ప్రధాన వార్తలు
మైదానంలో అతి.. హార్దిక్ పాండ్యాపై కేసు నమోదు
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. పాండ్యా జాతీయ జెండాను అవమానించాడని పుణేకు చెందిన వాజిద్ ఖాన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీ20 ప్రపంచకప్ విజయోత్సవాలలో భాగంగా హార్దిక్ జాతీయ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వాజిద్ పేర్కొన్నారు.శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జాతీయ జెండాను ఆ గౌరవ పరచడం చట్టరీత్యా నేరమని, ప్రతి పౌరుడు జెండాను గౌరవించడం బాధ్యత అని అడ్వకేట్ ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు సమాచారం.ఏమి జరిగిందంటే?ఫైనల్లో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసిన తర్వాత తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంలో విజయోత్సవాలు నిర్వహించారు. భారత ప్లేయర్ల కుటంబ సభ్యులను కూడా మైదానంలో అనుమతించారు. ఈ సమయంలో పాండ్యా హద్దులు మీరి ప్రవర్తించాడు. తన గర్ల్ఫ్రెండ్ మహికా శర్మను హగ్ చేసుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు.ఆ సమయంలో అతడి ఒంటిపై భారత జెండా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే అతడిపై పోలీసులకు వాజిద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. హార్దిక్ ప్రవర్తనపై నెటిజన్లు సైతం తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ టోర్నీలో పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు అర్ధ సెంచరీలు, 9 వికెట్లతో భారత్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: 'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం
'ఆ రోజు మా వాళ్లు వణికిపోయారు.. అందుకే గెలిచే మ్యాచ్లో ఓడాం'
ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. 1992 వన్డే ప్రపంచకప్ నుంచి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 వరకు దాయాదిపై భారత్దే పై చేయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో 2011 వన్డే ప్రపంచకప్లో భారత్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను అప్పటి పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది గుర్తు చేసుకున్నాడు. మొహాలీ స్టేడియంలోని ప్రేక్షకుల ధాటికి తమ ఆటగాళ్లు ఎలా భయపడ్డారో అఫ్రిది వివరించాడు."వన్డే ప్రపంచకప్-2011లో మొహాలీలో భారత్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మ్యాచ్లో మేము చాలా అద్భుతంగా ఇన్నింగ్స్ మొదలుపెట్టాం. మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ తొలి వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో టీమిండియాను ఓడించడం ఖాయమని చాలా రిలాక్స్గా డ్రెస్సింగ్ రూమ్లో కూర్చునున్నాను.కానీ తొలి వికెట్ పడగానే సీన్ మారిపోయింది. స్టేడియంలోని అభిమానులు భారత జట్టును ఉత్సాహపరిచిన తీరు అమోఘం. ఆ కేరింతలు, అరుపుల మధ్య భారత్ తిరిగి అద్భుతంగా పుంజుకుంది. దెబ్బకు మైదానంలో మా బ్యాటర్లు వణికిపోవడం నేను చూశాను. హఫీజ్ అవుట్ అయిన తర్వాత, మా ప్లేయర్లు వరుస క్రమంలో పెవిలియన్కు చేరారుప్రతీ బంతికి ఇబ్బంది పడ్డారు. స్టేడియంలో విపరీతమైన గోల మధ్య మా ప్లేయర్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు. కనీసం నిలదొక్కుకోలేకపోయారు" అని అఫ్రిది పేర్కొన్నాడు. కాగా ఆ మ్యాచ్లో పాక్పై 29 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 260 పరుగుల లక్ష్య చేధనలో పాక్ 231 పరుగులకు ఆలౌటైంది. 85 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు
ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనం: ఇరాన్
దుబాయ్: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే పురుషుల ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఈ జూన్, జూలైల్లో మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ప్రస్తుతం తమ దేశం మీదపడి దాడులు చేస్తున్న అమెరికా... అక్కడికెళ్లే మా జట్టుకు హాని చేయకుండా ఉండదని ఇరాన్ ఆరోపించింది. "అత్యంత క్రూరంగా అమెరికా ప్రవర్తిస్తోంది. గడిచిన ఎనిమిది తొమ్మిది నెలల్లోనే రెండోసారి మాపై యుద్ధం చేస్తోంది. వేల సంఖ్యలో మా ప్రజల ఉసురు తీస్తోంది. ఇలాంటి దేశానికి వెళ్లి మేం ఫుట్బాల్ మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుందా? ఆ దేశంలో ఆడే ప్రసక్తే లేదు" అని ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దొన్యమలి ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. దీంతో అధికారికంగా అమెరికా ఆతిథ్యమిచ్చే ఫుట్బాల్ ప్రపంచకప్ను ఇరాన్ బహిష్కరించనుందని తేటతెల్లమైంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ బహిష్కరణ వాఖ్యల్ని బేఖాతరు చేస్తూ తేలిగ్గా కొట్టిపారేశారు.చదవండి: రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు
సెమీస్లో భారత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ హాకీ టోర్నీ బెర్త్ను ఖరారు చేసుకునేందుకు భారత మహిళల జట్టు గెలుపు దూరంలో నిలిచింది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో బుధవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 4–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (29వ, 34వ, 55వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది. మరో గోల్ను సాక్షి రాణా (7వ నిమిషంలో) అందించింది. వేల్స్ జట్టు తరఫున బెట్సాన్ థామస్ (39వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. నవ్నీత్ కౌర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత జట్టుకు తొమ్మిది పెనాల్టీ కార్నర్లు, ఒక పెనాల్టీ స్ట్రోక్ లభించాయి. తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో రెండింటిని, పెనాల్టీ స్ట్రోక్ను నవ్నీత్ కౌర్ గోల్స్గా మలిచింది. ఈ గెలుపుతో భారత జట్టు ఏడు పాయింట్లతో పూల్ ‘బి’ టాపర్గా నిలిచింది. భారత్తోపాటు స్కాట్లాండ్ కూడా ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్కు చేరుకుంది. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా భారత్కు టాప్ ర్యాంక్ దక్కగా... స్కాట్లాండ్కు రెండో స్థానం లభించింది. స్కాట్లాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్లో 3–1తో ఉరుగ్వేపై గెలిచింది. పూల్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్ల్లో ఇంగ్లండ్ 2–0తో ఆస్ట్రియా జట్టుపై గెలుపొందగా... కొరియాతో మ్యాచ్ను ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన ఇంగ్లండ్ 9 పాయింట్లతో పూల్ ‘ఎ’లో టాప్ ర్యాంక్ను దక్కించుకుంది. ఇటలీ, కొరియా 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన గోల్స్ సగటుతో ఇటలీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.శుక్రవారం జరిగే సెమీఫైనల్స్లో ఇంగ్లండ్తో స్కాట్లాండ్ (సాయంత్రం గం. 5:15 నుంచి), ఇటలీతో భారత్ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. ఫైనల్ చేరుకునే రెండు జట్లకు శుక్రవారమే ప్రపంచకప్ బెర్త్లు ఖరారవుతాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య శనివారం మూడో స్థానం కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది.
బెంగళూరు X హైదరాబాద్
న్యూఢిల్లీ: తాజా టి20 ప్రపంచకప్ విజయోత్సాహంతో అటు టీమిండియా, ఇటు యావత్ భారతావని ఊగిపోతోంది. ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న అభిమానులకు మరోవైపు నుంచి వేసవి మజాను పంచేందుకు ఐపీఎల్ సీజన్ కూడా ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి షెడ్యూల్ కాదు. ఇరాన్పై యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్నే ప్రకటించారు. మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చాక పూర్తి సీజన్ షెడ్యూల్ను ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ వేడుకలతో పాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక హైదరాబాద్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న సన్రైజర్స్, లక్నో జట్ల మధ్య జరుగనుంది. ఏప్రిల్ 12 వరకు జరిగే తొలి దశ 20 మ్యాచ్ల్లో కేవలం ఒక మ్యాచ్నే హైదరాబాద్కు కేటాయించారు. బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, గువాహటి, ముల్లాన్పూర్ వేదికలపై రెండేసి మ్యాచ్లు జరుగనున్నాయి. ప్రారంభ శని, ఆదివారాల్లో ఒకే మ్యాచ్ నిర్వహిస్తున్నారు. తర్వాతి వారాంతాల్లో రెండేసి మ్యాచ్లు (డబుల్ హెడర్) జరుగుతాయి. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట వల్ల 11 మంది మృతి చెందడంతో కర్ణాటక సర్కారు చిన్నస్వామి స్టేడియంపై నిషేధాన్ని విధించింది. అయితే ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తేసిన సర్కారు నిపుణుల కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ స్టేడియంలోని సదుపాయాలు, ఏర్పాట్లను సమీక్షించి పూర్తిస్థాయి అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.
రిచాకు రూ. 61 లక్షలుదీప్తికి రూ. 34 లక్షలు
లండన్: ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్లో జరిగే ‘హండ్రెడ్’ (ఇన్నింగ్స్కు 100 బంతుల చొప్పున) టోర్నమెంట్లో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు బరిలో ఉన్నారు. బుధవారం వేలం కార్యక్రమం నిర్వహించగా... భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టు 50,000 పౌండ్లకు (రూ. 61 లక్షలు); ఆల్రౌండర్ దీప్తి శర్మను సన్రైజర్స్ లీడ్స్ జట్టు 27,500 పౌండ్లకు (రూ. 34 లక్షలు) కొనుగోలు చేసింది. వేలంలో కాకుండా గతంలోనే భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాయి. స్మృతి మంధానను 90,000 పౌండ్లకు (రూ. 1 కోటీ 11 లక్షలు) మాంచెస్టర్ సూపర్ జెయింట్స్... జెమీమాను 60,000 పౌండ్లకు (రూ. 74 లక్షలు)సదరన్ బ్రేవ్ జట్టు అట్టిపెట్టుకున్నాయి. వేలంలో భారత్ నుంచి 14 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా... ఇద్దరిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–19తో ఎంగ్ కీల్ వెస్లీ–జున్సుకె కుబో (సింగపూర్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ జంట 19–21, 14–21తో రుతానపక్–జెనిచా (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 21–15, 12–21, 4–21తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జ్ 23–21, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)పై సంచలన విజయం సాధించాడు. ఆయుశ్ శెట్టి 18–21, 19–21తో బ్రియాన్ యాంగ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు.
ప్రారంభానికి ముందే వాయిదా పడిన క్రికెట్ లీగ్
మహిళల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (WBPL) ప్రారంభానికి ముందే వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం, ఈ లీగ్ ఏప్రిల్ 3 నుంచి 15 తేదీల మధ్యలో జరగాల్సి ఉండింది. అయితే స్పాన్సర్లు దొరక్క జులై నెలకు పోస్ట్పోన్ చేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.వాస్తవానికి ఈ లీగ్ టీ20 ప్రపంచకప్కు ముందు తమ ప్లేయర్లకు ఉపయోగపడుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. అయితే వాయిదా పడటంతో ప్రపంచకప్ వరకు బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఎలాంటి అధికారిక మ్యాచ్లు ఉండవు. బంగ్లా ప్లేయర్లు నేరుగా జూన్ 14న నెదర్లాండ్స్తో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో బరిలోకి దిగాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో బంగ్లాదేశ్ క్రికెట్కు కఠిన పరీక్షలు ఎదురవుతున్నాయి. ఆ దేశ పురుషుల క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026 నుంచి వైదొలిగి, చాలా పెద్ద సాహసం చేసింది. ఈ పరిణామం తర్వాత ఆ దేశంలో క్రికెట్కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ ప్రభావం పలువురు అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే పురుషుల బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్పై కూడా పడనుంది. ఇప్పటికే ఆ లీగ్లోని పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు రెమ్యూనరేషన్ ఎగ్గొట్టాయనే టాక్ ఉంది. పురుషుల బీపీఎల్కు కూడా స్పాన్సర్లు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ లీగ్ మనుగడనే ప్రశ్నార్థకమవుతుంది.
టూ టైమ్ విన్నింగ్ కోచ్తో ఒప్పందం చేసుకున్న గుజరాత్
తమ తొలి సీజన్లోనే (2022) టైటిల్ ఎగరేసుకుపోయి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు కీలక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా టూ టైమ్ విన్నింగ్ కోచ్ విజయ్ దాహియాతో ఒప్పందం చేసుకుంది. రానున్న సీజన్ కోసం అతన్ని అసిస్టెంట్ కోచ్గా నియమించుకుంది. దాహియా ఇటీవలే నియమితుడైన హెడ్ కోచ్ మాథ్యూ హేడెన్కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. దాహియా 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచినప్పుడు ఆ బృందంలో అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. దాహియా తన ఐపీఎల్ కెరీర్లో కేకేఆర్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్కు కూడా పని చేశాడు. అతని కోచింగ్లో ఢిల్లీ జట్టు 2007-08 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఈ అనుభవం గుజరాత్ టైటాన్స్కి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన గుజరాత్.. ఆతర్వాత సీజన్లో కూడా ఫైనల్కు చేరినా, సీఎస్కే చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. 2024లో హార్దిక్ పాండ్యా ఆ ఫ్రాంచైజీని వీడి ముంబై ఇండియన్స్లో చేరడంతో శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ సారథ్యంలో గుజరాత్ తొలి సీజన్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత సీజన్లో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచినా ఫైనల్స్కు చేరలేకపోయింది. రాబోయే సీజన్లో మరోసారి గిల్ నేతృత్వంలో గుజ.రాత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఇదిలా ఉంటే, 2026 సీజన్కు సంబంధించి తొలి విడత షెడ్యూల్ (20 మ్యాచ్లు) ఇవాళే విడుదలైంది. గుజరాత్ తమ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్లో (మార్చి 28) ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోటీపడనున్నాయి. తొలి విడతలో ప్రతి జట్టు తలో నాలుగు మ్యాచ్లు ఆడనుంది.గుజరాత్ టైటాన్స్ తొలి విడత షెడ్యూల్.. - మార్చి 31: GT vs PBKS - ఏప్రిల్ 4: GT vs RR - ఏప్రిల్ 8: GT vs DC - ఏప్రిల్ 12: GT vs LSG దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.
IPL 2026: సన్రైజర్స్ షెడ్యూల్ ఇదే..!
ఐపీఎల్ 2026 తొలి విడత షెడ్యూల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగే 20 మ్యాచ్ల తేదీలు, వేదికలను బీసీసీఐ ఇవాళ (మార్చి 11) ప్రకటించింది. తొలి దశలో ప్రతి జట్టు 4 మ్యాచ్లు ఆడనుంది. ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. సన్రైజర్స్ హైదరాబాద్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా మార్చి 28వ తేదీ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ను విడతల వారీగా ప్రకటిస్తామని బీసీసీఐ ముందే చెప్పిన విషయం తెలిసిందే.తొలి విడతలో మ్యాచ్లు మొత్తం 10 వేదికల్లో (బెంగళూరు, ముంబై, గౌహతి, కొత్త చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) జరుగనున్నాయి. బెంగళూరులో జరిగాల్సిన మ్యాచ్లు మార్చి 13న నిపుణుల కమిటీ అనుమతికి లోబడి ఉంటాయి. తొలి విడతలో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ విడతలో అన్ని జట్లలాగే సన్రైజర్స్ హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్లు ఆడనుంది. టోర్నీ ఓపెనర్లోనే ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీతో తలపడనుంది. సన్రైజర్స్ రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్కతా వేదికగా కేకేఆర్తో జరుగనుంది. మూడో మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో.. నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 11న ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగనుంది. తొలి విడతలో సన్రైజర్స్ తమ హోం గ్రౌండ్ హైదరాబాద్లో ఒకే ఒక మ్యాచ్ (ఏప్రిల్ 5, లక్నోతో) ఆడనుంది. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. లక్నో, పంజాబ్ మ్యాచ్లు మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతాయి.ఐపీఎల్ 2026 కోసం సన్రైజర్స్ జట్టు..సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, రవిచంద్రన్ స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్సే, హర్ష్ దూబే, జాక్ ఎడ్వర్డ్స్, లియామ్ లివింగ్స్టోన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ మావి, పాట్ కమిన్స్ (కెప్టెన్), అమిత్ కుమార్, క్రియాన్స్ ఫులెట్రా, ప్రఫుల్ హింజ్, ఎషాన్ మలింగ, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్, శివంగ్ కుమార్, ఓంకార్ తర్మలే, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ
టైటిల్ నిరీక్షణ ముగించేందుకు... స్విస్ ఓపెన్ బరిలో శ్రీకాంత్
గత ఏడాది రెండు టైటిల్స్కు విజయం దూరంలో ఉండిపోయిన ...
భారత్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్...
భారత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచకప్ హాకీ క్వాలిఫయ...
లక్ష్య సేన్ రెండో‘సారీ’
బర్మింగ్హామ్: బ్రిటిష్ గడ్డపై విజయగర్జన చేయాలని...
IPL 2026: సన్రైజర్స్ షెడ్యూల్ ఇదే..!
ఐపీఎల్ 2026 తొలి విడత షెడ్యూల్ విడుదలైంది. మార్చ...
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ను హెడ్కోచ్ గ...
ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదల
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున...
హండ్రెడ్ లీగ్ వేలం.. టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం
ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ...
క్రీడలు
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
సంజూ భాయ్ ఆట... సెమీస్ బాట... అంతేగా.. అంతేగా (ఫొటోలు)
వీడియోలు
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup 2026: టీమిండియా కు వైఎస్ జగన్ అభినందనలు
గౌతమ్ గంభీర్ సరికొత్త చరిత్ర
చరిత్ర సృష్టించిన భారత్
సామ్సన్ తుఫాన్ ఇన్నింగ్స్.. ఫైనల్లో పవర్ హిట్టింగ్
