ప్రధాన వార్తలు
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ ప్లేయర్..
టీమిండియా వెటరన్ పేసర్, సౌరాష్ట్ర దిగ్గజం జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత సాధించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉనద్కట్ అవతరించాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ నితీశ్ కుమార్ను ఔట్ చేసిన జయదేవ్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 83 మ్యాచ్లు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సిద్ధార్థ్ కౌల్(120) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో కౌల్ను ఉనద్కట్ అధిగమించాడు.పోరాడి ఓడిన సౌరాష్ట్రఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌరాష్ట్రపై 10 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులకే పరిమితమైంది. రుచిత్ అహిర్(39), వగేలా(7 బంతుల్లో 23) ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటికి ఓటమి నుంచి మాత్రం తప్పించలేకపోయారు. ఢిల్లీ స్పిన్నర్ సుయష్ శర్మ 3 వికెట్లతో సత్తాచాటాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..జయదేవ్ ఉనద్కత్ 121సిద్ధార్థ్ కౌల్ 120పీయూష్ చావ్లా 113లుక్మాన్ మేరివాలా 108చామ మిలింద్ 107ప్రస్తుతం టాప్-5 బౌలర్లలో జయదేవ్, చామ మిలింద్ మాత్రమే ఇంకా ఆడుతున్నారు. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు ఉనద్కట్ను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది.చదవండి: IND vs SA: ఒక్క మ్యాచ్కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్కు ఛాన్స్?
నీ ఒంటికి వేరే జెర్సీ సూట్ అవ్వదు: షారుఖ్ ఖాన్ పోస్ట్ వైరల్
వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. 2026 మినీ వేలానికి ముందు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. రసెల్ను ఉద్దేశించి ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు.నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా..‘‘మాకెన్నో మధురమైన, అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆండ్రీ. నీ అద్భుత ఆట తీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. కేకేఆర్ (KKR)కు నువ్వు అందించిన సేవలు మరువలేనివి.ఇక క్రీడాకారుడిగా నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్ కోచ్గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ తెలివి, శక్తిని మన ఆటగాళ్లకు బదిలీ చేసెయ్. వారిని చాంపియన్లుగా నిలిపే ఉత్ప్రేరకంగా మారు.ఏదేమైనా నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు ఆండ్రీ. లవ్ యూ రసెల్. ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫున నేను ఈ మాట చెబుతున్నా’’ అంటూ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. రసెల్తో తమ జట్టుకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. కాగా... కేకేఆర్ యాజమాన్యం రసెల్ (Andre Russell)ను తమ జట్టు ‘పవర్ కోచ్’గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.నాలో సిక్స్లు కొట్టే సత్తా ఉందిఇదిలా ఉంటే.. 2012 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి ఇప్పటి వరకు కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటైర్మెంట్ సందర్భంగా.. ‘కేకేఆర్తో బంధం విడదీయలేనిది. ఇప్పటికీ నాలో సిక్స్లు కొట్టే సత్తా... మ్యాచ్లు గెలిపించగల పట్టుదల ఉన్నాయి. కానీ వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని భావించా.ఇక మీద కొత్త అవతారంలో దర్శనమిస్తా. 2026 సీజన్లో అదే ఉత్సాహంతో కేకేఆర్ ‘పవర్ కోచ్’గా పనిచేయనున్నాను. 12 సీజన్లుగా కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇతర లీగ్ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నా... ఐపీఎల్లో మాత్రం ప్లేయర్గా కాకుండా వేరే బాధ్యతలు నిర్వర్తించనున్నా. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే తప్పుకోవాలనేది నా అభిమతం.ఎంతో నమ్మకముంచారుఅందుకే ఇంకొన్నాళ్లు ఆడే దమ్ము ఉన్నప్పటికీ ముందే వీడ్కోలు పలుకుతున్నా. ఆటగాడిగా రిటైర్ అయినా... కేకేఆర్ కుటుంబంలో నేనెప్పుడూ భాగమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించా. వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇన్నాళ్లు మైదానంలో ప్లేయర్గా నిర్వర్తించిన బాధ్యతలను ఇకపై ‘పవర్ కోచ్’గా డగౌట్లో ఉండి చక్కబెట్టమని సూచించారు. అందుకు అంగీకరించా’ అని రసెల్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.కాగా తొలి రెండు సీజన్ల పాటు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రసెల్... ఓవరాల్గా ఐపీఎల్లో 140 మ్యాచ్లాడి 174.18 స్ట్రయిక్రేట్తో 2,651 పరుగులు చేశాడు. పేస్ ఆల్రౌండర్గా తన బౌలింగ్తోనూ ఎన్నో మ్యాచ్ల్లో జట్టుకు విజయాలు అందించిన రసెల్ 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఒక్క మ్యాచ్కే అతడిపై వేటు.. డేంజరస్ బ్యాటర్కు ఛాన్స్?
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక ప్రోటీస్ జట్టును 17 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ గెలిచినప్పటికి సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది.జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో జాన్సెన్, బాష్ జోరు చూస్తే సఫారీలదే మ్యాచ్ అన్నట్లు అన్పించింది. కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మయాజాలంతో ఓటమి నుంచి మెన్ బ్లూ గట్టెక్కింది.అదేవిధంగా రాంచీ వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(13) కూడా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు.వారిద్దరిపై వేటు.. ఈ నేపథ్యంలో బుధవారం రాయ్పూర్ వేదికగా సఫారీలతో జరిగే రెండో వన్డేలో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, సుందర్లపై వేటు వేసేందుకు మెనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం.రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సుందర్ స్ధానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పంత్ గతేడాది చివరగా భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఈ డేంజరస్ బ్యాటర్ బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు. గత మ్యాచ్లో సుందర్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. జట్టులో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా ఉండడంతో సుందర్ను బెంచ్కు పరిమితం చేయాలని గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. నితీష్ బ్యాట్తో పాటు మీడియం పేస్ బౌలర్గా కూడా తన సేవలను అందించనున్నాడు. అయితే సఫారీలతో జరిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్చదవండి: రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
Ashes: పింక్బాల్ టెస్టుకు ముందు ఆసీస్కు భారీ షాక్!
ఇంగ్లండ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ఈ మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. గాయాల బెడద వల్ల వీరిద్దరు ఇంగ్లండ్తో రెండో టెస్టుకు కూడా దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఇటీవలే వెల్లడించింది.యాషెస్ సిరీస్తో బిజీఅయితే, తాజా సమాచారం ప్రకారం ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కూడా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్తో బిజీగా ఉంది ఆస్ట్రేలియా.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును ముందుకు నడిపించగా.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4-8 మధ్య బ్రిస్బేన్లోని గాబా వేదికగా రెండో టెస్టు జరుగనుంది.ఖవాజా సైతం..పింక్బాల్తో జరిగే ఈ డై- నైట్ టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. కమిన్స్తో పాటు హాజిల్వుడ్ గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. అయితే, ఇప్పుడు ఖవాజా ఫిట్నెస్ సమస్య ఆసీస్కు తలనొప్పిగా మారింది. పెర్త్ టెస్టు సందర్భంగా ఖవాజాకు వెన్ను నొప్పి తిరగబెట్టింది.గత మూడు మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు అతడేఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్లోనూ ఓపెనింగ్ చేయలేదు. ఇక పింక్బాల్ టెస్టుకు సన్నద్ధమయ్యే క్రమంలోనూ అతడు వెన్నునొప్పితో బాధపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ముప్పై నిమిషాల పాటు జరిగిన సెషన్లో బ్యాటింగ్ చేసేందుకు అతడు ఇబ్బందిపడినట్లు పేర్కొంది.దీంతో రెండో టెస్టుకు ఖవాజా అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతడు ఈ మ్యాచ్కు దూరమైతే జట్టుకు కష్టమే. గాబాలో గత మూడు పింక్ బాల్ టెస్టుల్లోనూ ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో అతడికి మాత్రమే ఉంది. కాగా ఖవాజా గనుక ఇంగ్లండ్తో రెండో టెస్టుకు దూరమైతే బ్యూ వెబ్స్టర్, జోష్ ఇంగ్లిస్ల రూపంలో బ్యాకప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఇంగ్లండ్తో పింక్బాల్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్రాల్డ్, బ్యూ వెబ్స్టర్.చదవండి: రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
గంభీర్, అగార్కర్లతో బీసీసీఐ అత్యవసర భేటీ!
సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేలో కూడా ప్రోటీస్ను చిత్తు చేసి సిరీస్ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్తో పాటు మరికొంత మంది ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి గల కారణాలను, భవిష్యత్తు ప్రణాళికలను గంభీర్, అగార్కర్తో బీసీసీఐ చర్చించే అవకాశముంది.బీసీసీఐ సీరియస్?"హోమ్ టెస్టు సీజన్లో మాకు కొన్ని ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి. వాటిపై మాకు స్పష్టత కావాలి. మా తదుపరి టెస్టు సిరీస్కు ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. అందుకోసం ముందుస్తు ప్రణాళికలను కోచ్, చీఫ్ సెలక్టర్ నుంచి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్లో కూడా టీమిండియా టైటిల్ ఫేవరేట్గా ఉంది. కాబట్టి ఈ రెండు మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా టీమ్మెనెజ్మెంట్కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్కు బీసీసీఐ కొత్త బాస్ మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ సమావేశం మ్యాచ్ రోజే జరగనుండడంతో సీనియర్ ప్లేయర్లు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఇక టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్ కావడంతో గంభీర్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా డిమాండ్ చేశారు.గంభీర్ మాత్రం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటిలో గంభీర్ హెడ్కోచ్ పదవికి ఎటువంటి ముప్పులేదు. ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్-2027 వరకు భారత హెడ్ కోచ్గా కొనసాగే అవకాశముంది.చదవండి: వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025
సచిన్ తనయుడికి ప్రమోషన్.. కట్ చేస్తే!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బౌలింగ్లో రాణిస్తున్నప్పటికి బ్యాటింగ్లో మాత్రం అర్జున్ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గత సీజన్లో లోయార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన అర్జున్కు ఈసారి గోవా టీమ్ మెనెజ్మెంట్ ఏకంగా ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చింది.కెరీర్లో తొలిసారి ఓపెనర్గా బరిలోకి దిగిన జూనియర్ టెండూల్కర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ఉత్తర్ప్రదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 28 పరుగులు చేసిన అర్జున్.. ఆ తర్వాత చండీగఢ్పై కేవలం 18 పరుగులతో సరిపెట్టుకున్నాడు.తాజాగా ఆదివారం హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 13 బంతులు ఆడి 7 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్లో కూడా అర్జున్ సత్తాచాటలేకపోయాడు. యూపీపై కూడా అర్జున్ బ్యాట్తో పాటు బంతితో కూడా విఫలమయ్యాడు. కానీ చండీగఢ్పై మాత్రం 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో గోవా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మిగితా రెండు మ్యాచ్లలో మాత్రం గోవా చిత్తు అయింది. ముంబై నుంచి తన మకాంను గోవాకు మర్చిన అర్జున్ ఇక్కడ కూడా తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. మొన్నటివరకు కేవలం రెడ్ బాల్ క్రికెట్కు పరిమితమైన అర్జున్కు ఈసారి పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడే అవకాశం దక్కింది. కానీ తనకు దక్కిన అవకాశాన్ని అర్జున్ సద్వినియోగ పరుచుకోలేకపోతున్నాడు. కాగా ఐపీఎల్-2026లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడనున్నాడు. మినీ వేలానికి ముందు అర్జున్ను ముంబై ఇండియన్స్ నుంచి లక్నో ట్రేడ్ చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. బాష్ ఒంటరి పోరాటంఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది. Game, set, match! 💪Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk— BCCI (@BCCI) November 30, 2025 అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..వాళ్ల పోరాటం అద్భుతం‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. జాగ్రత్త అంటూ వార్నింగ్తదుపరి రెండు మ్యాచ్లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్ కప్ను మరిచిపోవడమే'
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్ (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. దీంతో వన్డే వరల్డ్కప్-2027లో ఈ వెటరన్ క్రికెటర్లు ఆడుతారా? అప్పటివరకు ఫిట్నెస్గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెటర్లు వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్ జోడీ అద్భుత ఇన్నింగ్స్లతో సమాధానమిచ్చింది.ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్ను గెలవడం అసాధ్యమని అతడు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వేరే లెవల్లో ఆడుతున్నారు. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మనం వరల్డ్కప్ను గెలవలేం. కాబట్టి ఇకపై ప్రపంచకప్లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్నెస్గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతూ తమ రిథమ్ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్కప్లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.182 పరుగులుఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా... బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42; 5 సిక్స్లు) రాణించారు.సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాటీ20 ఫార్మాట్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్ నిలిచాడు.గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్లో జార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.టీ20 క్రికెట్లో ఒకే మ్యాచ్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు🏏ఇషాన్ కిషన్ (ఇండియా)- జార్ఖండ్ తరఫున 3 శతకాలు🏏ఆడం గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 శతకాలు🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 శతకాలు. చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి
రొనాల్డో కల నెరవేరిన వేళ.. పోర్చు‘గోల్’ చేరింది!
దోహ: పోర్చుగల్ ఫుట్బాల్ అంటే ముందుగా గుర్తుకొచ్...
ఆర్చరీలో చికితకు రజతం
జైపూర్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ)...
భారత్ శుభారంభం
చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల జూనియర్ ప్ర...
రూ.1750 నుంచి రూ.13,500 వరకు...
సాక్షి, హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా...
సచిన్ తనయుడికి ప్రమోషన్.. కట్ చేస్తే!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్క...
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీ...
'వారిద్దరూ అద్భుతం.. ఆడకపోతే వరల్డ్ కప్ను మరిచిపోవడమే'
రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ...
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత ...
క్రీడలు
#INDvsSA : కింగ్ పూర్వవైభవం.. లేటు వయసులోనూ అదిరిపోయే శతకం
ఉత్సాహంగా వైజాగ్ మారథాన్ ర్యాలీ (ఫొటోలు)
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
ధోనీ కేరళ వస్తే? ఇది ఏఐ అని చెబితే తప్ప తెలియదు (ఫొటోలు)
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసిన గీతా బస్రా, హర్భజన్ దంపతులు (ఫొటోలు)
ప్రీ మెచ్యూర్డ్ చిల్డ్రన్స్ కు ‘ప్రీమిథాన్’ (ఫొటోలు)
మంధాన పెళ్లి షురూ.. సంగీత్లో వరల్డ్ కప్ స్టార్స్ డాన్స్ (ఫోటోలు)
లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)
నా జీవితంలోని ఆల్రౌండర్కు హ్యాపీ బర్త్ డే: సూర్యకుమార్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
వీడియోలు
IND Vs SA: రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
12 బంతుల్లో 50.. 32 బంతుల్లో 100.. ఇదేం బాదుడురా బాబు
జట్టులో కీలక మార్పులు
టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
స్మృతి మందాన పెళ్లి రద్దు? వేరే అమ్మాయితో పలాస్ డేటింగ్!
మహిళా క్రికెటర్ స్మృతి మందాన వివాహం వాయిదా
Nikhat Zareen: అదరగొట్టిన తెలంగాణ బాక్సర్.. గోల్డ్ మెడల్
గిల్ అనుమానమే..!
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 42 బంతుల్లోనే 144 పరుగులు
