ప్రధాన వార్తలు
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..
ఆస్ట్రేలియా గడ్డపై దాదాపు దశాబ్దన్నరం తర్వాత ఇంగ్లండ్ తొలిసారి టెస్టు మ్యాచ్ గెలిచింది. పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి గెలుపు జెండా ఎగురవేసింది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా బాక్సింగ్ డే టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.గెలుపు బోణీఆతిథ్య ఆసీస్ విధించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించి.. గెలుపు బోణీ కొట్టింది. యాషెస్ సిరీస్లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన ఇంగ్లండ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన కంగారూలు యాషెస్ సిరీస్ను మరోసారి కైవసం చేసుకోగా.. స్టోక్స్ బృందం తీవ్ర విమర్శలపాలైంది.ముఖ్యంగా.. బజ్బాల్ అంటూ దూకుడైన ఆటతో మూల్యం చెల్లించేలా చేసిన హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ ప్రసిద్ధ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టులో బరిలో దిగింది ఇంగ్లండ్.బౌలర్లదే పైచేయిశుక్రవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుని.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పచ్చటి పిచ్ పేసర్లకు అనుకూలించిన తరుణంలో ఆసీస్ బౌలర్లు సైతం చెలరేగిపోయారు. ఇంగ్లండ్ను 110 పరుగులకే కుప్పకూల్చారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 42 పరుగుల ఆధిక్యం సంపాదించిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం తేలిపోయారు. ఈసారి 132 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా ఇంగ్లండ్కు 175 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగారు. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పొరపాట్లకు తావివ్వలేదు.ఆచితూచి ఆడుతూనే తమదైన శైలిలో టార్గెట్ పూర్తి చేసింది. ఆరు వికెట్లు నష్టపోపయి 178 పరుగులు చేసి.. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ చివరగా 2010లో టెస్టు మ్యాచ్ గెలిచింది. ఆసీస్ గడ్డపై తొలిసారి ఇలా..ఇక ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్కు ఆస్ట్రేలియాలో ఇదే యాషెస్ తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఇంతటి ప్రత్యేక మ్యాచ్లో మొత్తంగా ఏడు వికెట్లతో చెలరేగిన జోష్ టంగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
టీమిండియా కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 112 పరుగులకే పరిమితంనిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్ కీపర్ బ్యాటర్ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్ కవిశా దిల్హారి బౌలింగ్లో స్మృతి మంధాన (1) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (9)ను కవిశా వెనక్కి పంపింది.షఫాలీ, హర్మన్ ధనాధన్ఇలాంటి దశలో మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్గా అత్యధిక విజయాలు (సూపర్ ఓవర్ సహా)👉హర్మన్ప్రీత్ కౌర్ (ఇండియా)- 130 మ్యాచ్లలో 77 విజయాలు👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్లలో 76 విజయాలు👉హీదర్ నైట్ (ఇంగ్లండ్)- 96 మ్యాచ్లలో 72 విజయాలు👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 93 మ్యాచ్లలో 68 విజయాలు👉ఎన్ చైవాయి (థాయ్లాండ్)- 79 మ్యాచ్లలో 55 విజయాలు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
Ashes: ఎట్టకేలకు...
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్లో కంగారూల సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించింది.యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.రెండు రోజుల్లోనే..ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లుహ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఇక 4/0 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24 నాటౌట్) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లుఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఎట్టకేలకు తొలి విజయంపేసర్లకు అనుకూలిస్తున్న పిచ్పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాపార్డర్లో ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్డౌన్లో వచ్చిన ‘పేసర్’ బ్రైడన్ కార్స్ (6) విఫలమయ్యాడు.ఈ క్రమంలో జేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ (18) ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లుఆస్ట్రేలియా: 152 &132ఇంగ్లండ్: 110 &178/6.చదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే!
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది.
వరుసగా ఐదో సెంచరీ!.. మళ్లీ ఓడిన హైదరాబాద్
రాజ్కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.
కోహ్లి 77 రోహిత్ 0
బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి చక్కటి షాట్లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్ పంత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ ‘డకౌట్’ జైపూర్: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ (0) ఉత్తరాఖండ్తో మ్యాచ్లో ‘గోల్డెన్ డకౌట్’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ తమోర్ (93 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సర్ఫరాజ్ ఖాన్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (55; 7 ఫోర్లు), షమ్స్ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది.
మీ వెంటే మేము...
మెల్బోర్న్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్లు ముగిశాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్ను 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రత్యర్థి పేస్కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్ (28), కెపె్టన్ బెన్ స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ (4 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకరి వెంట ఒకరు... గత మూడు మ్యాచ్ల్లో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్ (6) విఫలం కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్ గ్రీన్ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్ ఏడో వికెట్కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు. తీరు మారని ఇంగ్లండ్... చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్ వినియోగించుకోలేకపోయింది. జాక్ క్రాలీ (5), బెన్ డకెట్ (2), జాకబ్ బెథెల్ (1), జో రూట్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డకెట్ను అవుట్ చేసిన స్టార్క్... తన తదుపరి ఓవర్లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్ను నెసెర్ అవుట్ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్ కౌంటర్ ఎటాక్కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. కెపె్టన్ స్టోక్స్తో కలిసి చక్కటి షాట్లతో ఐదో వికెట్కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్ బౌలింగ్లో బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్ కొన్ని షాట్స్ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 94,199 ఈ మ్యాచ్కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ మధ్య 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 3468 టెస్టు క్రికెట్లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్ గిల్క్రిస్ట్ 3610 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 4 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి.
ఆంధ్ర గెలుపు బోణీ
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్ను ఓడించింది. మొదట రైల్వేస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్ (76; 11 ఫోర్లు, 2 సిక్స్లు), అన్ష్ యాదవ్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), షేక్ రషీద్ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్లు), అశ్విన్ హెబ్బర్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది. మళ్లీ ఓడిన హైదరాబాద్రాజ్కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్పై విజయాలు సాధించాయి. కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్మోల్, హర్నూర్ శతకాలు ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్పై నెగ్గింది. మొదట ఛత్తీస్గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్లో ఆడలేదు.
సూర్య చరిష్మా సంచలనం
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తమరి సూర్య చరిష్మా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సూర్య చరిష్మా 21–12, 21–15తో టాప్ సీడ్, ప్రపంచ 23వ ర్యాంకర్ ఉన్నతి హుడా (హరియాణా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 36 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఆమె తొలి గేమ్లో ఒకసారి వరుసగా నాలుగు పాయింట్లు, మరోసారి వరుసగా ఆరు పాయింట్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రెండో గేమ్లో స్కోరు 10–8 వద్ద సూర్య చరిష్మా ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15–8తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న ఆంధ్ర షట్లర్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్ చేరే క్రమంలో సూర్య చరిష్మా తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో రక్షిత శ్రీ (తమిళనాడు)తో ఆమె ఆడుతుంది.ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రక్షిత శ్రీ 16–21, 21–14, 21–18తో తన్వీ శర్మ (పంజాబ్)పై, తన్వీ పత్రి (ఒడిశా) 21–16, 12–21, 22–20తో ఆకర్షి కశ్యప్ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)పై, శ్రుతి ముందాడ (మహారాష్ట్ర) 22–20, 21–12తో రెండో సీడ్ అనుపమ (ఢిల్లీ)పై గెలిచారు. తరుణ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్, రెండో సీడ్ తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మన్రాజ్ సింగ్ (హరియాణా)తో 42 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్ తరుణ్ 21–13, 22–20తో గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో భరత్ రాఘవ్ (హరియాణా)తో తరుణ్ ఆడతాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ కిరణ్ జార్జి (కేరళ) 21–18, 21–18తో రౌనక్ చౌహాన్ (ఛత్తీస్గఢ్)పై, రితి్వక్ సంజీవి (తమిళనాడు) 21–13, 22–20తో సతీశ్ కుమార్ కరుణాకరన్ (తమిళనాడు)పై, భరత్ రాఘవ్ 21–17, 21–13తో జిన్పాల్ సోనా (ఢిల్లీ)పై గెలిచారు. మహిళల డబుల్స్లో కలగోట్ల వెన్నెల (తెలంగాణ)–రేíÙక (తమిళనాడు) జోడీ... మిక్స్డ్ డబుల్స్లో సాతి్వక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.
అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!
‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కట...
వివాహబంధంలో వీనస్
ఫ్లోరిడా: అమెరికా సీనియర్ టెన్నిస్ క్రీడాకారిణి,...
సూర్య చరిష్మా ముందంజ
సాక్షి, విజయవాడ: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప...
‘అర్జున‘ అవార్డు రేసులో ధనుశ్ శ్రీకాంత్, పుల్లెల గాయత్రి
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి, బ...
ఆంధ్ర గెలుపు బోణీ
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఓడిన ...
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో ...
రేణుక నిప్పులు షఫాలీ మెరుపులు
121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు ...
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో ట...
క్రీడలు
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
నా సూపర్స్టార్: భార్యకు సంజూ శాంసన్ విషెస్ (ఫొటోలు)
మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
వీడియోలు
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
మహిళా క్రికెటర్లకు BCCI గుడ్ న్యూస్
సిరీస్ పై భారత్ ఫోకస్
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
