Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sarfaraz Khan Reacts After Years Of IPL Snub Ends At 2026 Auction1
మరోసారి ఐపీఎల్‌లో.. సర్ఫరాజ్‌ స్పందన ఇదే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్‌ ఆడిన ఈ ముంబైకర్‌.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ క్యాష్‌ రిచ్‌లో పునరాగమనం చేయనున్నాడు.ఐదుసార్లు చాంపియన్‌ జట్టు అయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సర్ఫరాజ్‌ ఖాన్‌ను కొనుక్కుంది. అబుదాబి వేదికగా మంగళవారం నాటి మినీ వేలంలో కనీస ధర రూ. 75 లక్షలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.సర్ఫరాజ్‌ స్పందన ఇదేసోషల్‌ మీడియా వేదికగా తన భావాలను పంచుకుంటూ.. ‘‘కొత్త జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు సీఎస్‌కే’’ అంటూ సర్ఫరాజ్‌ ఖాన్ చెన్నై యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో నాని ‘జెర్సీ’ సినిమాలోని ఎమోషనల్‌ సీన్‌కు సంబంధించిన దృశ్యాలను జతచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో తిరిగి అమ్ముడుపోవడంపై స్పందించిన తీరు వైరల్‌గా మారింది.కాగా దేశవాళీ క్రికెట్‌లో రన్‌ మెషీన్‌గా గుర్తింపు పొందినా కూడా భారత టెస్టు జట్టుకు కూడా దూరమయ్యాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అతడు భాగమయ్యాడు. ఇక ఇప్పటికి.. సర్ఫరాజ్‌ 7 ఇన్నింగ్స్‌లలో కలిపి ఏకంగా 203.08 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఐపీఎల్‌ వేలంలో ముందుగా రూ.75 లక్షల కనీస ధరకు అతడిని ఎవరూ తీసుకోలేదు. మళ్లీ అతడి పేరు వచ్చినప్పుడు ఇదే మొత్తానికి చెన్నై ఎంచుకుంది. మరోవైపు.. సర్ఫరాజ్‌ మిత్రుడు పృథ్వీ షాను కూడా ఢిల్లీ తీసుకోవడం విశేషం. అతడిని ఢిల్లీ కనీస ధర రూ. 75 లక్షలకే కొనుక్కుంది.అమ్ముడుపోని స్టార్లు వీరేఐపీఎల్‌లో గతంలో ఆడిన లేదా అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు ఉన్న పలువురు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ విదేశీ క్రికెటర్లలో డెవాన్‌ కాన్వే, జేక్‌ ఫ్రేజర్, గస్‌ అట్కిన్సన్, జేమీ స్మిత్, గెరాల్డ్‌ కొయెట్జీ, ముజీబుర్‌ రహమాన్, మహీశ్‌ తీక్షణ, స్టీవ్‌ స్మిత్, డారిల్‌ మిచెల్, షాయీ హోప్, టామ్‌ కరన్, అల్జారీ జోసెఫ్, నవీన్‌ ఉల్‌ హక్, రహ్మనుల్లా గుర్బాజ్, వియాన్‌ ముల్డర్, జానీ బెయిర్‌స్టో, ఫజల్‌హఖ్‌ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్‌ హుడా, మయాంక్‌ అగర్వాల్, కరణ్‌ శర్మ, మనన్‌ వోహ్రాను ఎవరూ పట్టించుకోలేదు.

Shubman Gill Ruled Out Of Lucknow IND vs SA T20I: Report2
నాలుగో టీ20 నుంచి గిల్‌ అవుట్‌!

భారత్‌- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు పొగమంచు అంతరాయం కలిగించింది. ఫలితంగా ఇరుజట్ల మధ్య నాలుగో టీ20కి టాస్‌ ఆలస్యంగా పడనుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమైనట్లు సమాచారం.కాగా ఆసియా టీ20 కప్‌-2025 టోర్నమెంట్‌ సందర్భంగా భారత టీ20 జట్టులో పునరాగమనం చేసిన గిల్‌.. నాటి నుంచి ఓపెనర్‌గా పేలవ ప్రదర్శనలతో తేలిపోతున్నాడు. అంతకు ముందు కూడా అంత గొప్పగా ఏమీ ఆడలేదు. గత ఇరవై ఇన్నింగ్స్‌లో అతడు సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్‌ (4(2), 0(1)).. చివరగా ధర్మశాలలో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌గా వచ్చి 28 బంతుల్లో 28 పరుగులు చేసి.. మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కాగా గిల్‌ కోసం.... విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీగా కొనసాగుతున్న అభిషేక్‌ శర్మ- సంజూ శాంసన్‌లను యాజమాన్యం విడదీసింది.అభిషేక్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూ అతడికి గిల్‌ను జతచేసి.. సంజూను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో గిల్‌ వరుస వైఫల్యాలు, అయినా అతడినే కొనసాగిస్తున్న మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా నాలుగో టీ20కి మాత్రం గిల్‌ దూరమైనట్లు క్రిక్‌బజ్‌ వెల్లడించింది. అయితే, పాదానికి గాయమైన కారణంగానే అతడు తప్పుకొన్నట్లు పేర్కొంది.కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా గాయపడ్డ గిల్‌.. రెండో టెస్టుతో పాటు మూడు వన్డేల సిరీస్‌కూ దూరమయ్యాడు. టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు మరోసారి గాయపడటం గమనార్హం. ఇక టీమిండియా టెస్టు, వన్డేలకు గిల్‌ కెప్టెన్‌ కాగా.. టీ20లలో సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

IND vs SA 4th T20I Lucknow: Toss Update Playing XIs Highlights3
IND vs SA: టాస్‌ మరింత ఆలస్యం.. కారణం ఇదే

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ ఆలస్యంగా పడనుంది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించగా ఎలాంటి మార్పూ లేదు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయగా.. అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. రాత్రి 8 గంటలకు మరోసారి పరిస్థితిని పర్యవేక్షించి అందుకు అనుగుణంగా అంపైర్లు మ్యాచ్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.వీడని సస్పెన్స్‌ఈసారి అంపైర్లు మైదానం కలియదిరుగుతూ పొగమంచు ప్రభావం ఎలా ఉందో గమనించారు. బ్యాటర్‌, బౌలర్‌, ఫీల్డర్ల పొజిషన్ల నుంచి బంతి స్పష్టంగా కనబడుతుందా? లేదా? అ‍న్న విషయాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం 8.30 నిమిషాలకు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాజా పరిశీలనలోనూ అంపైర్లు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో 9 గంటలకు మరోసారి రివ్యూ జరుగనుంది.రీప్లేస్‌మెంట్‌గా షాబాజ్‌ అహ్మద్‌కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ టీమిండియాకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి అతడు తప్పుకోగా.. బీసీసీఐ షాబాజ్‌ అహ్మద్‌ను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది. అదే విధంగా వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి వచ్చాడు. నాలుగో టీ20లో అతడు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.ఇదిలా ఉంటే.. ఐదు టీ20 సిరీస్‌ల భాగంగా కటక్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ 101 పరుగులతో గెలవగా.. ముల్లన్‌పూర్‌లో సౌతాఫ్రికా 51 పరుగులతో గెలిచింది. తద్వారా 1-1తో సిరీస్‌ స​మం చేసింది. అయితే, ధర్మశాలలో మరోసారి జయభేరి మోగించిన టీమిండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలని సూర్య సేన పట్టుదలగా ఉంది. అంతకు ముందు టెస్టుల్లో సఫారీలు టీమిండియాను 2-0తో వైట్‌వాష్‌ చేయగా.. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలుచుకుంది.చదవండి: నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Varun Chakravarthy breaks Bumrah Record New high in T20I rankings4
నంబర్‌ 1: చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) పేరిట ఉన్న రికార్డును వరుణ్‌ చక్రవర్తి బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా 32 వికెట్లుకాగా 2021 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత వరుణ్‌ చక్రవర్తి (Varun Chakravarthy) టీమిండియాకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రీఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికి 19 టీ20 మ్యాచ్‌లలో కలిపి వరుణ్‌ చక్రవర్తి అత్యుత్తమంగా 32 వికెట్లు కూల్చాడు.సౌతాఫ్రికాతో స్వదేశంలో తాజా టీ20 సిరీస్‌లోనూ వరుణ్‌ చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటికి సఫారీలతో జరిగిన మూడు మ్యాచ్‌లలో రెండేసి వికెట్ల చొప్పున ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఓవరాల్‌గా 6.75 ఎకానమీతో వికెట్లు తీసిన వరుణ్‌.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దుమ్ములేపాడు.818 రేటింగ్‌ పాయింట్లుటీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న వరుణ్‌ చక్రవర్తి.. రేటింగ్‌ను భారీగా మెరుగుపరచుకున్నాడు. కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఏకంగా 818 రేటింగ్‌ పాయింట్లు సాధించి.. రెండో ర్యాంకర్‌ జేకబ్‌ డఫీ (699 పాయింట్లు)కి అందనంత దూరంలో నిలిచాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ రేటింగ్‌ సాధించిన భారత బౌలర్‌గానూ వరుణ్‌ చక్రవర్తి నిలిచాడు. అంతకుముందు.. 2017లో బుమ్రా కెరీర్‌ బెస్ట్‌ 783 రేటింగ్‌ పాయింట్లతో ఈ ఘనత సాధించగా.. వరుణ్‌ ఇప్పుడు దానిని అధిగమించాడు.అంతేకాదు.. అత్యుత్తమ టీ20 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉన్న టాప్‌-10 ఓవరాల్‌ బౌలర్ల జాబితాలోనూ చోటు సంపాదించాడు. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో వరుణ్‌ తొలిసారి టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ టాప్‌ ర్యాంకు నిలబెట్టుకోగా.. తిలక్‌ వర్మ రెండు స్థానాలు ఎగబాకి.. నాలుగో ర్యాంకులో నిలిచాడు.పురుషుల అంతర్జాతీయ టీ20లలో బెస్ట్‌ బౌలర్‌ రేటింగ్స్‌👉ఉమర్ గుల్ (పాకిస్తాన్)- 865👉శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్-) 864👉డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)- 858👉సునీల్ నరైన్ (వెస్టిండీస్)- 832👉రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్)- 828👉తబ్రేజ్‌ షంసీ (దక్షిణాఫ్రికా)- 827👉షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 822👉వరుణ్ చక్రవర్తి (ఇండియా)- 818👉షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)- 811👉వనిందు హసరంగా (శ్రీలంక)- 809.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Why CSK Spent Over Rs 28 Cr For Uncapped Kartik Sharma Prashant Veer5
ఒకప్పుడు ‘డాడీస్‌ ఆర్మీ’.. ఇప్పుడు కుర్రాళ్లకు కోట్లు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్‌కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.ఐపీఎల్‌ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్‌ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌... ఐపీఎల్‌ వేలంలో ప్రశాంత్‌ వీర్ (Prashant Veer), కార్తీక్‌ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.రంజీ ట్రోఫీ, ముస్తాక్‌ అలీ టోర్నీ, భారత్‌ ‘ఎ’, అండర్‌–19, అండర్‌–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...ధోనీకి ప్రత్యామ్నాయమా! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్‌ ధోనినే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) వికెట్‌ కీపర్‌గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్‌లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా షాట్‌లు ఆడగల ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.అంతకుముందే టీమిండియా ప్లేయర్‌ సంజూ శాంసన్‌(Sanju Samson)ను ట్రేడింగ్‌లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్‌ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... ఐపీఎల్‌ వేలానికి ముందే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్‌ వీర్‌ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అయిన ప్రశాంత్‌... లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడగల సమర్థుడు. ఉత్తర ప్రదేశ్‌ లీగ్‌లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్‌... ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 2 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్‌లాడి 160కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Why Green Will Pocket Only Rs 18 Cr Despite KKR Buying Him For 25 Cr6
వేలంలో రూ. 25.20 కోట్లు.. చేతికి రూ. 18 కోట్లు మాత్రమే!

భారత క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం ముగ్గురు ఆటగాళ్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వీరిలో ఒకరు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (Cameron Green).. మరో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు కార్తీక్‌ శర్మ (Kartik Sharma), ప్రశాంత్‌ వీర్‌ (Prashant Veer).రాజస్తాన్‌కు చెందిన పందొమిదేళ్ల కార్తీక్‌ శర్మను, ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రశాంత్‌ వీర్‌లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌‌ కోట్లాభిషేకం చేసింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సేవలు అందించే కార్తీక్‌ కోసం రూ. 14.20 కోట్లు.. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌ కోసం కూడా అంతే మొత్తం చెన్నై వెచ్చించింది. అత్యధిక ధరఇక ఈసారి మినీ వేలంలో టాప్‌లో నిలిచిన గ్రీన్‌ను.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా అతడు నిలిచాడు. అయితే, కోల్‌కతా వెచ్చించిన రూ. 25.20 కోట్ల మొత్తం అతడు అందుకోలేడు. వేలంలో ఈ మేర భారీ ధర పలికినా.. గ్రీన్‌కు గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి.కారణం ఇదేఐపీఎల్‌ నిబంధనల ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాడికి ఎంత విలువ పలికినా... ఆటగాళ్ల గరిష్ట రీటెయినింగ్‌ ఫీజు (రూ.18 కోట్లు) లేదా.. మెగా వేలంలో ఆటగాడికి దక్కిన మొత్తం (రూ.27 కోట్లు; రిషభ్‌ పంత్‌)కు ఇది మించరాదు. రెండింటిలో ఏది తక్కువైతే అంతే మొత్తం.. సదరు ఆటగాడికి లభిస్తుంది.ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అయిన కామెరాన్‌ గ్రీన్‌కు ఈ నిబంధన వర్తిస్తుంది. కాబట్టి రీటెయింగ్‌ ఫీజుకు సమానంగా అతడికి రూ. 18 కోట్లు దక్కుతాయి. కేకేఆర్‌ అతడి కోసం పర్సు నుంచి తీసిన మొత్తంలో.. మిగిలిన రూ.7.20 కోట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరతాయి. అత్యధిక పర్సు వాల్యూతో..కాగా ఈసారి అత్యధిక పర్సు వాల్యూ రూ. 64.3 కోట్లతో వేలం బరిలో దిగింది కోల్‌కతా. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ రిటైర్మెంట్‌ కారణంగా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుగా గ్రీన్‌ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. అదే విధంగా శ్రీలంక యువ పేసర్‌ మతీశ పతిరణ కోసం రూ. 18 కోట్లు, బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ కోసం రూ. 9.20 కోట్లు వెచ్చించింది.వీరితో పాటు తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), దక్ష్‌ కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)లను వేలంలో కొనుగోలు చేసింది.ఐపీఎల్‌-2026కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు ఇదేఅజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌ కామెరాన్‌ గ్రీన్‌, మతీశ పతిరణ, ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌, తేజస్వి సింగ్‌ , రచిన్‌ రవీంద్ర, ఫిన్‌ అలెన్‌ , సీఫెర్ట్‌, ఆకాశ్‌దీప్‌, రాహుల్‌ త్రిపాఠి , కామ్రా , సార్థక్‌ రంజన్‌ , ప్రశాంత్‌ సోలంకి, కార్తీక్‌ త్యాగి.చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

IPL 2026 Full Squad List Of All Teams After Auction Sold Players Details7
IPL 2026: మినీ వేలంలో ఎవరికి ఎంత?.. పది జట్ల పూర్తి వివరాలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 సీజన్‌కు పది ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వేలానికి ముందు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. మంగళవారం నాటి వేలంపాటలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అబుదాబి వేదికగా జరిగిన వేలంలో.. అత్యధిక పర్సు (రూ. 64.3 కోట్లు) కలిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది.మరోవైపు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు కార్తీక్‌ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌(రూ. 14.20 కోట్లు)లపై కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కూడిన పది జట్ల వివరాలు మీకోసం..ముంబై ఇండియన్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుక్వింటన్‌ డి కాక్‌ (రూ.1 కోటి), మయాంక్‌ రావత్‌ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్‌ (రూ. 30 లక్షలు), మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ (రూ. 30 లక్షలు), డానిశ్‌ మాలేవర్‌ (రూ. 30 లక్షలు). చెన్నై సూపర్‌ కింగ్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, ఎంఎస్‌ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్‌), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్‌ చౌదరి.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకార్తీక్‌ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌ (రూ.14.20 కోట్లు), రాహుల్‌ చహర్‌ (రూ.5.20 కోట్లు), మాట్‌ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్‌ హొసీన్‌ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్‌ (రూ.1.50 కోట్లు), జాక్‌ ఫూల్క్స్‌ (రూ.75 లక్షలు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.75 లక్షలు), అమన్‌ ఖాన్‌ (రూ.40 లక్షలు). కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకామెరాన్‌ గ్రీన్‌ (రూ. 25.20 కోట్లు), మతీశ పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుప్యాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, అనికేత్‌ వర్మ, జీషన్‌ అన్సారీ, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌​ కార్స్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లులివింగ్‌స్టోన్‌ (రూ.13 కోట్లు), జేక్‌ ఎడ్వర్డ్స్‌ (రూ.3 కోట్లు), సలీల్‌ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్‌ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్‌ (రూ. 30 లక్షలు), అమిత్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు), ఓంకార్‌ (రూ. 30 లక్షలు), సాకిబ్‌ హుస్సేన్‌ (రూ. 30 లక్షలు), శివాంగ్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు).గుజరాత్‌ టైటాన్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుశుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), షారుఖ్‌ ఖాన్‌, కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), అనూజ్‌ రావత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియా, నిషాంత్‌ సింధు, గ్లెన్‌ ఫిలిప్స్‌, అర్షద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి కిశోర్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుజేసన్‌ హోల్డర్‌ (రూ.7 కోట్లు), బాంటన్‌ (రూ. 2 కోట్లు), అశోక్‌ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్‌వుడ్‌ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్‌ (రూ. 30 లక్షలు). రాజస్తాన్‌ రాయల్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుధ్రువ్‌ జురెల్‌, రియాన్ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, డొనొవాన్‌ ఫెరీరా (ట్రేడింగ్‌), సామ్‌ కర్రాన్‌ (ట్రేడింగ్‌), యుధ్‌వీర్‌ చరక్‌, జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, శుభమ్‌ దూబే, నండ్రీ బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్‌), వైభవ్‌ సూర్యవంశీ.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లురవి బిష్ణోయ్‌ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్‌ (రూ.95 లక్షలు), సుశాంత్‌ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్‌ సేన్‌ (రూ.75 లక్షలు), బ్రిజేశ్‌ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్‌రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్‌ (రూ. 30 లక్షలు), యశ్‌రాజ్‌ (రూ. 30 లక్షలు). రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుఅట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభినందన్‌ సింగ్‌, నువాన్‌ తుషార, టిమ్‌ డేవిడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, యశ్‌ దయాళ్‌, జేకబ్‌ బెతెల్‌, రసిఖ్‌ ధార్‌, జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సూయాంశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లువెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 7 కోట్లు), మంగేశ్‌ యాదవ్‌ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్‌ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్‌ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్‌ (రూ. 30 లక్షలు). ఢిల్లీ క్యాపిటల్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్‌ (రూ.2 కోట్లు), ఎన్‌గిడి (రూ.2 కోట్లు), డకెట్‌ (రూ. 2 కోట్లు), మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు)లక్నో సూపర్‌ జెయింట్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅబ్దుల్‌ సమద్‌, దిగ్వేశ్‌ రాఠీ, మొహ్సిన్‌ ఖాన్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌. ఆకాశ్‌ సింగ్‌, మణిమరన్‌ సిద్దార్థ్‌, ప్రిన్స్‌ యాదవ్‌. అర్జున్‌ టెండుల్కర్‌ (ముంబై నుంచి ట్రేడింగ్‌), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్‌ పంత్‌, అర్షిన్‌ కులకర్ణి, మయాంక్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, మొహమమ్మద్‌ షమీ (సన్‌రైజర్స్‌ నుంచి ట్రేడింగ్‌), ఆయుశ్‌ బదోని, మిచెల్‌ మార్ష్‌వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఇన్‌గ్లిస్‌ (రూ.8.60 కోట్లు), ముకుల్‌ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్‌ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్‌ తివారి (రూ.1 కోటి). పంజాబ్‌ కింగ్స్‌ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅర్ష్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ముషీర్‌ ఖాన్‌. సూర్యాంశ్‌ షెడ్గే, హర్నూర్‌ పన్నూ, నేహాల్‌ వధేరా, విష్ణు వినోద్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైశాక్‌ విజయ్‌కుమార్‌, లాకీ ఫెర్గూసన్‌, ప్రియాంశ్‌ ఆర్య, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కో యాన్సెన్‌, పైలా అవినాశ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, శశాంక్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుబెన్‌ డ్వార్‌షుయిస్‌ (రూ.4.40 కోట్లు), కూపర్‌ కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్‌ (రూ. 30 లక్షలు), ప్రవీణ్‌ దూబే (రూ. 30 లక్షలు).

Predicted India Playing XI for 4th T20I8
సౌతాఫ్రికాతో నాలుగో టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి మరో ఛాన్స్‌

లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20కు ముందు తన సన్నిహితుడొకరు ఆస్పత్రిపాలవడంతో వెంటనే అతడు ముంబైకి తిరిగి వెళ్లిపోయాడు. ఈ నాలుగో టీ20కు బుమ్రా అందుబాటులో ఉండవచ్చని దూబే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పినప్పటికి.. టీమ్ మెనెజ్‌మెంట్ మాత్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవన్‌లో కొనసాగించనున్నారు. గత మ్యాచ్‌లో బుమ్రా స్థానంలో వచ్చిన హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. క్వింటన్ డి కాక్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి కీలక వికెట్లు తీసి సఫారీలను దెబ్బ తీశాడు. టీమిండియా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా గత మ్యాచ్ ఆడినే జట్టునే లక్నోలోనూ కొనసాగించనుంది. లక్నో వంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జోడీ మరోసారి కీలకంగా మారనున్నారు. బుమ్రా అందుబాటులోకి వస్తే రాణాపై వేటు పడే అవకాశముంది. మరోవైపు సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌కూ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. సౌతాఫ్రికా జట్టులో మరోసారి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి రానున్నాడు.తుది జట్లుదక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్ ), డికాక్, రిజా హెండ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరిరా, యాన్సెన్, బాష్, జార్జ్‌ లిండే/కేశవ్, ఎంగిడీ, బార్ట్‌మన్‌.భార‌త్‌సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, శుభ్‌మన్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి. చదవండి: Prithvi Shaw: ఒకప్పుడు రూ.8 కోట్లు.. ఇప్పుడు ధర తెలిస్తే షాక్‌!

Cameron Green departs for a shocking duck in first outing after bagging 25.20 cr KKR contract9
ఐపీఎల్ వేలంలో రూ. 25 కోట్లు.. క‌ట్ చేస్తే! అక్క‌డ డకౌట్‌

ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన గ్రీన్‌.. వేలం ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన పేలవ ప్రదర్శనతో అందరిని నిరాశపరిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో గ్రీన్ డకౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గ్రీన్ తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 2 బంతులు ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బ్రైడన్ కార్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో నెటిజన్లు గ్రీన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా ఇలానే ఆడుతావా? కేకేఆర్ భయపడుతోంది అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. గాయం కారణంగా గత ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉన్న గ్రీన్‌.. ఈసారి కేకేఆర్ తరపున బరిలోకి దిగనున్నాడు.గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. దాదాపు ఆరు నెలల తర్వాత పోటీ క్రికెట్‌లో తిరిగొచ్చిన గ్రీన్‌.. టెస్టుల్లో మాత్రం రాణించలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం పర్వాలేదన్పిస్తున్నాడు. అయితే కామెరూన్ తనదైన రోజున ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 326 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో అలెక్స్ క్యారీ(106) సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. ఉస్మాన్‌ ఖవాజా(126 బంతుల్లో 82), ఇంగ్లిష్‌(32) రాణించారు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ స్టార్క్‌(33), లియోన్‌(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, బ్రైడన్ కార్స్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్‌ సంచలనం

Auqib Nabi bought by Delhi Capitals for INR 8.40 crore at IPL Auction 202610
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్‌ సంచలనం

'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట స‌రిగ్గా జ‌మ్మూ కాశ్మీర్ పేస్ సంచ‌ల‌నం ఆకిబ్‌కి స‌రిపోతుంది. ఒక‌ప్పుడు ట్ర‌య‌ల్స్ కోసం త‌న స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్‌.. ఇప్పుడు నిమిషాల వ్య‌వ‌ధిలో కోటీశ్వ‌రుడుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్ల త‌న శ్ర‌మ‌కు ఎట్ట‌కేల‌కు ఫ‌లితం ద‌క్కింది. ఐపీఎల్‌-2026 మినీ వేలంలో రూ. 8.40 కోట్ల‌కు అత‌డిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. క‌నీస ధ‌ర రూ.30 ల‌క్ష‌ల‌తో వేలంలోకి వ‌చ్చిన ఆకిబ్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్, ఢిల్లీ జ‌ట్లు పోటీప‌డ్డాయి. చివరికి ఢిల్లీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి.. అతడిని బేస్ ప్రైస్ కంటే 28 రెట్లు ఎక్కువ ధర వెచ్చించి టీమ్‌లోకి తీసుకుంది. ఉమ్రాన్ మాలిక్, యుద్వీర్ సింగ్ చారక్ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందిన మూడవ కాశ్మీర్ పేసర్‌గా నబీ నిలిచాడు. ఈ క్ర‌మంలో ఎవ‌రీ ఆకిబ్ న‌బీ ధార్ అని నెటిజ‌న్లు తెగవెతికేస్తున్నారు.ఎవ‌రీ ఆకిబ్ న‌బీ..?29 ఏళ్ల ఆకిబ్ న‌బీ.. బారముల్లా జిల్లాలోని క్రేరీ గ్రామంలో జ‌న్మించాడు. అత‌డి తండ్రి ఒక ప్రైవేట్‌ స్కూల్ టీచ‌ర్‌. దీంతో న‌బీని డాక్ట‌ర్ చేయాల‌ని త‌న తండ్రి కల‌లు క‌న్నాడు. ఆకిబ్ మాత్రం త‌న తన తండ్రి ఆశయానికి భిన్నంగా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. సరైన క్రీడా మైదానాలు, శిక్షణ సౌకర్యాలు లేని ప్రాంతం నుండి వచ్చిన నబీ.. త‌న క‌ఠోర సాధ‌న‌, ప‌ట్టుద‌ల‌తోనే ఈ స్ధాయికి చేరుకున్నాడు.జమ్మూ కాశ్మీర్‌లో చలికాలంలో క్రికెట్ ఆడటం చాలా కష్టం. అయిన‌ప్ప‌టికి సిమెంట్ వికెట్ల‌పై ప్రాక్టీస్ చేస్తూనే త‌న బౌలింగ్‌ను మెరుగు ప‌రుచుకున్నాడు. న‌బీకి అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే స‌త్తా ఆకిబ్‌కు ఉంది. ఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు.రంజీల్లో అదుర్స్‌..న‌బీ 2020-21 రంజీ సీజ‌న్‌లో జ‌మ్ము కాశ్మీర్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. త‌న డెబ్యూ సీజ‌న్‌లో న‌బీ పెద్ద‌గా రాణించిక‌పోయిన‌ప్ప‌టికి.. గ‌త రెండేళ్ల‌గా మాత్రం దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. 2024 రంజీ సీజన్‌లో 13.93 సగటుతో 44 వికెట్లు ప‌డ‌గొట్టాడు. రంజీ సీజన్‌ 2025-26లో ఆకిబ్‌ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా దార్‌ కొనసాగుతున్నాడు.నబీకి బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. నబీ త‌న ఫాస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లతో పాటు 870 పరుగులు చేశాడు. అదేవిధంగా దులీప్‌ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నబీ రికార్డులెక్కాడు.దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో ఆకిబ్ సత్తాచాటుతున్నాడు. 7 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. బిహార్‌తో జరిగిన ​‍మ్యాచ్‌లో అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. మిచెల్‌ స్టార్క్‌, నోర్జే వంటి స్పీడ్‌ స్టార్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ను ఆకిబ్‌ షేర్‌ చేసుకోనున్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement