ప్రధాన వార్తలు
వెస్టిండీస్ స్టార్ సంచలన నిర్ణయం
వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి వైదొలిగాడు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మోతీ విండీస్ జట్టుతో పాటు పశ్చిమ ఆసియాలో యుద్దం కారణంగా వారం రోజుల పాటు భారత్లో చిక్కుకుపోయాడు. ఇప్పుడు మరోసారి ఆసియాకు ప్రయాణించి రిస్క్ తీసుకోడదని అతడు భావించినట్లు సమాచారం. ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో మోతీ లాహోర్ ఖలందర్స్కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అతడు గైర్హజరీలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగేను లాహోర్ తమ జట్టులోకి తీసుకుంది.మోతీతో పాటు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. లాహోర్ ఖలందర్స్ కెప్టెన్గా షాహీన్ అఫ్రిది వ్యవహరించనున్నాడు.లాహోర్ ఖలందర్స్ జట్టు ఇదేఫఖార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, ఆసిఫ్ అలీ, తయ్యాబ్ తాహిర్, సికందర్ రాజా, దసున్ షనక, హుస్సేన్ తలత్, డేవిడ్ వీస్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉసామా మీర్, సామ్ బిల్లింగ్స్, హసీబుల్లా ఖాన్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, దునిత్ వెల్లలాగే చదవండి: IPL 2026: జింబాబ్వే బౌలర్కు బంపరాఫర్?
’నా చిన్ని తమ్ముడు.. ఇకపై ఆమెకు మాత్రమే సొంతం’
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. కొత్త కోడలి రాకతో పరివారంలో సందడి నెలకొంది. ఈ క్రమంలో సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తమ్ముడు అర్జున్ టెండుల్కర్- మరదలు సానియా చందోక్లను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సానియా పాపిట్లో అర్జున్ తిలకం దిద్దుతున్న ఫొటోను పంచుకున్న సారా.. ‘‘నా చిన్ని తమ్ముడు.. ఇకపై సానియాకే సొంతం. ఈ విశ్వం మీపై అంతులేని ప్రేమ, ఆశీర్వచనాలు కురిపించాలి. మీ హృదయం కోరుకున్న ప్రతి ఒక్కటి మీకు దక్కాలి.మీకు ఎవరి దిష్టి తగలకూడదు. మీ ఇద్దరిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన రోజు మీ పెళ్లి రోజే అని చెప్పడంలో సందేహంలేదు’’ అని తమ్ముడు, మరదలిపై ప్రేమను కురిపించింది. తనకు సోదరిలేని లోటు తీర్చేలా సానియాను ఇచ్చినందుకు అర్జున్కు ఈ సందర్భంగా సారా ధన్యవాదాలు కూడా తెలిపింది.కాగా సచిన్- అంజలి దంపతుల ఏకైక కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహం మార్చి 5న సానియా చందోక్తో జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకు భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తదితరులు సతీసమేతంగా తరలివచ్చారు. ముకేశ్ అంబానీ కుటుంబం కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించింది.ఇదిలా ఉంటే.. తమ్ముడి పెళ్లిలో సారా కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. సంగీత్, మెహందీ వేడుకలో సంప్రదాయ దుస్తుల్లో సారా టెండుల్కర్ మరింత అందంగా కనిపించింది. ఇక అర్జున్- సానియా సంగీత్ ఫొటోలను షేర్ చేస్తూ.. వారి పట్ల మరోసారి సారా ప్రేమ చూపగా.. సానియా ఇందుకు.. ‘‘ధన్యవాదాలు.. లవ్ యూ సోదరి’’ అంటూ జవాబు ఇచ్చింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా. ఆమె కూడా ఎంటర్ప్రెన్యూర్గా రాణిస్తోంది.
IPL 2026: జింబాబ్వే బౌలర్కు బంపరాఫర్?
ఐపీఎల్-2026 సీజన్ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్-8 స్టేజ్కు చేరుకోవడంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.అతడికి పవర్ప్లేతో డెత్ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.ముస్తాఫిజుర్పై వేటు..కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ సూచింది.బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ను కేకేఆర్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా, భారత ఆల్రౌండర్ హర్షిత్ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.కేకేఆర్ పూర్తి జట్టు:అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రశాంత పహల్గామ్ లోయలో అమాయకులను కాల్చి చంపిన ఉగ్రమూకలపై భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ఉక్కుపాదం మోపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాక్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.కరచాలనానికి నిరాకరించిఇందుకు ప్రతిగా పాక్ సైన్యం రంగంలోకి దిగగా.. భారత ఆర్మీ వారి దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత క్రికెట్ జట్టు పాక్ జట్టుతో కరచాలనానికి నిరాకరించి నిరసన తెలియజేసింది. దీంతో పాక్ బోర్డు రాద్ధాంతం చేయగా ఐసీసీ రంగంలోకి దిగి చివాట్లు పెట్టింది.మొట్టికాయలు వేసిన ఐసీసీఅదే విధంగా టీమిండియాతో మ్యాచ్లో అతి చేసిన పాక్ ఆటగాళ్లకు గట్టిగానే మొట్టికాయలు కూడా వేసింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు.చెలరేగిన వివాదంఅయినా సరే బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని పాక్ బోర్డు మరోసారి డ్రామాలు ఆడి.. బొక్కబోర్లా పడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ‘ది హండ్రెడ్ లీగ్-2026’ వేలంలో సన్ గ్రూపునకు చెందిన కావ్యా మారన్ నేతృత్వంలోని సన్రైజర్స్ లీడ్స్ పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది.టీమిండియాతో మ్యాచ్లో అతి చేస్తూ.. ఆపరేషన్ సిందూర్ను కించపరిచే విధంగా వ్యవహరించిన అబ్రార్ కోసం సన్రైజర్స్ రూ. 2.34 కోట్లు వెచ్చించడంతో.. భారతీయ నెటిజన్లు లీడ్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ‘ది హండ్రెడ్ (ఇంగ్లండ్)’ విదేశీ లీగ్ కాబట్టి.. తాము ఈ విషయంలో జోక్యంచేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సన్రైజర్స్ తాజాగా విదేశీ లీగ్లో పాక్ ఆటగాడిని ఎంచుకోగా.. ఇంతకు ముందే పలు భారత టీ20 ఫ్రాంఛైజీలు పాక్ ప్లేయర్లకు తమ జట్టులో చోటు ఇచ్చాయి. అవేమిటంటే..భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు👉పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్, టీ20 ప్రపంచకప్ టోర్నీ-2026లో తన బౌలింగ్ యాక్షన్తో వార్తల్లోకి ఎక్కిన స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్కు ఆడారు. ఈ జట్టుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ యజమానులైన షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జై మెహతానే ఓనర్లు.👉ఇక అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MCL)లో గతేడాది పాక్ ఆల్రౌండర్ ఇమాద్ వసీం సీటెల్ ఆర్కాస్కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ జట్టు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంలో భాగమైన GMR గ్రూప్నకు చెందినది. 👉కాగా ఇమాద్ వసీం 2023-24 ILT20 సీజన్లో కేకేఆర్కు చెందిన అబు దాబి ఫ్రాంఛైజీకి ఆడాడు. ఇక పాక్ మరో క్రికెటర్ ఉస్మాన్ ఖాన్ ILT20 2025 సీజన్లో.. ముంబై ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్కు ప్రాతినిథ్యం వహించాడు. 👉ఇదిలా ఉంటే.. ది హండ్రెడ్ వేలంలో అబ్రార్ను సన్రైజర్స్ కొనగా.. మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ను బర్మింగ్హామ్ ఫొనిక్స్ కొనుగోలు చేసింది. ఈసారి ఈ వేలంలో పాక్ నుంచి వీరిద్దరే అమ్ముడుపోగా.. సయీమ్ ఆయుబ్, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి వాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
ఇరాన్ ఆడకపోవడమే మంచిది.. ట్రంప్ వార్నింగ్!
మరో రెండు నెలల్లో ఫుట్బాల్ సాకర్ ఫీవర్ మొదలుకానుంది. అమెరికా,మెక్సికో,కెనడా దేశాలు సంయుక్తంగా 2026 ఫిపా వరల్డ్కప్కు ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ ఏడాది జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాకర్ మెగాటోర్నీ జరగనుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రస్తుతం భీకరరూపం దాల్చింది. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్కప్ ఆడలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిపా వరల్డ్కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. తాజాగా జియాని వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్సోషల్ వేదికగా స్పందించారు. ‘ఇరాన్ ఫుట్బాల్ జట్టు సాకర్ ప్రపంచకప్లో ఆడడం, ఆడకపోవడమనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాకు వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎంతమాత్రం గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ వరల్డ్కప్కు దూరంగా ఉండడమే మంచిది’ అని సున్నితంగా హెచ్చరించారు.2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. నాటి ఫైనల్లో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో (4-2) ఫ్రాన్స్ను ఓడించింది. తద్వారా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ జూలై 19 వరకు జరగనుంది. మొత్తం 48 జట్లు పాల్గొననుండగా.. నాలుగేసి జట్లు 12గ్రూపులుగా విడిపోయి మ్యాచ్లు ఆడనున్నాయి. మొత్తం 104 మ్యాచ్లు జరగనుండగా, అందులో 78 మ్యాచ్లు అమెరికాలో, కెనడా, మెక్సికోలు చెరో 13మ్యాచ్లకు ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్-జిలో ఉన్న ఇరాన్.. బెల్జియం, ఈజిప్టు, న్యూజిలాండ్తో మ్యాచ్లు ఆడాల్సి ఉంది.చదవండి: మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!
ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదే..! రూ. 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ తొలి విడతగా కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. అతడు ఎంపిక చేసిన తుది జట్టు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గత సీజన్ మాదిరిగానే ఓపెనర్లగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను అతడు ఎంపిక చేశాడు. అదేవిధంగా మూడో స్ధానంలో పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్కు అవకాశమిచ్చాడు.ఆ తర్వాత వరుసగా నాలుగు ఐదు స్దానాల్లో క్లాసెన్,నితీష్ కుమార్ రెడ్డిలకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ వేలంలో భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు ప్రధాన ఆల్రౌండర్గా చోప్రా చోటు కల్పించాడు. ఏడో స్థానంలో అనికేత్ వర్మను ఫినిషర్గా అతడు తీసుకున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్కు వస్తాడని చోప్రా అంచనా వేశాడు. పేస్ బౌలింగ్ విభాగంలో కమ్మిన్స్తో పాటు జయదేవ్ ఉనద్కత్ ,శివమ్ మావిలకు చోటు దక్కింది. ఇక స్పిన్నర్గా జీషన్ అన్సారీని అతడు ఎంపిక చేశాడు. అయితే రూ.8 కోట్లతో ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న హర్షల్ పటేల్ను ఆకాష్ చోప్రా పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.ఆకాష్ చోప్రా ఎంపిక చేసిన ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఇదేఅభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టోన్, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, శివమ్ మావిచదవండి: IPL 2026: 'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్కే బ్యాక్ బోన్'
'ధోని, రుతురాజ్ కాదు.. అతడే సీఎస్కే బ్యాక్ బోన్'
టీ20 వరల్డ్కప్-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్ వరకు రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్-2026 సీజన్కు ముందు సీఎస్కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్పై భారత మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ రాకతో సీఎస్కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు."సీఎస్కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్కే జట్టులోకి తీసుకుంది.అతడు భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో తలపడనుంది. చెన్నై కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరించనున్నాడు.చదవండి: సన్రైజర్స్లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే
మా అన్న పెళ్లికి ధూంధాం చేస్తా!
భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వనిష్కను శనివారం ఉత్తరాఖండ్లోని మస్సూరి హిల్ స్టేషన్లో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే పెళ్లికి కూడా కొద్ది మంది సెలబ్రెటీలకు మాత్రమే ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహానికి క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సహా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ నుంచి పెళ్లి ఆహ్వానం అందుకున్న టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ శుక్రవారమే డెహ్రాడూన్లో అడుగుపెట్టాడు.కుల్దీప్ యాదవ్ పెళ్లి పట్ల తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, మా అన్న పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ధూంధాంగా ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు. కాగా గతేడాది జూన్లోనే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో లక్నో వేదికగా తన స్నేహితురాలు వనిష్కతో కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వాస్తవానికి పెళ్లి గతేడాది నవంబర్లోనే కావాల్సి ఉండగా.. ఈలోగా టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల కావడం, కుల్దీప్ జట్టుకు ఎంపిక కావడం చకచకా జరిగిపోయాయి. దీంతో కుల్దీప్ యాదవ్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్ను టీమిండియా గెలుచుకుంది. ప్రపంచకప్ గెలిచిన ఆనందానికి తోడు ఇప్పుడు కుల్దీప్ పెళ్లి కూడా తోడవ్వడంతో ఆ సంతోషం రెట్టింపుగా మారిపోయింది. టీ20 ప్రపంచకప్లో కుల్దీప్ యాదవ్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. తుదిజట్టు పటిష్టంగా ఉండడంతో కుల్దీప్కు జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు యజ్వేంద్ర చాహల్ 2023 తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: ధోనికిదే చివరి సీజన్!
RCB: అతడికి తుదిజట్టులో చోటు ఉండదు.. కానీ!
ఐపీఎల్-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ అతడి కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఈ ఆల్రౌండర్ అందుకు తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు.గతేడాది ఐపీఎల్లో వెంకటేశ్ అయ్యర్ పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం 142 పరుగులే చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో సేవలు అందించనేలేదు. దీంతో ఐపీఎల్-2026 వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలేసింది.రూ. 7 కోట్లకు కొనుగోలుఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంకటేశ్ అయ్యర్ను రూ. 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వెంకటేశ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీజన్ ఆరంభ మ్యాచ్లలో అతడికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం లేదన్నాడు.తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చుఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది ఆడించిన తుదిజట్టుతోనే ఆర్సీబీ కొనసాగుతుందని అనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్ అయ్యర్కు తుదిజట్టులో స్థానం దక్కకపోవచ్చు. ముఖ్యంగా ఆరంభ మ్యాచ్లలో అతడి అవసరం ఉండదనే అనిపిస్తోంది.దేవదత్ పడిక్కల్ కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడు. గాయం వల్ల గతంలో రెండు మ్యాచ్లు మిస్సయ్యాడు. అయితే, ఇప్పుడు అతడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడిక్కల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్ ఆప్షన్గా సూయశ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండనే ఉంటాడు.లెఫ్టాండర్ కావడం వల్ల ఏదేమైనా వెంకటేశ్ అయ్యర్ కూడా అద్భుతమైన ఆటగాడే. అతడు జట్టుతో ఉండటం అదనపు బలం. ఏ క్షణంలోనైనా.. ఏ పరిస్థితుల్లోనైనా అతడు అందుబాటులో ఉంటాడు. అతడి అనుభవం జట్టుకు మేలు చేస్తుంది. ముఖ్యంగా అతడు లెఫ్టాండర్ కావడం వల్ల పడిక్కల్కు సరైన బ్యాకప్ ఆప్షన్గా పనిచేస్తాడు’’ అని కుంబ్లే పేర్కొన్నాడు. కాగా గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది.ఐపీఎల్-2026 ఆర్సీబీ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జేకబ్ బెతెల్, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ సింగ్, సూయశ్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, మంగేశ్ యాదవ్, జేకబ్ డఫీ, సాత్విక్ ఒస్త్వాల్, జోర్డాన్ కాక్స్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, విక్కీ ఒస్త్వాల్.చదవండి: T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
IPL 2026: ధోనికిదే చివరి సీజన్!
ఎంఎస్ ధోనీ లేకుంటే చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభంమైనప్పటి నుంచి ధోనీ సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ధోనీ కెప్టెన్సీలోనే సీఎస్కే ఐదుసార్లు చాంపియన్గా నిలిచింది. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహా మిగతా సీజన్లలో సీఎస్కే కనీసం ప్లేఆఫ్ చేరిన జట్టుగా నిలిచింది. 2025 సీజన్కు తొలుత రుతురాజ్ కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో మరోసారి ధోనీనే జట్టును నడిపించాడు. తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 28 నుంచి షురూ కానున్న నేపథ్యంలో సీఎస్కే ఈసారి టైటిల్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ లేకుండా సీఎస్కేను ఊహించడం కష్టంగా ఉంటుంది. అలాగే ధోనీ లేకపోతే ఐపీఎల్ కూడా ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. బహుశా ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. సంజూ శాంసన్ జట్టులో చేరడం, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉండడంతో ఈసారి ధోనీ వారికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఎందుకంటే సంజూతో పాటు రుతురాజ్ చాలాకాలం పాటు సీఎస్కేలో కొనసాగే అవకాశముంది. అయితే ఈ సీజన్లో ధోనీ ఎన్ని మ్యాచ్లు ఆడుతాడన్నది సరిగ్గా తెలియనప్పటికీ జట్టుతో ఉంటే చాలు డ్రెస్సింగ్ రూమ్లో కొండంత బలం ఉంటుంది. ముఖ్యంగా చెన్నై భవిష్యత్తు కెప్టెన్గా సంజూ శాంసన్ ఎదిగేందుకు ధోనీ సలహాలు చాలా వరకు ఉపయోగప డనున్నాయి. అంతేకాదు రుతురాజ్ ఇప్పటికే కెప్టెన్గా చేసిన అనుభవం ఉండడం కూడా కలిసొచ్చే అంశం. ఇక ధోనీ ఫిట్నెస్, బ్యాటింగ్ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఫిట్నెస్ పరంగా చూస్తే ధోనీ అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు. పైగా ఇదే సీజన్ అతనికి చివరిది కూడా అయ్యే చాన్స్ ఉంది. అందుకే ఈ సీజన్లో కప్ గెలిచి ధోనీకి ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లుగా ఉంది’ అని పఠాన్ పేర్కొన్నాడు. అయితే ప్రతీ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అనే మాట వినిపించడం చూస్తూనే వస్తున్నాం. అయితే ఈ సీజన్లో ధోనీ సీఎస్కే తరఫున కెప్టెన్గా ఆడతాడా లేదంటే ఆటగాడిగా కొనసాగుతాడా అనే దానిపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టతనిచ్చారు. ఈ సీజన్లో ధోనీ అన్ని మ్యాచ్లు ఆడుతాడని, కానీ అతని రోల్ ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు.చదవండి: ‘సౌతాఫ్రికా ఒక తెలివితక్కువ టీమ్’
ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొనం: ఇరాన్
దుబాయ్: ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో జరగబోయే ప...
సెమీస్లో భారత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ హాకీ టోర్నీ బెర్త్...
ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ
బాసెల్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుష...
‘డ్రా’ చేసుకుంటే సెమీస్ బెర్త్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ మహిళల హాకీ క్వాలిఫయ...
RCB: అతడికి తుదిజట్టులో చోటు ఉండదు.. కానీ!
ఐపీఎల్-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల...
సన్రైజర్స్లోకి పాక్ ఆటగాడు.. బీసీసీఐ స్పందన ఇదే
'ది హండ్రెడ్' లీగ్-2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్...
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరి...
పాక్ ఆటగాడి ఎంపికపై సన్రైజర్స్ కోచ్ వివరణ
హండ్రెడ్ లీగ్ 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్...
క్రీడలు
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
టి20 ప్రపంచకప్లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్-సానియా మెహందీ.. తరలివచ్చిన క్రికెటర్లు (ఫొటోలు)
వీడియోలు
సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
IPLపై నీలినీడలు.. గ్యాస్ కొరత, విమాన సమస్యలు తప్పవా?
క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఫస్ట్ ఫేజ్ ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
Samson: నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
T20 World Cup: రూ.131 కోట్ల నగదు బహుమతి ప్రకటన
ఓ తండ్రి త్యాగం.. ఎన్నో అవమానాలు.. కట్ చేస్తే..
World Cup: తుఫాన్ బ్యాటింగ్.. ఫైనల్లో గెలుపుకు కారణం అతనే
భయమేసింది పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయా..ఫైనల్ మ్యాచ్ కి ముందు సచిన్ నాకు కాల్ చేసి ..
