Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

You Will Be On Floor: Did Klaasen Warn Fan For Recording His Family Viral1
కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్‌ మాస్‌ వార్నింగ్‌!

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస విజయాల్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ది కీలక పాత్ర. దాదాపుగా ప్రతీ మ్యాచ్‌లోనూ నిలకడగా రాణిస్తూ.. కష్టాల్లో ఉన్న వేళ జట్టును ఆదుకుంటున్నాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. ఫ్రాంఛైజీ తనకోసం వెచ్చించిన రూ. 23 కోట్లకు తన ఆటతో న్యాయం చేస్తున్నాడు.414 పరుగులుఇప్పటికి ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి క్లాసెన్‌ 414 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగిన క్లాసెన్‌.. 30 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.తదుపరి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్‌ సన్నద్ధవుతున్నాడు. ఇదిలా ఉంటే.. క్లాసెన్‌ పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఉన్న దృశ్యాల ప్రకారం.. క్లాసెన్‌ తన కుటుంబంతో కలిసి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించాడు.నేను చెప్పేది జాగ్రత్తగా వినుఇందుకు క్లాసెన్‌ తనదైన శైలిలో గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు. ‘‘ఫొటోలు, వీడియోలు తీయొద్దు సరేనా!.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.. రికార్డు చేయొద్దు ఒకేనా!’’ అని క్లాసెన్‌ హెచ్చరించాడు. ఇందుకు సదరు వ్యక్తి.. ‘‘నీ జట్టును వదిలెయ్‌.. నువ్వు బాగా ఆడుతున్నావు’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులుగా.. ‘‘థాంక్యూ.. కానీ ఫొటో మాత్రం తీయొద్దు.POV: meeting a foreign cricketer in India…. Dude just give him and his family some privacy for gods sake.What a man Klaasy 🙏 cinema lo hero villain ki warning ela isthado ala ichadu 😂🔥 good man 🧡#SRH #IPL2026 pic.twitter.com/imwBT2c8wi— Varun Velamakanti 🦅 (@CricVarunSRH) April 30, 2026ఒకవేళ నేను అటు తిరగగానే నన్ను, నా కుటుంబాన్ని ఫొటో తీశావనుకో.. ఒట్టేసి చెబుతున్నా.. నువ్వు ఊహించని విధంగా బుద్ధి చెప్తా! దానిని నుంచి నువ్వు కోలుకోలేవు కూడా!.. నేను వెళ్తున్నా.. మళ్లీ చెప్తున్నా.. నీ కెమెరాలన్నీ పక్కనపెట్టు.. దయచేసి మమ్మల్ని ఫొటోలు తీయొద్దు’’ అని సున్నితంగానే కొట్టినంత పనిచేశాడు క్లాసెన్‌.అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!ఈ వీడియోపై ఆరెంజ్‌ ఆర్మీ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘క్లాసీ క్లాసెన్... ‘చెప్పినట్లు వినకుంటే.. అమ్మతోడు కిందపడేసి తొక్కుతా బిడ్డా!’ అని మాస్‌ స్టైల్లో వార్నింగ్‌ ఇచ్చాడు. నువ్వు తోపు అన్నా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని.. వారి గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని సదరు వ్యక్తికి చురకలు అంటిస్తున్నారు. కాగా సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటికి తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచింది. చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

Shubman Gill reveals how Kohli's burst sparked Gujarat Titans' comeback2
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్‌ మొత్తం వారికే: గిల్‌

ఐపీఎల్‌-2026లో గుజ‌రాత్ టైటాన్స్ ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గుజ‌రాత్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. మొద‌ట ఆర్సీబీని 155 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన గుజ‌రాత్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ స‌త్తాచాటింది.15.5 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది. ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన త‌మ బౌల‌ర్ల‌ను గిల్ కొనియాడాడు."కీల‌క మ్యాచ్‌లో విజ‌యం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ఇలాంటి వికెట్‌పై ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును 160 ప‌రుగులలోపు క‌ట్డ‌డి చేయ‌డం అంత సులువు కాదు. కానీ మా బౌల‌ర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్‌లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్ర‌తీ ఒక్క‌రూ జ‌ట్టు విజ‌యంలో త‌మ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవ‌ర్‌లో విరాట్ భాయ్ వ‌రుస బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు. కానీ ఆ త‌ర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అత‌డి వికెట్‌తో తిరిగి మేము గేమ్‌లోకి వ‌చ్చాము. నేనేమి ఈ మ్యాచ్‌లో ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ల‌తో బ‌రిలోకి దిగ‌లేదు. నేను ఒక రిథ‌మ్‌లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్‌లో ప‌డింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌల‌ర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జ‌ట్టులో కీల‌క స‌భ్యుడు. ఈ రోజు అత‌డు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడ‌నుకున్నా. కానీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్య‌త‌ను తెవాటియా తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 43 ప‌రుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

I felt umpire made mistake: Ex India Star on Patidar controversial dismissal3
అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే! అతడు అవుట్‌ కానేకాదు!

గుజరాత్‌ టైటాన్స్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది. ఐపీఎల్‌-2026లో భాగంగా గత శనివారం బెంగళూరు వేదికపై 205 పరుగులు చేసి కూడా గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమిని ఎదుర్కొంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లో సొంతగడ్డపై ‘రిటర్న్‌’ మ్యాచ్‌తో ఆర్సీబీని ఓడించింది. నాలుగు వికెట్ల తేడాతో పాటీదార్‌ సేనపై గెలుపొందింది.రీప్లేలో స్పష్టంగా కనిపించిందిఅయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య ఘటన వివాదానికి దారితీసింది. అర్షద్‌ బౌలింగ్‌లో ఆర్సీబీ సారథి రజత్‌ పాటీదార్‌ (19) పుల్‌ షాట్‌ కొట్టగా... డీప్‌ స్క్వేర్‌లెగ్‌ నుంచి పరుగెత్తుతూ వచ్చిన జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) ముందుకు దూకుతూ క్యాచ్‌ అందుకున్నాడు.అయితే హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన తర్వాత బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. తన ఎడమ చేతిలో బంతిని ఉంచుకున్న హోల్డర్‌ తనను తాను నియంత్రించుకునే క్రమంలో బంతిపైనే పూర్తిగా భారం వేసి మరీ పైకి లేచాడు.It’s heating up in Ahmedabad! 🔥#JasonHolder caught #RajatPatidar at the boundary, but the #RCB camp wasn’t convinced with the decision! 👀#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/GwfAoIelDj— Star Sports (@StarSportsIndia) April 30, 2026రిజర్వ్‌ అంపైర్‌తో కోహ్లి వాగ్వాదంఅయినప్పటికీ.. థర్డ్‌ అంపైర్‌ అభిజిత్‌ భట్టాచార్య మాత్రం బంతిని హోల్డర్‌ సరిగానే పట్టుకున్నాడని, బంతిని పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాడని భావిస్తూ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి, కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ రిజర్వ్‌ అంపైర్‌ పరాశర్‌ జోషితో గట్టిగా వాదించినా ఫలితం లేకుండా పోయింది.ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. పాటీదార్‌ అవుట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని అతడు తప్పుబట్టాడు. ‘‘నా దృష్టిలో హోల్డర్‌ పట్టింది అసలు క్యాచ్‌ కానేకాదు. క్రికెట్‌ చట్టంలోని 33.3 నియమం ప్రకారం..అంపైర్‌ది ముమ్మాటికీ తప్పే!బంతి ఒక్కసారి చేతిలోకి వచ్చినపుడు బాల్‌తో పాటు శరీరంపై కూడా ఆటగాడు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అప్పటి వరకు బంతి నేలను అ‍స్సలు తాకకూడదు. ఆ సమయంలో ఆటగాడి చేయి నేలకు తాకినా సరే.. బంతి మాత్రం అస్సలు నేలకు తాకకూడదు.జేసన్‌ హోల్డర్‌ క్యాచ్‌ పట్టిన వెంటనే జారిపడ్డాడు. స్లైడ్‌ అవుతున్న సమయంలో అతడి శరీరం చలనంలో ఉంది కాబట్టి అతడు తనను తాను పూర్తిగా నియంత్రించుకోలేకోయాడు. అప్పుడే బంతి నేలకు తాకింది. అప్పటికి అది ఇంకా డెడ్‌బాల్‌ కానేలేదు.కాబట్టి ఆ క్యాచ్‌ పూర్తికానట్లే లెక్క. నా అభిప్రాయం ప్రకారం అంపైర్‌ తప్పుచేశాడు. బ్యాటర్‌(పాటీదార్‌)ను నాటౌట్‌గా ప్రకటించాల్సింది’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. రూల్‌ ఇదేకాగా మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియ‌మం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డ‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు, అత‌డి చేతి వేళ్ల మ‌ధ్య నుంచి బాల్‌ నేలకు తాకినట్లయితే దాన్ని అవుట్‌గానే ప‌రిగణిస్తారు. ఈ నియమాన్ని అనుసరించే థర్డ్‌ అంపైర్‌ పాటీదార్‌ను అవుట్‌గా ప్రకటించినట్లు తెలుస్తోంది.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Lucky loser Potapova makes history by reaching semifinal in Madrid Open4
సెమీఫైనల్లో తొలిసారి ‘లక్కీ లూజర్‌’

మూడు పుష్కరాల చరిత్ర ఉన్న మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ)–1000 టోర్నీల్లో ఇప్పటి వరకు చోటు చేసుకోని అద్భుతం మాడ్రిడ్‌ ఓపెన్‌లో నిజమైంది. ‘లక్కీ లూజర్‌’ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగు పెట్టిన ఆస్ట్రియా ప్లేయర్‌ అనస్తాసియా పొటపోవా ఏకంగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా 1990 నుంచి జరుగుతోన్న డబ్ల్యూటీఏ–1000 సిరీస్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకున్న తొలి ‘లక్కీ లూజర్‌’గా పొటపోవా గుర్తింపు పొందింది.మాడ్రిడ్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 56వ ర్యాంకర్‌ పొటపోవా 6–1, 6–7 (4/7), 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2016 యూఎస్‌ ఓపెన్, 2021 వింబుల్డన్‌ టోర్నీ రన్నరప్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై సంచలన విజయం సాధించింది. ‘లక్కీ లూజర్‌’ ఎవరంటే... ఏదైనా టోర్నీ మెయిన్‌ ‘డ్రా’ ఖరారయ్యాక అందులోని ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలుగుతారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఓడిపోయిన అత్యుత్తమ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్లకు ‘లక్కీ లూజర్స్‌’ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పిస్తారు.మాడ్రిడ్‌ ఓపెన్‌లో పొటపోవాకు ఈ అనుభవమే ఎదురైంది. రష్యాలో జన్మించి ప్రస్తుతం ఆస్ట్రియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొటపోవా ఈ టోర్నీ సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లో ఓడిపోయింది. ఫలితంగా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించలేకపోయింది.అయితే మెయిన్‌ ‘డ్రా’లో చోటు పొందిన నలుగురు ప్లేయర్లు గాయాల కారణంగా చివరి నిమిషంలో వైదొలిగారు. దాంతో నిర్వాహకులు క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌లలో ఓడిపోయిన నలుగురు అత్యుత్తమ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్లకు మెయిన్‌ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. పొటపోవాతోపాటు పన్నా ఉడ్వార్డి (హంగేరి), అన్నా బ్లింకోవా (రష్యా), యులియా (ఉక్రెయిన్‌)లకు ‘లక్కీ లూజర్స్‌’గా మెయిన్‌ ‘డ్రా’లో చోటు కల్పించారు. ఉడ్వార్డి, బ్లింకోవా రెండో రౌండ్‌లో ఓడిపోగా... యులియా తొలి రౌండ్‌లో వెనుదిరిగింది. పొటపోవా మాత్రం ఒక్కో రౌండ్‌ను దాటుకుంటూ సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.

Bhuvneshwar Kumar Creates History, Becomes First Bowler To Set This Legendary IPL Record5
భువ‌నేశ్వ‌ర్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డు

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగళూరు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. భువ‌నేశ్వ‌ర్ మాత్రం మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. భువీ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 28 ప‌రుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు ప‌డగొట్టాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ పేస‌ర్ ఇష‌న్ మలింగ‌(15 వికెట్లు)ను వెన‌క్కి నెట్టి భువీ(17 వికెట్లు) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను భువ‌నేశ్వ‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. భారత గడ్డపై 200 ఐపీఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా అత‌డు చ‌రిత్ర సృష్టించాడు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడంతో ఈ ఫీట్‌ను భువనేశ్వర్ సాధించాడు. భువీ తర్వాత స్ధానంలో చాహల్ (186 వికెట్లు) ఉన్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చాహల్‌(228) అగ్రస్ధానంలో ఉండగా.. భువనేశ్వర్ కుమార్(215) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ వంటి మూడు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ తరపున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్‌గా భువీ నిలిచాడు.చదవండి: IPL 2026: పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

Virat Kohli Creates History, Becomes First Player To Achieve This Iconic IPL Feat6
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఓపెన‌ర్ విరాట్ కోహ్లి త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైన‌ప్ప‌టికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవ‌లం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 28 ప‌రుగులు చేసి కోహ్లి ఔట‌య్యాడు.ముఖ్యంగా గుజ‌రాత్ పేస‌ర్ కగిసో రబాడ‌కు కింగ్ కోహ్లి చుక్క‌లు చూపించాడు. ర‌బాడ వేసిన రెండో ఓవ‌ర్‌లో కోహ్లి వ‌రుస‌గా 5 సిక్స్‌లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే👉భారత గడ్డపై ఐపీఎల్‌లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్‌గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.భార‌త్‌లో అత్యధిక ఐపీఎల్ ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరేవిరాట్ కోహ్లీ - 8,016రోహిత్ శర్మ - 6,274శిఖర్ ధావన్ - 5,819డేవిడ్ వార్నర్ - 5,689👉ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్‌గా క్రిస్ గేల్‌, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్‌, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్‌దత్త్ పడిక్కల్‌(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

IPL 2026 Shock 240 CCTV Cameras Down at Chinnaswamy7
ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో 240 సీసీటీవీ కెమెరాలు ఆఫ్..!

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), గుజరాత్‌ టైటెన్స్‌ (జీటీ) జట్ల మధ్య చిన్నస్వామి క్రీడామైదానంలో ఈనెల 24న జరిగిన రాయల్‌ ఐపీఎల్‌ పోటీల సమయంలో 240 సీసీటీవీ కెమెరాల సర్క్యూట్‌ను కట్‌చేసిన ఘటనకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంస్థ (కేఎస్‌సీఏ) స్పషీ్టకరణను ఇచ్చింది. ఇది పూర్తిగా ప్రైవేట్‌ అమ్మకందారులతో కూడిన అంతర్గత వివాదంగా స్పష్టం చేసింది. క్రీడామైదానం భద్రతకు సంబంధించి సంబంధం లేదని వెల్లడించింది. అమ్మకందారుల, దాని ఉద్యోగుల మధ్య చెల్లింపులకు సంబంధించి భిన్నాభిప్రాయాలతో ఈ సమస్య ఉద్భవించిందని పేర్కొంది. హర్యాణాకు చెందిన ఎస్‌టీఏక్యూ టెక్నాలజీస్‌ సంస్థ ఆదిత్య భట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్రదుర్గ జిల్లా హిరియూర మంజునాథ్‌ (37), ఉత్తర ప్రదశ్‌ సుల్తాన్‌పుర అబ్దుల్‌ కలాం (19) అరెస్ట్‌ చేశారని పేర్కొంది. ‘క్రీడామైదానం భద్రత కోసం అమర్చబడిన సీసీటీవీ కెమెరాల నిర్వహణ బాధ్యతను ఐవీఎస్‌ డిజిటల్‌ సొల్యూషన్‌ అనే ఉప పంపిణీదారుల సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థలో మంజునాథ్, అబ్దుల్‌ కలాం గతంలో పనిచేశారు. అయితే కంనెనీ నుంచి జీతం పెండింగ్‌ ఉంది, ఎంత అడిగినా జీతం ఇవ్వకపోవటంతో కోపగించుకొని ఈ కృత్యానికి పాల్పడ్డారు’. ఈ విషయం తనిఖీ ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు.

women cricket Ends Life In Chennai8
టీ20 జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్ ఆత్మహత్య

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో శిక్షణ పొందుతున్న క్రికెటర్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన కాశ్మీర్‌ కుమార్‌ చెన్నైలో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతని కుమార్తె ఏంజెల్‌ కంగావి (19) పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఆమె టీ20 జట్టులో చోటుకోసం ప్రయత్నించింది. ఎంపిక కాకపోవడంతో మనస్తాపం చెందింది. బుధ­వారం రాత్రి ప్రాక్టీస్‌ ముగించుకుని ఇంటికి వచ్చిన ఏంజెల్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అందులో ‘చాలా కాలంగా నా జీవితాన్ని దేవుడే రాశాడు. నా చావుకు నేనే కారణం. నేను ఇతరులను నిందించాలనుకోవడం లేదు. అమ్మా, నాన్నా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు’ అని రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Why Rajat Patidar was adjudged out in GT vs RCB match9
పాటిదార్‌ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి?

ఐపీఎల్‌-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓట‌మిని చూవిచూసింది. గురువారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ ఔటైన తీరు వివాద‌స్పదమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 8వ ఓవ‌ర్ వేసిన అర్ష‌ద్ ఖాన్ బౌలింగ్‌లో పాటిదార్ పుల్ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. ఈ స‌మ‌యంలో డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ నుండి పరుగెత్తుకుంటూ వచ్చిన జేసన్ హోల్డర్ ఒక అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.అయితే అదే క్యాచ్‌ను అందుకునేందుకు ర‌బాడ కూడా ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాడు. అయిన‌ప్ప‌టికి హోల్డ‌ర్.. త‌న‌ను ర‌బాడ ఢీకొనే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా డైవ్ చేసి తన ఎడమ చేత్తో బంతిని ఒడిసిపట్టాడు. దీంతో గుజ‌రాత్ ఆట‌గాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఫీల్డ్ అంపైర్‌లు అది క్లీన్ క్యాచ్ అవునా? కాదా? థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశారు. అయితే హోల్డర్ డైవ్ చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. దీంతో పాటిదార్ త‌నది నాటౌట్ అని బౌండ‌రీ లైన్ వ‌ద్ద అగిపోయాడు. కానీ థ‌ర్డ్ అంపైర్ మాత్రం అది క్లీన్ క్యాచ్ అంటూ ఔట్‌గా ప్ర‌కటించాడు. ఇది చూసిన పాటిదార్ షాక్‌కు గుర‌య్యాడు. డగౌట్‌లో ఉన్న విరాట్ కోహ్లి, కోచ్ ఆండీ ఫ్లవర్ ఫోర్త్ అంపైర్‌తో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఆఖ‌రికి 19 ప‌రుగులు చేసిన పాటిదార్ నిరాశ‌తో మైదానాన్ని వీడాల్సి వ‌చ్చింది. అయితే బంతి నేలకు తగిలినట్లు క‌న్పించిన థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇలా ఇచ్చాడ‌ని ఆర్సీబీ ఫ్యాన్స్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో రూల్స్ ఏమి చెబుతున్నాయో ఓసారి ప‌రిశీలిద్దాం.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియ‌మం 33.2.2.1 ప్రకారం.. ఫీల్డ‌ర్ బంతిని అందుకున్న‌ప్పుడు, అత‌డి చేతి వేళ్ల మ‌ధ్య నుంచి బంతికి నేలకు తాకినట్లయితే దాన్ని ఔట్‌గానే ప‌రిగణిస్తారు. ఇప్పుడు పాటిదార్ విష‌యంలో కూడా అదే జ‌రిగింది. బంతి హోల్డర్ వేళ్ల మధ్య ఉండగానే నేలను తాకిందని భావించిన థర్డ్ అంపైర్ అభిజిత్ భట్టాచార్య త‌న నిర్ణ‌యాన్ని ఔట్‌గా ప్ర‌కటించాడు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌THE CONTROVERSIAL CATCH - What are your thoughts on the decision? 👀 pic.twitter.com/rbrdEQtkRr— Johns. (@CricCrazyJohns) April 30, 2026

Sri Lanka U19 Cricketers Accused Of Filming Women In Hotel Bathroom10
మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు.. ఇద్దరు క్రికెటర్లు అరెస్ట్‌

శ్రీలంక క్రికెట్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్‌-19 క్రికెటర్లు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోటల్ బాత్‌రూమ్‌లలో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై సదరు ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కొలంబోలోని నారాహెన్‌పిటాలో ఓ హోటల్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కొంతమంది మహిళా వైద్యులు అక్కడికి వచ్చారు. అయితే తాము స్నానం చేస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీస్తున్నట్లు వారు గమనించారు. దీంతో ఈ ఘటనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడింది అండర్-19 క్రికెటర్లేనని తేల్చినట్లు శ్రీలంక మిర్రర్ తమ కథనంలో పేర్కొంది. దీంతో సదరు క్రికెటర్లను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుప‌రిచారు. అయితే వారికి మెజిస్ట్రేట్ వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల (శ్రీలంక రూపీ) చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.కాగా పోలీసుల ద‌ర్యాప్తులో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ప్ర‌కారం.. పోలీసుల ప్రాథమిక విచారణలో వారిద్ద‌రూ మహిళలను మాత్రమే కాకుండా కొంతమంది పురుషుల వీడియోలను కూడా తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా నిందుతుల‌గా ఉన్న ఆ ఇద్ద‌రు యువ క్రికెట‌ర్లు క్యాండీలోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ జోసెఫ్, వాజ్ కాలేజ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement