Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Sourav Ganguly Returns To TV In A New Avatar, Set To Host Bigg Boss Bangla1
మరో కొత్త అవతారంలో గంగూలీ

టీమిండియా ఆటగాడిగా, కెప్టెన్‌గా, బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, కోచ్‌గా, మెంటార్‌గా వివిధ హోదాల్లో క్రికెట్‌కు సేవలందించిన భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. త్వరలో క్రికెటేతర రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ టీవీ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌' బెంగాలీ వెర్షన్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యాడు. ఈ షోను ఇటీవలే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రకటించారు. బిగ్‌ బాస్‌ లాంచ్‌ వేడుక ఈడెన్ గార్డెన్స్‌లో భారీ లైట్ షో, కళాకారుల ప్రదర్శనలు, సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్‌తో ఘనంగా జరిగింది. ఈ షో స్టార్ జల్షా ఛానల్‌లో ప్రసారం కానుంది. బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా ఎంపికైన సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. ఏ పని చిన్నది కాదు. దేశం కోసం ఆడినా, షో హోస్ట్ చేసినా, నేను పూర్తి అంకితభావంతో చేస్తాను అని అన్నాడు. కాగా, గంగూలీ ప్రస్తుతం ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీ ఛైర్‌ పర్సన్‌గా, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా, బీసీసీఐ క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ అడ్మినిస్ట్రేటర్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇవి కాకుండా ఇప్పుడు అదనంగా బిగ్‌ బాస్‌ హోస్ట్‌ బాధ్యతలు చేపట్టాడు.మరోవైపు గంగూలీ బయోపిక్ తెరపైకి రానున్న విషయం తెలిసిందే. అందులో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించనున్నారు. అపరాజిత ఆధ్యా గంగూలీ తల్లి పాత్రలో, బోమన్ ఇరానీ తండ్రి చండీ గంగూలీగా నటించనున్నట్లు సమాచారం. పాత్రకు సన్నద్ధం కావడానికి రాజ్‌కుమార్ రావు గంగూలీ ఇంట్లో కొంతకాలం గడపనున్నారు.

Lea Tahuhu announces retirement from ODI cricket2
ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

టీమిండియాతో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ మహిళా క్రికెటర్‌ లియా తాహూహు వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించింది. న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌లో అత్యంత అనుభవజ్ఞులైన అయిన లియా.. తన 15 ఏళ్ల వన్డే క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలికింది. 35 ఏళ్ల తాహూహు, 2011లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసి, 103 వన్డేల్లో 125 వికెట్లు సాధించింది. ఇది న్యూజిలాండ్ మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్ల రికార్డు. లియా కుడి చేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌.తాహూహు నాలుగు వన్డే ప్రపంచకప్‌లలో (2013, 2017, 2022, 2025) ఆడి 36 వికెట్లు తీసింది. ఇది న్యూజిలాండ్ తరఫున అత్యధికం. అలాగే మొత్తం జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ఆమె చివరి వన్డేగా నిలిచింది. రిటైర్మెంట్ సందర్భంగా తాహూహు భావోద్వేగంగా స్పందించారు. “వైట్ ఫెర్న్స్ జెర్సీ ధరించడం ఎప్పుడూ గౌరవం. ఒక్క మ్యాచ్ ఆడటం కూడా గొప్ప అనుభూతే. కానీ వందకు పైగా మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని కలలో కూడా ఊహించలేదని అన్నారు. వన్డేలకు వీడ్కోలు పలికినా, అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగుతానని తాహూహు స్పష్టం చేసింది. ఆమె తన చివరి టీ20ని 2025 మార్చిలో ఆడింది. ఈ నెలలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో తాహూహు జట్టులో ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో భాగమైన తాహూహు, ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగబోయే టోర్నీలో టైటిల్ నిలబెట్టుకోవడం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. తాహూహు కెరీర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్‌కు ఓ మైలురాయిగా నిలిచింది. ఆమె వేగం, దూకుడు జట్టుకు ప్రత్యేకమైన అంచు ఇచ్చాయి. వన్డేలకు వీడ్కోలు పలికినా, టీ20ల్లో ఆమె అనుభవం జట్టుకు మరింత బలం చేకూర్చనుంది. తాహూహు ఇప్పటివరకు ఆడిన 98 టీ20ల్లో 95 వికెట్లు తీసింది.

Today is the T20 World Cup 2026 final match between india vs new zealand3
ట్రిపుల్‌ టైటిల్‌ వేటలో...

భారత జట్టు 2024 టి20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లు ఆడితే 40 గెలిచింది. 2023 ఆగస్టు నుంచి మన టీమ్‌ ఒక్క సిరీస్‌ కూడా కోల్పోలేదు. జట్టులో పలు మార్పులు చేసుకున్నా, ఆఖరి క్షణాల్లో ఆటగాళ్లను చేర్చినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. ఎలాంటి నిర్ణయం, వ్యూహమైనా అద్భుతంగా పని చేశాయి. ఇలాంటి విజయాల తర్వాత, ఇంత బలమైన జట్టుకు ఇప్పుడు వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు అన్ని రకాలుగా అర్హత ఉంది. కానీ అనిశ్చితికి మారుపేరైన టి20 క్రికెట్‌లో కొన్ని అనూహ్య క్షణాలు కూడా రాత మారుస్తాయి. అలాంటివి అధిగమించి టీమిండియా మూడోసారి, వరుసగా రెండోసారి వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించగలదా?అవతలి వైపు ఉన్న జట్టు మనతో పోలిస్తే చిన్నదే కావచ్చు... బలాబలాల్లో, అనుభవంతో భారత్‌కు పోటీ కాకపోవచ్చు. కానీ పోరాడితే పోయేదేమీ లేదనే తత్వమే న్యూజిలాండ్‌ను ఒక్కసారిగా బలంగా మార్చేస్తుంది. రెండున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓడిన రోజు భారత అభిమానులకు ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకం... కానీ నేటి ఫైనల్లో కివీస్‌ ఓడితే తర్వాతి వారంలో ఆ దేశంలో అంతా మరచిపోతారు. వారి రోజూవారీ సంవాదనల్లో అది ఒక విషయమే కాదు. ఆ టీమ్‌లో స్టార్‌ పేసర్‌ లేకపోయినా, మిస్టరీ స్పిన్నర్‌ లేకపోయినా గెలిచేందుకు కావాల్సినంత కసి ఉంది. ఇప్పుడు అలాంటిదే వారికి మొదటి టి20 వరల్డ్‌ కప్‌ అందించాలి. ప్రపంచకప్‌లలో పడిన ‘రన్నరప్‌’ ముద్రను ఆ జట్టు మార్చగలదా?వ్యూహ ప్రతివ్యూహాలు, భావోద్వేగాలు, ప్రతిభ మాత్రమే సరిపోదు, కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి...చివరకు రోజు ముగిసేసరికి ఒక్క జట్టుకు మాత్రం సంపూర్ణ ఆనందం దక్కితే మరో జట్టుకు తీవ్ర నిరాశ ఖాయం. ఒక్క దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓటమి మినహా టోర్నీ ఆసాంతం టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబర్చగా... పడుతూ, లేస్తూ ప్రయాణం సాగించిన కివీస్‌ సెమీస్‌లో దక్షిణాఫ్రికాపైనే భారీ విజయంతో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో పదో టి20 వరల్డ్‌ కప్‌ తుది పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగే ఫైనల్‌ పోరులో భారత్, న్యూజిలాండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్‌: టి20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు (2007, 2024) విజేతగా నిలిచి ఇప్పుడు మూడో టైటిల్‌పై గురి పెట్టిన జట్టు ఒకవైపు...తొమ్మిది ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయిన జట్టు మరోవైపు... ఒక టీమ్‌ టోర్నీ గెలిస్తే తొలిసారి ‘ట్రిపుల్‌’ సాధించిన జట్టు కావడంతో పాటు సొంతగడ్డపై నెగ్గిన తొలి టీమ్‌గా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. మరో టీమ్‌ గెలిస్తే సుదీర్ఘ కాలంగా అందకుండా ఊరిస్తున్న వరల్డ్‌ కప్‌ కల నెరవేరుతుంది. ఇలాంటి అంచనాల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్, న్యూజిలాండ్‌ మధ్య టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగనుంది. స్వదేశంలో టీమిండియా విజయంపై అభిమానులు భారీ ఆశలతో ఉండగా... కివీస్‌ తమ స్థాయికి మించిన ప్రదర్శనను కనబర్చాలని పట్టుదలగా ఉంది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇదే మైదానంలో టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ గెలిచి ట్రోఫీని అందుకోవాలని సూర్యకుమార్‌ బృందం భావిస్తోంది. వరుణ్‌ స్థానంలో కుల్దీప్‌! ప్రపంచకప్‌లో భారత్‌ ప్రదర్శన చూస్తే ఇప్పడు ఫైనల్‌ కోసం తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కానీ ‘సూపర్‌ ఎయిట్స్‌’ దశలో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి పేలవ ఆట జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎంత ఘనంగా బౌలింగ్‌ చేసినా టి20ల్లో తాజా ఫామ్‌ కీలకం. దాదాపు 12 పరుగుల ఎకానమీతో అతను 4 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. వరుణ్‌ మిస్టరీని ప్రత్యర్థులు ఛేదించినట్లుగా కనిపిస్తోంది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఇదే భావిస్తే అతని స్థానంలో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఫామ్‌పై కూడా కాస్త సందేహం ఉన్నా... ఒంటిచేత్తో ఆట స్వరూపాన్ని మార్చే అతడిని పక్కన పెట్టే ఆలోచన చేయకపోవచ్చు. సంజు సామ్సన్‌ గత రెండు మ్యాచ్‌లలో చెలరేగిన విధంగా మరో నాకౌట్‌ మ్యాచ్‌లోనూ ఆడితే జట్టుకు తిరుగుండదు. సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ కూడా సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. చివర్లో హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ వేగంగా అందించే అదనపు పరుగులతో ప్రత్యర్థికి టీమిండియా సవాల్‌ విసరడం ఖాయం.ముందుగా బ్యాటింగ్‌ చేస్తే మరోసారి 200కు పైగా స్కోరు చేస్తే జట్టు నిశ్చింతగా ఉండవచ్చు. డఫీకి చోటు! న్యూజిలాండ్‌ విజయావకాశాలన్నీ ఇప్పుడు ఓపెనింగ్‌ జోడీ ఫిన్‌ అలెన్, టిమ్‌ సీఫెర్ట్‌లపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాపై మెరుపు వేగంతో చెలరేగిన వీరిద్దరు మరోసారి శుభారంభం అందించగలరు. ఇన్నింగ్స్‌ మొదట్లోనే బుమ్రా, అర్ష్ దీప్‌ వీరిని కట్టడి చేయడం కీలకం. రచిన్‌ రవీంద్ర ఆల్‌రౌండర్‌గా రాణిస్తుండగా, ఫిలిప్స్‌ బ్యాటింగ్‌ కూడా కీలకం. వరల్డ్‌ కప్‌కు ముందు భారత్‌పై చెలరేగిన మిచెల్‌ ఈ టోర్నీలో పూర్తిగా విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. అసలు సమరంలోనైనా అతను తన స్థాయికి తగినట్లుగా ఆడాలని టీమ్‌ కోరుకుంటోంది. చాప్‌మన్‌ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. కెపె్టన్‌ సాంట్నర్‌పై అటు ఆల్‌రౌండర్‌గా, ఇటు కెపె్టన్‌గా కూడా అదనపు భారం ఉంది. గతంలో ఏ కివీస్‌ సారథికి సాధ్యం కాని ఘనతను అందుకోవాలంటే అతను కూడా స్వయంగా అసాధారణ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. పిచ్‌ కాస్త అనుకూలిస్తే పేసర్లు హెన్రీ, ఫెర్గూసన్‌ ప్రమాదకారులు కాగలరు. టీమిండియా లెఫ్ట్‌ హ్యాండర్లను నిలువరించేందుకు ఆఫ్‌స్పిన్నర్‌ మెక్‌కోన్‌కీ జట్టు సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఆల్‌రౌండర్‌ నీషమ్‌ స్థానంలో పేసర్‌ డఫీకి చోటు దక్కే అవకాశం ఉంది. 7 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు 10 టి20 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ వేదికపై న్యూజిలాండ్‌తో ఆడిన ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టే గెలిచింది. పిచ్, వాతావరణం ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమం కలిపిన పిచ్‌ను ఫైనల్‌ కోసం సిద్ధం చేశారు. దీనిపై మంచి పేస్, బౌన్స్‌ ఉండి బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలిస్తుంది. భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉంది. స్పిన్‌కు తగిన టర్న్‌ లభించకపోవచ్చు. ఈ మైదానంలోనే దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా... ఆ మ్యాచ్‌ను భారత్‌ మరో పిచ్‌పై ఆడింది. గత ఎనిమిది మ్యాచ్‌లలో తర్వాత బ్యాటింగ్‌ చేసిన జట్టే ఐదుసార్లు గెలిచింది. కాబట్టి టాస్‌ గెలిచిన టీమ్‌ ఛేదనకే మొగ్గు చూపవచ్చు. అయితే భారత్‌పై సెమీస్‌లో ఇంగ్లండ్‌ ఒత్తిడిలో చిత్తయిన తీరు చూస్తే ముందుగా బ్యాటింగ్‌ చేయడమే మేలు. వర్షం సమస్య లేదు. ఒకవేళ వాన వచ్చినా రిజర్వ్‌ డే ఉంది. 2-2 భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన గత నాలుగు ఐసీసీ టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌లలో ఇరు జట్లూ చెరో రెండు గెలిచి 2–2తో సమంగా ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ గెలవగా... 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో, 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ గెలుపొందింది.16 భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, ఇషాన్‌ కిషన్, తిలక్‌వర్మ, పాండ్యా, దూబే, అక్షర్, బుమ్రా, అర్ష్ దీప్, వరుణ్‌/కుల్దీప్‌. న్యూజిలాండ్‌: సాంట్నర్‌ (కెప్టెన్ ), అలెన్, సీఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, మెక్‌కోన్‌కీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్‌/డఫీ.

Indian womens hockey team to play first match against Uruguay in qualifiers today4
ప్రపంచకప్‌ బెర్త్‌ లక్ష్యంగా...

సాక్షి, హైదరాబాద్‌: భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌ బెర్తే లక్ష్యంగా క్వాలిఫయర్స్‌ బరిలోకి దిగుతోంది. నేడు తొలి పోరులో భారత జట్టు ఉరుగ్వేతో తలపడుతుంది. గచ్చిబౌలి హాకీ టర్ఫ్‌ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మూడు బెర్త్‌ల కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య భారత్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, ఇటలీ, ఉరుగ్వే, వేల్స్, ఆ్రస్టియాలు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 8 జట్లను రెండు పూల్స్‌గా విభజించారు. పూల్‌ ‘ఎ’లో ఇంగ్లండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా... పూల్‌ ‘బి’లో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్‌ ఉన్నాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు పూల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌ చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌ మార్చి 13న... మూడో స్థానం కోసం మ్యాచ్, ఫైనల్‌ మ్యాచ్‌ మార్చి 14న జరుగుతాయి. ఈ క్వాలిఫయింగ్‌ టోర్నీలో టాప్‌–3లో నిలిచిన జట్లు ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్‌లలో జరిగే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధిస్తాయి. తొలి రోజు ఆదివారం ఇంగ్లండ్‌తో ఇటలీ (మధ్యాహ్నం గం. 12:45 నుంచి); కొరియాతో ఆస్ట్రియా(మధ్యాహ్నం గం. 3 నుంచి); స్కాట్లాండ్స్‌తో వేల్స్‌ (సాయంత్రం గం. 5:15 నుంచి) కూడా తలపడతాయి.

Indian womens team heading for defeat in only day night Test5
పరాజయం పలకరిస్తోంది!

పెర్త్‌: భారత మహిళల జట్టు ఏకైక డే అండ్‌ నైట్‌ టెస్టులో పరాజయం దిశగా పయనిస్తోంది. రెండో రోజే ఆ్రస్టేలియా మహిళల జట్టు మ్యాచ్‌నే శాసించే స్థితిలో నిలిచింది. మొదట బ్యాట్‌తో, తర్వాత బంతితో హర్మన్‌ప్రీత్‌ బృందాన్ని ఆటాడుకుంది. దీంతో నాలుగు రోజుల ‘పింక్‌ బాల్‌’ టెస్టును మూడు రోజుల్లోనే ముగించేందుకు సిద్ధమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 96/3తో శనివారం ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90.4 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. క్రితంరోజు బ్యాటర్లు అనాబెల్‌ సదర్లాండ్‌ (129; 17 ఫోర్లు) ‘శత’క్కొట్టగా, ఎలీస్‌ పెరీ (76; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించింది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో సయాలీ సత్గరే 4 వికెట్లు, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన భారత్‌ ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్మృతి మంధాన (2), షఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్‌ (14), కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ (11)లతో కూడిన ప్రధాన బ్యాటింగ్‌ బలగమంతా ని్రష్కమించింది. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే భారత జట్టు మరో 20 పరుగులు సాధించాలి. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 198; ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: జార్జియా వోల్‌ (బి) సయాలీ 2; ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (సి) జెమీమా (బి) క్రాంతి 9; పెరీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 76; అలీసా హీలీ (సి) జెమీమా (బి) సయాలీ 13; అనాబెల్‌ సదర్లాండ్‌ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి 129; బెత్‌ మూనీ (సి) జెమీమా (బి) స్నేహ్‌ రాణా 19; యాష్లీ గార్డ్‌నర్‌ (బి) క్రాంతి 1; తాలియా (సి) స్మృతి మంధాన (బి) షఫాలీ 13; అలానా కింగ్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) సయాలీ 21; లూసీ హామిల్టన్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) సయాలీ 23; డార్సీ బ్రౌన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (90.4 ఓవర్లలో ఆలౌట్‌) 323. వికెట్ల పతనం: 1–2, 2–31, 3–58, 4–186, 5–240, 6–241, 7–273, 8–277, 9–311, 10–323. బౌలింగ్‌: సయాలీ 18.4–2–50–4, క్రాంతి గౌడ్‌ 22–5–72–2, కాశ్వీ గౌతమ్‌ 11–1–46–0, స్నేహ్‌ రాణా 17–1–64–1, దీప్తి శర్మ 17–1–67–2, షఫాలీ 5–2–12–1. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: స్మృతి (బి) డార్సీ బ్రౌన్‌ 2; షఫాలీ (సి) బెత్‌ మూనీ (బి) లూసీ 5; ప్రతీక (బ్యాటింగ్‌) 43; జెమీమా (సి) బెత్‌ మూనీ (బి) సదర్లాండ్‌ 14; హర్మన్‌ప్రీత్‌ (సి) లూసీ (బి) సదర్లాండ్‌ 11; దీప్తి శర్మ (బి) లూసీ 9; రిచా ఘోష్‌ (సి) బెత్‌ మూనీ (బి) లూసీ 0; స్నేహ్‌ రాణా (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (29 ఓవర్లలో 6 వికెట్లకు) 105. బౌలింగ్‌: 1–2, 2–10, 3–38, 4–64, 5–82, 6–82. బౌలింగ్‌: డార్సీ బ్రౌన్‌ 9–1–37–1, లూసీ హామిల్టన్‌ 8–1–32–3, అనాబెల్‌ సదర్లాండ్‌ 6–2–15–2, తాలియా 6–1–15–0. 1 వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా అనాబెల్‌ రికార్డు నెలకొల్పింది. భారత్‌తో టెస్టుకంటే ముందు దక్షిణాఫ్రికాపై (210; 2024లో), ఇంగ్లండ్‌పై (163; 2025లో) అనాబెల్‌ సెంచరీలు సాధించింది. అనాబెల్‌ తన తొలి సెంచరీని 2023లో ఇంగ్లండ్‌పై (137 నాటౌట్‌) నమోదు చేసింది.

Indian star Lakshya Sen in the final of the All England badminton tournament6
లక్ష్య సేన్‌ అదరహో

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–16, 18–21, 21–15తో కెనడాకు చెందిన విక్టర్‌ లాయ్‌పై తుదికంటా పోరాడి గెలిచాడు. తాజా ప్రపంచ చాంపియన్‌íÙప్‌ (పారిస్‌–2025) కాంస్య పతక విజేత అయిన విక్టర్‌ను ఓడించేందుకు లక్ష్యసేన్‌ ఏకంగా 97 నిమిషాల పాటు శ్రమించాడు. కాలి పాదాలు మంటపెడుతున్నా... కోర్టులో తన కదలికలతో నొప్పి మరింత పెరిగినా అన్నీ భరించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. నేడు జరిగే టైటిల్‌ పోరులో చైనీస్‌ తైపీ షట్లర్‌ లిన్‌ చున్‌ యితో లక్ష్యసేన్‌ తలపడతాడు. కాలి పాదం గాయాన్ని పంటిబిగువన భరించి సెమీస్‌లో చెమటోడ్చిన భారత షట్లర్‌ 25 ఏళ్ల తర్వాత చరిత్రలో నిలిచేందుకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచాడు. సుప్రసిద్ధ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ ఖాతాలో రెండే టైటిల్స్‌ ఉన్నాయి. ప్రకాశ్‌ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్‌ (2001) మాత్రమే గెలిచారు. కానీ 24 ఏళ్ల లక్ష్యసేన్‌ పుట్టాక మరో టైటిల్‌ రానేలేదు. తనే నాలుగేళ్ల క్రితం 2022లో గెలిచే ప్రయత్నం చేసినా... ఫైనల్‌ తడబాటు వల్ల చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ లక్ష్యసేన్‌ ఎంతో మారాడు. అనుభవం సంపాదించాడు. నైపుణ్యం పెంచుకున్నాడు. ఇక చరిత్రకెక్కడమే తరువాయి!

Jhooth Bol Raha Hai: Suryakumar Direct Aim At New Santner T20 WC Final7
T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్‌

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. సాంట్నర్‌ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్‌- న్యూజిలాండ్‌ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్‌ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఎర్రమట్టి పిచ్‌!అహ్మదాబాద్‌లో ఈసారి ఎర్రమట్టి పిచ్‌ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్‌ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.220 పరుగులకే కట్టడి చేస్తేఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్‌ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్‌లో ఫ్లాట్‌ పిచ్‌ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.అబద్ధం చెబుతున్నాడుఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్‌ యాదవ్‌.. సాంట్నర్‌కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్‌ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్‌రూమ్‌లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్‌ డిమాండ్‌కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Drop Abhishek Sharma: Kaif Suggestion Ahead Of IND v NZ T20 WC Final8
IND vs NZ: అభిషేక్‌ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!

న్యూజిలాండ్‌తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్‌ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్‌కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్‌ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్‌ శర్మకు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్‌లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్‌లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌.. ఫామ్‌లో లేని బ్రాండన్‌ కింగ్‌కు బదులు.. రోస్టన్‌ ఛేజ్‌ను ఓపెనర్‌గా ఆడించింది. బ్రాండన్‌రు ఐదు- ఆరు మ్యాచ్‌లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్‌ అయినా సరే అతడికి బ్రేక్‌ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్‌లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్‌ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్‌లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్‌ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్‌ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్‌ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్‌ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్‌-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్‌ కైఫ్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్‌లో అభిషేక్‌ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్‌ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భారత్‌- న్యూజిలాండ్‌ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Goal to silence crowd Break Hearts: Santner On T20 WC Final Vs IND9
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్‌

అహ్మదాబాద్‌ పిచ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్‌ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్‌ పిచ్‌నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం భారత్‌- న్యూజిలాండ్‌ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్‌ సాంట్నర్‌ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్‌కు అవకాశంపిచ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్‌ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్‌కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్‌ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్‌లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్‌ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్‌ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్‌ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్‌ కామెంట్‌ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై గెలిచి టీమిండియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీకి ముందు భారత్‌.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Cricketer Vaibhav Sooryavanshi uncle Abhishek Chauhan cracks UPSC exam10
వైభవ్‌ సూర్యవంశీ మామకు సివిల్స్‌లో బెస్ట్‌ ర్యాంక్‌

భారత క్రికెట్‌లో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ.. మైదానంలో పరుగుల వరద పారించడం ఈ పిల్లాడికి పరిపాటి అయిపోయింది. పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నెన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు ఈ బిహారీ అబ్బాయి.యూత్‌ వన్డే, యూత్‌ టెస్టుల్లో అతి పిన్న వయసులోనే విధ్వంసకర శతకాలు బాదిన బ్యాటర్‌గా వైభవ్‌ చరిత్రకెక్కాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున మొదలైన అతడి పరుగుల ప్రవాహం.. భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా కొనసాగుతోంది.ఇటీవల ముగిసిన అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 175 పరుగులు చేసి.. భారత్‌ను గెలిపించాడు వైభవ్‌ (Vaibhav Suryavanshi). తద్వారా టీమిండియా వైపు తొలి అడుగు వేశాడు. ఇక ప్రస్తుతం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌-2026 కోసం రాజస్తాన్‌ రాయల్స్‌తో కలిసి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.పదో తరగతి పరీక్షలు డుమ్మాఇదిలా ఉంటే.. ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ ఇటీవల వైభవ్‌ సూర్యవంశీ పేరు వైరల్‌ అవుతోంది. క్రికెట్‌తో బిజీగా ఉన్నందున అతడు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయలేకపోయాడు. ఈ విషయాన్ని వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ ధ్రువీకరించారు.102వ ర్యాంకుమరోవైపు.. తాజాగా సంజీవ్‌ సూర్యవంశీ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. వైభవ్‌ సూర్యవంశీకి వరుసకు మేనమామ అయిన అభిషేక్‌ చౌహాన్‌ (Abhishek Chauhan) యూపీఎస్‌సీ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 102వ ర్యాంకు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే అభిషేక్‌ ఈ మేర ర్యాంకు సాధించడం మరో విశేషం. ఆయన ఐపీఎస్‌ సర్వీస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఉన్నత విద్యావంతుల కుటుంబంబిహార్‌లోని సమస్తిపూర్‌లో గల మొహియుద్దీన్‌నగర్‌ బ్లాక్‌లో గల రాజాజన్‌ గ్రామంలో 1999లో అభిషేక్‌ చౌహాన్‌ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు డాక్టర్‌ అభయ్‌ కుమార్‌ సింగ్‌, తల్లి అనురాధా రాజ్‌పుత్‌. అభయ్‌ కుమార్‌ సింగ్‌ నలంద ఓపెన్‌ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఇక ఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అభిషేక్‌ 2022 నుంచి సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం అయ్యారు. 2025లో తొలిసారి పరీక్ష రాయగా.. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. దీంతో సమస్తిపూర్‌లో సంతోషకర వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితుల రాకతో హడావుడిగా మారింది. ఈ నేపథ్యంలో వైభవ్‌ తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ.. అభిషేక్‌ చౌహాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement