ప్రధాన వార్తలు
ఆర్సీబీతో మ్యాచ్ టాస్.. బౌలింగ్ ఎంచుకున్న ముంబై
MI vs RCB Live Updates: ఐపీఎల్-2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది.
IPL 2026: రాకాసి బౌన్సర్ దెబ్బకు పుర్రె పగిలిపోయేది..!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ముకుల్ ఛౌదరి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 2026 ఎడిషన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అశోక్ కుమార్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ ముకుల్ ఛౌదరి తలను బలంగా తాకింది. గంటకు 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతి ముకుల్ హెల్మెట్ను తగిలి థర్డ్ మన్ దిశగా చాలా దూరం వెళ్లింది. దీన్ని బట్టి బంతి ఎంత వేగంగా వచ్చిందో అంచాన వేయవచ్చు. pic.twitter.com/c7dQanPPqN— crictalk (@crictalk7) April 12, 2026ఈ దెబ్బకు హెల్మెట్ ఉన్నా, ముకుల్ దిమ్మతిరిగిపోయింది. ఈ ఘటన తర్వాత మైదానం మొత్తం ఒక్క క్షణం నిశబ్దం ఆవహించింది. ఫిజియో హుటాహుటిన వచ్చి ముకుల్కు కంకషన్ టెస్ట్ చేశాడు. అదృష్టవశాత్తూ ముకుల్కు ఎలాంటి అపాయం జరగలేదు. ఒకవేళ ఆ బంతి హెల్మెట్ కవర్ చేయని ప్రాంతంలో తగిలి ఉంటే, ముకుల్ పరిస్థితి ఏంటో అంచనా వేయడం కష్టంగా ఉండేది. ఒకవేళ ముకుల్ హెల్మెట్ లేకుండా బరిలోకి దిగుంటే అతని పుర్రె పగిలిపోయేది. అశోక్ ఎంత వేగవంతమైన బౌలరో ఇదివరకే రుజువైంది. ఈ సీజన్తోనే అరంగేట్రం చేసిన అతను.. క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బంతి (154.2) కూడా అశోక్ ఖాతాలోనే ఉంది.ముకుల్ విషయానికొస్తే.. ఇతగాడు గత మ్యాచ్లో (కేకేఆర్పై) లక్నోను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపుపై ఎమాత్రం అంచనాలు లేని సమయంలో 27 బంతుల్లో 54 పరుగులు చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్లో ముకుల్ కొట్టిన 7 సిక్సర్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో ముకుల్ వింటేజ్ ధోనిని గుర్తు చేశాడు. ముకుల్ కూడా ధోని తరహాలోనే వికెట్కీపింగ్ బ్యాటర్గా ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతుంది.
'అతడే మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు'
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ వైఫల్యం కొనసాగుతోంది. బ్యాటింగ్లో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. శనివారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది.220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో సీనియర్ పేసర్గా ఉన్న జయదేవ్ ఉనద్కట్ దారుణంగా విఫలమవుతున్నాడు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అయితే జయదేవ్ పూర్తిగా తేలిపోయాడు.సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్లో అతడు తీవ్రంగా శ్రమించాడు. పంజాబ్ బ్యాటర్లు అతడి బౌలింగ్ను ఓ ఆట ఆడుకున్నాడు. ఉనద్కట్ తన మూడు ఓవర్ల కోటాలో 13.30 ఏకానమీతో 40 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా అతడు విఫలమయ్యాడు.ఆ మ్యాచ్లో అయితే ఉనద్కట్ 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 50 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్లలో కూడా అతడు ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. మొత్తంగా అతడు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడి 4 వికెట్లు సాధించాడు. జయదేవ్ ఏకానమీ రేటు 10.90గా ఉంది.దీంతో ఇంతదారుణంగా విఫలమవుతున్నప్పటికి అతడిని ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించడం పట్ల ఎస్ఆర్హెచ్ అభిమానులు మండిపడుతున్నారు. ఉనద్కట్ను సైతం ట్రోల్ చేస్తున్నారు. "బ్యాటింగ్లో కోహ్లి రన్ మిషన్ అయితే, బౌలింగ్లో ఉనద్కట్ ఒక రన్ మిషన్" అంటూ పోస్ట్లు పెడుతున్నారు. 'జయదేవ్ ఉనద్కట్ మన బెస్ట్ బౌలర్.. గెలిచే మ్యాచ్లను దగ్గరుండి ఓడిస్తాడు' అని మరొక నెటిజన్ ఈ సెటైరికల్ పోస్ట్ చేశాడు. అతడి స్ధానంలో ప్రఫుల్ హింగే, ఓంకర్ తర్మాలే వంటి యువ పేసర్లకు అవకాశమివ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. తదుపరి మ్యాచ్కైనా ఉనద్కట్పై ఎస్ఆర్హెచ్ వేటు వేస్తుందో లేదో చూడాలి.చదవండి: IPL 2026: వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
IPL 2026: కేకేఆర్కు బిగ్ న్యూస్
ఐపీఎల్ 2026లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కేకేఆర్కు బిగ్ న్యూస్ అందింది. రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న శ్రీలంక పేసర్ మతిష పతిరణ త్వరలో జట్టులో చేరబోతున్నాడు. సొంత దేశ క్రికెట్ బోర్డు (SLC) నుంచి అతనికి NOC లభించింది. గాయం కారణంగా పతిరణ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా అతను ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి, SLC అనుమతితో ఐపీఎల్ 2026లో అడుగుపెట్టబోతున్నాడు.ఏప్రిల్ 14న సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్కు అతను అందుబాటులో ఉండనున్నాడు. పతిరణ రాక కేకేఆర్ బౌలింగ్ విభాగానికే కాకుండా జట్టు యావత్తుకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ సేవలు కోల్పోయి పేలవ ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పుడు పతిరణ రాక కేకేఆర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టుకు అదృష్టం కూడా కలిసి రావడం లేదు. గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓటమిపాలవడంతో పాటు ఓ మ్యాచ్ అన్యాయంగా వర్షార్పణం అయ్యింది.ఇదిలా ఉంటే, పతిరణ గైర్హాజరీలో విదేశీ పేసర్గా జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పలు మ్యాచ్లు ఆడాడు. అయితే అతని నుంచి ఆశించి ఫలితాలు రాకపోవడంతో కేకేఆర్కు చేదు అనుభవాలు మిగిలాయి. చివరికి గాయంతో బాధపడుతున్న గ్రీన్తో బౌలింగ్ చేయించినా సానుకూల ఫలితాలు రాలేదు. సీజన్ ప్రారంభానికి ముందే ముస్తాఫిజుర్ రూపంలో కేకేఆర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
ఐపీఎల్-2026లో శుక్రవారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ గెలుపొందినప్పటికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.మరోవైపు రుమీ బిందర్ పక్కన ఉండి ఫోన్ చూసిన 15 వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు
లక్నోపై గుజరాత్ గెలుపు
లక్నోపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం లక్నో 164/8(20) గుజరాత్ 165/3(18.4)లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్165 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ లక్ష్యం దిశగా సాగుతుంది. 8 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 69 పరుగులుగా ఉంది. గిల్ (40), బట్లర్ (14) క్రీజ్లో ఉన్నారు. గుజరాత్ టార్గెట్ 165టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు తీసి లక్నోను దెబ్బ తీశాడు. ఏడో వికెట్ కోల్పోయిన లక్నో18.1వ ఓవర్- 131 పరుగుల వద్ద లక్నో ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బట్లర్కు క్యాచ్ ఇచ్చి ముకుల్ చౌదరి (18) ఔటయ్యాడు.ఐదో వికెట్ కోల్పోయిన లక్నో14.3వ ఓవర్-109 పరుగుల వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి పూరన్ (19) ఔటయ్యాడు.నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నోలక్నో 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96 పరుగులుగా ఉంది. పూరన్ (6), సమద్ (17) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన లక్నో4.1వ ఓవర్- 45 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో తెవాతియాకు క్యాచ్ ఇచ్చి పంత్ (18) ఔటయ్యాడు. మార్ష్ (11) ఔట్1.3వ ఓవర్- 14 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ ఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, మానవ్ సుతార్, జాసన్ హోల్డర్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్స్: మణిమారన్ సిద్ధార్థ్, జార్జ్ లిండే, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్
రోహిత్, విరాట్ సరసన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో సీఎస్కే సింగం సంజూ శాంసన్ చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సంజూ జూలు విదిల్చి సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సంజూతో పాటు బౌలింగ్లో జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) సత్తా చాటడంతో ఢిల్లీపై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.ఈ మ్యాచ్లో అద్భుత శతకంతో చెలరేగిన సంజూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించాడు. ఇందులో ఓ భారీ సిక్సర్ల రికార్డు సైతం ఉంది. అదేంటంటే.. ఈ మ్యాచ్లో 4 సిక్సర్లు బాదిన అనంతరం టీ20ల్లో సంజూ సిక్సర్ల సంఖ్య క్వాడ్రపుల్ సెంచరీకి (400) చేరింది.పొట్టి క్రికెట్ చరిత్రలో ఇది అత్యంత అరుదైన మైలురాయి. ఇప్పటివరకు ఈ మైలురాయిని కేవలం 29 మంది మాత్రమే (సంజూతో కలుపుకొని) తాకారు. భారత్ తరఫున సంజూకు ముందు కేవలం ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని అధిగమించారు. వీరిలో రోహిత్ శర్మ (554), విరాట్ కోహ్లి (440), సూర్యకుమార్ యాదవ్ (421) వంటి సిక్స్ హిట్టింగ్ మిషన్లు ఉన్నారు. ఇప్పుడు సంజూ బాబా వీరి సరసన చేరాడు. ఓవరాల్గా పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1056) చలామణి అవుతున్నాడు. అతనికి చాలా దూరంలో కీరన్ పోలార్డ్ (982), ఆండ్రీ రసెల్ (784) తదితర విండీస్ యోధులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 9, విరాట్ కోహ్లి 21, సూర్యకుమార్ యాదవ్ 23, సంజూ శాంసన్ 29 స్థానాల్లో ఉన్నారు.
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (115 నాటౌట్) సూపర్ సెంచరీ సాధించి సీఎస్కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్ నుంచి సీఎస్కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.ఇందులో ముఖ్యమైనది..సంజూ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది. 2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నాడు. మెక్కల్లమ్ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్లో తొలి సెంచరీలు చేశారు.ప్రతి ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు.. 2008- బ్రెండన్ మెక్కల్లమ్2009- ఏబీ డివిలియర్స్2010- యూసఫ్ పఠాన్2011- పాల్ వాల్తాటి2012- అజింక్య రహానే2013- షేన్ వాట్సన్2014- లెండిల్ సిమన్స్2015- బ్రెండన్ మెక్కల్లమ్2016- క్వింటన్ డికాక్2017- సంజూ శాంసన్2018- క్రిస్ గేల్2019- సంజూ శాంసన్2020- కేఎల్ రాహుల్2021- సంజూ శాంసన్2022- జోస్ బట్లర్2023- హ్యారీ బ్రూక్2024- విరాట్ కోహ్లి2025- ఇషాన్ కిషన్2026- సంజూ శాంసన్పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ (2), సీఎస్కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్ రాహుల్ ఈ ఘనతను సాధించాడు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు.
ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్ మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. ఓవరాల్గా సురేఖ కెరీర్లో ఇది 12వ ప్రపంచకప్ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్ నుంచే భారత్, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్లో భారత్ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్లో ఆధిక్యం 114-117 తగ్గింది. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.చదవండి: అథ్లెటిక్స్లో సంచలనం.. బోల్ట్ రికార్డు బద్దలు!
అనూహ్య మార్పు.. జూనియర్ హాకీ జట్టుకు కొత్త కోచ్
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు టిమ్...
ఆయుశ్ సంచలనం
నింగ్బో (చైనా): బరిలోకి దిగిన తొలిసారే భారత రైజింగ...
‘చనిపోయేలోపు ఫిఫా వరల్డ్కప్లో భారత జట్టును చూడాలి’
క్రికెట్తో పోలిస్తే భారత్లో ఫుట్బాల్కు ఆదరణ...
భారత మహిళల పంచ్ అదుర్స్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
లక్నోపై గుజరాత్ గెలుపు
లక్నోపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం లక...
రోహిత్, విరాట్ సరసన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న ...
ఎవరికీ సాధ్యంకాని ఘనతను సాధించిన సంజూ
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జ...
IPL 2026: నితీశ్ రాణా, రుతురాజ్పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జ...
క్రీడలు
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగ భాగ్యం (ఫొటోలు)
హైదరాబాద్ : “రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ ఛాంపియన్షిప్” (ఫొటోలు)
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
వీడియోలు
ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...
ఢిల్లీపై చెన్నై అద్భుత విజయం
ఎవడైతే నాకేంటి .. I DONT CARE
15 ఏళ్ల కుర్రాడు ..15 బంతుల్లో RCB కి చుక్కలు చూపించాడు
RCB కి చుక్కలు చూపించాడు.. ఈ బుడ్డోడి కొట్టుడికి కోహ్లి రియాక్షన్ చూస్తే
చుక్కలు చూపించిన బుడోడు.. బిత్తరపోయిన కోహ్లి!
వైభవ్ విధ్వంసం.. బుడ్డోడు బాదుడే బాదుడు
టీమిండియాలో దక్కని చోటు..!వైభవ్, ఆయుష్ మాత్రే కు షాకిచ్చిన BCCI
ఉత్కంఠ పోరులో లక్నో విజయం
మిల్లర్ పై అనుమానాలు..! IPL లో ఫిక్సింగ్ కలకలం..?
