Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pathum Nissankas century powers Sri Lanka to Super 81
ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఆస్ట్రేలియాకు మ‌రోసారి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం పల్లెకెలె వేదిక‌గా జ‌రిగిన గ్రూపు-బి మ్యాచ్‌లో ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది.ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 56), కెప్టెన్ మిచెల్ మార్ష్ (54) మొదటి వికెట్‌కు 104 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించారు. ఒక దశలో 104/0 తో ఉన్న ఆస్ట్రేలియాను లంక స్పిన్నర్లు దూషన్ హేమంత, దునిత్ వెల్లలాగే కట్టడి చేశారు. కేవలం 77 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ త‌న 10 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. శ్రీలంక బౌల‌ర్ల‌లో హేమంత మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. చ‌మీరా, క‌మిందు మెండిస్‌, వెల్ల‌లాగే త‌లా వికెట్ సాధించారు.నిస్సాంక సూప‌ర్ సెంచ‌రీ..అనంత‌రం 182 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. లంక ఓపెన‌ర్ పాథుమ్ నిస్సాంక అజేయ సెంచ‌రీతో స‌త్తాచాటాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన నిస్సాంక‌.. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి టార్గెట్‌ను ఫినిష్ చేశాడు.నిస్సాంక 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో స‌రిగ్గా 100 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడాది పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే తొలి సెంచ‌రీ కావ‌డం గమ‌నార్హం. అత‌డితో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ (51), ప‌వ‌న్ ర‌త్నాయకే(28) రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిష్ ఒక్క‌డే రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.ఆసీస్ ఇంటికే!ఈ విజ‌యంతో గ్రూపు-బి నుంచి శ్రీలంక సూప‌ర్‌-8కు అర్హ‌త సాధించింది. కానీ వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మి పాలైన ఆసీస్ మాత్రం త‌మ సూప‌ర్‌-8 అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. ఈ గ్రూపు పాయింట్ల ప‌ట్టిక‌లో జింబాబ్వే(4 పాయింట్లు) రెండో స్దానంలో ఉంది. ఆసీస్ సూప‌ర్-8కు చేరాలంటే జింబాబ్వే త‌మ త‌దుప‌రి మ్యాచ్‌ల‌లో ఐర్లాండ్, శ్రీలంకపై ఓడిపోవాలి. అదేవిధంగా ఒమ‌న్‌పై ఆసీస్ భారీ విజ‌యం సాధించాలి.

Former Indian cricketer S Sreesanth Shares his Success Mantra in Rooted For Life podcast2
భారత్‌ ప్రపంచకప్‌ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్‌

మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్‌లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్‌ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్‌ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్‌లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్‌లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్‌లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు.

T20 WC 2026:Pakistan Set To Take Drastic Step After India Thrashing, Axe 2 Superstars says Report3
భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్‌ కీలక నిర్ణయాలు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్‌ ఆటగాళ్ల పేర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది అని తెలుస్తుంది.వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం​ జారీ చేసినట్లు సమాచారం. పాక్‌ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్‌లో బాబర్‌, అఫ్రిది స్థానాల్లో సల్మాన్‌ మీర్జా, నసీం షా, ఫకర్‌ జమాన్‌, ఖ్వాజా నఫాయ్‌ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.భారత్‌ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్‌ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్‌ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్‌, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్‌ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.పాక్‌ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్‌ చేస్తున్నాడని మెజార్జీ పాక్‌ క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయట. నఖ్వీ భారత్‌ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్‌ ఆటగాళ్లతో పాటు హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై 61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్‌ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్‌ ఆటుఇటైతే పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్‌తో పాటు యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరుకుంటుంది.

T20 WC 2026: England into super 8 by beating Italy4
T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాం​పియన్‌ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్‌ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్‌ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్‌ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్‌ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్‌ గట్టెక్కింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఇంగ్లండ్‌ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ 28, బట్లర్‌ 3, బేతెల్‌ 23, బాంటన్‌ 30, బ్రూక్‌ 14, సామ్‌ కర్రన్‌ 25, ఓవర్టన్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్‌, కలుగమగే చెరో 2, స్మట్స్‌, అలీ హసన్‌, బెన్‌ మనెంటి తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్‌ మనెంటి (60), జస్టిన్‌ మోస్కా (43), గ్రాంట్‌ స్టివర్ట్‌ (45) ఇంగ్లండ్‌ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. బెన్‌ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్‌ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌​ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్‌ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్‌ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్‌ కర్రన్‌ స్టీవర్ట్‌ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 19 ఓవర్‌లో కర్రన్‌ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్‌ వికెట్‌ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్‌ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్‌లో ఓవర్టన్‌ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్‌ చేశాడు. తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్ని మెప్పించింది.

Hardik Pandya Dons Multi Million Watch In IND vs PAK Encounter, Check Price Inside5
పాకిస్తాన్ మ్యాచ్‌లో శివుడి ప్రతిమ ఉన్న వాచ్‌ ధరించిన హార్దిక్‌.. ధర ఎంతో తెలుసా..?

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు లగ్జరీ వాచ్‌ల పట్ల ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ బరోడా ఆటగాడు ప్రపంచంలో దొరికే దాదాపు అన్ని ఖరీదైన వాచ్‌లు తన కలెక్షన్‌లో కలిగి ఉన్నాడు. తాజాగా హార్దిక్‌ ధరించిన మరో లగ్జరీ వాచ్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ Jacob & Co. Epic X Chrono 44mm Titanium వాచ్‌ ధరించి అందరి దృష్టిని ఆకర్శించాడు. ఈ వాచ్ ధర భారత మార్కెట్లో రూ. 29 లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు ఉంటుందని అంచనా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. వాచ్ డయల్‌పై శివుడి ప్రతిమ చెక్కబడినట్లు తెలుస్తుంది. నిన్న శివరాత్రి కావడంతో హార్దిక్‌ తన భక్తిని ఈరకంగా చాటుకున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు.హార్దిక్‌ వాచ్‌ల కలెక్షన్‌హార్దిక్‌ వాచ్‌ల కలెక్షన్‌ గురించి గతంలో చాలా విషయాలు విన్నాం. అతని వద్ద రూ. 100 కోట్ల విలువ గల లగ్జీర వాచ్‌ల కలెక్షన్‌ ఉంటుందని అంచనా. గతంలో హార్దిక్‌ ధరించిన అతి ఖరీదైన వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.- Richard Mille RM 27-04 – ధర ₹20 కోట్లు (2025 ఆసియా కప్ ట్రైనింగ్ సమయంలో ధరించాడు) - Richard Mille RM 27-02 – ధర ₹7 కోట్లు (2026 ప్రారంభంలో కనిపించాడు). - Richard Mille RM 56-03 Blue Sapphire – ధర ₹53–54 కోట్లు (ప్రపంచంలో ఈ వాచ్‌లు కేవలం మూడు మాత్రమే తయారు చేశారు). - Rolex Daytona Rainbow – ధర ₹4–5 కోట్లు (సఫైర్లు, డైమండ్లతో అలంకరించిన వాచ్).- Audemars Piguet Royal Oak – ధర ₹3.25 కోట్లు (డబుల్ బ్యాలెన్స్ వీల్ ఓపెన్‌వర్క్డ్ & పర్పెచువల్ క్యాలెండర్ (18K రోజ్ గోల్డ్). - Rolex Eye of the Tiger – ధర ₹2–2.5 కోట్లు (ప్రత్యేకమైన Rolex Cosmograph Daytona)భారత్‌-పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ హార్దిక్‌ బ్యాట్‌తో ప్రభావం​ చూపించలేకపోయినా, బంతితో సత్తా చాటాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్‌ (తొలి ఓవరే) కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో అతను ఓ క్యాచ్‌ కూడా పట్టాడు. బ్యాట్‌తో రాణించకపోయినా, బంతితో మెరిసి హార్దిక్‌ భారత గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ పాక్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సూపర్‌-8కు అర్హత సాధించింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం భారత బౌలర్లు కలిసికట్టుగా రాణించి పాక్‌ను 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూల్చారు. భారత గెలుపులో ప్రధానపాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Amelia Kerr named all format New Zealand captain6
న్యూజిలాండ్‌కు కొత్త కెప్టెన్‌

న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్ ఆ జట్టు నూతన ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా నియమించబడింది. సోఫీ డివైన్ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కెర్ న్యూజిలాండ్‌ సారధిగా బాధ్యతలు చేపట్టింది.25 ఏళ్ల కెర్‌ 2016లో 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కుడి చేతి వాటం బ్యాటర్‌, లెగ్‌ స్పిన్నర్‌ అయిన కెర్‌.. ఇప్పటివరకు 84 వన్డేలు, 88 టీ20లు ఆడింది. వన్డేల్లో 4 సెంచరీలు, 10 హాఫ్‌ సెంచరీల సాయంతో 2304 పరుగులు చేసింది. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ కూడా (232*) ఉంది. అలాగే బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 106 వికెట్లు తీసింది. టీ20ల్లో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో, 5 హాఫ్‌ సెంచరీల సాయంతో 1453 పరుగులు చేసిన కెర్‌.. బౌలింగ్‌లో 2 నాలుగు వికెట్ల ప్రదర్శనల సాయంతో 95 వికెట్లు తీసింది.కెర్‌ 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకుంది. అదే ఏడాది ఐసీసీ మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు కూడా గెలుచుకొని, ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్‌ ప్లేయర్‌ అయ్యింది. కెర్‌ న్యూజిలాండ్‌ ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత భావోద్వేగానికి లోనైంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నా చిన్ననాటి కల. ఇప్పుడు కెప్టెన్‌గా అవకాశం రావడం గొప్ప గౌరవమని పేర్కొంది. ఈ జట్టులో ఉన్న ప్రతిభ, కృషి, అంకితభావం నన్ను ఉత్సాహపరుస్తున్నాయి. మనం కలిసి గొప్ప విజయాలు సాధించగలమని నమ్ముతున్నాను అంటూ కెర్ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేసింది.కెర్‌ ఎంపికపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ బెన్ సాయర్ హర్షం వ్యక్తం చేశారు. కెర్ జట్టులో గౌరవం పొందిన నాయకురాలు. ఆమె నాయకత్వం న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ భవిష్యత్తుకు స్థిరత్వం, నిరంతరతను ఇస్తుందని అన్నారు. కెర్ తన కెప్టెన్సీ కెరీర్‌ను జింబాబ్వేతో జరిగే హోమ్ సిరీస్‌తో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 25న సెడ్డన్ పార్క్‌లో జరిగే మొదటి టీ20 ఈ సిరీస్‌ మొదలవుతుంది. కెర్‌ ముందున్న సవాళ్లు - 2026లో ఇంగ్లండ్‌లో T20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడం. - 2027లో శ్రీలంకలో ICC T20 ఛాంపియన్స్ ట్రోఫీ. - 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, T20 ప్రపంచకప్.

Ishan Kishan To Marry Girlfriend Aditi Hundia After T20 World Cup.. Family Agrees On Camera7
పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాన్‌ కిషన్‌

టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్‌ తాత అనురాగ్‌ పాండే స్వయంగా వెల్లడించారు. ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్‌ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ పేరు అదితి. ఆమె ఓ మోడల్‌. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఇషాన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇషాన్‌ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ ప్రధాన కారణంగా భారత్‌ పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ​మ్యాచ్‌ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్‌ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్‌ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.పాక్‌పై వీరబాదడు తర్వాత ఇషాన్‌ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్‌నిస్తుంది. వాస్తవానికి ఇషాన్‌-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్‌మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. ఇషాన్‌ తాత తాజా ప్రకటనతో ఇషాన్‌-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్‌ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక​ ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.ఎవరీ అదితి హుండియా..?ఇషాన్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ మోడల్‌. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్‌లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ జైపూర్‌లో అభ్యసించింది. జైపూర్‌లోని సెయింట్‌ జేవియర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్‌ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్‌ మిస్‌ రాజస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆతర్వాత 2018 మిస్‌ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2018లో మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్‌గా, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్‌లోనూ నటించింది.ఇషాన్‌-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్‌ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్‌తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్‌ అభిమానులు గూగుల్‌ చేయడం మొదలుపెట్టారు.

Smith replaces injured Hazlewood in Australia T20 World Cup 2026 squad8
ప్రపంచకప్‌ జట్టులో స్టీవ్‌ స్మిత్‌

ఆసీస్‌ దిగ్గజ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులోకి లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ముందుగా అనుకున్నట్లు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌కు ప్రత్యామ్నాంగా కాదు. స్మిత్‌ ఆసీస్‌ వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌కు రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.కాలి గాయంతో బాధపడుతున్న హాజిల్‌వుడ్‌ సూపర్‌-8 సమయానికంతా కోలుకుంటాడని ముందుగా భావించారు. అయితే ఇలా జరగకపోగా.. హాజిల్‌వుడ్‌ టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. హాజిల్‌వుడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడం​ వల్లనే ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించినట్లు సీఏ తెలిపింది.ఆసీస్‌ సెలెక్టర్లు స్పెషలిస్ట్‌ పేసర్‌ అయిన హాజిల్‌వుడ్‌ స్థానాన్ని స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అయిన స్టీవ్‌తో భర్తీ చేయడం ఆసక్తికరంగా మారింది. పైగా స్టీవ్‌ అంతర్జాతీయ టీ20 ఆడక​ ఏడాదైపోయింది. టీ20 ప్రపంచకప్‌లో అతని చివరి ప్రదర్శన 2022లో వచ్చింది. స్టీవ్‌కు టీ20 ప్రపంచకప్‌తో పాటు యావత్‌ టీ20 ఫార్మాట్‌లోనే పెద్ద ట్రాక్‌ రికార్డు లేదు. అయితే స్టీవ్‌ ఎంపిక గత రికార్డులను చూసి కాకుండా, అతని తాజా బీబీఎల్‌ ప్రదర్శన ఆధారంగా జరిగింది. స్టీవ్‌ ఇటీవల ముగిసిన బీబీఎల్‌లో 59.80 సగటున, 167.97 స్ట్రయిక్‌రేట​్‌తో 299 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొని సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టీవ్‌ ఎంట్రీ ఆసీస్‌కు ఏమేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి. మరోపక్క ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ సేవలను కూడా తొలి రెండు మ్యాచ్‌లకు కోల్పోయింది. మార్ష్‌ గాయం కారణంగా ఐర్లాండ్‌, జింబాబ్వే మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. తొలుత స్టీవ్‌ను మార్ష్‌కు బ్యాకప్‌గా ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతమందుతున్న సమాచారం ప్రకారం, మార్ష్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఆసీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో (ఫిబ్రవరి 16) శ్రీలంకతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఆసీస్‌కు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు గ్రూప్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గ్రూప్‌-బిలో ఆసీస్‌ ప్రస్తుతం శ్రీలంక, జింబాబ్వే తర్వాత మూడో స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ గ్రూప్‌ దశలో ఒమన్‌తో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ ఫిబ్రవరి 20న జరుగనుంది.అప్‌డేటెడ్‌ ఆసీస్‌ జట్టు..మిచెల్‌ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎలిస్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

How Can Pakistan Qualify For Super 8s After Defeat To IND In T20 WC 20269
పటిష్ట స్థితిలో అమెరికా.. పాక్‌ సూపర్‌-8 చేరాలంటే?

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాకిస్తాన్‌పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సల్మాన్‌ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.తదుపరి నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్‌-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్‌ దశలో అమెరికా నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.పటిష్ట స్థితిలో అమెరికాఇందులో భారత్‌, పాకిస్తాన్‌ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్‌, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్‌ ఓడిపోవడంతో అమెరికా సూపర్‌-8 ఆశలు సజీవమయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్‌-8కు చేరాలంటే పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్‌ గెలిస్తేనే సూపర్‌-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్‌ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్‌కు చెడ్డపేరు ఉంది.పాక్‌ సూపర్‌-8 చేరాలంటే?మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్‌ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్‌ అయిన ఇంగ్లండ్‌ను వణికించగా.. తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడుతున్న ఇటలీ నేపాల్‌ను చిత్తు చేసింది.కాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో పాక్‌ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్‌-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్‌ మాదిరే ఈసారి లీగ్‌ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్‌ తమ తొలి రెండు మ్యాచ్‌లలో నెదర్లాండ్స్‌, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్‌రన్‌రేటు -0.403.నెట్‌రన్‌రేటు పరంగాకాబట్టి నమీబియాతో మ్యాచ్‌లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్‌ అమెరికాను దాటి సూపర్‌-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్‌రన్‌రేటు పరంగా యూఎస్‌ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్‌కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్‌, టీమిండియా మాత్రమే సూపర్‌-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.చదవండి: అభిషేక్‌ శర్మ ఫెయిల్‌.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

T20 WC 2026: Rashid becomes the first bowler ever to complete 700 wickets in T20s10
T20 WC 2026: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు, ఈ జనరేషన్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యావత్‌ పొట్టి ఫార్మాట్‌లో (అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్‌ లీగ్‌లు) 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. 2015లో కెరీర్‌ మొదలుపెట్టిన రషీద్‌ టీ20 ఫార్మాట్‌లో 517 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతని సగటు 18.5 కాగా.. ఎకానమీ 6.59గా ఉంది. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 5 వికెట్ల ఘనతలు నాలుగు సార్లు.. 4 వికెట్ల ఘనతలు 18 సార్లు నమోదు చేశాడు. రషీద్‌ కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు 6-17గా ఉన్నాయి. రషీద్‌ తన జాతీయ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడాడు. అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ తర్వాతి స్థానాల్లో (టాప్‌-5) విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (613), సౌతాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (572), విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (508) ఉన్నారు. రషీద్‌ ఖాతాలో అత్యధిక టీ20 వికెట్ల రికార్డుతో పాటు చాలా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ రికార్డులు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో రషీద్‌ నాలుగు హ్యాట్రిక్‌లు నమోదు చేశాడు. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 432 మంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. టీ20ల్లో ఏ బౌలర్‌ ఇంతమంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేయలేదు. అలాగే రషీద్‌ భారత్‌, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో 100కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరూ సాధించలేదు. రషీద్‌ ఒక్క ఆసియా ఖండంలోనే 400కు పైగా వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా ఎవరి వల్ల కాలేదు. 2017 నుంచి 2025 వరకు రషీద్‌ ప్రతి ఏడాది కనీసం 50 వికెట్లు తీశాడు. ఇది కూడా ఎవరూ సాధించలేదు. బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ ద్వారా రషీద్‌ 379 వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా కేవలం రషీద్‌కు మాత్రమే సొంతం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విలియం లిల్లీవైట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వసీం​ అక్రమ్‌, టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఖాన్‌ 700 వికెట్ల మైలురాయిని తాకిన తొలి బౌలర్లు.మ్యాచ్‌ విషయానికొస్తే.. యూఏఈపై ఆఫ్ఘనిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షోయబ్‌ ఖాన్‌ (68) అర్ద సెంచరీతో రాణించగా.. అలీషాన్‌ షరాఫు (40) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 4 వికెట్లతో చెలరేగాడు. ముజీబ్‌ రెహ్మాన్‌ 2, రషీద్‌ ఖాన్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ వికెటే రషీద్‌కు టీ20ల్లో 700వ వికెట్‌.అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్‌ (53) ఆఫ్ఘన్‌ గెలుపుకు పునాది వేయగా.. ఒమర్‌జాయ్‌ (40 నాటౌట్‌) తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement