Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sahaja Yamalapalli Marches Into Quarterfinals At ITF W751
సహజ ముందంజ 

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య డబ్ల్యూ75 టోరీ్నలో భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్, తెలంగాణ ప్లేయర్‌ సహజ యామలపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 378వ ర్యాంకర్‌ సహజ 6–3, 7–5తో థాయ్‌లాండ్‌కు చెందిన అన్చిసా చాంటాపై గెలుపొందింది. 1 గంట 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేసింది. తన సరీ్వస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. తొలి సరీ్వస్‌లో 23 పాయింట్లు గెలిచిన భారత యువతార, రెండో సర్వీస్‌లో 18 పాయింట్లు సొంతం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో లీసా పిగాటో (ఇటలీ)తో సహజ తలపడుతుంది. ఇదే టోర్నీ డబుల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో రుతుజా భోస్లే (భారత్‌)–వుషువాంగ్‌ జెంగ్‌ (చైనా) జోడీ 6–3, 6–3తో క్యోకా ఒకమురా (జపాన్‌)–పీంగ్‌టార్న్‌ ప్లిపుయెచ్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచింది.

Malaysia Open 2026: PV Sindhu crushes Japanese shuttler Miyazaki2
క్వార్టర్స్‌లో సింధు 

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత స్టార్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సింధు 21–8, 21–13తో ప్రపంచ 9వ ర్యాంకర్‌ టొమోకా మియజకి (జపాన్‌)పై గెలిచింది. కేవలం 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 14–12తో ఆధిక్యంలో ఉంది. లక్ష్య సేన్, ఆయుశ్‌ అవుట్‌ పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 20–22, 15–21తో ప్రపంచ 18వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యియు (హాంకాంగ్‌) చేతిలో... ప్రపంచ 32వ ర్యాంకర్‌ ఆయుశ్‌ శెట్టి 18–21, 21–18, 12–21తో ప్రపంచ నంబర్‌వన్‌ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాతి్వక్‌–చిరాగ్‌ ద్వయం 21–18, 21–11తో జునైది ఆరిఫ్‌–రాయ్‌ కింగ్‌ యాప్‌ (మలేసియా) జంటను ఓడించింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రీ (ఇండోనేసియా)లతో సాతి్వక్‌–చిరాగ్‌ తలపడతారు.

Fourth edition of the Womens Premier League 2026, Special Story3
ధనాధన్‌కు వేళాయె... 

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ను ఇప్పటి వరకు మూడుసార్లు నిర్వహించారు. ముంబై రెండుసార్లు, బెంగళూరు ఒకసారి విజేతగా నిలిచాయి. అయితే గతానికి, 2026 సీజన్‌కు ప్రధాన తేడా ప్లేయర్ల ‘గుర్తింపు’. టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన తర్వాత జరుగుతున్న తొలి డబ్ల్యూపీఎల్‌ ఇదే కావడంతో అన్ని వైపుల నుంచి సహజంగానే అదనపు ఆసక్తి పెరిగింది. టోర్నీ మొదలైనప్పుడు మహిళా క్రికెటర్ల గురించి ఒక పరిచయ కార్యక్రమంలాగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు! నాడు ఉచితంగా అభిమానులను అనుమతించగా, తక్కువే అయినా ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌ మ్యాచ్‌లకు టికెట్‌ ఉండటం లీగ్‌ స్థాయి పెరిగిందనేందుకు సంకేతం. ఐపీఎల్‌ తరహాలోనే వేలం, ప్రతిభాన్వేషణ, ప్రత్యేకంగా టీమ్‌ స్పాన్సర్లతో లీగ్‌ ఇప్పుడు స్వతంత్రంగా నిలబడింది. ఈ నేపథ్యంలో లీగ్‌ నాలుగో సీజన్‌ వచ్చేసింది. ఐదు జట్ల మధ్య జరిగే సమరంలో తుది విజేత ఎవరో 22 మ్యాచ్‌ల తర్వాత తేలనుంది. ముంబై: హర్మన్‌ప్రీత్‌ బృందం ముచ్చటగా మూడోసారి టైటిల్‌ సాధిస్తుందా? భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన తన టీమ్‌ను రెండోసారి విజేతగా నిలుపుతుందా? లేక కెపె్టన్‌గా కొత్త పాత్రలో మరో టాప్‌ ప్లేయర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ తన జట్టుకు తొలిసారి టైటిల్‌ అందిస్తుందా? ఈ నేపథ్యంలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో మరోసారి ప్రపంచ మహిళా క్రికెటర్ల ప్రదర్శన చూసేందుకు సమయం ఆసన్నమైంది. నేడు ప్రారంభం కానున్న నాలుగో సీజన్‌ ఫిబ్రవరి 5న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నమెంట్‌ను ఈసారి రెండు మైదానాలకే పరిమితం చేశారు. ఫ్రాంచైజీలు ఐపీఎల్‌ తరహాలో సొంత, ప్రత్యర్థి వేదికలపై మ్యాచ్‌లు ఆడాలని ఆశించినా... ప్రధాన వేదికలన్నీ టి20 వరల్డ్‌ కప్, రంజీ ట్రోఫీల కోసం కేటాయించడంతో బీసీసీఐ దానికి అనుమతించలేదు. రెండు తొలి 11 మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదిక కాగా, తర్వాతి 11 మ్యాచ్‌లు వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది. తొలి మూడు సీజన్ల పాటు డబ్ల్యూపీఎల్‌ ఫిబ్రవరి–మార్చిలలో జరిగినా ... కొత్త ఎఫ్‌టీపీలో డబ్ల్యూపీఎల్, ఉమెన్‌ బిగ్‌బా‹Ù, హండ్రెడ్‌ టోరీ్నలకు ప్రత్యేకంగా తేదీలను కేటాయించారు. ఇకపై జనవరి–ఫిబ్రవరిలోనే ఈ లీగ్‌ జరుగుతుంది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ‘డబుల్‌ హెడర్‌’లు ఉండబోతున్నాయి. జనవరి 10, 17 తేదీల్లో ఒకే రోజు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. కొత్త కోచ్‌లతో... లీగ్‌లో ఎప్పటిలాగే ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా... హర్మన్, స్మృతి, జెమీమాతో పాటు మెగ్‌ లానింగ్, యాష్లీ గార్డ్‌నర్‌ మరో రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు జెమీమా రూపంలో కొత్త కెప్టెన్‌ వచ్చింది. గత సీజన్‌ వరకు ఢిల్లీకి సారథిగా ఉన్న మెగ్‌ లానింగ్‌ ఈ ఏడాది యూపీ వారియర్స్‌ కెపె్టన్‌గా బరిలోకి దిగుతోంది. లానింగ్‌ నాయకత్వంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు సీజన్లలో కూడా ఫైనల్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ మూడుసార్లు ఆ జట్టు రన్నరప్‌గానే నిలిచింది. ఈ సీజన్‌ కోసం మూడు జట్లు కొత్త కోచ్‌లను ఎంచుకున్నాయి. ముంబై కోచ్‌గా చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ స్థానంలో లిసా కీట్లీ, ఆర్‌సీబీ కోచ్‌గా ల్యూక్‌ విలియమ్స్‌ స్థానంలో మలోలన్‌ రంగరాజన్, యూపీ కోచ్‌గా జాన్‌ లూయిస్‌ స్థానంలో అభిషేక్‌ నాయర్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వ్యక్తిగత కారణాలతో ఎలీస్‌ పెరీ, అనాబెల్‌ టోర్నీ నుంచి తప్పుకోగా... గుర్తింపు ఉన్న ప్లేయర్లలో అలీసా హీలీ, చమరి అటపట్టు, హీతర్‌ నైట్‌లను వేలంలో ఎవరూ ఎంచుకోలేదు. ఎవరి సత్తా ఎంత? లీగ్‌లో ఐదు జట్ల బలాబలాలను చూస్తే ముంబై ఇండియన్స్‌ ఎప్పటిలాగే పటిష్టంగా కనిపిస్తోంది. మూడో సారి టైటిల్‌ గెలవకుండా జట్టును నిలువరించడం అంత సులువు కాదు. హర్మన్‌ప్రీత్, హేలీ మాథ్యూస్, నాట్‌ సివర్, బ్రంట్, అమన్‌జోత్‌ కౌర్, అమేలియా కెర్‌లతో బలంగా ఉంది. తాజా సంచలనం కమలినిని కూడా టీమ్‌ ఎంచుకుంది. స్మృతి నాయకత్వంలో బెంగళూరు రెండో ట్రోఫీపై గురి పెట్టింది. అయితే టీమ్‌లో బెస్ట్‌ ప్లేయర్‌ ఎలీస్‌ పెరీ ఈ సీజన్‌కు దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. ఆమె లేని లోటును ఆర్‌సీబీ పూరించాల్సి ఉంది. స్మృతి ఎప్పటిలాగే ముందుండి నడిపించనుండగా... రిచా ఘోష్, పూజ వస్త్రకర్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. ఇటీవల వరల్డ్‌ కప్‌లో చెలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డి క్లెర్క్‌ ఇదే టీమ్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధానంగా టాపార్డర్‌పై ఆధారపడుతోంది. వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా కెపె్టన్‌ లారా వోల్‌వార్ట్, షఫాలీ వర్మ, జెమీమా, మరిజాన్‌ కాప్‌ టాప్‌–4లో కీలకం. బౌలింగ్‌లో నల్లపురెడ్డి శ్రీచరణి, స్నేహ్‌ రాణావంటి స్పిన్నర్లు ఉన్నా జట్టు పేస్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో కలిపి 16 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లో గెలిచి 2025లో చివరి స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌ ఈసారి తమ అదృష్టం మారుతుందని భావిస్తోంది. వరల్డ్‌ కప్‌ స్టార్‌ దీప్తి శర్మపై మరోసారి పెద్ద భారం ఉండగా... మెగ్‌ లానింగ్‌ కెపె్టన్సీ, నాయర్‌ కోచింగ్‌ను జట్టు నమ్ముకుంది. ధాటిగా ఆడే కిరణ్‌ నవ్‌గిరే, వరల్డ్‌ కప్‌ సభ్యురాలు హర్లీన్‌ డియోల్, లిచ్‌ఫోల్డ్‌ ఇతర కీలక ప్లేయర్లు. పేసర్లు క్రాంతి గౌడ్, శిఖా పాండేలతో స్పిన్నర్‌ ఎకెల్‌స్టోన్‌లపై బౌలింగ్‌ భారం ఉంది. వేలంలో సోఫీ డివైన్, రేణుకా సింగ్, డానీ వ్యాట్‌లను తీసుకొని గుజరాత్‌ జెయింట్స్‌ తమ జట్టును కాస్త పటిష్టంగా మార్చుకుంది. గార్డ్‌నర్, బెత్‌ మూనీ, వేర్‌హామ్‌ టీమ్‌ ప్రధాన బలం. యువ ఆటగాళ్ళలో టిటాస్‌ సాధు, కాశ్వీ గౌతమ్, తనూజ కన్వర్‌ రాణించడం ముఖ్యం.ఈసారి డబ్ల్యూపీఎల్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు క్రికెటర్లు బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నల్లపురెడ్డి శ్రీచరణి (ఢిల్లీ), తెలంగాణ నుంచి అరుంధతి రెడ్డి (బెంగళూరు), గొంగడి త్రిష (యూపీ), మమత మదివాలా (ఢిల్లీ), నల్లా క్రాంతి రెడ్డి (ముంబై) పోటీపడనున్నారు.

BCCI gives update on Tilak Varma, batter ruled out of first 3 IND vs NZ T20Is4
టీమిండియాకు భారీ షాక్‌..

న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించింది."తిలక్ వర్మ శస్త్రచికిత్స విజయవంతమైంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. తిలక్‌ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నాడు. నొప్పి త‌గ్గిన త‌ర్వాత అత‌డు త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ క్రమంలోన్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరంగా ఉండనున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.ఏమి జరిగిందంటే? తిలక్ ప్రస్తుతం విజయ్ హజారే-2025లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్‌కు పొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే అతడిని రాజ్‌కోట్‌లో గోకుల్‌కు ఆస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించారు.అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. తిలక్‌ ఈ సిరీస్‌కు దూరమైనా టీ20 ప్రపంచకప్‌-2026 నాటికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశముంది. జనవరి 21 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

WPL 2026 schedule: Check full list of matches with timings5
డ‌బ్ల్యూపీఎల్‌-2026కు స‌ర్వం సిద్దం.. షెడ్యూల్ ఇదే! తదితర వివరాలు ఇవే

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్-2026 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో శుక్రవారం నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీని నవీ ముంబైతో పాటు వ‌డోద‌ర వేదిక‌గా నిర్వ‌హించ‌నున్నారు.జనవరి 9 నుంచి 17 వరకు తొలి 11 మ్యాచ్‌లు నవీ ముంబైలో జ‌ర‌గ‌నుండ‌గా. ఆ త‌ర్వాత టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు వ‌డోద‌రలోని బీసీఎ స్టేడియం ఆతిథ్య‌మివ్వ‌నుంది. కీల‌క‌మైన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌తో ఫైన‌ల్ కూడా ఇదే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 3న ఎలిమినేటర్ మ్యాచ్, ఫిబ్రవరి 5న ఫైనల్‌సాధార‌ణంగా డ‌బ్ల్యూపీఎల్ ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగుతుంది. కానీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌-2026 కార‌ణంగా ఈ టోర్నీని గ‌తంలో కంటే ఒక నెల ముందుగానే నిర్వహిస్తున్నారు. ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్,యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మొత్తం ఐదు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు, యూపీ వారియర్స్‌కు కొత్త కెప్టెన్‌లు వచ్చారు. ఢిల్లీ జట్టుకు భారత స్టార్ ప్లేయర్ రోడ్రిగ్స్ సారథ్యం వహించనుండగా.. యూపీ వారియర్స్‌ను ఆసీస్ లెజెండ్ మెగ్ లానింగ్ ముందుండి నడిపించనుంది.డబ్ల్యూపీఎల్‌ 2026 పూర్తి షెడ్యూల్ ఇదే..జనవరి 9 – ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (నవీ ముంబై)జనవరి 10 – యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)జనవరి 10 – ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 11 – ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (న‌వీ ముంబై)జనవరి 12 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్, (నవీ ముంబై)జనవరి 13 – ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 14 – యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( నవీ ముంబై)జనవరి 15 – ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్ ( నవీ ముంబై)జనవరి 16 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ ( నవీ ముంబై)జనవరి 17 – యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ ( నవీ ముంబై)జనవరి 17 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( నవీ ముంబై)జనవరి 19 – గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 20 – ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 22 – గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ ( వడోదర)జనవరి 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 26 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ ( వడోదర)జనవరి 27 – గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( వడోదర)జనవరి 29 – యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( వడోదర)జనవరి 30 – గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (వడోదర)ఫిబ్రవరి 1 – ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్ (వడోదర)ఫిబ్రవరి 3 – ఎలిమినేటర్ (వ‌డోదర)ఫిబ్రవరి 5 – ఫైనల్ ( వడోదర)మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే?ఈ మ్యాచ్‌లను అభిమానులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌ల‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా నవీ ముంబైలో జరగనున్న ప్రారంభ వేడుకల్లో యోయో హనీ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్లు పాల్గోనున్నారు.

Mizoram cricketer dies after collapsing during a match6
మ్యాచ్‌ జరుగుతుండగా గుండెపోటు.. రంజీ క్రికెటర్‌ హఠాన్మరణం

భార‌త క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన‌ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సమీపంలోని సిహ్ముయ్‌లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.ఈ టోర్నీలో వెంగ్‌నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్‌పుయ్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది."లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడు.మిజోరం ఒక గొప్ప క్రికెటర్‌ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్‌గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

Venkatesh Iyer prove haters wrong with dazzling VHT knocks7
ఆర్సీబీకి గుడ్ న్యూస్‌.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్‌

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్‌ అయ్యర్‌ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్‌.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్‌ దూబే(40), త్రిపురేష్‌(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌ పేసర్‌ శివాంగ్‌ కుమార్‌ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్‌ మయాక్‌ అగర్వాల్‌(49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.ఆర్సీబీకి గుడ్ న్యూస్‌..ఐపీఎల్‌-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌-2025లో సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.చదవండి: VHT 2025-26: చ‌రిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు

Enna Thambi Vaibhav Suryavanshi stepping into big shoes of Sanju: Ashwin8
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్‌ సూర్యవంశీ ఫిక్స్‌!

భారత క్రికెట్‌లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్‌ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్‌ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు (104)తో యూత్‌ టెస్టులో శతక్కట్టిన వైభవ్‌.. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున గుజరాత్‌ టైటాన్స్‌(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్‌ గడ్డ మీద యూత్‌ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌... ఆస్ట్రేలియాలో యూత్‌ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్‌ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్‌ తరఫున దేశీ క్రికెట్‌లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్‌​-19 జట్టుతో యూత్‌ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇటీవల విజయ్‌ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్‌ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్‌ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఖతార్‌, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్‌ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్‌ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్‌-19 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్‌ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్‌ స్థానంలోఅండర్‌-19 వరల్డ్‌కప్‌-2026లో అతడు షోటాపర్‌ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్‌ జాతరే!అతడి పట్టుదల, టెంపర్‌మెంట్‌, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్‌ను రాజస్తాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ట్రేడ్‌ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్‌ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్‌ స్థానానికి వైభవ్‌ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడితే.. క్రికెట్‌ దేవుడు, దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్‌ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్‌ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్‌ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

Ben Stokes hints at the end of Bazball after Ashes defeat vs Aus9
‘బజ్‌బాల్‌’ ఖేల్‌ ఖతం!.. స్టోక్స్‌ కీలక వ్యాఖ్యలు

యాషెస్‌ 2025-26 సిరీస్‌ను విజయంతో ముగించాలన్న ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆఖదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 4-1తో ఈ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్‌ తమ సొంతం చేసుకుంది.పెర్త్‌, బ్రిస్బేన్‌, అడిలైడ్‌ టెస్టుల్లో ఆసీస్‌ గెలవగా.. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. అయితే, సిడ్నీ వేదికగా ఆదివారం మొదలైన ఐదో టెస్టు.. గురువారం ముగిసింది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (Ben Stokes) స్పందించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ముందుకుపోయే ‘బజ్‌బాల్‌’ ఆటకు స్వస్తి పలుకుతామనే సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మాతో మ్యాచ్‌లో ఎలా ఆడాలో బహుశా అన్ని జట్లకు తెలిసిపోయి ఉంటుంది.బ్యాట్‌తో బరిలోకి దిగినపుడు మేము అంతా బాగుందనే అనుకుంటున్నాం. కానీ ప్రత్యర్థి జట్లు మాకోసం మరింత మెరుగైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. వాళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.ఇలాగే ఆడితే..కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మేము బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మా బ్యాటింగ్‌ సరిగ్గా లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఆడితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను.ఒకరిపై ఒకరం నిందలు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయితే, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మా జట్టు అలాంటిదే. మేము తిరిగి పుంజుకుని మునుపటి మాదిరే ఉన్నత స్థితికి చేరుకుంటాం.ఏదేమైనా ఈ సిరీస్‌ మొత్తం ఆస్ట్రేలియా అత్యద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌.. ఆసీస్‌ జట్టు మొత్తం అదరగొట్టింది. మేము కూడా మా పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’’ అని స్టోక్స్‌ పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌ గడ్డపై యాషెస్‌లో మరోసారి ఘోర పరాభవం నేపథ్యంలో ‘బజ్‌బాల్’‌ ఆద్యులు హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌, కెప్టెన్‌ స్టోక్స్‌ను పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ యాషెస్‌ ఐదో టెస్టు స్కోర్లు👉వేదిక: సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌, సిడ్నీ👉టాస్‌: ఇంగ్లండ్‌.. తొలుత బ్యాటింగ్‌👉ఇంగ్లండ్‌: 384 & 342👉ఆస్ట్రేలియా: 567 & 161/5👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్‌.. ఒక్క పరుగు తేడాతో..

Sri Lanka appoint Vikram Rathour as batting coach10
శ్రీలంక మాస్టర్‌ మైండ్‌.. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం

టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటిం‍గ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి శ్రీలంక జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.రాథోర్‌ జ‌న‌వ‌రి 18న లంక‌తో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జ‌ట్టుతోనే ఉండ‌నున్నాడు. విక్ర‌మ్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. . 2019 సెప్టెంబ‌ర్ నుంచి 2024 జూలై వ‌ర‌కు భార‌త బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅత‌డు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవ‌ల్ 3 కోచ్‌గా కొన‌సాగాడు.అత‌డు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా ప‌నిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్ప‌టికే భార‌త మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను త‌మ ఫీల్డింగ్ కోచ్‌గా నియ‌మించింది. రాథోర్ భార‌త బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధ‌ర్ పనిచేశాడు.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవ‌లందించ‌నున్నాడు. కాగా ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు శ్రీలంక‌, భార‌త్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. శ్రీలంక త‌మ లీగ్ మ్యాచ్‌ల‌న్నింట‌ని స్వ‌దేశంలోనే ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement