Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

 Virat Kohli does 'Nagin Dance' in Vadodara as Phillips perishes to Kuldeep1
విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్‌ను బయటపెట్టాడు.వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నిం‍గ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో డార్లీ మిచెల్‌(71 బంతుల్లో 84), డెవాన్‌ కాన్వే(56), హెన్రీ నికోల్స్‌(62) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'pic.twitter.com/LZrkrdDVtq— crictalk (@crictalk7) January 11, 2026

IND vs NZ: Mitchell 84 Helps New Zealand Sets 300 Target2
రాణించిన కివీస్ బ్యాట‌ర్లు.. భార‌త్ ముందు భారీ టార్గెట్‌

రాజ్‌కోట్ వేదిక‌గా వ‌డోద‌ర వేదిక‌గా జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 300 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. బ్లాక్ క్యాప్స్ జట్టుకు ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 117 పరుగులు జోడించి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. నికోలస్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విల్ యంగ్(12) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. డెవాన్ కాన్వే కూడా వెంటనే పెవిలియన్‌కు చేరాడు. అయితే మిడిలార్డర్‌లో సీనియర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.మిచెల్‌ 71 బంతుల్లో 5 ఫోర్లు, 33 సిక్స్‌లతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో అరంగేట్ర ఆటగాడు క్లార్క్‌(24) రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, హర్షిత్‌ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.తుది జట్లుభారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్యూజిలాండ్‌: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్

117-run stand. Devon Conway, Henry Nicholls break 38 year record vs India during first ODI3
Ind vs NZ 1st ODI: 27 ఏళ్ల రికార్డు బద్దలు

వడోదర వేదికగా భారత్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌ (62), డెవాన్‌ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు. భారత్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్‌-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు నాథన్‌ ఆస్టల్‌-క్రెయిగ్‌ స్పియర్‌మన్‌ పేరిట ఉండేది. 1999లో రాజ్‌కోట్‌లో ఈ న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ జోడీ భారత్‌పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్‌ ప్లేస్‌లో ఆండ్రూ జోన్స్‌-జాన్‌ రైట్‌ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్‌ పెయిర్‌ ఇదే వడోదరలో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది. డారిల్‌ మిచెల్‌ (56 నాటౌట్‌) గౌరవప్రదమైన స్కోర​్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్‌ క్లార్క్‌ (1) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌ తలో 2.. ప్రసిద్ద్‌, కుల్దీప్‌ చెరో వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (12), గ్లెన్‌ ఫిలిప్‌ (12), మిచెల్‌ హే (18), కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్‌ 1 పరుగుకే ఔటయ్యాడు.కాగా, న్యూజిలాండ్‌ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ​

Pathan criticises Gambhir for overlooking Nitish Reddy in IND vs NZ 1st ODI4
'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'

నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్‌మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్‌కు ఎంపిక చేస్తే మరొక సిరీస్‌కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్‌ను వెనుక్కి నెట్టిస్తున్నాయి. అంతేకాకుండా అతడిని ఆల్‌రౌండర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ పట్ల టీమ్ మెనెజ్‌మెంట్ కఠినంగా వ్యవహరించింది.న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్‌కు చోటు దక్కలేదు.అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు."నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్‌తో పాటు ఉంటాడు.. కానీ తుది జ‌ట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒక‌వేళ తుది జ‌ట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవ‌ర్లు బౌలింగ్‌, 8 స్ధానంలో బ్యాటింగ్‌కు పంపుతారు. ఇది స‌రైన విధానం కాదు. రెగ్యూల‌ర్‌గా అవ‌కాశ‌మివ్వ‌క‌పోతే ఎప్ప‌టికీ అత‌డిని ఒక‌ మంచి ఆల్‌రౌండ‌ర్‌గా తీర్చిదిద్దలేరు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్‌గా ఎదిగాడన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్దు" అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పఠాన్‌ పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్‌

Swastik Chikara joins Yash Dayal to humiliate RCB as leaked private messages hog limelight5
వివాదంలో విరాట్‌ కోహ్లి భక్తుడు

విరాట్‌ కోహ్లి భక్తుడు, గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్‌లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్‌లోని ఓ మాల్‌లో కలిశాడు. ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్‌లు పంపాడని ఆధారాలతో (చాట్‌ స్క్రీన్‌షాట్లు) సహా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. లీకైన ఈ చాట్‌ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్‌ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయిన ఆర్సీబీ బ్రాండ్‌కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్‌ యశ్‌ దయాల్‌పై ఘాజియాబాద్, జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. యశ్‌ దయాల్‌ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. తాజాగా చికారా ఎపిసోడ్‌ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్‌ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్‌ ఇమేజ్‌ కలిగిన ఆర్సీబీ దయాల్‌, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్‌ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్‌లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన చికారా విరాట్‌ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్‌ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్‌ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్‌ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.మొత్తంగా యశ్‌ దయాల్‌, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్‌ గ్రౌండ్‌ కూడా చెక్‌ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్‌లోనే తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై జయకేతనం​ ఎగురవేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి అంకితమిచ్చారు. ఈ గెలుపుతో విరాట్‌ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్‌ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్‌ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్‌ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్‌ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు.

Most ODI matches for India: Virat Kohli overtakes Sourav Ganguly6
కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్‌

టీమిండియా సూప‌ర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘ‌న‌త సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్‌. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్(463) అగ్ర‌స్ధానంలో ఉన్నారు. అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలోనూ స‌చిన్(18426) టాప్‌లో కొన‌సాగుతున్నారు.భారత్‌ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..సచిన్‌ టెండూల్కర్‌-463ఎంఎస్‌ ధోని-347రాహుల్‌ ద్రవిడ్‌-340అజారుద్దీన్‌-334విరాట్‌ కోహ్లి-309సౌరవ్‌ గంగూలీ-308వన్డే కింగ్‌..ఇక ప్రపంచ వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లి కూడా త‌న పేరును సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్‌గా కోహ్లి కొన‌సాగుతున్నాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు 53 సెంచ‌రీలు న‌మోదు చేశాడు. అదేవిధంగా వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవ‌రూ లేరు.

IND VS NZ 1st ODI: virat kohli need 42 runs, rohit sharma need 67 runs to achieve greater milestones7
భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్‌, కోహ్లి

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్‌ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.రో-కో ప్రస్తుతమున్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్‌లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్‌ గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.కోహ్లి విషయానికొస్తే.. రోహిత్‌తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత 4 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్‌ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్‌ పెట్టారు.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్‌ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌ (42), డెవాన్‌ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్‌కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద లైఫ్‌ లభించింది. కుల్దీప్‌ యాదవ్‌ సునాయాసమైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆరుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో బరిలోకి దిగింది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Who is Adithya Ashok? India born spinner part of New Zealand ODI playing XI for 1st match8
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్‌ జట్టులో భారత మూలాలున్న ఆటగాడు

స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్‌, జడేజా, కుల్దీప్‌.. పేసర్లుగా సిరాజ్‌, ప్రసిద్ద్‌, హర్షిత్‌ బరిలో దిగుతున్నారు.న్యూజిలాండ్‌ తరఫున క్రిస్టియన్‌ క్లార్క్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్‌ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాన బౌలర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్‌ రైట్‌ ఆర్మ్‌ లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌. గూగ్లీలు వేయడంలో దిట్ట.ఎవరీ ఆదిత్య అశోక్‌..?ఆదిత్య అశోక్‌ తమిళనాడులోని వేలూర్‌లో 2002 సెప్టెంబర్‌ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆక్లాండ్‌లో స్థిరపడింది. అశోక్‌ ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు.అశోక్‌ 2020 అండర్-19 వరల్డ్ కప్‌తో న్యూజిలాండ్ తరఫున జూనియర్‌ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్‌లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు. - 2021 డిసెంబర్‌లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు. - 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు. - 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. అశోక్‌కు న్యూజిలాండ్‌ సీనియర్‌ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్‌ న్యూజిలాండ్‌ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్‌ స్పిన్‌ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్‌ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్‌ పునా ప్రథముడు కాగా.. దీపక్‌ పటేల్‌, జీత్‌ రావల్‌, ఐష్‌ సోధి, ఎజాజ్‌ పటేల్‌, రచిన్‌ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్‌ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు.

IND VS NZ 1st ODI: Team india won the toss and elected to bowl first, here are the playing XI9
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్‌, జడేజా, కుల్దీప్‌.. పేసర్లుగా సిరాజ్‌, ప్రసిద్ద్‌, హర్షిత్‌ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్‌ తరఫున క్రిస్టియన్‌ క్లార్క్‌ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్‌ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్‌ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడింది. తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్‌ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

india vs new zealand odi series history10
ఇవాల్టి నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌

స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి మ్యాచ్‌ జరుగనుంది. సిరీస్‌ ప్రారంభ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. భారత్‌-న్యూజిలాండ్‌ ఇప్పటివరకు 17 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్‌ 6, భారత్‌ 9 సిరీస్‌ల్లో విజయాలు సాధించాయి. 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి.వీటిలో భారత్‌లో జరిగిన సిరీస్‌లను ప్రత్యేకంగా తీసుకుంటే.. భారత్‌ ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఏడు వన్డే సిరీస్‌లు అడగా ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. ఏడు సిరీస్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసి, స్వదేశంలో తిరుగులేని రికార్డు కలిగి ఉంది. చివరి సారిగా (2022-23) స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమిండియా 3-0తో కివీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షి​క సిరీస్‌లు..న్యూజిలాండ్‌లో జరిగినవి.. 1975/76- 2-0 (న్యూజిలాండ్‌)1980-81- 2-0 (న్యూజిలాండ్‌)1993-94- 2-2 (డ్రా)1998-99- 2-2 (డ్రా)2002-03- 5-2 (న్యూజిలాండ్‌)2008-09- 3-1 (5) (భారత్‌)2013-14- 4-0 (5) (న్యూజిలాండ్‌)2018-19- 4-1 (భారత్‌)2019-20- 3-0 (న్యూజిలాండ్‌)2022-23- 1-0 (3) (న్యూజిలాండ్‌)భారత్‌లో జరిగిన సిరీస్‌లు..1988/89- 4-01995-96- 3-21999-00- 3-22010-11- 5-02016-17- 3-22017-18- 2-12022-23- 3-0* అన్నింటిలో భారత్‌దే విజయంహెడ్‌ టు హెడ్‌ రికార్డులుభారత్‌-న్యూజిలాండ్‌ ఇప్పటివరకు 120 వన్డేల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్‌ 62, న్యూజిలాండ్‌ 50 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్‌ టై అయ్యింది. వీటిలో​ భారత్‌ స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 31 కాగా.. న్యూజిలాండ్‌ వారి స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 26.చివరిగా తలపడిన మ్యాచ్‌లోనూ పరాభవమేభారత్‌-న్యూజిలాండ్‌ చివరిగా వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు..డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, కైల్ జేమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement