Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lucknow Super Giants vs Kolkata Knight Riders Toss update and playing 111
లక్నో వర్సెస్‌ కేకేఆర్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సిద్దార్ధ్ స్ధానంలో లిండే తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్‌ మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జ‌ట్లుకోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే(కెప్టెన్‌), టిమ్ సీఫెర్ట్(వికెట్ కీప‌ర్‌), కెమెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్

 Ishan Kishan WARNS Vaibhav Sooryavanshi after his 103 knock vs SRH in IPL 20262
'నీ సీక్రెట్స్‌ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'

ఐపీఎల్‌-2026 సీజన్‌లో శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్‌ కేవలం​ 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు."వైభ‌వ్‌ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో త‌న‌కు వివ‌రించాను. అత‌డు నిజంగా ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డు గ‌నుక మ‌రికొన్ని ఓవ‌ర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అత‌డు బ్యాటింగ్ చేస్తున్న తీరు త‌లుచుకుంటుంటే భయమేస్తోంది. అత‌డి వికెట్ తీయడం మాకు క‌లిసొచ్చింది" అని కిష‌న్ వెల్ల‌డించాడు.అంతేకాకుండా మా జ‌ట్టుపై కొంచెం నెమ్మ‌దిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభ‌వ్‌ను హెచ్చరించినట్లు కిష‌న్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

Ruturaj Gaikwad Bats All 20 Overs,Gujarat Titans need 159 to win3
రుతురాజ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. సీఎస్‌కే స్కోరెంతంటే?

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్ట‌కేల‌కు త‌న ఫామ్‌ను అందుకున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా గుజ‌రాత్‌ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతున్న‌ప్ప‌టికి రుతురాజ్ మాత్రం ఆచితూచి త‌మ జ‌ట్టుకు గౌర‌వ‌ ప్ర‌ద‌మైన స్కోర్‌ను అందించాడు.60 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు జేమీ ఓవర్టన్‌(6 బంతుల్లో 18) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.గుజరాత్‌ బౌలర్లలో రబాడ మూడు, అర్షద్‌ ఖాన్‌, సుత్తార్‌, సిరాజ్‌ తలా వికెట్‌ సాధించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన సంజూ సంశాన్‌.. గుజరాత్‌పై మాత్రం 11 పరుగులు చేసి ఔటయ్యాడు.

Pat Cummins calls Vaibhav Suryavanshi his new favourite player4
అతడొక అద్భుతం.. నా ఫేవరేట్‌ ప్లేయర్‌: కమ్మిన్స్‌

ఐపీఎల్‌-2026లో శ‌నివారం ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభ‌వ్ సంచ‌ల‌న సెంచ‌రీతో చెలరేగాడు. వైభ‌వ్ కేవ‌లం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్స్‌ల‌తో త‌న రెండో ఐపీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అతడు వైభవ్ ఆటతీరుకు స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ సైతం ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్‌పై క‌మ్మిన్స్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు."వైభ‌వ్‌ నా కొత్త ఫేవరెట్ ప్లేయర్. అత‌డు బ్యాటింగ్ స్కిల్స్ నిజంగా అద్భుతం. బంతిని చాలా బలంగా కొడుతున్నాడు. వైభ‌వ్ బ్యాటింగ్ చూడటానికి చాలా బాగుంది. అత‌డికి బౌలింగ్ చేసేట‌ప్పుడు బౌల‌ర్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ మాత్రం లైన్ త‌ప్పినా బంతిని మైదానం వెలుప‌ల ప‌డ‌టం ఖాయమ‌ని" క‌మ్మిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో సూర్య‌వంశీ.. క‌మ్మిన్స్‌ను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స‌ర్‌గా మ‌లిచాడు. కాగా15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్లు అయిన జ‌స్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, అర్ష్‌దీప్ సింగ్‌ల‌కు త‌న ప‌వ‌ర్ ఏంటో చూపించాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో సూర్య‌వంశీ ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడి 357 ప‌రుగులు చేశాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag Trashes Riyan Parag's Leadership5
నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తమ హోం గ్రౌండ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమి చవిచూసింది. శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ పరాజయం పాలైంది. 229 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ బౌలర్లు కాపాడులేకపోయారు.అంతేకాకుండా కెప్టెన్ రియాన్ పరాగ్ తల తిక్క నిర్ణయాలు కూడా రాజస్తాన్ ఓటమికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో టాప్ క్లాస్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, రవీంద్ర జడేజాలతో పరాగ్ చెరో ఓవర్ మాత్రమే వేయించాడు. భారీగా పరుగులు సమర్పించుకున్న బ్రిజేష్ శర్మతో మాత్రం పరాగ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయించాడు.కెప్టెన్సీతో మాత్రమే కాదు బ్యాటింగ్ పరంగా రియాన్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు.ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో పరాగ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇప్ప‌టివ‌ర‌కు 8 మ్యాచ్‌లు ఆడిన ప‌రాగ్ కేవ‌లం 88 ప‌రుగులు చేశాడు. అత‌డి అత్య‌ధిక స్కోర్ 20 ప‌రుగులగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌రాగ్‌పై భార‌త మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ విమ‌ర్శ‌లు గుప్పించాడు. "రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం రియాన్ పరాగ్ కెప్టెన్సీపై పునరాలోచన చేయాలి. అత‌డు త‌మకు స‌రైన కెప్టెన్ కాదా అన్న‌ది రాజ‌స్తాన్ మ‌రోసారి ఆలోచించాలి. మీరు 25 మందినీ ఇంటర్వ్యూ చేసి ప‌రాగ్‌ను ఎంపిక చేసి ఉండొచ్చు. కానీ అత‌డు లీడర్‌గా నిరూపించుకోలేక‌పోతున్నాడు. ముఖ్యంగా అత‌డి వ్యూహాలు ఎంటో ఆర్ధం కావ‌డం లేదు. హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో వికెట్ టేకింగ్ బౌలర్లైన రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాల‌తో ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే బౌలింగ్ చేయించాడు. వారికి మ‌రో ఓవ‌ర్ ఇచ్చి ఉండాల్సింది. ఒక్క ఓవ‌ర్ మాత్ర‌మే ఇస్తే వికెట్లు ఏలా తీస్తారు? అత‌డు బ్యాట‌ర్‌గా కూడా విఫ‌ల‌మ‌వుతున్నాడు. ఆ ప్ర‌భావం క‌చ్చితంగా అత‌డి కెప్టెన్సీపై ప‌డుతుంది. ప‌రుగులు ఎలా సాధించాల‌న్న త‌ప‌న‌తో కెప్టెన్సీపై ఏకాగ్ర‌త‌ను కోల్పోతున్నాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం బాదేశాడు, నేను సీనియ‌ర్‌ని, ఎందుకు ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాను అని ప‌రాగ్ తెగ ఆలోచిస్తుంటాడు. ప‌దేప‌దే ఎక్కువ‌గా ఆలోచించ‌డంతో అత‌డిపై మ‌రింత ఒత్తిడి పెరుగుతుంద‌ని" క్రిక్‌బ‌జ్ ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి తీవ్ర గాయం.. ఐపీఎల్‌ నుంచి అవుట్‌?

IPL 2026: Chennai Super Kings vs Gujarat Titans Toss and playing 116
సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2026లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్‌ జట్టులోకి అర్షద్‌ ఖాన్‌ రాగా.. సీఎస్‌కే జట్టులోకి ఉర్విల్‌ పటేల్‌ వచ్చాడు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్

Pakistan ODI Squad For 1st Ever Historical Series Announced7
చారిత్రాత్మక సిరీస్‌కు పాక్‌ వన్డే జట్టు ప్రకటన

జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. మే 4న మొదలయ్యే ఈ చారిత్రాత్మక సిరీస్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్‌ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించారు. ఈ జట్టుకు ఫాతిమా సనా సారథ్యం వహించనుంది. మే 4, 6, 9 తేదీల్లో నేషనల్‌ బ్యాంక్‌ స్టేడియం (కరాచీ) వేదికగా మూడు మ్యాచ్‌ వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ సిరీస్‌ ఐసీసీ వుమెన్స్‌ ఛాంపియన్షిప్‌ 2025–29లో భాగం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సిరీస్‌ కోసం ఎంపిక​ చేసిన పాక్‌ జట్టులో యువ స్పిన్నర్ మోమిరనా రియాసత్‌కు తొలిసారి చోటు దక్కింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆమె, ఇటీవల జరిగిన నేషనల్ టీ20 టోర్నీలో 16 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. వన్డే కప్‌లోనూ 19 వికెట్లు సాధించి తన ప్రతిభను నిరూపించుకుంది.ఈ పర్యటన కోసం జింబాబ్వే జట్టు ఏప్రిల్ 29న కరాచీకి చేరుకోనుంది. ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటాయి. ప్రస్తుతం ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, జింబాబ్వే ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది.జింబాబ్వేతో వన్డే సిరీస్ అనంతరం పాకిస్థాన్ మహిళల జట్టు ఐర్లాండ్‌ టీ20 ట్రై సిరీస్‌ 2026లో పాల్గొననుంది. ఇందులో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా పోటీపడనున్నాయి. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026కు సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లు ఉన్నాయి. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ అనంతరం పాక్‌ జట్టు ఆదే టీమ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఆడనుంది. ఈ సిరీస్‌ మే 12, 14, 15 తేదీల్లో నేషనల్‌ బ్యాంక​్‌ స్టేడియం వేదికగానే జరగనుంది.జింబాబ్వే సిరీస్‌ కోసం పాక్‌ వన్డే జట్టు..ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా జాఫర్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ (WK), నజిహా అల్వీ (WK), నష్రా సుంధు, నటాలియా పర్వైజ్, రమీన్ షమీమ్, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్‌రిజర్వ్‌ ప్లేయర్లు: ఇరామ్ జావేద్, ఈమాన్ ఫాతిమా, సైరా జబీన్, తుబా హసన్, అంబర్ కైనాట్.

IPL 2026: Orange cap shared between kohli, rahul, vaibhav, abhishek in a single day8
పొద్దున్నే విరాట్‌, రాత్రికి అభిషేక్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లే అయ్యాయి. రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్‌ క్యాప్‌ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్‌ క్యాప్‌ను రాహుల్‌ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ తన బ్యాట్‌కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్‌ క్యాప్‌ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్‌లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్‌రైజర్స్‌ మరో ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం​ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Not Highest Successful Chase, Punjab Kings Smash Another World Record In IPL9
పంజాబ్‌ కింగ్స్‌ మరో చరిత్ర

ఐపీఎల్‌ 2026లో పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ లక్ష్య ఛేదన ఐపీఎల్‌లోనే కాకుండా యావత్‌ పొట్టి క్రికెట్‌లోనే అత్యధికం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కూడా ఈ రికార్డు పంజాబ్‌ పేరిటే ఉండేది. 2024 ఎడిషన్‌లో ఈ జట్టు కేకేఆర్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.టీ20 చరిత్రలో అత్యధిక రన్ ఛేజ్‌లు ఇవేపంజాబ్ కింగ్స్- 265/4- ప్రత్యర్ధి- ఢిల్లీ క్యాపిటల్స్‌పంజాబ్ కింగ్స్‌-262/2- ప్రత్యర్ధి-కేకేఆర్‌సౌతాఫ్రికా- 259/4- ప్రత్యర్ధి- వెస్టిండీస్‌బ్రిస్బేన్ హీట్‌-258/2- ప్రత్యర్ధి- పెర్త్ స్కార్చర్స్ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ మరో భారీ రికార్డు కూడా నెలకొల్పింది. ఇప్పటివరకు తలో ఐదు సార్లు ఛాంపియన్లైన సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ కూడా సాధించలేని ఘనతను సాధించింది.శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న ఈ జట్టు.. తొలి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేయగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు లీగ్ మ్యాచ్‌ల అనంతరం 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ గణాంకాల ద్వారానే పంజాబ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టూ తొలి ఏడు మ్యాచ్‌ల తర్వాత 13 పాయింట్లు సాధించలేదు. 12 పాయింట్లు మాత్రమే గరిష్టంగా ఉండేది. ఆ ఘనతను ముంబై, చెన్నై, గుజరాత్, రాజస్థాన్ వంటి పలు జట్లు సాధించాయి. ఇప్పుడు పంజాబ్ ఆ రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.Most points in an #ipl after 7 games13 - PBKS (2026)12 - MI (2010), CSK (2014), PBKS (2014), CSK (2015), GL (2016), MI (2017), CSK (2019), GT (2022), RR (2024) pic.twitter.com/8EK78fGVzR— Erika Morris (@ErikaMorris79) April 25, 2026కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ.. కేఎల్‌ రాహుల్‌ (152 నాటౌట్‌), నితీశ్‌ రాణా (91) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పంజాబ్‌ ఆది నుంచే కరిగించుకుంటూ వచ్చింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (43), ‍ప్రభ్‌సిమ్రన్‌ (76) తమ సహజ శైలిలో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (71 నాటౌట్‌) నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఫలితంగా పంజాబ్‌ ఈ సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగించింది.

Rajasthan Royals Issue Official Update On Vaibhav Sooryavanshi's Injury10
వైభవ్‌ సూర్యవంశీ గాయంపై అధికారిక​ అప్‌డేట్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్‌ నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉండిన వైభవ్‌ మైదానాన్ని వీడటంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.వైభవ్‌ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్‌ మొత్తానికి దూరం కావాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ చెక్‌ పెట్టాడు. వైభవ్‌ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్‌ అనంతరం అధికారికంగా వెల్లడించాడు. దీంతో రాయల్స్‌ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.రాథోడ్‌ మాటల్లో.. "వైభవ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా రెండు రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.రాథోడ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్‌ రాయల్స్‌ తదుపరి మ్యాచ్‌ సమయానికంతా సిద్దంగా ఉంటాడని తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపొతుందని స్పష్టమవుతుంది. రాయల్స్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 28న పంజాబ్‌ కింగ్స్‌తో ఆడనుంది. ఆ మ్యాచ్‌ సమయానికి వైభవ్‌ తప్పక అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఒకవేళ వైభవ్‌ ఆ మ్యాచ్‌ సమయానికి అందుబాటులో లేకపోతే రాయల్స్‌కు తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్‌లో వైభవ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్‌లోనూ 36 బంతుల్లోనే శతక్కొట్టాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ పరాజయంపాలైంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement