Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

24-year-old Pakistan cricketer announces retirement after T20 World Cup 2026 disaster1
పాక్ క్రికెటర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 24 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌

పాకిస్తాన్ దేశ‌వాళీ క్రికెట‌ర్, సియాల్‌కోట్ స్టార్ ఆల్‌రౌండర్‌ షహజైబ్ భట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాక్‌ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 24 ఏళ్ల‌కే భట్టి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. దేశీయ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, అవినీతి ఎక్కవైందని అతడు ఆరోపించాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణంగా తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు షహజైబ్ వెల్లడించాడు."పాకిస్తాన్ క్రికెట్‌కు గుడ్‌బై. 24 ఏళ్ల వయసులోనే నేను క్రికెట్ నుంచి తప్పుకొంటున్నాను. గతేడాది క్వైడ్-ఎ-అజం ట్రోఫీ ఫైనల్లో నా జట్టును గెలిపించాను. కానీ ఆ తర్వాత వరుసగా 40 మ్యాచ్‌ల పాటు నన్ను ఆడించకుండా పక్కన పెట్టారు" అని భట్టి ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.షహజైబ్ భట్టి పాక్ దేశవాళీ క్రికెట్‌లో టాలెంటెడ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్వైడ్-ఎ-అజం ట్రోఫీ (2024-25)ను సియాల్‌కోట్ సొంతం చేసుకోవడంలో భట్టి కీలక పాత్ర పోషించాడు. పెషావర్ రీజియన్‌తో జరిగిన ఫైనల్‌లో భట్టీ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 32 పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 2024 చివరలో తన రెండో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికి , గత 14 నెలలుగా అతనికి ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. దాదాపు 40 మ్యాచ్‌ల పాటు అతడిని వరుసగా బెంచ్‌కే పరిమితం చేయడం గమనార్హం.ఈ క్రమంలోనే భట్టీ తన కెరీర్‌ను అర్థవంతంగా ముగించాడు. తనలాంటి ఎందరో ఆటగాళ్ల కెరీర్‌లు ఈ విషపూరిత రాజకీయాల వల్ల నాశనమవుతున్నాయని భట్టీ ఆరోపించాడు. కాగా ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్తాన్ క్రికెట్‌లో రాజకీయం జోక్యం ఎక్కవైందని గత కొన్నాళ్లగా విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడు షహజైబ్ భట్టి తీసుకున్న ఈ నిర్ణయం పాక్ బోర్డులోని లోపాలను మరోసారి ఎత్తిచూపింది.చదవండి: ఇండియా క్రికెట్‌‎ను నాశనం చేసింది: షోయబ్‌ అక్తర్‌

Aakash Chopra picks his team of the T20 World Cup 20262
టీ20 ప్రపంచకప్ బెస్ట్ టీమ్‌ ఇదే.. పాక్‌ నుంచి ఒక్కరు కూడా!

టీ20 ప్రపంచ కప్‌ 2026 టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా.. ఫైన‌ల్లో న్యూజిలాండ్‌ను 96 ప‌రుగుల తేడాతో టైటిల్‌ను ముద్దాడింది. ఇది భార‌త్‌కు మూడో టీ20 వర‌ల్డ్‌క‌ప్ విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. మూడు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ట్రోఫీల‌ను సొంతం చేసుకున్న ఏకైక జ‌ట్టుగా మెన్ బ్లూ చ‌రిత్ర సృష్టించింది. అయితే తాజాగా ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రకటించాడు. ఆకాశ్ చోప్రా తన జట్టులో ఓపెనర్లుగా సంజూ శాంసన్‌, ఫిన్ అలెన్‌లను ఎంపిక చేశాడు. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన సంజూ శాంసన్‌పై చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు."శాంసన్ నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా భారత్ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్‌లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదడం నిజంగా అద్భుతం. అందుకే అతడికి ఓపెనర్‌గా అవకాశమిచ్చా" అని చోప్రా పేర్కొన్నాడు.అదేవిధంగా సాహిబ్జాదా ఫర్హాన్, టిమ్ సీఫెర్ట్‌, పాతుమ్ నిస్సంక బ్రియన్ బెన్నెట్, ఐడెన్ మార్క్‌రమ్‌లు ఓపెనర్లగా రాణించినప్పటికి ఫిన్ అలెన్ వైపే తను మొగ్గు చూపుతున్నట్లు చోప్రా తెలిపాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక వరుసగా రెండు మూడు స్ధానంలో ఇషాన్ కిషన్‌, జాకబ్ బెథెల్‌కు చోప్ర అవకాశమిచ్చాడు. ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్‌, అక్షర్ పటేల్‌కు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లగా అమెరికా పేసర్ షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీలకు ఛాన్స్ లభించింది. భారత్ నుంచి ఆరుగురు ఈ జట్టులో చోటు దక్కింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం చోప్రా పరిగణలోకి తీసుకోలేదు.ఆకాశ్ చోప్రా ఎంచుకున్న టీ20 ప్రపంచకప్ బెస్ట్ ఎలెవన్ ఇదేసంజు శాంసన్, ఫిన్ అలెన్, ఇషాన్ కిషన్, జాకబ్ బెథెల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, విల్ జాక్స్, అక్షర్ పటేల్, షాడ్లీ షాల్క్విక్, జస్ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడీచదవండి: ఇండియా క్రికెట్‌‎ను నాశనం చేసింది: షోయబ్‌ అక్తర్‌

India have ruined cricket: Salty Shoaib Akhtar reacts to one-sided T20 World Cup win3
ఇండియా క్రికెట్‌‎ను నాశనం చేసింది: షోయబ్‌ అక్తర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టైటిల్‌ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది.ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంటే.. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం విషం చిమ్ముతున్నారు. పాక్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెల్లగక్కాడు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అధిపత్యం క్రికెట్‎ను పూర్తి నాశనం చేసిందంటూ అక్త‌ర్ ఆరోపించాడు."ఓ ధ‌నిక పిల్లాడు.. ప‌క్క‌వీధిలో ఉన్న పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. ముందుగా 8 జట్లలో నాలుగు జట్లను ఉంచుకొని, తర్వాత అందులో మూడు జట్లను ఇంటికి పంపించి చివరకు నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భార‌త్ చేస్తుంది కూడా అదే. ఇలా క్రికెట్‌ను భారత్ పూర్తిగా నాశనం చేసింది" అని ఓ ఛాన‌ల్ డిబేట్‌లో అక్త‌ర్ పేర్కొన్నాడు.కాగా ఫైన‌ల్‌కు ముందు న్యూజిలాండ్ క‌ప్ గెల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్లు అక్త‌ర్ చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే ఓ వైపు భార‌త్‌ను విమ‌ర్శిస్తునే హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌పై షోయ‌బ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా ఉంటూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో గంభీర్ సక్సెస్ అయ్యారని అక్త‌ర్ కొనియాడాడు. మ‌రో పాకిస్తాన్ మాజీ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ అమీర్ సైతం భార‌త విజ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాడు.చదవండి: మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్‌

Hardik Pandya Massive Declaration After T20 World Cup 2026 Triumph4
మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్‌

టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా భారత్‌ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌ విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సహా పేస్‌ బౌలింగ్‌తో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన హార్దిక్‌ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో మెరుపులు మెరిపించాడు. అతని నిలకడను గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా స్థానం క‌ల్పించింది.పాండ్యాతో పాటు శాంస‌న్‌, ఇషాన్, బుమ్రా ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. 32 ఏళ్ల పాండ్యా 18 నెలల క్రితం బార్బడోస్‌ (2024)లో రోహిత్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో విజయోత్సంలో పాల్గొన్న ఈ ఆల్‌రౌండర్‌ అప్పుడు ఆత్మ ప్రమాణం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.‘నాడు దక్షిణాఫ్రికాపై (2024లో) కప్‌ గెలవగానే... ఇకమీదట భారత్‌ తరఫున ఏ టోర్నీలో బరిలోకి దిగినా... జట్టు గెలవడానికే ఆడతాను. ట్రోఫీని సగర్వంగా ఎత్తుతాను అని నా మనసుకు నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు కివీస్‌పై విజయంతో నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు.నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ఐసీసీ టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. నిన్నటి నుంచే మేమే ఛాంపియన్లమని నాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే నాకు లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. ఆ ప్రపంచకప్‌ (2024) సమయంలో తాను ఎన్నో వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యానని చెప్పాడు. అందుకే ఇతరత్రా విషయాల్ని పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టేందుకు స్వీయ వాగ్దానం చేసుకున్నట్లు చెప్పాడు.చదవండి: T20 WC 2026: పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

 Stuck West Indies and South Africa teams to leave India on Tuesday5
ముగిసిన నిరీక్షణ.. భార‌త్‌ను వీడ‌నున్న సౌతాఫ్రికా, విండీస్ జ‌ట్లు

భారత్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు వచ్చింది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఎట్టకేలకు స్వదేశాలకు పయనం అవుతున్నాయి. టీమిండియా నెగ్గిన ఈ మెగా ఈవెంట్‌లో కరీబియన్‌ సూపర్‌–8లోనే నిష్క్ర‌మించింది. దక్షిణాఫ్రికా సెమీస్‌ ఓడింది. సూపర్‌–8 మ్యాచ్‌లు ముగిసి వారం రోజులవుతున్నా... పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో విదేశీ జట్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో మొదలైన కుంపటి పశ్చిమాసియాకు పాకింది. తమపై యుద్ధం చేస్తున్న అమెరికా స్థావరాలపై గురిపెట్టిన ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. దీంతో పశ్చిమాసియా గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో కరీబియన్‌ జట్టు చిక్కుకుంది. కొందరు ఐపీఎల్‌ కోసం ఉండిపోగా, మరికొందరు ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో చుట్టూ తిరిగి విండీస్‌ దీవులకు చేరుకోనున్నారు. మిగిలిపోయిన 12 మంది విండీస్‌ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున దక్షిణాఫ్రికా జట్టు సభ్యులతో కలిసి జొహన్నెస్‌బర్గ్‌ మీదుగా అంటిగ్వా చేరుకోనుంది.

Varun Chakravarthy takes fresh dig at Pakistan with Tea Cup photograph after T20 World Cup triumph6
పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

ప్రపంచకప్‌తో భారత టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గాం«దీనగర్‌ సమీపంలోని మోనుమెంట్‌ కాంప్లెక్స్‌కు చేరగానే అక్కడంతా పండగ వాతావరణం నెలకొంది. గుజరాత్‌ వారసత్వ కట్టడం ‘అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ వద్ద అధికారిక ఫొటో సెషన్‌ నిర్వహించగా... టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రపంచకప్‌తో సందడి చేశాడు.అతను కప్‌తో చేరుకోగానే అభిమానులంతా ‘ఇండియా... ఇండియా...’ నినాదాలతో హోరెత్తించారు. తర్వాత అడాలజ్‌ కట్టడం వద్ద కప్‌ పట్టుకొని ఫొటోలకు ఫొజులివ్వడంతో కెమెరా ట్రిగ్గర్లన్నీ ‘కిస్సిక్‌... కిస్సిక్‌...’ మోత మోగాయి. సుప్రసిద్ధ అడాలజ్‌ స్టెప్‌వెల్‌’ 500 ఏళ్ల పైచిలుకు చరిత్ర ఉంది. రాణి రుడాబాయి ఈ అడాలజ్‌ను నిర్మించింది.ఆమె వాఘెలా సంస్థానదీశుడు రాణా వీర్‌ సింగ్‌ భార్య. రాణా వీర్‌ మరణానంతరం రుడాబాయి ఈ ప్రాంతాన్ని పాలించింది. ఆ సమయంలోనే అడాలజ్‌ స్టెప్‌వెల్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్‌ సంస్కృతి, వారసత్వ సంపదలో భాగమైన ఈ కట్టడాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా విన్నర్స్‌ ట్రోఫీతో భారత జట్టు అప్పటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఫొటోలు దిగారు. ట్రోఫీతో ఆలయంలో పూజలు అంతకుముందు స్టేడియంలో సంబరాల్లో పాల్గొన్న ఆటగాళ్లు కాసేపు సేద తీరారు. ఈ సమయంలో కోచ్‌ గంభీర్, కెపె్టన్‌ సూర్యకుమార్, ఐసీసీ చైర్మన్‌ జై షాతో కలిసి స్టేడియం లోపలే ఉన్న హనుమాన్‌ ఆలయానికి ప్రపంచకప్‌ను తీసుకువెళ్లి పూజలు చేశారు.పూజల అనంతరం మళ్లీ ఎప్పట్లాగే మైదానంలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. సోమవారం తెల్లవారుజాము వరకు ఈ సంబరాలు జరుపుకున్నారు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్ తదితురులు ప్రపంచకప్‌తో దిగిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు.పాక్‌ను ట్రోలు చేసిన వరుణ్‌కాగా విజయోత్సవాల సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్తాన్‌ను వరుణ్ మరోసారి ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీని పట్టుకుని టీ కప్పుతో సిప్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇదే తరహా ఫోటోను ఆసియాకప్‌-2025 విజయనంతరం కూడా అతడు షేర్ చేశాడు. ఆసియా ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టు.. ఏసీసీ చైర్మెన్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.ఆ సమయంలో వరుణ్ చక్రవర్తి ట్రోఫీ లేకపోయినా, తన బెడ్ పక్కన ఒక 'టీ కప్పు' పెట్టుకుని పడుకున్న ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ట్రోఫీని లాక్కోవచ్చు కానీ, ఛాంపియన్ ట్యాగ్‌ను కాదు" అని పరోక్షంగా పాక్‌కు చురకలు అంటించాడు. ఇప్పుడు ఒరిజినల్ వరల్డ్ కప్ ట్రోఫీతో మళ్ళీ అదే విధంగా కాఫీ తాగుతూ ఫోటోను షేర్ చేస్తూ పాక్‌ను ట్రోల్ చేశాడు.చదవండి: ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌

ICC T20 World Cup: Sanju Samson and Hardik Pandya and Ishan Kishan and Jasprit Bumrah in team of the tournament7
ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్‌ జట్టులో టైటిల్‌ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్‌రమ్‌ (దక్షిణాఫ్రికా) కెపె్టన్‌ కాగా, ఓపెనింగ్‌లో సంజూ సామ్సన్, టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్, మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా, బౌలింగ్‌లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్‌ నుంచి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఈ ఐసీసీ టీమ్‌లో ఓపెనర్‌గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్‌ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జట్టు: మార్క్‌రమ్‌ (కెపె్టన్‌), ఫర్హాన్‌ (పాకిస్తాన్‌), సామ్సన్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా (భారత్‌), విల్‌ జాక్స్, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌), జేసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌), ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్‌ షాలి్వక్‌ (అమెరికా; 12వ ప్లేయర్‌).

FIH Hockey Womens World Cup 2026 Qualifiers: India vs Scotland ends in 2-2 draw8
భారత్‌కు నిరాశ

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచింది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన పూల్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. తమకంటే బలహీన జట్టయిన స్కాట్లాండ్‌పై భారత్‌ పలు అవకాశాలు చేజార్చుకొని విజయాన్ని కోల్పోయింది. భారత్‌ తరఫున నవనీత్‌ కౌర్‌ (18వ నిమిషంలో), సునెలితా టొప్పో (29వ నిమిషంలో)... స్కాట్లాండ్‌ తరఫున మెక్‌ఇవాన్‌ హీతర్‌ (6వ నిమిషంలో), ఫియోనా బర్నెట్‌ (33వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు.భారత్‌కు మొత్తం 9 పెనాల్టీ అవకాశాలు రాగా, రెండింటిలో మాత్రమే జట్టు సఫలమైంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఉరుగ్వే 3–2తో వేల్స్‌పై, ఇంగ్లండ్‌ 3–0తో కొరియాపై, ఇటలీ 3–0తో ఆస్ట్రియాపై గెలిచాయి. పూల్‌ ‘బి’లో ప్రస్తుతం భారత్, స్కాట్లాండ్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఉరుగ్వే 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వేల్స్‌ ఖాతా తెరువలేదు. నేడు విశ్రాంతి దినం. బుధవారం జరిగే పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌తో ఆస్ట్రియా (మధ్యాహ్నం గం. 12:45 నుంచి), ఇటలీతో కొరియా (మధ్యాహ్నం 3 గంటల నుంచి), ఉరుగ్వేతో స్కాట్లాండ్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి), వేల్స్‌తో భారత్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు పూల్స్‌ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. వేల్స్‌తో మ్యాచ్‌ను భారత్‌ ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

Gautam Gambhir Makes Stunning People On Social Media Remark After T20 World Cup Triumph9
కావాల్సింది భారత్‌ విజయాలు

⇒ భారత జట్టు ప్రదర్శన, టోర్నీ అసాంతం ఆడిన తీరు అద్భుతం. అహ్మదాబాద్‌లో మన జట్టు చరిత్ర సృష్టించింది. (ఎప్పుడు గంభీరంగా ఉండే గౌతీని ఉద్దేశించి) కోచ్‌ సాబ్‌... మీ ముఖంపై ఈ చిరునవ్వు బాగుంది. గెలుపు కోసం తపించిన మీ పట్టుదల, ఈ చిద్విలాసం రెండు కిల్లర్‌ కాంబినేషన్‌. బుమ్రా చాంపియన్‌ బౌలర్‌. అతని గురించి ఓ ముక్కలో సరిపెట్టలేను. ఓ వాక్యంలో పూర్తి చేయలేను. ⇒ రెండేళ్ల తర్వాత ధోని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ పోస్ట్‌కు సోషల్‌ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ధోని, గంభీర్‌ అభిమానులైతే తెగ రీట్వీట్‌ చేసుకుంటున్నారు.అహ్మదాబాద్‌: తాజా ప్రపంచకప్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తనకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే భారత జట్టు ఘనవిజయాలే ముఖ్యమని అన్నాడు. విజయానంతరం కోచ్‌ మాట్లాడుతూ ‘మన జట్టు ట్రోఫీలతో సంబరాలు చేసుకోవాలి... వ్యక్తిగత ఘనతలతో కాదు’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తను పదవిలో ఉన్నంత కాలం సమష్టి విజయాలపైనే దృష్టి ఉంటుందని అన్నాడు. ఒకట్రెండు మెగా ట్రోఫీలతో, లేదంటే విజయాలతో భారత శకం మొదలైనట్లుగా భావించనన్నాడు. సోషల్‌ మీడియా చెత్తని పట్టించుకోనని తేలిగ్గా తీసిపారేశాడు. నమ్మకంతోనే జట్టును నిర్మించాలి, అంచనాలతో కాదని స్పష్టం చేశాడు. పలు అంశాలపై మీడియాతో గంభీర్‌ పంచుకున్న అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఉండాల్సింది నమ్మకం ఏదైనా జట్టు నమ్మకంతో ఎదగాలి. అంచనాలతో కాదు. అంటే ఆటగాళ్ల ఎంపికైనా... జట్టు నిర్మాణమైనా... ఈ రెండింటిలో కామన్‌ పాయింట్‌ ఒకటే. అదే రాణిస్తారనే నమ్మకం. ఈ పునాదితోనే జట్టును నిర్మిస్తాం. అంతే కానీ ఫలానా ఆటగాడు ఈ పూటకు మెరిపిస్తాడు లేదంటే ఈ మ్యాచ్‌లో గట్టెక్కిస్తాడనే అంచనాలతో జట్టును నిర్మించడం సాధ్యపడదు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఒకటి అర వైఫల్యంతో కూలిపోదు. సంజూ సామ్సన్, అభిõÙక్, ఇషాన్‌ కిషన్‌లు కూడా విఫలమయ్యారు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అందువల్లే జట్టులో కొనసాగారు. విజయవంతమయ్యారు. సోషల్‌ మీడియాను పట్టించుకోను అదేపనిగా విమర్శల్ని లేదంటే ప్రతికూల వార్తల్ని వైరల్‌ చేసే సోషల్‌ మీడియాను, పనికిరాని నెటిజన్ల పోస్టుల్ని పట్టించుకోను. కోచ్‌గా నేను జవాబుదారీగా ఉండాలనుకునేది ఈ 30 మందికే (డ్రెస్సింగ్‌ రూమ్‌లో భాగమయ్యే ప్లేయర్లు)! పరిమిత ఓవర్ల శకం మాదే అనుకోను అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌ శకం మొదలైందని నేను అనుకోను. మా ఆధిపత్యం మొదలైనట్లయితే మేం గత మూడు వన్డే సిరీస్‌లలో రెండు ఎలా ఓడిపోతాం. ప్రత్యేకించి ఐసీసీ క్రికెట్‌ టోర్నిల్లో మాత్రం భారత్‌ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాను. 2024లో టి20 ప్రపంచకప్, 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2026లో టి20 వరల్డ్‌కప్‌ ఇలా ఏడాదికో ఐసీసీ ట్రోఫీ చొప్పున భారత్‌ గెలుచుకుంది. లక్ష్మణ్, ద్రవిడ్‌లకు థ్యాంక్స్‌ముఖ్యంగా ఈ తాజా కప్‌ను నా కన్నా ముందు హెడ్‌ కోచ్‌గా పనిచేసిన రాహుల్‌ ద్రవిడ్‌కు, బీసీసీఐ ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు అంకితమిస్తున్నా. కొన్నేళ్లపాటు అంకితభావంతో శ్రమించిన ద్రవిడ్‌ టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో పటిష్టమైన జట్టుగా మార్చాడు. అలాగే ఆటగాడిగా భారత్‌కు విజయాలందించిన లక్ష్మణ్‌ ఇప్పుడు బెంగళూరులో కుర్రాళ్లకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు.2028లో ‘హ్యాట్రిక్‌’, బంగారమాయేనా... భారత జట్టు సభ్యులందరూ గెలుచుకున్న వరుస ప్రపంచకప్‌లతో అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత జట్టు సభ్యుల సగటు వయసు 30. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే మెగా ఈవెంట్‌కు దాదాపు వీరే ఉండటం ఖాయం. నిజానికి కెపె్టన్‌ సూర్యకుమార్‌ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపించినా విజయానంతరం స్వయంగా అతనే వాటిని తోసి పుచ్చాడు. ప్రస్తుతానికి పక్కన బెట్టినా... 2028 వరకైతే సూర్య కొనసాగడం ముమ్మాటికి కష్టమే! ఇక ఆ ఏడాది (2028) భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కానుంది.ఓవైపు ఆ్రస్టేలియా–న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌లో ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ ఊరిస్తుంటే... ప్రతిష్టాత్మక లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ కూడా జరుగనున్నాయి. ఇందులోనూ చాంపియన్‌ అయితే మాత్రం 2028 మనకి బంగారమవుతుంది! ఆదివారం రాత్రి కప్‌తో పిచ్‌పై కూర్చున్న కెపె్టన్‌ సూర్యకుమార్‌ ఫొటోలకు పోజులిస్తూ తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్‌ స్వర్ణం, మరో టి20 ప్రపంచకప్‌ గెలవడమనే చెప్పాడు. ఆదివారం రాత్రి విన్నర్స్‌ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవం తర్వాత భారత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో మైదానంలో ఉల్లాసంగా గడపడంతోపాటు ట్రోఫీతో ఫొటోలు దిగారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌ నుంచి పలువురు ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు.

Gary Kirsten appointed head coach of Sri Lankan mens team10
శ్రీలంక హెడ్‌ కోచ్‌గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి

తాము సంయుక్తంగా (భారత్‌తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్‌-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్‌స్టన్‌. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్‌ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్‌ కోచ్‌గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్‌ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్‌ కోచ్‌గా ఉండిన సనత్‌ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్‌ బోర్డు కిర్‌స్టన్‌ను ఎంపిక​ చేసింది. కిర్‌స్టన్‌ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా లంక క్రికెట్‌ కిర్‌స్టన్‌ నియామకం చేపట్టింది.కిర్‌స్టన్‌ను హెడ్‌ కోచ్‌గా మంచి ట్రాక్‌ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్‌లో అతను విజయవంతమైన జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్‌లో ఏదైనా ఫెయిల్యూర్‌ ఉందా అంటే అది పాకిస్తాన్‌ వైట్‌ బాల్‌ జట్టుకు కోచ్‌గా సేవలందించడమే. పాక్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్‌లో కిర్‌స్టన్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్‌స్టన్‌ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్‌ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్‌ను ( జేమీ సిడ్డన్స్‌) కూడా మార్చింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement