Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Cricket is team game Shivam 2 fours as important as Sanju 97: Gambhir  1
అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో కీలక ముందడుగు వేసింది టీమిండియా. సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ముంబై వేదికగా వాంఖడే మైదానంలో గురువారం ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. ముంబైకి చేరుకున్న టీమిండియాఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ముంబైకి చేరుకుంది. కాగా ఈ ఎడిషన్‌ ఆరంభంలో నేపాల్‌ వంటి పసికూన జట్టుతో సవాలు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ పుంజుకున్న తీరు అమోఘం.Touchdown, Mumbai! 📍#TeamIndia are in and gearing up for the semi-final in just three days! 👏ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 5:30 PM pic.twitter.com/gfOBk4T29X— Star Sports (@StarSportsIndia) March 2, 2026అందరూ మేటి ఆటగాళ్లేముఖ్యంగా సూపర్‌-8లో శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించి.. హ్యాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ఇంగ్లండ్‌ గట్టి ప్రత్యర్థి అని.. ఆ జట్టుతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఆ జట్టులో ఫిల్‌ సాల్ట్, హ్యారీ బ్రూక్‌, సామ్‌ కరన్, విల్‌ జాక్స్‌ సహా అందరు మేటి ఆటగాళ్లేనని అన్నాడు.వాంఖడే పిచ్‌ పరిస్థితులు వేరుగా ఉంటాయని... అటువంటి చోట ఇంగ్లండ్‌ లాంటి జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదే అని గౌతీ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ వంటి జట్టును ఓడించేందుకు తాము ఇంకాస్త ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందని అన్నాడు.సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసుఅదే విధంగా.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన తీరుపై కూడా గౌతీ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన సంజూ శాంసన్‌ను ప్రశంసించాడు. అయితే, క్రికెట్‌ జట్టు క్రీడ అని అందరూ కలసి కట్టుగా ఆడాల్సిందే... జట్టుగా గెలవాల్సిందేనని పేర్కొన్నాడు.‘‘సంజూ సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. మెగా ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ అతనికి క్లిష్టంగా గడిచింది. అందుకే కాస్త విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు వెస్టిండీస్‌తో కీలకమైన ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో శాంసన్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు’’ అని గంభీర్‌ కితాబిచ్చాడు.🚨 BIG STATEMENT BY GAUTAM GAMBHIR 🚨 "For so many year, we only glorified individual success. But this Indian Team is different, we play as a team. Shivam Dube's 2 boundaries is as important as Sanju Samson 97*."What's your take 🤔pic.twitter.com/zdecRc7PVJ— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 3, 2026అదే విధంగా తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే తదితర సహచరులు కూడా బాగా ఆడారని గౌతీ అన్నాడు. తాను కోచ్‌గా ఉన్నంతకాలం జట్టు విజయంలో భాగమైన ప్రతి ఆటగాడి సహకారానికి తగిన గుర్తింపు లభిస్తుందన్నాడు. అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్‌ వేస్ట్‌!‘క్రికెట్‌ ఎప్పటికైనా టీమ్‌ గేమ్‌. ఓ జట్టుగా ఆడాలి. జట్టుగానే గెలవాలి. కొన్నేళ్లుగా మనం ఒకరిద్దరి సేవలగురించే ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరి సహకారం గురించి ప్రస్తావించడం నాకూ ఆనందంగానే ఉంది’ అని గంభీర్‌ ఫలానా ఆటగాడి పేరుచెప్పకుండా తన శైలిలో సమాధాన మిచ్చాడు.‘జట్టు విజయంలో ఎవరైనా పెద్ద స్కోరు చేస్తే పతాక శీర్షికలకెక్కుతారు. కానీ నా దృష్టిలో మాత్రం ఆ పెద్ద స్కోరుకు విలువపెంచే భాగస్వామ్యంలో తక్కువ పరుగులు చేసినా విజయంలో ఈ రెండూ విలువైనవే! ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ఎందుకంటే కీలకమైన సమయంలో శివమ్‌ దూబే కొట్టిన రెండు విలువైన బౌండరీలు లక్ష్యఛేదనకెంతో ఉపయోగపడ్డాయి. అవే లేకపోయినా... ఫలితం ప్రతికూలంగా ఉన్నా... సామ్సన్‌ (97 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌ మరుగున పడేది’ అని గౌతీ వివరించాడు.చదవండి: స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

PV Sindhu returns home safely after harrowing Dubai ordeal as Middle East crisis costs her All England shot2
సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్‌ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.భయానక అనుభవం సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.ఇంటికి చేరాను మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది. కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్‌ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది.

West Indies stuck in India after T20 world cup exit3
టీ20 ప్రపంచకప్‌పై యుద్ద ప్రభావం

అమెరికా, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ద ప్రభావం భారత్‌, శ్రీలంక దేశాల్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026పై పడింది. ఈ మెగా టోర్నీలో సూపర్‌-8 దశలో నిష్క్రమించిన వెస్టిండీస్‌ జట్టు.. అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులకు ప్రతిగా ఇరాన్‌ పలు గల్ఫ్‌ ప్రాంతాలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విండీస్‌ జట్టు స్వదేశానికి చేరాలంటే దుబాయ్‌ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే యుద్ద నేపథ్యంలో పరిస్థితులు అనూకలించకపోవడంతో విండీస్‌ జట్టు భారత్‌లోనే హాల్ట్‌ అయ్యింది. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది. వీలైనంత త్వరగా తమ జట్టును స్వదేశానికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయంలో విండీస్‌ బోర్డుకు ఐసీసీ, బీసీసీఐ సహకరిస్తున్నాయి. మరోవైపు విండీస్‌లాగే మరో జట్టు కూడా భారత్‌లోనే ఇరుక్కుపోయింది. విండీస్‌లాగే సూపర్‌-8లోనే నిష్క్రమించిన జింబాబ్వే కూడా యుద్ద ప్రభావం చేత విమాన రాకపోకలు నిలిచిపోవడంతో భారత్‌లో హాల్ట్‌ అయ్యింది. జింబాబ్వే కూడా స్వదేశానికి వెళ్లలంటే దుబాయ్‌ మీదుగా వెళ్లాల్సిందే. జింబాబ్వే పరిస్థితిని కూడా ఐసీసీ దగ్గరగా పర్యవేక్షిస్తుంది. వీలైనంత త్వరగా జింబాబ్వే జట్టును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది.ఇదిలా ఉంటే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ప్రపంచకప్‌లో సూపర్-8లోనే నిష్క్రమించాయి. ఈ రెండు జట్లు భారత్‌తో పాటు గ్రూప్‌-1లో ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌-4కు అర్హత సాధించాయి.తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.

IND vs ENG, SA vs NZ Umpires, Match Referee, Officials Announced For ICC T20 World Cup 2026 Semifinal4
T20 WC 2026: సెమీస్‌కు అంపైర్లు వీరే..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.ఈ మ్యాచ్‌లకు అఫీషియల్స్‌ జాబితాను (అంపైర్లు, రిఫరీలు) ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఎనిమిది మంది అంపైర్లు, ఇద్దరు మ్యాచ్ రిఫరీల పేర్లను వెల్లడించింది. ఎప్పటిలాగే తటస్థ అధికారులను నియమించింది. సౌతాఫ్రికా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్ - థర్డ్‌ అంపైర్‌: నితిన్ మెనన్ - నాలుగో అంపైర్లు: రాడ్ టక్కర్ - మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్ భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో సెమీఫైనల్‌ - ఆన్ ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గాఫనీ, అల్లాహుద్దీన్ పాలేకర్ - థర్డ్‌ అంపైర్లు: ఎడ్రియన్ హోల్డ్‌స్టాక్ - నాలుగో అంపైరు: పాల్ రైఫెల్ - మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్

Babar Azam Named Captain In Pakistan After T20 World Cup5
బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు

టీ20 ప్రపంచకప్‌ 2026లో వరుస వైఫల్యాల తర్వాత కూడా పాకిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం.. బాబర్ ఆజమ్ నేషనల్ టీ20 కప్ 2026లో లాహోర్ రీజియన్ వైట్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 5న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ వైట్స్, పెషావర్ రీజియన్‌ను ఎదుర్కొంటుంది. గత ఎడిషన్‌లో లాహోర్ వైట్స్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరినా, అబ్బొటాబాద్ రీజియన్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి బాబర్ నాయకత్వంలో లాహోర్‌ వైట్స్‌ మెరుగైన ఫలితాలు సాధించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌ 2026 ఎడిషన్‌లో పాక్‌ ఓ మోస్తరు ప్రదర్శనలు చేసినా సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినా, న్యూజిలాండ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ లేని కారణంగా సెమీస్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆరంభ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైనందుకు బాబార్‌ ఆజమ్‌ను శ్రీలంక మ్యాచ్‌ నుంచి తప్పించారు.ఈ ప్రపంచకప్‌లో బాబర్‌ 4 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 22.75 కాగా, స్ట్రైక్ రేట్ 112.34గా ఉంది. ఈ చెత్త ప్రదర్శనలతో బాబర్‌ పాకిస్తాన్ జట్టుకు భారంగా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇదే తీరు కొనసాగుతుంది.2023 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత బాబర్‌ 23 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 772 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ శతకం, ఐదు అర్ధశతకాలు ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అతను 20 ఇన్నింగ్స్‌ల్లో 451 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 26.52, స్ట్రైక్ రేట్ 118.99గా ఉంది. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి.టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనల తర్వాత జాతీయ జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో బాబర్‌కు దేశవాలీ జట్టు పగ్గాలు దక్కడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బాబర్‌తో పాటు సీనియర్లను తప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది.

T20 WC 2026: India and England met in semis in last two editions also6
IND VS ENG Semis: చరిత్ర పునరావృతమవుతుందా.. లేక..!

టీ20 ప్రపంచకప్‌ 2026 రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీకి సిద్దంగా ఉన్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ సమరం జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర అంశం సోషల్‌మీడియాలో హైలైట్‌ అవుతుంది. గత మూడు టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్లలో భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్లోనే ఎదురెదురుపడ్డాయి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా, రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2026 ఎడిషన్‌లోనూ ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటంతో, సెంటిమెంట్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ విజేత టైటిల్‌ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే ఈ సెంటిమెంట్‌ రిపీటైతే భారత్‌కు ప్రతికూల ఫలితం వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఎందుకుంటే, గత రెండు ఎడిషన్లలో గెలుపు చేతులు మారింది. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌ను ఓడిస్తే.. 2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ లెక్కన రొటేషన్‌ పద్దతిలో ఈసారి ఇంగ్లండ్‌ గెలుస్తుందని సెంటిమెంట్లు ఫాలో అయ్యే వారు విశ్వసిస్తున్నారు.అయితే క్రికెట్‌ లాంటి క్రీడల్లో సెంటిమెంట్లకు విశ్వసనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగనీ సెంటిమెంట్లను తీసి వేయడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అవి కూడా వర్కౌటవుతాయి.సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే..ఇంగ్లండ్‌ కంటే టీమిండియానే క్తాస మెరుగ్గా ఉంది. ఈసారి హాట్‌ ఫేవరెట్‌ కూడా ఇండియానే. అలాగనీ ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుతం వారి జట్టు బ్యాటింగ్‌ టాపార్డర్‌ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్లు సాల్ట్‌, బట్లర్‌ సహా జేకబ్‌ బేతెల్‌ తరుచూ విఫలమవుతున్నారు. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, మిడిలార్డర్‌ బ్యాటర్ల సాయంతోనే ఆ జట్టు ఈ ఎడిషన్‌లో విజయాలు సాధించింది. బ్యాటింగ్‌తో పోలిస్తే.. ఆ జట్టు బౌలింగ్‌ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ రెండు విభాగాల్లో ఇంగ్లండ్‌ కంటే భారత్‌ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్‌ మినహా భారత్‌ అన్ని విషయాల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్‌కు ముందు టీమిండియాను ఫీల్డింగ్‌ విషయం చాలా కలవరపెడుతుంది. తాజాగా విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్‌లు నేలపాలు చేశారు. సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్‌ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్‌ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. మ్యాచ్‌కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా, ఆ రోజు మ్యాచ్‌లో ఎవరు రాణిస్తే వారికే అంతిమ విజయం దక్కుతుంది.

Australia Test Squad vs India Announced, Pacer Ruled Out7
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ దూరం

పెర్త్‌లోని ప్రసిద్ధ WACA మైదానం వేదికగా మార్చి 6 నుంచి 9 వరకు భారత్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం 13 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును నిన్న (మార్చి 2) ప్రకటించారు. ఈ మ్యాచ్‌ డే అండ్‌ నైట్ ఫార్మాట్‌లో పింక్ బాల్‌తో జరుగుతుంది. పేసర్ కిమ్ గార్త్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. రాచెల్ ట్రెనమన్, మైట్‌లాన్ బ్రౌన్ జట్టులోకి వచ్చారు. వీరిద్దరు గాయాల బారిన పడిన స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్‌ పెర్రీ, స్పిన్నర్ సోఫీ మోలినెక్స్‌ ప్రత్యామ్నాయంగా ఎంపికయ్యారు.24 ఏళ్ల ట్రెనమన్‌కు సీనియర్ జట్టు తరఫున ఇది తొలి అవకాశం. ఇటీవలికాలంలో ఆమె అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ సీజన్ విమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో టస్మానియా తరఫున ఓపెనింగ్ చేస్తూ 81 సగటున 648 పరుగులు చేసి సెలెక్టర్లను ఆకట్టుకుంది. బ్రౌన్ విషయానికొస్తే.. ఈ 28 ఏళ్ల పేసర్ 2021 తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె న్యూ సౌత్ వేల్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది. గత ఆగస్టులో ఇండియా-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఆస్ట్రేలియా A తరఫున ఆడి 4 వికెట్లతో సత్తా చాటింది. చివరి మ్యాచ్‌ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలైస్సా హీలీకి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్‌. హీలీ చాలా రోజుల ముందే తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. హీలీ.. తాజాగా ఆడిన తన చివరి వన్డేలో అద్భుత శతకంతో (158) చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత జట్టు ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.భారత్‌తో ఏకైక టెస్ట్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు.. - అలీస్సా హీలీ (కెప్టెన్) - డార్సీ బ్రౌన్ - మైట్‌లాన్ బ్రౌన్ - అశ్లే గార్డ్నర్ - లూసీ హామిల్టన్ - అలానా కింగ్ - ఫీబీ లిచ్‌ఫీల్డ్ - బెత్ మూనీ - తాలియా మెక్‌గ్రాత్ - ఎలీస్ పెర్రీ - అన్నాబెల్ సతర్లాండ్ - జార్జియా వోల్ - జార్జియా వారెహామ్

Pakistan T20 WC Star Sahibzada Farhan Rejected by The Hundred Teams Ahead of 2026 Auction8
పాక్‌ ప్రపంచకప్‌ హీరోకు ఘోర అవమానం

పాకిస్తాన్‌ టీ20 ప్రపంచకప్‌ హీరో సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు ఘోర అవమానం జరిగింది. హండ్రెడ్‌ లీగ్‌ 2026 వేలం తుది జాబితాలో అతనికి అవకాశం దక్కలేదు. ప్రపంచకప్‌ 2026లో రెండు సెంచరీలు సహా పలు భారీ రికార్డులు నెలకొల్పినా ఫర్హాన్‌ పేరు వేలం జాబితాలో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫర్హాన్‌ సహా 49 పాక్‌ ఆటగాళ్ల పేర్లు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది.కాగా, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లో తొలిసారి వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ వేలం​ మార్చి 11, 12 తేదీల్లో లండన్‌ వేదికగా జరుగనుంది. ఈ వేలంలో తొలుత 710 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 63 మంది పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. అయితే ఫ్రాంచైజీలు 75–100 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయమని ఆదేశించడంతో, చివరికి 243 మంది ఆటగాళ్లు మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి కేవలం 14 మంది (షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్) అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే సాహిబ్‌జాదా ఫర్హాన్ సహా 49 మంది పాక్‌ ఆటగాళ్ల పేర్లు గల్లంతయ్యాయి. ఫర్హన్‌.. టీ20 ప్రపంచకప్‌ 2026లో 76.60 సగటున 383 పరుగులు చేసి ప్రస్తుతానికి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ సింగిల్‌ ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. ఫర్హాన్‌ నమీబియా, శ్రీలంకపై అద్భుత శతకాలు సాధించాడు. పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరకపోయినా, ఫర్హాన్ వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అయినా, హండ్రెడ్ లీగ్‌ ఫ్రాంచైజీలు అతన్ని పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు, వరల్డ్ కప్ జట్టులో లేని పాక్‌ పేసర్‌ హారిస్ రౌఫ్‌ వేలంలో మార్‌కీ ఆటగాడిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రౌఫ్‌తో పాటు జో రూట్, జానీ బెయిర్‌స్టో వంటి ఇంగ్లండ్ స్టార్‌లు.. డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్ వంటి విదేశీ ఆటగాళ్లు కూడా మార్‌కీ జాబితాలో ఉన్నారు. కాగా, హండ్రెడ్‌ లీగ్‌ వేలం జాబితాలో పాక్‌ స్టార్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజమ్‌, మొహమ్మద్ రిజ్వాన్ పేర్లు కూడా లేవు. ఈ ఇద్దరు విండీస్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా తమ పేర్లు నమోదు చేసుకోలేదు.

Lakshya Sen to face world No 1 Shi Yu Qi in first round In All England 20269
నిరీక్షణ ముగిసేనా? 

బర్మింగ్‌హామ్‌: శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌కు నేడు తెర లేవనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలోని ఐదు విభాగాల్లోనూ (పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టి... డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా... డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌; ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో బరిలో ఉన్నారు. అయితే స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ ఎయిర్‌ స్పేస్, ఎయిర్‌పోర్టు మూసివేయడంతో సింధు అక్కడే చిక్కుకుపోయింది. దుబాయ్‌ విమానాశ్రయం నుంచి సోమవారం సాయంత్రం నుంచి పాక్షికంగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సింధు తన తొలి రౌండ్‌ మ్యాచ్‌ను బుధవారం థాయ్‌లాండ్‌ ప్లేయర్‌ సుపనిద కటెథోంగ్‌తో ఆడాల్సి ఉంది. సింధు మినహా భారత ఇతర ప్లేయర్లు సింగపూర్, ఆఫ్రికా దేశాల మీదుగా బర్మింగ్‌హామ్‌కు చేరుకున్నారు. క్లిష్టమైన ‘డ్రా’ 127 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్‌ (2001లో) మాత్రమే టైటిల్స్‌ సాధించారు. 2022లో లక్ష్య సేన్‌ ఫైనల్‌ చేరినా తుదకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. 2015లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్‌ కూడా రన్నరప్‌గానే నిలిచింది. ఈ ఏడాదైనా భారత ప్లేయర్లు టైటిల్‌ నిరీక్షణకు తెరదించుతారో లేదో వేచి చూడాలి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, ఆయుశ్‌ శెట్టిలకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకి (చైనా)తో లక్ష్య సేన్, అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో ఆయుశ్‌ శెట్టి ఆడతారు. 2022, 2023లలో సెమీఫైనల్‌ చేరిన గాయత్రి–ట్రెసా ద్వయం తొలి రౌండ్‌లో సయాకా హిరోటా–అయాకో సకురామోటో (జపాన్‌) జోడీతో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో కాంగ్‌ ఖాయ్‌ జింగ్‌–ఆరోన్‌ టాయ్‌ (మలేసియా)లతో సాతి్వక్‌–చిరాగ్‌ పోటీపడతారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మూడో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా)తో మాళవిక; ఆరో సీడ్‌ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఉన్నతి ఆడతారు.

T20 WC 2026: team india dropped 3 catches in do or die match against west indies10
టీమిండియాలో ఆందోళన.. తప్పు జరిగిందా, చరిత్ర హీనులవుతారు..!

టీ20 ప్రపంచకప్‌ 2026 తుది దశకు చేరింది. నాలుగు సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌.. రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మార్చి 4వ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకే మొదలవుతుంది.కాగా, ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడుతుంది. భారత ఫీల్డింగ్‌ ప్రతి భారత క్రికెట్‌ అభిమానిని ఆందోళనకు గురి చేస్తోంది. విండీస్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 మ్యాచ్‌లు నేలపాలు చేశారు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మ కీలక దశలో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. ఓ క్యాచ్‌ను తిలక్‌ వర్మ వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చుంటే, అభిషేక్‌, తిలక్‌పై ముప్పేట దాడి జరిగుండేది. టీమిండియా గెలవడంతో ఈ ఇద్దరు భారీ ట్రోలింగ్‌ను తప్పించుకున్నారు.విండీస్‌తో మ్యాచ్‌ ఒక్కటే కాదు, మెగా టోర్నీ ప్రారంభం నుంచి టీమిండియా ఫీల్డింగ్‌ అత్యంత చెత్తగా ఉంది. సూపర్‌-8కి చేరిన జట్లలో అత్యంత చెత్త క్యాచింగ్‌ ప్రదర్శనలు మనవే. భారత ఫీల్డర్లు 100లో కేవలం​ 71 శాతం క్యాచ్‌లను మాత్రమే పట్టారు. మొత్తంగా సూపర్‌-8కు చేరిన జట్లలో ఏ జట్టు వదలని విధంగా ఏకంగా 13 క్యాచ్‌లు నేలపాలు చేశాడు. అదనంగా భారత ఫీల్డర్లు మిస్‌ ఫీల్డింగ్‌ కూడా చేసి ప్రత్యర్దిని అదనపు పరుగులు సమకూర్చారు.సెమీస్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియా తప్పక మూల్యం​ చెల్లించుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయన్న విషయాన్ని భారత ఆటగాళ్లు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. గత ప్రపంచకప్‌ ఫైనల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన క్యాచే​ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన విషయాన్ని ప్రస్తుత టీమిండియా సభ్యులు గుర్తు పెట్టుకోవాలి. క్యాచ్‌లు నేలపాలు చేసినా, మిస్‌ ఫీల్డింగ్‌ చేసి అదనపు పరుగులు సమర్పించుకున్నా, సరిదిద్దుకోవడానికి జరగబోయేది సామాన్యమైన మ్యాచ్‌ కాదు. ఒక్కసారి తప్పు జరిగిపోతే, ఎంతటి స్టార్‌ ఆటగాడైనా చరిత్ర హీనుడవ్వాల్సిందే. కాబట్టి, సెమీఫైనల్లో ప్రతి భారత ఆటగాడు ఫీల్డ్‌లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌ హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement