

Auqib Nabi in Team India soon? Gets letter of recommendation from Ganguly9
అత‌డు అద్బుతాలు చేస్తాడు.. టీమిండియాకు ఎంపిక చేయండి: గంగూలీ

ఫిబ్ర‌వ‌రి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జ‌మ్మూ అండ్ కాశ్మీర్ త‌మ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదిక‌గా జ‌రిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్‌లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంలో ఆ జ‌ట్టు పేస‌ర్ ఆకిబ్‌ న‌బీ ధార్‌ది కీల‌క పాత్ర‌. ఈ సీజ‌న్ అసాంతం ఆకిబ్ న‌బీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.ఈ సీజన్‌లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైన‌ల్ మ్యాచ్‌లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల న‌బీ త‌న‌ స్వింగ్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌కు చుక్కలు చూపించాడు.మొత్తంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి క‌ర్ణాట‌క ఓట‌మిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాట‌ర్ల‌ను సైతం న‌బీ బోల్తా కొట్టించాడు. న‌బీ త‌న సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీని సైతం ఆక‌ర్షించాడు.రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాల‌ని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గంగూలీ అభిప్రాయ‌ప‌డ్డాడు."ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్‌లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్‌లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్‌లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

T20 WC South African legend brutally trolls NZ after their loss to England10
వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?: సాంట్నర్‌పై సౌతాఫ్రికా లెజెండ్‌ ఫైర్‌

ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతులెత్తేసింది. వ్యూహాలను అమలు చేసే క్రమంలో తడబడి ఓటమిని ఆహ్వానించింది. ఫలితంగా సెమీస్‌ చేరేందుకు మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చుకుంది. 159 పరుగులుకొలంబో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (35), ఫిన్‌ అలెన్‌ (29) ఫర్వాలేదనిపించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (39) రాణించాడు. మిగతా వారు స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కివీస్‌ 159 పరుగులు చేయగలిగింది.ఆదిలోనే ఎదురుదెబ్బలుఇంగ్లండ్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ రెండేసి వికెట్లు తీయగా.. లియామ్‌ డాసన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కివీస్‌ బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (2), జోస్‌ బట్లర్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (26)ను ఫిలిప్స్‌ తొందరగానే పెవిలియన్‌కు పంపాడు.ఆఖర్లో అంతా తలకిందులుఇక జేకబ్‌ బెతెల్‌ (21), సామ్‌ కర్రాన్‌ (24) నిరాశపరచగా.. టామ్‌ బాంటన్‌ (33) రాణించాడు. ఇలాంటి తరుణంలో కివీస్‌కు గెలుపు అవకాశాలు మెరుగు కాగా.. విల్‌ జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా 18వ ఓవర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకున్నారు. ఇక 19వ ఓవర్లో సాంట్నర్‌ బౌలింగ్‌లో 16 పరుగులు రాబట్టారు. ఇక ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. హెన్రీ బౌలింగ్‌లో రెండు సింగిల్‌, ఫోర్‌ బాది పని పూర్తి చేశారు.మొత్తంగా జాక్స్‌ 18 బంతుల్లో 32, రెహాన్‌ అహ్మద్‌ 7 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్‌ను గెలిపించారు. కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర మూడు, మ్యాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో ఫలితం తారుమారు కావడంతో కివీస్‌కు చేదు అనుభవం తప్పలేదు. శ్రీలంకతో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోతేనే న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరగలదు.వాళ్లతో బౌలింగ్‌ చేయిస్తావా?ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఖరి రెండు ఓవర్లలో కివీస్‌ అనుసరించిన వ్యూహాన్ని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఘాటుగా విమర్శించాడు. ‘‘18వ ఓవర్లో.. గెలుపు దోబూచులాడుతున్న వేళ.. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్న సమయంలో.. ఆఫ్‌ స్పిన్నర్‌లను ప్రయోగిస్తారా? ఇంతకంటే జోక్‌ ఉంటుందా?’’ అంటూ కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు గ్రేమ్‌ స్మిత్‌ చురకలు అంటించాడు.చదవండి: T20 WC: పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement