Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mosaddek Hossain, Nurul Hasan recalled for first two Australia ODIs1
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన

3 మ్యాచ్‌ల వన్డే‌, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. జూన్‌ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్‌లోని తొలి 2 మ్యాచ్‌ల కోసం​ బంగ్లాదేశ్‌ జట్టును ఇవాళ (జూన్‌ 3) ప్రకటించారు.స్టార్‌ ఆల్‌రౌండర్ మొసద్దెక్‌ హొసేన్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్‌ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.మొసద్దెక్‌తో పాటు నురుల్‌ హసన్‌ కూడా గ్యాప్‌ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్‌ దాస్‌, నజ్ముల్‌ హొసేన్‌ షాంటో, తౌహిద్‌ హృదోయ్‌, కెప్టెన్‌ మెహిది హసన్‌ మిరాజ్‌ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, షొరిఫుల్‌ ఇస్లాం, నహిద్‌ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.ఈ సిరీస్‌లోని వన్డేలు జూన్‌ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌లో జరుగనున్నాయి.ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్‌ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, షొరీఫుల్‌ ఇస్లాం, నహిద్‌ రాణా

T20 Mumbai 2026: Mumbai Panthers beat Bandra Blasters in Super Over2
ఉ‍త్కంఠ పోరు.. 'రహానే' జట్టు సూపర్‌ విజయం

టీ20 ముంబై లీగ్‌ 2026లో ఇవాళ (జూన్‌ 3) ఓ ఆసక్తికర సమరం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో నార్త్‌ ముంబై పాంథర్స్‌, బాంద్రా బ్లాస్టర్స్‌ జట్లు తలపడగా.. అజింక్య రహానే నేతృత్వం వహిస్తున్న ముంబై పాంథర్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. సూపర్‌ ఓవర్‌లో ముంబై పాంథర్స్‌ పైచేయి సాధించింది.నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బాంద్రా బ్లాస్టర్స్‌.. కెప్టెన్‌ సువేద్‌ పార్కర్‌ (110) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పాంథర్స్‌ టీమ్‌.. బ్లాస్టర్స్‌కు ధీటుగా పోరాడి స్కోర్‌ను సమం చేసింది. 16 ఓవర్ల వరకు ఓటమి ఖాయమనుకున్న పాంథర్స్‌ అనూహ్యంగా పుంజుకొని చివరి 4 ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి స్కోర్‌ను సమం చేసింది. వైభవ్‌ మాలి (32), రాహుల్‌ సావంత్‌ (10), తనుశ్‌ కోటియన్‌ (32 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తనుశ్‌ చివరి ఓవర్లో బౌండరీ, సిక్సర్‌ సహా చివరి బంతికి రెండు పరుగులు సాధించి మ్యాచ్‌ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం సూపర్‌ ఓవర్‌లో వైభవ్‌ మాలి మరోసారి రెచ్చిపోవడంతో (2 సిక్సర్లు, ఫోర్‌) తొలుత బ్యాటింగ్‌ చేసిన పాంథర్స్‌ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఛేదనలో మోహిత్‌ అవస్థి అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో బ్లాస్టర్స్‌ జట్టు 7 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నీలో రహానే, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.

IPL 2026 Fast Bowling Rankings: Which Team Had The Most Fearsome Pace Attack3
ఐపీఎల్‌ 2026లో అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఏది..?

ఐపీఎల్‌ 2026లో బ్యాటర్ల హవా కొనసాగినా, పేస్‌ బౌలర్లు కూడా తమదైన ముద్ర వేశారు. ఈ సీజన్‌లో అత్యధిక 200+ స్కోర్లు నమోదైనా, కొన్ని జట్లు తమ బలమైన ఫాస్ట్‌ బౌలింగ్‌ దళంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాయి. సీజన్‌ మొత్తంలో ఏ జట్టుకు అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఉందో ఈ కంటెంట్‌లో చూద్దాం. చివరి నుంచి మొదలుపెడితే..కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (2/10)ఈ సీజన్‌లో అత్యంత బలహీనమైన పేస్‌ అటాక్‌ కేకేఆర్‌ది అని చెప్పవచ్చు. హర్షిత్‌ రాణా, మతీష పతిరణ గాయాలతో దూరమవ్వడం ఈ సీజన్‌లో ఆ జట్టుకు భారీ దెబ్బ. కార్తీక్‌ త్యాగి 18 వికెట్లు తీసినా మిగతా పేసర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.పంజాబ్‌ కింగ్స్‌ (2/10)ఈ జట్టులో అర్షదీప్‌ సింగ్‌ వంటి స్టార్‌ పేసర్‌ ఉన్నప్పటికీ, మిగతా పేసర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి కారణంగా కీలక మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లను కూడా కాపాడుకోలేకపోయారు.ముంబై ఇండియన్స్‌ (3/10)ఈ జట్టు పేస్‌ దళం ఈ సీజన్‌లో అతిపెద్ద నిరాశగా నిలిచింది. బుమ్రా, బౌల్ట్‌ లాంటి స్టార్‌ పేసర్లు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు.చెన్నై సూపర్‌ కింగ్స్‌ (4/10)ఈ జట్టు తరఫున అన్షుల్‌ కంబోజ్‌ 21 వికెట్లతో మెరిసినా.. గాయాలు, అస్థిర ప్రదర్శనల కారణంగా పేస్‌ విభాగం బలహీనంగా కనిపించింది.ఢిల్లీ క్యాపిటల్స్‌ (4/10)ఈ జట్టులో స్టార్క్‌, నటరాజన్‌ కొంత మేర రాణించినా, మిగతా పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.లక్నో సూపర్‌ జెయింట్స్‌ (5/10)ఈ సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ చివరి స్థానంలో నిలిచినా, పేస్‌ బౌలింగ్‌లో మంచి సామర్థ్యం చూపింది. ప్రిన్స్‌ యాదవ్‌, షమీ ఆకట్టుకున్నారు. అయితే గాయాలు జట్టును దెబ్బతీశాయి.రాజస్థాన్‌ రాయల్స్‌ (6/10)ఈ సీజన్‌లో రాయల్స్‌ విజయాల్లో జోఫ్రా ఆర్చర్‌ కీలక పాత్ర పోషించాడు. 25 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (7/10)ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పేస్‌ విభాగం బలంగా కనిపించింది. కమిన్స్‌ నేతృత్వంలో ఆ జట్టు పేస్‌ దళం మంచి సమతుల్యతను ప్రదర్శించింది. ఎషాన్‌ మలింగ 20 వికెట్లతో మెరిశాడు.రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (8/10)బ్యాక్‌ టు బ్యాక్‌ టైటిళ్లు గెలవడంలో ఆర్సీబీ పేస్‌ బౌలర్ల పాత్ర అమోఘం. భువనేశ్వర్‌ కుమార్‌ 28 వికెట్లతో అదరగొట్టగా, రసిక్‌ సలా​ం​,‍ హాజిల్‌వుడ్‌ మంచి ప్రదర్శనలు ఇచ్చారు.గుజరాత్‌ టైటాన్స్‌ (9/10)ఈ సీజన్‌లో అత్యంత భయంకరమైన పేస్‌ దళం మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌దే. ఈ జట్టులోని రబాడ, సిరాజ్‌, హోల్డర్‌, ప్రసిద్ద్‌ సమిష్టిగా సత్తా చాటారు. 29 వికెట్లు తీసి రబాడ పర్పుల్‌ క్యాప్‌ కూడా గెలుచుకున్నాడు.

Smriti Mandhana Requested Fans To Encourage Women T20 World Cup 20264
‘మమ్మల్ని ఆదరించండి’.. మంధాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మ‌హిళల క్రికెట్ చరిత్రలో మరో అత్యుత్తమ సమరానికి తెరలేవబోతోంది. జూన్ 12 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీమిండియా వైస్‌కెప్టెన్ స్మృతి మంధాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌పంచ‌క‌ప్ లాంటి మెగాటోర్నీ జ‌రుగుతున్నా భార‌త్‌-పాక్ మ‌ధ్య మ్యాచ్‌కు మాత్ర‌మే హైప్ ఉంద‌ని, మిగిలిన టోర్నీకి కూడా అదే స్థాయిలో ఆద‌ర‌ణ చూపాల‌ని అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి ఆస‌క్తి క‌లిగించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్, హైప్ సహజమైనదే అయినప్పటికీ.. కేవలం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాకుండా టోర్నీ మొత్తానికి భారీ స్థాయిలో ప్రచారం కల్పించాలని ఆమె కోరారు. మహిళల క్రికెట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందుతోందని, ప్రతి జట్టులోనూ అద్భుతమైన ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని ఆమె గుర్తుచేశారు. అభిమానులు, క్రీడా విశ్లేషకులు, మీడియా సంస్థలు కేవలం భారత్-పాక్ పోరుపైనే కాకుండా, టోర్నమెంట్లో జరిగే మిగిలిన అన్ని మ్యాచ్లపై కూడా అంతే శ్రద్ద పెట్టాలని, అప్పుడే మహిళల క్రికెట్కు నిజమైన గుర్తింపు దక్కుతుందని మంధాన అభిప్రాయపడ్డారు. పురుషుల క్రికెట్‌తో స‌మానంగా తాము అద్భుతాలు చేస్తున్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల క్రికెట్‌పై ఇంకా చిన్న‌చూపేన‌ని పేర్కొన్నారు. స్మృతి మంధాన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ టోర్నీ విజయవంతం కావడానికి సోషల్ మీడియా పాత్ర కూడా ఎంతో కీలకమని, ప్రతీ మ్యాచ్ గురించి చర్చ జరగాలని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మంధాన చెప్పిన‌ట్లుగా కేవలం ఒకే ఒక్క హై-వోల్టేజ్ మ్యాచ్ టోర్నీని ముగించకుండా, ప్రతీ లీగ్ మ్యాచ్‌ను, ప్రతీ జట్టు ప్రదర్శనను హైలైట్ చేయడం వల్ల మహిళల క్రీడలకు మరింత వాణిజ్య పరమైన ఆదరణ, స్పాన్సర్షిప్‌ లభించే అవకాశం ఉంది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇక ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లు టైటిల్ గెలవడమే లక్ష్యంగా శిక్షణ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. గత కొన్ని సిరీస్‌లుగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ సమతూకంతో కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు జట్టులోకి రావడం జట్టు బలాన్ని మరింత పెంచింది.చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్‌లో మెరిసిన టీమిండియా స్టార్‌!

Team India Star-Umesh Yadav Bowling Viral In-Vidarbha Premier League 20265
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్‌లో మెరిసిన టీమిండియా స్టార్‌!

టీమిండియా వెట‌ర‌న్ క్రికెట‌ర్ ఉమేశ్ యాద‌వ్ చాన్నాళ్ల త‌ర్వాత త‌న బౌలింగ్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. భార‌త జ‌ట్టులో ఎప్పుడో చోటు కోల్పోయిన ఉమేశ్ ప్ర‌స్తుతం విద‌ర్భ ప్రీమియ‌ర్ లీగ్ ఆడుతూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ లీగ్‌లో నాగ్‌పూర్ హీరోస్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమేశ్ యాద‌వ్ మంగ‌ళ‌వారం ఇండియా వారియ‌ర్స్‌తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాద‌వ్ 3 ఓవ‌ర్ల‌లో 41 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. ఈ నేప‌థ్యంలో ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్ వీడియోనూ ఒక అభిమాని ఎక్స్ వేదిక‌గా పంచుకున్నాడు. 'ఎన్ని రోజుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చావ‌య్యా.. నీ బౌలింగ్ చూసి కొన్నేళ్ల‌యింది.. థాంక్యూ ఉమేశ్' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాద‌వ్ టీమిండియా త‌ర‌ఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వ‌న్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల త‌ర‌ఫున ఆడిన వైభ‌వ్ మొత్తంగా 148 మ్యాచ్‌ల్లో 144 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ధోని సార‌థ్యంలో 2013 చాంపియ‌న్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాలో ఉమేశ్ యాద‌వ్ స‌భ్యుడిగా ఉన్నాడు. 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ఉమేశ్ యాద‌వ్‌ నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో 310 స్ట్రైక్‌రేట్‌తో 10 బంతుల్లోనే 31 ప‌రుగులు చేయ‌డం ఇప్ప‌టికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఉమేశ్ యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హించిన నాగ్‌పూర్ హీరోస్‌పై ఇండియ‌న్ వారియ‌ర్స్‌ 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 261 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శ‌ర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్‌), శుభ‌మ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్‌) మెరిశారు. అనంత‌రం నాగ్‌పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్‌వార్‌, గుర్దీప్‌సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. Saw Umesh Yadav bowling after a long timeFeels NostalgicHe is playing Vidarbha premier league pic.twitter.com/Bp0TwGQez2— Sawai96 (@Aspirant_9457) June 3, 2026చదవండి: వైభవ్‌ సూర్యవంశీపై ప‌రిశోధ‌న‌లు!

Sooryavanshi effect: Tri series of A teams in SL to be telecast live6
వైభవ్‌ సూర్యవంశీ ఎఫెక్ట్‌.. బిగ్‌ న్యూస్‌

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్‌ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్‌వర్క్‌) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్‌ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్‌ క్రేజ్‌కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్‌ బ్రాండ్‌ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ 2026 మరియు ఐపీఎల్‌ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్‌వర్క్‌, వైభవ్‌ క్రేజ్‌ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్‌ పెట్టింది. అన్ని మ్యాచ్‌లు సోని స్పోర్ట్స్‌, సోని లివ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్‌ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్‌ సూర్యవంశీయే. ఐపీఎల్‌లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్‌.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్‌ పరాగ్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్‌ వర్మ (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, రుతురాజ్‌ గైక్వాడ్‌, ప్రియాంశ్‌ ఆర్య, ఆయుశ్‌ బదోని, నిషాంత్‌ సింధు, సూర్యాంశ్‌ షేడ్గే, విప్రాజ్‌ నిగమ్‌, అన్షుల్‌ కంబోజ్‌, అనుకూల్‌ రాయ్‌, అర్షాద్‌ ఖాన్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, కుమార్‌ కుషాగ్రా, యశ్‌ ఠాకూర్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌

Agarkar backs Shreyas Iyer Will He get Gambhir Nod Report Says This7
టీ20 కొత్త కెప్టెన్‌గా అతడికే ఓటేసిన అగార్కర్‌!

టీమిండియా టీ20 కెప్టెన్‌ మార్పు అంశంపై భారత క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్‌కు ఈ ఏడాది ప్రపంచకప్‌ టైటిల్‌ అందించినప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌పై వేటు వేసేందుకు భారత ‍క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్‌-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్‌ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్‌కప్‌ వీరుడు సంజూ శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్‌లను కాదని శ్రేయస్‌ అయ్యర్‌కే సెలక్షన్‌ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‌‘‘అజిత్‌ దృఢచిత్తం గల చీఫ్‌ సెలక్టర్‌. స్ట్రాంగెస్ట్‌ చీఫ్‌ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్‌తో కలిసి కొత్త టీ20 కెప్టెన్‌ కోసం అగార్కర్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్‌ అయ్యర్‌ను తొలుత వన్డేలకు వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభానికి ముందే శ్రేయస్‌ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్‌ విముఖత!అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో అగార్కర్‌తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్‌ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్‌ పటేల్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్‌ కూడా!ఇక ఇషాన్‌ కిషన్‌.. అతడి వయసు చిన్నదే. ఫామ్‌లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్‌ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు ఇషాన్‌, అక్షర్‌ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే!

Abhishek Agarwal 19 Balls-63 Runs-Vidarbha Premier League8
దేశవాలీ టోర్నీలో అభిషేక్ విధ్వంసం..

దేశవాలీ టోర్నీ విదర్భ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదయ్యింది. మంగళవారం ఇండియా వారియర్స్‌, నాగ్‌పూర్ హీరోస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇటీవలే ఐపీఎల్‌లో పెద్దగా మెరవని శుభమ్ దూబేతో పాటు అభిషేక్ అగర్వాల్ సంచలన ఇన్నింగ్స్‌లతో మెరిశారు. ముఖ్యంగా అభిషేక్ అగర్వాల్ కేవలం 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు శుభమ్ దూబే కూడా (33 బంతుల్లో 74 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) తడాఖా చూపించాడు. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జోడించడం దేశవాలీ క్రికెట్‌లో ఒక రికార్డుగా మిగిలిపోనుంది. ఇక ఇన్నిం‍గ్స్ చివరి ఓవర్‌లో అభిషేక్ అగర్వాల్ ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లు కొట్టి మొత్తంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ 16 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. మ్యాచ్ విష‌యానికొస్తే నాగ్‌పూర్ హీరోస్‌పై ఇండియ‌న్ వారియ‌ర్స్‌ 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 261 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శ‌ర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్‌), శుభ‌మ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్‌) మెరిశారు. అనంత‌రం నాగ్‌పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్‌వార్‌, గుర్దీప్‌సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఎఫెక్ట్‌.. బిగ్‌ న్యూస్‌

Ek Bihari Sab Pe Bhaari: Kohli Tells Sooryavanshi Then Dont Listen Message9
వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్‌

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్‌ తొలి టైటిల్‌ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్‌మెషీన్‌ కల గతేడాది ఫలించింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్‌-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్‌ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు, ఆరెంజ్‌క్యాప్‌ విన్నర్‌ వైభవ్‌ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్‌ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్‌’.. ‘బేబీ బాస్‌’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్‌ల వీడియోను బుధవారం షేర్‌ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్‌కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్‌తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. ఈ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్‌లో 675 పరుగులు సాధించి టాప్‌-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్‌ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026

IIM Indore Announced We-Will-Reasearch On Vaibhav Sooryavanshi10
వైభవ్‌ సూర్యవంశీపై ప‌రిశోధ‌న‌లు!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డును అందుకున్నాడు. 15 ఏళ్ల వ‌య‌సులోనే బ్యాటింగ్‌లో సంచ‌ల‌నాలు చేస్తుండ‌డంపై దిగ్గ‌జ క్రికెట‌ర్లు కూడా వైభ‌వ్‌ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఈ నేపథ్యంలో అత‌డి జీవితాన్ని, చిన్న వ‌య‌సులోనే ఒత్తిడిని అధిగ‌మించి ఇవాళ స్టార్ క్రికెట‌ర్ రేంజ్‌కు ఎదిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఘ‌న‌త‌ను త‌మ పాఠ్యాంశంలో చేర్చాల‌ని ప్ర‌తిష్ఠాత్మ‌క ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-ఇండోర్ భావిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్‌పై ఐఐఎం-ఇండోర్ ప‌రిశోధ‌న‌లు చేప‌ట్ట‌నుంది. చిన్న వ‌య‌సులోనే క్రికెట్‌లో సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన‌ వైభ‌వ్ సూర్యవంశీపై ఒక ప్ర‌త్యేక కేస్‌స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు ఐఐఎం ఇండోర్ ప్ర‌తినిధులుతెలిపారు. దీంతో వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. చిన్న‌వ‌య‌సులోనే స్టార్‌డ‌మ్ రావ‌డం, చిన్న‌వ‌య‌సులోనే స్టార్‌డ‌మ్ రావ‌డం, కెరీర్‌ భవిష్యత్తు, ఒత్తిళ్లు, సవాళ్లు.. వాటి ప్ర‌భావాల‌ను వైభవ్‌ ఎలా అధిగమించాడనే దానిపై త‌మ సంస్థ‌ అధ్య‌య‌నం చేయనుంద‌ని ఐఐఎం ఇండోర్‌కు చెందిన సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.‘బాల మేధావుల అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎలాంటి కార‌కాలు దోహ‌ద‌ప‌డుతాయ‌నేవి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం చిన్న‌త‌నం నుంచే అల‌వ‌డే వ్య‌క్తిత్వం, ప్ర‌వ‌ర్త‌న‌, సాధ‌న ప‌ద్ద‌తులు.. కుటుంబం నుంచి అందుతున్న స‌హ‌కారం, ఉపాధ్యాయులు, కోచ్‌లు, సీనియ‌ర్ల మ‌ద్ద‌తుతో వివిధ రంగాల్లో ఎదుగుతున్న పిల్ల‌ల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని నిర్ణ‌యించాం. స్పోర్ట్స్ విభాగంలో వైభ‌వ్ సూర్య‌వం శీని ఎంపిక చేసుకున్నాం. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని అత‌డికి తెలియ‌జేశాము.’ అని ఐఐఎం డైర‌క్ట‌ర్ తెలిపారు.బాల‌ల ప్ర‌తిభ‌పై సంస్థ జ‌రిపే అధ్య‌య‌నంలో మ‌న‌స్త‌త్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, మాన‌వ వ‌న‌రులు, స‌మాచారవ్యాప్తి, ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించి ప్ర‌త్యేక ప‌రిశోధ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ అధ్య‌య‌నం కేవ‌లం క్రీడ‌ల‌కే కాకుండా చిన్న వ‌య‌సులోనే గ‌ణితం, సైన్స్‌, క‌ళ‌లు, ఇత‌ర వృత్తుల్లో రాణిస్తున్న ప్ర‌తిభావంతుల‌పై కూడా జ‌రగ‌నుంది. అయితే ఈ అధ్య‌య‌నం పూర్త‌వ్వ‌డానికి రెండు నుంచి మూడు నెల‌లు ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని ఐఐఎం ఇండోర్ తెలిపింది.చదవండి: వరల్డ్‌ నంబర్‌వన్‌ను చావుదెబ్బ కొట్టిన ప్రజ్ఞానంద!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement