Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Rohit Sharma Creates History Vs KKR In IPL 2026, Shatters Huge Record1
IPL 2026: రోహిత్‌ శర్మ ఉగ్రరూపం​.. సరికొత్త చరిత్ర

ఐపీఎల్‌ 2026లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ చెలరేగిపోతున్నాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ద సెంచరీ (3 ఫోర్లు, 5 సిక్సర్లు) పూర్తి చేసి ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ రికార్డు నెలకొల్పి, చరిత్ర సృష్టించాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే హిట్‌మ్యాన్‌, మరోసారి అదే తరహా ప్రదర్శనతో రెచ్చిపోయి, ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు (36 మ్యాచ్‌ల్లో 1094 పరుగులు, 6 అర్ద సెంచరీలు, ఓ సెంచరీ) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు డేవిడ్‌ వార్నర్‌ (1093 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో రోహిత్‌, వార్నర్‌ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి (1021), శిఖర్‌ ధవన్‌ (907), సురేశ్‌ రైనా (829) ఉన్నారు.ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీఈ మ్యాచ్‌లో రోహిత్‌ చేసిన 23 బంతుల హాఫ్‌ సెంచరీ, ఐపీఎల్‌లో అతనికి వేగవంతమైందిగా నిలుస్తుంది. అతని గత ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ 25 బంతుల్లో వచ్చింది. 2015 ఎడిషన్‌ ఫైనల్లో సీఎస్‌కేపై ఈ ఫీట్‌ సాధించాడు.మరో మైలురాయిఈ హాఫ్‌ సెంచరీతో రోహిత్‌ ఐపీఎల్‌లో మరో మైలురాయిని తాకాడు. ఈ హాఫ్‌ సెంచరీ అతనికి ఐపీఎల్‌లో 50వది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు విరాట్‌ కోహ్లి (72), డేవిడ్‌ వార్నర్‌ (66), శిఖర్‌ ధవన్‌ (53) ఉన్నారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. కేకేఆర్‌ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్‌ శర్మ (59), రికెల్టన్‌ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్‌ (33 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్‌ గ్రీన్‌ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.

 IPL 2026 Match 2: KKR set 221 runs target to MI2
IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్‌ భారీ స్కోర్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ భారీ స్కోర్‌ చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.రెచ్చిపోయిన రహానేకేకేఆర్‌ కెప్టెన్‌ రహానే లేటు వయసులో రెచ్చిపోయి, కేకేఆర్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. కేవంల 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అతను.. మొత్తంగా 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. రహానేకు జతగా ఓపెనింగ్‌ చేసిన ఫిన్‌ అలెన్‌ కూడా చెలరేగిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖ‌రీదైన విదేశీ ఆట‌గాడిగా నిలిచిన కెమరూన్‌ గ్రీన్‌ దారుణంగా విఫలమయ్యాడు. అలెన్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గ్రీన్‌.. 10 బంతుల్లో బౌండరీ, సిక్సర్‌ సాయంతో 18 ప‌రుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్‌ వేలంలో కేకేఆర్‌ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది.రాణించిన రఘువంశీగ్రీన్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన అంగ్క్క్రిష్‌ రఘువంశీ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా, ఆతర్వాత బ్యాట్‌ ఝులిపించాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. రఘువంశీ మెరుపుల కారణంగానే కేకేఆర్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది.పర్వాలేదనిపించిన రింకూ ఇన్నింగ్స్‌ చివర్లో బరిలోకి దిగిన రింకూ సింగ్‌ తన సహజ శైలిలో మెరుపు బ్యాటింగ్‌ చేయనప్పటికీ పర్వాలేదనిపించాడు. 21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.

IPL 2026: Most Expensive Foreign Buy Cameron Green Flops in KKR Debut Against MI3
అనుకున్న‌దే జ‌రిగింది.. రూ.25 కోట్ల ప్లేయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌ ఆల్‌రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్ పేల‌వంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో అత్యంత ఖ‌రీదైన విదేశీ ఆట‌గాడిగా నిలిచిన గ్రీన్‌.. త‌ను ఆడిన తొలి మ్యాచ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూపలేక‌పోయాడు. వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న గ్రీన్‌ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెన‌ర్లు అజింక్య ర‌హానే(67), ఫిన్ అలెన్(37) అద్భుత‌మైన ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ అలెన్ ఔట‌య్యాక క్రీజులోకి గ్రీన్ వచ్చాడు. గ్రీన్ ఓ ఫోర్‌, సిక్సర్ బాది జోష్‌లో క‌న్పించాడు. కానీ గ్రీన్ త‌న జోరును కొన‌సాగించ‌లేక‌పోయాడు. శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రూథ‌ర్ ఫ‌ర్డ్‌కు క్యాచ్ ఇచ్చి గ్రీన్ ఔట‌య్యాడు.కాగా గతేడాది జ‌రిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి కేకేఆర్‌ మ‌రి కొనుగోలు చేసింది. అయితే చాలా మంది గ్రీన్‌కు అంత ధ‌ర వెచ్చించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇప్పుడు అంద‌రూ అంచ‌నా వేసిన‌ట్లే తొలి మ్యాచ్‌లోనే గ్రీన్ విఫ‌ల‌మ‌య్యాడు. అంత‌కుముందు జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ గ్రీన్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ అదే తీరును కొన‌సాగించేలా క‌న్పిస్తున్నాడు.తుది జట్లు..ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

CSK suffer another blow before IPL 2026 opener4
సీఎస్‌కేకు మరో భారీ షాక్‌.. విధ్వంసకర వీరుడికి గాయం

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. సోమ‌వారం గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ గాయం కార‌ణంగా సీఎస్‌కే ఆడే తొలి మూడు మ్యాచ్‌ల‌కు దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది.రెవ్‌స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. బ్రెవిస్ పక్కటెముకల కండరాల నొప్పి తో బాధపడుతున్నాడు. అత‌డు కోలుకోవ‌డానికి దాదాపు రెండు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్‌-2025 సీజ‌న్ మ‌ధ్య‌లో సీఎస్‌కేతో బ్రెవిస్ చేరాడు. గ‌త సీజ‌న్‌లో బ్రెవిస్ దుమ్ములేపాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 225 పరుగులు చేసి స‌త్తాచాటాడు. ఆ త‌ర్వాత సౌతాఫ్రికా లీగ్ 2025-26లో కూడా అత‌డు త‌న ప‌వ‌ర్ చూపించాడు. ప్రిటోరియా తరఫున 12 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. అటువంటి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్ గాయం బారిన ప‌డ‌డం సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మ‌రోవైపు ఎంఎస్ ధోని కూడా కండ‌రాల గాయంతో స‌త‌మ‌త‌వుతున్నాడు. అత‌డు దాదాపు సీఎస్‌కే ఆడే ఆరు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు ఈ జాబితాలో బ్రెవిస్ కూడా చేరాడు. అంత‌కంటే ముందు ఆసీస్ స్పీడ్ స్టార్ నాథ‌న్ ఎల్లీస్ ఏకంగా సీజ‌న్ మొత్తానికే దూర‌మ‌య్యాడు.ఐపీఎల్‌-2026 సీఎస్‌కే జ‌ట్టురుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, శివమ్ దూబే, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, ఓవర్సీస్, ముకేష్మీ చౌద్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అకేల్ హోసేన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ (వికెట్ కీప‌ర్‌), మాథ్యూ షార్ట్, అమన్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్.

IPL 2026, KKR VS MI: Sunil Narine creates history for Most matches by an overseas player in the IPL5
చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 29) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (190) ఆడిన విదేశీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో తన దేశీయ (వెస్టిండీస్‌) సహచరుడు కీరన్‌ పోలార్డ్‌ను (189) అధిగమించాడు. ఈ విభాగంలో నరైన్‌, పోలార్డ్‌ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌ (184), డేవిడ్‌ వార్నర్‌ (184), డ్వేన్‌ బ్రావో (161) ఉన్నారు. నరైన తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఆడిన 190 మ్యాచ్‌లు కేకేఆర్‌ తరఫునే ఆడటం మరో విశేషం.మ్యాచ్‌ విషయానికొస్తే.. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్‌ గెలిచిన ఆనందం వారికి ఎంతో సేపు మిగల్లేదు. హార్దిక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ పవర్‌ ప్లే ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకుంటూ పేట్రేగిపోతుంది. ఓపెనర్లు అజి​ంక్య రహానే (10 బంతుల్లో 21; 3 సిక్సర్లు), ఫిన్‌ అలెన్‌ (14 బంతుల్లో 32; ఫోర్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. 4 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 57-0గా ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

CSK to miss Thalas services for 6 IPL 2026 games, return date revealed6
ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

ఐపీఎల్‌-2026 సీజన్ ఆరంభానికి ముందే ఎంఎస్ ధోని రూపంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిక్క కండరాల గాయంతో ధోని.. తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడని సీఎస్‌కే మేనెజ్‌మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది. అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఎంఎస్ కోలుకోవడానికి నాలుగు నుంచి వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అయితే మిస్టర్ కూల్ ఇప్పుడు ఏప్రిల్ చివరి వారం వరకు అందుబాటులో ఉండకపోవచ్చు అని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.అంటే ధోని దాదాపు 6 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ధోని తిరిగి మళ్లీ ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశముంది. ధోని స్ధానంలో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ధోనికే ఇదే ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌ అయ్యే అవకాశముంది. దీంతో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.ధోనీ దూరమయ్యే మ్యాచ్‌లు ఇవే: రాజస్థాన్ రాయల్స్ (మార్చి 30), పంజాబ్ కింగ్స్ (ఏప్రిల్ 3), ఆర్సీబీ (ఏప్రిల్ 5), ఢిల్లీ క్యాపిటల్స్ (ఏప్రిల్ 11). కేకేఆర్‌(ఏప్రిల్‌ 14), ఎస్‌ఆర్‌హెచ్‌(ఏప్రిల్‌ 18)

IPL 2026 Match 2: MI vs KKR Updates and Highlights7
రోహిత్‌ శర్మ 78 (38) ఔట్‌

రోహిత్‌ శర్మ 78 (38) ఔట్‌11.5వ ఓవర్‌- 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో అనుకూల్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. రికెల్టన్‌కు (67) జతగా సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌కేకేఆర్‌ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్‌ శర్మ (59), రికెల్టన్‌ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ ఎంతంటే..?టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్‌ (33 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (37) సైతం మెరుపులు మెరిపించాడు. భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్‌ గ్రీన్‌ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌18.3వ ఓవర్‌- 205 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి రఘువంశీ (51) ఔటయ్యాడు. రహానే (67) ఔట్‌13.3వ ఓవర్‌- 146 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే (67) ఔటయ్యాడు. రఘువంశీ​కి (17) జతగా రింకూ సింగ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. గ్రీన్‌ ఔట్‌8.5 ఓవర్‌- 109 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి కెమరూన్‌ గ్రీన్‌ (18) ఔటయ్యాడు. రహానేకు (49) జతగా రఘువంశీ క్రీజ్‌లోకి వచ్చాడు. తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌5.2 ఓవర్‌- 69 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి ఫిన్‌ అలెన్‌ (37) ఔటయ్యాడు. రహానేకు (28) జతగా గ్రీన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 29) జరుగుతున్న ఐపీఎల్‌ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

Indian PM Narendra Modi Brings Up Auqib Nabi Before IPL Debut8
ప్రధాని మోదీ నోట సాధారణ క్రికెటర్‌ మాట

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఓ సాధారణ క్రికెటర్‌ మాట వినిపించింది. ఇవాళ (మార్చి 29) జరిగిన 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమంలో మోదీ ఆ క్రికెటర్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ క్రికెటర్‌ పేరు ఆకిబ్‌ నబీ. జమ్మూ అండ్‌ కశ్మీర్‌కు చెందిన ఈ 29 ఏళ్ల కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్‌ బౌలర్‌, ఇటీవల తన జట్టు తొలి రంజీ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. సీజన్‌ మొత్తంలో 60 వికెట్లు తీసి, తన జట్టు 70 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఈ కారణంగానే మోదీ నబీ పేరును మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. నబీ కారణంగా జమ్మూ అండ్‌ కశ్మీర్‌ సాధించిన విజయం అక్కడి యువతలో క్రీడలపై ఉత్సాహం పెంచిందని అన్నారు. నబీ స్పూర్తితో రాబోయే రోజుల్లో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం​ చేశారు. ఓ సాధారణ క్రికెటర్‌ మాట ప్రధాని నోట రావడంతో అతని పేరు సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.దేశవాలీ క్రికెట్‌లో ఇప్పటికే పేరు గడించిన నబీ, త్వరలో ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్‌ (2026) వేలంలో నబీని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.8.40 కోట్ల భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. రూ.30 లక్షల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన నబీ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వంటి ఫ్రాంచైజీలు పోటీపడినా, చివరికి అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. ఈ డీల్‌తో నబీ జీవితమే మారిపోనుంది. ఐపీఎల్‌లో అతను సత్తా చాటగలిగితే, టీమిండియా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించి మిచెల్‌ స్టార్క్‌ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానం ఖాళీగా ఉంది. పవర్‌ప్లేలో బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేయగల నబీ ఆ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పేసర్లు లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా మధ్య ఓవర్లలో బౌలింగ్‌ చేయడం ఇష్టపడతారు కాబట్టి, నబీ పవర్‌ప్లేలో కీలకంగా మారవచ్చు. ఢిల్లీ ఏప్రిల్‌ 1న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2026 ప్రయాణం మొదలుపెడుతుంది.

Harbhajan Singh Blasts Troll On X In Ugly War Of Words Over R Ashwin Comment9
'అశ్విన్‌ నీ కెరీర్‌ను ముగించాడు'.. ట్రోలర్స్‌పై భజ్జీ ఫైర్‌

ఐపీఎల్‌-2026 సీజన్‌ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ హార్భజన్‌ సింగ్‌, ఓ క్రికెట్‌ అభిమాని మధ్య ఎక్స్‌ వేదికగా జరిగిన మాటల యుద్దం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.ఏం జరిగిందంటే?ఐపీఎల్‌-19వ సీజన్‌లో హార్భజన్‌ హిందీ కామెంటటేర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదే మ్యాచ్‌లో మరో దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ హిందీ వ్యాఖ్యతగా డెబ్యూ చేశాడు. దీనిపై ఒక అభిమాని ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ "అశ్విన్ రాకతో హర్భజన్ కామెంటరీ కెరీర్ ముగిసిపోతుంది.గతంలో టీమిండియాలో హర్భజన్ స్థానాన్ని అశ్విన్ ఎలా భర్తీ చేసి అతని అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాడో, ఇప్పుడు కామెంటరీలో కూడా అలాగే జరుగుతుంది" అని వెటకారంగా పోస్ట్ చేశాడు.అంతేకాకుండా హర్భజన్, సెహ్వాగ్, సిద్ధూ వంటి హిందీ కామెంటటర్ల కంటే ఇయాన్ బిషప్ అసలైన భారతీయుడిలా కన్పిస్తున్నడు అని పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన భజ్జీ సదరు యూజర్‌కు సరైన కౌంటరిచ్చాడు.ఏనుగు బజారులో వెళ్తుంటే వేల కుక్కలు మొరుగుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో టామీ అంటూ హార్భజన్‌ రిప్లై ఇచ్చాడు.శునకాలకు నెయ్యి అరగదు. అలాగే నీలాంటి వాళ్లకు నా సమాధానం ఆర్ధం కాదు. వెళ్లిపో టామీ అంటూ రెండో పోస్ట్‌కు టర్బనేటర్ తనదైన శైలిలో సమాధనమిచ్చాడు.చదవండి: IPL 2026: 'రెండేళ్ల నిషేధం సరిపోదు'.. బెన్ డ‌కెట్‌పై గ‌వాస్క‌ర్ ఫైర్‌

Mumbai Player Jailed In T20 World Cup 2026 Case10
టీ20 వరల్డ్‌ కప్‌ కేసులో ముంబై క్రికెటర్‌ అరెస్ట్‌

భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 వరల్డ్‌కప్‌ 2026కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్‌ అరెస్ట్‌ అయ్యాడు. ముంబై అండర్‌ 19 మాజీ ఆటగాడు బల్వంత్‌ సింగ్‌ స్వరూప్‌ సింగ్‌ సోధాను టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ కేసులో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతగాడు సాధారణ టికెట్‌ను రూ. 25000కి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, కాల్‌ డేటా రికార్డులను పరిశీలించగా విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్‌ మంజూరైంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌ 2026 భారత్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను, ఓవరాల్‌గా మూడో టీ20 ప్రపంచకప్‌ను కైవసం​ చేసుకుంది.ఈ టోర్నీ గ్రూప్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. సూపర్‌-8లో సౌతాఫ్రికా మినహా జింబాబ్వే, వెస్టిండీస్‌పై అద్భుత విజయాలు సాధించి, సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టి20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

Advertisement
Advertisement
 
Advertisement