Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Not Hardik These 3 IPL 2026 Captains Set To be Sacked: Report1
హార్దిక్‌ కాదు!.. ఆ ముగ్గురు కెప్టెన్లపై వేటు!

ఐపీఎల్‌-2026 లీగ్‌ దశ ముగింపునకు వచ్చింది. ఇంకో పది రోజుల్లో (మే 24) లీగ్‌ స్టేజీ పూర్తి కానుంది. ఇలాంటి తరుణంలో ఓ సంచలన నివేదిక తెరమీదకు వచ్చింది. ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరిచిన ముగ్గురు కెప్టెన్లపై వేటు పడనుందని దాని సారాంశం.ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు రిషభ్‌ పంత్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెగా వేలం-2025లో అతడిని ఏకంగా రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆటగాడిగా, కెప్టెన్‌గా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పూర్తిగా తేలిపోతున్నాడు.చెత్త ప్రదర్శనగతేడాది చెత్త ప్రదర్శనతో జట్టును ఏడో స్థానంలో నిలిపిన పంత్‌.. తాజా ఎడిషన్‌లోనూ వైఫల్యాలు కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికి 11 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నో కేవలం మూడే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది.వ్యక్తిగతంగానూ పంత్‌ ప్రదర్శన బాగాలేదు. పదకొండు ఇన్నింగ్స్‌లో కలిప కేవలం 251 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి అక్షర్‌ పటేల్‌ కూడా విమర్శల పాలవుతున్నాడు. పన్నెండు మ్యాచ్‌లలో కలిపి 100 పరుగులే చేసిన ఈ ఆల్‌రౌండర్‌.. కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.అక్షర్‌ అంతంత మాత్రమేలీగ్‌ దశలో అక్షర్‌ సేన ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఐదు గెలిచి పట్టికలో ఏడో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక అజింక్య రహానే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జట్టుకు టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకుని మరీ.. రహానేకు పగ్గాలు ఇచ్చింది కోల్‌కతా నైట్‌ రైడర్స్‌.రహానేదీ అదే బాటగతేడాది డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌.. పద్నాలుగింట ఐదే గెలిచి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ఇప్పటికి పదకొండింటిలో నాలుగు గెలిచి ఎనిమిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఇక రహానే 11 ఇన్నింగ్స్‌ ఆడి 237 పరుగులే చేశాడు.వేటుకు రంగం సిద్ధంఈ నేపథ్యంలో ఐపీఎల్‌ సన్నిహిత వర్గాలు పీటీతో మాట్లాడుతూ.. ‘‘ముగ్గురు ఐపీఎల్‌ కెప్టెన్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌ ఆఖరి నాటికి వాళ్లు తమ పదవులు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందకు సంబంధించిన ఫ్రాంఛైజీ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.అక్షర్‌ పటేల్‌, అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌ గత రెండు సీజన్లలో సారథులుగా విఫలమవుతున్నారు. ఒక్కసారి కూడా జట్లను ప్లే ఆఫ్స్‌ దిశగా తీసుకువెళ్లలేకపోయారు’’ అని పేర్కొన్నాయి. ముఖ్యంగా పంత్‌ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. అతడి వ్యూహాలు బెడిసికొట్టడం ఫ్రాంఛైజీకి తలనొప్పిగా మారిందని తెలిపాయి.మరి హార్దిక్‌ పరిస్థితి ఏంటి?పంత్‌, అక్షర్‌, రహానే సంగతి ఇలా ఉంటే.. ముంబై ఇండియన్స్‌ సారథి హార్దిక్‌ పాండ్యా గురించి మాత్రం సదరు వర్గాలు స్పందించలేదు. 2024లో ముంబై కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌ తొలి ఏడాది అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. గతేడాది ప్లే ఆఫ్స్‌ చేర్చినా.. ఈ ఏడాది పదో స్థానం కోసం ముంబై లక్నోతో పోటీపడుతోంది. ఇప్పటికే గాయం సాకుతో హార్దిక్‌ జట్టుకు దూరమయ్యాడు. త్వరలోనే అతడిపై వేటు పడనుందనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా నివేదికలో అతడి పేరు లేకపోవడం గమనార్హం.చదవండి: బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్‌

Cummins Reacts To claims stating Australian stars will ditch BBL for SA202
బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు!.. స్పందించిన కమిన్స్‌

తనపై వస్తున్న వదంతులపై ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ స్పందించాడు. తన గురించి రాస్తున్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆసీస్‌ టెస్టు, వన్డే సారథిగా కమిన్స్‌కు గొప్ప రికార్డు ఉంది. మిచెల్‌ స్టార్క్‌తో పాటు పేస్‌ దళంలో బౌలర్‌గానూ కమిన్స్‌ కీలకం.అయితే, కమిన్స్‌తో పాటు మరికొందరు సీనియర్‌ క్రికెటర్లు క్రికెట్‌ ఆస్ట్రేలియాను (CA)ను బెదిరిస్తున్నారంటూ ‘ది ఏజ్‌’ కథనం పేర్కొంది. తమ జీతాలు పెంచకపోతే దేశీ టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)ను బహిష్కరిస్తామని వాళ్లు బ్లాక్‌మెయల్‌ చేశారన్నది ఆ కథనం సారాంశం.దాదాపు రూ. 7 కోట్లు2027-28 సీజన్‌కు గానూ.. ఒకవేళ తాము కోరినట్లు 1 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 7 కోట్లు) చెల్లించకపోతే.. ఈ సీజన్‌లో ఆడేది లేదని ఆటగాళ్లు తేల్చిచెప్పినట్లు సదరు కథనం పేర్కొంది. బీబీఎల్‌ను వదిలి సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు వెళ్తామని హెచ్చరించినట్లు తెలిపింది.నువ్వు రాసినదంతా కల్పితంఇందుకు సంబంధించిన వార్తను ఓ నెటిజన్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేయగా.. ప్యాట్‌ కమిన్స్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘ది హండ్రెడ్‌ లీగ్‌లో నాకు ఆఫర్‌ వచ్చినట్లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నిరభ్యంతర పత్రం విషయంలో నేనేదో డిమాండ్‌ చేసినట్లు.. నా గురించి నువ్వు రాసినదంతా కల్పితం మాత్రమే’’ అని కమిన్స్‌ బదులిచ్చాడు.కాగా వెన్నునొప్పి కారణంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడిన కమిన్స్‌.. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. దాదాపు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఈ పేస్‌ బౌలర్‌.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీ విధులతో బిజీగా ఉన్నాడు.అయితే, ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్‌... ఇటీవలే తిరిగి వచ్చి జట్టును విజయపథంలో తీసుకువెళ్తున్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఇప్పటికి 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న కమిన్స్‌ బృందం ప్లే ఆఫ్స్‌ బెర్తు లక్ష్యంగా ముందుకు సాగుతోంది.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర

Dick Advocaat Curacao manager will be oldest in World Cup history3
మూణ్ణెళ్ల కింద రాజీనామా.. ఇప్పుడు రికార్డు పుటల్లోకి!

కేవలం 1,56,000 జనాభా ఉన్న కురసావ్‌ దేశం వచ్చే నెలలో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 96 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో ఆడనున్న అతిచిన్న దేశంగా (జనాభా, వైశాల్యం పరంగా) కురసావ్‌ జట్టు గుర్తింపు పొందనుంది. ఈ జట్టుగా హెడ్‌ కోచ్‌గా ఉన్న డిక్‌ అడ్వోకాట్‌ కూడా రికార్డు నెలకొల్పనున్నాడు. ప్రపంచకప్‌ చరిత్రలోనే ఒక జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్న అతిపెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అడ్వోకాట్‌ (Dick Advocaat) గుర్తింపు పొందనున్నాడు. గతంలో ఈ రికార్డు ఒట్టో రెహగల్‌ పేరిట ఉంది. 2010 ప్రపంచకప్‌లో గ్రీస్‌ జట్టుకు రెహగల్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్నపుడు ఆయన వయస్సు 71 ఏళ్లు. గ్రూప్‌ ‘ఇ’లో ఉన్న కురసావ్‌ జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న హ్యూస్టన్‌లో జర్మనీ జట్టుతో ఆడనుంది. నెదర్లాండ్స్‌కు చెందిన అడ్వోకాట్‌ శిక్షణలోనే కురసావ్‌ దేశం మొదటిసారి ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించింది. రెండేళ్లపాటు కురసావ్‌ జట్టుకు కోచ్‌గా ఉన్న అడ్వోకాట్‌ మూడు నెలల క్రితం కుటుంబకారణాలరీత్యా తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఈ మూడు నెలల కాలంలో కురసావ్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ఫ్రెడ్‌ రుటెన్‌ ఆధ్వర్యంలో ఆశించిన ఫలితాలు రాలేదు. చైనా, ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో కురసావ్‌ ఓడిపోయింది. కురసావ్‌ జట్టులోని సీనియర్‌ ప్లేయర్లకు కూడా రుటెన్‌ శిక్షణ పద్ధతులు నచ్చలేదు. సీనియర్‌ ప్లేయర్లందరూ మళ్లీ అడ్వోకాట్‌ను కోచ్‌గా తేవాలని కురసావ్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్యను కోరారు. దాంతో కురసావ్‌ సమాఖ్య... అడ్వోకాట్‌ను సంప్రదించగా ఆయన కోచ్‌గా మళ్లీ వచ్చేందుకు అంగీకరించారు. ఫుట్‌బాల్‌ సర్కిల్‌లో ‘ద లిటిల్‌ జనరల్‌’గా పేరున్న అడ్వోకాట్‌కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. హెడ్‌ కోచ్‌గా అడ్వోకాట్‌కిది మూడో ప్రపంచకప్‌ కానుంది. 1994లో నెదర్లాండ్స్‌ జట్టుకు... 2006లో దక్షిణ కొరియా జట్టుకు ఆయన కోచ్‌గా ఉన్నారు. అంతేకాకుండా బెల్జియం, యూఏఈ, రష్యా, సెర్బియా, ఇరాక్‌ జట్లకు, 16 ప్రొఫెషనల్‌ క్లబ్‌ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.

What kind of rubbish thinking is this: Kris Srikkanth Slams Shreyas Iyer4
ఇదేం పద్ధతి?.. శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ కెప్టెన్‌ ఫైర్‌

ఐపీఎల్‌-2026 సీజన్‌ను ఘనంగా ఆరంభించింది పంజాబ్‌ కింగ్స్‌. వరుసగా ఆరు మ్యాచ్‌లలో గెలిచి టేబుల్‌ టాపర్‌గా చాన్నాళ్లపాటు కొనసాగింది. కానీ ఆ తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. వరుసగా నాలుగు ఓటములతో పంజాబ్‌ ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయింది.ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌లలో పంజాబ్‌ సత్తా చాటాల్సిందే. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడి ఓడిపోయిన పంజాబ్‌..‍ గురువారం ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తీరును విమర్శించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తమ ప్రధాన స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌తో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడాన్ని తప్పుబట్టాడు.అతడితో ఒక్క ఓవర్‌ కూడా వేయించరా?ఈ మేరకు.. ‘‘పంజాబ్‌ తమ స్పిన్నర్లు చహల్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌లను తప్పనిసరిగా ఆడించాల్సింది. ఇలాంటి సమయంలోనే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తమ బౌలర్లపై నమ్మకం ఉంచాలి. చహల్‌తో ఒక్క ఓవర్‌ కూడా వేయించకపోవడం ఏమిటి?ఇదేం ఆలోచనా విధానం? ఇదేం పద్ధతి?.. చెత్త కెప్టెన్సీ.. ధర్మశాలలో ఫ్లాట్‌ వికెట్‌పై ప్రధాన స్పిన్నర్‌తో కనీసం రెండు ఓవర్లు కూడా వేయించరా?.. చహల్‌ గతంలో ఆర్సీబీ తరఫున ఫ్లాట్‌ వికెట్ల మీద చక్కగా బౌలింగ్‌ చేసి ఆ జట్టును గెలిపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ బౌలర్ల ప్రదర్శన ఇలాకాగా ధర్మశాలలో ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్‌ 210 పరుగులు సాధించింది. కానీ ఈ భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయి.. మూడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీయగా.. యశ్‌ ఠాకూర్‌ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 55 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే, ఎట్టకేలకు రెండు వికెట్లు తీయగలిగాడు.ఇక మార్కో యాన్సెన్‌ 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు ఇచ్చి వికెట్‌ తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో బెన్‌ డ్వార్షుయిస్‌ నాలుగు ఓవర్లలో 51 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌.. మార్కస్‌ స్టొయినిస్‌ 3 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయగలిగారు. చహల్‌ తుదిజట్టులో ఉన్నా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. మరోవైపు హర్‌ప్రీత్‌ బ్రార్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

RCB Opener Loses Gold Chain Nasty Bouncer Blow Vs KKR Fans Reacts5
బంగారు గొలుసు పారేసుకున్నాడు.. అదే పాక్‌లో అయితే!

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్‌ జేకబ్‌ బెతెల్‌ బంగారు గొలుసు నేల మీద పడిపోయింది. అయితే, అతడు దానిని తీసుకోవడం మర్చిపోయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఐపీఎల్‌-2026లో భాగంగా ఆర్సీబీ- కేకేఆర్‌ బుధవారం రాయ్‌పూర్‌ వేదికగా తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన ఆర్సీబీ.. కేకేఆర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల తేడాతో గెలుపుఅంగ్‌క్రిష్‌ రఘువంశీ (71), కామెరాన్‌ గ్రీన్‌ (32), రింకూ సింగ్‌ (49 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ జేకబ్‌ బెతెల్‌ కేవలం 15 పరుగులు చేసి.. కార్తిక్‌ త్యాగి బౌలింగ్‌లో అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి అజేయం సెంచరీ (105)తో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (39) రాణించాడు. ఈ క్రమంలో 19.1 ఓవర్లలో ఆర్సీబీ నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్‌ పూర్తి చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.కిందపడిన బంగారు గొలుసుఇదిలా ఉంటే.. కార్తిక్‌ త్యాగి సంధించిన బౌన్సర్‌ జేకబ్‌ బెతెల్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. ఈ క్రమంలోనే అతడి మెడలో ఉన్న గోల్డ్‌ చెయిన్‌ కింద పడిపోయింది. అయితే, అవుటై పెవిలియన్‌కు వెళ్లిపోతున్న క్రమంలో బెతెల్‌.. బంగారు గొలుసు తీసుకోవడం మర్చిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్‌.. ఈ విషయాన్ని గుర్తించాడు.PC: Xఅదే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే..మైదానంలో పడిన బంగారు గొలుసు తీసి అంపైర్‌కు చూపించగా.. అది అక్కడి నుంచి బెతెల్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.‘‘అసలే బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో గొలుసు దొరికితే ఎవరూ వదిలిపెట్టరు. ఇది ఐపీఎల్‌లో జరిగింది కాబట్టి సరిపోయింది. బెతెల్‌కు తన గొలుసు లభించింది. అదే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇలా జరిగి ఉంటే.. గొలుసు మళ్లీ కనిపించేదే కాదు’’ అని వ్యంగ్యరీతిలో కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సీఎస్‌కేకు భారీ షాక్‌!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్‌ ప్లేయర్‌

It Eats Me Up: Kohli Reveals Why Ton Celebration Vs KKR Wasnt Big One6
అది నన్ను తీవ్రంగా వేధించింది: విరాట్‌ కోహ్లి

వరుస వైఫల్యాల తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్‌ కోహ్లి బుధవారం బ్యాట్‌ ఝులిపించాడు. ‘వింటేజ్‌ కింగ్‌’ను గుర్తుచేస్తూ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.గెలుపులో కీలక పాత్రరాయ్‌పూర్‌ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వరించింది.అది నన్ను తీవ్రంగా వేధించిందిఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్‌లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026కారణం అదేఅదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.కృతజ్ఞుడిగా ఉంటానునా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్‌ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా. దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్‌ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్‌లలో కోహ్లి డకౌట్‌ అయిన సంగతి తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర

CSK IPL 2026 Playoff push takes big hit as star player returns home7
IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మధ్య ఓవర్లలో జట్టుకు కీలకంగా మారిన.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ జేమీ ఓవర్టన్‌ స్వదేశానికి పయనమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడు.. ఐపీఎల్‌-2026 టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.స్పందించిన ఫ్రాంఛైజీఈ విషయంపై చెన్నై యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘జేమీ ఓవర్టన్‌ (Jamie Overton) కుడి తొడకు గాయమైంది. అతడు యూకేకు వెళ్లిపోతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడి గాయంపై స్పష్టత వస్తుంది’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్‌-2026లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న చెన్నై జట్టు.. ఆరింట గెలిచింది.కీలక ఆల్‌రౌండర్‌గాతద్వారా 12 పాయింట్లు సాధించి పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో కీలక ఆల్‌రౌండర్‌ అయిన ఓవర్టన్‌ గాయం వల్ల జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికి 10 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌.. 14 వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. 136 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. సీజన్‌ ఆరంభం నుంచి చెన్నైని గాయాల బెడద వేధిస్తోంది. జట్టు దిగ్గజ సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల ఇప్పటికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక పేసర్‌ రామకృష్ణ ఘోష్‌ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చిన వేళ.. భారీ షాక్‌!అంతకు ముందే పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, ఆయుశ్‌ మాత్రే, నాథన్‌ ఎల్లిస్‌.. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యారు. కాగా టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలతో చతికిలపడ్డ చెన్నై.. అనూహ్య రీతిలో పుంజుకుని ప్లే ఆఫ్స్‌ రేసులోకి దూసుకువచ్చింది. ఇలాంటి కీలక సమయంలో ఓవర్టన్‌ జట్టుకు దూరం కావడంతో భారీ షాక్‌ తగిలినట్లయింది.ఇక ఇప్పటికి 11 మ్యాచ్‌లలో 430 పరుగులు సాధించి సంజూ శాంసన్‌ చెన్నై తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉండగా.. పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ 19 వికెట్లు కూల్చి టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Virat Kohli Scripts History Breaks Chris Gayle World Record8
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్‌ కోహ్లి అదరగొట్టాడు. ఐపీఎల్‌-2026లో గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన ‘కింగ్‌’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్‌లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డు బద్దలుటీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ రికార్డును కోహ్లి సమం చేశాడు.ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. రాయ్‌పూర్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ కోహ్లి (105 నాటౌట్‌) శతక్కొట్టగా.. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉విరాట్‌ కోహ్లి- 409 ఇన్నింగ్స్‌లో👉క్రిస్‌ గేల్‌- 423 ఇన్నింగ్స్‌లో👉డేవిడ్‌ వార్నర్‌- 431 ఇన్నింగ్స్‌లో👉జోస్‌ బట్లర్‌- 468 ఇన్నింగ్స్‌లో👉అలెక్స్‌ హేల్స్‌- 505 ఇన్నింగ్స్‌లో👉కీరన్‌ పోలార్డ్‌- 633 ఇన్నింగ్స్‌లోటీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉క్రిస్‌ గేల్‌- 22👉బాబర్‌ ఆజం- 13👉డేవిడ్‌ వార్నర్‌- 10👉విరాట్‌ కోహ్లి- 10👉రీలీ రొసోవ్‌, సాహిబ్‌జాదా ఫర్హాన్‌- 9👉క్వింటన్‌ డికాక్‌, అభిషేక్‌ శర్మ- 9.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

Asian Games 2026: India Team Announced No 1 Zoravar Singh Left Out9
ఆసియా క్రీడలకు భారత జట్టు ప్రకటన

భారత జట్టు ఎంపికలో ర్యాంకింగ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలకంటే తమ సెలక్షన్‌ ట్రయల్స్‌కే ప్రాధాన్యతనిస్తామని భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) స్పష్టం చేసింది. ట్రయల్స్‌లో సత్తా చాటితేనే టీమ్‌లో చోటు దక్కుతుందని, ర్యాంక్‌ను పరిగణనలోకి తీసుకోమని ఏడాది క్రితం తాము రూపొందించిన విధానాన్ని వెల్లడించింది. ‘నంబర్‌ వన్‌’కు చోటే లేదు!ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత ‘షాట్‌గన్‌’ టీమ్‌లను ఎన్‌ఆర్‌ఐఏ ప్రకటించింది. అయితే ఇందులో ఆసియా నంబర్‌వన్, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో ఉన్న ట్రాప్‌ షూటర్‌ జొరావర్‌ సింగ్‌ సంధూకు చోటు దక్కలేదు.గత ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో అతను నిలకడగా రాణిస్తున్నా... ఇటీవల జాతీయ చాంపియన్‌షిప్, సెలక్షన్‌ ట్రయల్స్‌లోలో ప్రదర్శన బాగా లేకపోవడంతో జొరావర్‌ను తప్పించారు. నెల రోజుల క్రితమే జొరావర్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు. గత అక్టోబర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన 47 ఏళ్ల జొరావర్‌ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం నెగ్గిన మూడో భారత షూటర్‌గా గుర్తింపు పొందాడు. గత నెలలో కేవలం స్కోరింగ్‌ పాయింట్ల కోసమే పాల్గొన్న వరల్డ్‌ కప్‌లో కూడా జొరావర్‌ 119 పాయింట్లతో భారత షూటర్లలో అందరికంటే మెరుగైన స్కోరు సాధించాడు. నా ఘనతను గుర్తించాలని కోరుతున్నాఇక 2025 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కూడా 122 పాయింట్లతో భారత్‌ తరఫున అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. తమ నిర్ణయాన్ని ఎన్‌ఆర్‌ఏఐ పునఃసమీక్షించాలని జొరావర్‌ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. ‘ఆసియా నంబర్‌వన్‌గా, వరల్డ్‌ నంబర్‌ 6గా ఉన్న నా ఘనతను గుర్తించాలని కోరుతున్నా. గత ఆరు నెలలుగా నేను ట్రాప్‌లో అత్యుత్తమ స్కోరింగ్‌లు నమోదు చేశాను’ అని జొరావర్‌ అన్నాడు. ఎంపిక చేసే ప్రసక్తే లేదుఅయితే ఎన్‌ఆర్‌ఏఐ మాత్రం ఇవేమీ పరిగణనలోకి తీసుకోమని చెబుతోంది. ఎలాంటి మార్పూ లేకుండా ప్రస్తుతం ప్రకటించిన జట్టే 99 శాతం బరిలోకి దిగుతుందని ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్‌ కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పేరు ప్రతిష్టలను బట్టి ఎంపిక ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. టీమ్‌లోకి ఎంపికైన ఇతర ‘షాట్‌గన్‌’ షూటర్ల స్కోరింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో జొరావర్‌కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో రిజ్వీ (122), హైదరాబాద్‌ షూటర్‌ కైనన్‌ చెనాయ్‌ (119), శపథ్‌ భరద్వాజ్‌ (118) స్కోరు సాధించారు. 35 ఏళ్ల కైనన్‌ మూడోసారి ఆసియా క్రీడల్లో పోటీపడనున్నాడు. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన కైనన్‌ 36వ స్థానంలో నిలిచాడు. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కైనన్‌ కాంస్య పతకాన్ని సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కైనన్‌... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం... ప్రపంచకప్‌లలో ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిపి నాలుగు పతకాలు గెలిచాడు. భారత ‘షాట్‌గన్‌’ జట్ల వివరాలు పురుషుల ట్రాప్‌: కైనన్‌ చెనాయ్, అహ్వర్‌ రిజ్వీ, శపథ్‌ భరద్వాజ్‌. మహిళల ట్రాప్‌: నీరూ, మనీషా కీర్, ఆషిమా అహ్లావత్‌. పురుషుల స్కీట్‌: అనంత్‌జీత్‌ సింగ్, భవ్‌తేజ్‌ గిల్, మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌. మహిళల స్కీట్‌: పరీనాజ్‌ ధలివాల్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌. ట్రాప్‌ ‘మిక్స్‌డ్‌’: కైనన్‌ చెనాయ్, నీరూ. స్కీట్‌ ‘మిక్స్‌డ్‌’: అనంత్‌జీత్‌ సింగ్, పరీనాజ్‌ ధలివాల్‌. చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. తొలి ప్లేయర్‌గా అరుదైన రి​కార్డు

ICC Test rankings silence Bumrah critics amid IPL 2026 Failure10
‘టాప్‌’లోనే బుమ్రా.. కమిన్స్‌ సూపర్‌

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ (ఆస్ట్రేలియా), మ్యాట్‌ హెన్రీ (న్యూజిలాండ్‌), ప్యాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా) ఒక్కో ర్యాంక్‌ను మెరుగుపర్చుకొని వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్‌ బౌలర్‌ నోమన్‌ అలీ మూడు స్థానాలు పడిపోయి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షాంటో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌లో నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో షంటో తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. బంగ్లాదేశ్‌కే చెందిన మోమినుల్‌ హక్‌ 12 స్థానాలు మెరుగుపర్చుకొని 35వ ర్యాంక్‌లో ఉన్నాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement