Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Wisden 2025 Mens ODI Team of the Year Announced1
2025 విజ్డన్‌ జట్టు ప్రకటన.. భారత దిగ్గజాలకు చోటు

2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్‌ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్‌ నుంచి దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఎంపికయ్యారు. మరో భారతీయ ఆటగాడు మిలింద్‌ కుమార్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కినా, ప్రస్తుతం అతను యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.వెస్టిండీస్‌ (షాయ్‌ హోప్‌, జేడన్‌ సీల్స్‌), న్యూజిలాండ్‌కు (మిచెల్‌ సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ) కూడా భారత్‌తో సమానంగా రెండు బెర్త్‌లు దక్కాయి. మిగతా బెర్త్‌లు సౌతాఫ్రికా (మాథ్యూ బ్రీట్జ్కే), స్కాట్లాండ్‌ (జార్జ్‌ మున్సే), ఇంగ్లండ్‌ (ఆదిల్‌ రషీద్‌), శ్రీలంకకు (అషిత ఫెర్నాండో) చెందిన ఆటగాళ్లు దక్కించుకున్నారు.ఆటగాళ్ల వారిగా గతేడాది ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..రోహిత్‌ శర్మపరుగులు- 650 సగటు- 50.00స్ట్రయిక్‌రేట్‌- 100 అత్యుత్తమ ప్రదర్శనలు- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 76 పరుగులు.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై సెంచరీలుజార్జ్ మున్సేపరుగులు- 735సగటు- 73.50స్ట్రయిక్‌రేట్‌- 1072 సెంచరీలువిరాట్‌ కోహ్లిపరుగులు- 651సగటు- 65.10స్ట్రయిక్‌రేట్‌- 96పాకిస్తాన్‌పై అజేయ శతకం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో 84 పరుగులుషాయ్‌ హోప్‌ (వికెట్‌కీపర్‌)పరుగులు- 670 సగటు- 64.18స్ట్రయిక్‌రేట్‌- 99 పాకిస్తాన్‌పై 120*; 15 క్యాచ్‌లు, 2 స్టంపింగ్స్మాథ్యూ బ్రీట్జ్కేపరుగులు- 706సగటు- 64.18స్ట్రయిక్‌రేట్‌- 99అరంగేట్రంలోనే 150 పరుగులు; మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలుమిలింద్ కుమార్పరుగులు- 652సగటు- 81.50 స్ట్రయిక్‌రేట్‌- 992 శతకాలువికెట్లు- 20ఓ ఐదు వికెట్ల ప్రదర్శనమిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌)పరుగులు- 210వికెట్లు- 25 ఎకానమీ- 4.57కెప్టెన్‌గా స్థిరమైన ప్రదర్శనఆదిల్‌ రషీద్‌వికెట్లు- 30 సగటు- 23.63మ్యాట్‌ హెన్రీవికెట్లు- 27 వికెట్లుసగటు- 18.142025లో అత్యధిక వికెట్లు; ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ బౌలర్జేడన్‌ సీల్స్‌వికెట్లు- 27 సగటు- 18.14పాకిస్తాన్‌పై 6-18అషిత ఫెర్నాండో వికెట్లు- 23 వికెట్లుసగటు- 21.30

ILT20 2025-26: Narine, Pepper power Abu Dhabi Knight Riders to Eliminator win2
రాణించిన నరైన్‌.. ఎలిమినేటర్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2025-26 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. క్వాలిఫయర్‌-1లో గెలిచి డెజర్ట్‌ వైపర్స్‌ నేరుగా ఫైనల్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా.. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీ కొనసాగుతుంది. నిన్న (జనవరి 1) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌ దుబాయ్‌ క్యాపిటల్స్‌పై తిరుగులేని విజయం సాధించి, ఇవాళ జరుగబోయే క్వాలిఫయర్స్‌-2కు (ఎంఐ ఎమిరేట్స్‌తో) అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2 విజేత జనవరి 4న జరిగే ఫైనల్లో డెజర్ట్‌ వైపర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌పై అబుదాబీ నైట్‌రైడర్స్‌ 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌.. మైఖేల్‌ పెప్పర్‌ (49 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్‌ సాల్ట్‌ (43), ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (22 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లతో సత్తా చాటగా.. హైదర్‌ అలీ, వకార్‌ సలాంఖిల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన క్యాపిటల్స్‌.. 16.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సునీల్‌ నరైన్‌ (3-0-12-3), జేసన్‌ హోల్డర్‌ (3.2-0-18-3), లివింగ్‌స్టోన్‌ (4-0-26-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించారు. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన నబీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Rajasthan Royals beat RCB to secure this stadium home venue IPL 2026: Report3
IPL 2026: రాజస్తాన్‌ రాయల్స్‌ ‘ఫ్యాన్స్‌’కి భారీ షాక్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మొట్టమొదటి సీజన్‌ విజేతగా రాజస్తాన్‌ రాయల్స్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్‌ ఆడిన రాజస్తాన్‌.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్‌ ఆడింది.సుదీర్ఘ బంధానికి వీడ్కోలుక్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్‌ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్‌ కథనం ప్రకారం.. ఐపీఎల్‌-2026 సీజన్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ హోం గ్రౌండ్‌ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్‌ ఎంచుకుంది.కారణం ఇదేజైపూర్‌లోని ‘SMS’ గ్రౌండ్‌లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్‌ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్‌ తమ హోం గ్రౌండ్‌ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.పుణెలోఇప్పటికే రాయల్స్‌ ఆపరేషన్‌ టీమ్‌ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్‌ పరిస్థితులు, సీటింగ్‌ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్‌ కింగ్స్‌ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. ఆర్సీబీని ఓడించి..ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్‌ మ్యాచ్‌ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్‌’కు భారీ షాక్‌ తగిలినట్లే!!ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్‌.. మళ్లీ ఫైనల్‌ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్‌ కెప్టెన్సీలో 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్‌ చేసిన రాయల్స్‌ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

Gautam Gambhir's India Head Coach position offered to Australian legend, denied online4
టీమిండియా కోచ్‌ పదవి ఆఫర్‌.. సున్నితంగా తిరస్కరించిన పాక్‌ మాజీ కోచ్‌..!

టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఆఫర్‌పై పాకిస్తాన్‌ మాజీ హెడ్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిల్లెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్స్‌లో ఓ పాకిస్తాన్‌ సోషల్ మీడియా యూజర్ గిల్లెస్పీని టీమిండియా కోచ్‌గా వ్యవహరించమని అడిగాడు. ఏడాది వ్యవధిలో భారత జట్టు స్వదేశంలోనే రెండు సార్లు (టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో) వైట్‌ వాష్‌ అయ్యిందని.. ఈ పరిస్థితుల్లో టీమండియాకు నీ సేవలు అవసరమని సదరు యూజర్‌ గిల్లెస్పీకి వ్యంగ్యంగా ఆఫర్‌ చేశాడు. ఈ ఆఫర్‌ను గిల్లెస్పీ సున్నితంగా తిరస్కరించాడు. 'నో థ్యాంక్స్‌' అంటూ రెండు ముక్కల్లో తన అభిమతాన్ని బయటపెట్టాడు. పాకిస్తానీ ఎక్స్‌ యూజర్‌-గిల్లెస్పీ మధ్య ఈ సంభాషణ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐకి పాకిస్తాన్‌ కోచ్‌గా పని చేసిన వారికి టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి ఇచ్చేంత కర్మ పట్టలేదని అంటున్నారు. వాస్తవానికి గిల్లెస్పీకి టీమిండియా హెడ్‌ కోచ్‌ అయ్యేంత సీన్‌ లేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చేసిన పాక్‌ ఎక్స్‌ యూజర్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. గంభీర్‌ను భారత టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి తొలగించనున్నారని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేశారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. గంభీర్‌ మూడు ఫార్మాట్లలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది.వాస్తవానికి గంభీర్‌పై దుష్ప్రచారాని కారణాలు లేకపోలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను టీమిండియాను విజయవంతంగా నడిపిస్తున్నా, టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలొ క్లీన్‌ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్‌ టెస్ట్‌ ప్రస్తానం.. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్‌ స్వీప్‌ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్‌ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్‌ పర్యటనలో 1-3తో సిరీస్‌ కోల్పోయి, ఇంగ్లండ్‌ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది. ఇంత దారుణమైన ట్రాక్‌ ఉంటే సహజంగానే ఏ కోచ్‌పై అయినా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం గంభీర్‌ కూడా ఇదే ఎదుర్కొంటున్నాడు. అయితే బీసీసీఐ నుంచి అతనికి కావాల్సినంత మద్దతు లభిస్తుంది.గిల్లెస్పీ విషయానికొస్తే.. ఈ ఆసీస్‌ మాజీ ఆటగాడు 2024 ఏప్రిల్‌లో పాకిస్తాన్ టెస్ట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ఆతర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో రాజకీయాల కారణంగా కొంతకాలంలోనే (2024 డిసెంబర్‌) ఆ పదవికి రాజీనామా చేశాడు. గిల్లెస్పీ జమానాలో పాక్‌ బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడింది. గిల్లెస్పీ తాజాగా పీసీబీ బాస్‌ మొహిసిన్‌ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. నఖ్వీ తనను అవమానించాడని బాహాటంగా ప్రకటన చేశాడు.

Ashes 5th Test Bashir Potts IN Atkinson OUT England Name Playing XII5
‘యాషెస్‌’ ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ XII

యాషెస్‌ 2025-26 సిరీస్‌లో వరుస పరాజయాల తర్వాత బాక్సింగ్‌ డే టెస్టు గెలుపు రూపంలో ఇంగ్లండ్‌కు ఊరట దక్కింది. ఆస్ట్రేలియా హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ కైవసం చేసుకున్నప్పటికీ.. నాలుగో టెస్టులో గెలవడం ద్వారా స్టోక్స్‌ బృందం వైట్‌వాష్‌ గండం నుంచి ముందుగానే గట్టెక్కింది.ఇక సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో జనవరి 4 నుంచి మొదలయ్యే ఐదో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో యాషెస్‌ తాజా ఎడిషన్‌లో చివరి టెస్టుకు తమ ప్లేయింగ్‌ XIIను ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.విల్‌ జాక్స్‌తో పోటీఈ జట్టులో ఎట్టకేలకు స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ (Shoaib Bashir) చోటు దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌తో పోటీ నెలకొన్న తరుణంలో ప్రస్తుతానికి 12వ ఆటగాడిగా ఉన్న బషీర్‌.. తుదిజట్టులో ఉంటాడా? లేదా? అనేది మ్యాచ్‌ రోజు తేలనుంది. మరోవైపు.. ప్రధాన జట్టులో ఉన్నా ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన మాథ్యూ పాట్స్‌ (Matthew Potts)కు ఈసారి స్థానం దక్కింది.పాట్స్‌ రీఎంట్రీగాయం కారణంగా గస్‌ అట్కిన్సన్‌ దూరం కాగా.. అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు తర్వాత జోఫ్రా ఆర్చర్‌ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. ఇక మార్క్‌వుడ్‌ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఈ ముగ్గురి గైర్హాజరీ పాట్స్‌ పాలిట వరంగా మారింది. డిసెంబరు 2024లో చివరగా టెస్టు మ్యాచ్‌ ఆడిన ఈ పేస్‌ బౌలర్‌ యాషెస్‌ చివరి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గట్కిన్సన్‌ రీప్లేస్‌మెంట్‌గా అతడు తుదిజట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియాతో యాషెస్‌ 2025-26 చివరి టెస్టు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ XIIబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్‌ బెతెల్‌, హ్యారీ బ్రూక్, బ్రైడన్‌ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, జో రూట్, జేమీ స్మిత్ (వికెట్‌ కీపర్‌), జోష్ టంగ్.అదే జట్టుమరోవైపు.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌ చివరి టెస్టు కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టులో ఏ మార్పు చేయలేదు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌ 3–1తో సొంతం చేసుకోగా... ఆఖరిదైన ఐదో టెస్టు ఆదివారం సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.గత మ్యాచ్‌లో ఓడినప్పటికీ అదే జట్టును కొనసాగిస్తోంది. స్టీవ్‌ స్మిత్‌ జట్టుకు సారథ్యం వహించనుండగా... ఆసీస్‌ బృందం గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యంతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి సిరీస్‌ నిలబెట్టుకున్న ఆతిథ్య ఆసీస్‌... నాలుగో టెస్టులో పరాజయం పాలైంది. దీంతో ఇంగ్లండ్‌ జట్టు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్‌ నెగ్గింది. పూర్తిగా పేసర్లకు సహకరించిన మెల్‌బోర్న్‌ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో... సిడ్నీలో ఐదో టెస్టుకు ఎలాంటి పిచ్‌ సిద్ధం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్‌ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే

All round Ferreira stars in Joburg Super Kings Super Over win6
2026కు అదిరిపోయే ఆరంభం.. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం

క్రికెట్‌కు సంబంధించి 2026 స​ంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో భాగంగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి, సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పైచేయి సాధించింది.ఈ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డొనొవన్‌ ఫెరియెరా (డాన్‌) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఆల్‌రౌండ్‌ షో అంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌ మత్రమే కాదు వికెట్‌కీపింగ్‌ కూడా.తొలుత బ్యాటింగ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌ (10 బంతుల్లో 33 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) ఆడిన డాన్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో (4-0-24-1), ఆఖర్లో వికెట్‌ కీపింగ్‌లో (చివరి బంతికి ఒక పరుగు చేస్తే ప్రత్యర్ది గెలిచే సమయంలో అద్భుతమైన రనౌట్‌ చేశాడు) అదరగొట్టి ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. సూపర్‌ ఓవర్‌లో రిలీ రొస్సో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. డివిలియర్స్‌ (38), డుప్లెసిస్‌ (47), శుభమ్‌ రంజనే (50 నాటౌట్‌), డొనొవన్‌ ఫెరియెరా (33 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డర్బన్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-12-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. హార్మర్‌ (4-0-22-1) కూడా పర్వాలేదనిపించాడు.అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో డర్బన్‌ జట్టు చివరి బంతి వరకు గెలుపు కోసం​ పోరాడింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందన్న తరుణంలో డాన్‌ మ్యాజిక్‌ రనౌట్‌ చేసి మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. ముల్దర్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసిన హార్మర్‌ బంతిని కట్‌ చేసే క్రమంలో మిస్‌ అయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. అప్పుడు వికెట్‌కీపింగ్‌ చేస్తున్న డాన్‌ అద్భుతమైన రీతిలో బాష్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ వికెట్‌ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లీసన్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి డర్బన్‌ బ్యాటర్లు జోస్‌ బట్లర్‌, ఆరోన్‌ జోన్స్‌ను కట్టడి చేశాడు. 6 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రిలీ రొస్సో 3 బంతుల్లో 2 బౌండరీలు బాది సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

BCCI Responds On Criticism Over KKR Bought Mustafizur Rahman7
KKR: అతడొక ద్రోహి.. బీసీసీఐ స్పందన ఇదే

ప్రపంచంలోనే మేటి టీ20 లీగ్‌గా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కొనసాగుతోంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టోర్నమెంట్‌ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.కేవలం భారత్‌కు చెందిన ఆటగాళ్లే కాకుండా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడంతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు కూడా!ఐపీఎల్‌ ఆడకుండా నిషేధంఅయితే, ఆరంభంలో పాకిస్తాన్‌ ప్లేయర్లు సైతం క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఆడేవారు. వసీం అక్రం, షోయబ్‌ అక్తర్‌, మిస్బా ఉల్‌ హక్‌, ఉమర్‌ గుల్‌, కమ్రాన్‌ అక్మల్‌, షోయబ్‌ మాలిక్‌, సొహైల్‌ తన్వీర్‌ వంటి వాళ్లు ఆరంభ సీజన్‌లో ఆడారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2009 నుంచి పాక్‌ ప్లేయర్లు ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెటర్లకు సైతం ఇదే దుస్థితి కలిగే అవకాశం ఉంది. భారత్‌ నుంచి ఎల్లవేళలా మద్దతు, సాయం పొందిన బంగ్లాదేశ్‌ కొన్నాళ్లుగా విచిత్ర పోకడలకు పోతోంది. ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్‌ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లుఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఐదు నుంచి ఆరుగురు క్రికెటర్లు పేరు నమోదు చేసుకోగా.. లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. షారుఖ్‌ ఖాన్‌ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అతడొక ద్రోహి..ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత సంగీత్‌ సింగ్‌ సోమ్‌ షారుఖ్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ప్లేయర్‌ను కొన్న షారుఖ్‌ను ద్రోహిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలంటూ ఆయనకు కొంతమంది మద్దతు తెలపగా..కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.బీసీసీఐ స్పందన ఇదేఅంతర్జాతీయ క్రికెట్‌ మండలి ప్రమాణాలకు అనుగుణంగా బీసీసీఐ ఈ లీగ్‌ను నిర్వహిస్తోందని.. ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు ఈ పరిణామాలపై స్పందించారు. ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ శత్రు దేశమేమీ కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్‌ ప్లేయర్లు ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనబడటం లేదు’’ అని పేర్కొన్నారు. కాబట్టి ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ బరిలో దిగే అవకాశం ఉంది.ఎలాంటి ఆదేశాలు రాలేదుమరోవైపు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా IANSతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అయితే, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను ఐపీఎల్‌ నుంచి నిషేధించే అంశమై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము’’ అని పేర్కొన్నాయి. చదవండి: న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. వాళ్లిద్దరికి మొండిచేయి!

Arjun Tendulkar bats just like Sachin Tendulkar: Yograj Singh8
అర్జున్‌ టెండుల్కర్‌ గొప్ప బ్యాటర్‌.. అచ్చం సచిన్‌లాగే!

భారత మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్ననాటి నుంచే తన కుమారుడికి కఠిన శిక్షణ ఇచ్చి మేటి క్రికెటర్‌గా తీర్చిదిద్దాదని చెప్పే యోగ్‌రాజ్‌.. తన స్వభావం వల్ల యువీ తల్లితో తాను ఎలా విడిపోయాడో కూడా పలు సందర్భాల్లో వెల్లడించాడు.తాజాగా.. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ (Arjun Tendulkar) గురించి యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్‌ తండ్రి మాదిరే గొప్పగా బ్యాటింగ్‌ చేస్తాడని కితాబులిచ్చాడు. బౌలర్‌ కంటే బ్యాటర్‌గానే అర్జున్‌ ఉత్తమంగా రాణించగలడని పేర్కొన్నాడు.నిజానికి అతడొక బ్యాటర్‌‘‘అందరూ అర్జున్‌ టెండుల్కర్‌ బౌలింగ్‌ మీదే ఎందుకు దృష్టి పెడతారు?.. నిజానికి అతడొక బ్యాటర్‌. రంజీ ట్రోఫీకి ముందు సచిన్‌, యువరాజ్‌... అర్జున్‌కు శిక్షణ ఇవ్వమని నన్ను అభ్యర్థించారు. అపుడు 10-12 రోజుల పాటు అర్జున్‌కు కోచింగ్‌ ఇచ్చాను. అర్జున్‌ జాగ్రత్తగా చూసుకోమని సచిన్‌, యువీ చెప్పారు.కానీ ఓ రోజు అతడికి గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసుకువెళ్లాము. తను కోలుకున్నాడు. ఈ క్రమంలో ఓరోజు నేను అర్జున్‌తో బ్యాటింగ్‌ చేయమని చెప్పాడు. కానీ అతడు అందుకు సుముఖంగా లేడు. అయితే, నేను మాత్రం ‘నీ బ్యాటింగ్‌ చూడాల్సిందే’ అని పట్టుబట్టాను.ఫోర్లు, సిక్సర్లు బాదాడుదీంతో అతడు బ్యాటింగ్‌ మొదలుపెట్టాడు. నెట్స్‌లో ఫోర్లు, సిక్సర్లు బాదాడు. అప్పుడు నేను అర్జున్‌ కోచ్‌తో మాట్లాడాను. ‘ఇంతబాగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు? మరెందుకని అతడితో కేవలం బౌలింగే ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు? బ్యాటర్‌గా అతడిలో మంచి నైపుణ్యం ఉంది. తండ్రి మాదిరే అతడు బ్యాటింగ్‌ చేస్తున్నాడు’ అని అన్నాను.అర్జున్‌తో రోజూ కనీసం 2-3 గంటలు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించమని చెప్పాను. అన్నట్లుగానే రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే అర్జున్‌ సెంచరీ బాదాడు’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌.. రవి బిస్త్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా యోగ్‌రాజ్‌ చెప్పినట్లుగా 2022-23 సీజన్‌లో రంజీల్లో అడుగుపెట్టిన అర్జున్‌.. ఏడో స్థానంలో వచ్చి 207 బంతుల్లో 120 పరుగులు సాధించాడు.ఓపెనర్‌గానూఅదే మ్యాచ్‌లో కొత్త బంతితో బౌలింగ్‌కు దిగిన అర్జున్‌.. మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే, ఆ తర్వాత క్రమంగా ముంబై జట్టులో చోటు కోల్పోయిన అతడు.. గోవాతో జట్టుకట్టాడు. ఇటీవల గోవా తరఫున ఓపెనర్‌గానూ అర్జున్‌ బరిలోకి దిగాడు. అయితే, ఇప్పటికి వరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 620 పరుగులు చేసి.. 48 వికెట్లు పడగొట్టిన అర్జున్‌.. లిస్ట్‌-ఎ, టీ20 క్రికెట్‌లో 25, 35 వికెట్లు పడగొట్టాడు.సచిన్‌తో పోలికా?.. మతి చెడిందా?కాగా లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అర్జున్‌ నైపుణ్యం గల ఆటగాడే. అయితే, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌తో పోల్చడం ఎంతమాత్రం సరికాదని అభిమానులు యోగ్‌రాజ్‌ మాటలను ఖండిస్తున్నారు.​ యోగ్‌రాజ్‌కు మతి చెలించిందంటూ మరికొందరు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, శతక శతకాలు సాధించిన సచిన్‌ చెక్కుచెదరని ఈ రెండు రికార్డులను తన ఖాతాలో కొనసాగిస్తూనే ఉన్నాడు.చదవండి: పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్‌ ఖవాజా

Aakash Chopra picks India ODI Squad vs NZ No place for Shami, Sanju9
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్‌!

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అనంతరం భారత్‌- కివీస్‌ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.ఇందుకు సంబంధించి న్యూజిలాండ్‌ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్‌ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.జైస్వాల్‌కు చోటు దక్కినా..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా న్యూజిలాండ్‌తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ.. విరాట్‌ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్‌.ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.పంత్‌కు చోటెలా?అదే విధంగా వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌కు చోటిచ్చిన ఆకాశ్‌ చోప్రా.. వైస్‌ కెప్టెన్‌గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్‌ హజారే మ్యాచ్‌లలో విఫలమవుతున్న రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేసుకున్నాడు.ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్ల విభాగంలో వాషి​ంగ్టన్‌ సుందర్‌కు ఓటు వేసిన ఆకాశ్‌ చోప్రా.. లెఫ్టార్మ్‌ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్‌ ఐదు టీ20లతో పాటు వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్‌తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.సంజూతో పాటు షమీకీ మొండిచేయితన జట్టులో తిలక్‌ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్‌ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్‌ సిరాజ్‌, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఆకాశ్‌ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్‌తో టీ20 మ్యాచ్‌లు, ప్రపంచకప్‌-2026 దృష్ట్యా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత జట్టుశుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్‌ వర్మ, హర్షిత్‌ రాణా, మొహమ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ, రిషభ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌.చదవండి: పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్‌ ఖవాజా

Gillespie Reveals How PCB Humiliation Led To His Resignation Pak Coach10
అవమానించారు: పాక్‌ క్రికెట్‌ బోర్డుపై మాజీ హెడ్‌కోచ్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ ‍క్రికెట్‌ హెడ్‌కోచ్‌లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. సెలక్టర్లు, మెంటార్లు, సహాయక సిబ్బందిలో కూడా తరచూ మార్పులు ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా టెస్టు హెడ్‌కోచ్‌ అజహర్‌ మహమూద్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.కాంట్రాక్టు ముగియడానికి మూడు నెలల ముందే అజహర్‌ను సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ హెడ్‌కోచ్‌, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ జేసన్‌ గిల్లెస్పి పీసీబీ తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.పాక్‌ కోచ్‌గా ఎందుకు తప్పుకొన్నారు?‘ఎక్స్‌’ వేదికగా ఓ యూజర్‌.. ‘‘మీరు పాకిస్తాన్‌ కోచ్‌గా ఎందుకు తప్పుకొన్నారు’’ అని గిల్లెస్పిని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అప్పట్లో నేను పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు కోచింగ్‌ ఇచ్చేవాడిని. నాకు తెలియకుండానే.. నలుగురు సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌లను చెప్పాపెట్టకుండా పీసీబీ తొలగించింది.అవమానించారుహెడ్‌కోచ్‌గా నాకిది అస్సలు నచ్చలేదు. ఎంతమాత్రం ఆమోదయోగ్యనీయం కూడా కాదు. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. పీసీబీ తీరు నన్ను కించపరిచేవిధంగా, అవమాపరిచేలా ఉండటం ఎంతో బాధించింది’’ అని జేసన్‌ గిల్లెస్పి సమాధానం ఇచ్చాడు.కాగా తాను 2024లో పాక్‌ కోచ్‌గా ఉన్న సమయంలో పాక్‌ బోర్డు చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ వ్యవహరించిన తీరుపై జేసన్‌ గిల్లెస్పి.. బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కాడు. ‘‘జట్టులో సామరస్యం పెంచేందుకు ‘కనెక్షన్‌ క్యాంపు’ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచనతో గ్యారీ కిర్‌స్టన్‌ మా ముందుకు వచ్చాడు.చైర్మన్‌ నక్వీ తీరు సరిగా లేదుపాక్‌ క్రికెట్‌ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు ఇందులో తమ అనుభవాలు, ఇబ్బందుల గురించి చెప్పవచ్చు. ఈ మీటింగ్‌ కోసం నేను ఆస్ట్రేలియా నుంచి.. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చాము. కానీ చైర్మన్‌ నక్వీ మాత్రం జూమ్‌ కాల్‌లో హాజరయ్యాడు.అతడు లాహోర్‌లోనే ఉంటాడు. అయినా సరే సమావేశానికి హాజరుకాలేదు. గ్యారీ సౌతాఫ్రికా నుంచి వచ్చినపుడు.. చైర్మన్‌ 20 నిమిషాల కారు ప్రయాణంలో మీటింగ్‌కు చేరుకునే వీలున్నా రాకపోవడం అసాధారణంగా అనిపించింది’’ అని గిల్లెస్పి నక్వీ తీరును విమర్శించాడు. చదవండి: పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్‌ ఖవాజా

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement