Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

RCB to be acquired by Aditya Birla Group1
రాయల్‌ ‘బిర్లా’ బెంగళూరు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. లీగ్‌ విలువను చూపిస్తూ రెండు ఐపీఎల్‌ జట్లు కలిపి ఏకంగా సుమారు రూ.32 వేల కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. క్రికెట్‌తో పరిచయం లేని అమెరికా వ్యాపార సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా లీగ్‌తో జత కట్టేందుకు భారీ మొత్తాలతో ముందుకు వచ్చారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్‌ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఆరంభమైన 2008 నుంచి లీగ్‌లో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యాజమాన్యం తమ జట్టును అమ్మకానికి ఉంచగా... అమెరికాకు చెందిన కాల్‌ సోమాని కన్సార్టియమ్‌ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్‌ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త కాల్‌ సోమానితో పాటు రాబ్‌ వాల్టన్, హ్యాంప్‌ ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్నారు. టెక్నాలజీ సర్వీసెస్‌ అండ్‌ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్, ఎడ్యుటెక్‌ సర్వీసెస్‌ రంగాల్లో ఇన్‌ట్రా ఎడ్జ్, ట్రూయో.ఏఐ, అకడమియన్‌ వంటి సంస్థలకు అధిపతిగా సోమాని ఉన్నారు. రాబ్‌ వాల్టన్‌ ప్రఖ్యాత వాల్‌మార్ట్‌ కంపెనీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీకి హ్యాంప్‌ ఫ్యామిలీ యజమానిగా ఉంది. సోమాని రాజస్తాన్‌ జట్టులో 2021 నుంచి చిన్న వాటాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిని సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్‌–2026 ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి జట్టుపై హక్కులు లభిస్తాయి. అసాధారణ పెరుగుదల... నిజానికి ఐపీఎల్‌లో ఆట, అభిమానులపరంగా చూస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకే చివరి స్థానం దక్కుతుంది. 2008లో తొలిసారి టోర్నీ గెలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. ఎలాంటి స్టార్‌ ఆటగాళ్లు లేకుండానే టీమ్‌ సాగుతూ వచ్చింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంగా 2016, 2017 సీజన్లలో టీమ్‌పై నిషేధం కూడా పడింది. 2008లో 67 మిలియన్‌ డాలర్లకు ఈ జట్టు అమ్ముడుపోయింది. నాటి రూపాయి విలువ ప్రకారం జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే! ఇతర ఏడు జట్లతో పోలిస్తే రాజస్తాన్‌ అన్నింటికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయింది. రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్య హక్కులు (ఇప్పటి వరకు) మనోజ్‌ బదాలే (ఎమర్జింగ్‌ మీడియా) 65%, రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ 15%, లక్‌లాన్‌ మర్డోక్‌ 13%, ఇతరులు 7% ఎవరు కొన్నారు? కాల్‌ సోమాని: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్‌ట్రా ఎడ్జ్‌ కంపెనీ సీఈఓ రాబ్‌ వాల్టన్‌: వాల్‌మార్ట్‌ కుటుంబ వారసుడు, అమెరికాలోని నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌)లో డెన్వర్‌ బ్రోంకోస్‌ జట్టు యజమాని. హ్యాంప్‌ ఫ్యామిలీ: ఫోర్డ్‌ కంపెనీ మరియు ఫైర్‌స్టోన్‌ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్‌... హ్యాంప్‌ ఫ్యామిలీ కోడలిగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌లో డెట్రాయిట్‌ లయన్స్‌ జట్టుకు యజమాని. ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) అమ్మకం కూడా పూర్తయినట్లు సమాచారం. 1.78 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.16,753 కోట్లు) ఆదిత్య బిర్లా గ్రూప్‌ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ టీమ్‌తో పాటు ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లోని ఆర్‌సీబీ జట్టు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆర్‌సీబీని కొన్న కన్సార్టియంలో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్, బోల్ట్‌ వెంచర్స్, బ్లాక్‌స్టోన్స్‌ (బీఎక్స్‌పీఈ) కలిసి భారీ మొత్తానికి బెంగళూరు జట్టును తమదిగా మార్చుకున్నాయి. 2008 తొలి ఐపీఎల్‌ సమయంలో విజయ్‌ మాల్యాకు చెందిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ గ్రూప్‌ 111.6 మిలియన్‌ డాలర్లకు (నాటి విలువ ప్రకారం సుమారు రూ.485 కోట్లు) సొంతం చేసుకుంది. బోల్ట్‌ వెంచర్స్‌ తరఫున ప్రముఖ ఇన్వెస్టర్‌ డేవిడ్‌ బ్లిట్జర్స్, బీఎక్స్‌పీఈ తరఫున విరాల్‌ పటేల్‌ టీమ్‌ యాజమాన్యంలో భాగస్వాములు కానుండగా... ఆర్యమాన్‌ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్‌ గ్రూప్‌ నుంచి సత్యన్‌ గాజ్‌వాని వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.29 ఏళ్ల ఆర్యమాన్‌ బిర్లా దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు తరఫున 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 4 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. ‘క్రికెట్‌లో మానసిక ఒత్తిడి’ని తట్టుకోలేనంటూ 2019లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ఎంపికైనా... ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు ఒక జట్టు చైర్మన్‌గా మళ్లీ అతను ఐపీఎల్‌లో అడుగు పెట్టనున్నాడు!

Lucknow Super Giants with new hopes 2
‘జెయింట్స్‌’ స్థాయి పెరిగేనా!

ఐపీఎల్‌లో ఆలస్యంగా అడుగు పెట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి రెండు సీజన్లలో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరి ఆకట్టుకుంది. అయితే గత రెండు సీజన్లలో జట్టు ఆటతీరు పేలవంగా ఉంది. వరుసగా రెండేళ్లు కూడా టీమ్‌ ఏడో స్థానానికే పరిమితమైంది. 2025లో రికార్డు మొత్తంతో కొత్త కెప్టెన్‌గా వచ్చిన రిషభ్‌ పంత్‌ చివరి మ్యాచ్‌ మినహా టోర్నీ అంతా విఫలం కాగా... ఇతర ఆటగాళ్లు కూడా అదే బాటలో ఉండటం జట్టును దెబ్బ తీసింది. ఐపీఎల్‌లో ఐదో సీజన్‌ ఆడబోతున్న లక్నో ఈసారైనా తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తుందో లేదో వేచి చూడాలి. – సాక్షి క్రీడా విభాగం తొలి ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు విజయాలు, తర్వాతి ఆరు మ్యాచ్‌లలో ఒకే ఒక్క గెలుపు! గత ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పరిస్థితి. టోర్నీని మెరుగ్గా ఆరంభించినా ఆ తర్వాత అంతా గతి తప్పింది. ఈసారి అది పునరావృతం కారాదని జట్టు పట్టుదలగా ఉంది. మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, అవసరం అనుకుంటే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ కనిపించే టీమ్‌ యాజమాని సంజీవ్‌ గోయెంకా అంచనాలు, ఆశలకు అనుగుణంగా రాణించడంలో మాత్రం టీమ్‌ విఫలమవుతోంది. తొలి సీజన్‌ తర్వాత టీమ్‌ కిట్‌ను పూర్తిగా మార్చిన మేనేజ్‌మెంట్‌ మూడు సీజన్లు దానిని కొనసాగించింది. ఏదైనా నమ్మకాల వల్ల కావచ్చు 2026 సీజన్‌ కోసం కూడా చాలా మార్పులు చేసింది. టీమ్‌ జెర్సీని పూర్తిగా మార్చేయడంతో పాటు లోగోను కూడా కొత్తగా డిజైన్‌ చేయించింది. మైదానంలో ఈ ‘సెంటిమెంట్‌’లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది ఆసక్తికరం. పంత్‌పై ఆశలు... టాప్‌–3 విదేశీ ఆటగాళ్లతో లక్నో బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. మిచెల్‌ మార్‌‡్షతో పాటు మార్క్‌రమ్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. వీరిద్దరు మంచి ఆరంభాన్ని అందిస్తే పూరన్‌ అదే ధాటిని కొనసాగించగలడు. పంత్‌ మూడో స్థానంలో ఆడటంపై చర్చ జరిగినా... ఈ ముగ్గురు బ్యాటర్లను చూస్తే పంత్‌కు నాలుగో స్థానమే ఖాయంగా కనిపిస్తోంది. పేసర్లతో ఫుల్‌... షమీ, నోర్జే, మయాంక్, అవేశ్, మొహసిన్, అర్జున్‌ టెండూల్కర్, నమన్‌ తివారి, ఆకాశ్‌ సింగ్, ప్రిన్స్, అర్షిన్, మార్‌‡్ష... రెగ్యులర్‌ బౌలర్లు, ఆల్‌రౌండర్లు కలిపి ఏకంగా 11 పేస్‌ బౌలింగ్‌ ప్రత్యామ్నాయాలు లక్నోకు అందుబాటులో ఉన్నాయి. స్పిన్‌ బలహీనం... ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లలో స్పిన్నర్లు కీలక ప్రభావం చూపించడం ఖాయం. సూపర్‌ జెయింట్స్‌ హోమ్‌ గ్రౌండ్‌ లక్నో కూడా సగటు భారత పిచ్‌ల తరహాలో పేస్‌కంటే కూడా స్పిన్‌కే కొంత అనుకూలిస్తుంది. కానీ ఈ విషయంలో లక్నో బలహీనంగా కనిపిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌గా లంక ఆటగాడు హసరంగను జట్టు ఎంచుకుంది. అతనిపైనే ప్రధానంగా భారం ఉంది. లక్నో జట్టు వివరాలు: పంత్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, మిచెల్‌ మార్‌‡్ష, పూరన్, ఇన్‌గ్లిస్, బ్రీట్‌కే, హసరంగ, నోర్జే, హిమ్మత్, ముకుల్, అక్షత్, సమద్, షహబాజ్, అర్షిన్, బదోని, షమీ, అవేశ్‌ , సిద్ధార్‌్థ, దిగ్వేశ్‌ రాఠీ, ఆకాశ్‌ సింగ్, ప్రిన్స్, అర్జున్‌ టెండూల్కర్, నమన్‌ తివారి, మయాంక్‌ యాదవ్, మొహసిన్‌ ఖాన్‌.

England cricketer withdraws from IPL3
సారీ... ఈ సీజన్‌ ఆడలేను: డకెట్‌

లండన్‌: ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌ బరిలోకి దిగడం లేదని చావుకబురు చల్లగా చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాల్సిన అతను చాలా ఆలస్యంగా తన గైర్హాజరు నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇది కఠినమైన నిర్ణయం. కానీ తప్పలేదు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీకి క్షమాపణలు చెబుతున్నా. వేలంలో నాపై నమ్మకముంచి ఐపీఎల్‌ ఆడే అవకాశమిచి్చన ఫ్రాంచైజీ తరఫున ఆడలేకపోవడం విచారకరం’ అని డకెట్‌ పోస్ట్‌ చేశాడు. దీంతో ఐపీఎల్‌ నియమావళి ప్రకారం అతను రెండేళ్ల నిషేధానికి గురయ్యే అవకాశముంది. లీగ్‌ నిబంధన ప్రకారం ఎవరైనా విదేశీ ఆటగాడు వేలంలో పాల్గొని, ఫ్రాంచైజీ ఎంపిక చేసుకున్నాక సహేతుక కారణం లేకుండా ఆడనని చెబితే కుదరదు. గాయం, ఫిట్‌నెస్‌ సమస్యలు, పితృత్వపు సెలవులకు మినహాయింపు ఉంటుంది. డకెట్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువసేపు గడిపేందుకు భారత్‌కు రావడం లేదని చెప్పాడు. దీంతో అతనికి నిషేధం తప్పదని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానాల్లో... ఈ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలన్నీ గాయాల బెడదను ఎదుర్కొంటున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు. తాజాగా వారి స్థానాలను ఆయా ఫ్రాంచైజీలు భర్తీ చేసుకున్నాయి. » కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు పేసర్‌ ఆకాశ్‌దీప్‌ స్థానంలో రూ. 30 లక్షలతో సౌరభ్‌ దూబేను తీసుకుంది. » సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జాక్‌ ఎడ్వర్డ్స్‌ (ఆ్రస్టేలియా) స్థానాన్ని డేవిడ్‌ పైన్‌ (ఇంగ్లండ్‌; రూ.1.5 కోట్లు)తో భర్తీ చేసుకుంది. » చెన్నై సూపర్‌ కింగ్స్‌ గాయపడిన నాథన్‌ ఎలీస్‌ స్థానంలో ఆసీస్‌కే చెందిన సహచరుడు స్పెన్సర్‌ జాన్సన్‌ (రూ. 1.5 కోట్లు)ను తీసుకుంది.

Gujarat Titans is organizing a special event titled Shubharambham 20264
గర్జించేందుకు గిల్‌ రెడీ

అహ్మదాబాద్‌: మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... ప్రశాంతంగా ఉండటం వల్ల సునిశిత దృష్టి అలవడుతుందని గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు. ఇటీవల టి20 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్‌... ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు రెండో టైటిల్‌ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజీ తొలి సీజన్‌లోనే చాంపియన్‌ అవతరించింది. ఆ తర్వాత ఏడాది రన్నరప్‌గా నిలిచిన టైటాన్స్‌... గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరింది. శుక్రవారం నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆ ఫ్రాంచైజీ ‘శుభారంభం–2026’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం గిల్‌ మాట్లాడుతూ... ‘నేను సాధారణంగా ప్రశాంతంగానే ఉంటాను. అదే నాకు జట్టుపై నమ్మకం, విశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోనూ కాకుండా ఉండటం ద్వారా విశాల దృక్పథం అలవుడుతుంది. దీంతో ఆ క్షణాలను విభిన్నంగా చూడగల శక్తి వస్తుంది. అప్పుడు సమస్యల పరిష్కారం సులువు అవుతుంది’ అని వెల్లడించాడు.ఫ్రాంచైజీ క్రికెట్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకి మాట్లాడుతూ... ‘గతేడాది మా జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే ఈ కార్యక్రమం ద్వారా ఆటగాళ్లందరినీ ఒక్క చోటకు చేర్చాం. దీంతో జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరగడంతో పాటు పరస్పర నమ్మకం కలుగుతుంది. వేలంలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశాం. జట్టు కూర్పుకు తగ్గట్లు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాం. ఆ ఫలితాలు మరి కొన్ని రోజుల్లో మీ ముందు ఉంటాయి’ అని అన్నాడు.

President of the Cyprus Chess Federation comments on Koneru Humpy5
‘హంపి తప్పు చేసింది’

న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్‌ చెస్‌ సమాఖ్య (సీసీఎఫ్‌) అధ్యక్షుడు క్రిటాన్‌ టొర్నారిటిస్‌ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్‌ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్‌ చెస్‌ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్‌ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్‌లలో మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్‌ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్‌ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.

IPL 2026: KKR big announcement Rinku Singh named Rahane deputy6
భవిష్య కెప్టెన్‌గా రింకూ సింగ్‌.. ప్రకటన విడుదల

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్‌ కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌, టీ20 ప్రపంచకప్‌ విజేత రింకూ సింగ్‌ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్‌ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్‌ అయినప్పటికీ కేకేఆర్‌ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి. కెప్టెన్‌గా రహానేఇక మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో కేకేఆర్‌ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్‌ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్‌ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్‌ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.భవిష్య కెప్టెన్‌ రింకూనేనిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్‌ భవిష్య కెప్టెన్‌ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.కాగా 2018 నుంచి రింకూ సింగ్‌ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. పేద కుటుంబంఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్‌ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.లోక్‌సభ ఎంపీతో నిశ్చితార్థంవరల్డ్‌కప్‌ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్‌ ప్రియా సరోజ్‌తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026

Blow For DC England Star Pulls Out Of IPL 2026 Set To Face Big Punishment7
ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సంచలన ప్రకటన.. వేటు తప్పదు!

ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం వెల్లడించాడు.రూ. 2 కోట్లుకాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ డకెట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్‌ ఆప్షన్‌గా పనికివస్తాడనే కారణంతో అతడి కోసం రూ. 2 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి డకెట్‌ ఓపెనింగ్‌ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి.ఢిల్లీ క్యాపిటల్స్‌ నెత్తిన పిడుగుఅయితే, తాజాగా బెన్‌ డకెట్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) నెత్తిన పిడుగు వేశాడు. తాను ఈ సీజన్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు.. ‘‘ఢిల్లీ ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరునా క్షమాపణలు చెబుతున్నా. ఈసారి ఢిల్లీ ఫ్రాంఛైజీ తరఫున ఆడాలని ఎంతో ఆతురతగా ఎదురుచూశాను.క్షమించండిఅందుకు తగ్గట్లుగానే ఫ్రాంఛైజీ కూడా తమ జట్టు కూర్పు విషయంలో ప్రణాళికలు రచించుకుంది. కానీ నా నిర్ణయం వల్ల వారి ప్రణాళికల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందుకు నేను ఎంతగానో చింతిస్తున్నా.ఢిల్లీ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను. ఐపీఎల్‌ నుంచి వైదొలగాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నా. ఈ విషయాన్ని చెప్పడం ఎంతో బాధగా ఉంది. అయితే, చిన్ననాటి నుంచి ఇంగ్లండ్‌ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాను.నా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే అంకితంనా సర్వస్వం ఇంగ్లండ్‌ క్రికెట్‌కే ధారబోయాలని అనుకున్నాను. అందుకోసం నేను శారీకరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి. సమ్మర్‌ షెడ్యూల్‌ కోసం నేను సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని డకెట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.కాగా డకెట్‌ ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఐపీఎల్‌లో ఆడకుండా అతడిపై రెండేళ్ల నిషేధం పడనుంది. పాలక మండలి ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం.. గాయం లేదంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంటుంది. రెండేళ్ల నిషేధంఅలాకాని పక్షంలో ఇష్టానికి టోర్నీ నుంచి తప్పుకొంటే నిషేధం పడుతుంది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ ఇప్పటికే ఈ మేరకు నిషేధం ఎదుర్కొంటుండగా.. తాజాగా మరో ఇంగ్లిష్‌ ప్లేయర్‌ డకెట్‌ ఈ జాబితాలో చేరనున్నాడు.కాగా డకెట్‌ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ కేవలం 221 పరుగులే చేయగలిగాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో సమ్మర్‌ షెడ్యూల్‌లో భాగంగా సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలనే యోచనలో ఉన్నట్లు డకెట్‌ ఇటీవల పేర్కొన్నాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయంఆ విదేశీ ఆటగాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌

Ireland To Allow Cricketers To Boycott Afghanistan ODIs Reason is8
‘అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ బాయ్‌కాట్‌ చేయొచ్చు’

క్రికెట్‌ ఐర్లాండ్‌ ఇటీవలే అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్‌- అఫ్గనిస్తాన్‌ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ జట్లు అఫ్గనిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్‌లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్‌ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్‌ అఫ్గన్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్‌ ఆడింది. ఇక ఐర్లాండ్‌ తాజాగా అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఐర్లాండ్‌ హై పర్ఫామెన్స్ డైరెక్టర్‌ గ్రేమ్‌ వెస్ట్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్‌తో సిరీస్‌ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్‌ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్‌ ఐర్లాండ్‌ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్‌ అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్‌ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్‌కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్‌ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్‌-8 దశ చేరకుండానే లీగ్‌ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్‌ పదవికి పాల్‌ స్టిర్లిండ్‌ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బ్రీడీ, బెల్‌ఫాస్ట్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Hardest Period: Stokes Breaks Silence on Ashes debacle Post Goes Viral9
అత్యంత క్లిష్ట సమయం: బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గడిచిన మూడు నెలల కాలం తన కెప్టెన్సీ కెరీర్‌లో అత్యంత కష్టతరమైనదని పేర్కొన్నాడు. ఏదేమైనా తాము సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నాడు.ఘోర పరాభవంఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ 2025-26లో ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో 4-1తో ఓడిపోయిన స్టోక్స్‌ బృందం.. ఈ కీలక టెస్టు సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చిన ఒకే ఒక్క అంశం మెల్‌బోర్న్‌ వేదికగా నాలుగో టెస్టు గెలవడం మాత్రమే. రాజీనామా డిమాండ్లూఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ జట్టు ఆట తీరుపై.. ముఖ్యంగా బజ్‌బాల్‌ పేరిట టెస్టు క్రికెట్‌లోనూ దూకుడుగా ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ రాజీనామా చేయాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ECB) మాత్రం వీరిపై నమ్మకం ఉంచింది.అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదుECB చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ గుడ్‌ ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘అంతర్గతంగా యాషెస్‌ వైఫల్యంపై సమీక్ష జరిపాము. కొన్నిసార్లు నాయకత్వ బృందాన్ని మార్చడం తేలికైన పని అనిపిస్తుంది. కానీ అన్నిసార్లూ అదే సరైన మార్గం కాదు.అదృష్టవశాత్తూ మా నాయకత్వ బృందానికి అంకితభావం, లక్ష్య సాధనకై శ్రమించే తత్వం ఎక్కువ. యాషెస్‌ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు’’ అని పేర్కొన్నాడు. అత్యంత క్లిష్టమైనదిఈ మేరకు రిచర్డ్‌ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి స్టోక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌గా ఉండటం అత్యంత గొప్ప గౌరవం. దీనిని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.కొన్నిసార్లు నవ్వితే.. మరికొన్నిసార్లు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు. గత మూడు నెలల కాలం నా కెప్టెన్సీ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైనది. బజ్‌ (మెకల్లమ్‌), రాబ్‌ కీ (సెలక్టర్‌), నేను ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నాము.జట్టును విజయపథంలో నడిపించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. మేము కొన్ని తప్పులు చేశామని మాకు తెలుసు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటాము. అపజయాలను విజయాలుగా మారుస్తాము. సమ్మర్‌ టెస్టు షెడ్యూల్‌తో జూన్‌లో మిమ్మల్ని కలసుకుంటాను’’ అని స్టోక్స్‌ అభిమానులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టాడు. ఈ సందర్భంగా బజ్, రాబ్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు.చదవండి: PSL: బంగ్లాదేశ్‌ కీలక నిర్ణయం

IPL Franchise Rajasthan Royals Sold Rs 15000 Cr Huge Deal: Report10
RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్‌-2008 విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్‌ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్‌ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రూ. 15 వేల కోట్లకు సొంతం!జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్‌మార్ట్‌ కుటుంబానికి చెందిన రాబ్‌ వాల్టన్‌, హ్యాంప్‌ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.ఐపీఎల్‌-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్‌ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్‌ మీడియా వెంచర్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు యజమానిగా ఉంది. రెడ్‌బర్డ్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌, లాచ్‌లాన్‌ ముర్దోచ్‌ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌, అమెరికాకు చెందిన స్పోర్ట్స్‌ ఇన్వెస్టర్‌ డేవిడ్‌ బిల్ట్జర్‌ రాయల్స్‌ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.ఎవరీ కల్‌ సోమానీ?ఎడ్‌ టెక్‌, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్‌ సంస్థలు ఇంట్రాఎడ్జ్‌, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్‌ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్‌ చరిత్రలో రాజస్తాన్‌ రాయల్స్‌ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్‌ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్‌ దిగ్గజం

Advertisement
Advertisement
 
Advertisement