Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC One Of Greatest Days Of My Life: Sanju Samson Emotional IND Win1
మూడు పరుగులతో సెంచరీ మిస్‌!.. సంజూ ఎమోషనల్‌

‘‘నా జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఇదొకటి. ఇదే (ఆట) నా ప్రపంచం. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచే.. దేశం కోసం ఆడాలనే కల కన్నాను. ఇలాంటి రోజు కోసమే ఎదురుచూశాను. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు పళ్లాలు ఉన్నాయి.ఒక్కోసారి నా మీద నాకే సందేహం కలిగేది. నేనసలు ఆడగలనా.. ఒకవేళ ఆడితే ఎలా ఉంటుంది. అనుకున్న విధంగా రాణించగలనా.. ఇలా ఎన్నెన్నో సందేహాలు. అయితే, ఆ దేవుడి మీద నమ్మకం మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. ఈరోజు ఆయన నన్ను దీవించాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. టీ20 ఫార్మాట్లో నాకెంతో అనుభవం ఉంది.విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గత మ్యాచ్‌లలో వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయాను. అయితే, ఈ రోజు భాగస్వామ్యాలు నిర్మించడంపైనే ఎక్కువ దృష్టి సారించాను. బంతిని చూస్తూ ఆడాను. ఈరోజు నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాను’’ అంటూ టీమిండియా స్టార్ సంజూ శాంసన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లడంలో సంజూదే కీలక పాత్ర. టీ20 ఫార్మాట్లో ప్రమాదకర జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియాను గెలిపించాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు వరుస కడుతున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలకడగా బ్యాటింగ్ చేశాడు.This team! 🥹💙🫂Next Stop: Semi-finals 🚀ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/CEMSGouFlO— Star Sports (@StarSportsIndia) March 1, 2026చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. సంజూ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. కాగా గత కొన్ని రోజులుగా సంజూ ఫామ్‌లేమితో సతమతమయ్యాడు. ఫలితంగా ఓపెనర్‌గా స్థానం కోల్పోయాడు.అయితే, గత మ్యాచ్ (జింబాబ్వే)తో మళ్లీ తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. తాజాగా వెస్టిండీస్‌పై అదరగొట్టి తన విలువ చాటుకున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌తో మెరిసి అభిమానులను ఖుషీ చేశాడు.భారత్ వర్సెస్ వెస్టిండీస్ స్కోర్లువేదిక- ఈడెన్ గార్డెన్స్‌, కోల్‌కతాటాస్‌- భారత్‌.. తొలుత బౌలింగ్‌వెస్టిండీస్ స్కోరు- 195/4(20)భారత్ స్కోరు- 199/5 (19.2)ఫలితం- ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌- సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు.. 97 పరుగులు నాటౌట్‌).

T20 WC 2026: Sanju Shines India Beat West Indies Enters Semi Final2
T20 WC 2026: విండీస్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్లో టీమిండియా

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సూపర్‌-8 దశలో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ (IND Beat WI)ను ఓడించి టైటిల్‌ దిశగా కీలక ముందడుగు వేసింది. కోల్‌కతా వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆదివారం టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.195 పరుగులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లలో కెప్టెన్‌ షాయీ హోప్‌ (33 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించగా.. రోస్టన్‌ ఛేజ్‌ (25 బంతుల్లో 40) రాణించాడు.మిగిలిన వారిలో షిమ్రన్‌ హెట్‌మైర్‌ (12 బంతుల్లో 27) ధనాధన్‌ దంచికొట్టగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (9 బంతుల్లో 14) రాణించాడు. ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ (19 బంతుల్లో 34), జేసన్‌ హోల్డర్‌ (22బంతుల్లో 37) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.నిరాశపరిచిన అభిషేక్‌, ఇషాన్‌భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమమ్రా రెండు వికెట్లు తీయగా.. హార్దిక్‌ పాండ్యా, వరుణ్‌ చక్రవర్తి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (11 బంతుల్లో 10) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (6 బంతుల్లో 10) సైతం నిరాశపరిచాడు.సంజూ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 18) చేతులెత్తేయగా.. తిల‌క్ వ‌ర్మ (15 బంతుల‌లో 27) వేగంగా ఆడే క్ర‌మంలో అవుట‌య్యాడు. ఇలాంటి ద‌శ‌లో ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ బాధ్య‌తాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు న‌డిపాడు. Man on a mission! 🚀Sanju Samson looks in sublime touch as he bring up his fifty! 🙌ICC Men’s #T20WorldCup, SUPER 8, #INDvWI | LIVE NOW ➡️ https://t.co/Y26WH6p8dS pic.twitter.com/yrCOStYeaF— Star Sports (@StarSportsIndia) March 1, 2026 అయితే విజ‌యానికి 10 బంతులలో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మైన వేళ హార్దిక్ పాండ్యా (14 బంతుల‌లో 17) రూపంలో భార‌త్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో శివం దూబే సంజూకు జ‌త‌య్యాడు. దూబే 4 బంతుల‌లో 8 ప‌రుగులు చేయ‌గా.. సంజూ ఆఖ‌రి ఓవ‌ర్లో సిక్స‌ర్‌, ఫోర్ బాది టీమిండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలోఈ మ్యాచ్‌లో సంజూ మొత్తంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 97 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో నిలిచిపోయినా చిరస్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యం అందించాడు. ఇక మ‌రో నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను ఓడించింది.

T20 World Cup:West Indies Set Target Of 196 Against India3
టీమిండియా టార్గెట్ 196

కోల్‌కతా: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ లో భారత్‌కు 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది వెస్టిండీస్, ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆది నుంచి బ్యాట్ ఝుళిపించింది. ఓపెనర్లు షాయ్ హోప్( 32: 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రోస్టన్ ఛేజ్(40: 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)లు చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత హెట్ మెయిర్ ( 27: 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు) చెలరేగి ఆడే యత్నం చేశాడు. విండీస్ స్కోరు బోర్డు వేగం పుంజుకునే క్రమంలో బూమ్రా బౌలింగ్ లో హెట్ మెయిర్ అవుటయ్యాడు. బూమ్రా బౌలింగ్ లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు హెట్ మెయిర్. అప్పటికి విండీస్ స్కోరు 11.3 ఓవర్లలో 102 పరుగులుగా ఉంది. అయితే హెట్ మెయిర్ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత విండీస్ స్కోరు బోర్డులో వేగం తగ్గింది. అయితే రావెన్ పావెల్(34 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాసన్ హోల్డర్(37 నాటౌట్‌; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. ఈ జోడి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. వీరిద్దరూ 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.భారత బౌలర్లలో బుమ్రా మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బుమ్రా నాలుగు ఓవర్లలో 36 పరుగులే ఇవ్వగా, హార్దిక్‌ పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో 40 పరుగులు, అర్షదీప్‌ 43 పరుగులు, వరుణ్‌ చక్రవర్తి 40 పరుగులు ఇచ్చారు. అక్షర్‌ పటేల్‌ నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.పావెల్‌ అరుదైన ఘనతఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టడం ద్వారా రోవ్‌మాన్‌ పావెల్‌ అరుదైన ఘనతను సాధించాడు. విండీస్‌ తరుఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. పావెల్‌ టీ20ల్లో 150 సిక్సర్లు మార్కును చేరుకోవడంతో విండిస్‌ తరుఫున ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో నికోలస్‌ పూరన్‌ 149 సిక్సర్లు కొట్టిన జాబితాలో ఉండగా, వెవిన్‌ లూయిస్‌ 136 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక క్రిస్‌ గేల్‌ 124 సిక్సర్లతో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.పొలార్డ్‌, హెట్‌మెయిర్‌లు 99 సిక్సర్లతో ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

T20 WC 2026 IND VS WI: team india won the toss and choose to bowl4
T20 WC 2026: విండీస్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌.. టీమిండియా ఇదే..!

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 1) డూ ఆర్‌ డై మ్యాచ్‌ జరుగుతుంది. కోల్‌కతా వేదికగా జరుగనున్న ఈ సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-1 నుంచి సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.అత్యంత ​కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ ఓ మార్పు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ స్థానంలో అకీల్‌ హొసేన్‌ తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..భారత్‌: సంజూ శాంసన్ (WK), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్వెస్టిండీస్‌: షాయ్ హోప్ (c & wk), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్‌, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్

T20 WC 2026: South africa beat zimbabwe in formal super match5
T20 WC 2026: నామమాత్రపు మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాదే గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2026లో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన ఈ జట్టు.. సూపర్-8 దశను కూడా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్‌కు చేరిన సౌతాఫ్రికా.. ఇవాళ (మార్చి 1) జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీకి రెడీ అయ్యింది.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా ఆదుకున్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మరో ప్లేయర్‌ క్లైవ్‌ మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా (4-0-29-3) బాగా ఇబ్బంది పెట్టాడు. అయితే మధ్య వరుస బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0) విఫలమైనా.. రికెల్టన్‌ (31), బ్రెవిస్‌ (42), మిల్లర్‌ (22), స్టబ్స్‌ (21 నాటౌట్‌), లిండే (30 నాటౌట్‌) రాణించి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. జింబాబ్వే బౌలర్లలో రజాతో పాటు ముజరబానీ (3.5-0-32-1), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3-0-22-1) వికెట్లు తీశారు. ఈ ఓటమితో ప్రపంచకప్‌లో జింబాబ్వే పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో జింబాబ్వే గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

T20 WC 2026: Zimbabwe set 154 runs target to south africa6
T20 WC 2026: సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. సికందర్‌ రజా విధ్వంసం

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 1) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. గ్రూప్‌-1 నుంచి సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఢిల్లీలోకి అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ అప్రధానమైన మ్యాచ్‌లో జింబాబ్వే టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.87 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన జింబాబ్వేను సికందర్‌ రజా, క్లైవ్‌ మదండే (26 నాటౌట్‌) ఆదుకున్నారు. ముఖ్యంగా సికందర్‌ రజా ఆకాశమే హద్దుగా చెలరేగి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. రజా 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. మదండే 20 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరు మినహా జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. మరుమణి 7, బ్రియాన్‌ బెన్నెట్‌ 15, డియాన్‌ మైర్స్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 5, టోనీ మున్యోంగా 2, బ్రాడ్‌ ఈవాన్స్‌ 8 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మఫాకా, కార్బిన్‌ బాష్‌ చెరో 2.. లిండే, ఎంగిడి, నోర్జే తలో వికెట్‌ తీశారు.అనంతరం​ 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాను బ్యాట్‌తో సత్తా చాటిన సికందర్‌ రజా ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు మార్క్రమ్‌ (4), డికాక్‌ (0)ను ఔట్‌ చేశాడు. 5 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్‌ 30-2గా ఉంది. రికెల్టన్‌ (19), బ్రెవిస్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.

Australia women beat india by 185 runs in 3rd ODI7
విశ్వవిజేత భారత్‌కు భారీ షాక్‌

మహిళల వన్డేల్లో విశ్వవిజేత అయిన భారత్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జగజ్జేతగా అవతరించిన తర్వాతి సిరీస్‌లోనే మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది.హోబర్ట్‌ వేదికగా ఇవాళ (మార్చి 1) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 185 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు రెండు వన్డేలను కూడా ఆస్ట్రేలియానే గెలిచింది. అయితే దీనికి ముందు ఆసీస్‌లోనే జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ అలైస్సా హీలీ (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో భారత్‌ చేతులెత్తేసింది. అలానా కింగ్‌ (10-1-33-4), జార్జియా వేర్హమ్‌ (1.1-0-3-2) ధాటికి 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. నికోలా కేరీ, సదర్‌ల్యాండ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో వికెట్‌ తీశారు. భారత ప్లేయర్లలో స్మృతి మంధన, కశ్వీ గౌతమ్‌ డకౌట్‌ కాగా.. ప్రతీకా రావల్‌ 27, జెమీమా 42, కెప్టెన్‌ హర్మన్‌ 25, హర్లీన్‌ డియోల్‌ 14, దీప్తి శర్మ 29, రిచా ఘోష్‌ 18, శ్రీ చరణి 11 పరుగులు చేశారు. ఓటమి ఖరారయ్యాక స్నేహ్‌ రాణా (44) ప్రతిఘటించింది. కాగా, ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌ ప్రారంభం కానుంది. పెర్త్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన ముగుస్తుంది.

PV Sindhu, Stranded In Dubai, Shares a Video As America Iran Conflict Escalates8
ఇరాన్‌ దాడులు.. దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్‌లో చిక్కుకుపోయింది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ దాడులు కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె ప్రయాణానికి అంతరాయం కలిగింది. సింధు బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ కోసం దుబాయ్‌ మీదుగా లండన్‌కు బయల్దేరింది.దుబాయ్ ట్రాన్సిట్‌లో ఉన్న సమయంలో గల్ఫ్ ఎయిర్‌స్పేస్‌లో మిసైల్ దాడుల కారణంగా అన్ని విమాన సర్వీసులు నిలిపి వేయబడ్డాయి. దీంతో సింధు విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులపై సింధు తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది. తాము ఉన్న ప్రాంతానికి అతి సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించింది. ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశాము. ఇక్కడి పరిస్థితులు క్రమేపీ భయానకంగా మారుతున్నాయి. ‍ప్రస్తుతానికి తామంతా క్షేమంగా ఉన్నాము. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తమను సురక్షిత ప్రాంతానికి తరలించారు అని ఎక్స్‌లో పేర్కొంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ.. ప్రయాణికులు అనిశ్చితిలో వేచి ఉన్న దృశ్యాలను చూపించింది.కాగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అల్‌ ఖమేనీ మృతి చెందగా, పలువురు భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు.ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ మరియు మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై మిసైల్ మరియు డ్రోన్ దాడులు చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు పామ్ జుమైరా ప్రాంతాలు ఇరాన్ మిసైల్ దాడులకు గురయ్యాయి. బుర్జ్ ఖలీఫా సమీపంలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈ దాడుల కారణంగా గల్ఫ్ ఎయిర్‌స్పేస్ మూసివేయబడింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Pakistan Become The 1st Team To Suffer America-Iran War, England Cancelled Series9
అమెరికా-ఇరాన్‌ యుద్దం.. క్రికెట్‌ సిరీస్‌ రద్దు

అమెరికా-ఇరాన్ యుద్ద ప్రభావం క్రికెట్ ప్రపంచంపై కూడా పడింది. పాకిస్తాన్‌ షాహీన్స్‌తో (ఏ జట్టు) జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ లయన్స్‌ (ఏ జట్టు) రద్దు చేసుకుంది. ఈ సిరీస్‌ యూఏఈలోని అబుదాబీ వేదికగా జరుగుతుంది. అబుదాబీ నగరం ప్రస్తుతం ఇరాన్‌ దాడులతో అట్టుడికిపోతుంది.అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్‌ అమెరికా ఎయిర్‌బేస్‌ల్లో ఒకటైన అబుదాబీని టార్గెట్‌ చేసింది. శక్తివంతమైన బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తుంది. అక్కడే ఇంగ్లండ్‌ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ చిక్కుకుపోయారు. భారతకాలం ప్రకారం ఇవాళ (మార్చి 1) ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది.అయితే భద్రతా కారణాల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్‌ మొత్తాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.“జట్టు భద్రత మా ప్రాధాన్యత. పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం” ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లండ్‌ కోచింగ్‌ బృందంలో ఆ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ సహా విధ్వంసకర వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, ఇంగ్లండ్‌ లయన్స్‌-పాకిస్తాన్‌ షాహీన్స్‌ మధ్య 3 టీ20లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అబుదాబీ వేదికగా షెడ్యూలైంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో తొలుత టీ20లు జరగగా.. ఇంగ్లండ్‌ 3-0 తేడాతో ఆ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 27న జరిగిన తొలి వన్డేలోనూ ఇంగ్లండే విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లోని 3, 4, 5 వన్డేలు మార్చి 4, 6, 9 తేదీల్లో జరగాల్సి ఉంది.

IND VS AUS 3rd ODI: Alyssa healy, mooney shines with blasting 100s, australia scored 409 for 710
హీలీ, మూనీ విధ్వంసకర శతకాలు.. ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్‌

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అతి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా కెప్టెన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 409 పరుగులు చేసింది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌​ అలైస్సా హీలీ (మిచెల్‌ స్టార్క్‌ భార్య) (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. రేణుకా, రాణా మినహా మిగతా ముగ్గురు భారత బౌలర్లను ఆసీస్‌ ప్లేయర్లు చెడుగుడు ఆడుకున్నారు. కశ్వీ గౌతమ్‌ 10 ఓవర్లలో 83, దీప్తి శర్మ 10 ఓవర్లలో 90 పరుగులు ఇవ్వగా.. శ్రీచరణి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకుంది. రేణుకా, రాణా తలో 10 ఓవర్లలో చెరో మెయిడిన్‌ వేసి 64, 66 పరుగులు ఇచ్చారు.కాగా, ఆసీస్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ఇదివరకే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్‌ తొలి రెండు వన్డేల్లో గెలవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement