Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

rain washes out New Zealand-Pakistan clash1
పాకిస్తాన్‌-న్యూజిలాండ్ మ్యాచ్ ర‌ద్దు

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా శ‌నివారం కొలంబో వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా రద్దయ్యింది. దీంతో ఇరు జ‌ట్ల‌కు త‌లో పాయింట్ ల‌భించింది. షెడ్యూల్ ప్ర‌కారం సాయంత్రం 6:30 గంట‌ల‌కు టాస్ ప‌డింది.అయితే టాస్ వేసిన కొద్దిసేపటికే వర్షం ప్రారంభమైంది. మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. దాదాపు రెండున్నర గంటల నిరీక్షణ తర్వాత కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. సూపర్-8 గ్రూప్-2లో ఉన్న ఈ రెండు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. అయితే మొద‌టి మ్యాచే ర‌ద్దు కావ‌డంతో, సెమీస్ చేరాలంటే తర్వాత జరగబోయే మ్యాచుల్లో ఇరు జ‌ట్లు క‌చ్చితంగా గెల‌వాల్సిందే. న్యూజిలాండ్ త‌మ తదుప‌రి మ్యాచ్‌లో బుధ‌వారం శ్రీలంక‌తో త‌ల‌ప‌డ‌నుంది. పాక్ విష‌యానికి వ‌స్తే ఫిబ్ర‌వ‌రి 24న ఇంగ్లండ్‌తో ఆడ‌నుంది.

IND W vs AUS W 3rd T20I: India Beat Australia Won Series2
ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ మనదే

ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత మహిళా క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. ఆతిథ్య జట్టును పదిహేడు పరుగుల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడేందుకు భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆసీస్‌ వుమెన్‌ టీమ్‌తో తొలి టీ20లో గెలుపొందిన భారత్‌.. రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది.స్మృతి మంధాన ధనాధన్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో టీ20 జరిగింది. అడిలైడ్‌ వేదికగా టాస్‌ గెలిచిన హర్మన్‌ సేన.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో స్మృతి మంధాన 55 బంతుల్లో 82 పరుగులతో ఇరగదీయగా.. షఫాలి వర్మ (7) విఫలమైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ అర్ధ శతకం (59)తో సత్తా చాటగా రిచా ఘోష్‌ 18 పరుగులు చేసింది.కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2 పరుగులతో అజేయంగా నిలవగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (1), దీప్తి శర్మ (1) రనౌట్‌ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 176 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ రెండు వికెట్లు తీయగా.. కిమ్‌ గార్త్‌, కెప్టెన్‌ సోఫీ మొలినెక్స్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.చెలరేగిన శ్రేయాంక, శ్రీచరణిఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఓపెనర్లు జార్జియా వోల్‌ (10), బెత్‌ మూనీ (6) సహా ఎలిస్‌ పెర్రీ (1) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోబే లిచిఫీల్డ్‌ (26) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. ఆష్లే గార్డ్‌నర్‌ హాఫ్‌ సెంచరీ (57) చేసింది. కానీ మిగిలిన వారి నుంచి ఆమెకు సహకారం అందలేదు.భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్, శ్రీచరణి తలా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. అరుంధతి రెడ్డి రెండు, రేణుకా సింగ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. స్మృతి మంధానకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

IND vs SA Except the openers: Suryakumar Yadav on Batting Flexibility3
వాళ్ల గురించే నా బాధంతా!: ఇచ్చిపడేసిన సూర్యకుమార్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు తాము సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకుంటామని పేర్కొన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ ఎలా ఉన్నా వ్యూహాలకు తగినట్లు ఆడటంలో తమ బ్యాటర్లు దిట్ట అని సూర్య అన్నాడు.కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌-8 దశలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. కాగా గ్రూప్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లను గెలిచాయి భారత్‌, సౌతాఫ్రికా.ప్రతికూల అంశాలు ఇవేఅయితే, గ్రూప్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) డకౌట్‌ కావడం.. భారత బ్యాటర్లు స్పిన్‌ బౌలింగ్‌లో తడబడటం వంటివి ప్రతికూలాంశాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఐడెన్‌ మార్క్రమ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌లతో కూడిన స్పిన్‌ దళంతో అటాక్‌ చేసే అవకాశం ఉంది.వాళ్ల గురించే నా బాధంతా!ఈ విషయాల గురించి టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) తాజాగా స్పందించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మ సరిగ్గా ఆడటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో.. ఆ వ్యక్తుల గురించే నేను ఎక్కువగా వర్రీ అవుతున్నా.అతడిని ఎదుర్కొనే ప్రత్యర్థుల గురించే నా బాధంతా!.. గతేడాది అతడు అదరగొట్టాడు. తిరిగి ఫామ్‌ అందుకుంటాడు. ఇక మా జట్టులో ఓపెనర్లు తప్ప 3-8 మధ్య ప్రతీ బ్యాటర్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ 8-9 ఓవర్ల వరకు వికెట్‌ పడకపోతే.. శివం దూబే లేదంటే హార్దిక్‌ పాండ్యా టాప్‌నకు ప్రమోట్‌ అవుతారు.సమస్య లేదునాతో సహా జట్టులో ప్రతి ఒక్కరి బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారుతూనే ఉంటుంది. రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ లేదంటే ఇంకెవరైనా బౌలింగ్‌ చేసినా వారిని ఎదుర్కోగల సత్తా మా వాళ్లకు ఉంది. కాబట్టి బౌలర్లు ఎవరన్న అంశంతో మాకు సంబంధం లేదు. మా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు తనకంటూ ప్రత్యేక నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఎవరి గేమ్‌ప్లాన్‌ వారికి స్పష్టత ఉంది. కాబట్టి సమస్య లేదు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన జట్టు పట్ల ఆత్మవిశ్వాసం కనబరిచాడు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

We Will expose under pressure India: SA Coach Conrad ahead Super 8 clash4
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే: సౌతాఫ్రికా కోచ్‌

సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్‌ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు​ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.అజేయంగా సూపర్‌-8కుఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్‌కప్‌-2026లో హాట్‌ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచి సూపర్‌-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్‌-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది.ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదేఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కన్రాడ్‌ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.సెమీ ఫైనల్‌.. ఆపై ఫైనల్‌ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. భారత్‌దే ఆధిపత్యంకాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించింది. టీ20 సిరీస్‌లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్‌కప్‌ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్‌ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

I love my man: Mahieka Sharma Reply to Hardik Pandya goes viral5
’నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనే’

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రేమలో మునిగితేలుతున్నాడు. భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడిపోయిన ఈ బరోడా క్రికెటర్‌కు మహీక శర్మ రూపంలో కొత్త ప్రేమ దొరికింది. గతేడాది తమ బంధాన్ని బహిర్గతం చేసిన హార్దిక్‌- మహీక అప్పటి నుంచి రొమాంటిక్‌ పోస్టులతో సోషల్‌ మీడియాను నింపేస్తున్నారు.ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణిస్తూ టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న హార్దిక్‌.. ప్రియురాలు మహీక పుట్టినరోజును ఇటీవల ఘనంగా సెలబ్రేట్‌ చేశాడు.నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డేపాకిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం తనతో పాటు మహీకను శ్రీలంకకు తీసుకువెళ్లిన హార్దిక్.. అక్కడ ఓ స్విమింగ్‌ పూల్‌లో ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ‘‘నా రాజకుమారికి హ్యాపీ బర్త్‌డే’’ అంటూ విషెస్‌ తెలిపాడు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వే. నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని హార్దిక్‌ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రేమను కురిపించాడు. ఇందుకు మహీక శర్మ సైతం తనదైన శైలిలో బదులిచ్చింది. నా వాడు.. ప్రపంచంలో అందరికంటే లక్కీ గర్ల్‌ నేనేహార్దిక్‌తో కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఐ లవ్‌ మై మ్యాన్‌. నా జీవితంలో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమైన పుట్టినరోజు. థాంక్యూ బేబీ. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతురాలైన అమ్మాయిని నేనే’’ అంటూ హార్దిక్‌తో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది.కొడుకు సమక్షంలో మరోసారి పెళ్లికాగా సెర్బియా మోడల్‌ నటాషాను ప్రేమించిన హార్దిక్‌ పాండ్యా.. 2020లో సన్నిహితుల నడుమ ఆమెను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికే నటాషా గర్భవతి. అదే ఏడాది ఈ జంట కుమారుడు అగస్త్యకు జన్మనిచ్చింది. అనంతరం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే, కొంతకాలానికే హఠాత్తుగా విడాకుల బాంబు పేల్చారు. 2025 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.ఆ తర్వాత కొన్నాళ్లకే మహీకతో 32 ఏళ్ల హార్దిక్‌ తన ప్రేమ బంధాన్ని చాటుకుంటూ విహారయాత్రలలో దిగిన ఫొటోలు షేర్‌ చేయడం మొదలుపెట్టాడు. కాగా మహీక ఫిబ్రవరి 19న 25వ వసంతంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్‌ ధర అక్షరాలా రెండు లక్షలు ఉండటం గమనార్హం. కాగా మహీక ఓ మోడల్‌ అన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!

T20 WC Super 8: What Happens If Pak vs NZ Match Gets Washed Out6
NZ vs PAK: పాక్‌, కివీస్‌లకు బ్యాడ్‌న్యూస్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఎనిమిది జట్లు ముందడుగు వేశాయి. మిగిలిన పన్నెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. టాప్‌-8 జట్లతో కీలకమైన సూపర్‌-8 దశకు శనివారం తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో కివీస్‌- పాక్‌ ఢీసెమీస్‌ రేసులో భాగంగా గ్రూప్‌-2 నుంచి తొలుత న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ (NZ vs PAK) మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ మొదలుకావాల్సి ఉంది.అయితే, కివీస్‌- పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల గ్రూప్‌-బి నుంచి పల్లెకెలెలో జింబాబ్వే- ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాన కారణంగా టాస్‌ పడకుండానే రద్దైపోయింది. తాజాగా న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.పొంచి ఉన్న వాన ముప్పుఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. కొలంబోలో శనివారం వర్షం పడేందుకు 80- 100 శాతం అవకాశాలు ఉన్నాయి. పగలు 75 శాతం.. రాత్రి 87 శాతం వాన కురిసేందుకు ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 52 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది.మ్యాచ్‌ రద్దైతే గనుకఇక కివీస్‌- పాక్‌ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు మొదలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం వల్ల మ్యాచ్‌ గనుక రద్దైపోతే ఇరుజట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లే. సూపర్‌-8 మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేదు కాబట్టి.. మ్యాచ్‌ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. దీంతో తదుపరి మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంటుంది.కాగా సూపర్‌-8లో గ్రూప్‌-1 నుంచి భారత్‌, జింబాబ్వే, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా తలపడుతుండగా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పోటీలో ఉన్నాయి. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్న కివీస్‌, పాక్‌... తదుపరి శ్రీలంక, ఇంగ్లండ్‌లతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.ఒక్క మ్యాచ్‌ ఫలితం తేడా వచ్చినా ఇందులో భాగంగా పాకిస్తాన్‌ ఫిబ్రవరి 24న లండ్‌తో, ఫిబ్రవరి 28న శ్రీలంకతో.. న్యూజిలాండ్‌ ఫిబ్రవరి 25న శ్రీలంకతో, ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌తో తలపడతాయి. సెమీస్‌ రేసులో ఒక్క మ్యాచ్‌ ఫలితం తేడా వచ్చినా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి శనివారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాలని అటు న్యూజిలాండ్‌.. ఇటు పాకిస్తాన్‌ పట్టుదలగా ఉండగా.. ఫలితం వరుణుడి మీద ఆధారపడి ఉంది.ఫామ్‌ పరంగా దొందూ దొందేఇదిలా ఉంటే.. కివీస్‌ జట్టులో టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ మాత్రమే ఇప్పటి వరకు సత్తా చాటారు. మిగిలిన వారి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగడం పాకిస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. కొలంబో పిచ్‌పై వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. శనివారం నాటి మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లు కోసం ఇప్పటికే పాక్‌ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈసారి కూడా పాక్‌ స్పిన్‌ దళాన్నే నమ్ముకోనుంది. అయితే, పాక్‌ బ్యాటర్లలో ఫర్హాన్‌ మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ప్రతికూల అంశం. కాబట్టి ఫామ్‌ పరంగా ప్రస్తుతం కివీస్‌- పాక్‌ ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Bitterly: Mitchell Marsh Breaks Silence on AUS Early T20 WC 2026 Exit7
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్‌ కెప్టెన్‌

మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్‌ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్‌ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్‌పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్‌.. లీగ్‌ దశలో చివరగా పసికూన ఒమన్‌ను ఓడించి విజయంతో ముగించింది.ఇదొక చేదు అనుభవంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్‌-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్‌రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్‌ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.గుణపాఠం నేర్చుకుంటాముఇక్కడి పిచ్‌ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.క్రికెట్‌ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము. చాలా బాధగా ఉందిఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్‌ మార్ష్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఒమన్‌పై జయభేరి మోగించింది. ఆడమ్‌ జంపా (4/21), మ్యాక్స్‌వెల్‌ (2/13), బార్ట్‌లెట్‌ (2/27), స్టొయినిస్‌ (2/16), ఎలిస్‌ (1/14) ఇలా... బౌలింగ్‌ దళమంతా కలిసి ఒమన్‌ బ్యాటర్లను దెబ్బకొట్టింది.మిచెల్‌ మార్ష్‌ ధనాధన్‌ముందుగా ఒమన్‌ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్‌ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (33 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెడ్‌ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Bas de Leede Demand ICC for more opportunities against big teams IND8
T20 WC: ఐసీసీకి డచ్‌ క్రికెటర్‌ డిమాండ్‌.. కనీసం..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ కీలక దశకు చేరుకుంది. నాలుగు గ్రూపుల నుంచి సత్తా చాటి టాపర్లుగా నిలిచిన జట్లు సూపర్‌-8లో అడుగుపెట్టాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి జింబాబ్వే, శ్రీలంక.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ సెమీస్‌ రేసులో నిలిచాయి.పసికూనలతో పాటు ఆసీస్‌ కూడా.. ఇక మిగిలిన జట్లు గ్రూప్‌-ఎ నుంచి అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా.. ‘బి’ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, ఒమన్‌.. ‘సి’ నుంచి స్కాట్లాండ్‌, ఇటలీ, నేపాల్‌.. ‘డి’ నుంచి అఫ్గనిస్తాన్‌, యూఏఈ, కెనడా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ బాస్‌ డి లీడె ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి డిమాండ్‌భారత్, ఆస్ట్రేలియాలాంటి జట్లతో ముక్కోణపు సిరీస్‌లు ఆడే భాగ్యమైతే దక్కనే దక్కదు... కనీసం ఇలాంటి మేటి ప్రత్యర్థులతో వార్మప్‌ మ్యాచ్‌లైనా ఏర్పాటు చేయండని అతడు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)ని కోరాడు. అసోసియేట్‌ జట్ల ఆట ఎప్పుడో ఒకసారి అది కూడా ఐసీసీ ప్రపంచకప్‌ల వరకే పరిమితమవుతోందని అన్నాడు.గట్టి ప్రత్యర్థులతో ఆడే అవకాశం తరచు దక్కడం లేదని లీడె వాపోయాడు. నెదర్లాండ్స్‌ మాజీ క్రికెటర్‌ టిమ్‌ డి లీడె కుమారుడైన బాస్‌ డి లీడె ప్రస్తుతం డచ్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌ ఆడాడు. గ్రూప్‌ దశలో భారత్‌తో చివరి మ్యాచ్‌ ఆడిన నెదర్లాండ్స్‌ ఓటమితో మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించింది.కనీసం వార్మప్‌ మ్యాచ్‌లైనా ఆడండి‘ప్రస్తుత ఐసీసీ భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం, ప్రపంచ వ్యాప్త టి20 లీగ్‌లతో భారత్, ఆసీస్‌ లాంటి శాశ్వత దేశాలు, ఆటగాళ్లు ఊపిరి సలపని బిజీ షెడ్యూల్‌తో ఉంటారని మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఘనాపాఠిలతో మాకు ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు సిరీస్‌లంటే అది అయ్యే పని కాదు. నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఏర్పాటు చేయలేక పోయినా... ఈ అంతర్జాతీయ మేటి ప్రత్యర్థులతో వార్మప్‌ మ్యాచ్‌లైనా ఆడిస్తే మా జట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడో ఓసారి జరిగే మెగా ఈవెంట్‌లో ఆడటం... అక్కడితో మా అంతర్జాతీయ క్రికెట్‌ (మేటి జట్లతో) అటకెక్కడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది’ అని లీడె అన్నాడు. చదవండి: T20 WC: సిగ్గులేకుండా అబద్ధాలు.. మా ఆటగాళ్లకే నష్టం: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

IND vs SA: Hardik Shot Hits Teammate Knee Leaves Field IND Big Injury Scare9
T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్‌ దశలో భాగంగా గ్రూప్‌-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్‌ సేన సూపర్‌-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.తొలుత దక్షిణాఫ్రికాతో..ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్‌-1లో ఉన్న టీమిండియా.. సూపర్‌-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ మొదలుకానుంది.ప్రాక్టీస్‌లో తలమునకలుఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్‌ కారణంగా భారత స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్‌ బాదిన బంతి సిరాజ్‌ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.గాయపడిన పేసర్‌దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్‌ మధ్యలోనే నెట్‌ సెషన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్‌ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.గాయాల బెడదకాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్‌, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చిన సిరాజ్‌.. గ్రూప్‌ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఇప్పుడిలా..మరోవైపు.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. ఆఖరిగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడు బరిలోకి దిగాడు.ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్‌-8లో భారత్‌.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Told Such Blatant Lies: Bangladesh Coach Slams Nazrul Over T20 WC Row10
సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 ఆడాలన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల కల కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా టోర్నీ ఆరంభానికి ముందే జట్టు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కీలక క్రికెటర్లు బ్యాట్‌ స్పాన్సర్లతో పాటు ఇతర క్రికెట్‌ పరికరాల స్పాన్సర్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.యూటర్న్‌ల నజ్రుల్‌అయితే, వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని క్రీడా శాఖ మాజీ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తొలుత మీడియాకు వివరించారు. కానీ ఆ తర్వాత మాట మారుస్తూ దేశం కోసం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లే ప్రపంచకప్‌ ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో దుమారం రేగింది.దీంతో మరోసారి యూటర్న్‌ తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ప్లేయర్లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారని.. తన మాటల్ని వక్రీకరించడం వల్లే అపార్థాలు మొదలయ్యాయని నజ్రుల్‌ నాలుక మడతేశారు. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ మొహమ్మద్‌ సలావుద్దీన్‌ (Mohammad Salahuddin) ఘాటుగా స్పందించాడు. సిగ్గులేకుండా అబద్ధాలునజ్రుల్‌ అబద్ధాలకోరు అని.. బుద్ధి లేకుండా ఇష్టారీతిన అవాస్తవాలు ప్రచారం చేశాడని మండిపడ్డాడు. ‘‘నేనొక ఉపాధ్యాయుడిని. నాలాంటి టీచర్లు అబద్ధాలు చెప్పేందుకు వెనుకాడతారు. కానీ అతడు మాత్రం నిర్భయంగా అందరి ముందు అబద్ధాలు చెప్పాడు.అసలు అతడు అలా ఎలా చేయగలిగాడో నాకు ఇంత వరకు అర్థం కావడం లేదు. ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని అతడు చెప్పాడు. అలాంటి సమయంలో మా కుర్రాళ్లకు నేను ఎలా ముఖం చూపించగలను? అతడు అంత దారుణంగా యూటర్న్‌ తీసుకుంటాడని ఊహించలేదు.అతడు కూడా ఒక టీచర్‌. ఢాకా యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేసిన వ్యక్తి. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం సరికాదు. దీనిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఆయనకు ఇదెలా సాధ్యమైంది. మాటలు మార్చడం ఆయనకు అలవాటేమో! మాకు మాత్రం కాదు.మా ఆటగాళ్లు మానసికంగా కుంగిపోయారువరల్డ్‌కప్‌ ఆడాలన్న మా బాయ్స్‌ కల ఒక్క క్షణంలో చెదిరిపోయింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆటగాడు నష్టపోయాడు. మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లైతే ఐదు రోజుల వరకు మానసికంగా కోమాలోకి వెళ్లిపోయారంటే నమ్మండి. మళ్లీ వాళ్లలో ఉత్తేజం నింపి మైదానంలో అడుగుపెట్టేలా చేయాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది’’ అని సలావుద్దీన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.జరిగింది ఇదీకాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్‌ పట్టుపట్టింది. భారత్‌లో తమకు భద్రత లేదని.. మరో ఆతిథ్య దేశం శ్రీలంకలో తమను ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్‌ వాదనలో నిజం లేదని తమ కమిటీ చెప్పడంతో ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలని బంగ్లాదేశ్‌కు గడువు​ ఇవ్వగా.. తగ్గేదేలే అంటూ బంగ్లా పంతానికి పోయింది. దీంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ. దీంతో బంగ్లాదేశ్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement