ప్రధాన వార్తలు
‘అహం’ వదిలి మైదానానికి వస్తా!
లక్నో: భారత క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రవీంద్ర జడేజా సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్ మ్యాచ్లో ప్రభావవంతమైన ప్రదర్శన కనబర్చాడు. అటు బ్యాటింగ్లో మెరుగైన స్కోరు సాధించిన అతను, కట్టుదిట్టమైన బౌలింగ్తో లక్నో సూపర్ జెయింట్స్ను నిలువరించి రాజస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత కొన్ని మ్యాచ్లలో జడేజా బౌలర్గా తన పూర్తి స్థాయి నాలుగు ఓవర్ల కోటా కూడా వేయలేదు. దీనిపై అతను స్పందించాడు. జట్టు కోణంలోనే అంతా ఆలోచించాలని, ఏ రూపంలోనైనా టీమ్కు ఉపయోగపడటమే తన పని అని అతను వ్యాఖ్యానించాడు. ‘నేను మైదానానికి వస్తున్నప్పుడే నా అహాన్ని హోటల్ రూంలో వదిలి బయలుదేరతాను. ఆ రోజు టీమ్కు ఎలా ఉపయోగపడగలనో అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప మిగతా విషయాలు కాదు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ విషయానికి వస్తే చివరి వరకు నిలబడాలని పట్టుదలగా నిర్ణయించుకున్నా. ఎందుకంటే 17 లేదా 18వ ఓవర్లో అవుటైపోతే మేం 159 వరకు చేరేవాళ్లం కాదు. కనీసం 20–25 పరుగులు తగ్గేవి. అప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించడం లక్నోకు సులువయ్యేది. టి20 మ్యాచ్లలో ప్రతీ పిచ్, పరిస్థితులు భిన్నంగా ఉండాయి కాబట్టి దానికి తగినట్లుగా ఆడాలి. బౌలింగ్లో ఫలానా ప్రత్యర్థి బ్యాటర్ నా బౌలింగ్ను సులువుగా ఆడతాడని జట్టు భావిస్తే అర్థం చేసుకోగలను. అది జరిగినా, జరగకపోయినా ఆటలో భాగంగానే భావిస్తాను’ అని జడేజా చెప్పాడు. చివరి ఓవర్ మయాంక్ యాదవ్ వేస్తాడని ముందే ఊహించి దానికి తగినట్లుగా సిద్ధమయ్యానన్న జడేజా ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టడంలో సఫలమయ్యాడు. బౌలింగ్లో వేగాన్ని సమర్థంగా వాడుకునే మార్‡్ష, పూరన్లకు స్లో బంతులు వేసి కట్టడి చేయగలిగినట్లు జడేజా వివరించాడు.
వారెవ్వా వోల్వార్ట్
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో మ్యాచ్లోనూ ఓడి 0–3తో సిరీస్ కోల్పోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాపై భారత్కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ లౌరా వోల్వార్ట్ (53 బంతుల్లో 115; 14 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కింది. వోల్వార్ట్ 47 బంతుల్లోనే శతకం సాధించి మహిళల టి20ల్లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. మరో ఓపెనర్ సునె లుస్ (42 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో మెరిసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 15.2 ఓవర్లలోనే 183 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు సునాయాసంగా గెలుపొందింది. మహిళల టి20ల్లో ఇది మూడో అతిపెద్ద లక్ష్యఛేదన. వెస్టిండీస్ (213; ఆస్ట్రేలియాపై), ఇంగ్లండ్ (199; భారత్పై) ముందున్నాయి. నాలుగో టి20 మ్యాచ్ శనివారం జొహన్నెస్బర్గ్లోనే జరుగుతుంది.
నైట్రైడర్స్ ‘హోం’లో ఒలింపిక్స్
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్స్లో 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ పునరాగమనం చేస్తుండగా ఇప్పుడు ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్లు నిర్వహించే ప్రధాన వేదిక ఖరారైంది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ కూడా భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ‘పొమోనా’లో కొత్తగా నిర్మిస్తున్న మైదానాన్ని క్రికెట్ ప్రధాన వేదికగా నిర్ణయించారు. ఈ మైదానం ఐపీఎల్ టీమ్ కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యానికి చెందినది కావడం విశేషం. అమెరికాలో 2023 సీజన్ నుంచి నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో లాస్ ఏంజెలిస్ నైట్రైడర్స్ జట్టు కూడా ఉంది. ఈ టోర్నీలో తమ ‘హోం’ గ్రౌండ్ కోసం నైట్రైడర్స్ ఈ స్టేడియాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వచ్చే రెండేళ్లలో మైదానం నిర్మాణం పూర్తి చేసుకొని ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో క్రికెట్ పురోగతి కొత్త మైలురాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా అన్నారు. ‘అంతర్జాతీయ క్రీడగా క్రికెట్ విస్తరించే క్రమంలో ఇది మరో కొత్త మలుపు. ఒలింపిక్స్లో పాల్గొని ఆట స్థాయిని పెంచడమే మా లక్ష్యం. ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనానికి సంబంధించి ఈ స్టేడియం నిర్మాణం కొత్త మైలురాయి. ఒలింపిక్స్లో ఈ మైదానం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని మా విశ్వాసం’ అని ఆయన చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజోగ్ గుప్తా, నైట్రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్, పొమోనా నగర మేయర్ టిమ్ సాండోవల్ పాల్గొన్నారు.
విజయోస్తు!
నాలుగేళ్ల క్రితం జరిగిన అద్భుత ఘట్టాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత పురుషుల జట్టు... సెమీఫైనల్ చేరడమే తొలి లక్ష్యంగా భారత మహిళల జట్టు... ప్రతిష్టాత్మక టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ థామస్ కప్, ఉబెర్కప్లలో బరిలోకి దిగనున్నాయి. హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ అసాధారణ ప్రదర్శనతో 2022లో భారత పురుషుల జట్టు తొలిసారి థామస్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప తదితరుల మెరుపులతో 2014, 2016లలో వరుసగా రెండు పర్యాయాలు భారత మహిళల జట్టు ఉబెర్ కప్లో సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ఈసారి అటు పురుషుల జట్టుతోపాటు ఇటు మహిళల జట్టుకు గ్రూప్ దశలో కాస్త అనుకూలమైన ‘డ్రా’నే పడింది. తమ గ్రూప్లో టాప్–2లో నిలిచి ముందుగా క్వార్టర్ ఫైనల్ చేరడమే భారత జట్ల లక్ష్యం కానుంది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ నాకౌట్ పోరులో నెగ్గితే సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకుంటాయి. బలాబలాలను పరిశీలిస్తే భారత మహిళల జట్టుతో పోలిస్తే భారత పురుషుల జట్టుకు ఈసారి పతకం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రణయ్... కిడాంబి శ్రీకాంత్... లక్ష్య సేన్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఈ ఐదుగురికి ఎలా ఆడితే థామస్ కప్లో టైటిల్ సాధించగలమో తెలుసు. 2022లో టీమిండియాకు థామస్ కప్ దక్కడంలో ఈ ఐదుగురు కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ ఐదుగురికి ఆయుశ్ శెట్టి రూపంలో రైజింగ్ స్టార్ జత కలిశాడు. ఫలితంగా 2022 చాంపియన్ భారత జట్టు ఈసారి థామస్ కప్లో టైటిల్పై గురి పెట్టింది. సింగిల్స్లో రెండు, డబుల్స్లో ఒక విజయం లభిస్తే మ్యాచ్ వశమవుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి బలగంతో థామస్ కప్లో అడుగు పెట్టిన భారత జట్టు రెండోసారి అద్భుతం చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో ఆయుశ్ శెట్టి రన్నరప్గా నిలిచి తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్ చేరిన క్రమంలో టాప్–10లోని ముగ్గురు క్రీడాకారులను ఆయుశ్ ఓడించాడు. ఈ నేపథ్యంలో ఆయుశ్, లక్ష్య సేన్, ప్రణయ్, శ్రీకాంత్, సాత్విక్–చిరాగ్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే భారత జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం కష్టమేమీ కాదు. నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్లో కెనడాతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత 27న ఆ్రస్టేలియాతో... 29న చైనాతో టీమిండియా మ్యాచ్లున్నాయి. మరోవైపు భారత మహిళల జట్టు ఆశలన్నీ సింగిల్స్ ప్లేయర్స్పైనే ఆధారపడి ఉన్నాయి. డబుల్స్ స్టార్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ వైదొలగడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపకుండా ఉండాలంటే... మూడు సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్లు గెలవాల్సి ఉంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ను నేడు ఆతిథ్య డెన్మార్క్ జట్టుతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే చైనా, ఉక్రెయిన్ జట్లు కూడా ఉన్నాయి. చైనాపై భారత్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో... క్వార్టర్ ఫైనల్ చేరాలంటే డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లపై భారత్ నెగ్గాల్సి ఉంటుంది. డెన్మార్క్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం నాకౌట్ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డెన్మార్క్తో మ్యాచ్ అనంతరం భారత్ రెండో మ్యాచ్ను 25న ఉక్రెయిన్తో, మూడో మ్యాచ్ను 27న చైనాతో ఆడుతుంది. థామస్ కప్ టోర్నీకి భారత జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, హరిహరన్, ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల. ఉబెర్ కప్ టోర్నీకి భారత జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా, తనీషా క్రాస్టో, ప్రియ కొంజెంగ్బమ్, శ్రుతి మిశ్రా, సెల్వం కవిప్రియ, సిమ్రన్.
బ్యాటింగ్లో నజు్మల్... బౌలింగ్లో ముస్తఫిజుర్
చట్టోగ్రామ్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్ జట్టు... న్యూజిలాండ్పై 2–1తో వన్డే సిరీస్ చేజిక్కించుకుంది. గురువారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 55 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఇటీవల వెస్టిండీస్, పాకిస్తాన్పై వన్డే సిరీస్లు నెగ్గిన బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజు్మల్ హుసేన్ షాంటో (119 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో విజృంభించగా... వికెట్ కీపర్ లిటన్ దాస్ (91 బంతుల్లో 76; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకదశలో 32/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఆదుకుంది. షాంటో, లిటన్ నాలుగో వికెట్కు 160 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ కోలుకుంది. కివీస్ బౌలర్లలో విలియమ్ రూర్కె 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 44.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఫోక్స్క్రాఫ్ట్ (72 బంతుల్లో 75; 7 సిక్స్లు), నిక్ కెల్లీ (80 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ముస్తఫిజుర్ రహమాన్ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నహీద్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.
బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేలవ ఫామ్ కొనసాగుతోంది. కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు.తొలుత బౌలింగ్లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన హార్దిక్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్ షాట్ ఆడి తన వికెట్ను వికెట్ను కోల్పోయాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్ అంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.సీఎస్కే ఘన విజయంఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు, గుర్జప్నీత్, కాంబోజ్, ముఖేష్ చౌదరి, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ విజయంతో సీఎస్కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.
ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్ బ్రెవిస్(21), గైక్వాడ్(22) రాణించారు. ఈ ఏడాది సీజన్లో సంజూకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్, అశ్విని కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.అకిల్ మ్యాజిక్అనంతరం 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే స్పిన్నర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(36), తిలక్ వర్మ(37) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ముంబై ఇండియన్స్కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం.
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి శతక్కొట్టాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ముంబై బౌలర్లను తనదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా టీ20 క్రికెట్లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సూర్య సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్కే బ్యాటర్గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్కే బ్యాటర్ కూడా ముంబైపై ముడెంకల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్ నిలిచాడు.టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్లోకి విధ్వంసకర ప్లేయర్
ఢిల్లీ క్యాపిటల్స్లోకి విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే వైదొలిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్ధానాన్ని మరో ఇంగ్లీష్ ప్లేయర్ రెహాన్ అహ్మద్తో ఢిల్లీ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనెజ్మెంట్ గురువారం అధికారంగా ప్రకటించింది.ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సరైన ఆల్రౌండర్లు లేరు. కెప్టెన్ అక్షర్ పటేల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆల్రౌండర్ అయిన రెహాన్తో ఢిల్లీ ఒప్పందం కుదర్చుకుంది. రెహాన్ అహ్మద్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అతడు లెగ్ స్పిన్తో పాటు లోయార్డర్లో దూకుడుగా బ్యాటింగ్ కూడా చేయగలడు.కాగా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ 'ది హండ్రెడ్' టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు తరపున ఆడనున్నాడు. సదర్ బ్రేవ్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమానార్హం. అతడికి వైట్బాల్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 5 టెస్టులు, 9 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.అయితే ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా హర్మన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3016) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. హర్మన్ ఇప్పటివరకు భారత కెప్టెన్గా 3017 పరుగులు చేసింది. ఈ జోహాన్స్బర్గ్ వన్డే హర్మన్ తన విశ్వరూపం ప్రదర్శించింది. హర్మన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్గా నిలిచింది.మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీరేహర్మన్ప్రీత్ కౌర్-3017చమరి అటపట్టు-3016మెగ్ లానింగ్- 2619షార్లెట్ ఎడ్వర్డ్స్-2529సూజీ బేట్స్-2236చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచలనం!
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నాలుగేళ్ల కాలానికి తెలంగ...
కేడీ జాదవ్కు ‘పద్మవిభూషణ్’పై తేల్చండి!
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు ...
నా ఫేవరెట్ నేనే...
సాధారణంగా ఏ రంగంలో అయినా... ఉన్నత లక్ష్యాలను నిర్ద...
భారత 95వ గ్రాండ్మాస్టర్గా అరోణ్యక్ ఘోష్
రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్కు చెందిన య...
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార...
ఢిల్లీ క్యాపిటల్స్లోకి విధ్వంసకర ప్లేయర్
ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుల...
టీమిండియా కెప్టెన్ వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొన...
‘ఆర్థిక సాయం వద్దు.. ఆ ఒక్క పని చేయండి ప్లీజ్’
అఫ్గనిస్తాన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ గత ...
క్రీడలు
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)
తిరుమల శ్రీవారి సేవలో సినీ, క్రీడా ప్రముఖులు (ఫొటోలు)
వీడియోలు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
అభిషేక్ సిక్సర్లు .. వెంకీ మామ స్టెప్పులు కావ్య పాప నవ్వులే నవ్వులు
హార్దిక్ తో గొడవ పై కృనాల్ పాండ్యా క్లారిటీ
సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు
హైదరాబాద్ లో ఢిల్లీ చిత్తు.. శతక్కొట్టిన అభిషేక్
పిచ్చి కూతలు కూసారు.. పిక్చర్ చూపించాడు.. తెలుగోడి విశ్వరూపం
నిమ్మకాయలకు వికెట్లు IPLలో బ్లాక్ మ్యాజిక్
ఇన్స్టా పోస్ట్కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్
ఎవ్వడిని వదల్లేదు, RCB పొగరు దింపిన మిల్లర్
కలిసిరాని గ్రీన్ జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
