Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Indian cricket team preparing for semi final match1
భారత జట్టు ముమ్మర సాధన

టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్‌ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్‌లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్‌ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ పర్యవేక్షణలో అభిషేక్‌ శర్మ ప్రత్యేకంగా ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్‌ ఆఫ్‌ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ అటు స్పిన్, ఇటు పేస్‌ బౌలింగ్‌లో సాధన చేశారు. కుల్దీప్‌ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌లపై తిలక్‌ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్‌ సింగ్‌ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్‌ లేకుండా తనదైన శైలిలో స్పాట్‌ బౌలింగ్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. హార్దిక్‌ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్‌కు రెండు రోజుల మాత్రం పిచ్‌పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్‌ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది.

New Zealand face South Africa in the first semi final of the T20 World Cup 2026 today2
సెమీస్‌ సమరానికి సిద్ధం

టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో రెండు టీమ్‌లదీ దాదాపు ఒకే రకమైన పరిస్థితి...ఇరు జట్లు ఒక్కో సారి ఫైనల్‌ వరకు చేరగలిగినా టైటిల్‌ గెలుచుకోలేక రన్నరప్‌గానే సంతృప్తి చెందాయి. లీగ్‌ దశలో అద్భుతంగా ఆడుతున్నా, ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసురుతున్నా అసలు సమయంలో మాత్రం ఈ టీమ్‌లు చేతులెత్తేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఫైనల్‌ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ సిద్ధమయ్యాయి. రెండు టీమ్‌లలో ఒకరికి మాత్రమే టైటిల్‌ వేటలో పోటీ పడేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లూ సై అంటున్నాయి. ఈడెన్‌ గార్డెన్స్‌లో హోరాహోరీ పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందనేది ఆసక్తికరం. కోల్‌కతా: టి20 వరల్డ్‌ కప్‌ తొలి నాకౌట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) జరిగే తొలి సెమీఫైనల్లో గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్‌ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో కూడా విజయాలు సాధించే దక్షిణాఫ్రికా అజేయంగా సెమీస్‌ చేరగా...కివీస్‌ ప్రస్థానం మాత్రం తడబడుతూ సాగింది. లీగ్‌ దశలో మూడు బలహీన జట్లను ఓడించిన న్యూజిలాండ్, సూపర్‌ ఎయిట్స్‌లో ఒకటే విజయంతో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దక్షిణాఫ్రికా అలవోక విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రదర్శనతో దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుతుందా లేక గత మ్యాచ్‌కు కివీస్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా చూడాలి. అద్భుత ఫామ్‌లో... 2024 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో దాదాపు చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించి అనూహ్యంగా ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారి మెగా టోర్నీకి బాగా సన్నద్ధమై వచ్చినట్లు కనిపించింది. ప్రత్యర్థులకు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు చెలరేగిపోతోంది. అఫ్గనిస్తాన్‌పై పోరు సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లినా...భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లను ఓడించిన తీరు జట్టు బలాన్ని చూపించింది. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. టాపార్డర్‌లో డికాక్, రికెల్టన్‌లనుంచి అతనికి సరైన మద్దతు లభిస్తోంది. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌లతో మిడిలార్డర్‌ చాలా పటిష్టంగా ఉంది. మిల్లర్‌ చాలా కాలంగా నిలకడగా రాణిస్తుండగా, బ్రెవిస్‌ మెరుపు బ్యాటింగ్‌తో ఏ టీమ్‌పైనైనా చెలరేగిపోగలడు. యాన్సెన్, బాష్‌ రూపంలో ఇద్దరు చక్కటి ఆల్‌రౌండర్లు ఉండటం జట్టు బలాన్ని పెంచింది. బౌలింగ్‌లో ఇద్దరు బెస్ట్‌ ఫాస్ట్‌ బౌలర్లు జట్టును నడిపిస్తున్నారు. రబాడ, ఎన్‌గిడి ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం కావడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీసి కోలుకోకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తన ఆటను అమాంతం మెరుగుపర్చుకున్న ఎన్‌గిడి ‘స్లో బంతులు’ బ్యాటర్లకు పెద్ద సమస్యగా మారాయి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కేశవ్‌ మహరాజ్‌ తన సత్తాను ప్రదర్శిస్తున్నాడు. ఓవరాల్‌గా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న సఫారీలకే గెలుపు సానుకూలత ఎక్కువగా ఉంది. తడబడుతూనే... ప్రత్యర్థితో పోలిస్తే న్యూజిలాండ్‌ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు బలాబలాల్లో ఏ జట్టుకూ కూడా తీసిపోనట్లు కనిపించిన కివీస్‌ అసలు సమయంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శనను చూపించలేకపోయింది. ఏ ఆటగాడు కూడా ఒంటిచేత్తో టీమ్‌ను గెలిపించేలా కనిపించడం లేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా జట్టులో తడబాటు కనిపిస్తూనే ఉంది. టాప్‌–3 బ్యాటర్లు సీఫెర్ట్, అలెన్, రచిన్‌లలో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఫిలిప్స్‌లో కూడా నిలకడ లోపించగా...చాప్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యాడు. ఇటీవల భారత్‌తో సిరీస్‌లో చెలరేగిన మిచెల్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కెపె్టన్‌ సాంట్నర్‌ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. బౌలింగ్‌లో విఫలమైన సాంట్నర్‌ బ్యాటింగ్‌లో కూడా ఒక్క ఇన్నింగ్స్‌ మినహా ఎక్కడా బాగా ఆడలేదు. ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం జట్టు బలహీనతలను స్పష్టంగా చూపించింది. బౌలింగ్‌లో ఫెర్గూసన్‌పైనే ప్రధానంగా పేస్‌ భారం ఉంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన హెన్రీ సెమీస్‌ వరకు తిరిగి వస్తాడని మేనేజ్‌మెంట్‌ చెప్పినా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక వేళ హెన్రీ రాకపోతే అతని స్థానంలో డఫీ బరిలోకి దిగుతాడు. కివీస్‌ ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో ఆడుతున్నా ఒక్కరు కూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. అందరూ ధారాళంగా పరుగులిస్తున్నారు. తుది జట్లు (అంచనా) దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బాష్, రబాడ, మహరాజ్, ఎన్‌గిడి న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్‌), సీఫెర్ట్, అలెన్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, సోధి, ఫెర్గూసన్, హెన్రీ / డఫీ5-0 టి20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా...ఐదు కూడా దక్షిణాఫ్రికానే గెలిచింది. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్‌. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావంతక్కువగా ఉన్నా సరే ఇక్కడ ఛేదన చాలా సులువు. భారత్, విండీస్‌ మధ్య పోరులో కూడా ఇది కనిపించింది. మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.

Lakshya Sen wins over world number one Shi Yuqi3
లక్ష్యసేన్‌ సంచలనం

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను పెను సంచలనంతో మొదలుపెట్టాడు. ప్రపంచంలోనే కొరకరాని ప్రత్యర్థి, చైనా గోడను తొలి రౌండ్లోనే బద్దలు కొట్టాడు. చైనాకు చెందిన టాప్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్‌ షి యూకిపై భారత షట్లర్‌ చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, సుదిర్మన్‌ కప్, థామస్‌ కప్‌లాంటి ఎన్నో టోర్నీల్లో స్వర్ణ, రజత పతకాలు సాధించిన షి యూకిని ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌ 23–21, 19–21, 21–17తో టాప్‌ సీడ్, తాజా ప్రపంచ చాంపియన్‌ షి యూకిని కంగుతినిపించాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 11–21, 6–21తో వరుస గేముల్లో మూడో సీడ్‌ చెన్‌ యూ ఫె (చైనా) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ పొర్న్‌పవీ చోచువాంగ్‌ (థాయిలాండ్‌) 21–12, 21–18తో ఉన్నతి హుడా (భారత్‌)ను ఓడించి ముందంజ వేసింది. డబుల్స్‌ జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జోడీ 21–17, 21–19తో హూ పాంగ్‌ రాన్‌–చెంగ్‌ సు యిన్‌ (మలేసియా) జంటపై గెలుపొందగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 15–21, 21–15, 18–21తో జపాన్‌కు చెందిన సయాక హిరోత–అయాకొ సకురమొతొ జంట చేతిలో పరాజయం చవిచూసింది. సింధు స్వదేశానికి... భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ కోసం బయల్దేరిన సింధు తాజా యుద్ధ పరిణామాల కారణంగా ఫ్లయిట్‌లు ఆగిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుంది. ఇంగ్లండ్‌ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. అయితే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకుంటే 5 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. అయితే సింధు ఇచి్చన వివరణ, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆల్‌ ఇంగ్లండ్‌ ఆర్గనైజర్లు జరిమానాను రద్దు చేశారు.

Indian womens football team ready for first match in Asia Cup tournament4
భారత్‌ X వియత్నాం

పెర్త్‌: మైదానం లోపలా బయటా సమస్యలతో సతమతమవుతున్న భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు... ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో తొలిపోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం మొదటి మ్యాచ్‌లో మనకంటే మెరుగైన ర్యాంక్‌ గల వియత్నాంతో టీమిండియా తలపడనుంది. చైనీస్‌ తైపీ, జపాన్, వియత్నాంతో కలిసి గ్రూప్‌ ‘సి’నుంచి భారత్‌ పోటీ పడుతోంది. గతేడాది అక్టోబర్‌ తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. చివరగా ఇరాన్, నేపాల్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మన అమ్మాయిలు పరాజయం పాలయ్యారు. మరి ఆ వైఫల్యాలను అధిగమించి బుధవారం మనవాళ్లు మైదానంలో ఆకట్టుకుంటారా చూడాలి. ఈ టోర్నమెంట్‌ కోసం గత నెల 11నే పెర్త్‌ చేరుకున్న భారత జట్టు... అక్కడ స్థానిక క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడి అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో వియత్నాం 36వ ర్యాంక్‌లో ఉండగా... భారత్‌ 67వ స్థానంలో కొనసాగుతోంది. ఫామ్‌ పరంగా చూసుకున్నా... వియత్నాం ఇటీవలే బలమైన ప్రత్యర్థులపై విజయాలతో సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉంది. మరి అలాంటి జట్టుపై ఆధిక్యం కనబర్చాలంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పదు. 2003లో చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ వియత్నాం విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన రెండేసి జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన రెండు మేటి జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరనున్నాయి. అందులో విజయం సాధించిన జట్లకు 2027లో బ్రెజిల్‌ వేదికగా జరగనున్న మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కనుంది. ‘2023 ఆసియాకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయాం. కానీ ఈ సారి మంచి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తాం. ఈ టోర్నీకి ముందు టర్కీలో ప్లేయర్ల కోసం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఆసియాకప్‌లో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌ అమేలియా వాల్‌వెర్డ్‌ పేర్కొంది. సరైన్‌ కిట్‌లు లేక... ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ కోసం చాలా ముందుగానే ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టుకు అనూహ్య ఇబ్బంది వచ్చి పడింది. జట్టు స్పాన్సర్‌ సరైన సమయానికి సరైన్‌ కిట్‌లు అందించకపోవడంతో ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీనిపై ఆగ్రహించిన ప్లేయర్లు తమ సమస్యను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) దృష్టికి తీసుకొచ్చారు. ‘అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రొఫెషనల్‌ ప్రమాణాలు అవసరం. కనీసం కిట్‌లను కూడా సరిగ్గా సమకూర్చలేకపోతే కష్టం. ప్రాక్టీస్‌ సమయంలోనే సరైన దుస్తులు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి కీలక టోర్నమెంట్‌ ఆడుతున్న సమయంలో కిట్‌లు సరిగ్గా లేకపోవడం అనేది ఎంతో బాధిస్తోంది. మ్యాచ్‌కు ముందు ఇలాంటి సమస్యలు మా ఏకాగ్రతను దెబ్బతీశాయి’ అని ప్లేయర్లు ఏఐఎఫ్‌ఎఫ్‌కు లేఖ రాశారు. కెపె్టన్‌ స్వీటి దేవి నాంగ్‌బమ్‌తో పాటు ఎనిమిది మంది ప్రధాన ప్లేయర్లు ఈ లేఖపై సంతకాలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సమాఖ్య మంగళవారం ప్లేయర్లకు కొత్త కిట్‌లు అందించినట్లు తెలిపింది.

Australia captain bids farewell to career5
హ్యాట్సాఫ్‌ హీలీ

ఆరుసార్లు ఐసీసీ మహిళల టి20 ప్రంపచకప్‌ ముద్దాడిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన ఘనత... మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు... అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన గుర్తింపు.. అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌గా చరిత్ర. వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌కీపర్‌! ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఆ్రస్టేలియా మహిళల క్రికెట్‌ జట్టు దిగ్గజ ప్లేయర్‌ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం టీమిండియాతో ఆడిన తన కెరీర్‌ చివరి వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కిన హీలీ... శుక్రవారం నుంచి పెర్త్‌ వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో చివరిసారి ఆసీస్‌ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. మహిళల క్రికెట్‌లో దిగ్గజ స్థాయికి చేరిన హీలీ కెరీర్‌ను ఓసారి విశ్లేషిస్తే... – సాక్షి, క్రీడావిభాగం ఇప్పుండంటే అలీసా హీలీ పెద్ద స్టార్‌ అయిఉండవచ్చు కానీ... కెరీర్‌ తొలినాళ్లలో ఆమె మెరుగైన జీవనం కోసం రెస్టారెంట్‌లో పనిచేసింది. 2009–10 మధ్య హీలీ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు కేఎఫ్‌సీలో పనిచేస్తూ క్రికెట్‌ ప్రాక్టీస్‌ కొనసాగించింది. అలా ఆమె పడ్డ శ్రమ వృథా పోలేదు. నిలకడగా రాణిస్తున్న హీలీకి 2010లో తొలిసారి జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆడిన అరంగేట్ర మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అలీసా... 11 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేసింది. అప్పటికీ అదీ మహిళల వన్డేల్లో ఈ దూకుడు ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. లోయర్‌ ఆర్డర్‌లో జట్టుకు మంచి ‘పించ్‌ హిట్టర్‌’ దొరికిందని మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే ఆ జోరు ఎక్కువ కాలం కొనసాగలేదు. వికెట్‌ల వెనక అద్భుతమైన ప్రతిభ కనబర్చిన హీలీ... బ్యాటింగ్‌లో ఆ స్థాయిలో రాణించలేకపోయింది. అయినా... కీపింగ్‌లో ఆమె అసాధారణ గణాంకాలు జట్టులో చోటుకు భరోసానిచ్చాయి. మలుపుతిప్పిన 2017 అప్పటి వరకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం... అవసరమైనప్పుడు ధాటిగా ఆడటం అలవాటు చేసుకున్న హీలీకి 2017లో అతిపెద్ద ప్రమోషన్‌ దక్కింది. ఆ ఏడాది అక్టోబర్‌లో హీలీకి ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశం దక్కింది. అప్పటి వరకు అడపాదడపా మెరుపులు మెరిపించిన అలీసా... ఇక దంచికొట్టడం ప్రారంభించింది. ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఇన్నింగ్స్‌ను వాయువేగంతో ప్రారంభించడం అలవాటుగా మార్చుకుంది. 2017కు ముందు... ఆ తర్వాత ఆమె కెరీర్‌ను చూస్తే అది స్పష్టంగా అర్థమవుతుంది. 2017 ముందు వరకు 52 మ్యాచ్‌లాడి 15.96 సగటుతో 495 పరుగులే చేసిన ఈ వికెట్‌కీపర్‌... ఆ తర్వాత 74 మ్యాచ్‌ల్లో 46.22 సగటుతో 3282 పరుగులు చేసింది. వన్డేల్లో అలీసా స్ట్రయిక్‌రేట్‌ వందకు పైగా ఉంది అంటే ఆమె ఆటతీరు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ‘నిజం చెప్పాలంటే కెరీర్‌ తొలి ఏడెనిమిది సంవత్సరాలు నేనేం అంత బాగా ఆడలేదు. అంతగా అవకాశాలు కూడా రాలేదు. కానీ ఆ తర్వాత మాత్రం చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశా’ అని ఇటీవల హీలీ వెల్లడించింది. 8 వరల్డ్‌కప్‌ల విజేత... అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ్రస్టేలియా హవా సాగుతున్న సమయంలోనే హీలీ కెరీర్‌ కొనసాగింది. దీంతో సహజంగానే ఆమె ఖాతాలో అత్యధిక వరల్డ్‌కప్‌లు చేరాయి. 2010, 2012, 2014, 2018, 2020, 2023 ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో హీలీ సభ్యురాలు... మహిళల క్రికెట్‌లో మరే ప్లేయర్‌ ఆరుసార్లు పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఇక 2013, 2022 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులోనూ హీలీ ప్రధానపాత్ర పోషించింది. 2022 వరల్డ్‌కప్‌ పైనల్లో ఆమె కొట్టిన సెంచరీని అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు చేసి ఆసీస్‌ భారీ విజయానికి అలీసా బాటలు వేసింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది రికార్డు సృష్టించిన హీలీ... టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో విఫలమైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన ఆసీస్‌ సారథి... ఆసీస్‌లో టీమిండియా పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలగనుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఆఖరి వన్డేలో హీలీ బ్యాటింగ్‌ చూసిన వారెవరైనా ఆమెకు 35 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే. కెరీర్‌ ఆఖరి వన్డేలోనూ అలవోకగా పరుగులు రాబట్టిన హీలీ అనవసరంగా రిటైర్మెంట్‌ ప్రకటించిందనే అనుమానం రాకమానదు. తన కెరీర్‌లో చివరి వన్డేలో కెప్టెన్ గా బరిలోకి దిగిన ఈ ఓపెనర్‌ 98 బంతుల్లోనే 158 పరుగులు చేసింది. ఆమె కెరీర్‌లో ఎన్నో శతకాలు ఉన్నా... దీని ప్రత్యేకతే వేరు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం బౌండరీల ద్వారానే అలీసా 120 పరుగులు రాబట్టడం విశేషం. ఇన్ని ఘనతలు సాధించిన హీలీ... శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోనుంది. గతేడాది జరిగిన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో ఆమెను ఏ జట్టు తీసుకోకపోయినా... భవిష్యత్తుల్లో అలీసా మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటం ఖాయమే. మిచెల్‌ స్టార్క్‌తో వివాహబంధం...క్రీడా కుటుంబానికే చెందిన హీలీ మొదటి నుంచే మంచి అథ్లెట్‌. దీంతో కష్టతరమైన క్యాచ్‌లను సైతం ఎంతో ఒడుపుగా అందుకునేది. ఆ్రస్టేలియా దిగ్గజ క్రికెటర్‌ ఇయాన్‌ హీలీ అన్న కుమార్తెగా తనమీద ఉన్న ముద్రను చెరిపేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2015లో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్‌ జట్టు పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో హీలీకి పరిచయం ఏర్పడింది. స్టార్క్‌ కూడా వికెట్‌ కీపర్‌గానే కెరీర్‌ ప్రారంభించగా... వీరిద్దరి మనసులు కలిసి 2016లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు అండగా నిలుస్తూ... రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున టెస్టు క్రికెట్‌ ఆడిన తొలి భార్యాభర్తలుగా రికార్డు సృష్టించిన వీరిద్దరూ... పలు సందర్భాల్లో తమ మధ్య అవగాహనను బాహాటంగానే వెల్లడించారు. 2020లో మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో తన భార్య ఆట చూసేందుకు స్టార్క్‌ వన్డే సిరీస్‌ నుంచి సెలవు తీసుకొని స్వదేశానికి చేరడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.

Mohammad Amir Makes New Prediction On India After T20 WC Semifinals Take6
చెత్త ఫీల్డింగ్‌.. టీమిండియా గెలవలేదు: పాక్‌ మాజీ బౌలర్‌ ఓవరాక్షన్‌

పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత జట్టుకు ఫైనల్‌ చేరే సత్తా లేదంటూ అవాకులు చెవాకులు పేలాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ దశలో సూర్యకుమార్‌ సేన అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్‌-8గ్రూప్‌-‘ఎ’లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి.. సూపర్‌-8లో అడుగుపెట్టింది. అయితే, స్థాయికి తగ్గట్లు రాణించడంలో మాత్రం విఫలమైందనే చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్‌ స్థానిక మీడియాలో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ సెమీస్‌ చేరతాయని.. టీమిండియా ఎట్టి పరిస్థితుల్లోనూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టలేదంటూ ఓవరాక్షన్‌ చేశాడు.అయితే, అతడి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. వెస్టిండీస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా టాప్‌-4లో అడుగుపెట్టింది. దీంతో మహ్మద్‌ ఆమిర్‌ను చివాట్లు పెడుతూ టీమిండియా అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండిఅయినప్పటికీ ఆమిర్‌ తీరు మారలేదు. మరోసారి టీమిండియాను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘క్రికెట్‌ కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. నిజానికి టీమిండియా అంత గొప్పగా ఏమీ ఆడటం లేదు. ముఖ్యంగా ఆ జట్టు ఫీల్డింగ్‌ చూడండి.గత మ్యాచ్‌లో వాళ్లు 3-4 క్యాచ్‌లు వదిలేశారు. జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించడం లేదు. హార్దిక్‌ పాండ్యా పెద్ద జట్లపై ఆడలేడని నేను చెప్పాను. అందుకు తగ్గట్లేఅతడు నాలుగు ఓవర్లలో అతడు 40 పరుగులు ఇచ్చుకున్నాడు.టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదుఇక వెస్టిండీస్‌ బ్యాటర్లు వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. సెమీ ఫైనల్లో భారత్‌తో ఆడే జట్టు స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించగల సత్తా కలిగి ఉంది. కాబట్టి నా దృష్టిలో టీమిండియా టైటిల్‌ ఫేవరెట్‌ కాదు. వాళ్లు ఫైనల్‌ చేరతారని నేను ఇప్పటికీ నమ్మడం లేదు’’ అని మహ్మద్‌ ఆమిర్‌ అతి చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత నెటిజన్లు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు పాకిస్తాన్‌ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని హితవు పలుకుతున్నారు. కాగా పాక్‌ సూపర్‌-8 దశలోనే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. ముంబైలో గురువారం జరిగే ఈ మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం వేదిక. చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

T20 WC Semis IND vs ENG: Sanju Samson biggest threat Jofra Archer7
T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నాకౌట్‌ దశకు చేరుకుంది. ఇ‍ప్పటికే నాలుగు సెమీస్‌ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌.. రెండో సెమీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌- టీమిండియా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.సఫారీ- కివీస్‌ జట్లు బుధవారం కోల్‌కతా వేదికగా అమీతుమీ తేల్చుకోనుండగా.. భారత్‌- ఇంగ్లండ్‌ (IND vs ENG) ముంబై గురువారం సెమీ ఫైనల్లో పోటీపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక సూపర్‌-8లో హ్యాట్రిక్‌ విజయాలతో ఇంగ్లండ్‌ జోరు మీద ఉండగా.. టీమిండియా మాత్రం సెమీస్‌ చేరేందుకు కష్టపడాల్సి వచ్చింది.వీరోచిత ఇన్నింగ్స్‌అయితే, వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ (50 బంతుల్లో 97 నాటౌట్‌)తో రాణించడంతో భారత్‌ గట్టెక్కి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ తప్పిదాలు.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తప్ప వేరే బౌలర్‌ ఎవరూ పెద్దగా రాణించకపోవడం.. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ విఫలం కావడం సెమీస్‌కు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి.సంజూకు పొంచి ఉన్న ప్రమాదంఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన సంజూకు ఈ మ్యాచ్‌లో మాత్రం జోఫ్రా ఆర్చర్‌ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. గతేడాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఇంగ్లండ్‌ పేసర్‌ సంజూను బాగా ఇబ్బంది పెట్టాడు.సంజూకు ఆర్చర్‌ 23 డెలివరీలు సంధించగా.. అతడు కేవలం 25 పరుగులే రాబట్టగలిగాడు. ఇందులో ఒక ఫోర్‌, రెండు సిక్స్‌లు మాత్రమే ఉన్నాయి. అంతేకాదు.. మూడుసార్లు ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.ఆర్చర్‌తో పాటు అతడూఒకవేళ ఇంగ్లండ్‌ ఈసారి కూడా ఆర్చర్‌తోనే బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభిస్తే.. ఓపెనర్‌ సంజూ మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇక సామ్‌ కర్రాన్‌ కూడా సంజూకు సవాలు విసిరే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్‌లో నాలుగేళ్లలో సామ్‌ సంజూకు 16 డెలివరీలు సంధించగా.. అతడు 21 పరుగులు చేయగలిగాడు. రెండుసార్లు అవుటయ్యాడు. ఈ ప్రమాదాల్ని అధిగమిస్తేనే సంజూ టీమిండియాకు మంచి ఆరంభం ఇవ్వగలడు. గత గణాంకాలను బట్టి సంజూను తుదిజట్టులో ఆడిస్తారా?.. ఒకవేళ ఆడించినా ఓపెనర్‌గా పంపుతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వేటు పడుతుందా?అయితే, సంజూపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌ విండీస్‌తో ఆడిన జట్టుతోనే ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌ ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా, వికెట్‌ కీపర్‌గా జట్టులో స్థానం కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో ఆడిన అతడు.. ఆ తర్వాత మళ్లీ సూపర్‌-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఆడాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి 143 పరుగులు సాధించాడు.వెస్టిండీస్‌తో ఆడిన భారత తుదిజట్టుసంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Protest At Gymkhana Ground During HCA President Press Meet 8
ఆ ఆరోపణల్లో నిజం లేదు!.. HCAకు వ్యతిరేకంగా ధర్నా

తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (HCA) అధ్యక్షుడు అమర్‌నాథ్‌ కొట్టిపారేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి చెక్కు లపై సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు. కాగా HCA నుంచి విశాఖ కంపెనీకి రూ. 69 కోట్లు చెల్లింపులు జరిగాయన్న అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం జింఖానా గ్రౌండ్స్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అమర్‌నాథ్‌.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని పేర్కొన్నారు. ‘‘69 కోట్ల రూపాయలు HCA నుంచి విశాఖ కంపెనీ కి చెల్లింపుల వెనుక నా ప్రమేయం లేదు. నేను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగింది. డబ్బులు చెల్లించాలి అని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి’’ అని అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఒకవైపు HCA ప్రెస్ మీట్ జరుగుతుండగానే క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. HCAలో 70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. నిధులు తప్పుదోవ పట్టించారని ఆందోళన చేపట్టాయి.మంత్రి వివేక్‌కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ కి 70 కోట్ల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు చేశాయి. మంత్రి ఆదేశాల మేరకు HCA లో ఉన్న పెద్దలు 70 కోట్లు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ఆరోపించాయి. ఈ ఆరోపణను కొట్టి పారేస్తూ.. HCA ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగానే క్రికెట్ సంఘాలు మళ్లీ ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో జింఖానా గ్రౌండ్ లో గందరగోళం నెలకొంది.

Become A Star In Short Time: Ex India Star Slams Abhishek Sharma9
బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఆట తీరుపై విమర్శల వర్షం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ చేసిన పరుగులు 80. ఇందులో మూడు డకౌట్లు.. ఓ హాఫ్‌ సెంచరీ ఉన్నాయి.సూపర్‌-8 దశలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం పది పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్‌కు ముందు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) ఆట తీరుపై మండిపడ్డాడు. నిర్లక్ష్యంగా ఆడితే.. తుదిజట్టులో చోటు కోల్పోయే దుస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ..తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌గా‘‘వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే చెత్త షాట్లతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతి తక్కువ సమయంలోనే అభిషేక్‌ శర్మ సూపర్‌ స్టార్‌ అయ్యాడు. భవిష్యత్తులోనూ సూపర్‌స్టార్‌గా కొనసాగాలంటే జట్టుకు విజయాలు అందించాలి.భారత జట్టులో చోటు కోసం ఎంతో మంది పోటీపడుతున్నారు. ఎంతో మంది మ్యాచ్‌ విన్నర్లుగా ఇప్పటికే నిరూపించుకున్నారు. వాళ్లందరినీ దాటి జట్టులో కొనసాగాలంటే మెరుగ్గా ఆడాలి. బ్యాటింగ్‌ చేయడు.. చెత్త ఫీల్డింగ్‌వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అతడు బ్యాట్‌ ఝులిపించాల్సింది. అంతేకాదు రెండు క్యాచ్‌లు జారవిడిచి.. చెత్త ఫీల్డింగ్‌తోనూ నిరాశపరిచాడు. అతడి మైండ్‌సెట్‌ ఇప్పటికైనా మారాలి’’ అని మనోజ్‌ తివారి అభిషేక్‌ శర్మ ఆట తీరును విమర్శించాడు. మరోవైపు.. భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం అభిషేక్‌ ఫామ్‌లేమిపై ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న ఈ టీమిండియా ఓపెనర్‌ ఆటపై అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు.చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

IPL 2026 Its Official: RCB confirmed to return to Chinnaswamy stadium10
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్‌ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్‌ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్‌-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్‌ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్‌లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్‌లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్‌ మీనన్‌ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్‌లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్‌ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్‌లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్‌గా టైటిల్‌ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌: గంభీర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement