ప్రధాన వార్తలు
పొట్టికప్లో బోణి.. నెదర్లాండ్స్పై యూఎస్ఏ గ్రాండ్ విక్టరీ
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ యూఎస్ఏ గ్రాండ్ విక్టరీ కొట్టింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యూఎస్ఏ బ్యాటర్లలో ముక్కమల్ల సాయితేజ(79) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు.అనంతరం 197 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కేవలం 103 పరుగలకే చాప చుట్టేసింది. లక్ష్య ఛేదనలో 15.5 ఓవర్లలోనే ఆలౌట్ కాగా.. నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డే లీడే (23) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఎస్ఏ టీ20 ప్రపంచకప్లో బోణికొట్టింది. USA notch up a big win in Chennai to earn crucial points at the #T20WorldCup 2026 👌 📝: https://t.co/n1q9ZX2kpH pic.twitter.com/hnvO4BoqAc— ICC (@ICC) February 13, 2026
T20 WC 2026: సత్తా చాటిన సాయితేజ.. యూఎస్ఏ భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 13) రాత్రి మొదలైన మ్యాచ్లో యూఎస్ఏ, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో యూఎస్ఏ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి నెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన యూఎస్ఏ.. సాయితేజ ముక్కామల (79), శుభ్మ్ రంజనే (48 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.మిగతా యూఎస్ఏ ఆటగాళ్లలో మొనాంక్ పటేల్ (36), షయాన్ జహంగీర్ (20) కూడా రాణించారు. సంజయ్ కృష్ణమూర్తి (1), మిలింగ్ కుమార్ (3), హర్మీత్ సింగ్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. మొహమ్మద్ మొహిసిన్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ (4-0-37-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లొగాన్ వాన్ బీక్ (4-0-28-1), కైల్ క్లెయిన్ (4-0-35-1), ఫ్రెడ్ క్లాసెన్ (3-0-32-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ ధాటిగా ప్రారంభించింది. తొలి 5 ఓవర్లలో ఆ జట్టు 41 పరుగులు చేసింది. అయితే కీలకమైన రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైఖేల్ లెవిట్ 3 పరుగులు చేసి కెంజిగే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. మ్యాక్స్ ఒడౌడ్ 13 పరుగులు చేసి హర్మీత్ సింగ్ బౌలింగ్లో మిలింద్ కుమార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 156 పరుగులు చేయాలి.
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీమిండియాదే వరల్డ్కప్..!
టీ20 వరల్డ్కప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 13) పెను సంచలనం నమోదైంది. పసికూన జింబాబ్వే.. 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.వాస్తవానికి టీ20 ప్రపంచకప్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది మొదటిసారి కాదు. పొట్టి ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్లోనే (2007) జింబాబ్వే ఆసీస్కు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రపంచకప్ల పరంగా చూసుకుంటే, జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడం ఇది కూడా తొలిసారి కాదు. 1983 వన్డే ప్రపంచకప్లోనే జింబాబ్వే తొలిసారి ఆసీస్ను ఓడించింది. మొత్తంగా జింబాబ్వే తమ క్రికెట్ చరిత్రలో వారికంటే చాలా రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను ఐదు సార్లు ఓడించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో రెండు సార్లు (2007, 2026), వన్డే వరల్డ్కప్లో ఒకసారి (1983), సాధారణ వన్డేల్లో రెండు సార్లు (2014, 2022) జింబాబ్వే ఆసీస్కు షాకిచ్చింది.అయితే జింబాబ్వే ఆసీస్పై సాధించిన విషయాల్లో ఓ ఆసక్తికర విషయం దాగి ఉంది. అది భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే అంశం. అదేంటంటే.. జింబాబ్వే ప్రపంచకప్ టోర్నీల్లో ఆసీస్పై విజయం సాధించిన తొలి రెండు సందర్భాల్లో భారత్ జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే తొలిసారి ఆసీస్పై విజయం సాధించిన సందర్భంలో భారత్ తొలిసారి జగజ్జేతగా నిలిచింది. జింబాబ్వే ఆసీస్పై రెండోసారి విజయం సాధించిన సందర్భంలో భారత్ రెండో సారి జగజ్జేతగా నిలిచింది.ప్రస్తుత ప్రపంచకప్లో ఈ సెంటిమెంట్ రిపీటైతే, భారత్ మరోసారి జగజ్జేతగా అవతరించడం ఖాయమని టీమిండియా అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గూగుల్ ఇండియా కూడా విశ్లేషించింది. తాజా ప్రపంచకప్లో ఆసీస్పై జింబాబ్వే విజయం సాధించిన తర్వాత ఈ విషయం సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈసారి కూడా టీమిండియానే టీ20 ప్రపంచ ఛాంపియన్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ సెంటిమెంట్కు అభిమానులు ప్రస్తుత జట్టు బలాన్ని, ఇటీవలి ఫామ్ను కూడా జోడిస్తున్నారు. భారత జట్టు గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని, గత రెండేళ్లలో టీమిండియా ఫామ్ అద్వితీయంగా ఉందని, పై సెంటిమెంట్కు ఈ రెండు కలిస్తే భారత్కు తిరుగే ఉండదన్న విషయం స్పష్టమవుతుందని చర్చించుకుంటున్నారు. పై ఫ్యాక్టర్స్ అన్నీ వర్కౌటై భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్ కావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. ఇన్ని శుభ శకునాల మధ్య భారతీయులను ఓ చెడు శనుకం కూడా పలకరిస్తుంది. అదేంటంటే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉండి, మరోసారి ప్రపంచకప్ గెలవలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌటవుతుందేమోనని టీమిండియా ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు.
ఆసీస్ను చిత్తు చేసిన ఆనందంలో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్
2026 టీ20 ప్రపంచకప్-2026లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించి జోష్లో ఉన్న జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన వికెట్కీపర్-బ్యాటర్ బ్రెండన్ టేలర్ హామ్స్ట్రింగ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన తొలి మ్యాచ్లో (ఒమన్) టేలర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో అతను మూడు అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో పాటు 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సమయంలో టేలర్ కుడి కాలి హామ్స్ట్రింగ్తో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. తొలుత గాయం చిన్నదే అనుకున్నా, వైద్య పరీక్షల తర్వాత ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తేలింది. దీంతో టేలర్ మెగా టోర్నీలో కొనసాగలేడని జింబాబ్వే క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. టేలర్ స్థానాన్ని బెన్ కర్రన్తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రాత్మక ఆటగాడుటేలర్కు ప్రపంచ క్రికెట్లో ఎవరికీ లేని ఓ ప్రత్యేకత ఉంది. అతను 0మొదటి టీ20 ప్రపంచకప్ (2007), ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడిన ఏకైక ఆటగాడు. 40 ఏళ్ల వయసులోనూ టేలర్ జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆయన లేని లోటు జింబాబ్వేకు ఎదురుదెబ్బ అవుతుంది.కాగా, ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4), బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు.
యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు
భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నమెంట్కు శుక్రవారం తెరలేచింది.బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ వుమెన్-‘ఎ’ జట్టు నేపాల్ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రాణించిన అనుష్క శర్మ, తనూజఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్ (16)లతో పాటు వన్డౌన్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ (1) కూడా విఫలమైంది. కెప్టెన్ రాధా యాదవ్ (7), మిన్ను మణి (8), వికెట్ కీపర్ బ్యాటర్ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.Calm Under Fire 😌 Anushka Sharma’s gritty 47 pushed India A to a competitive total 💥Watch our Girls in Blue take on the UAE in the DP World Women’s Asia Cup Rising Stars 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising pic.twitter.com/r5I8fqLrJo— Sony Sports Network (@SonySportsNetwk) February 13, 2026ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్ తనూజ కణ్వార్ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్ (4), సైమా ఠాకూర్ (3 నాటౌట్) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్ కేవలం 130 పరుగులే చేసింది.యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్, కెప్టెన్ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఇషా ఓజా అజేయ హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తీర్థ సతీశ్ (10) నిరాశపరిచింది. వన్డౌన్ బ్యాటర్ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్ బాది అజేయంగా నిలిచింది.ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్ ఇషా ఓజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. UAE won by 7 wickets. India A will look to bounce back in the next game!Scorecard ▶️ https://t.co/L2wkjCKSKq#WomensRisingStarsAsiaCup pic.twitter.com/lGYXSFIDDD— BCCI Women (@BCCIWomen) February 13, 2026చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్ అవుట్
పసికూనల పోరులో యూఏఈదే పైచేయి
టీ20 ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. హర్ష్ ఠాకూర్ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్నీత్ ధలీవాల్ (34), శ్రేయస్ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా 11, యువరాజ్ సమ్రా 5, నికోలస్ కిర్టన్ 4, జస్కరన్ సింగ్ 4 (నాటౌట్), సాద్ బిన్ జాఫర్ 5, డిలాన్ హేలిగర్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. కెనడా బౌలర్లలో సాద్ బిన్ జాఫర్ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్ సనా (4-0-29-1), డిలన్ హేలిగర్ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్, షోయబ్ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు.
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
అవాంతరాలన్నీ తొలగి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యంతో దిగివచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తాము టీమిండియాతో ఆడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాయాదుల పోరును వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న అభిమానులకు ఓ చేదు వార్త.సాంకేతికంగా మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినా.. వాతావరణం ఇందుకు సహకరించేలా కనిపించడం లేదు. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలైన విషయం తెలిసిందే.అగ్రస్థానంలో టీమిండియామొత్తంగా ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టీమిండియా అమెరికా, నమీబియాలపై గెలుపొందగా.. పాక్ జట్టు నెదర్లాండ్స్, అమెరికాలపై జయభేరి మోగించింది.ఫలితంగా గ్రూప్-ఎ నుంచి చెరో రెండు విజయాలతో భారత్- పాక్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నా.. నెట్ రన్రేటు పరంగా భారత్ (+3.050).. పాకిస్తాన్ (+0.932) కంటే అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు ఫిబ్రవరి 15న తలపడాల్సి ఉంది.వాన పడే అవకాశంశ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్- పాక్ (IND vs PAK) మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది.అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది.యూటర్న్ తీసుకున్న పాక్ఇక మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాన తగ్గే అవకాశం ఉన్నా.. ఒకవేళ రోజంతా వర్షం కురిస్తే అవుట్ఫీల్డ్ చిత్తడిగా మారే ప్రమాదం ఉంది. ఇది కూడా మ్యాచ్పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్తో ఎనిమిది సార్లు ముఖాముఖి తలపడ్డ భారత్ 7-1 (విజయాలు)తో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా బంగ్లాదేశ్కు మద్దతుగా తాము కూడా టీ20 వరల్డ్కప్-2026 బహిష్కరిస్తామంటూ పాక్ తొలుత ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేవలం భారత్తో మాత్రమే ఆడమంటూ నాటకాలు ఆడగా.. ఐసీసీ రంగంలోకి దిగడంతో యూటర్న్ తీసుకుంది.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్కప్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి.
T20 WC 2026: టోర్నీ నుంచి కెప్టెన్ అవుట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 అవకాశాలను ఐరిష్ టీమ్ సంక్లిష్టం చేసుకుంది.ఇలాంటి తరుణంలో కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Stirling) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ శుక్రవారం వెల్లడించింది.కాగా టీ20 వరల్డ్కప్లో శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్లతో కలిసి గ్రూప్-బి నుంచి ఐర్లాండ్ పోటీలో దిగింది. తొలి మ్యాచ్లో శ్రీలంక చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిన స్టిర్లింగ్ బృందం.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో 67 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.గాయపడిన కెప్టెన్కొలంబోలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగానే కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయపడ్డాడు. అతడి కుడి మోకాలికి గాయమైంది. స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి పంపగా గాయం తీవ్రంగా ఉందని తేలడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్కప్ టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు.యువ బ్యాటర్ ఎంట్రీఇక పాల్ స్టిర్లింగ్ స్థానంలో 20 ఏళ్ల బ్యాటర్ సామ్ టాపింగ్ (Sam Topping) ఐర్లాండ్ ప్రపంచకప్ జట్టులోకి వచ్చాడు. స్టిర్లింగ్ స్వదేశానికి పయనం కాగా.. సామ్ భారత్కు చేరుకోనున్నాడు. కాగా ఐర్లాండ్ తమ తదుపరి మ్యాచ్లో ఒమన్తో తలపడుతుంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ పోరుకు కొలంబో వేదిక. ఇదిలా ఉంటే.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే చెరో రెండు విజయాలతో టాప్-2లో ఉన్నాయి. జింబాబ్వే చేతిలో ఆసీస్ తాజా ఓటమి ఆ జట్టును క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఐర్లాండ్ జట్టు (అప్డేటెడ్)మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, సామ్ టాపింగ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.చదవండి: నిన్ను నాశనం చేస్తా: పాక్ మాజీ క్రికెటర్పై భజ్జీ ఆగ్రహం
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటన
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్గా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్లు ఆడి 141.84 స్ట్రయిక్రేట్తో 1566 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన రియాన్ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. ఆ సీజన్లో అతను 149.21 స్ట్రయిక్రేట్తో 573 పరుగులు చేశాడు. గత సీజన్లో రియాన్ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్రేట్తో 393 పరుగులు) చేశాడు.గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ 8 మ్యాచ్ల్లో కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్లో రియాన్ ఫుల్టైమ్ కెప్టెన్గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కాగా, తదుపరి సీజన్కు రాయల్స్కు కెప్టెన్తో పాటు నూతన హెడ్ కోచ్ కూడా రానున్నాడు. గత సీజన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ వదవిని వదిలేయడంతో, ఆ స్థానంలో కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్ కలిసి 2026 ఎడిషన్లో రాజస్థాన్ రాయల్స్ను నడిపిస్తారు.2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు..రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పేరాల, షిమ్రోన్ హెట్మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, యుద్ద్వీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పంజా, విజ్ఞేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురు...
ఆకృతికి రజతం... అంజుమ్కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత ష...
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... ...
ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐ...
IND vs PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్!
అవాంతరాలన్నీ తొలగి భారత్- పాకిస్తాన్ మ్యాచ్ నిర...
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తు...
T20 WC 2026: టోర్నీ నుంచి కెప్టెన్ అవుట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగ...
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటన
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రక...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
