ప్రధాన వార్తలు
మిట్టల్ చేతికి రాజస్తాన్ రాయల్స్
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ను కొనుగోలు చేశారు. లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్, అదర్ పూనావాలాతో కలిసి 165 కోట్ల డాలర్ల (రూ. 15,660 కోట్లు) బిడ్తో రాయల్స్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో పాటు... వేర్వేరు లీగ్ల్లో పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ జట్లు కూడా మిట్టల్ సొంతం అయ్యాయి. ఐపీఎల్ గవరి్నంగ్ కౌన్సిల్, బీసీసీఐ పాలక మండలి ఆమోదం అనంతరం ఈ లావాదేవీ పూర్తి కానుంది. ఈ ప్రక్రియ ముగియడానికి మరో మూడు నెలలు పట్టొచ్చని సమాచారం. ‘మనోజ్ బదాలే కన్సార్టియం నుంచి అదర్ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్తాన్ రాయల్స్ను కొనుగోలు చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది’ అని మిట్టల్ కుటుంబం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ వివరాల ప్రకారం రాయల్స్ జట్టులో మిట్టల్ కుటుంబం 75 శాతం వాటా కలిగి ఉంటుంది. పూనావాలా 18 శాతం వాటా కలిగి ఉంటారు. మిగిలిన 7 శాతం వాటాలో పాత యజమాని మనోజ్ బదాలేతో పాటు ఇతర పెట్టుబడిదారులు ఉంటారు. దీంతో రాయల్స్ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్–భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బదాలే సభ్యులుగా ఉంటారు. రాజస్తాన్ సాదుల్పూర్లో జన్మించిన లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ... ‘నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబం రాజస్తాన్కు చెందింది. అందుకే వాటా కొనుగోలు చేసేందుకు రాజస్తాన్ రాయల్స్ కంటే మంచి జట్టు లేదనిపించింది’ అని అన్నారు. రెండు నెలల క్రితం భారత సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త కాల్ సోమాని కన్సార్టియం రాజస్తాన్ రాయల్స్ను కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల ఆ ఒప్పందం కార్యరూపం దాల్చలేదు.
పోరాడి ఓడిన పంజాబ్.. గుజరాత్ను గెలిపించిన సుందర్
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.అంతకుముందు పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు.
సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభానికి ముందు నుంచే వేధిస్తున్న గాయాల సమస్య ఆ జట్టును మరోసారి గట్టి దెబ్బేసింది. గత మ్యాచ్లోనే (ముంబై ఇండియన్స్) అరంగేట్రం చేసిన ఆల్రౌండర్ రామకృష్ణ ఘోష్ తన తొలి మ్యాచ్లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో ఘోష్ కుడి పాదానికి ఫ్రాక్చర్ అయ్యింది.ఘోష్ సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఘోష్ తన తొలి మ్యాచ్లోనే ఓ మోస్తరు ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి కీలకమైన సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. ఈ వికెట్కు ముందే ఘోష్ అందరి మన్ననలు అందుకున్నాడు. విల్ జాక్స్ను ఔట్ చేయడానికి అతను పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది.వాస్తవానికి ఘోష్ తన తొలి బంతికే గాయపడ్డాడు. ఫాలో త్రూలో అతని కాలు మెలిక పడినట్లు క్లియర్గా తెలిసింది. అయినా అతను మరో 17 బంతులు బౌలింగ్ చేశాడు. 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ కూడా చేశాడు. తొలి మ్యాచ్లోనే మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఘోష్ అదే మ్యాచ్లో గాయపడటం దురదృష్టకరం.ఈ మ్యాచ్లో సీఎస్కే ముంబైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపు అనంతరం కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఘోష్పై ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మంచి సామర్థ్యం చూపించాడని కొనియాడాడు. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్ చేసి ముంబైను 159 పరుగులకే కట్టడి చేసిన సీఎస్కే, ఆతర్వాత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్లో అన్షుల్ కంబోజ్ (4-0-32-3), నూర్ అహ్మద్ (4-0-26-2), జేమీ ఓవర్టన్ (4-0-23-1) రాణించగా.. బ్యాటింగ్లో రుతురాజ్ (67 నాటౌట్), కార్తీక్ శర్మ (54 నాటౌట్) సత్తా చాటారు.గాయాల శాపంఈ సీజన్లో సీఎస్కేకు గాయాల శాపం వెంటాడుతోంది. ఇప్పటికే ఖలీల్ అహ్మద్, అయుష్ మాత్రే, నాథన్ ఎల్లిస్ వంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ జట్టు దిగ్గజం ధోని కాలి కండరాల గాయంతో సతమతమవుతూ ఇంకా బరిలోకి దిగలేదు. ప్రస్తుతం రామకృష్ణ ఘోష్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే త్వరలోనే ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
పెళ్లిపై నిశ్శబ్దం వీడిన శుభ్మన్ గిల్
టీమిండియా టెస్ట్, వన్డే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ ఇవాళ (మే 3) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ సమయంలో గిల్ తన వివాహంపై క్లారిటీ ఇచ్చాడు.త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావా..? అని ప్రెజెంటర్ డ్యానీ మోరిసన్ అడగగా, అలాంటిదేమీ లేదని ఒక్క మాటలో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది.గిల్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ను పెళ్లి చేసుకోబోతున్నాడని కొందరు.. బాలీవుడ్ నటీమణులు సారా అలీ ఖాన్, అవ్నీత్ కౌర్, సోనమ్ బజ్వా ప్రేమాయణం సాగిస్తున్నాడని మరికొందరు పుకార్లు పుట్టించారు. వీటిలో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా గిల్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్దమవుతుంది.తన పెళ్లి, డేటింగ్పై వచ్చిన వార్తలను గిల్ గతంలోనూ చాలాసార్లు ఖండించాడు. తాను సింగిల్గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అయినా గిల్ ఏదో దాస్తున్నాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.ఇదిలా ఉంటే, గిల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ గత సీజన్లలో మాదిరిగానే రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 3 అర్ద సెంచరీల సాయంతో 373 పరుగులు చేసి, లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో గిల్ నేతృత్వంలోని గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.ఇవాళ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ ఆదిలోనే ప్రత్యర్దిని చావు దెబ్బకొట్టినప్పటికీ.. సూర్యాంశ్ షేడ్గే (58), మార్కస్ స్టోయినిస్ (29) కలిసి పంజాబ్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. వీరిద్దరు ఆరో వికెట్కు 78 పరుగులు జోడించి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. 15.5 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 126-5గా ఉంది.
చరిత్ర సృష్టించిన మనీశ్ పాండే
కేకేఆర్ వెటరన్ బ్యాటర్ మనీశ్ పాండే చరిత్ర సృష్టించాడు. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్ అన్ని ఎడిషన్లలో (19) కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగడంతో ఈ రేర్ ఫీట్ను అందుకున్నాడు.ఐపీఎల్ అరంగేట్రం ఎడిషన్లో అరంగేట్రం చేసిన మనీశ్.. అప్పటి నుంచి వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున నిరంతర ప్రయాణం కొనసాగించాడు. ప్రతి సీజన్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి స్థిరత్వాన్ని చాటుకున్నాడు. ఈ సీజన్లో మనీశ్కు సన్రైజర్స్ మ్యాచే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్లో అతను రమన్దీప్ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. సన్రైజర్స్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు మనీశ్ వరకు రాకుండానే ఛేదించారు.ధోనీ కూడా చేరొచ్చువిరాట్, రోహిత్, మనీశ్ సరసన ధోని కూడా చేరే అవకాశం ఉంది. ధోని సైతం గత 18 ఐపీఎల్ ఎడిషన్లలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాడు. ఈ సీజన్లో అతను బరిలోకి దిగాల్సి ఉంది. ధోని గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఐపీఎల్లో మనీశ్ ప్రస్థానంముంబై ఇండియన్స్తో కెరీర్ ప్రారంభించిన మనీశ్.. ఆపై ఆర్సీబీ, కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మొత్తం ఏడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో 175 మ్యాచ్లు ఆడిన మనీశ్ సెంచరీ, 22 అర్ద సెంచరీల సాయంతో 3942 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 121.5గా ఉంది.
ఎస్ఆర్హెచ్కు షాకిచ్చిన కోల్కతా నైట్రైడర్స్
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు కోల్కతా నైట్రైడర్స్ షాకిచ్చింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై 7 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో అంగక్రిష్ రఘువంశీ(59) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కెప్టెన్ అజింక్య రహానే(43), ఫిన్ అలెన్(29), రింకూ సింగ్(22 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. హైదరాబాద్ బౌలర్లలో షకీబ్, కమ్మిన్స్, శివాంగ్ కుమార్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 105/2తో పటిష్టంగా కన్పించిన సన్రైజర్స్ కేవలం 60 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. కేకేఆర్ బౌలర్లలో కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావెస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి.
పంజాబ్పై గుజరాత్ గెలుపు
పంజాబ్పై గుజరాత్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్పై గుజరాత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో మరో బంతి మాత్రమే మిగిలుండగా వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) సిక్సర్ బాది గుజరాత్ను గెలిపించాడు. అంతకుముందు సాయి సుదర్శన్ (57) అర్ద సెంచరీతో రాణించి, గెలుపుకు పునాది వేశాడు. అయితే గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగింది. ఈ మధ్యలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బార్ట్లెట్ (4-0-38-2), అర్షదీప్ సింగ్ (4-0-24-2), జన్సెన్ (4-0-33-1), విజయ్ కుమార్ (4-0-31-2) తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ (2.5-0-26-1) లక్ష్యాన్ని కాపాడలేకపోయాడు. ఈ ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్సర్ వచ్చింది. గుజరాత్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (5), నిషాంత్ సంధు (15), తెవాతియా (2), హోల్డర్ (2) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. బట్లర్ (26) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అర్షద్ ఖాన్ (8 నాటౌట్) బౌండరీ బాది లక్ష్యానికి చేరువ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్14.5వ ఓవర్- 124 పరుగుల వద్ద గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో బార్ట్లెట్కు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (57) ఔటయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 94 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్లో విజయ్ కుమార్కు క్యాచ్ ఇచ్చి నిషాంత్ సింధు (15) ఔటయ్యాడు.రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్8.1వ ఓవర్- 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ (26) ఔటయ్యాడు. ఆదిలోనే గుజరాత్కు షాక్1.3వ ఓవర్: 164 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ (5) రెండో ఓవర్లోనే అర్షదీప్ బౌలింగ్లో కూపర్ కన్నోల్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంజాబ్ స్కోర్ 163-9టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ పడుతూ లేస్తూ చివరికి గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. సూర్యాంశ్ షేడ్గే (57), మార్కస్ స్టోయినిస్ (40), ఆఖర్లో మార్కో జన్సెన్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ (4-0-24-4) పంజాబ్ను భారీ దెబ్బకొట్టాడు. తొలుత సిరాజ్ (4-0-28-2), రబాడ (4-1-22-2) కూడా పంజాబ్ను కష్టాల్లోకి నెట్టారు. మిగతా బౌలర్లలో రషీద్ ఖాన్ (4-0-32-1) పర్వాలేదనిపించగా.. మానవ్ సుతార్ (1-0-27-0), అర్షద్ ఖాన్ (3-0-29-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ 2, ప్రభ్సిమ్రన్ 15, కూపర్ కన్నోల్లీ డకౌట్, శ్రేయస్ అయ్యర్ 19, నేహల్ వధేరా, జేవియర్ బార్ట్లెట్ డకౌటయ్యారు. విజయ్ కుమార్, అర్షదీప్ తలో పరుగుతో అజేయంగా నిలిచారు. పతనం అంచుల్లో పంజాబ్పంజాబ్ కింగ్స్ మరోసారి వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో సిరాజ్, 18వ ఓవర్లో హోల్డర్ ఈ ఘనత సాధించారు. తాజాగా హోల్డర్ స్టోయినిస్ (40), బార్ట్లెట్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. ఆరో వికెట్ కోల్పోయిన పంజాబ్15.6వ ఓవర్- 126 పరుగుల వద్ద పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో సూర్యాంశ్ షేడ్గే (57) ఔటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పంజాబ్8.4వ ఓవర్- 47 పరుగుల వద్ద పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (19) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కష్టాల్లో పంజాబ్6.3వ ఓవర్- పంజాబ్ జట్టు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తాజాగా నేహల్ వధేరాను (0) హోల్డర్ ఔట్ చేశాడు. బట్లర్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్5.2వ ఓవర్- 35 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్లో మానవ్ సుతార్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ సింగ్ (15) ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్పంజాబ్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వరుస బంతుల్లో ప్రియాంశ్ ఆర్య (2), కన్నోల్లీ (0)ని ఔట్ చేశాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్0.2వ ఓవర్- ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో నిషాంత్ సంధుకు క్యాచ్ ఇచ్చి ప్రియాంశ్ ఆర్మ (2) ఔటయ్యాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నగుజరాత్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 3) జరుగుతున్న 46వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి, ఓ మ్యాచ్లో ఓడగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 5 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొంది.తుది జట్లు..పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్
ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. క్లాసెన్ మైండ్ బ్లాంక్
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ స్టార్ రోవ్మన్ పావెల్ మరోసారి తన సంచలన ఫీల్డింగ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ధనాధన్ లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో పావెల్ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు.ఎస్ఆర్హెచ్ డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ను సూపర్ క్యాచ్తో పావెల్ పెవిలియన్కు పంపాడు. సన్రైజర్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్లో నాలుగో బంతిని క్లాసెన్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాలిలోకి లేచింది.ఈ క్రమంలో డీప్ మిడ్ వికెట్ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన రోవ్మన్ పావెల్.. తన కుడివైపు గాలిలోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో ఉప్పల్ మైదానంలో ప్రేక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా ఈ క్యాచ్ను అందుకునే క్రమంలో పావెల్ తలకు గాయం కూడా అయ్యే అవకాశముండేది. అయినప్పటికి రిస్క్ తీసుకుని మరి పావెల్ బంతిని ఒడిసిపట్టాడు. కాగాఇదే సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ పావెల్ సంచలన క్యాచ్ను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 19 ఓవర్లలో 19 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ట్రావెస్ హెడ్(61), ఇషాన్ కిషన్(42) మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IPL 2026: చరిత్ర సృష్టించిన సీఎస్కే చిచ్చర పిడుగుIt takes a stunner to send #HeinrichKlaasen packing! 🤯🔥#RovmanPowell covers massive ground and pulls off a one-handed diving catch to dismiss the danger man! 🫡#TATAIPL Revenge Week 2026 ➡️ #SRHvKKR | LIVE NOW 👉 https://t.co/YyLg9wqh6o pic.twitter.com/Dgp31wvLY8— Star Sports (@StarSportsIndia) May 3, 2026
చారిత్రక సిరీస్ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్లో పర్యటించింది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్కు వెళ్లనుంది.ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్వన్డేలు – సబీనా పార్క్, కింగ్స్టన్జూన్ 3 – తొలి వన్డేజూన్ 6 – రెండో వన్డేజూన్ 8 – మూడో వన్డేటీ20లు – సబీనా పార్క్జూన్ 11 – తొలి టీ20జూన్ 13 – రెండో టీ20జూన్ 14 – మూడో టీ20టెస్టులు – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వాజూన్ 25 నుంచి తొలి టెస్టుజూలై 3 నుంచి రెండో టెస్టుఇరు జట్లకు కీలకంఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్వాష్ చేసింది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 డిజాస్టర్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది.
60 పరుగులకే 8 వికెట్లు.. ఎస్ఆర్హెచ్కు ఏమైంది?
ఉప్పల్ వేదికగా కోల్కతానైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు నిరాశపరిచారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు ఎప్పటిలాగే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 45 పరుగుల వద్ద అభిషేక్ రూపంలో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది.అయినప్పటికి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై మాత్రం విరుచుకుపడ్డాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కిషన్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ హెడ్గా తోడుగా నిలిచాడు.వీరిద్దరి ధాటికి 9 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది. అయితే 9వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆఖరి బంతికి హెడ్(61) ఔటయ్యాడు. హెడ్ ఔటైప్పటికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 9 ఓవర్లకు 105 పరుగులగా ఉంది. ఆ తర్వాత సన్రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది. ప్రతీ మ్యాచ్లో మిడిలార్డర్లో వెన్నుమకగా నిలిచిన క్లాసెన్ సైతం నిరాశపరిచాడు. 11 పరుగులు చేసి గ్రీన్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత డెబ్యూ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ కూడా వెంటనే ఔటయ్యాడు. యువ ఆటగాళ్లు అనికేత్ వర్మ, ఆరోరా కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి కిషన్ క్రీజులో ఉండడంతో సన్రైజర్స్ భారీ స్కోర్ సాధిస్తుందని భావించారు.కానీ 42 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ కూడా సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం లోయార్డర్ బ్యాటర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. దీంతో ఆరెంజ్ ఆర్మీ కేవలం 60 పరుగుల వ్యవధిలో మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా సన్రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగీ, నరైన్ తలా రెండు వికెట్లు సాధంచారు.
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్బాల్ ప్రపంచ కప్లో అగ్రశ...
రికార్డు ‘బ్రేక్’
ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడాన...
శభాష్ సౌరవ్
కార్లో (ఐర్లాండ్): భారత ప్లేయర్ సౌరవ్ కొఠారి సం...
ముగిసిన వేలం.. తెలంగాణ ప్లేయర్కు చోటు.. జట్ల వివరాలివే!
ముంబై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) 7వ సీ...
పంజాబ్పై గుజరాత్ గెలుపు
పంజాబ్పై గుజరాత్ గెలుపుఐపీఎల్ 2026లో భాగంగా ఇవా...
ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. క్లాసెన్ మైండ్ బ్లాంక్
ఐపీఎల్-2026లో కోల్కతా నైట్రైడర్స్ స్టార్ రోవ్మ...
చారిత్రక సిరీస్ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్ను ప్రకటి...
60 పరుగులకే 8 వికెట్లు.. ఎస్ఆర్హెచ్కు ఏమైంది?
ఉప్పల్ వేదికగా కోల్కతానైట్రైడర్స్తో జరుగుతున్న ...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్..సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రికార్డుల రారాజు రోహిత్ శర్మకు బర్త్డే విషెస్ (ఫోటోలు)
క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ బర్త్డే.. ఈ ఫొటోలు చూశారా?
కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్ (ఫొటోలు)
SRH vs DC : ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్ (ఫొటోలు)
SRH Vs CSK Match : సన్రైజర్స్ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్ (ఫొటోలు)
ఉప్పల్లో ఫుల్ జోష్.. ధనా ధన్ ధోని, ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
వీడియోలు
IPLలో నేడు డబుల్ ధమాకా
వైభవ్ మీదకు దూసుకెళ్లాడు.. భారీ షాకిచ్చిన బీసీసీఐ
IPL గేమ్ ఛేజింగ్ రూల్, IPL 2026లో 200+ పరుగుల వరద
వైభవ్ బ్యాటింగ్ పై గర్ల్ ఫ్రెండ్ ప్రశంసలు.. మొహం మాడ్చుకున్న అర్షదీప్
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
గుజరాత్ చేతిలో RCB ఘోర ఓటమి
Viral Video: బలుపు చూపిస్తున్న బుడ్డాడు.. వైరల్ అవుతున్న వైభవ్ వీడియో
చితక్కొట్టిన సన్ రైజర్స్
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
