Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Big twist Bangladesh asks Mohsin Naqvi to end India T20 WC Boycott1
బిగ్‌ ట్విస్ట్‌!.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌!

టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ఒత్తిడి పెరుగుతోంది. పాక్‌ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిందిగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఇప్పటికే పీసీబీకి లేఖ రాసింది.ఆర్థికంగా నష్టంగతంలో తమ జట్టుపై పాకిస్తాన్‌లో ఉగ్రదాడి జరిగినా.. తిరిగి తామే మళ్లీ తొలిసారి ఆ దేశంలో పర్యటించిన విషయాన్ని లంక బోర్డు ఈ సందర్భంగా గుర్తు చేసింది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. ఒకవేళ మ్యాచ్‌ రద్దు చేసుకుంటే తాము ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతామని పేర్కొంది. ఇకముందు కూడా తాము పీసీబీతో సంబంధాలు కొనసాగించాలనుకున్నామంటూ సుత్తిమెత్తగానే హెచ్చరికలు జారీ చేసింది.యూఏఈ లేఖతాజాగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) క్రికెట్‌ కూడా పాకిస్తాన్‌కు లేఖ రాసింది. ‘‘ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్తాన్‌తో చాలా ఏళ్లుగా బంధం కొనసాగిస్తోంది. గతంలో పాకిస్తాన్‌ కోసం మా వేదికలు ఇచ్చి టోర్నీలు సజావుగా సాగేలా చూసుకున్నాము.అయితే, టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాక్‌ నిర్ణయం మాతో పాటు ఇతర సభ్యదేశాలను తీవ్రంగా గాయపరిచింది. ముఖ్యంగా అసోసియేట్‌ జట్లు ఆర్థికంగా భారీ ఎత్తున నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది.పీసీబీ కుటుంబంలో సభ్యులుగా ఈ విషయంలో పునరాలోచన చేయాలని.. సమస్యకు సరైన పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని యూఏఈ బోర్డు ఇ-మెయిల్‌ పంపింది. బంగ్లాదేశ్‌ సైతంఇక ఈ వివాదం అంతటికీ మూలకారణమైన బంగ్లాదేశ్‌ సైతం పీసీబీకి ఇదే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా భారత్‌-శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా.. భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్‌ ఐసీసీని ఆశ్రయించిది.తమ వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా కోరింది. అయితే, ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేసిన ఐసీసీ బంగ్లాకు గడువు ఇచ్చింది. అయినా సరే బంగ్లా బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు. దీంతో ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది.మొహ్సిన్‌ నక్వీతో చర్చలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఉంటామంటూ పాక్‌.. మొదట టోర్నీ నుంచే వైదొలుగుతామని బెదిరించింది. అనంతరం టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే బహిష్కరిస్తామని కొత్త నాటకానికి తెరతీసింది. ఇదే జరిగితే ఐసీసీ ఆర్థికంగా భారీగా నష్టపోతుంది. ఈ ప్రభావం పీసీబీతో పాటు ఇతర సభ్య దేశాల బోర్డు మీదా పడుతుంది.మీ మద్దతుకు ధన్యవాదాలు.. కానీఈ క్రమంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా, బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్‌ ఇస్లాం ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్లారు. పీసీబీ చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీతో ఈ విషయం గురించి చర్చించారు. ఈ సందర్భంగా అమినుల్‌ ఇస్లాం.. తమకు మద్దతుగా నిలిచినందుకు పీసీబీకి ధన్యవాదాలు చెప్పినట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే తమతో పాటు అన్ని బోర్డులు ఆర్థికంగా నష్టపోతాయని అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అమినుల్‌ నక్వీని కోరిట్లు సమాచారం.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన నక్వీ.. ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తటస్థ వేదికైన కొలంబోలో ఫిబ్రవరి 15న భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

Pakistan origin player removed from T20 World Cup, India accused of bias2
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి పాక్‌ మూలాలున్న ఆటగాడి తొలగింపు

టీ20 వరల్డ్ కప్-2026 పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) జట్టులో కలకలం రేగింది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు ప్రకటన ప్రకారం.. జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జోహెబ్‌ ఏ నియమాలు ఉల్లంఘించాడోనని క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆరా తీస్తుంది. ఇంత సడెన్‌గా ఓ ఆటగాడిని స్వదేశానికి పంపారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, జోహెబ్ మాత్రం తనపై తీసుకున్న చర్యను జాతి వివక్షగా అభివర్ణించాడు. మేనేజ్‌మెంట్ మొత్తం భారతీయ మూలాలున్నవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినైనందు వల్ల జట్టు నుంచి ఆకస్మికంగా తొలగించారని ఆరోపించాడు. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశాడు.ఈ విషయంలో జోహెబ్‌ భారత్‌ను నిందించడాన్ని భారతీయులు తప్పుబడుతున్నారు. ఏదైనా ఉంటే యూఏఈతో బోర్డుతో చూసుకోవాలి కాని, భారత మూలలున్న వారిని అడ్డం పెట్టుకొని భారత్‌ను నిందించడం సరికాదని వార్నింగ్‌ ఇస్తున్నారు.కాగా, జోహెబ్ తొలగింపుతో యూఏఈ జట్టులో కలకలం రేగినా, టోర్నమెంట్‌లో వారి ప్రయాణం కొనసాగుతుంది. రేపు (ఫిబ్రవరి 10) జరిగే మొదటి మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. ఆ తర్వాతి మ్యాచ్‌లు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరగనున్నాయి. ప్రీ-టోర్నమెంట్‌లో ఇటలీతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యూఏఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక, కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. జోహెబ్ లేకుండా యూఏఈ జట్టు మరింత బలహీనపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ.. కెనడా, ఆఫ్ఘనిస్తాన్‌పై గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచకప్‌లో యూఏఈ స్క్వాడ్: మహ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిఖీ, మయాంక్ కుమార్, మహ్మద్ అర్ఫాన్, మహ్మద్ ఫారూక్, మహ్మద్ జవాదుల్లా, రోహిద్ ఖాన్, సోహెబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్

KL RAHUL SCORED A HUNDRED AND WON THE PLAYER OF THE MATCH AWARD IN RANJI TROPHY QUARTER FINAL AGAINST MUMBAI3
కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో అద్భుతమైన శతకం సాధించి, తన జట్టుకు (కర్ణాటక) అపురూప విజయాన్ని అందించాడు. ఈ శతకం ఛేదనల్లో అత్యుత్తమమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా మిగిలిపోనుంది. 325 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాహుల్‌ అద్వితీయమైన సమయస్పూర్తి ప్రదర్శించి చారిత్రక శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా బ్యాటింగ్‌ చేసి విజయం ఖరారయ్యే వరకు క్రీజ్‌లో ఉన్నాడు. 182 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మరణ్‌ రవిచంద్రన్‌తో పాటు రాహుల్‌ నెలకొల్పిన 147 పరుగుల భారీ భాగస్వామ్యం మ్యాచ్‌ను కర్ణాటకవైపు మళ్లించింది.స్మరణ్‌ అజేయమైన అర్ద శతకం (83) సాధించి, కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. విద్యాధర్‌ పాటిల్‌ (31 నాటౌట్‌) స్మరణ్‌కు అండగా నిలిచాడు. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని కర్ణాటక 73.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే తొలి సెమీఫైనల్లో కర్ణాటక ఉత్తరాఖండ్‌తో తలపడుతుంది.కర్ణాటకతో మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు.అనంతరం కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు.ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

T20 WC: Scotland records highest associate team Total Beats Italy4
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో స్కాట్లాండ్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-సిలో భాగంగా కోల్‌కతాలో సోమవారం ఇటలీతో తలపడింది స్కాట్లాండ్‌. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఇటలీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లలో జార్జ్‌ మున్సే (54 బంతుల్లో 84) అదిరిపోయే ఆరంభం అందించగా.. మైకేల్‌ జోన్స్‌ (37) కూడా రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన బ్రెండన్‌ మెక్‌ముల్లన్‌ (18 బంతుల్లో 41 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టగా.. ఆఖర్లో మైకేల్‌ లీస్క్‌ (5 బంతుల్లో 22 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్‌ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్‌ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 207 పరుగులు సాధించింది. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో 200కు పైగా స్కోరు చేసిన తొలి అసోసియేట్‌ జట్టుగా స్కాట్లాండ్‌ చరిత్ర సృష్టించింది.McMullen charges out and pumps it clean over long-on for a glorious hit. 🙌Marching towards 200! 💪ICC Men’s #T20WorldCup | #SCOvITA | LIVE NOW 👉 https://t.co/iRy5VavUwZ pic.twitter.com/Ax7EvdDitH— Star Sports (@StarSportsIndia) February 9, 2026ఇక లక్ష్య ఛేదనలో ఇటలీ ఆది నుంచే తడబడింది. టాపార్డర్‌లో జస్టిన్‌ మోస్కా (0), ఆంటోనీ మోస్కా (13) విఫలం కాగా.. జేజే స్మట్స్‌ 22 పరుగులు చేశాడు. హ్యారీ మానెంటి (25 బంతుల్లో 37), బెన్‌ మానెంటి (31 బంతుల్లో 52) రాణించినా.. మిగతా వారి నుంచి సహకారం లభించలేదు.73 పరుగుల తేడాతో ఓటమిఆరో స్థానం నుంచి బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లు స్కాట్లాండ్‌ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. 2, 0, 3*, 2, 0, 0, 0 స్కోర్లతో వెనుదిరిగారు. దీంతో 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి ఇటలీ ఆలౌట్‌ అయింది.ఫలితంగా స్కాట్లాండ్‌ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాటిష్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మైకేల్‌ లీస్క్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్‌ వాట్‌ రెండు, బ్రాడ్‌ క్యూరీ, బ్రాడ్‌ వీల్‌, ఒలివర్‌ డేవిడ్‌సన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అనూహ్య రీతిలో స్కాట్లాండ్‌ రేసులోకి వచ్చింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఓడిన ఈ జట్టు.. తాజాగా ఇటలీని ఓడించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే.. ఇటలీ ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.చదవండి: IND vs PAK: పాక్‌ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ

BCCI Clears Stance After ICC Meeting Lahore Renews Ind Vs Pak Match Hopes5
IND Vs PAK: పాక్‌తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) యూటర్న్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్‌లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తరఫున అమినుల్‌ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్‌ ఆడాలంటే.. ఈ మ్యాచ్‌లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్‌ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరించామన్న పాక్‌ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్‌ ప్లాన్‌!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్‌ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్‌ ప్లాన్‌ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్‌ ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్‌ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్‌ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్‌ సైతం తమకు భారత్‌లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్‌ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్‌ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్‌.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తామని పాక్‌ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్‌కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్‌లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్‌లు ఆడామని గుర్తు చేసింది.భారత్‌- పాక్‌ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్‌ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్‌ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్‌.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్‌ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026

'Chanafali Bech Rahe The Kya': Ex-Pak Star Tear Into Team Over NED Show6
జస్ట్‌ మిస్‌.. పల్లీలు అమ్ముకుంటారా?: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాళ్ల తీరుపై మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ మండిపడ్డాడు. జట్టుకు ఉపయోగపడని అనుభవం ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు. పసికూన చేతిలో తృటిలో పరాభవం తప్పిందని.. లేదంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా భారత్‌- శ్రీలంక వేదికగా శనివారం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ మొదలైన విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. అయితే, మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ గెలుపు బోణీ కొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు బంతులు ఉండగా నెదర్లాండ్స్‌ విధించిన సాధారణ 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్‌ ఏడు వికెట్లు కోల్పోవడంతోపాటు ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు ఉండగా నెగ్గి ఊపిరి పీల్చుకుంది.తొలుత నెదర్లాండ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. బాస్‌ డీ లీడ్‌ (30; 4 ఫోర్లు), మిచెల్‌ లెవిట్‌ (24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), అకెర్‌మన్‌ (20; 4 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో సల్మాన్‌ మీర్జా 3 వికెట్లు పడగొట్టగా... సయీమ్‌ అయూబ్, అబ్రార్‌ అహ్మద్, నవాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (31 బంతుల్లో 47;4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. 18 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ జట్టు 119/7తో ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (12), బాబర్‌ ఆజమ్‌ (15), ఉస్మాన్‌ ఖాన్‌ (0), షాదాబ్‌ ఖాన్‌ (8), నవాజ్‌ (6) విఫలమయ్యారు.ఫహీమ్‌ ఆష్రఫ్‌ రాణించడంతోవిజయానికి చివరి 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫహీమ్‌ ఆష్రఫ్‌ (11 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ షాట్‌లతో విజృంభించాడు. ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో అతడు 6, 2, 6, 6, 4తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం చిన్నబోయింది. నెదర్లాండ్స్‌ బౌలర్లలో ఆర్యన్‌ దత్, పాల్‌ వ్యాన్‌ మీకెరెన్‌ చెరో 2 వికెట్లు తీశారు. నిజానికి ఆఖరి ఓవర్లో ఆష్రఫ్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఒడౌడ్‌ వదిలేయడంతో అతడికి లైఫ్‌ రాగా.. పాక్‌ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో బసిత్‌ అలీ (Basit Ali) పాక్‌ ప్రదర్శనపై.. ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజం (Babar Azam), నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌ బతికిపోయింది"పాకిస్తాన్‌ బతికిపోయింది. చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది. షాహిన్‌ ఆఫ్రిది బ్యాటింగ్‌ చేయడానికి వచ్చినప్పుడే అంతా అయిపోయిందనుకున్నాం. మిడిలార్డర్‌ చెత్తగా ఆడింది. ముఖ్యంగా బాబర్‌ ఆజం, నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ అసలేం చేశారో వారికైనా తెలుసా?వీళ్లంతా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌లు ఆడుతున్నారు. కానీ ఈరోజు పాకిస్తాన్‌ తరఫున ఒక్కరూ హీరోగా నిలవలేకపోయారు. అందరూ జీరోలుగా మిగిలిపోయారు. బాబర్‌ ఆజం బ్యాటింగ్‌కు రాగానే అంతా సంతోషించారు. అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తాడని భావించారు.పల్లీలు అమ్ముకోవడానికి వెళ్లారా?కానీ ఇలా వచ్చి అలా వెళ్లడం అతడికి అలవాటైపోయింది. ఫహీమ్‌ ఆష్రఫ్‌ లేకుంటే ఈరోజు పాక్‌ పరువు పోయి ఉండేది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి స్టార్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా పల్లీలు అమ్ముకోవడానికి అక్కడికి వెళ్లారా?’’ అంటూ బసిత్‌ అలీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

IND vs USA Match: Rohit Sharma Politely Denies Mukesh Ambani Food Offer Viral7
ముకేశ్‌ అంబానీకి నో చెప్పిన రోహిత్‌ శర్మ!

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరొందాడు రోహిత్‌ శర్మ. భారత్‌కు 2024లో టీ20 ప్రపంచకప్‌ అందించిన హిట్‌మ్యాన్‌.. 2025లో చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్‌ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్‌ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్‌ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో హిట్‌మ్యాన్‌ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్‌ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్‌కప్‌ అంబాసిడర్‌గా నియమించింది.వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్‌కప్‌ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్‌ శర్మ. అమెరికాతో మ్యాచ్‌ నేపథ్యంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్‌కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్‌ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్‌ మ్యాచ్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్‌ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్‌కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్‌ అంబానీ స్వయంగా ఛాయ్‌ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్‌తో కూడిన సాసర్‌ను ముకేశ్‌ అంబానీ రోహిత్‌ శర్మకు అందించారు. అయితే, రోహిత్‌ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma  (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్‌కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హిట్‌మ్యాన్‌ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్‌ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్‌. అయితే, రోహిత్‌ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

T20 WC: Washington Sundar To join team before IND vs NAM In Delhi8
T20 WC 2026: టీమిండియాకు శుభవార్త

టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు భారత ప్రధాన జట్టులో మార్పులు జరిగాయి. యువ పేసర్‌ హర్షిత్‌ రాణా గాయం వల్ల దూరం కాగా.. సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అనూహ్య రీతిలో..దాదాపు ఏడాదిన్నర క్రితం చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌ ఆడిన సిరాజ్‌ (Mohammed Siraj).. అనూహ్య రీతిలో వరల్డ్‌కప్‌ జట్టులోకి రావడమే కాకుండా.. తుదిజట్టులోనూ స్థానం సంపాదించాడు. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా అమెరికాతో తలపడగా.. భారత్‌ విజయంలో సిరాజ్‌ తన వంతు పాత్ర పోషించాడు.ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ హైదరాబాదీ పేసర్‌.. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన సిరాజ్‌ 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు.టీమిండియాకు శుభవార్తఇదిలా ఉంటే.. టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన​ సుందర్‌ (Washington Sundar) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన ఈ చెన్నై చిన్నోడు.. నమీబియాతో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ధ్రువీకరించాడు.అమెరికాపై గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘వాషీ ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు. అతడు బాగున్నాడు. అంతా బాగుంది’’ అని తెలిపాడు. ఇక బుమ్రా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడన్న సూర్య.. వాతావరణ మార్పు వల్లే అతడు ఇబ్బంది పడుతున్నాడని వెల్లడించాడు.కాగా ముంబై వేదికగా తమ తొలి మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించి గెలుపు బోణీ కొట్టింది. తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ వేదికగా నమీబియా జట్టుతో గురువారం సూర్య సేన తలపడుతుంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి టీమిండియాసూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

T20 World Cup 2026 February 9 Schedule Venues Timings Details9
T20 WC 2026 Feb 9: ఈరోజు జరిగే మ్యాచ్‌లు ఇవే

భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7) తెరలేచింది. శ్రీలంకలోని కొలంబోలో తొలుత గ్రూప్‌-‘ఎ’ నుంచి పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌ తలపడ్డాయి. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ మూడు వికెట్ల తేడాతో గట్టెక్కి పాక్‌ ఊపిరి పీల్చుకుంది.ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవేఅనంతరం మధ్యాహ్నం మ్యాచ్‌లో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విండీస్‌ 35 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది. ఇక సాయంత్రం మ్యాచ్‌లో గ్రూప్‌-ఎ నుంచి టీమిండియా- అమెరికా తలపడగా.. భారత జట్టు 29 పరుగుల తేడాతో గెలుపొందింది.ఇక ఆదివారం (ఫిబ్రవరి 8) నాటి మ్యాచ్‌లో చెన్నైలో అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్‌.. ముంబైలో నేపాల్‌పై ఇంగ్లండ్‌.. ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించాయి. మరి సోమవారం నాటి షెడ్యూల్‌ ఎలా ఉందంటే..టీ20 ప్రపంచకప్‌-2026: ఫిబ్రవరి 9 షెడ్యూల్‌ ఇదేగ్రూప్‌-సి: స్కాట్లాండ్‌ వర్సెస్‌ ఇటలీ- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా- ఉదయం 11 గంటలకు ఆరంభంగ్రూప్‌-బి: జింబాబ్వే వర్సెస్‌ ఒమన్‌- సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌, కొలంబో- మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంగ్రూప్‌-డి: సౌతాఫ్రికా వర్సెస్‌ కెనడా- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌- రాత్రి ఏడు గంటలకు ఆరంభంకాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, నమీబియా, నెదర్లాండ్స్‌, అమెరికా.. గ్రూప్‌- బి నుంచి శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఒమన్‌, ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి.ఇక గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఇటలీ, నేపాల్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ, అఫ్గనిస్తాన్‌ రేసులో ఉన్నాయి. స్టార్‌ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!

T20 WC: Gambhir hosts Team Indi for special dinner in Delhi Video Viral10
సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్‌

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌-2026 టోర్నీని విజయంతో ఆరంభించింది టీమిండియా. ముంబై వేదికగా శనివారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. తదుపరి.. గురువారం నాటి మ్యాచ్‌లో నమీబియాతో భారత్‌ మ్యాచ్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం ఇందుకు వేదిక.సతీసమేతంగాఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) భారత జట్టును తమ ఇంటికి ఆహ్వానించాడు. తొలుత కారులో గంభీర్‌ తమ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం భార్య నటాషా, పిల్లలతో కలిసి టీమిండియాను తమ నివాసానికి సాదరంగా ఆహ్వానించాడు.ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, ఆటగాళ్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో ఉన్న గంభీర్‌ నాలుగు అంతస్థుల విలాస భవనానికి విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.#WATCH | Members of the Indian T20 cricket team arrive at the residence of Indian Cricket Team Head Coach Gautam Gambhir in Delhi. Gautam Gambhir is hosting a special dinner for the team https://t.co/VQ2symRZ2M pic.twitter.com/tXgiuAwN6D— ANI (@ANI) February 8, 2026అందుకే డిన్నర్‌ పార్టీలుకాగా టీమిండియాకు ఆటవిడుపు కలిగించేందుకు, జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా గంభీర్‌ డిన్నర్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగానూ ఇలాగే ఆటగాళ్లకు పార్టీ ఇచ్చాడు. ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆటగాళ్ల మధ్య ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉన్నా వాటికి పరిష్కారం చూపేలా హెడ్‌కోచ్‌ ఇలాంటి వేదికను ఏర్పాటు​ చేసినట్లు తెలుస్తోంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌.. గ్రూప్‌-ఎలో పాకిస్తాన్‌, నమీబియా, అమెరికా, నెదర్లాండ్స్‌ దేశాలతో కలిసి ఉంది. తొలుత అమెరికాతో మ్యాచ్‌ ఆడిన టీమిండియా.. ఆ తర్వాత గురువారం నమీబియా (ఫిబ్రవరి 12), ఆదివారం పాకిస్తాన్‌ (ఫిబ్రవరి 15).. లీగ్‌ దశలో చివరగా వచ్చే బుధవారం (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడేలా షెడ్యూల్‌ ఖరారైంది.టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టుసూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, మొహమ్మద్‌ సిరాజ్‌.చదవండి: T20 WC 2026: టీమిండియాతో ఆడతాం కానీ..: బుద్ధి చూపించిన పాకిస్తాన్‌!#WATCH | Indian Cricket Team Head Coach Gautam Gambhir arrives at his residence in Delhi pic.twitter.com/Y3yg3yvgVy— ANI (@ANI) February 8, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement