Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Lord's Cricket Ground Ends Its Alliance With BrewDog Beer Supplier1
లార్డ్స్‌ స్టేడియంలో బీర్లు బంద్‌!

క్రికెట్‌లో లార్డ్స్‌ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఎన్నో మ్యాచ్‌లకు ఈ స్టేడియం వేదికగా నిలిచింది. 1983లో లార్డ్స్‌ వేదికగానే జరిగిన ప్రపంచకప్‌లో కపిల్‌ డెవిల్స్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.అంతేకాదు 2001లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ టోర్నీ సందర్భంగా టీమిండియా ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఆనాటి భారత కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ లార్డ్స్‌ స్టేడియం బాల్కనీలో నుంచి తన చొక్కా విప్పి తిప్పిన సంఘటన ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల మదిలో ఇంకా కదలాడుతూనే ఉంది.అనేక జ్ఞాపకాలకు నెలవైన లార్డ్స్‌ స్టేడియం బీర్లకు కూడా ప్రసిద్ధి చెందింది. లార్డ్స్‌ మైదానంలోని లాన్‌లో కూర్చుని బీరు తాగుతూ మ్యాచ్‌ను వీక్షిస్తుంటే వచ్చే మజా వేరుగా ఉంటుంది. అయితే లార్డ్స్‌ స్టేడియంలో ఇక మీదట ఆ అవకాశం లేకపోవచ్చు.ఎందుకంటే లార్డ్స్‌ స్టేడియానికి బీర్లను సరఫరా చేసే బ్రూడాగ్‌ బెవరేజ్‌ సంస్థతో ఒప్పందం ముగిసినట్లు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ లీగ్‌ (ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బ్రూడాగ్‌ స్థానంలో టిల్‌ రే బ్రాండ్స్‌కు బీర్ల అమ్మకాలకు అవకాశం ఇస్తూ ఎంసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు జరుగుతుందన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడించకపోవడంతో అప్పటివరకు లార్డ్స్‌ స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరగవని తెలిపింది.అయితే ఎంసీసీ, బ్రూడాగ్‌లు 2024లో వచ్చే నాలుగేళ్ల కాలానికి బీర్ల సరఫరా, అమ్మకాలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ కొన్ని కారణాల వల్ల సంవత్సరం తిరగకముందే ఒప్పందం ముగింపుకు రావడం గమనార్హం.బ్రూడాగ్‌తో ఒప్పందం జరిగిన మొదటి ఏడాదిలో లార్డ్స్‌ స్టేడియంలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగడం తమకు ఆనందాన్ని కలిగించిందని ఎంసీసీ పేర్కొంది.ఈ బంధం శాశ్వతంగా కొనసాగుతుందనుకున్నప్పటికీ ఒక ఏడాదితోనే ముగిసిపోయిందని తెలిపింది. ఇక బ్రూడాగ్‌ సంస్థ లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌తో పాటు ప్రీమియర్‌ ఫుట్‌బాల్‌ లీ2్‌ వెస్ట్‌హామ్‌ యునైటెడ్‌తో స్పాన్సర్‌షిప్‌తో పాటు ఇంగ్లీష్‌ రగ్బీ సూపర్‌ లీగ్‌కు చెందిన సెంట్‌ హెలెన్స్‌ స్టేడియంతో బీర్ల అమ్మకాలకు పదేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.చదవండి: బంతి కోసం క్రికెటర్‌ నానాతిప్పలు!

New Zealand Members Prefer PSL 2026 Over National Duty, NZC Takes Bold Step2
న్యూజిలాండ్‌ సభ్యుల సాహసోపేత నిర్ణయం

న్యూజిలాండ్‌ జాతీయ క్రికెట్‌ జట్టులోని కీలక సభ్యులు జేకబ్‌ ఓరమ్‌ (బౌలింగ్‌ కోచ్‌), లూక్‌ రాంచీ (బ్యాటింగ్‌ కోచ్‌) సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విధులు కాదని పరాయి దేశ ఫ్రాంచైజీ లీగ్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌కు ప్రాధాన్యమిచ్చారు. వీరి అభీష్టానికి ఆ దేశ క్రికెట్‌ బోర్డు అడ్డు చెప్పకపోగా, అనుమతి ఇవ్వడం ఆసక్తికరం​.ఓరమ్‌, రాంచీ త్వరలో ప్రారంభం కానున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఎడిషన్‌ (మార్చి 26) కోసం ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్రాంచైజీతో పని చేయనున్నారు. రాంచీ హెడ్‌ కోచ్‌గా.. ఓరమ్‌ అదే ఫ్రాంచైజీకి అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. రాంచీ గతంలో పీఎస్‌ఎల్‌లో మూడు సీజన్లు ఆటగాడిగా కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఓరమ్‌, రాంచీ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పాల్గొనే సమయంలో న్యూజిలాండ్‌ జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌.. ఆతర్వాత బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్తుంది.ఓరమ్‌, రాంచీ జాతీయ జట్టు విధుల మీద ప్రైవేట్‌ లీగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌లోని కీలక వ్యక్తి సమర్దించాడు. ఇది వారి కోచింగ్‌ అనుభవాన్ని పెంచుకునే గొప్ప అవకాశమని అన్నాడు. ఓరమ్‌, రాంచీ గైర్హాజరీలో రాబోయే సిరీస్‌లకు ప్రత్యామ్నాయ కోచ్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు జానీ బాసెట్‌-గ్రాహమ్, గ్రేమ్‌ ఆల్డ్రిడ్జ్‌.. బంగ్లాదేశ్‌ పర్యటనకు అదనంగా బ్రెండన్‌ డాంకర్స్‌ హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌కు డిప్యూటీలుగా పని చేస్తారని తెలిపాడు.

RCB Kingmaker Issues Brutal Verdict As SRH Owner Signs Abrar Ahmed In The Hundred3
సన్‌రైజర్స్‌లోకి పాక్‌ ప్లేయర్‌.. ఆర్సీబీ కింగ్‌ మేకర్‌ సంచలన కామెంట్స్‌

హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో భారత యాజమాన్యంలోని సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీ పాక్‌ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్‌ను తీసుకోవడంపై భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో పెద్ద దుమారం రేగుతుంది. పాక్‌ ఆటగాడిని ఎలా తీసుకుంటారంటూ భారత క్రికెట్‌ అభిమానులు సన్‌రైజర్స్‌, ఆ ఫ్రాంచైజీ కో ఓనర్‌ కావ్యా మారన్‌పై సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌ తట్టుకోలేక ఎక్స్‌ ఏకంగా సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఖాతానే సస్పెండ్‌ చేసింది.ఈ క్రమంలో ఆర్సీబీ గత ఎడిషన్‌లో (2025) ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర (హెడ్‌ కోచ్‌గా) పోషించిన ఆండీ ఫ్లవర్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. సన్‌రైజర్స్‌ లీడ్స్‌ పాక్‌ ఆటగాళ్లను తీసుకుంటే తప్పేంటి అని అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు.అతడి మాటల్లో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హండ్రెడ్‌ లాంటి లీగ్‌ల్లో ఉస్మాన్‌ తారిక్‌, అబ్రార్‌ అహ్మద్ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ‌ఆడటం శుభపరిణామం. వీరి చేరిక పోటీని మరింత రసవత్తరంగా మారుస్తుంది. ఆండీ ఫ్లవర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కావ్యా మారన్‌ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నాయి. క్రీడలకు ఇతర విషయాలతో సంబంధం ఉండకూడదన్న విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆండీ ఫ్లవర్‌ ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా ఉండటంతో పాటు హండ్రెడ్‌ లీగ్‌లోని లండన్‌ స్పిరిట్‌ ఫ్రాంచైజీకి కూడా హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీగా సన్‌రైజర్స్‌ లీడ్స్‌ నిలిచింది.ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.ఈ వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

Charlie Stobo Unconventional Methods To Retrieve Ball Sheffield Shield Viral4
బంతి కోసం క్రికెటర్‌ నానాతిప్పలు!

క్రికెట్‌లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువ లేదు. తాజాగా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా సౌత్‌ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బంతి కోసం ఆటగాళ్లు నానాపాట్లు పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సందర్భంగా ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో రియాన్‌ హడ్లే వేసిన షార్ట్‌బాల్‌ను లియామ్‌ స్కాట్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. బౌండరీ వైపు దూసుకెళ్లిన బంతి ఫెన్సింగ్‌ అవతల పడింది. అయితే ఈ బంతిని తీయడానికి సౌత్‌ ఆస్ట్రేలియా ఫీల్డర్‌ స్టోబో నానా రకాలుగా ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. అనంతరం ఫెన్సింగ్‌ కిందకు దూరి బంతి తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో స్టోబో కొద్ది దూరంలో కనిపించిన ఒక చిన్న కట్టెను తీసుకొచ్చి ఫెన్సింగ్‌ అవతల నుంచి మొత్తానికి బంతిని బయటకు తీశాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై క్రికెట్‌ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ‘పాపం మ్యాచ్‌కు మొత్తం ఒకటే బంతి ఉందనుకుంటా.. అందుకే బంతిని తీయడం కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు’ అని కామెంట్‌ చేశారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే సౌత్‌ ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సౌతా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం న్యూసౌత్‌వేల్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌట్‌ కావడంతో సౌతా్‌ ఆస్ట్రేలియా టార్గెట్‌ 95 పరుగులుగా నిర్ధేశించబడింది. ఈ టార్గెట్‌ను సౌత్‌ ఆస్ట్రేలియా ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!Genuinely bizarre scenes as Charlie Stobo has to get a stick to retrieve the ball from underneath the fence. #SheffieldShield pic.twitter.com/YVwlyjxo06— cricket.com.au (@cricketcomau) March 6, 2026

Young Football Player Ravinder Singh Died Heart Attack In Punjab5
భారత ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం!

భారత్‌ ఫుట్‌బాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్‌బాల్‌ ఆటలో మంచి భవిష్యత్తు ఉన్న యంగ్‌ డిఫెండర్‌ రవీందర్‌ సింగ్‌ 25 ఏళ్ల వయసులోనే మృత్యువాత పడడం కలచివేసింది. పంజాబ్‌లోని లుధియానా జిల్లా మాజ్రి గ్రామానికి చెందిన రవీందర్‌ సింగ్‌ లోకల్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. రవీందర్‌ సింగ్‌ను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం రవీందర్‌ సింగ్‌ నమ్దారీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత ఫుట్‌బాల్‌ జట్టులోకి ప్రవేశం పొందేందుకు ఈ క్లబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.చిన్నతనం నుంచే ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్న రవీందర్‌ సింగ్‌ 2000వ సంవత్సరంలో జన్మించాడు. ఫుట్‌బాల్‌పై ఇష్టం పెంచుకున్న రవీందర్‌ ప్రస్తుతం ఘర్షంకర్‌లోని బబ్బర్‌ అకాలీ మొమోరియల్‌ ఖల్సా కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.కాగా రవీందర్ సింగ్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు సహా స్నేహితులు, ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌కు చెందిన పలు క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు భారీగా హాజరయ్యారు. సామాజిక మాధ్యమాల్లోనూ రవీందర్‌సింగ్‌ మృతి పట్ల నివాళులు వెల్లువెత్తాయి. రవీందర్‌సింగ్‌ మృతిపై నమ్దారీ ఫుట్‌బాల్‌ క్లబ్ ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ‘మా ఫుట్‌బాల్‌ క్లబ్‌లో భాగమైన ఆటగాడు మరణించడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న రవీందర్‌ సింగ్‌ 25 ఏళ్లకే మృతి చెందడం కలచివేస్తోంది. అతని అకాల మరణం ఫుట్‌బాల్‌ ఫ్యామీలీకి తీరని లోటు. రవీందర్‌ సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అని తెలిపాడు. ఈ సందర్భంగా నమ్దారీ స్పోర్ట్స్‌ తరఫున ఆటగాళ్లు,కోచ్‌, సిబ్బంది నివాళి అర్పిస్తున్న వీడియోను షేర్‌ చేసుకుంది. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ సహా ఇతర ఫుట్‌బాల్‌ క్లబ్‌లు కూడా రవీందర్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించాయి.చదవండి: పాక్‌ ఆటగాడి కొనుగోలు.. కావ్యా మారన్‌కు భారీ ఝలక్‌ View this post on Instagram A post shared by Namdharisports (@namdharisports)

Sunrisers Leeds X Account Suspended Amid Row Over Signing Pakistan Star Abrar Ahmed In The Hundred Auction6
పాక్‌ ఆటగాడి కొనుగోలు.. కావ్యా మారన్‌కు భారీ ఝలక్‌

హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలంలో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్‌ లీడ్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌కు భారీ షాక్‌ తగిలింది. అబ్రార్‌ ఎంపిక జరిగిన కొన్ని గంటలకే సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా సస్పెండ్‌ అయ్యింది.అబ్రార్‌ను కొనుగోలు చేసిన వార్త బయటికి రాగానే భారత క్రికెట్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కావ్యా మారన్‌, సన్‌రైజర్స్‌ లీడ్స్‌పై విరుచుకుపడ్డారు. పాక్‌ ఆటగాడిని ఎలా కొనుగోలు చేస్తారంటూ అసభ్యపదజాలాలతో దుమ్మెత్తిపోశారు. సన్‌రైజర్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ పిలుపునిచ్చారు.భారీ ట్రోలింగ్‌ నేపథ్యంలో ఎక్స్‌ సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఖాతాను సస్పెండ్‌ చేసింది. వారి అకౌంట్‌ను యాక్సెస్‌ చేయాలని ప్రయత్నించిన వారికి “Account suspended. X suspends accounts that violate the X rules” అనే సందేశం కనిపించింది. ఇది భారతీయ అభిమానుల నుంచి పెల్లుబికిన ఆగ్రహజ్వాలల నేపథ్యంలో తీసుకున్న చర్చగా తెలుస్తుంది.కాగా, నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌ తొట్టతొలి వేలంలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ అబ్రార్‌ను 190,000 పౌండ్ల (సుమారు ₹2.34 కోట్లు) భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. హండ్రెడ్‌ లీగ్‌ వేలంలో పాక్ ప్లేయర్‌ను కొన్న ఏకైక భారతీయ ఫ్రాంచైజీగా సన్‌రైజర్స్‌ లీడ్స్‌ నిలిచింది.ఈ లీగ్‌ వేలంలో మొత్తం 13 మంది పాక్‌ ఆటగాళ్లు బరిలో నిలువగా.. అబ్రార్‌తో పాటు వివాదాస్పద స్పిన్నర్‌ ఉస్మాన్‌ తారిక్‌ మాత్రమే అమ్ముడుపోయాడు. ఉస్మాన్‌ తారిక్‌ను బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ 1.4 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది.ఈ వేలంలో ఇంగ్లండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ కోల్స్‌ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్‌ పౌండ్లు (లండన్‌ స్పిరిట్‌) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్‌ తర్వాత అత్యధిక ధర జోర్డన్‌ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్‌ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది.

Ajinkya Rahane to lead KKR in IPL 2026 says Report7
IPL 2026: కేకేఆర్‌ కెప్టెన్‌ అతడే..!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కెప్టెన్లను ఫైనల్‌ చేసుకునే పనిలో పడ్డాయి. గత సీజన్‌ ప్రదర్శనల ఆధారంగా ఈ సీజన్‌లో పలువురు కెప్టెన్ల మార్పు ఉంటుందని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ కెప్టెన్ల మార్పు తథ్యమని ఊహించారు. అయితే ఈ సీజన్‌లోనూ పాత వారితోనే ముందుకు వెళ్లాలని సదరు ఫ్రాంచైజీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీ అక్షర్‌ పటేల్‌తో.. కేకేఆర్‌ అజింక్య రహానేను ఈ సీజన్‌లో కూడా కెప్టెన్లుగా కొనసాగిస్తుందని ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.ఆశలుగత సీజన్‌లో రహానే కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సీజన్‌లో అతని మార్పు తప్పదని అంతా భావించారు. ఈ ప్రస్తావన రాగానే జట్టులో సీనియర్లలో ఒకరైన వరుణ్‌ చక్రవర్తి కెప్టెన్సీపై ఆశలు పెంచుకున్నాడు. తీరా చూస్తే యాజమాన్యం రహానేతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వరుణ్‌కు ఆశాభంగమైంది.ప్రక్షాళన2026 సీజన్‌కు ముందు కేకేఆర్‌ యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టింది. ఊహించని విధంగా చాలా మంది సీనియర్లను వదిలించుకొని కొత్త వారిని తీసుకుంది. కేకేఆర్‌ వదిలించుకున్న సీనియర్లలో ఆండ్రీ రస్సెల్‌, వెంకటేష్‌ అయ్యర్‌, క్వింటన్‌ డికాక్‌, అన్రిచ్‌ నోకియా, మొయిన్‌ అలీ, రహ్మనుల్లా గుర్బాజ్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.జాక్‌పాట్‌ కొట్టిన గ్రీన్‌ఈ సీజన్‌ వేలంలో కేకేఆర్‌ యాజమాన్యం ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కెమారూన్‌ గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 25.2 కోట్లు ఖర్చు చేసింది. అలాగే లంక పేసర్‌ మతీష పతిరణపై రూ. 18 కోట్లు వెచ్చించింది. అలాగే న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రచిన్‌ రవీంద్ర, టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ను ఓ మోస్తరు మొత్తాలకు సొంతం చేసుకుంది.కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్‌ను నిన్ననే ప్రకటించారు. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు సాగే ఈ విడతతో 20 మ్యాచ్‌ల తేదీలు, వేదికలను వెల్లడించారు. ఈ దశలో ప్రతి జట్టు తలో 4 మ్యాచ్‌లు ఆడనుంది.ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్‌ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న (ముంబై ఇండియన్స్‌తో) ముంబై వేదికగా ఆడుతుంది. రెండో మ్యాచ్‌ ఏప్రిల్‌ 2న ఎస్‌ఆర్‌హెచ్‌తో (కోల్‌కతా), మూడో మ్యాచ్‌ ఏప్రిల్‌ 6న పంజాబ్‌తో (కోల్‌కతా), నాలుగో మ్యాచ్‌ ఏప్రిల్‌ 9న లక్నోతో (కోల్‌కతా) ఆడనుంది.2026 ఐపీఎల్‌ సీజన్‌ కోసం కేకేఆర్‌ జట్టు..అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతియానా, మతీషా పతియానా, మతీషా పతియాన సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్

Virat Kohli, Rohit Sharma To Get Extra Matches For India On The Road To 2027 ODI World Cup8
రోహిత్‌-కోహ్లి అభిమానులకు శుభవార్త

భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా క్రికెట్‌లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌లో (FTP) షెడ్యూలైన మ్యాచ్‌లకు అదనంగా కొన్ని దేశాలు భారత్‌తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది భారత్‌ షెడ్యూల్‌ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్‌లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ దేశాల క్రికెట్‌ బోర్డులు అదనపు మ్యాచ్‌ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్‌ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌తో మొదలవుతుంది.అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్‌ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్‌, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం రిక్వెస్ట్‌ చేస్తుందని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్‌ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కూడా భారత్‌తో అదనపు వన్డే సిరీస్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్‌, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్‌, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.ఐపీఎల్‌ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్‌ (అంచనా)..ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేలు, ఓ టెస్ట్‌ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సన్నాహాలు జరుగుతున్నాయిఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్‌లపై ఆసక్తి)శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్‌లుబంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లుజింబాబ్వే టీ20 సిరీస్‌కు సన్నాహాలు జరుగుతున్నాయివెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లుఆసియా క్రీడలున్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్‌లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లుఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు

Suryakumar Yadav on winning T20 World Cup 20269
బాహుబలి పాటతో స్ఫూర్తి పొందాం

ముుంబై: భారత్‌కు టి20 వరల్డ్‌ కప్‌ను అందించిన మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ ఘనత సాధించాడు. ఫైనల్‌ ముగిసిన రోజునుంచి అతను ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో పలు అంశాలపై అతను మీడియాతో మాట్లాడాడు. విశేషాలు సూర్యకుమార్‌ మాటల్లోనే... కెప్టెన్సీ, వరల్డ్‌ కప్‌ గెలిపించడంపై... రోహిత్‌ తప్పుకున్న తర్వాత నన్ను కెప్టెన్‌ను చేస్తారని ఊహించలేదు. ఏడాదిన్నర క్రితం శ్రీలంక వెళ్లడానికి వారం రోజుల ముందు నిన్ను కెప్టెన్‌గా నియమిస్తున్నామని జై షా చెప్పారు. అప్పుడే కోచ్‌ గంభీర్‌తో మాట్లాడి వరల్డ్‌ కప్‌ గెలవాలనే ఏకైక లక్ష్యంతో రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం. ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా ప్రపంచ కప్‌ గెలిస్తే అది చాలా గొప్ప విషయం అవుతుందని అనుకున్నా. ఇప్పుడు అదే జరగడం చాలా సంతోషంగా ఉంది. 2024 ప్రపంచకప్‌తో పోలిక...అప్పటికంటే మా బ్రాండ్‌ క్రికెట్‌కు మార్చాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలకంటే జట్టుగా గెలవడం ముఖ్యం అని అందరికీ చెప్పాం. సెమీస్‌ చేరే వరకు కూడా అత్యధిక పరుగుల, వికెట్ల జాబితాలో మన ఆటగాళ్లెవరూ లేరు. ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించడంతో వరుసగా విజయాలు వచ్చాయి. చాలా మంది మన జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో దూకుడుగా ఆడుతుంది. ఐసీసీ ఈవెంట్లలో జాగ్రత్త పడుతుంది అని విమర్శించేవారు. కానీ దీనిని కూడా మార్చాలని, ఇక్కడా అదే ధాటిని కొనసాగించాలని భావించాం.మర్చిపోలేని క్షణాలు... వరల్డ్‌ కప్‌ ట్రోఫీని కెప్టెన్‌గా అందుకోవడం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఇంకా నమ్మలేకపోతున్నాను అన్నట్లుగా నా చెంపపై రెండు సార్లు దెబ్బ వేసి మరీ ముందుకు సాగాను. మైదానంలో చూస్తే అక్షర్‌ పట్టిన క్యాచ్‌ అద్భుతం. నేను 2024 ఫైనల్లో అందుకున్న క్యాచ్‌ లాంటిదే ఇది కూడా. దక్షిణాఫ్రికా మ్యాచ్‌ తర్వాత ‘సాహోరే...బాహుబలి’ పాటతో ప్రత్యేకంగా పది నిమిషాల రీల్‌ చేసి మా వీడియో అనలిస్ట్‌ మాలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

Satwik and Chirag pair into quarters at Swiss Open badminton tournament10
క్వార్టర్స్‌కు సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ భారత జంట 21–15, 15–21, 28–26తో హిరోకి ఒకముర–క్యొహే యామషిత (జపాన్‌) ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌ మన్నెపల్లి ప్రిక్వార్టర్స్‌ చేరగా, మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 43వ ర్యాంకర్‌ తరుణ్‌ 16–21, 21–16, 7–2తో తనకన్నా మెరుగైన ప్రత్యర్థి, ఐదో సీడ్‌ కెంట నిషిమొటో (జపాన్‌)పై ఆధిక్యంలో ఉండగా భుజం గాయంతో జపాన్‌ ఆటగాడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ప్రిక్వార్టర్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 18–21, 21–16, 16–21తో జాసన్‌ గునవన్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో మాళవిక బన్సోద్‌ 11–21, 15–21తో థాయ్‌లాండ్‌కు చెందిన ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ పొర్న్‌పవీ చొచువాంగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఎమ్‌.ఆర్‌.అర్జున్‌–హరిహరన్‌ జోడీ 17–21, 11–21తో చెన్‌ చెంగ్‌ కున్‌–లిన్‌ బింగ్‌ వీ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement