ప్రధాన వార్తలు
పంత్ కెప్టెన్సీలో కోహ్లి
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి... ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రెండు సెంచరీలతో విజృంభించిన విరాట్... న్యూజిలాండ్తో సిరీస్కు ముందు ఈ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ల్లో కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీలోని తొలి రెండు మ్యాచ్ల కోసం శుక్రవారం ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కోహ్లి, పంత్తో పాటు సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, నవ్దీప్ సైనీ కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు. పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అందుబాటులో ఉన్న సమయంలో టోర్నీలో పాల్గొననున్నట్లు ప్రకటించాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఢిల్లీ జట్టు డిసెంబర్ 24 నుంచి జనవరి 8 మధ్య ఏడు మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. దీంతో ఫామ్, ఫిట్నెస్ కాపాడుకునేందుకు కోహ్లికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. ఆయుశ్ బదోనీ ఢిల్లీ జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా... యశ్ ధుల్, ప్రియాన్ష్ ఆర్య, నితీశ్ రాణా వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. ఆరంభ మ్యాచ్లకు రోహిత్ దూరం మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శివమ్ దూబే... విజయ్ హజారే టోర్నీ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నారు. యువ ఆటగాళ్లను పరీక్షించాలనే ఉద్దేశంతో స్టార్ ఆటగాళ్లను తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేయడం లేదని ముంబై చీఫ్ సెలెక్టర్ సంజయ్ పాటిల్ పేర్కొన్నాడు. ‘రోహిత్, జైస్వాల్, దూబే, రహానే కనీసం తొలి రెండు మ్యాచ్లకు ముంబై జట్టులో ఉండరు. సెలెక్షన్ కమిటీ యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తోంది. జైస్వాల్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో యువకులకు అవకాశం ఇవ్వాలని భావించాం’ అని సంజయ్ వెల్లడించారు. ఈ టోర్నీ గ్రూప్ ‘సి’లో ఉన్న ముంబై జట్టు ఈ నెల 24న తొలి మ్యాచ్లో సిక్కీంతో తలపడనుంది.
హెడ్ అజేయ శతకం
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో ఆ్రస్టేలియా జట్టు మరో విజయానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (196 బంతుల్లో 142 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఆ్రస్టేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఆ్రస్టేలియా... మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. మిడిలార్డర్ నుంచి ఓపెనర్గా ప్రమోషన్ దక్కించుకున్న హెడ్... ఈ సిరీస్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (1), మార్నస్ లబుõÙన్ (13), కామెరాన్ గ్రీన్ (7) విఫలం కాగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్ కేరీ (91 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్ ఖ్వాజా (51 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. మరో వైపు నుంచి వికెట్లు పడుతున్నా... హెడ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ పరుగులు సాధించాడు. మంచి బంతులను గౌరవిస్తూనే... చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. 72 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... 146 బంతుల్లో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తనకు అలవాటైన రీతిలో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకునే హెడ్... ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పిచ్ను ముద్దాడి ఆనందంలో మునిగిపోయాడు. సెంచరీకి ఒక పరుగు ముందు హెడ్ ఇచ్చిన క్యాచ్ను గల్లీలో హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్న హెడ్ ఎట్టకేలకు సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 11వ శతకం. అబేధ్యమైన ఐదో వికెట్కు కేరీతో కలిసి హెడ్ 122 పరుగులు జోడించాడు.చేతిలో 6 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా.... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 85 పరుగులతో కలుపుకొని ఓవరాల్గా 356 పరుగుల ముందంజలో ఉంది. ఈ మ్యాచ్లో మరో రెండు రోజుల ఆట మిగిలుండగా... శనివారం మరింత స్కోరు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలని ఆసీస్ భావిస్తోంది. స్టోక్స్–ఆర్చర్ రికార్డు భాగస్వామ్యం... అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 213/8తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 87.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83; 8 ఫోర్లు) పట్టుదలగా పోరాడగా... జోఫ్రా ఆర్చర్ (105 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక హాఫ్సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే నెమ్మదైన అర్ధ శతకం. ఈ జోడీ తొమ్మిదో వికెట్కు రికార్డు స్థాయిలో 106 పరుగులు జోడించడంతో ఆ్రస్టేలియాకు తొలి ఇన్నింగ్స్లో ఎక్కువ ఆధిక్యం దక్కలేదు. ఒక్కసారి స్టోక్స్ అవుట్ అయ్యాక... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ్రస్టేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
సాత్విక్–చిరాగ్ జోడీ చరిత్ర
కొన్నేళ్లపాటు భారత బ్యాడ్మింటన్లో సింగిల్స్లో షట్లర్లు దేశ ప్రతిష్ట పెంచారు. ‘చైనా’ గోడకు ఎదురునిలిచి సంచలన విజయాలు, ఒలింపిక్ పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్ విజయాలు, ప్రపంచనంబర్వన్ ర్యాంకింగ్స్తో షట్లర్లు ఘనతకెక్కారు. అయితే డబుల్స్లో మాత్రం ఆ స్థాయికి చేరలేదనే బెంగ ఉండేది. కానీ ఇప్పుడది గతం! వర్తమానంలో సాత్విక్–చిరాగ్ జోడీ చెలరేగిపోతోంది. డబుల్స్ భవిష్యత్తును బంగారం చేయబోతోంది. హాంగ్జౌ: భారత డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కొత్త చరిత్ర లిఖించారు. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. తద్వారా ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరిన తొలి భారత పురుషుల ద్వయంగా సాత్విక్–చిరాగ్ ఘనతకెక్కింది. ఈ టోర్నీలో ఈ జోడీ ఎదురేలేకుండా దూసుకెళుతోంది. ప్రపంచ అత్యుత్తమ, టాప్–8 జంటలే బరిలోకి దిగే ఈ మేటి టోర్నీలో గ్రూప్ ‘బి’లో ఉన్న సాత్విక్–చిరాగ్ జోడీ అజేయంగా నాకౌట్ దశకు అర్హత సంపాదించింది. చైనా గడ్డపై ప్రత్యర్థి జంటలను గడగడలాడిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ వరుసగా గెలిచి ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. శుక్రవారం జరిగిన ఈ గ్రూపులోని ఆఖరి మూడో మ్యాచ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ జోడీ 17–21, 21–18, 21–15తో మలేసియాకు చెందిన రెండో సీడ్ అరోన్ చియా–సో వుయ్ యిక్లపై చెమటోడ్చి నెగ్గింది. పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతక విజేతలైన చియా– సో వుయ్లకు అసాధారణ పోరాటంతో చెక్పెట్టింది. ముఖాముఖీ పోటీల్లో 5–11తో వెనుకబడి వున్నప్పటికీ శుక్రవారం మాత్రం భారత జోడీ ప్రదర్శన మరో స్థాయిలో నిలిపింది. మింగుడు పడని ప్రత్యర్థి ద్వయం చేతిలో తొలి గేమ్ను కోల్పోయిన భారత జోడీ ఏమాత్రం నిరాశపడకుండా తదుపరి గేముల్లో పట్టుదల కనబరిచింది. పాయింట్ పాయింట్కు చెమటోడ్చి రెండో గేమ్ను వశం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. ఇక నిర్ణాయక మూడో గేమ్లో అయిన చిరాగ్–సాత్విక్ల ఆటతీరుకు మలేసియన్ జోడీ తలొగ్గకతప్పలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం చైనాకు చెందిన లియాంగ్ వి కెంగ్–వాంగ్ చంగ్ జంటను ఢీకొట్టనుంది.
చాంపియన్స్ సాహితి, శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ విజయవంతంగా ముగిసింది. జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీలో... 7 నుంచి 15 ఏళ్ల విభాగాల్లో వేర్వేరుగా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ప్రాథమిక రౌండ్లలో సత్తాచాటిన 500 మంది అథ్లెట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. బాలికల అండర్–15 విభాగంలో సత్యం ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన వర్ష ప్రథమ బహుమతి దక్కించుకోగా... సాహితి (ఎంఎన్ఆర్ హై స్కూల్), పర్విన్ జేబా (అంబర్పేట్ గవర్నమెంట్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్–14 విభాగంలో నాగార్జున గ్రామర్ హై స్కూల్కు చెందిన శ్రీజెనా మొదటి స్థానం దక్కించుకోగా... ప్రణవి (శ్లోక స్కూల్), భువనేశ్వరి (కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్) రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. బాలుర అండర్–15 విభాగంలో గంగోత్రి పబ్లిక్ స్కూల్కు చెందిన శ్రీకాంత్ అగ్రస్థానంలో నిలవగా... సమీర్ హుసేన్ (బ్రైట్ కాన్సెప్ట్ హైస్కూల్), రాహుల్ శెట్టి (గౌతమి టెక్నో స్కూల్) వరుసగా ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. అండర్–14 విభాగంలో పల్లవి మోడల్ స్కూల్కు చెందిన హర్షిత్ మొదటి స్థానం దక్కించుకోగా... మొహమ్మద్ అయాన్ ఖాన్ (పల్లవి మోడల్ స్కూల్), సూరజ్ కుమార్ (సెయింట్ థామస్ హై స్కూల్) వరుసగా రెండో, మూడో బహుమతులు దక్కించుకున్నారు. విజేతలకు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి శుక్రవారం బహుమతులు ప్రదానం చేశారు.
వ్రిత్తి అగర్వాల్కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత అంతర్ యూనివర్సిటీ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన వ్రిత్తి అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో సత్తా చాటిన వ్రిత్తి... చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. మహిళల 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ విభాగంలో శుక్రవారం వ్రిత్తి 18 నిమిషాల 1.04 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానం దక్కించుకుంది. విశ్వేశ్వర టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన షీరీన్ (18 నిమిషాల 10.97 సెకన్లు) రజత పతకం గెలుచుకోగా... అశ్విత చంద్ర (18 నిమిషాల 24.11 సెకన్లు; జైన్ యూనివర్సిటీ బెంగళూరు) కాంస్య పతకం సాధించింది.
విజయంతో ముగింపు
టెస్టు సిరీస్లో 0–2తో ఓటమి, వన్డేల్లో 2–1తో గెలుపు, ఇప్పుడు టి20ల్లో 3–1తో ఘన విజయం...సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత జట్టు ప్రదర్శన ఇది. చాలా కాలం తర్వాత ఒకే పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో జరిగిన సిరీస్లలో టీమిండియా పైచేయి సాధించింది. టెస్టు సిరీస్ ఫలితం బాధపెట్టేదే అయినా ఓవరాల్గా 5–4తో మన జట్టు పైచేయి సాధించింది. సిరీస్ ఓడిపోయే ప్రమాదం లేని స్థితిలో చివరి టి20లో బరిలోకి దిగిన భారత్ భారీ స్కోరుతో ప్రత్యరి్థకి చెక్ పెట్టింది. పాండ్యా అద్భుత బ్యాటింగ్, తిలక్ మెరుపులు ఇందులో కీలక పాత్ర పోషించాయి. డికాక్ జోరుతో సఫారీలు ఛేదన వైపు సాగినట్లు అనిపించినా అది కొన్ని ఓవర్లకే పరిమితమైంది. చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయి ఒత్తిడిలో జట్టు చిత్తయింది. టి20ల్లో భారత్కు ఇది వరుసగా 8వ సిరీస్ విజయం కావడం విశేషం. అహ్మదాబాద్: దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ను భారత్ 3–1తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (25 బంతుల్లో 63; 5 ఫోర్లు, 5 సిక్స్లు), తిలక్ వర్మ (42 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులకే పరిమితమైంది. క్వింటన్ డికాక్ (35 బంతుల్లో 65; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించగా, వరుణ్ చక్రవర్తికి 4 వికెట్లు దక్కాయి. రాణించిన సామ్సన్... భారత్కు సంజు సామ్సన్ (22 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్లు), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అభిషేక్ తనదైన శైలిలో దూకుడుగా మొదలు పెట్టగా, గిల్ గైర్హాజరులో దక్కిన అవకాశాన్ని సామ్సన్ సమర్థంగా వాడుకున్నాడు. యాన్సెన్ ఓవర్లో తొలి మూడు బంతులను అభిషేక్ ఫోర్లుగా మలచగా, చివరి బంతికి సామ్సన్ సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బార్ట్మన్ ఓవర్లో సామ్సన్ మూడు ఫోర్లు కొట్టాడు. అభిషేక్ వికెట్ కోల్పోయి పవర్ప్లే ముగిసే సరికి భారత్ 67 పరుగులు చేసింది. తొలి బంతికే ఫోర్తో మొదలు పెట్టిన తిలక్ కూడా తన ధాటిని ప్రదర్శించడంతో స్కోరు దూసుకుపోయింది. సామ్సన్ వెనుదిరిగాక మరో సారి సూర్యకుమార్ (5) వైఫల్యం కొనసాగింది. ఈ దశలో జత కలిసిన తిలక్, హార్దిక్ ద్వయం దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడింది. చూడచక్కటి ఫోర్లు కొట్టిన తిలక్ 30 బంతుల్లో అర్ధసెంచరీని అందుకున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించి స్కోరును 200 దాటించారు. చివర్లో దూబే (10 నాటౌట్) కూడా సిక్స్, ఫోర్తో తాను ఓ చేయి వేశాడు. డికాక్ అర్ధ సెంచరీ... భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు డికాక్ మెరుపు ఆరంభాన్ని ఇస్తూ అద్భుత షాట్లతో చెలరేగిపోయాడు. అర్ష్ దీప్ తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను...అతని తర్వాతి ఓవర్లో మరో మూడు ఫోర్లు, సిక్స్ బాదడం విశేషం. పవర్ప్లే సఫారీ టీమ్ కూడా సరిగ్గా 67 పరుగులే సాధించింది. హెన్డ్రిక్స్ (13) వెనుదిరిగాక 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్కు మరో ఎండ్లో బ్రెవిస్ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అండగా నిలిచాడు. పాండ్యా బౌలింగ్లో బ్రెవిస్ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. 10.1 ఓవర్లలో 120/1తో దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా కథ మారిపోయింది. డికాక్, బ్రెవిస్ రెండు పరుగుల వ్యవధిలో వెనుదిరిగాక ఇన్నింగ్స్ కుప్పకూలింది. మిగతా బ్యాటర్లలో ఎవరూ నిలవలేకపోయారు.ఆ 16 బంతులు... తొలి బంతికే సూపర్ సిక్స్...మెరుపు వేగంతో దూసుకొచి్చన బంతి భుజానికి తగలడంతో కెమెరామన్ అల్లాడిపోయాడు. టీమ్ ఫిజియో వెళ్లి చికిత్స చేయాల్సి వచి్చంది. అలా మొదలైన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ అంతే విధ్వంసకరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తర్వాతి రెండు బంతుల్లో సింగిల్, ఫోర్ కొట్టిన పాండ్యా... లిండే వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6, 4 బాదాడు. ఇంత పెద్ద మైదానంలో అతను కొట్టిన భారీ సిక్స్లు బౌండరీకి దగ్గర్లో కాకుండా ఎక్కడో గ్యాలరీల్లో పడ్డాయంటే ఆ వాడి ఎలాంటిదో అర్థమవుతుంది. తర్వాతి ఐదు బంతులు కాస్త జాగ్రత్తగా ఆడుతూ 7 పరుగులే రాబట్టినా...బాష్ ఓవర్లో మళ్లీ జోరు కనిపించింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అదే ఓవర్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదడంతో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) లిండే 37; అభిషేక్ (సి) డికాక్ (బి) బాష్ 34; తిలక్ (రనౌట్) 73; సూర్యకుమార్ (సి) మిల్లర్ (బి) బాష్ 5; పాండ్యా (సి) హెన్డ్రిక్స్ (బి) బార్ట్మన్ 63; దూబే (నాటౌట్) 10; జితేశ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–63, 2–97, 3–115, 4–220, 5–227. బౌలింగ్: ఎన్గిడి 4–0–29–0, యాన్సెన్ 4–0–50–0, బార్ట్మన్ 3–0–39–1, బాష్ 3–0–44–2, ఫెరీరా 2–0–20–0, లిండే 4–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) అండ్ (బి) బుమ్రా 65; హెన్డ్రిక్స్ (సి) దూబే (బి) వరుణ్ 13; బ్రెవిస్ (సి) సుందర్ (బి) పాండ్యా 31; మిల్లర్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 18; మార్క్రమ్ (ఎల్బీ) (బి) వరుణ్ 6; ఫెరీరా (బి) వరుణ్ 0; లిండే (బి) వరుణ్ 16; యాన్సెన్ (సి) సామ్సన్ (బి) బుమ్రా 14; బాష్ (నాటౌట్) 17; ఎన్గిడి (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–69, 2–120, 3–122, 4–135, 5–135, 6–154, 7–163, 8–177. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–47–1, సుందర్ 4–0–30–0, బుమ్రా 4–0–17–2, వరుణ్ 4–0–53–4, పాండ్యా 3–0–41–1, 1–0–13–0.2: భారత్ తరఫున టి20ల్లో పాండ్యా రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో) సాధించాడు. యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట టాప్ రికార్డు ఉంది.
విరాట్ కోహ్లి వచ్చేశాడు.. కెప్టెన్గా రిషభ్ పంత్
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.ఇక మరో టీమిండియా స్టార్ పేసర్ హర్షిత్ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ, నవదీప్సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్ డిప్యూటీగా ఆయుశ్ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్ వికెట్ కీపర్గా సేవలు అందించనున్నాడు.2010లో చివరిసారిగాకాగా 2010లో చివరిసారిగా విరాట్ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్ బరిలో దిగనున్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్లకు మాత్రం రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తాజాగా వెల్లడించాడు.విజయ్ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్లకు ఢిల్లీ జట్టురిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోని (వైస్ కెప్టెన్), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్ కీపర్), హర్ష్ త్యాగి, సిమర్జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ఆయుశ్ దొసేజా, దివిజ్ మెహ్రా, వైభవ్ కంద్పాల్, రోహన్ రాణా, అనూజ్ రావత్. చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
హార్దిక్ పాండ్యా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. తిలక్ విధ్వంసం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం పదహారు బంతుల్లోనే హార్దిక్ పాండ్యా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఫాస్టెస్ట్ ఫిఫ్టీతద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన రెండో ఆటగాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మను అధిగమించి.. యువరాజ్ సింగ్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికాపై 2-1తో ఆధిక్యంలో ఉంది టీమిండియా.తిలక్ వర్మ విధ్వంసంఇక శుక్రవారం అహ్మదాబాద్లోనూ గెలిచి సిరీస్ను 3-1తో గెలుచుకోవాలనే సంకల్పంతో బరిలోకి దిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్ (22 బంతుల్లో 37), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 34) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు..@TilakV9 is not holding back! Brings up a quick-fire half century! 💪#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/P4cz4TX7lc— Star Sports (@StarSportsIndia) December 19, 2025నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) మరోసారి తీవ్రంగా నిరాశపరచగా.. అతడు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి, స్టాండ్స్లోకి తరలించి అభిమానులను ఉర్రూతలూగించాడు. నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్లు బాది 16 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు దాటేశాడు. అనూహ్య రీతిలోమొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న పాండ్యా.. 5 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 63 పరుగులు సాధించాడు. అయితే, ఒట్నీల్ బార్ట్మన్ బౌలంగ్లో షాట్ ఆడే క్రమంలో రీజా హెండ్రిక్స్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. Watch out! The ball is being powered across the ground today. ⚡️@hardikpandya7 starts his innings with a maximum! 🙌#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/NjCNUJh71c— Star Sports (@StarSportsIndia) December 19, 2025ఇక తిలక్ వర్మ (42 బంతుల్లో 73) అనూహ్య రీతిలో పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి రనౌట్ కాగా.. శివం దూబే మూడు బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించింది. సఫారీ బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీయగా.. జార్జ్ లిండే, ఒట్నీల్ బార్ట్మన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 ఫిఫ్టీలు నమోదు చేసింది వీరే🏏యువరాజ్ సింగ్- 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్ మీద 12 బంతుల్లో ఫిఫ్టీ🏏హార్దిక్ పాండ్యా- 2025లో సౌతాఫ్రికా మీద 16 బంతుల్లో ఫిఫ్టీ🏏అభిషేక్ శర్మ- 2025లో ఇంగ్లండ్ మీద 17 బంతుల్లో ఫిఫ్టీ🏏కేఎల్ రాహుల్- 2021లో స్కాట్లాండ్ మీద 18 బంతుల్లో ఫిఫ్టీ🏏సూర్యకుమార్ యాదవ్- 2022లో సౌతాఫ్రికా మీద 18 బంతుల్లో ఫిఫ్టీ.చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్ శర్మ!
కోహ్లి ఆల్టైమ్ రికార్డు జస్ట్ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.కాగా ఐపీఎల్-2025లో సన్రైజర్స్ తరఫున అదరగొట్టిన అభిషేక్ శర్మ 14 మ్యాచ్లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఆరు మ్యాచ్లలో కలిపి 304 పరుగులు సాధించాడు.ఇక టీమిండియా తరఫున ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. కోహ్లి ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.2016లో విరాట్ కోహ్లి ఐపీఎల్, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్ నాలుగో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్లో అభిషేక్ శర్మ అవుటయ్యాడు. వికెట్ కీపర్ క్వింటన్ డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు.
Asia Cup 2025: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ ఖండాంతర టోర్నీలో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు గ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, మలేసియా జట్లను ఓడించి అజేయంగా సెమీస్కు చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో శ్రీలంకతో తలపడింది.దుబాయ్లో వాన పడిన కారణంగా టాస్ ఆలస్యమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించినా.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఇక టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులే చేసింది.లంక ఓపెనర్లు విరాన్ చముదిత (19), దుల్నిత్ సిగెరా (1) విఫలం కాగా... వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ విమత్ దిన్సారా (32) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో చమిక హీనతిగల 42 పరుగులతో లంక తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 30 పరుగులతో రాణించాడు. మిగిలిన వారిలో కవిజ గమాగే (2), కిత్మా వితనపతిరన (7), ఆధమ్ హిల్మీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.భారత బౌలర్లలో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్, ఖిలన్ పటేల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు.. ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ శర్మ (7), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. రసిత్ నిమ్సారా వీరిద్దరిని పెవిలియన్కు పంపాడు.అయితే, వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రాతో కలిసి ధనాధన్ దంచికొట్టాడు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. ఆరోన్ 49 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 58 పరుగులతో.. విహాన్ 45 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ 18 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 139 పరుగులు చేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆరోన్, విహాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పంచుకున్నారు.అండర్-19 ఆసియా కప్-2025 సెమీ ఫైనల్-1 స్కోర్లు👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉వాన వల్ల ఆలస్యంగా పడిన టాస్.. వెట్ఫీల్డ్ కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్👉శ్రీలంక స్కోరు: 138/8 (20)👉భారత్: 139/2 (18)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చ...
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్...
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములే...
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు...
Asia Cup 2025: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్...
IND vs SA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు
దక్షిణాఫ్రికాపై 30 పరుగుల తేడాతో భారత్ గెలుపు. స్క...
టీ20 వరల్డ్కప్-2026 జట్టు ప్రకటన.. కెప్టెన్పై వేటు
టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026కు ముందు శ్రీలంక క్రికె...
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసర...
క్రీడలు
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
వీడియోలు
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
