Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: Royal Challengers Bengaluru Won By 5 Wkts Vs Gujarat Titans1
గర్జించిన కోహ్లి, పడిక్కల్‌.. ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంత‌గ‌డ్డ‌పై మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), ప‌డిక్క‌ల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. చివ‌ర్లో హైడ్రామా నెల‌కొన్న‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్‌), కృనాల్ పాండ్యా (23 నాటౌట్‌) జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2, సిరాజ్‌, హోల్డ‌ర్‌, మాన‌వ్ సుతార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, సుయాశ్ శ‌ర్మ‌, హాజిల్‌వుడ్ త‌లా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్‌లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్‌వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్‌), హోల్డర్ (23 నాటౌట్‌) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్‌ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్ (14) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్‌కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్‌, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026

Sourav Gangulys Bengal Takes Historic Step For Domestic Success2
సౌరవ్‌ గంగూలీ సంచలన నిర్ణయం

సౌర‌వ్ గంగూలీ నేతృత్వంలోని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్‌, సపోర్ట్ స్టాప్ నియమాకాల్లో పారదర్శకత తీసుకురావడానికి బెంగాల్ క్రికెట్ చారిత్రత్మక అడుగు వేసింది. సీనియర్ పురుషుల జట్టు హెడ్‌ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లాతో క్యాబ్ తెగదెంపులు చేసుకుంది. అంతర్గతంగా జరిగే నియామకాలకు స్వస్తి పలికి, మెరిట్ ఆధారంగా కొత్త కోచ్‌లను ఎంపిక చేయాలని క్యాబ్ నిర్ణయించింది. ఇందుకోసం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీసీసీఐ మాదిరిగానే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు మే 1 సాయంత్రం 5 గంటలలోపు ధరఖాస్తు చేసుకోవచ్చు.కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు అర్హతులు ఇవే👉కనీసం 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు లేదా 1 టెస్ట్, 30 వన్డేలు లేదా 45 టీ20లు ఆడి ఉండాలి👉బీసీసీఐ లెవల్ 2 లేదా లెవల్ 3 కోచింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి👉ఒకవేళ ఆడిన అనుభవం లేకపోతే, సీనియర్ డొమెస్టిక్ జట్లు లేదా వయోపరిమితి జట్లకు 3 నుండి 5 ఏళ్ల పాటు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.👉దరఖాస్తుదారుల వయస్సు 60 ఏళ్ల లోపు ఉండాలి.👉సీనియర్ పురుషల జట్టు, మహిళల జట్టు, ఏజ్ గ్రూపు జట్లు(U-16, U-19, U-23) కోచ్ పదవులను భర్తీ చేయనున్నారు.

Sai Sudharsan Breaks Chris Gayles IPL Record With Stunning Century In RCB3
చరిత్ర సృష్టించిన సుదర్శన్‌.. తొలి ప్లేయర్‌గా

ఐపీఎల్‌-2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సుదర్శన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. గత మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో 'గోల్డెన్ డక్' అయిన సుదర్శన్.. ఈమ్యాచ్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు.ఈ తమిళనాడు క్రికెటర్ ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తొలి రెండు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన సుదర్శన్‌, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. సుదర్శన్‌కు ఇది మూడో ఐపీఎల్ సెంచరీ కావడం​ గమనార్హం.ఈ క్రమంలో సాయిసుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్‌లు పరంగా అత్యంత వేగంగా 2000 పరుగుల మార్కును చేరుకున్న ఆటగాడిగా సాయి సుదర్శన్ రికార్డుల​కెక్కాడు. అతడు కేవలం 47 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(48 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో అభిషేక్ శర్మ(1193) అగ్రస్ధానంలో ఉన్నాడు.బంతులు పరంగా అత్యంతవేగంగా 2000 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే1193 - అభిషేక్ శర్మ1211 - వీరేంద్ర సెహ్వాగ్1306 - రిషబ్ పంత్1326 - యశస్వి జైస్వాల్1353 - యూసుఫ్ పఠాన్1361 - సాయి సుదర్శన్Krunal Pandya ಅವರ ಬೌನ್ಸರ್ ಎಸೆತಕ್ಕೆ Sai Sudharsan ಅಟ್ಟಿದ ಭರ್ಜರಿ ಸಿಕ್ಸರ್!😱🔥ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #RCBvsGT | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL pic.twitter.com/0BTEiT4tnC— Star Sports Kannada (@StarSportsKan) April 24, 2026

Basit ali blasts Hardik Pandya and Mumbai Indians after dismal show in IPL 20264
'సెంచరీలు కొట్టండి.. లేదంటే అంతే మీ పని'

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 103 ప‌రుగుల తేడాతో ముంబై చిత్తు అయింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌రుగుల తేడా ప‌రంగా ముంబై ఇండియ‌న్స్‌కు ఇదే అతి పెద్ద ఓట‌మి.దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనపై ఆ జట్టు యజమాని ఆకాశ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ముంబై డౌగౌట్‌కు దగ్గరలో ఉన్న ఆకాశ్‌.. సోఫాలో నుంచి లేచి నిలబడి.. ‘‘అంతా అయిపోయింది. ఇంకేం చూస్తారు.. పదండి పదండి’’ అన్నట్లుగా ప్రేక్షకులకు సైగ చూస్తూ స్టేడియాన్ని వీడారు. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ అంబానీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై వరుస వైఫల్యాలపై ఆకాశ్ గుర్రుగా ఉన్నారని బసిత్ అలీ అన్నాడు.ఆకాష్ అంబానీకి గనుక కోపం వస్తే పరిస్థితి మరో విధంగా ఉంటుంది. అప్పుడు ఆటగాళ్లను ఆయన దండిస్తాడు. భాయ్ ఇకపై మ్యాచ్‌లు గెలవండి, సెంచరీలు కొట్టండి అని తమ ఆటగాళ్లకు ఆకాష్‌ గట్టిగా చెబుతాడు అని బసిత్ అలీ ఎగతాళిగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ముంబై జట్టు సెలక్షన్‌పై కూడా అతడు విమర్శలు కురిపించాడు. ముఖ్యంగా వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఆటగాడు డానిష్ మలేవార్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అతడు తప్పబట్టాడు. "ఈ కొత్త ఓపెనర్ ఎవరు? అతడిని ముంబై ఎందుకు ఆడిస్తోంది? అతనేమన్నా సిఫార్సుతో జట్టులోకి వచ్చాడా? అని అలీ మండిపడ్డాడు. అయితే ముంబై ఫ్యాన్స్‌ మాత్రం బసిత్‌ అలీకి కౌంటరిస్తున్నారు. ముందు మీ పీఎస్‌ఎల్ సంగతి చూసుకోండి, ఆ తర్వాత ఐపీఎల్‌ గురుంచి మాట్లాడు అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. కాగా ఐపీఎల్‌కు పోటీగా ప్రారంభమైన పీఎస్‌ఎల్‌-2026 సీజన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయింది.

IPL 2026: Royal challengers vs Gujarat titans match live updates5
IPL 2026: గుజ‌రాత్‌పై ఆర్సీబీ ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంత‌గ‌డ్డ‌పై మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), ప‌డిక్క‌ల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. చివ‌ర్లో హైడ్రామా నెల‌కొన్న‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్‌), కృనాల్ పాండ్యా (23 నాటౌట్‌) జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2, సిరాజ్‌, హోల్డ‌ర్‌, మాన‌వ్ సుతార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ206 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐదో వికెట్ కోల్పోయింది. 8 ప‌రుగులు చేసిన ర‌జ‌త్ ప‌టీదార్ మాన‌వ్ సుత‌ర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి సుంద‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు 15.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. టిమ్ డేవిడ్ ఒక్క ప‌రుగుతో క్రీజులో ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న పడిక్కల్‌5 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(16), దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(18) ఉన్నారు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్‌ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన బెతల్‌.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ ముందు భారీ టార్గెట్‌చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ సాయిసుదర్శన్‌ సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. 58 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సుదర్శన్‌.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు.అతడితో పాటు శుభ్‌మన్‌ గిల్‌(32), జోస్‌ బట్లర్‌(25), జాసన్‌ హోల్డర్‌(23) రాణించారు. ఫలితంగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు.గుజరాత్ మూడో వికెట్ డౌన్‌గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన జోస్ బట్లర్‌.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్‌గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 100 ప‌రుగులు చేసిన సాయి సుద‌ర్శ‌న్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 16 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌: 170/2సాయిసుదర్శన్‌ సెంచరీగుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ సాయిసుదర్శన్‌ సెంచరీతో మెరిశాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సుదర్శన్‌ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 155-1గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌128 పరుగుల వద్ద గుజరాత్‌ టైటాన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌.. సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోర్‌:61/07 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 61 ప‌రుగులు చేసింది. క్రీజులో సాయిసుద‌ర్శ‌న్‌(48), శుభ్‌మ‌న్ గిల్‌(11) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న గుజరాత్‌2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(8), శుభ్‌మన్‌ గిల్‌(1) ఉన్నారు.ఐపీఎల్‌-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్‌ ఫిల్‌ సాల్ట్‌ దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్‌ బెతల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గుజరాత్ టైటాన్స్ తరపున అరంగేట్రం చేశాడు.తుది జ‌ట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్

Will RCB make any changes after defeat vs Gujarat Titans?6
ఆర్సీబీ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. తమ ఆఖ‌రి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఓట‌మిపాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్‌.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగే అవకాశముంది. రొమారియో షెపర్డ్ స్దానంలో బెతల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బెత‌ల్ మూడు రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తూ క‌న్పించాడు.బెత‌ల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్ర‌పంచ‌కప్‌-2026 సెమీఫైన‌ల్లో భార‌త్‌పై సంచ‌ల‌న సెంచ‌రీతో మెరిశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులు చేసి టీమిండియాను వణికించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే దూకుడును కనబరిచేందుకు జాకబ్ సిద్దమయ్యాడు.ఇక జోష్ హాజిల్‌వుడ్ స్ధానంలో ​కివీస్ పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. డఫీ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్‌వుడ్ రావడంతో అతడు గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.ఇప్పుడు అతడిని తిరిగి మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ మేనెజ్‌మెంట్ సిద్దమైంది. ఇక ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. నాలుగింట విజయం సాధిం‍చి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, జాకబ్‌ బెతల్‌, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్చదవండి: టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా?

New Zealands Doug bracewell Suspended From Cricket For Two Years7
కివీస్ క్రికెట్‌లో ప్రకంపనలు.. డ్రగ్స్ టెస్టులో దొరికిపోయిన బ్రేస్‌వెల్‌

న్యూజిలాండ్ దిగ్గజ పేస‌ర్‌ డౌగ్ బ్రేస్‌వేల్ డ్రగ్స్ టెస్టులో పట్టుబట్టాడు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతడు కోకైన్ తీసుకున్నట్లు తేలింది. దీంతో అతడిపై ఇంగ్లండ్ అండర్ వేల్స్ క్రికెట్ బోర్డు రెండేళ్ల నిషేధం విధించింది. 2025 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బ్రేస్‌వెల్ ఎసెక్స్ క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు.అయితే ఈ టోర్నీలో భాగంగా సోమ‌ర్‌సెట్‌తో జ‌రిగిన మ్యాచ్ అనంత‌రం సెప్టెంబ‌ర్ 24న బ్రేస్‌వెల్ నమూనాలను సేకరించారు. లండన్‌లోని వాడా (WADA) గుర్తింపు పొందిన ల్యాబొరేటరీలో జరిపిన పరీక్షల్లో, అత‌డు కోకైన్ వాడిన‌ట్లు తేలింది. బ్రేస్‌వెల్ కూడా త‌ను కోకైన్ తీసుకున్న‌ట్లు త‌న త‌ప్పును అంగీక‌రించాడు.దీంతో ఎలాంటి విచార‌ణ అవ‌స‌రం లేకుండానే ఈ కేసును ఈసీబీ ముగించింది. అయితే ఈ నిషేదం గ‌తేడాది నవంబ‌ర్ 27 నుంచి అమలులోకి వ‌స్తోంది. అంటే నవంబర్ 23, 2027 వరకు అత‌డు ఎలాంటి అధికారిక క్రికెట్‌లో పోటీల్లో పాల్గోన‌లేడు.కాగా 35 ఏళ్ల‌ బ్రేస్‌వెల్‌.. న్యూజిలాండ్ త‌ర‌పున ఆడిన అత్యుత్త‌మ ఫాస్ట్ బౌల‌ర్లలో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి చేసిన బ్రేస్‌వేల్‌.. త‌న మూడ‌వ టెస్టులోనే 9 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. అతడు టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు.

Vaibhav Sooryavanshis India Selection Debate Draws Cheeky Remark8
టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా?

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీపై ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, అలస్టైర్ కుక్, అలెక్స్ హార్ట్లీప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్లు తాజాగా వైభ‌వ్ ప్రదర్శనపై 'స్టిక్ టు క్రికెట్' (Stick to Cricket) పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర చర్చ జరిపారు.ఈ సంద‌ర్భంగా వీరంతా వైభ‌వ్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఐర్లాండ్‌తో టూర్‌తో వైభ‌వ్ సీనియ‌ర్ జ‌ట్టులోకి అరంగేట్రం చేస్తాడ‌ని వాన్ జోస్యం చెప్పాడు. వైభ‌వ్ ఒక అద్బుత‌మైన ఆట‌గాడ‌ని, అత‌డి టాలెంట్ చూస్తుంటే ముచ్చ‌టెస్తుంద‌ని అలెక్స్ హార్ట్లీ అభిప్రాయ‌ప‌డ్డాడు.కాగా త‌న అరంగేట్ర ఐపీఎల్ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీతో చెల‌రేగిన 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఐపీఎల్‌-2026లో కూడా అదే దూకుడును కొన‌సాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన సూర్య‌వంశీ, 220.87 స్ట్రైక్ రేటుతో 256 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ల మ‌ధ్య జ‌రిగిన సంబాష‌ణ ఇదేమైఖ‌ల్ వాన్: సూర్య‌వంశీ నిజంగా ఒక సంచ‌ల‌న ఆట‌గాడు, ఈ ఏడాది ఐపీఎల్‌లో అత‌డి స్ట్రైక్ రేట్ 236గా ఉంది.డేవిడ్ లాయిడ్: అత‌డు ఇప్పుడు స్కూల్‌కి వెళ్లాలి క‌దా? మ‌ధ్య‌లో స్కూల్ అలా మానేయ‌కూడ‌దు క‌దా వాన్‌!వాన్‌: అత‌డు మ‌ళ్లీ స్కూల్‌కు వెళ్తాడ‌ని నేను అనుకోను డేవ్‌. వైభ‌వ్ ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో ఉంటాడ‌ని నేను అనుకుంటా? ఒక‌వేళ నేను సెల‌క్ట‌ర్ అయితే ఇంగ్లండ్ సిరీస్ కోసం వైభ‌వ్‌ను క‌చ్చితంగా ఎంపిక చేస్తాను.టఫ్నెల్: అవును క‌చ్చితంగా సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అత‌డు అర్హుడు.అలస్టైర్ కుక్: ఇంత‌కి వైభ‌వ్ ద‌గ్గ‌ర పాస్‌పోర్ట్ ఉందా?(న‌వ్వుతూ)వాన్‌: అత‌డికి 20 ఏళ్లు ఉంటే మనందరం ఆశ్చర్యపోయేవాళ్లం కాదు. కానీ 15 ఏళ్ల‌లోనే ఇలా ఆడుతున్నాడు కాబ‌ట్టి అంద‌రూ జాగ్ర‌త్తగా ఉండాలి. బుమ్రాను సైతం అత‌డు వ‌ద‌ల్లేదు.హార్ట్లీ: వైభ‌వ్‌కు ఆత్మ‌విశ్వాసం ఎక్కువ‌. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అత ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా, నిర్భయంగా ఆడుతున్నాడు. క‌చ్చితంగా అత‌డిని భార‌త జ‌ట్టుకు ఎంపిక చేయాలి.వాన్‌: భార‌త టీ20 జ‌ట్టుకు కొత్త ఓపెన‌ర్ అత‌డే. మరో ఎండ్‌లో జైస్వాల్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ వైభ‌వ్ ప్ర‌ద‌ర్శ‌నల కార‌ణంగా జైశ్వాల్ వెలుగులోకి రాలేక‌పోతున్నాడు.

Felt bad: KKR Coach Who Let Shreyas Iyer Leave Breaks Silence On Decision9
‘అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్నాం’

భారత దేశీ క్రికెట్‌లో కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌కు మంచి పేరుంది. అతడి మార్గదర్శనంలోనే మధ్యప్రదేశ్‌ తొలి రంజీ టైటిల్‌ అందుకుంది. రంజీ 2021-22 సీజన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్‌ పండిట్‌ బాధ్యతలు చేపట్టాడు.చంద్రకాంత్‌ మార్గ నిర్దేశనం, శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) కెప్టెన్సీలో కేకేఆర్‌ 2024లో చాంపియన్‌గా అవతరించింది. అయితే, వీరి కంటే నాటి మెంటార్‌ గౌతం గంభీర్‌కే క్రెడిట్‌ ఎక్కువగా వచ్చింది. ఇక 2024 తర్వాత కేకేఆర్‌ శ్రేయస్‌ను వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ అతడిని ఏకంగా రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది.ఏకంగా ఫైనల్‌కుఅందుకు తగినట్లుగానే శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్‌ను గతేడాది ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఏడాది కూడా అతడి సారథ్యంలో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకుపోతోంది. మరోవైపు.. శ్రేయస్‌ను వదులుకున్న కేకేఆర్‌ వరుస పరాజయాలతో డీలా పడి.. విమర్శలు మూటగట్టుకుంటోంది.ఈ నేపథ్యంలో కేకేఆర్‌ మాజీ హెడ్‌కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకోవడంపై తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ ఆరోజు మేము అతడి సేవలు కోల్పోయాము. శ్రేయస్‌ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌కు ట్రోఫీ అందించాడు.అతడు జట్టును నడిపించే విధానానికి నేను అభిమానిని. అయితే, కొన్నిసార్లు దీర్ఘకాల ప్రయోజనాలు, వ్యూహాల దృష్ట్యా కొంతమంది ప్లేయర్లను వదులుకోవాల్సి వస్తుంది. నిజానికి ఆరోజు కేకేఆర్‌ కోచ్‌గా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను.అందుకే అతడిని వదులుకున్నాముఅయితే, కావాలని మేము అతడిని వదులుకోలేదు. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. శ్రేయస్‌ ఒక్కడినే కాదు.. ఫిల్‌ సాల్ట్‌ వంటి ఆటగాళ్లను కూడా మేము వదిలేశాము. ఏదేమైనా కోచ్‌గా ఉన్న సమయంలో కేకేఆర్‌ యజమానులు షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జై మెహతా, సీఈఓ వెంకీ మైసూర్‌ నాకు అండగా ఉన్నారు’’ అని చంద్రకాంత్‌ పండిట్‌ రెవ్‌స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు.కాగా 2025 సీజన్‌ తర్వాత చంద్రకాంత్‌ పండిట్‌కు ఉద్వాసన పలికిన కేకేఆర్‌.. 2026కు గానూ అభిషేక్‌ నాయర్‌ను హెడ్‌కోచ్‌గా ప్రకటించింది. గతేడాది అజింక్య రహానే కెప్టెన్సీలో పద్నాలుగింట కేవలం ఐదు గెలిచిన కేకేఆర్‌ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికి ఏడింట ఒక్కటి మాత్రమే గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Suzie Bates to retire from international cricket following ICC Women’s T20 World Cup 202610
న్యూజిలాండ్ స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

న్యూజిలాండ్ మ‌హిళా క్రికెట్ దిగ్గ‌జం, వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ సూజీ బేట్స్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జూన్‌-జూలైలో ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రగనున్న ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు బేట్స్ ప్ర‌క‌టించింది.2006లో భార‌త్‌పై అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసిన బేట్స్‌.. త‌న 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. 38 ఏళ్ల బేట్స్ ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. ఇటీవ‌ల సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో బేట్స్ తొడ కండరాల గాయం బారిన ప‌డింది. ప్ర‌స్తుతం ఆ గాయం నుంచి కోలుకుంటున్న బేట్స్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాల‌ని ప‌ట్టుద‌లతో ఉంది.20 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జెర్సీ ధరించినందుకు నేను ఎంతో గ‌ర్వ‌పడుతున్నాను. ఈ కాలం ఇంత వేగంగా గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన యూకే గడ్డపై మరో ప్రపంచకప్ గెలవడమే నా చివరి లక్ష్యం. అందుకోసం నా శక్తి మొత్తాన్ని ధారపోస్తాను.ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాను అని బేట్స్ న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. సూజీ బేట్స్ వ‌న్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఉమెన్స్ క్రికెట‌ర్‌గా కొన‌సాగుతోంది. 181 వ‌న్డేల్లో బేట్స్ 5,964 పరుగులు చేసింది.అదేవిధంగా ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన మ‌హిళా క్రికెట‌ర్‌గా బేట్స్ (4,717 ప‌రుగులు) కొన‌సాగుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 350 మ్యాచ్‌లు ఆడిన మొదటి మహిళా క్రికెటర్ సూజీనే కావ‌డం గ‌మ‌నార్హం.చదవండి: ఆకాశ్‌ అంబానీ ఆగ్రహం.. ఇంకేం చూస్తారు?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement