Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

From Pakistan To Australia Usman Khawaja Retirement Speech About His Journey1
పాకిస్తాన్‌ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్‌ ఖవాజా

ఊహాగానాలే నిజమయ్యాయి.. ఆస్ట్రేలియా వెటరన్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా తన రిటైర్మెంట్‌ నిర్ణయా​న్ని ప్రకటించాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన ఐదో టెస్టు.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్‌ అని వెల్లడించాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉస్మాన్‌ ఖవాజా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఆస్ట్రేలియా తరఫున అనేక మ్యాచ్‌లు ఆడాను. ఇది నా అదృష్టం. పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లింను నేను.నాలాంటి వాళ్లు ఆసీస్‌ తరఫున ఎప్పటికీ ఆడలేనని చాలా మంది హేళన చేశారు. వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూడండి నేను ఎక్కడ ఉన్నానో!.. మీరు కూడా నాలాగే అనుకున్నది సాధించగలరు’’ అని ఉస్మాన్‌ ఖవాజా పేర్కొన్నాడు.

Indian Sports Pro Wrestling League 2026 auction on January 32
అమన్, అంతిమ్‌పై నజర్‌ 

న్యూఢిల్లీ: భారత స్టార్‌ రెజ్లర్లు అమన్‌ సెహ్రావత్, అంతిమ్‌ పంఘల్‌... ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌) వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అమన్‌ పురుషుల విభాగంలో రూ. 18 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానుండగా... మహిళల విభాగంలో అంతిమ్‌ రూ. 10 లక్షలు ‘బేస్‌ ప్రైస్‌’గా నిర్ణయించుకుంది. ఈ నెల 15 నుంచి ఈ లీగ్‌ ప్రారంభం కానుండగా... శనివారం వేలం నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు హరియాణ థండర్స్, టైగర్స్‌ ఆఫ్‌ ముంబై దంగల్స్, పంజాబ్‌ రాయల్స్, మహారాష్ట్ర కేసరి, ఢిల్లీ దంగల్‌ వారియర్స్, యూపీ డామినేటర్స్‌ పాల్గొంటున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, 21 ఏళ్ల అమన్‌ సెహ్రావత్‌ అత్యధిక ప్రాథమిక ధరతో వేలంలో అందుబాటులో ఉండగా... కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేత దీపక్‌ పూనియా, నవీన్‌ రూ. 10 లక్షల ‘బేస్‌ ప్రైస్‌’తో వేలంలోకి రానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సుజీత్‌ కల్‌కల్‌ తన ప్రాథమిక ధరను రూ. 7 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. విదేశీ రెజ్లర్ల కేటగిరీల్లో రష్యాకు చెందిన ప్రపంచ మాజీ చాంపియన్‌ మగోమ్‌డోవ్‌తో పాటు అర్మాన్‌ (అర్మెనియా), ఇస్మాయిల్‌ (హంగేరీ), అర్సెన్‌ (అర్మేనియా), ఉస్మానోవ్‌ అహ్మద్‌ (రష్యా) రూ. 10 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి రానున్నారు. మహిళల విభాగంలో భారత స్టార్‌ అంతిమ్‌ పంఘల్‌ రూ. 10 లక్షల ‘బేస్‌ ప్రైస్‌’తో వేలంలోకి రానుంది.

Pat Cummins, Josh Hazlewood and Tim David return to Australia squad for ICC3
మిచెల్‌ మార్ష్ సారథ్యంలో.. 

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌ కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగే ఆసీస్‌ బృందానికి మిచెల్‌ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ఉపఖండంలో వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో... జట్టు ఎంపికలో స్పిన్నర్లకు పెద్దపీట వేశారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్‌ కమిన్స్, జోష్‌ హాజల్‌వుడ్, టిమ్‌ డేవిడ్‌లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్‌ సమయానికి వీరు ఫిట్‌నెస్‌ సాధిస్తారని చీఫ్‌ సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే ఆడని స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ టి20లకు వీడ్కోలు పలకడంతో... కూపర్‌ కొనొల్లీకి జట్టులో చోటు దక్కింది. ఆసీస్‌ ఆడిన గత 12 టి20 మ్యాచ్‌ల్లో ఆడని కొనొల్లీ ఎంపిక ఒక్కటే ఆశ్యర్చ పరిచే నిర్ణయం! గ్రీన్, స్టొయినిస్, టిమ్‌ డేవిడ్, మ్యాక్స్‌వెల్‌ రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఈ జట్టులో మార్పు చేర్పులకు ఈ నెల 31 వరకు ఐసీసీ అవకాశం కలి్పంచింది. ఐర్లాండ్, ఒమాన్, శ్రీలంక, జింబాబ్వేలతో కలిసి ఆ్రస్టేలియా గ్రూప్‌ ‘బి’లో పోటీ పడనుంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో ఆసీస్‌ తొలి మ్యాచ్‌ఆడనుంది. ఆ తర్వాత 13న జింబాబ్వేతో, 16న శ్రీలంకతో, 20న ఒమాన్‌తో తలపడుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది టి20 ప్రపంచ కప్‌లు జరగగా... అందులో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌ రెండేసి సార్లు ట్రోఫీ దక్కించుకున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆ్రస్టేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. వరల్డ్‌కప్‌ ప్రారంభానికి ముందు పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్‌ మార్ష్ (కెపె్టన్‌), హెడ్, ఇన్‌గ్లిస్, జేవియర్, కూపర్‌ కొనొల్లీ, కమిన్స్, టిమ్‌ డేవిడ్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, నాథన్‌ ఎలీస్, హాజల్‌వుడ్, కునేమన్, షార్ట్, జంపా.

Vennam Jyothi Surekha leads strong show by Indian compound archers4
టాప్స్‌లో జ్యోతి సురేఖ

న్యూఢిల్లీ: టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం పథకం (టాప్స్‌)లో కొత్తగా కాంపౌండ్‌ ఆర్చర్లను చేర్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత్‌కు పతకాలు తెచి్చపెడుతున్న తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖకు ఇది కొత్త ఉత్సాహం ఇవ్వనుంది. భారత్‌ నుంచి ఒలింపిక్‌ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ‘టాప్స్‌’ ద్వారా చేయూత ఇస్తోంది. అయితే ఇన్నాళ్లు ఒలింపిక్‌ క్రీడాంశాలకే ‘టాప్స్‌’ను అమలు చేస్తూ వచ్చారు. దీంతో ఒలింపిక్స్‌లో లేని కాంపౌండ్‌ కేటగిరీకి ‘టాప్స్‌’ను ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రపంచ ఆర్చరీ పోటీల్లో దేశానికి, రాష్ట్రానికి పతక ప్రతిష్టలు తెస్తున్న జ్యోతి సురేఖ, పర్‌నీత్‌ కౌర్, అభిõÙక్‌ వర్మలాంటి వారు దూరమయ్యారు. తాజాగా క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఒలింపిక్‌ ఈవెంట్‌తో సంబంధం లేకపోయినా 8 మంది కాంపౌండ్‌ ఆర్చర్లకు లబ్ధి చేకూరనుంది. మరో తెలుగుతేజం రికర్వ్‌ ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర ఇప్పటికే ఈ పథకంలో ఉన్నాడు. డోపింగ్‌లో పట్టుబడిన మహిళా రెజ్లర్‌ రితిక హుడాను ‘టాప్స్‌’ నుంచి తొలగించారు. 2024–పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం 179 మందికి ‘టాప్స్‌’ను అమలు చేశారు. ప్రదర్శన, వైఫల్యం, డోపింగ్‌ కారణాలతో గతేడాది నాటికి 179 జాబితా కాస్తా 94 మందికి పడిపోయింది. ఈ ఏడాది మొదలవుతుండగానే ‘టాప్స్‌’ కోర్‌ గ్రూప్‌ జాబితాను 118 మందికి పెంచారు. ఇందులో 57 మంది అథ్లెట్లు కాగా, మరో 61 మంది పారాథ్లెట్లు ఉన్నారు. క్రీడాశాఖ ప్రత్యేక డెవలప్‌మెంట్‌ గ్రూప్‌ జాబితాలో అథ్లెట్లు అనిమేశ్‌ కుజుర్‌ (200 మీ. పరుగు), తేజస్విన్‌ శంకర్‌ (డెకథ్లాన్‌), 4–400 మీ. రిలే జట్టు సభ్యులు విశాల్, జయ్‌ కుమార్, రాజేశ్‌ రమేశ్, అమోజ్‌ జాకబ్, మొహమ్మద్‌ అజ్మల్, సంతోష్‌ కుమార్‌లు ఉన్నారు. ఈ గ్రూప్‌లోనే టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్లు మానుశ్‌ షా, మానవ్‌ ఠక్కర్, దియా చిటాలేలకు చోటుదక్కింది. ‘టాగ్‌’లో కొత్తగా గోల్ఫ్, సర్ఫింగ్‌ టార్గెట్‌ ఆసియా క్రీడల గ్రూప్‌ (టీఏజీజీ–టాగ్‌)లో కొత్తగా లబ్దిపొందే క్రీడాంశాలను పెంచారు. ‘టాప్స్‌’లో లేని గోల్ఫ్, సర్ఫింగ్, టెన్నిస్‌ క్రీడాకారులకు ‘టాగ్‌’ కింద చేయూత అందిస్తారు. ఈ ఏడాది జపాన్‌లో ఏషియాడ్‌ జరుగనుంది. ఈ ఆసియా క్రీడల్లో పతకాలు తేవాలనే ఉద్దేశంతో గోల్ఫర్లు శుభాంకర్‌ శర్మ, దీక్ష డాగర్, టెన్నిస్‌ ప్లేయర్లు సుమిత్‌ నగాల్, యూకీ బాంబ్రీ, మాయ రాజేశ్వరన్‌ సహా 48 మందిని ‘టాగ్‌’ పథకం కింద ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటికే ఈక్వె్రస్టియన్స్‌ (గుర్రపుస్వారీ) ఫౌద్‌ మీర్జా, అనుశ్‌ అగర్‌వాలా, ఫెన్సర్‌ భవానీ దేవి, జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ తదితరులు ఉన్నారు. ‘టాప్స్‌’, ‘టాగ్‌’ పథకాల కింద కోచింగ్, ఇతరాత్ర ఖర్చుల కింద నెలకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అవసరమైతే మరో రూ. 25 వేలు పాకెట్‌ అలవెన్స్‌గా అందజేస్తారు. అలాగే విదేశీ శిక్షణలో ఉన్నన్ని రోజులు రోజుకు రూ. 2250 (25 డాలర్లు) అదనంగా ఇస్తారు. అయితే విదేశీ శిక్షణకు ముందుగా ఆమోదం పొందాల్సివుంటుంది.

5 Indian cricketers who might announce retirement in 20265
2026లో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న ఐదుగురు భారత క్రికెటర్లు

2026లో టీమిండియాలోకి చాలామంది యువకులు వచ్చే అవకాశం ఉంది. వయసు మీద పడటం, అవకాశాలు రాకపోవడం వంటి కారణాల చేత పలువురు వెటరన్ స్టార్లు ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి స్థానాలు భర్తీ చేసే క్రమంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌కు దగ్గర పడిన ఐదుగురు టీమిండియా వెటరన్‌ స్టార్లపై ఓ లుక్కేద్దాం.ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు మహ్మద్‌ షమీ. కారణం ఏదైనా షమీకి ఇటీవలికాలంలో అవకాశాలు రావడం లేదు. అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు చిన్నచూపు చూస్తున్నారు. ప్రస్తుతం షమీ వయసు 35 ఏళ్లు. ఏ రకంగా చూసినా షమీ ఎన్నో రోజుల ఆటలో కొనసాగే అవకాశం లేదు. అవకాశాలు వచ్చినా ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి లేదు. సాధారణంగానే ఫాస్ట్‌ బౌలర్లకు కెరీర్‌ స్పాన్‌ తక్కువ. 35 ఏళ్ల వచ్చాయంటే రిటైర్మెంట్‌ స్టేజీలో ఉన్నట్లే. ఈ లెక్కన షమీ ఈ ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది.ఈ ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉన్న రెండో వెటరన్‌ స్టార్‌ అజింక్య రహానే. రహానే అధికారికంగా ఆటకు వీడ్కోలు పలకకపోయినా, వయసు మీద పడటం చేత ఇప్పటికే అన్‌ అఫీషియల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం​ రహానే వయసు 37 ఏళ్లు. అతను మొదటి నుంచి టెస్ట్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గానే మిగిలిపోయాడు. ప్రస్తుత భారత టెస్ట్‌ జట్టు పరిస్థితి చూస్తే రహానేకు అవకాశం దక్కడం​ అసంభవం. రహానే ఆడే మిడిలార్డర్‌లో బెర్త్‌ల కోసం పదుల సంఖ్యలో పోటీ ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది ముందుగా రిటైర్మెంట్‌ ప్రకటించే టీమిండియా వెటరన్‌ రహానే కావచ్చు.ఈ ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉన్న మరో భారత వెటరన్‌ స్టార్‌ యుజ్వేంద్ర చహల్. చహల్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత దాదాపుగా కనుమరుగైపోయాడు. యువ స్పిన్నర్లు బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం చహల్‌కు మైనస్‌ అయిపోయింది. చహల్‌ బౌలింగ్‌లో అద్భుతాలు చేయగలిగినా బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోతాడు. ఇదే అతని కెరీర్‌ను ఎండ్‌ కార్డ్‌ పడేలా చేస్తుంది. మరోవైపు వయసు పైబడటం, యువకులతో పోటీ కూడా చహల్‌కు మైనస్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అతని వయసు 35. వయసును పక్కన పెట్టినా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి అడ్డంకులను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదు. కాబట్టి ఈ ఏడాదే చహల్‌ కెరీర్‌కు కూడా ఎండ్‌ కార్డ్‌ పడవచ్చు.ఈ ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉన్న నాలుగో క్రికెటర్‌ రవీంద్ర జడేజా. జడేజా ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికి జట్టులో అతని స్థానానికి ఢోకా లేనప్పటికీ.. వయసు పైబడటం దృష్ట్యా అతనే స్వచ్చందంగా ఆటకు వీడ్కోలు పలకవచ్చు. ఇప్పటికే అతని వారసుడిగా అక్షర్‌ పటేల్‌ ప్రమోట్‌ అయ్యాడు. జడ్డూ ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించకపోయినా వన్డేల నుంచైనా తప్పుకునే అవకాశం ఉంది.ఈ ఏడాది షాకింగ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్న భారత స్టార్‌ క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కావచ్చు. స్కై ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్‌గా అద్భుతాలు చేస్తున్నా, వ్యక్తిగతంగా విఫలమవుతుండటంతో ఇప్పటికే అతని ఉనికి ప్రమాదంలో పడింది. స్కై గత 19 ఇన్నింగ్స్‌లో 13.62 సగటున కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. విపరీతమైన పోటీ ఉన్న భారత టీ20 జట్టులో స్కై ఎక్కువ రోజులు కొనసాగడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఫిబ్రవరిలో జరిగే ప్రపంచకప్‌ తర్వాత స్కై రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది.

Jammu And Kashmir Cricket Association Breaks Silence On Star Playing With Palestine Flag On Helmet6
హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన జమ్మూ కశ్మీర్‌ క్రికెటర్‌

జమ్ము అండ్‌ కశ్మీర్‌లో ఓ స్థానిక వ్యక్తి హెల్మెట్‌పై పాలస్తీనా జెండా ధరించి క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం వివాదాస్పదంగా మారింది. జమ్ము కశ్మీర్‌ ఛాంపియన్స్ లీగ్ పేరిట జరుగుతున్న క్రికెట్‌ టోర్నీలో ఫుర్కాన్‌ భట్‌ అనే ప్లేయర్‌ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫుర్కాన్‌తో పాటు టోర్నీ నిర్వాహకుడు జాహిద్ భట్‌కు సమన్లు జారీ చేశారు.ఈ వివాదంపై జమ్మూ అండ్‌ కశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (JKCA) స్పందించింది. జమ్ము కశ్మీర్‌ ఛాంపియన్స్ లీగ్ JKCA గుర్తింపు పొందింది కాదని స్పష్టం చేసింది. ఫుర్కాన్‌ అనే ఆటగాడు JKCA లేదా దాని అనుబంధ సంస్థల్లో ఎక్కడా నమోదు కాలేదని తేల్చి చెప్పింది. కాగా, భారత పౌరసత్వం కలిగిన ఏ వ్యక్తి అయినా పరాయి దేశ జెండాలను వాడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.ఇదే నేరం ఏదైనా రాష్ట్రానికి చెందిన క్రికెట్‌ అసోసియేషన్‌కు సంబంధించిన వ్యక్తి చేస్తే మరింత తీవ్రమైందిగా పరిగణించడబడుతుంది. ఫుర్కాన్‌ అనే వ్యక్తి స్థానిక క్రికెట్‌ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కావడంతో వివాదం పెద్దది కాలేదు.ఇదిలా ఉంటే, జమ్ము అండ్‌ కశ్మీర్‌లో ఇటీవలి​కాలంలో అనధికారిక క్రికెట్‌ లీగ్‌లు ఎక్కువయ్యాయి. ఇదే ఏడాది ఇక్కడ జరిగిన ఇండియన్ హెవెన్ ప్రీమియర్ లీగ్ (IHPL) వివాదాస్పదంగా మారింది. ఈ టోర్నీలో చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ లీగ్‌ నిర్వాహకులు ఆటగాళ్లు, హోటల్ యజమానులను మోసం చేసి మధ్యలోనే పరారయ్యారు. ఈ లీగ్‌లో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ లాంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొన్నారు.

INDIA Vs NEW ZEALAND 1ST ODI MATCH TICKETS SOLD OUT IN JUST 8 MINUTES7
8 నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డే టికెట్లు

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జనవరి 11న వడోదరలోని కొటంబి స్టేడయంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్‌ ఔటయ్యాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది.తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్‌ వల్లే, ఇలా తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రో-కో ​క్రేజ్‌ అంటే అంటూ సోషల్‌మీడియాలో బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. రాజ్‌కోట్‌, ఇండోర్‌లో జరిగే మిగతా రెండు వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ హడావుడి చేస్తున్నారు. కాగా, రోహిత్‌-విరాట్‌ టెస్ట్‌, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో రో-కో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌ సిరీస్‌ తొలి వన్డేకు హైప్‌ మరింత పెరిగింది. కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబాడ్డారు. సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్‌ వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ చేసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్‌ను విరాట్‌ వడోదర వన్డేలోనూ కొనసాగిస్తాడని ఆశాభావం​ వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం​ న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్‌, ఇండోర్‌ వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది.

Babar Azam registers his second fifty of the BBL, marking the milestone on New Year’s Day against the Melbourne Renegades8
ఎట్టకేలకు గాడిలో పడిన బాబర్‌ ఆజమ్‌

గత కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్‌ బాష్‌ లీగ్‌ ఆడుతూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్‌ సెంచరీలు చేశాడు.వాస్తవానికి బాబర్‌ నుంచి ఇంకా చాలా రావాల్సి ఉన్నా.. ఇటీవలికాలంలో అతని పరిస్థితిని బట్టి చూస్తే ఇది కాస్త బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతగాడు రెండేళ్లకు పైగా అంతర్జాతీయ కెరీర్‌లో (మూడు ఫార్మాట్లు) శతకం లేకుండా గడిపాడు. అప్పుడెప్పుడో 2023లో పసికూన నేపాల్‌పై సెంచరీ చేసిన బాబర్‌.. ఇటీవలే (ఈ ఏడాది నవంబర్‌) శ్రీలంకపై మళ్లీ సెంచరీ చేశాడు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాబర్‌ నుంచి అర్ద సెంచరీ కూడా గొప్పగా అనిపిస్తుంది. తాజాగా బిగ్‌ బాష్‌ లీగ్‌లో బాబర్‌ చేసిన అర్ద సెంచరీలకు ఇంత ప్రాధాన్యత లభించడానికి మరో కారణం ఉంది.టీ20 ఫార్మాట్‌లో ఇటీవలికాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎంతలా అంటే.. ప్రపంచకప్‌ జట్టులో అతని స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారింది. పాక్‌ సెలెక్టర్లు బాబర్‌ ప్రత్యామ్నాయాన్ని వెతికే పనిలో కూడా పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అర్ద సెంచరీలు అతని ప్రపంచకప్‌ బెర్త్‌ ఆశలను సజీవంగా ఉంచాయి.ఇదే ఫామ్‌ను బాబర్‌ మరో ఐదారు మ్యాచ్‌ల్లో కొనసాగిస్తే ప్రపంచకప్‌ బెర్త్‌కు ఢోకా ఉండదు. ఇక్కడ బాబర్‌కు మరో సమస్య కూడా ఉంది. తాజాగా అతను రెండు అర్ద సెంచరీలు చేసినా, అవి పొట్టి ఫార్మాట్‌కు కావాల్సిన వేగంతో చేసినవి కావు. సిడ్నీ థండర్‌పై 42 బంతులు ఆడి 58 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌పై 46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో అజేయమైన 58 పరుగులు చేశాడు. రెనెగేడ్స్‌పై బాధ్యతాయుత అర్ద సెంచరీతో మ్యాచ్‌ను గెలిపిం​చినా, బాబర్‌లో మునుపటి వేగం లేదని స్పష్టంగా తెలిసింది.కాగా, బాబర్‌ హాఫ్‌ సెంచరీ, సీన్‌ అబాట్‌ (4-0-16-3) అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన కారణంగా రెనెగేడ్స్‌పై సిడ్నీ సిక్సర్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రెనెగేడ్స్‌ నిర్ణీత 20 ఓ‍వర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరగులు చేసింది. జోష్‌ బ్రౌన్‌ (43), మెక్‌గుర్క్‌ (38), హసన్‌ ఖాన్‌ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. సిక్సర్స్‌ బౌలర్లలో అబాట్‌తో పాటు జాక్‌ ఎడ్వర్డ్స్‌, డ్వార్షుయిస్‌, హేడెన్‌ కెర్‌ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం ఛేదనలో సిక్సర్స్‌ సైతం ఆదిలోన తడబడినప్పటికీ.. బాబర్‌-జోయెల్‌ డేవిడ్‌ (34 నాటౌట్‌) జోడీ సిక్సర్స్‌ను గెలిపించింది. 19.1 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

USA T20 World Cup 2026 squad leaked, Monank Patel to Lead, ex SL player included9
యూఎస్‌ఏ ప్రపంచకప్‌ జట్టులో వివాదాస్పద ఎంపికలు..?

యూఎస్‌ఏ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులో వివాదాస్పద ఎంపికలు జరిగినట్లు తెలుస్తుంది. సెలక్షన్ కమిటీ పాత్ర లేకుండా కోచ్ పుబుడు దసనాయకే, కెప్టెన్ మోనాంక్ పటేల్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం జట్టును అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పలువురు ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ప్రమేయం లేకుండానే ఎంపిక చేశారని ఓ అమెరికా సీనియర్‌ జర్నలిస్ట్‌ తెలిపారు.స్థానికంగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్యకు నేరుగా ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించారని తెలుస్తుంది. పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు ఎహ్సాన్ అదిల్‌ను కూడా అర్హత ప్రామాణాలు చూడకుండా జట్టులోకి తీసుకున్నారని సమాచారం.యూఎస్‌ఏ హెడ్‌ కోచ్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్‌ పుబుడు దసనాయకే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలే తీసుకుంటున్నారని స్థానిక మీడియా అంటుంది. జట్టు ఎంపికలో కోచ్‌ పాత్రను పరిమితం చేయాలని జర్నలిస్ట్‌లు యూఎస్‌ఏ క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నారు.ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం.. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 టీ20 ప్రపంచకప్‌ (ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8) కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల యూఎస్‌ఏ జట్టు ఇలా ఉంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మోనాంక్ పటేల్ వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా జెస్సీ సింగ్‌ ఎంపికయ్యాడు.మాజీ పాకిస్తాన్ ఆటగాడు ఎహ్సాన్ అదిల్, మాజీ శ్రీలంక బ్యాటర్‌ షేహాన్ జయసూర్య, లెగ్ స్పిన్నర్ మహ్మద్ మొహ్సిన్, మహారాష్ట్రలో (భారత్‌) జన్మించిన MLC స్టార్ శుభమ్ రంజనేమ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ మరియు అసిస్టెంట్ కోచ్‌ను నియమించినట్లు తెలుస్తుంది.కోచ్‌ పుబుడు దసనాయకే ప్రోద్బలంతో మాజీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దమ్మిక ప్రసాద్‌కు ఆ పదవి కట్టబెట్టారని సమాచారం.టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం ఎంపిక చేసిన యూఎస్‌ఏ జట్టు (లీకుల ప్రకారం)..మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్ (వైస్ కెప్టెన్), ఎహ్సాన్ అదిల్, ఆండ్రీస్ గౌస్, షయాన్ జహంగీర్, షేహాన్ జయసూర్య, ఆరోన్ జోన్స్, నోస్తుష్ కెన్జిగే, అలీ ఖాన్, సంజయ్ కృష్ణమూర్తి, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, సాయి ముక్కమల్లా, సౌరభ్ నేత్రవల్కర్, శుభమ్ రంజానే, హర్మీత్ సింగ్, రుషిల్ ఉగర్కర్, షాడ్లీ వాన్ స్కాల్క్విక్. కాగా, 2026 టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ గ్రూప్‌-ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో యూఎస్‌ఏతో పాటు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో యూఎస్‌ఏ తమ తొలి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 7) భారత్‌ను ఢీకొంటుంది. అనంతం ఫిబ్రవరి 10న పాకిస్తాన్‌, 13న నెదర్లాండ్స్‌, 15న నమీబియాతో పోటీపడనుంది.

Gill, Jadeja, KL Rahul Return Date Confirmed Set To Play In This Tourney10
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..

టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్‌ తరఫున ఓపెనర్‌గా గిల్‌ బరిలోకి దిగనున్నాడు.జైపూర్‌ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్‌ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్‌లో గిల్‌ భాగం కానున్నట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లో గిల్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అనూహ్య రీతిలో వేటుతొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్‌ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్‌-2026 జట్టులోనూ గిల్‌కు చోటివ్వలేదు. వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్‌ సత్తా చాటి తిరిగి ఫామ్‌లోకి రావాలని గిల్‌ భావిస్తున్నాడు.ఇప్పటికే ఆడేశారుఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్టార్లు రిషభ్‌ పంత్‌ ఢిల్లీ సారథిగా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా ఉండగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మహారాష్ట్ర, సర్ఫరాజ్‌ ఖాన్‌ ముంబై, దేవదత్‌ పడిక్కల్‌ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్‌ శర్మ సైతం పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాడు.టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..ఈ జాబితాలో ఇప్పుడు గిల్‌తో పాటు వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్‌, గుజరాత్‌ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం కర్ణాటక తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.త్రిపుర, రాజస్తాన్‌లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్‌లలో కర్ణాటక తరఫున కేఎల్‌ రాహుల్‌ ఆడనున్నాడు. ఇక గిల్‌తో పాటు.. జడేజా, కేఎల్‌ రాహుల్‌ విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్‌లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్‌తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్‌ చేయరు?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement