Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lucknow lost to Punjab Kings by 54 runs1
పంజాబ్‌ పరుగుల పండగ

గత నాలుగు మ్యాచ్‌ల్లో లక్ష్యఛేదనలో సత్తా చాటిన పంజాబ్‌ కింగ్స్‌... ఈసారి మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. లక్నో బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఈ సీజన్‌లో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకుంది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్‌ కనొలీ పోటీపడి సిక్స్‌లు కొట్టడంతో పంజాబ్‌ కొండంత స్కోరు చేయగా... ఛేదనలో పలు ప్రయోగాలు చేసిన లక్నో విజయానికి 54 పరుగుల దూరంలో నిలిచిపోయింది. న్యూ చండీగఢ్‌: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జోరు సాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని పంజాబ్‌ తమ ఖాతాలో ఐదో విజయం వేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్‌ 54 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను మట్టికరిపించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 93; 4 ఫోర్లు, 9 సిక్స్‌లు), కూపర్‌ కనోలీ (46 బంతుల్లో 87; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 80 బంతుల్లోనే 182 పరుగులు జోడించడం విశేషం. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్, సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులకు పరిమితమైంది. మిచెల్‌ మార్ష్ (28 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోనీ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (23 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (22 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాధించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా ఉండగా... లక్నో ఏ దశలోనూ ఆ వేగం అందుకలోకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. ధనాధన్‌.. ఈ సీజన్‌లో తొలిసారి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌... లక్నో బౌలర్లపై తమ ప్రతాపం చూపింది. ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0)ను షమీ తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేయగా... అక్కడి నుంచి పంజాబ్‌ ఊచకోత మొదలైంది. మరో ఓపెనర్‌ ప్రియాన్ష్ ఆర్య, కూపర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డారు. ఆరో ఓవర్‌లో ఆర్య 4, 6, 6 బాదగా... పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ 63/1తో నిలిచింది. బదోనీ ఓవర్‌లో కూపర్‌ 4, 6 కొట్టగా... ఆర్య 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. షమీ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో కూపర్‌ కూడా హాఫ్‌సెంచరీ మార్క్‌ దాటాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ దంచి కొట్టడంతో పంజాబ్‌ స్కోరు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. మార్క్‌రమ్‌ వేసిన 13వ ఓవర్‌లో అయితే ఈ ఇద్దరు పండగ చేసుకున్నారు. తొలి మూడు బంతులను కూపర్‌ సిక్స్‌లుగా మలిస్తే... చివరి రెండు బంతులకు ఆర్య సిక్స్‌లు కొట్టాడు. దీంతో 32 పరుగులు వచ్చాయి. ఫలితంగా 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ 179/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించింది. ఆఖర్లో కాస్త తేరుకున్న లక్నో బౌలర్లు ఈ ఇద్దరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ (5), నేహల్‌ వధేరా (13) వికెట్లు తీసి పరుగుల వేగాన్ని నియంత్రించారు. స్టొయినిస్‌ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (6 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) చివర్లో ధాటిగా ఆడారు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ ఆర్య (సి) మార్ష్ (బి) సిద్ధార్థ్‌ 93; ప్రభ్‌సిమ్రన్‌ (సి) మార్ష్ (బి) షమీ 0; కూపర్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) ప్రిన్స్‌ 87; శ్రేయస్‌ (సి) షమీ (బి) మొహసిన్‌ 5; స్టొయినిస్‌ (రనౌట్‌) 29; వధేరా (సి) పూరన్‌ (బి) సిద్ధార్థ్‌ 13; శశాంక్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ప్రిన్స్‌ 17; యాన్సెన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–3, 2–185, 3–187, 4–193, 5–208, 6–252, 7–254. బౌలింగ్‌: షమీ 4–0–56–1; మొహసిన్‌ 4–0–43–1; ప్రిన్స్‌4–0–25–2; బదోనీ 1–0–14–0; అవేశ్‌ 3–0–46–0; సిద్ధార్థ్‌ 3–0–35–2; మార్క్‌రమ్‌ 1–0–32–0. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) బార్ట్‌లెట్‌ (బి) చాహల్‌ 40; బదోనీ (సి) బార్ట్‌లెట్‌ (బి) వైశాక్‌ 35; పంత్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) అర్ష్ దీప్‌ 43; పూరన్‌ (సి) శ్రేయస్‌ (బి) యాన్సెన్‌ 9; మార్క్‌రమ్‌ (సి) స్టొయినిస్‌ (బి) యాన్సెన్‌ 42; ముకుల్‌ (నాటౌట్‌) 21; హిమ్మత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–61, 2–109, 3–128, 4–139, 5–199. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–41–1; బార్ట్‌లెట్‌ 4–0–54–0; యాన్సెన్‌ 4–0–37–2; వైశాక్‌ 4–0–30–1; చాహల్‌ 4–0–36–1. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X ముంబై వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

South Africa womens cricket team beat India womens cricket team by 8 wickets2
భారత్‌కు రెండో పరాజయం

డర్బన్‌: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని టీమిండియా... ఆదివారం జరిగిన రెండో పోరులో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ప్రస్తుతం హర్మన్‌ బృందం సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఉంది. టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో టీమిండియా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షఫాలీ వర్మ (38 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అనుష్క శర్మ (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన చెరో 12 పరుగులు చేయగా... జెమీమా రోడ్రిగ్స్‌ (2), దీప్తి శర్మ (1), రిచా ఘోష్‌ (3) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చోల్‌ ట్రయాన్, టుమి సెఖుఖునె చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా అమ్మాయిలు దంచి కొట్టారు. 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 148 పరుగులు చేశారు. కెపె్టన్‌ లౌరా వోల్‌వార్ట్‌ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌), సునె లుస్‌ (46 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో రాణించారు. ఈ జంట తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్‌ రెండు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య బుధవారం జొహన్నెస్‌బర్గ్‌లో మూడో టి20 జరగనుంది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) డిక్లెర్క్‌ (బి) ఎమ్‌లాబా 57; స్మృతి (సి) బాష్‌ (బి) ట్రయాన్‌ 12; జెమీమా (సి) సెఖుఖునె (బి) ట్రయాన్‌ 2; అనుష్క శర్మ (సి) బ్రిట్స్‌ (బి) ట్రయాన్‌ 28; హర్మన్‌ప్రీత్‌ (రనౌట్‌) 12; దీప్తి శర్మ (సి) జాఫ్తా (బి) సెఖుఖునె 1; రిచా (సి) వోల్‌వార్ట్‌ (బి) డిక్లెర్క్‌ 3; అరుంధతి రెడ్డి (రనౌట్‌) 14; శ్రేయాంక (ఎల్బీ) సెఖుఖునె 0; క్రాంతి (సి) డిక్లెర్క్‌ (బి) సెఖుఖునె 4; శ్రీచరణి (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 147. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–99, 4–109, 5–111, 6–119, 7–127, 8–128, 9–132, 10–147. బౌలింగ్‌: టుమి సెఖుఖునె 4–0–31–3; ఖాక 4–0–45–0; చోల్‌ ట్రయాన్‌ 4–0–22–3; డిక్లెర్క్‌ 2–0–14–1; ఎమ్‌లాబా 4–0–17–1; డెర్క్‌సెన్‌ 2–0–17–0. దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్‌: వోల్‌వార్ట్‌ (సి) అరుంధతి (బి) శ్రేయాంక 54; లుస్‌ (సి) క్రాంతి (బి) శ్రేయాంక 57; బ్రిట్స్‌ (నాటౌట్‌) 20; డెర్క్‌సెన్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.1 ఓవర్లలో 2 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–106, 2–124. బౌలింగ్‌: క్రాంతి 2–0–20–0; శ్రేయాంక 4–0–35–2; శ్రీచరణి 4–0–39–0; దీప్తి శర్మ 3–0–23–0; అరుంధతి 4–0–27–0; అనుష్క శర్మ 0.1–0–4–0.

Kolkata beat Rajasthan Royals by 4 wickets3
రఫ్ఫాడించిన రింకూ

ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎట్టకేలకు ఈ సీజన్‌లో గెలుపు రుచి చూసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో నైట్‌రైడర్స్‌ను విజయం వరించింది. గత నెల 28న లీగ్‌ ప్రారంభం కాగా... దాదాపు 20 రోజుల తర్వాత ఏడో మ్యాచ్‌లో కోల్‌కతా బోణీ కొట్టింది. మొదట స్పిన్నర్లు సత్తా చాటడంతో రాజస్తాన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన రహానే బృందం... స్వల్ప లక్ష్యఛేదనలోనూ తడబడ్డా కష్ట కాలంలో ‘ఫినిషర్‌’ రింకూ సింగ్‌ అజేయ అర్ధశతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా జరిగిన తొలి పోరులో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందింది. స్పిన్నర్లు సత్తా చాటడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన నైట్‌రైడర్స్‌ ఆ తర్వాత స్వల్ప స్కోరును ఛేదించేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడి చివరి ఓవర్‌లో గట్టెక్కింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (28 బంతుల్లో 46; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (29 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమకు అలవాటు అయిన శైలిలో దూకుడుగా ఆడగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. కోల్‌కతా స్పిన్నర్లు కట్టిపడేయడంతో రాయల్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్‌ త్యాగి ఖాతాలో 3 వికెట్లు చేరాయి. నరైన్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (34 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. అనుకూల్‌ రాయ్‌ (16 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) విలువైన పరుగులు చేశాడు. రాయల్స్‌ బౌలర్లలో జడేజా 3 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివరి 10 ఓవర్లలో 60/8 రాయల్స్‌ ఇన్నింగ్స్‌ను రెండు భాగాలుగా చూడొచ్చు. ఓపెనర్లు దంచికొట్టడంతో ఆరంభంలో మెరుపు వేగంతో దూసుకెళ్లిన రాజస్తాన్‌... 10 ఓవర్లు ముగిసేసరికి 95/1తో నిలిచింది. ఆ తర్వాత కోల్‌కతా స్పిన్నర్లు పట్టు బిగించడంతో పరుగుల రాక గగనం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తదుపరి ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ధ్రువ్‌ జురేల్‌ (5), పరాగ్‌ (12), హెట్‌మైర్‌ (15), డొనోవాన్‌ ఫెరీరా (7), జడేజా (9) పెవిలియన్‌కు వరుస కట్టారు. 85/6 నుంచి... స్వల్ప లక్ష్యఛేదనలోనూ కోల్‌కతా తడబడింది. ఓపెనర్‌ సీఫెర్ట్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ కాగా... కెపె్టన్‌ అజింక్య రహానే (0) కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ (10) విఫలం కాగా... జురేల్‌ చేసిన మెరుపు స్టంపౌట్‌కు గ్రీన్‌ (13 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. రావ్‌మన్‌ పావెల్‌ (20 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రమణ్‌దీప్‌ (10) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో నైట్‌రైడర్స్‌ 85/6తో ఓటమి అంచుల్లో నిలిచింది. ఈ దశలో రింకూ సింగ్‌ చెలరేగిపోయాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భారీ షాట్‌లతో లక్ష్యాన్ని కరిగించాడు. అతడికి అనుకూల్‌ నుంచి చక్కటి సహకారం దక్కింది. కోల్‌కతా విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... బ్రిజేశ్‌ వేసిన చివరి ఓవర్‌లో రింకూ 4, 4, 6తో జట్టును గెలిపించాడు. ఆ స్టంపౌట్‌ అద్భుతం...కోల్‌కతా ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో రాయల్స్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ మెరుపు స్టంపింగ్‌తో అదరగొట్టాడు. రవి బిష్ణోయ్‌ లెగ్‌సైడ్‌ వేసిన బంతిని గ్రీన్‌ ఆడలేకపోగా... రెప్పపాటులో బంతిని అందుకున్న జురేల్‌ అక్కడి నుంచే వికెట్లను గిరాటేశాడు. సంగక్కర, దినేశ్‌ కార్తీక్‌ వంట సీనియర్‌ కీపర్లు గతంలో చేసిన మాదిరిగా ఎడమవైపు దూకుతూ బంతిని అందుకొని వికెట్లను చూడకుండానే స్టంపౌట్‌ చేసిన తీరు మాత్రం చూసి తీరాల్సిందే! రింకూ క్యాచ్‌ మిస్‌రింకూ సింగ్‌ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బర్గర్‌ వదిలేశాడు. అప్పటికే ప్రధాన ఆటగాళ్లందరూ పెవిలియన్‌ చేరిపోయిన ఆ సమయంలో రింకూ వికెట్‌ కోల్పోయి ఉంటే... నైట్‌రైడర్స్‌ పరిస్థితి ఎలా ఉండేదో!1 ఐపీఎల్‌లో అత్యధిక (12) సార్లు డకౌట్‌ అయిన ఓపెనర్‌గా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పార్థివ్‌ పటేల్‌ (11), శిఖర్‌ ధావన్‌ (10), గౌతమ్‌ గంభీర్‌ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) రహానే (బి) నరైన్‌ 39; వైభవ్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) వరుణ్‌ 46; జురేల్‌ (స్టంప్డ్‌) సైఫెర్ట్‌ (బి) వరుణ్‌ 5; పరాగ్‌ (బి) వరుణ్‌ 12; హెట్‌మైర్‌ (సి) రఘువంశీ (బి) త్యాగి 15; డొనోవాన్‌ (సి అండ్‌ బి) నరైన్‌ 7; జడేజా (సి) గ్రీన్‌ (బి) త్యాగి 9; ఆర్చర్‌ (రనౌట్‌) 8; రవి బిష్ణోయ్‌ (సి) సీఫెర్ట్‌ (బి) త్యాగి 0; బ్రిజేశ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–81, 2–97, 3–99, 4–117, 5–124, 6–144, 7–146, 8–146, 9–155. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–37–0; కార్తీక్‌ త్యాగి 4–0–22–3; గ్రీన్‌ 2–0–27–0; నరైన్‌4–0–26–2; వరుణ్‌ చక్రవర్తి 4–0–14–3; రమణ్‌దీప్‌ 2–0–26–0. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (బి) ఆర్చర్‌ 0; రహానే (సి) జురేల్‌ (బి) బర్గర్‌ 0; రఘువంశీ (ఎల్బీ) (బి) జడేజా 10; గ్రీన్‌ (స్టంప్డ్‌) జురేల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 27; పావెల్‌ (సి) డొనోవాన్‌ (బి) జడేజా 23; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 53; రమణ్‌దీప్‌ (బి) యశ్‌ రాజ్‌ 10; అనుకూల్‌ రాయ్‌ (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–37, 4–52, 5–70, 6–85. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–35–1; బర్గర్‌ 2–0–20–1; బిష్ణోయ్‌ 4–0–41–1; యశ్‌ రాజ్‌ 4–0–25–1; జడేజా 3–0–8–2; పరాగ్‌ 1–0–10–0; బ్రిజేశ్‌ 1.4–0–21–0.

Sriram Balaji won the 18th ATP Challenger doubles title of his career4
బాలాజీ జోడీకి డబుల్స్‌ టైటిల్‌

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ డబుల్స్‌ ప్లేయర్‌ శ్రీరామ్‌ బాలాజీ తన కెరీర్‌లో 18వ ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. పోర్చుగల్‌లో జరిగిన ఒయిరాస్‌ ఏటీపీ–125 చాలెంజర్‌ టోర్నీలో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–నీల్‌ ఒబెర్‌లేట్నర్‌ (ఆ్రస్టియా) ద్వయం విజేతగా నిలిచింది. బారియెంటోస్‌ (కొలంబియా)–బెహర్‌ (గ్రీస్‌) జోడీతో జరిగిన ఫైనల్లో బాలాజీ–ఒబెర్‌లేట్నర్‌ జంట 6–7 (7/9), 6–4, 11–9తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచింది. ఈ ఏడాది బాలాజీ–ఒబెర్‌లేట్నర్‌లకు నాలుగో డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. ఒక గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో బాలాజీ, ఒబెర్‌లేట్నర్‌ ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు సాధించింది. తొలి సర్వీస్‌లో 38 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 19 పాయింట్లు సంపాదించింది. టైటిల్‌ గెలిచిన బాలాజీ–ఒబెర్‌లేట్నర్‌లకు 9,010 యూరోల (రూ. 9 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 125 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Vaishali reacts on Womens World Chess Championship5
జు వెన్‌జున్‌తో పోరుకు సిద్ధం: వైశాలి

చెన్నై: మహిళల ప్రపంచ చెస్‌ చాంపియన్‌షి ప్‌ టైటిల్‌ పోరు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి వ్యాఖ్యానించింది. సైప్రస్‌లో గతవారం ముగిసిన క్యాండిడేట్స్‌ టోర్నీ మహిళల విభాగంలో తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల వైశాలి విజేతగా నిలిచింది. ఆదివారం ఉదయం స్వస్థలం చెన్నైకు చేరుకున్న వైశాలికి ఘనస్వాగతం లభించింది. క్యాండిడేట్స్‌ టోర్నీ విజేత హోదాలో వైశాలికి ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో తలపడే అవకాశం లభించింది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో జు వెన్‌జున్‌ 2018 నుంచి విశ్వవిజేతగా కొనసాగుతోంది. ‘నా కల నిజమైనట్లు అనిపిస్తోంది. నేను ఎన్నో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌లను చూశాను. ఇప్పుడు నేనే ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాను. ఈ పోరు కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని వైశాలి తెలిపింది. ఈ ఏడాది పురుషుల, మహిళల విభాగాల్లో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ టైటిల్‌ పోరులో భారత గ్రాండ్‌మాస్టర్లు, తమిళనాడు ప్లేయర్లు (గుకేశ్, వైశాలి) బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ చాంపియన్‌షి ప్‌ మ్యాచ్‌ల ఆతిథ్య హక్కుల కోసం బిడ్‌ దాఖలు చేయాలని అఖిల భారత చెస్‌ సమాఖ్య నిర్ణయం తీసుకుంది.

IPL 2026: Punjab Kings Won By 54 Runs Vs Lucknow Super Giants6
ప్రియాన్ష్‌, కూపర్‌ విధ్వంసం.. పంజాబ్‌కు ఐదో విజయం

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ముల్లన్‌పూర్‌ వేదికగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 54 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులకే పరిమితమైంది. మార్కరమ్‌ (42 ), రిషబ్‌ పంత్‌ (43), మార్ష్‌ (40) పరుగులు సాధించారు. అయితే ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడంతో లక్నో చేతులెత్తేసింది. పంజాబ్‌బౌలర్లలో మార్కో యాన్సెన్‌ 2 వికెట్లు తీశాడు. అంతకముందు పంజాబ్‌ యువ బ్యాటర్లు ప్రియాన్ష్‌ ఆర్య, కూపర్‌ కన్నోలీ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రియాన్ష్‌ (93), కన్నోలి (87) తమ కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడారు. చివర్లో స్టోయినిస్‌ 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి పంజాబ్‌ భారీ స్కోరుకు బాటలు వేశాడు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌,మణిమరన్‌ సిద్ధార్థ్‌ చెరో 2 వికెట్లు తీశాడు. లక్నోతో మ్యాచ్‌ ద్వారా ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి (వర్షంతో ఒక మ్యాచ్‌ రద్దు) 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.𝘼𝙡𝙡'𝙨 𝙬𝙚𝙡𝙡 𝙩𝙝𝙖𝙩 𝙚𝙣𝙙𝙨 𝙬𝙚𝙡𝙡 😃Only smiles on the faces of skipper Shreyas Iyer, coach Ricky Ponting and.. Shashank Singh! #TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/SQU5z3zNdy— IndianPremierLeague (@IPL) April 19, 2026

KKR Captian Ajinkya Rahane Comments After Match Won Vs Rajasthan7
‘మాటలు రావడం లేదు.. ఆ ఇద్దరి వల్లే గెలిచాం’

ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రహానే సీజన్‌లో కెప్టెన్‌గా తొలి విజయాన్ని అందుకున్నాడు. రాజస్తాన్‌పై విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. రింకూ సింగ్‌, అనుకుల్ రాయ్‌ల వల్లే కేకేఆర్ గెలిచిందంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రహానే మాట్లాడుతూ.. 'నాకు చాలా ఆనందంగా ఉంది. మంచి ఫీలింగ్ ఇది. ఈ మ్యాచ్‌లో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. రింకు సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. రింకు, అనుకుల్ ఇద్దరూ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరి బ్యాటింగ్ సూపర్బ్. నాకు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఇష్టం. పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విజయం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. కార్తీక్ త్యాగి అద్భుతంగా ఆడుతున్నాడు. తన సామర్థ్యం గురించి అతనికి స్పష్టత ఉంది. ఇలాంటి యువ ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. అతను ఆత్మవిశ్వాసం రోజురోజుకు పెరుగుతోంది. అది చూడటం చాలా ఆనందంగా ఉంది. త్యాగి బౌలింగ్ చేస్తున్న వేగం అద్భుతం. ప్రతి మ్యాచ్‌ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అదే క్రికెట్ అవగాహనను పెంచుతుంది. కొన్నిసార్లు స్ట్రైక్‌రేట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నాకు అనిపిస్తుంది. కానీ మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లడం ముఖ్యం. ఈరోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఈ విజయం మాకు ఒక పెద్ద ఉపశమనం లాంటిది. జట్టు ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. జట్టు సభ్యుల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలి. అందరూ కలిసి కృషి చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అద్భుతంగా ఉంది. అభిమానులు కూడా బాగా మద్దతు ఇచ్చారు. ఈ విజయం వాళ్లకే అంకితం. జట్టులో చాలా సానుకూల వాతావరణం ఉంది' అని రహానే చెప్పుకొచ్చాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: కేకేఆర్‌ రాత మార్చిన రింకూ సింగ్‌!

Dropped On-8 Runs-Turning Point For-Rinku Singh Carries KKR-1st Win8
కేకేఆర్‌ రాత మార్చిన రింకూ సింగ్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యాన్ని సాధించింది. ఐదు ప‌రాజ‌యాల‌తో అట్ట‌డుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక ద‌శ‌లో 85 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓట‌మి చ‌విచూస్తుంద‌ని అంతా భావించారు. కానీ జ‌ట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ త‌న స‌హ‌చ‌ర బ్యాట‌ర్ అనుకుల్ రాయ్‌తో క‌లిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాత‌ను మార్చాడు. 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద త‌న‌కు ల‌భించిన లైఫ్‌ను రింకూ సింగ్ చ‌క్క‌గా వినియోగించుకున్నాడు. రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బ‌ర్గ‌ర్ వ‌దిలేయ‌డం మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్‌ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.త‌న‌కు లైఫ్ వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది రింకూ సింగ్ రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు రుచి చూపించాడు.ఈ సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌ని రింకూ సింగ్ రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో త‌న విలువ‌ను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వ‌చ్చేస‌రికి కేకేఆర్ 6 వికెట్ల న‌ష్టానికి 85 ప‌రుగుల‌తో ఉంది. విజ‌యానికి ఆరు ఓవ‌ర్ల‌లో 69 ప‌రుగులు కావాలి. అనుకుల్ రాయ్ నుంచి మంచి స‌హ‌కారం అంద‌డంతో రింకూ సింగ్ స్వేచ్ఛ‌గా బ్యాట్‌ను ఝ‌లిపించాడు. ఈ ఇద్ద‌రు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 ప‌రుగుల విన్నింగ్ భాగ‌స్వామ్యం న‌మోదు చేసి కేకేఆర్‌కు సీజ‌న్‌లో మొద‌టి విజ‌యాన్ని అందించారు. మ్యాచ్ అనంత‌రం రింకూ సింగ్ మాట్లాడాడు. ‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్‌లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్‌ ఇచ్చిన అనుకుల్‌ రాయల్‌ (16 బంతుల్లో 29 నాటౌట్‌) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.SENSATIONAL FINISH 🤯Rinku Singh & Anukul Roy, take a bow! 💜Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

Markram Unwanted Record For LSG Concede 32 Runs In 1 Over Vs Punjab9
ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ కన్నోలి లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రియాన్ష్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేయగా, కూపర్ 47 బంతుల్లో 87 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన మార్కరమ్‌కు ఈ ఇద్దరు పీడకలను మిగిల్చారు. 13వ ఓవర్ స్ట్రైకింగ్ తీసుకున్న కూపర్ కన్నోలి మార్కరమ్‌ మొదటి బంతిని సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని ఈసారి లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టిన కన్నోలి మూడో బంతిని కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని వైడ్ వేయగా, నాలుగో బంతికి కూపర్ సింగిల్ తీయడంతో ప్రియాన్ష్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక ప్రియాన్ష్ కూడా చివరి రెండు బంతులకు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 5 సిక్సర్లు, వైడ్ సహా సింగిల్ మొత్తం 32 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కరమ్ ఒక చెత్త రికార్డును తన పేరిట మూటగట్టుకున్నాడు. లక్నో తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు రవి బిష్ణోయ్ పేరిట ఉంది. 2022లో ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక 2026 సీజ‌న్‌లో ఒకే ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్ కూడా మార్క‌ర‌మ్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌లోనూ ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఓవ‌ర్ అని చెప్పొచ్చు. 2025 సీజ‌న్‌లో ఖ‌లీల్ అహ్మ‌ద్ (సీఎస్‌కే) ఆర్సీబీతో మ్యాచ్‌లో 33 ప‌రుగులు, మొయిన్ అలీ (కేకేఆర్‌) రాజ‌స్తాన్‌తో మ్యాచ్‌లో 32 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు.3️⃣2️⃣ runs of pure destruction 💥🎥 Relive this carnage 👉 https://t.co/EpOcpY1lLb#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @PunjabKingsIPL pic.twitter.com/eI5tuleNYM— IndianPremierLeague (@IPL) April 19, 2026చదవండి: 'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’

Rajasthan Royals Captain Riyan Parag Comments After Match Lost Vs KKR10
'క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంప‌ముంచింది’

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆదివారం కేకేఆర్ చేతిలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 4 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూసింది. మ్యాచ్‌ ఓటమిపై పరాగ్‌ స్పందించాడు. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం త‌మ కొంప ముంచింద‌ని రాజ‌స్తాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ తెలిపాడు. మ్యాచ్ ముగిసిన అనంత‌రం ప‌రాగ్ మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో తొలి నాలుగు ఓవ‌ర్లు ముగిసేసరికి ఈ పిచ్‌పై 170 ప‌రుగులు చేస్తే విజ‌యం సాధించొచ్చు అని భావించాం. కానీ 10 ప‌రుగులు వెనుక‌బ‌డ్డాం. మా బౌల‌ర్లు క‌ష్ట‌ప‌డ్డారు. కానీ ఫీల్డింగ్‌లో కొన్ని త‌ప్పులు చేశాం. క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం మా కొంపముంచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలంగా ఉంది. కానీ మా జ‌ట్టులో ఇవాళ పేస‌ర్లు ఎక్కువ‌గా ఉండడం, బిష్ణోయ్ మాత్ర‌మే రెగ్యుల‌ర్ స్పిన్న‌ర్‌గా ఉండ‌డం మాకు ప్ర‌తికూలంగా మారింది. బ్రిజేశ్ శ‌ర్మ ఇవాళ చాలా బాగా బౌలింగ్ వేశాడు. 14, 16వ ఓవ‌ర్లో అత‌ను సూప‌ర్‌గా బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ బౌలింగ్ పూర్తైన త‌ర్వాత క్రీజులో ఇద్ద‌రు ఎడమ‌చేతి బ్యాట‌ర్లు ఉండ‌డం, ఆ స‌మ‌యంలో మా వ‌ద్ద స్పిన్ బౌల‌ర్ లేక‌పోవ‌డం కూడా ఓట‌మికి దారి వేసింద‌ని చెప్పొచ్చు. ఇవాళ బ్యాటింగ్‌లో కూడా ఆశించినంత స్థాయిలో రాణించ‌లేక‌పోయాం. రెండు ఓట‌ములు వ‌చ్చినంత మాత్రాన వెన‌క్కి తగ్గిన‌ట్లు కాదు. మ‌ళ్లీ ఫుంజుకుంటాం. ఇక ’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్‌ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement