Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India to face Pakistan in Under 20 South Asian Football Tournament today1
భారత్‌ X పాకిస్తాన్‌

మాలె (మాల్దీవులు): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటుండగా... పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీ పడుతోంది. శనివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండిట్లో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా... మన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన పాకిస్తాన్‌ జట్టు భారత్‌పై ఏమాత్రం పోరాడుతుందో చూడాలి.

World Cup Shooting Shotgun Tournament from today2
కైనన్, రాజేశ్వరి జోడీగా...

టాంజియర్‌ (మొరాకో): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) కొత్త సీజన్‌కు నేటి నుంచి తెర లేవనుంది. నాలుగు షాట్‌గన్‌ ప్రపంచకప్‌లలో భాగంగా తొలి టోర్నీ నేడు మొదలుకానుంది. తొలి రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. శుక్రవారం స్కీట్‌ ఈవెంట్‌లో పోటీలు ఆరంభమవుతాయి. భారత్‌ నుంచి 12 మంది షూటర్లు పతకాల వేటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ షూటర్, రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్‌ చెనాయ్, అతని భార్య రాజేశ్వరి కుమారి వ్యక్తిగత విభాగంతోపాటు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కలిసి ఆడనున్నారు. ఇటీవల కైనన్, రాజేశ్వరి వివాహం జరిగింది. 35 ఏళ్ల కైనన్‌ 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో స్వర్ణం, వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. 34 ఏళ్ల రాజేశ్వరి 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో టీమ్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. మరోవైపు ట్రాప్‌ ఈవెంట్‌లో వెటరన్‌ షూటర్‌ జొరావర్‌ సింగ్‌ సంధూ ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’లో భాగంగా ఈ టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. 48 ఏళ్ల జొరావర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జొరావర్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. తద్వారా కర్ణీ సింగ్‌ (1962లో), మానవ్‌జీత్‌ సింగ్‌ సంధూ (2006లో) తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన మూడో భారతీయ ట్రాప్‌ షూటర్‌గా జొరావర్‌ గుర్తింపు పొందాడు. భారత షూటింగ్‌ జట్టు: పృథ్వీరాజ్‌ తొండైమన్, కైనన్‌ చెనాయ్, భౌనీశ్‌ మెందిరత్తా, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి, ఆషిమా అహ్లావత్‌ (ట్రాప్‌). మాన్‌ సింగ్, జ్యోతిరాదిత్య సింగ్‌ సిసోడియా, పరంపాల్‌ సింగ్, యశస్వి రాథోడ్, దర్శన రాథోడ్, మహేశ్వరి చౌహాన్‌ (స్కీట్‌). కైనన్‌ చెనాయ్‌–రాజేశ్వరి కుమారి, పృథ్వీరాజ్‌ తొండైమన్‌–కీర్తి గుప్తా (మిక్స్‌డ్‌ టీమ్‌).

Indian womens cricket team captain Harmanpreet Kaur on T20 World Cup 3
ఎక్కడైనా గెలుస్తాం

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. గతేడాది స్వదేశంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తొలిసారి వరల్డ్‌కప్‌ చేజిక్కించుకుంది. ఆ విజయంతో జట్టులో కొత్త శక్తి వచ్చినట్లయిందని.. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా మరిన్ని టైటిల్స్‌ గెలవగలమనే నమ్మకం కలిగిందని హర్మన్‌ చెప్పింది. ఈ ఏడాది జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌ వేదికగా టి20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం హర్మన్‌ మాట్లాడుతూ... ‘ఏ రంగంలోనైనా విజయానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. క్రీడల్లో కూడా అంతే. మీరు ఏదో ఒక టైటిల్‌ సాధిస్తేనే తగినంత గుర్తింపు లభిస్తుంది. లేకపోతే పడ్డ కష్టానికి విలువ ఉండదు. మా జట్టు వన్డే ప్రపంచకప్‌ గెలవడం వెనక సీనియర్ల కృషి ఎంతో ఉంది. వారు ఎప్పటి నుంచో కష్టపడి జట్టును ఈ స్థాయికి చేర్చారు. ఇన్ని కష్టాల తర్వాత కూడా తగిన గుర్తింపు దక్కకపోతే దానికి అర్థమేలేదు. కాబట్టి ఒక టైటిల్‌ చాలా అవసరమైంది. అది సాధించిన తర్వాత కుటుంబసభ్యులు, అభిమానులు, మీడియా ఇలా అందరి నుంచి మాకు అనూహ్య స్పందన లభించింది. దీని కోసమే మేము ఎంతో కాలంగా ఎదురుచూశాం. వన్డే వరల్డ్‌కప్‌తో మాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తాం. వన్డే వరల్డ్‌కప్‌ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా గెలవగలమనే నమ్మకం ఉంది. ఇటీవల ఆ్రస్టేలియా పర్యటనలో ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా... ఆ టూర్‌ మా ప్లేయర్లకు ఎంతో నేరి్పంది. ఇలాంటి మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లు మరిన్ని జరగాలి. వాటిలో సవాళ్లు ఎక్కువ ఎదురవుతాయి. అప్పుడే ప్లేయర్లు మరింత రాటుదేలుతారు’ అని వివరించింది.

India won Two gold medals at the Asian meet4
లాక్రాస్‌లో భారత్‌ లాజవాబ్‌

న్యూఢిల్లీ: ఆసియా మీట్‌లో పసిడి పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల లాక్రాస్‌ జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా బుధవారం అభినందించారు. సుదీర్ఘ విరామం అనంతరం 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనున్న ఈ క్రీడలో భారత జట్లు సత్తా చాటాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌ వేదికగా... అసియా లాక్రాస్‌ గేమ్స్‌లో భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాయి. పురుషుల ఫైనల్లో భారత జట్టు ఇరాక్‌పై గెలుపొందగా... మహిళల తుదిపోరులో పాకిస్తాన్‌ను భారత్‌ చిత్తుచేసి విజేతగా నిలిచింది. 2024లో భారత మహిళల జట్టు ఈ క్రీడలో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... గతేడాది పరుషుల జట్టు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. అనతి కాలంలోనే నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న మన జట్లు... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడా మంత్రి ఆకాంక్షించారు. ‘భారత్‌లో లాక్రాస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రీడకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ క్రీడలో ఆసియా స్థాయిలో భారత్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఇది మన జట్ల కృషి, పట్టుదలకు నిదర్శనం. ఇక 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి’ అని మాండవీయా అన్నారు. 1904 ఒలింపిక్స్‌లో ఈ ఆటను తొలిసారి విశ్వక్రీడల్లో ప్రవేశ పెట్టారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఇది పతక క్రీడగా కొనసాగింది. ఆ తర్వాత విశ్వక్రీడల జాబితా నుంచి లాక్రాస్‌ను తొలగించారు. 1928, 1932, 1948లో జరిగిన ఒలింపిక్స్‌లో లాక్రాస్‌ను ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అమెరికా వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో ఈ ఆట దర్శనమివ్వనుంది. 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత పురుషుల, మహిళల జట్లు... త్వరలో చైనా వేదికగా జరగనున్న ఆసియన్‌ లాక్రాస్‌ గేమ్స్‌లో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా వేదికగా జరగనున్న ఆసియా–పసిఫిక్‌ చాంపియన్‌షిప్‌లోనూ పోటీపడతాయి. భారత పురుషుల లాక్రస్‌ జట్టుకు తెలంగాణ ప్లేయర్‌ అనుదీప్‌ రెడ్డి సారథిగా వ్యవహరిస్తుండగా... ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు. అసలు ఏంటీ లాక్రాస్‌... ఈ ఆటకు అమెరికాలో ఆదరణ ఎక్కువ. హాకీ, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ కలగలిపినట్లు ఉండే ఈ ఆటలో... ఒక్కో జట్టు తరఫున 10 మంది పోటీ పడతారు. కాకపోతే ఒలింపిక్స్‌లో ఆడే జట్టులో మాత్రం ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. హాకీ స్టిక్‌ లాంటి పొడవైన కర్ర పై భాగంలో ప్రత్యేక నెట్‌ ఉంటుంది. రబ్బర్‌ బంతిని పట్టుకోవడానికి సహచరులకు పాస్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌లో ఎక్కువసార్లు ఎవరు బంతిని పంపగలిగితే వారు విజేతగా నిలుస్తారు. అచ్చం ఫుట్‌బాల్‌ మాదిరిగానే అటాకర్స్, మిడ్‌ఫీల్డర్స్, డిఫెండర్స్, గోలీ (గోల్‌ కీపర్‌) స్థానాలు ఉంటాయి. ప్లేయర్లు గాయపడే అవకాశముండటంతో... మైదానంలో ఉన్నవాళ్లంతా హెల్మెట్‌లు, గ్లౌవ్స్, ప్యాడ్స్‌ ధరించి బరిలోకి దిగుతారు.

IPL Governing Council clarifies on impact sub 5
‘ఇంపాక్ట్‌’ నిబంధన కొనసాగుతుంది

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో గత కొంత కాలంగా చర్చకు కారణమవుతున్న ‘ఇంపాక్ట్‌ సబ్‌’ నిబంధనపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ స్పష్టతనిచ్చింది. లీగ్‌లో ఈ నిబంధన కనీసం 2027 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఐపీఎల్‌ నిబంధనలు, ఇతర సూచనలకు సంబంధించి బుధవారం బీసీసీఐ కార్యాలయంలో 10 జట్ల సారథులతో ‘కెప్టెన్స్‌ మీట్‌’ జరిగింది. ఇందులో అన్ని అంశాలపై కౌన్సిల్‌ ప్రతినిధులు కెప్టెన్ల సందేహ నివృత్తి చేశారు. ముఖ్యంగా ‘ఇంపాక్ట్‌ సబ్‌’పై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. 2023లో దీనిని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆపై 2027 వరకు ఈ నిబంధనను పొడిగిస్తూ 2024లోనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ‘పలువురు కెపె్టన్లు దీనిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే 2027 వరకు దానిని మార్చలేమని వారికి చెప్పాం’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటూ 10 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకునే అవకాశం ఫీల్డింగ్‌ కెప్టెన్లకు గత సీజన్‌లో కల్పించారు. అయితే ఈసారి తొలి ఇన్నింగ్స్‌ సమయంలో కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని కెప్టెన్లు సూచించారు. దీనిపై కూడా కౌన్సిల్‌ వివరణ ఇచి్చంది. మంచు కారణంగానే కొత్త బంతిని ఇస్తున్నాం కాబట్టి గత ఏడాదిలాగే ఈసారి కూడా నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పింది. హర్షిత్‌ రాణా స్థానంలో నవ్‌దీప్‌ సైనీ గాయంతో ఐపీఎల్‌కు దూరమైన హర్షిత్‌ రాణా స్థానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నవ్‌దీప్‌ సైనీని ఎంపిక చేసుకుంది. టి20 ప్రపంచకప్‌ ముందు గాయపడ్డ హర్షిత్‌ రాణా మోకాలికి శస్త్రచికిత్స జరగగా... అతడు ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ యర్రా పృథ్వీరాజ్‌ కూడా గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో కుల్వంత్‌ ఖెజ్రోలియాను గుజరాత్‌ ఎంపిక చేసుకుంది.

Gujarat Titans aim for second IPL title6
ఆశల పల్లకిలో...

ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి ఏడాదే చాంపియన్‌గా నిలిచి సంచలనం సృష్టించడంతో పాటు తర్వాతి ఏడాది కూడా రన్నరప్‌గా నిలిచి గుజరాత్‌ టైటాన్స్‌ తమ స్థాయిని ప్రదర్శించింది. అయితే ఆ తర్వాతి సీజన్‌లో అనూహ్యంగా వెనుకబడి ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. కానీ గత సీజన్‌లో మెరుగైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరగలిగింది. 2025తో పోలిస్తే పెద్దగా మార్పులు లేకుండా ఈసారి కూడా జట్టు బరిలోకి దిగుతోంది. శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వానికి ఆశిష్‌ నెహ్రా కోచింగ్‌ వ్యూహాలు తోడైతే రెండో టైటిల్‌ను ఆశించవచ్చు. అయితే జోస్‌ బట్లర్, రషీద్‌ ఖాన్‌లాంటి స్టార్స్‌ ఇటీవలి తమ వైఫల్యాలను అధిగమించి ఫామ్‌లోకి రావడం జట్టుకు కీలకం. –సాక్షి క్రీడా విభాగం గత సీజన్‌లో లీగ్‌ దశలో 9 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో నిలిచిన టైటాన్స్‌... ‘ఎలిమినేటర్‌’లో ముంబై చేతిలో ఓడి నిష్క్రమించింది. ఐపీఎల్‌ వేలంలో ఈ ఏడాది గుజరాత్‌ ఐదుగురు ఆటగాళ్లనే ఎంచుకుంది. వీరిలో ముగ్గురు విదేశీయులు హోల్టర్, టామ్‌ బాంటన్, ల్యూక్‌ వుడ్‌ ఉన్నారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ను జట్టు వదిలేసుకొని అతని స్థానంలో టామ్‌ బాంటన్‌ను ఎంచుకుంది. గాయం కారణంగా గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన ఫిలిప్స్‌ ఈసారి అందుబాటులో ఉండటం గుజరాత్‌ బలాన్ని పెంచింది. తుది జట్టులో ఆడే విదేశీ ఆటగాళ్లలో రషీద్, బట్లర్‌లకు చోటు ఖాయం కాబట్టి బాంటన్, ఫిలిప్స్‌లలో ఒకరికే అవకాశం దక్కవచ్చు. ఎందుకంటే బౌలింగ్‌లో రబాడ లేదా హోల్డర్‌కు అవకాశం కల్పించడం కూడా కీలకం. టాప్‌–3 పైనే... గుజరాత్‌ మరోసారి తమ టాప్‌–3 బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్‌ కలిసి 2025 సీజన్‌లో జట్టు మొత్తం స్కోరులో 74.54 శాతం స్కోరు సాధించారు. ఒకే టీమ్‌ నుంచి టాప్‌–3 ఒక సీజన్‌లో 500కు పైగా పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. అయితే ఈసారి టైటాన్స్‌ ఇదే విషయంలో కొంత సవాల్‌ను కూడా ఎదుర్కొంటోంది. గిల్‌ భారత టి20 జట్టులో చోటు కోల్పోయాడు. బట్లర్‌ తన కెరీర్‌లోనే అతి ఘోరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలి టి20 వరల్డ్‌ కప్‌లో ఎనిమిది మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 26 కాగా, ఐదుసార్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. సాయిసుదర్శన్‌ కూడా గాయం నుంచి కోలుకుంటున్నాడు. కాబట్టి మిడిలార్డర్‌లో బాంటన్, ఫిలిప్స్, సుందర్, షారుఖ్, తెవాటియాలపై భారీ స్కోరు భారం ఉంది. గత రెండు సీజన్లలో మిడిలార్డర్‌ బ్యాటర్లు కలిపి అతి తక్కువ పరుగులు చేసిన జట్టు గుజరాత్‌దే. ఈసారి మాత్రం అదనపు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను గుజరాత్‌ తాజా సీజన్‌ కోసం బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంచుకుంది కాబట్టి అతని ప్రభావం కూడా కొంత ఉండవచ్చు. రషీద్‌ రాణించేనా... ఐపీఎల్‌లో 9 సీజన్లు ఆడిన లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కానీ ఇటీవల రషీద్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతని ఫామ్‌ పేలవంగా ఉంది. 2025లోనైతే మరీ ఘోరంగా కనీసం 10 వికెట్లు కూడా తీయలేకపోయిన రషీద్‌ ఏకంగా 57.11 సగటు నమోదు చేశాడు. ఎకానమీ కూడా 9కి పైగా ఉంది. ఇలాంటి స్థితిలో అతను మళ్లీ లయ అందుకుంటే తప్ప గుజరాత్‌ బౌలింగ్‌ బలహీనంగా మారిపోతుంది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సాయికిషోర్‌ ప్రభావం చూపించగలడు. సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ ప్రధాన పేసర్లు కాగా...మూడో పేసర్‌గా ఆల్‌రౌండర్‌ నైపుణ్యం ఉన్న హోల్డర్‌ వైపే జట్టు మొగ్గు చూపవచ్చు. వేలంలో రూ.7 కోట్లకు ఎంచుకున్న హోల్డర్‌ ఇటీవలి వరల్డ్‌ కప్‌లో మెరుగ్గా రాణించాడు. గత ఏడాది డోపింగ్‌ నిషేధం కారణంగా నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైన రబాడ ఈసారి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. విదేశీ ప్రత్యామ్నాయ పేసర్‌గా లెఫ్టార్మ్‌ బౌలర్‌ ల్యూక్‌వుడ్‌ అందుబాటులో ఉన్నాడు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌కు తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఆంధ్ర ఆటగాడు పృథ్వీరాజ్‌ గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున 2 మ్యాచ్‌లు ఆడిన తర్వాత అతను ఇప్పటి వరకు మరో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడలేదు.గుజరాత్‌ టైటాన్స్‌ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 60 గెలిచినవి 37 ఓడినవి 23 అత్యుత్తమ ప్రదర్శనవిజేత (2022), రన్నరప్‌ (2023) గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు: శుబ్‌మన్‌ గిల్‌ (కెపె్టన్‌), జోస్‌ బట్లర్, కుమార్‌ కుశాగ్ర, అనూజ్‌ రావత్, టామ్‌ బాంటన్, గ్లెన్‌ ఫిలిప్స్, సాయిసుదర్శన్, నిశాంత్, వాషింగ్టన్‌ సుందర్, అర్షద్‌ ఖాన్, సాయికిషోర్, జయంత్‌ యాదవ్, జేసన్‌ హోల్డర్, రాహుల్‌ తెవాటియా, షారుఖ్‌ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్, గుర్నూర్‌ సింగ్, ఇషాంత్‌ శర్మ, అశోక్‌ శర్మ, ల్యూక్‌వుడ్, రషీద్‌ ఖాన్, కుల్వంత్‌ ఖెజ్రోలియా.

KKR rope in Navdeep Saini as Harshit Rana replacement7
ఆర్సీబీ మాజీ పేసర్‌కు ఊహించని అవకాశం

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీకి ఊహించని అవకాశం దొరికింది. వేలంలో అమ్ముడుపోని సైనీని, కేకేఆర్‌ లీగ్‌ ప్రారంభానికి మూడు రోజుల ముందు అక్కున చేర్చుకుంది. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరమైన హర్షిత్‌ రాణా స్థానాన్ని సైనీ భర్తీ చేయనున్నాడు.రోజుల వ్యవధిలో కేకేఆర్‌లో జరిగిన రెండో కీలక మార్పు ఇది. కొద్ది రోజుల కిందట ఆకాశ్‌దీప్‌ గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరం కాగా.. అతని స్థానాన్ని సౌరభ్‌ దూబే భర్తీ చేశాడు. ఇద్దరు కీలక పేసర్లు సీజన్‌ మొత్తానికి దూరం కావడం అసలే అంతంతమాత్రంగా ఉన్న కేకేఆర్‌ పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రస్తుత కేకేఆర్‌ జట్టులో మతీష పతిరణ మినహా ఒక్క స్టార్‌ పేసర్‌ కూడా లేడు. ఉమ్రాన్‌ మాలిక్‌, బ్లెస్సింగ్‌ ముజరబానీ ఓ మోస్తరు గుర్తింపు కలిగిన పేసర్లుగా ఉన్నారు. వైభవ్‌ అరోరా, కార్తీక్‌ త్యాగి, సౌరభ్‌ త్యాగి రూపంలో దేశీయ పేసర్లు ఉన్నారు. ఈ సీజన్‌ కేకేఆర్‌ అజింక్య రహానే నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మార్చి 29న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో కేకేఆర్‌ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ సీజన్‌లో రహానేకి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) రింకూ సింగ్‌ను ప్రకటించారు. గత సీజన్‌తో పోలీస్తే ఈ సీజన్‌లో కేకేఆర్‌లో చాలా మార్పులు జరిగాయి. రసెల్‌ ఐపీఎల్‌కు బైబై చెప్పగా.. ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌, రోవ్‌మన్‌ పావెల్‌, కెమరూన్‌ గ్రీన్‌, రచిన్‌ రవీంద్ర వంటి విధ్వంసకర బ్యాటర్లు జట్టులోకి వచ్చారు.గుజరాత్‌ టైటాన్స్‌లో ఓ మార్పుతాజాగా గుజరాత్‌ టైటాన్స్‌లోనూ ఓ మార్పు చోటు చేసుకుంది. గాయం బారిన పడిన పృథ్వీ రాజ్‌ యర్రా స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియా జట్టులోకి వచ్చాడు. ఖేజ్రోలియా 2018లో RCB తరఫున IPLలో అరంగేట్రం చేశాడు. తర్వాత 2019లో RCB, 2023లో KKR తరఫున ఆడాడు. గత సంవత్సరంలో అతను గుజరాత్‌ తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌ ప్రయాణం మార్చి 31న ముల్లాన్పూర్‌లో పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌తో మొదలవుతుంది.

Jason Gillespie Shames Pakistan's Stupidity After Joining Hyderabad Kingsmen8
పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ

ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్‌ జేసన్‌ గిల్లెస్పీ పాకిస్తాన్‌ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను.. ఫ్రాంచైజీ తరఫున రూపొందించే వెల్కమ్ వీడియోలో పాల్గొనడానికి నిరాకరించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన స్టుపిడ్‌ అని పిలుస్తూ పాక్‌ అభిమానులు, ఫ్రాంచైజీ యాజమాన్యం మనోభావాలను దెబ్బ తీశాడు. గిల్లెస్పీ నుంచి ఈ ఊహించని చర్యకు పాక్‌ క్రికెట్‌ అభిమానులు తొలుత షాక్‌ అయ్యారు. ఆతర్వాత ఫైరవవుతన్నారు.వాస్తవానికి గిల్లెస్పీ ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు. గతంలో అతను పాక్‌ జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేసినప్పుడు పీసీబీ వల్ల చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. అవి మనసులో పెట్టుకునే అతను ఇలా ప్రవర్తించి ఉంటాడని క్రికెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి.కాగా, కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీ నిన్న తమ ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్ కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో గిల్లెస్పీ కూడా కనిపించినప్పటికీ, హోటల్ లాబీకి రావడానికి ఆయన నిరాకరించారు. నాకు చాలా పని ఉంది. మీరు ఆ మూర్ఖమైన వీడియోలు తీయమని అంటున్నారు. నేను చేయను అని స్పష్టంగా చెప్పారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌ కింగ్స్‌మెన్ మార్నస్ లాబుషేన్ నాయకత్వంలో మార్చి 26న లాహోర్ ఖలందర్స్‌తో తమ తొట్ట తొలి పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇంధన సంక్షోభం కారణంగా PCB ఈ టోర్నీని పరిమిత వేదికలలో, ప్రేక్షకులు లేకుండా నిర్వహించనుంది.

Yograj Singh Declares War With Sachin Tendulkar’s Teammate For Son Arjun Tendulkar9
సచిన్‌ కొడుకు కోసం అశ్విన్‌పై ఫైర్‌ అయిన యువరాజ్‌ సింగ్‌ తండ్రి

మాజీ భారత డాషింగ్‌ బ్యాటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొడుకు సహచరులపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యోగ్‌రాజ్‌ ఈసారి దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత స్పిన్‌ కింగ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేశాడు. యోగ్‌రాజ్‌ అశ్విన్‌పై ఫైరవ్వడానికి సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ కారణం.అర్జున్‌ 2022లో యోగ్‌రాజ్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచే అర్జున్‌ దశ మారింది. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌తో పాటు రంజీ ట్రోఫీలో గోవాకు మారి సత్తా చాటడం ప్రారంభించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో అర్జున్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది.ఈ సీజన్‌లో అర్జున్‌కు లక్నో తుది జట్టులో చోటు లభించడంపై ఇటీవల అశ్విన్‌ కాస్త ఓపెన్‌గా మాట్లాడాడు. అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం అసాధ్యమని అన్నాడు. ఈ మాటలే యోగ్‌రాజ్‌ను చిర్రెత్తిపోయేలా చేశాయి. టీవీల్లో కూర్చొని ఒకరి ఫేట్‌ను డిసైడ్‌ చేయడానికి నువ్వ ఎవరు.. నీ అర్హత ఏంటి అంటూ ఘాటుగా స్పందించాడు. ఓ ఆటగాడిని నువ్వు చేయలేవు.. ఇది సాధ్యం కాదు అని మాట్లాడటం సరైంది కాదంటూ అశ్విన్‌కు చురకలంటించాడు. ఇలా మాట్లాడటం ఏ ఆటగాడిపై అయినా ఒత్తిడి పెంచుతుందని అన్నాడు. సచిన్‌ కొడుకు కావడం అర్జున్‌పై ముందు నుంచే ఒత్తిడి ఉంది.. ఇలాంటి వ్యాఖ్యలు అతన్ని మరింత ఒత్తిడిలోకి నెడతాయని తెలిపాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అర్జున్‌కు తప్పక అవకాశాలు వస్తాయి.. వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటాడని యోగ్‌రాజ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, యోగ్‌రాజ్‌ కొంతకాలం కిందట, అర్జున్‌ తన వద్ద ఆరు నెలలు శిక్షణ తీసుకుంటే ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌ అవుతాడని జోస్యం చెప్పాడు. అలా జరగకపోతే తాను గడ్డం కత్తరించుకుంటానని ఛాలెంజ్‌ కూడా చేశాడు. యోగ్‌రాజ్‌ చెప్పనట్లుగానే.. అతని వద్ద 12 రోజుల శిక్షణ తీసుకున్న తర్వాత అర్జున్ ఫేట్‌ మారిపోయింది. రంజీ ట్రోఫీలో కొత్తగా గోవా తరఫున, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కాంట్రాక్ట్‌ లభించాయి. ఈ అవకాశాలను అర్జున్‌ పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయినా, అభిమానుల చూపును తనవైపు మళ్లించుకోగలిగాడు.అశ్విన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి వీల్లేదు..!ఈ సీజన్‌లో లక్నో బౌలింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. మొహమ్మద్ షమీ, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్, మోహ్సిన్ ఖాన్ వంటి నాణ్యమైన పేసర్లు జట్టులో ఉన్నారు. వీరిని కాదని అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కడం ప్రాక్టికల్‌ సాధ్యం కాకపోవచ్చు. అయినా, యోగ్‌రాజ్‌ అర్జున్‌పై నమ్మకం వ్యక్తం చేయడం ఆసక్తికరం.

Jasprit Bumrah's IPL 2026 Availability For Mumbai Indians Revealed After CoE Visit10
బుమ్రాకు సంబంధించి బిగ్‌ న్యూస్‌

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను తెగ కంగారు పెట్టింది. ఇటీవల బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లగా.. అతనికి గాయమైందేమోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. తాజాగా అలాంటిదేమీ లేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బుమ్రా కేవలం ఫిట్‌నెస్ చెక్ కోసమే CoE​కి వెళ్లాడని కన్ఫర్మ్‌ అయ్యింది. ప్రస్తుతం బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, తొలి మ్యాచ్‌ నుంచే అందుబాటులో ఉంటాడని స్పష్టమైంది.కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై ఇండియన్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఆ మరుసటి రోజు (మార్చి 29) ఆడనుంది. వాంఖడేలో జరిగే మ్యాచ్‌లో ఎంఐ.. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌​ ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, ఆఖరి మ్యాచ్‌ల్లో అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది (నాలుగో స్థానం). అయితే క్వాలిఫయర్-2లో పంజాబ్‌ కింగ్స్‌ చేతుల్లో ఓడి లీగ్‌ నుంచి నిష్క్రమించింది. బుమ్రా రాకతో మారిన ఫేట్‌గత ఎడిషన్‌లో బుమ్రా తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌ను చాలా ప్రభావితం చేసింది. బుమ్రా రాకతో ఎంఐ తిరిగి గాడిలో పడి క్వాలిఫయర్‌-2 వరకు చేరింది. ఆ సీజన్‌లో బుమ్రా 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌కు జీవం పోశాడు. ఊరిస్తున్న ఆరో టైటిల్‌తాజాగా బుమ్రా భారత్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ప్రదర్శనలు చేసి జోరుమీదున్నాడు. బుమ్రా ఫామ్‌ ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు ఆరో ఐపీఎల్‌ ట్రోఫీని ఊరిస్తుంది. బుమ్రా తన సామర్థ్యం మేరకు రాణించగలిగితే ఈ సీజన్‌లోనూ ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు తప్పక చేరుతుంది. ఉరకలేస్తుంది..!ఈ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. తాజాగా భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన సూర్యకుమార్‌ యాదవ్‌, ఆ జట్టులో సభ్యులైన తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా ఇదే జట్టులో ఉన్నారు. వీరికి వెటరన్‌ డాషింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ కూడా తోడున్నాడు. వారి ప్రదర్శనల కోసం ఎదురుచూపు..!వీరు కాకుండా ఈ సీజన్‌తోనే ముంబై ఇండియన్స్‌ పంచన చేరిన షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, విల్‌ జాక్స్‌ లాంటి భారీ హిట్టర్ల ప్రదర్శనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement