Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India beat New Zealand by 8 wickets in 3rd T20I to clinch series1
అభిషేక్ అద‌ర‌హో.. మూడో టీ20లో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ

గౌహతి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలూండ‌గానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లోనే ఊదిప‌డేసింది.ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్‌) వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్‌(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ, ఇష్‌ సోధీ తలా వికెట్‌ సాధించారు.బుమ్రా మ్యాజిక్‌..అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్‌(48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్‌ 'ఢీ'

IND VS NZ 3rd T20I: Abhishek Sharma smashed fifty from just 14 balls2
అభిషేక్‌ శర్మ విధ్వంసకాండ.. 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీని, ఓవరాల్‌గా ఏడో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు.భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు యువరాజ్‌ సింగ్‌ పేరిట ఉంది. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్‌ కేవలం 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్‌ గేమ్స్‌లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్‌ విధ్వంసం ధాటికి భారత్‌ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (28) ఔట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ (67), సూర్యకుమార్‌ యాదవ్‌ (42) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్‌ (4-0-17-3), హార్దిక్‌ పాండ్యా (3-0-23-2), హర్షిత్‌ రాణా (4-0-35-1) ధాటి​కి న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

Team india bowlers restrict new zealand to 153 runs in third T20I3
రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన న్యూజిలాండ్‌

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో ​కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్‌ సీఫర్ట్‌, కైల్‌ జేమీసన్‌ వికెట్లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. క్లీన్‌ బౌల్డ్‌ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్‌ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్‌ రవి బిష్ణోయ్‌ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్‌.. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్‌ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్‌ కాన్వే వికెట్‌ తీయగా.. హార్దిక్‌ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (3-0-32-0), శివమ్‌ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. చాప్‌మన్‌ (32), సాంట్నర్‌ (27), డారిల్‌ మిచెల్‌ (14), సీఫర్ట్‌ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్‌ (4), జేమీసన్‌ (3), హెన్రీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.

IND VS NZ 3RD T20I: JASPRIT BUMRAH CLEAN BOWLED TIM SEIFERT WITH A MIND BLOWING DELIVARY4
ఇదేం బౌలింగ్‌ సామీ.. నిప్పులు చెరిగిన బుమ్రా

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్‌ సింగ్‌ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్‌ (12), రచిన్‌ రవీంద్ర (4), చాప్‌మన్‌ (32), డారిల్‌ మిచెల్‌ (14) ఔట్‌ కాగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (48), సాంట్నర్‌ క్రీజ్‌లో ఉన్నారు.భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, బిష్ణోయ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు. వీరిలో బిష్ణోయ్‌, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన దాంట్లో కుల్దీప్‌ యాదవ్‌ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్‌ వేసి 13 పరుగులిచ్చాడు.గాల్లో నాట్యంఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ తొలి బంతి​కి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్‌ లెంగ్త్‌ బంతిని డిఫెండ్‌ చేసుకునే క్రమంలో సీఫర్ట్‌ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్‌ బ్యాట్‌ను ఆఫ్‌ స్టంప్‌ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్‌ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.A PEACH FROM THE BEST BOWLER OF GENERATION - BUMRAH 😍 pic.twitter.com/QyUNGzYLS1— Johns. (@CricCrazyJohns) January 25, 2026రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్‌ స్థానంలో కైల్‌ జేమీసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

India in line to face South Africa in sole warm up clash before T20 World Cup defence5
ప్రపంచకప్‌కు ముందే సౌతాఫ్రికాతో భారత్‌ 'ఢీ'

టీ20 ప్రపంచకప్‌కు ముందే డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా గతేడాది రన్నరప్‌ సౌతాఫ్రికాతో తలపడనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పోరు రెగ్యులర్‌ మ్యాచ్‌లా కాకుండా వార్మప్‌ మ్యాచ్‌గా జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు ఇదొక్కటే వార్మప్‌ మ్యాచ్‌ అని సమాచారం.వాస్తవానికి ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలకు ముందు వార్మప్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అయితే బంగ్లాదేశ్‌ కిరికిరి ఉండటంతో ఫైనల్‌ షెడ్యూల్‌ ఆలస్యమైంది. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌లో ఆడనుండటంతో షెడ్యూల్‌ మార్చాల్సి వచ్చింది.భారత్‌-సౌతాఫ్రికా వార్మప్‌ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. బీసీసీఐ, క్రికెట్‌ సౌతాఫ్రికా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ జనవరి 31న తిరువనంతపురంలో జరగనుంది. ఈ సిరీస్‌ తర్వాత టీమిండియా ఫిబ్రవరి 3న ముంబైలో కలుస్తుంది. సౌతాఫ్రికాతో వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 4న ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరుగనున్నట్లు సమాచారం.ప్రపంచకప్‌ మెయిన్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. కొలొంబో వేదికగా జరిగే పాకిస్తాన్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా యూఎస్‌ఏతో ఆడనుంది.భారత్‌.. యూఎస్‌ఏ, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌, నమీబియాతో పాటు గ్రూప్‌-ఏలో ఉంది. మిగతా గ్రూప్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 12 (నమీబియాతో ఢిల్లీలో), 15 (పాకిస్తాన్‌తో కొలొంబోలో), 18 (నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో) తేదీల్లో జరుగనున్నాయి.దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌, న్యూజిలాండ్‌, యూఏఈలతో కలిసి గ్రూప్‌-డిలో ఉంది. దక్షిణాఫ్రికా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 9న అహ్మదాబాద్‌లో కెనడాతో ఆడనుంది.

team india won the toss and choose to bowl in third T20I vs new zealand6
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్‌ గెలిచిన సూర్యకుమార్‌

గౌహతిలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ రెండు మార్పులు చేసింది. అర్షదీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా ఈ మ్యాచ్‌ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్‌ స్థానంలో కైల్‌ జేమీసన్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

PADMA SHRI FOR ROHIT SHARMA AND HARMANPREET KAUR7
హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు పద్మశ్రీ అవార్డు

2026 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. మొత్తం 131 మంది ఈ అవార్డులకు ఎంపిక కాగా.. ఇందులో 113 మందికి పద్మశ్రీ, 13 మంది పద్మభూషణ్‌, ఐదుగురికి పద్మవిభూషణ్‌ అవార్డులు లభించాయి. ఇందులో క్రీడారంగానికి సంబంధించి ఎనిమిది మందికి పద్మ అవార్డులు లభించగా.. వీరిలో టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌కు పద్మవిభూషణ్‌, భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టు ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, భారత సీనియర్‌ పురుషుల క్రికెట్‌ జట్టు మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌, భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవిత పూనియా సహా మరో ముగ్గురికి (బల్దేవ్‌ సింగ్‌, భగవాన్‌దాస్‌ రైక్వార్‌, కే పజనివేల్‌) పద్మశ్రీ అవార్డులు లభించాయి.

PERTH SCORCHERS WON THE BBL FOR THE 6th TIME8
బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26 విజేత స్కార్చర్స్‌

2025-26 ఎడిషన్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ అవతరించింది. ఇవాళ (జనవరి 25) జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి ఛాంపియన్షిప్‌ కైవసం చేసుకుంది. స్కార్చర్స్‌ 2014, 2015, 2017, 2022, 2023, 2026 ఎడిషన్లలో టైటిళ్లు సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో స్కార్చర్స్‌కు టైటిల్‌ అందించిన ఆష్టన్‌ టర్నర్‌ గతంలో మరో రెండు టైటిళ్లు (కెప్టెన్‌) అందించాడు. తద్వారా లీగ్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. బీబీఎల్‌ నిర్వహకులు ఈ ఎడిషన్‌లో కొత్త ఆనవాయితీకి తెరలేపారు. విజేతలను అందించే మెడల్స్‌ను చిన్నారుల చేత ఇప్పించారు. స్కార్చర్స్‌ కెప్టెన్‌ టర్నర్‌ తన విన్నింగ్‌ మెడల్‌ను తన ముగ్గురు సంతానం చేతుల మీదుగా అందుకున్నాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌.. జై రిచర్డ్స్‌ (4-0-32-3), డేవిడ్‌ పేన్‌ (4-0-18-3), మహ్లి బియర్డ్‌మన్‌ (4-0-29-2), ఆరోన్‌ హార్డీ (3-0-16-1), కూపర్‌ కన్నోల్లీ (3-0-14-0) ధాటికి 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌, జోష్‌ ఫిలిప్‌, కెప్టెన్‌ మోసస్‌ హెన్రిక్స్‌ తలో 24 పరుగులు చేయగా.. జోయల్‌ డేవిస్‌ 19, లచ్లాన్‌ షా 14 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను స్కార్చర్స్‌ ఆచితూచి ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (44), ఫిన్‌ అలెన్‌ (36) నిదానంగా ఆడినా, లక్ష్యానికి దగ్గర చేశారు. మిగతా కార్యక్రమాన్ని జోష్‌ ఇంగ్లిస్‌ (29 నాటౌట్‌) పూర్తి చేశాడు. ఇంగ్లిస్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. మరో 15 బంతులు మిగిలుండగానే స్కార్చర్స్‌ విజయతీరాలకు చేరింది. సిక్సర్స్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ (4-0-19-2), మిచెల్‌ స్టార్క​్‌ (4-0-33-1), జాక్‌ ఎడ్వర్డ్స్‌ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

List of all ICC events boycotted by teams9
చరిత్రలో ఐసీసీ టోర్నీలను బహిష్కరించిన జట్లు ఇవే..!

క్రికెట్‌కు సంబంధించి ఏ జట్టుకైనా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడమనేది చాలా ముఖ్యం. కేవలం మైదానంలో లభించే గుర్తింపు కోసమే కాకుండా, ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలోనూ ఇది చాలా కీలకం. అందుకే ప్రతి జట్టు ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.అయితే, క్రికెట్‌ చరిత్రలో కొన్ని జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ చేరింది. ఈ జట్టు త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఈవెంట్లను బహిష్కరించిన జట్లపై ఓ లుక్కేద్దాం.చరిత్ర చూస్తే.. రాజకీయ కారణాలు, భద్రతా సమస్యలు లేదా అంతర్జాతీయ సంబంధాల కారణంగా కొన్ని జట్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరించాయి. ఇందులో ముందుగా జింబాబ్వే పేరు వస్తుంది.జింబాబ్వే రాజకీయ ఉద్రిక్తతలు, ఆటగాళ్లకు వీసా సమస్యల కారణంగా ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ20ని (అప్పట్లో టీ20 ప్రపంచకప్‌ను అలా పిలిచేవారు) బహిష్కరించింది. జింబాబ్వే ఇలా చేయడానికి బీజం 2003లో పడింది. ఆయేడు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ జింబాబ్వేలో ఆడటానికి నిరాకరించింది. ఇందుకు కారణం నాటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబేతో యూకేకు ఉండిన రాజకీయ విభేదాలు.అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్‌ సంబంధాలు మెరుగుపడకపోవడంతో జింబాబ్వే 2009 ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ20 నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. జింబాబ్వేకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.ఇలాంటి ఉదంతమే 2016 అండర్‌ 19 వరల్డ్‌కప్‌లోనూ జరిగింది. ఆయేడు బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యువ ఆసీస్‌ జట్టు మెగా టోర్నీని బహిష్కరించింది. అప్పుడు ఆసీస్‌కు ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్‌కు అవకాశం లభించింది. పై రెండు ఉదంతాల తర్వాత ఓ జట్టు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే బహిష్కరించడం ఇదే ఏడాది జరిగింది. రాజకీయ ఉద్రిక్తతలు, ఐపీఎల్‌ 2026లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలగింపు, భద్రతా కారణాల చేత భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి బంగ్లాదేశ్‌ వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్‌కు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కింది.పైన పేర్కొన్న ఉదంతాల్లో ఆయా జట్లు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే రద్దు చేసుకోగా.. కొన్ని జట్లు పలు మ్యాచ్‌లను బాయ్‌కాట్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్లు బాయ్‌కాట్‌ చేశాయి. లంకలో అంతర్యుద్దం, భద్రతా కారణాల చేత ఆ జట్లు తమ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్‌ లభించింది. ఆ టోర్నీలో శ్రీలంకనే ఛాంపియన్‌గా నిలవడం​ కొసమెరుపు.2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు కూడా ఓ మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించింది. ఆయేడు ప్రపంచకప్‌ టోర్నీకి జింబాబ్వేతో పాటు కెన్యా కూడా ఆతిథ్యమిచ్చింది. మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌ నైరోబీలో ఓ మ్యాచ్‌ ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల చేత న్యూజిలాండ్‌ బాయ్‌కాట్‌ చేయాలనుకుంది.

Joe Root has the most Player of the match award for England in International cricket10
చరిత్ర సృష్టించిన జో రూట్‌

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జో రూట్‌ కెరీర్‌లో మరో ఘనతను సొంతం​ చేసుకున్నాడు. నిన్న (జనవరి 24) శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో (2.3-0-13-2, ఓ క్యాచ్‌, (90 బంతుల్లో 72; 5 ఫోర్లు)) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (POTM) అవార్డు గెలుచుకున్న అతడు.. ఇంగ్లండ్ తరఫున అత్యధిక POTM అవార్డులు (383 మ్యాచ్‌ల్లో 27) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో కెవిన్‌ పీటర్సన్‌ (277 మ్యాచ్‌ల్లో 26) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రూట్‌, కేపీ తర్వాత జోస్‌ బట్లర్‌ (24), ఇయాన్‌ మోర్గాన్‌ (23) ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 27న కొలొంబో వేదికగానే జరగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌ తర్వాత శ్రీలంకతో పాటు భారత్‌లో ప్రపంచకప్‌ మొదలవుతుంది.ఎనిమిది మందితో ప్రయోగంటాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించింది. తలో చేయి వేయడంతో శ్రీలంక 49.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌, రూట్‌ తలో 2 వికెట్లు తీయగా.. డాసన్‌, జాక్స్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లంక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (40), అసలంక (45) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.రాణించిన రూట్‌అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడినప్పటికీ.. రూట్‌ (75), బ్రూక్‌ (42), డకెట్‌ (39), బట్లర్‌ (33 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వ, వాండర్సే తలో 2, అషిత ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement