ప్రధాన వార్తలు
కోచ్లు, సెలక్టర్లు కావలెను!.. అర్హతలు ఇవే
గత కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటలేక చతికిలపడుతోంది తమిళనాడు క్రికెట్ జట్టు. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ సంఘం శిక్షణ బృందాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. వరుస వైఫల్యాలుకాగా గత రంజీ సీజన్లో గ్రూప్ దశలో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తమిళనాడు జట్టు... సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో సూపర్ లీగ్ దశకు చేరలేకపోయింది. దీంతో కోచింగ్ స్టాఫ్ను మార్పు చేయాలని భావించిన తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) కొత్త కోచ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషుల, మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్ జట్లకు కొత్త కోచ్లను నియమించనుంది. అలాగే సెలెక్షన్ కమిటీ సభ్యులను సైతం ఎంపిక చేయనుంది. ఈ నెల 10 దరఖాస్తులకు చివరి తేదీ కాగా... పరిమిత ఓవర్లకు, టెస్టు ఫార్మాట్కు వేర్వేరు కోచ్లను ఎంపిక చేయనుంది. ఉండాల్సిన అర్హతలు ఇవేకాగా 60 సంవత్సరాలకు లోబడి ఉండి బీసీసీఐ లెవల్–2 కోచింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ‘నిబంధనల ప్రకారం కొత్త కోచ్ల నియామకం చేపడతాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం’ అని టీఎన్సీఏ కార్యదర్శి భగవాన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు జట్లకు సెంథిల్నాథన్, వెంకటరమణ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'
‘జీవితంలో ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదు’
న్యూజిలాండ్ స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ కైలీ జెమీసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో పదిహేనేళ్ల పిల్లాడికి కూడా భయపడాల్సిన రోజు వస్తుందని అస్సలు ఊహించలేదన్నాడు. అతడిని అవుట్ చేసేందుకు ఆసీస్ దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్తో చర్చించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.36 బంతుల్లోనే శతక్కొట్టాడుఅవును.. జెమీసన్ చెప్తున్నది రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించే!.. ఐపీఎల్-2026లో ఈ లెఫ్లాండర్ బ్యాటర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో తన ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు వైభవ్. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో 36 బంతుల్లోనే శతక్కొట్టాడు.ఎదురుగా ఎవరున్నా డోంట్ కేర్ఇక ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచస్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనూ సిక్సర్లు బాది తన బ్యాట్ పవరేంటో మరోసారి చాటిచెప్పాడు వైభవ్. ఎదురుగా ఎంతటి దిగ్గజ బౌలర్ ఉన్నా బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకుని పరుగులు పిండుకుంటున్నాడు.నేనూ భయపడ్డాఈ నేపథ్యంలో తాను సైతం వైభవ్ సూర్యవంశీ విషయంలో భయపడ్డాడని కివీస్ స్టార్, ఢిల్లీ పేసర్ కైలీ జెమీసన్ అన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఢిల్లీ రాజస్తాన్తో తలపడ్డ సంగతి తెలిసిందే. జైపూర్ వేదికగా టాస్ గెలిచిన రాజస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, ప్రతీ మ్యాచ్లోనూ అదరగొడుతున్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4)లను త్వరగానే వెనక్కి పంపడంలో ఢిల్లీ సఫలమైంది. వైభవ్ను జెమీసన్ బౌల్డ్ చేయగా.. జైసూను మిచెల్ స్టార్క్ పెవిలియన్కు పంపాడు.ఢిల్లీ గెలుపుఓపెనర్లు విఫలమైనా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగుల మేర మంచి స్కోరు సాధించింది. ధ్రువ్ జురెల్ (42), డొనోవాన్ ఫెరీరా (14 బంతుల్లో 47 నాటౌట్)లతో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ (50 బంతుల్లో 90) ఇన్నింగ్స్ ఇందుకు కారణం.అయితే, 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అనూహ్య రీతిలో ఊదిపారేసింది. ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (33 బంతుల్లో 62), కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75).. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా (17 బంతుల్లో 33) వేగంగా ఆడి పని పూర్తి చేశారు.ఇంతలా భయపడే రోజు వస్తుందనుకోలేదుఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీని త్వరగా పెవిలియన్కు పంపేలా తాను ముందు నుంచే సన్నద్ధమయ్యాయని జెమీసన్ తాజాగా వెల్లడించాడు. ‘‘పదిహేనేళ్ల పిల్లాడికి కూడా ఇంతలా భయపడే రోజు వస్తుందని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు.అతడిని అవుట్ చేసేందుకు మేము ఎన్నో వ్యూహాలు, ప్రణాళికలు రచించుకున్నాము. అందుకు తగ్గ ఫలితం వచ్చింది’’ అని జెమీసన్ చెప్పుకొచ్చాడు. రాజస్తాన్కు కీలకమైన ఓపెనింగ్ జోడీని విడదీసేందుకు తానూ, స్టార్క్ ప్లాన్ వేశామని.. అనుకున్నట్లే ఆరంభంలోనే వారిని వెనక్కి పంపామని హర్షం వ్యక్తం చేశాడు.కాగా 15 ఏళ్ల వైభవ్ను అవుట్ చేసిన తర్వాత.. 31 ఏళ్ల జెమీసన్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరుస్తూ చప్పట్లు కొట్టాడు. దీంతో బీసీసీఐ జెమీసన్ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'That is absolute class! 😮💨#KyleJamieson with a ripper to knock over #VaibhavSooryavanshi!🤯#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/MZ8LkaCvca— Star Sports (@StarSportsIndia) May 1, 2026
నాకూ ఆ ఉద్దేశం లేదనే చెప్పాను: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా చోటుచేసుకున్న ‘నో షేక్హ్యాండ్’ వివాదంపై.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తాజాగా స్పందించాడు. ఆరోజు తాను ఎప్పటిలాగే గడుస్తుందని భావించానన్నాడు. అయితే, టాస్ సమయంలోనే తనకు నిజం తెలిసిందన్నాడు.తారస్థాయికి ఉద్రిక్తతలుమ్యాచ్ ముగిసిన తర్వాత అయినా టీమిండియా ఆటగాళ్లు తమతో కరచాలనం చేసేందుకు రాకపోవడం ఆశ్చర్యపరిచిందని ఆఘా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఉగ్రమూకకు బుద్ధి చెప్పే క్రమంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టగా.. పాక్ ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఇందుకు భారత సైన్యం గట్టిగానే బదులిచ్చింది.కరచాలనానికి నిరాకరణఈ పరిణామాల క్రమంలో తొలిసారి దాయాదులు టీమిండియా- పాక్ (IND vs PAK) ఆసియా కప్-2025 సందర్భంగా ముఖాముఖి తలపడ్డాయి. అయితే, టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాతో కరచాలనానికి టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు.ఇక ఈ మ్యాచ్లో పాక్పై టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరిస్తూ మ్యాచ్ ముగించిన సూర్య, శివం దూబే మైదానాన్ని వీడారు. మిగతా ఆటగాళ్లు సైతం డ్రెసింగ్రూమ్లోనే ఉండిపోయారు. దీంతో పాక్ జట్టు అవమానభారంతో మైదానాన్ని వీడింది.షాకిచ్చిన ఐసీసీఈ విషయం గురించి పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందుగా నో షేక్హ్యాండ్ గురించి తమకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కాబట్టి అతడిపై వేటు వేయాలని పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించింది. రిఫరీ నిబంధనలు ఉల్లంఘించారనేందుకు ఎలాంటి ఆధారం లేదని కొట్టిపారేసింది.ఇక బీసీసీఐ సైతం.. ఆటగాళ్లు కచ్చితంగా కరచాలనం చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని గుర్తు చేస్తూ టీమిండియాను సమర్థించింది. నాటి ఈ ఘటనపై సల్మాన్ ఆఘా తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నాడు.కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు‘‘మ్యాచ్కు ముందు మీడియా సమావేశం.. ట్రోఫీ ఫొటోషూట్ జరిగింది. అక్కడ కూడా షేక్హ్యాండ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక టాస్ సమయంలో నేను మైదానంలోకి వెళ్లినపుడు.. అంతా సాధారణంగానే ఉంటుందని భావించాను.అయితే, అంతలోనే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని నాకు అర్థమై పోయింది. అప్పుడే రిఫరీ నన్ను పక్కకు తీసుకువెళ్లి.. ‘ఫ్రెండ్.. ఇక్కడ షేక్హ్యాండ్ ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అని నాతో చెప్పారు.అప్పుడు నేను.. ‘నాకు కూడా కరచాలనం చేయాలనే ఆసక్తి ఏమీ లేదు’ అని చెప్పాను. టాస్ సమయంలో ముందుగానే నో షేక్హ్యాండ్ గురించి చెప్పారు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత పెవిలియన్కు చేరే సమయంలోనూ వాళ్లు (టీమిండియా) కరచాలనం చేసేందుకు ముందుకు రాలేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. ఓవరాక్షన్ ఎందుకు?తద్వారా నాడు ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ తమకు ముందుగానే సందేశం ఇచ్చాడని ఆఘా స్పష్టంచేశాడు. దీంతో పాక్ బోర్డు ఫిర్యాదుపై ఐసీసీ సరైన విధంగానే స్పందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా పాక్ను ఓడించి ట్రోఫీ గెలిచింది.చదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'
ముంబై ఇండియన్స్కు చావోరేవో మ్యాచ్.. ఓడితే ఇంటికే?
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ముంబై ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది. దీంతో ప్లే ఆఫ్ రేసులో ముంబై ఉండాలంటే మిగిలిన సీఎస్కేతో పాటు మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.ముంబై జట్టులోకి ప్రోటీస్ ఆల్రౌండర్ఇక సీఎస్కేతో జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. చెపాక్ మైదానం స్పిన్ అనుకూలించే అవకాశమున్నందన మాయాంక్ మార్కండేను తిరిగి తుది జట్టులోకి తీసుకురావలని ముంబై మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.మరో స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్తో మార్కండే బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా గత మ్యాచ్లో విఫలమైన పేసర్ ట్రెంట్ బౌల్ట్పై వేటు పడనున్నట్లు వార్తలు అతడి స్ధానంలో ప్రోటీస్ ఆల్రౌండర్ కార్భిన్ బాష్ ఆడడం దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్కు కూడా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు.దీంతో ముంబై ఇన్నింగ్స్ను ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ప్రారంభించనున్నారు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ ఉండనున్నారు. గత మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయిన యువ ఆటగాడు రాబిన్ మింజ్ను తుది జట్టులో కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయి.ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్, కార్బిన్ బాష్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్, మయాంక్ మార్కండేచదవండి: Heinrich Klaasen: 'క్షమించండి.. అది సాధ్యం కాదు'
‘ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలి.. వాళ్లిద్దరు అద్భుతం’
ఐపీఎల్లో ట్రోఫీలు గెలవకుండా ఎన్ని వ్యక్తిగత మైలురాళ్లు సాధించినా వాటికి విలువ ఉండదని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, భారత సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న రాహుల్... ఇటీవలే లీగ్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)ని అధిగమించాడు. ధోనీలా నేనూ 5 ట్రోఫీలు గెలవాలిఐపీఎల్లో ధోనీ 5439 పరుగులు చేయగా... తాజాగా రాహుల్ అతడిని దాటేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్లో మహీ భాయ్ పరుగులను దాటేశానని కూడా నాకు తెలియదు. వ్యక్తిగత మైలురాళ్లు మంచివే. సరైన దిశలోనే ఉన్నామని అవి భరోసా ఇస్తాయి. కానీ అసలైంది మాత్రం నిలకడగా ట్రోఫీలు గెలవడమే. ధోనీ గెలిచినన్ని ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే నాకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.క్రికెట్ వ్యక్తిగత క్రీడ కాదు. టీమ్ స్పోర్ట్. అందుకే విజయవంతమైన జట్లలో భాగం కావాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటా’ అని రాహుల్ అన్నాడు. చిన్నప్పటి నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... అందుకే అక్కడ మ్యాచ్ అంటే భావోద్వేగానికి గురవుతానని రాహుల్ చెప్పాడు.నాకు బెంగళూరు అలాంటిదే‘కేవలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లోనే అని కాదు. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడినా నా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో మీరు చాలా సౌకర్యవంతంగా భావిస్తారు. నాకు బెంగళూరు అలాంటిదే. అక్కడ క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారి ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలని అనుకుంటా. కొత్తతరం ప్లేయర్లు బౌలర్ చరిత్ర చూసి షాట్లు ఆడటం లేదు’ అని రాహుల్ వివరించాడు.వైభవ్, ఆయుశ్ అద్భుతంవైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు... ప్రపంచస్థాయి బౌలర్లయిన బుమ్రా, కమిన్స్లను ఎదుర్కొనేటప్పుడు ఏమాత్రం తడబడటం లేదన్నాడు రాహుల్. అవకాశం ఉంటే తొలి బంతి నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆధునిక టీ20 క్రికెట్కు ఇలాంటి మనస్తత్వమే అవసరమని రాహుల్ వెల్లడించాడు. వైభవ్, ఆయుశ్ మాత్రే వంటి వాళ్లు టీ20లు ఆడే విధానాన్ని మార్చేస్తున్నారని రాహుల్ చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!
'క్షమించండి.. అది సాధ్యం కాదు'
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్ సూపర్ స్టార్, సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మిడిలార్డర్లో ఎస్ఆర్హెచ్కు కీలక ఆటగాడిగా క్లాసెన్ మారాడు. దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ అతడి బ్యాట్ నుంచి పరుగులు వస్తున్నాయి. బుధవారం(ఏప్రిల్ 29) ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లోనూ క్లాసెన్ సత్తాచాటాడు. కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. దీంతో భీకర ఫామ్లో ఉన్న క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సూచించాడు. "సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ వారి సొంతగడ్డపైనే జరగనుంది. కాబట్టి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే అతడికి ఫోన్ చేసి, రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని జట్టులో చేరమని కోరాలి" అని పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లాసెన్ స్పందించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయంపై అతడు స్పష్టత ఇచ్చాడు. తను తిరిగి జాతీయ జట్టుకు ఆడాలని అనుకోవడం లేదని క్లాసెన్ తేల్చి చెప్పేశాడు."సారీ.. మళ్లీ తిరిగి నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేను. ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) లో రోటర్డామ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాను. ఈ ఈటీపీఎల్ లీగ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యమని" క్లాసెన్ స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బోర్డుతో విభేదాల కారణంగానే క్లాసెన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.చదవండి: IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
అన్నలా చెప్తున్నా.. బహిరంగంగా ఇలా చేయొద్దు: అశ్విన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెసింగ్ రూమ్లో ‘వేపింగ్’ (ఇ- సిగరెట్తో పొగ పీల్చడం) చేయడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. అయితే, అయితే మరీ కఠినంగా వ్యవహరించకుండా స్వల్ప స్థాయి శిక్షతో సరి పెట్టింది. జరిమానాతో సరిపరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో వేసింది. క్రికెట్ గౌరవాన్ని తగ్గించే ఘటనగా పేర్కొంటూ పరాగ్కు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఐపీఎల్ నియమావళిలో ఆర్టికల్ 2.21ను పరాగ్ ఉల్లంఘించాడు. ఇది క్రికెట్ను అగౌరవపర్చే చర్య. తన తప్పును అంగీకరిస్తూ పరాగ్ శిక్షకు సిద్ధమయ్యాడు’ అని బోర్డు పేర్కొంది. జట్టుపైనా చర్యలుఅయితే ఇలాంటి చర్యకు అవకాశం కల్పించిన రాజస్తాన్ రాయల్స్ టీమ్పై కూడా చర్య తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందని కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘ఐపీఎల్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆటగాళ్లు, అధికారులతో పాటు టీమ్ మేనేజ్మెంట్పై కూడా ఉంది. ఈ నేపథ్యంలో సదరు టీమ్పై కఠిన చర్య తీసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. దురదృష్టకర ఘటనఈ ఘటనపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తాజాగా స్పందించాడు. వేపింగ్ చేస్తూ రియాన్ పరాగ్ (Riyan Parag) పట్టుబడటాన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించాడు. పరాగ్ అలా చేయాల్సింది కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు తమ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని అతను సూచించాడు. ‘ఇది అన్ని విధాలుగా నివారించి ఉండాల్సిన ఘటన. ఇలాంటి విషయాల్లో పడరాదని యువ ఆటగాళ్లకు చెబుతున్నా.అన్నలాగా సలహా ఇస్తున్నాఇది వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయమే. కానీ ఇవి వ్యక్తిగతంగానే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరైంది కాదు. ఒక అన్నలాగా పరాగ్కు నేను సలహా ఇస్తున్నా. నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక ఐపీఎల్ టీమ్కు కెప్టెన్గా ఇలా చేయవద్దు. చాలా మంది యువ ఆటగాళ్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి మరింత బాధ్యతగా మెలగడం అవసరం. ఈ రోజుల్లో దేనినీ దాచలేం. కాబట్టి మున్ముందు తప్పునుంచి నేర్చుకోవాలంటే తగిన శిక్ష వేయడం కూడా అవసరం. పరాగ్ విషయంలో అదే జరిగింది’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.రూ. 25 లక్షలు చెల్లించే అవకాశంకాగా మంగళవారం న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా పరాగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ‘వేపింగ్’ చేస్తున్నట్లుగా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ 19వ సీజన్ కోసం రాజస్తాన్ రాయల్స్ జట్టు రూ. 14 కోట్లకు పరాగ్ను రీటెయిన్ చేసుకుంది. మ్యాచ్కు రూ. 1 కోటి చొప్పున అతడికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి.. జరిమానా రూపంలో పరాగ్ రూ. 25 లక్షలు చెల్లించే అవకాశముంది. చదవండి: అస్సలు పట్టించుకోను.. వారితో నాకేంటి: రియాన్ పరాగ్
బ్యాట్తో కొడతా.. జాగ్రత్త?
టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వారిద్దరూ తమ స్పిన్ మయాజాలంతో ఎన్నో మ్యాచ్ల్లో భారత జట్టుకు అద్భుతమైన విజయాలను అందించారు.ఆన్ది ఫీల్డ్ గానీ, ఆఫ్ ది ఫీల్డ్ గానీ ఈ స్పిన్ ద్వయం చాలా సరదాగా ఉంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కుల్దీప్ యాదవ్ పెళ్లికి కూడా హాజరై జడ్డూ సందడి చేశాడు. అయితే తాజాగా మరోసారి వారి మధ్య ఉన్న స్నేహం బయటపడింది.ఏమి జరిగిందంటే?ఐపీఎల్-2026లో శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ క్యాష్రిచ్ లీగ్లో జడ్డూ రాజస్తాన్ రాయల్స్కు, కుల్దీప్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే రాజస్తాన్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ధ్రువ్ జురెల్ ఔటయ్యాక రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చాడు.మైదానంలోకి వచ్చిన జడ్డూ తన బ్యాట్ను చెక్ చేసుకునేందుకు అంపైర్ వద్దకు వెళ్తుండగా.. పక్కనే ఉన్న కుల్దీప్ సరదాగా ఏదో అన్నాడు. అందుకు బదులుగా జడ్డూ తన బ్యాట్ను గాలిలో ఊపుతూ కొడతా అన్నట్లు సైగలు చేశాడు. అయితే ఏమాత్రం బెదరని కుల్దీప్, నవ్వుతూ జడేజా భుజాలపై చేతులు వేసి వెనక్కి నెట్టేశాడు.దీంతో పక్కన ఉన్న నితీష్ రాణా సైతం నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో రాజస్తాన్పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: IPL 2026: వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ𝙈𝙖𝙨𝙩𝙞 𝙧𝙪𝙠𝙣𝙞 𝙣𝙖𝙝𝙞 𝙘𝙝𝙖𝙝𝙞𝙮𝙚...Kuldeep Yadav & Ravindra Jadeja shared a fun moment in the middle of the game. 😅#TATAIPL 2026 ➡️ #RRvDC | LIVE NOW 👉https://t.co/cMKydi0l80 pic.twitter.com/6EijsAT5Nd— Star Sports (@StarSportsIndia) May 1, 2026
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన బీసీసీఐ
ఐపీఎల్-2026లో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అవుట్ చేశాక అతిగా సంబరాలు చేసుకున్న ఢిల్లీ పేసర్ కైల్ జేమీసన్కు బీసీసీఐ షాకిచ్చింది. జేమీసన్ను హెచ్చరించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డెమెరిట్ పాయింట్ను చేర్చింది.ఏమి జరిగిందంటే?రాజస్తాన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన జేమీసన్ బౌలింగ్లో వైభవ్ తన ఎదుర్కొన్న మొదటి బంతిని బౌండరీకి పంపాడు. అయితే మరుసటి బంతికే జేమీసన్ ఒక అద్భుతమైన డెలివరీతో వైభవ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్నాడు.ఈ కివీ స్పీడ్ స్టార్ 15 ఏళ్ల వైభవ్ వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెండాఫ్ ఇచ్చాడు. అతడి ప్రవర్తనపై ఫీల్డ్ అంపైర్లు సైతం అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు 15 ఏళ్ల పిల్లోడుపై నీ ప్రతాపమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.దీంతో బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జేమీసన్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినట్లు బోర్డు నిర్ధారించింది. దీంతో బీసీసీఐ అతడిపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.చదవండి: IPL 2026: అన్నా.. సారీ.. నిన్ను తక్కువగా అంచనా వేశాం!Kyle Jamieson gets Vaibhav Sooryavanshi early 🫡But that Celebration pic.twitter.com/c1kQZv9UbM— Shobhit Chandrawanshi (@Shobhit202518) May 1, 2026
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లుకేఎల్ రాహుల్ - 202* సిక్సర్లువిరాట్ కోహ్లీ - 192 సిక్సర్లురోహిత్ శర్మ - 148 సిక్సర్లుశిఖర్ ధావన్ - 143 సిక్సర్లుశుభమాన్ గిల్ - 129 సిక్సర్లుఅదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే21 - రోహిత్ శర్మ20 - విరాట్ కోహ్లీ18 - ఎంఎస్ ధోని17 - రవీంద్ర జడేజా17 - KL రాహుల్*
శభాష్ సౌరవ్
కార్లో (ఐర్లాండ్): భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి సం...
ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్కు చోటు.. జట్ల వివరాలివే!
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) 7వ సీ...
గర్భధారణ చికిత్సలో భాగంగానే వాడాను!.. తప్పని నిషేధం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నలుబోతు షణ్ముగ ...
లీగ్ దశలోనే భారత్ అవుట్
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ మహిళల బ్యా...
అన్నలా చెప్తున్నా.. బహిరంగంగా ఇలా చేయొద్దు: అశ్విన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస...
చరిత్రకు చేరువలో...
మాడ్రిడ్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇటలీ ...
నిషికొరి వీడ్కోలు
టోక్యో: పురుషుల టెన్నిస్లో ఆసియా అత్యుత్తమ ఆటగాడి...
బ్యాట్తో కొడతా.. జాగ్రత్త?
టీమిండియా స్టార్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్...
క్రీడలు
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
వీడియోలు
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
వైభవ్ సూర్యవంశీపై ఒలంపిక్స్ విజేత మనూ భాకర్ కామెంట్స్ వైరల్..
