ప్రధాన వార్తలు
T20 WC 2026: పాక్ జట్టులో కలకలం
పాక్ జట్టులో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది కోచ్ మైక్ హెస్సన్ను బహిరంగంగా టార్గెట్ చేశాడు. సూపర్-8 మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెస్సన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు."అవును, నన్ను నమీబియా మ్యాచ్ నుంచి తప్పించారు. అయినా నా దృష్టి ఎప్పటికీ బౌలింగ్పైనే ఉంటుంది. నాకు అవకాశం వచ్చినప్పుడు జట్టుకు 100 శాతం ఇవ్వడమే నా పని. ఎవరి ముందు నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు. అలాగే హెస్సన్ నిర్ణయాలపై వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "ఆయనకు ఒక మైండ్సెట్ ఉంది. ఆయన హెడ్ కోచ్. జట్టును ఎలా నడిపించాలో ఆయనకే బాగా తెలుసు. దానికి ఆయనే బాధ్యత వహించాలి" అని వ్యాఖ్యానించారు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు హెస్సన్పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.అఫ్రిది ఎందుకిలా..?అఫ్రిది-హెస్సన్ మధ్య విభేదాలు ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో నమీబియా మ్యాచ్ నుంచి మొదలయ్యాయి. భారత్తో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని అఫ్రిదిని హెస్సన్ నమీబియా మ్యాచ్ నుంచి తప్పించాడు. ఈ నిర్ణయాన్ని హెస్సన్ వ్యూహాల్లో భాగంగా పేర్కొన్నప్పటికీ, హెస్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టాడని అఫ్రిది భావిస్తున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అఫ్రిది ఇంగ్లండ్ మ్యాచ్లో రాణించిన తర్వాత హెస్సన్పై పరోక్ష మాటల దాడికి దిగాడు.ఇంగ్లండ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడినా, అఫ్రిది అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి మ్యాచ్పై ఆశలు కలిగించాడు. అయితే బ్రూక్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ను పాక్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అంతకుముందు న్యూజిలాండ్తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాక్ ఖాతాలో ప్రస్తుతం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది. ఆ జట్టు తమ చివరి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచినా, సెమీస్ బెర్త్ దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ప్రస్తుతం గ్రూప్-1 నుంచి ఖాళీగా ఉంది ఒకే ఒక బెర్త్. ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచి దర్జాగా సెమీస్కు అర్హత సాధించగా.. న్యూజిలాండ్, పాక్, శ్రీలంక మిగిలిన బెర్త్ కోసం పోటీపడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్లో నేడు మరో సూపర్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం.శ్రీలంక తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్తో జరగాల్సిన మ్యాచ్ రద్దై న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్ కోసం న్యూజిలాండ్-పాక్-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.న్యూజిలాండే ఫేవరెట్నేటి మ్యాచ్లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్ దశలో ఆసీస్పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయిఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు జరగగా.. న్యూజిలాండ్ 16, శ్రీలంక 11 మ్యాచ్లు గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. న్యూజిలాండ్ 5, శ్రీలంక 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది.తుది జట్లు (అంచనా)న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
T20 WC 2026: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ టీమ్
ఇంగ్లండ్ టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ప్రపంచకప్లో వరుసగా ఐదు ఎడిషన్లలో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో సెమీస్కు చేరడం ద్వారా ఈ ఘనత సాధించింది. వరుసగా 2016, 2021, 2022, 2024, 2026 ఎడిషన్లలో ఫైనల్-4కు చేరింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉండేది. పాక్ వరుసగా 2007, 2009, 2010, 2012 ఎడిషన్లలో సెమీస్కు చేరింది. శ్రీలంక వరుసగా 2009, 2010, 2012, 2014 ఎడిషన్లలో ఫైనల్-4కు అర్హత సాధించింది.తాజాగా ఎడిషన్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా నిలిచిన ఇంగ్లండ్.. తమ మూడో టైటిల్ దిశగా దూసుకుపోతుంది. 2010, 2022 ఎడిషన్లలో ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు.. తాజాగా పాక్పై సూపర్-8 మ్యాచ్లో గెలుపుతో గ్రూప్-2 నుంచి దర్జాగా సెమీస్కు చేరింది. అంతకుముందు ఇదే దశలో ఆతిథ్య శ్రీలంకపై కూడా గెలిచింది. చివరి సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది.మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఈ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ కోసం పోరాడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్ల్లో టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్లతో తలపడాల్సి ఉంది.ఇదిలా ఉంటే, పల్లెకెలె వేదికగా నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన మ్యాచ్లో పాక్పై ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చాడు.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కనులపండుగగా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).అంతకుముందు సాహిబ్జాదా ఫర్హాన్ (63) రాణించడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (25), ఫకర్ జమాన్ (25), షాదాబ్ ఖాన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
T20 WC 2026: మిల్లర్తో రీల్ చేసిన అమ్మాయికి రేప్ బెదిరింపులు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేసి సౌతాఫ్రికా గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఈ అవార్డు ప్రధానోత్సవం తర్వాత ఐసీసీ ఆహ్వానిత సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ప్రిన్సీ పారిఖ్ మిల్లర్తో ఓ రీల్ చేసింది. మిల్లర్ చుట్టూ తిరుగుతూ వ్యంగ్యంగా చప్పట్లు కొట్టింది. ఈ రీల్ను ఆమె తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. చాలామందికి ఈ రీల్ సరదాగా అనిపించగా.. కొందరికి మాత్రం నచ్చలేదు. ఫలితంగా పారిఖ్పై ఆన్లైన్ దాడులు జరిగాయి. ఫేస్బుక్లో రేప్ బెదిరింపులు, బాడీ షేమింగ్ కామెంట్లు వచ్చాయి.She posted this Instagram story after receiving backlash for her cringe reel. https://t.co/3cMjx42HK3 pic.twitter.com/0YUVM4RXRl— Bewda babloo 🧉 (@babloobhaiya3) February 24, 2026దీన్ని సీరియస్గా తీసుకున్న పారిఖ్.. ఇన్స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేస్తూ.. డేవిడ్ మిల్లర్తో చేసిన వీడియోని ఫేస్బుక్ నుంచి తొలగించాను. ఎందుకంటే వందలాది అసభ్యకరమైన కామెంట్లు, రేప్ బెదిరింపులు రావడం భరించలేకపోయానని పేర్కొన్నారు. అసభ్య కామెంట్లు పెట్టిన వారి అకౌంట్ల యూజర్నేమ్లు, మెసేజ్లు బయట పెడతానని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మున్ముందు ఎవరికీ ఇలాంటి బెదిరింపులు రాకూడదని రాసుకొచ్చారు. ప్రిన్సీ పారిఖ్ ఐసీసీ ఆహ్వానించిన ఇన్ఫ్లూయెన్సర్లలో ఒకరు. ఆమెకు ఇన్స్టాలో 1.7 మిలియన్లు, ఫేస్బుక్లో 30 వేల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె గతంలో హార్దిక్ పాండ్యా, కేన్ విలియమ్సన్, స్మృతి మంధానతో కూడా రీల్స్ చేశారు.ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్కు చేరుతుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వెస్టిండీస్, సౌతాఫ్రికా తమతమ తొలి మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి సెమీస్ రేసులో దూసుకుపోతున్నాయి.
పాక్పై మ్యాచ్ విన్నింగ్ శతకం.. రికార్డుల మోత మోగించిన బ్రూక్
టీ20 వరల్డ్కప్ 2026లో నిన్న (ఫిబ్రవరి 24) జరిగిన సూపర్-8 పోరులో పాకిస్తాన్పై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఒంటిచేత్తో ఇంగ్లండ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎవరి సహకారం లేకున్నా బ్రూక్ ఒక్కడే ఇంగ్లండ్ను విజయతీరాలకు చేర్చిన వైనం ప్రతి క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంది.చూడముచ్చటైన బౌండరీలు, భారీ సిక్సర్లతో అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు కన్నుల పండుగలా ఉండింది. 165 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బ్రూక్ అద్వితీయ శతకంతో గెలుపు తీరాల వరకు చేర్చాడు. అతనికి విల్ జాక్స్ (28), సామ్ కర్రన్ (16) నామమాత్రంగా సహరించారు. బ్రూక్ మూడంకెల స్కోర్ తర్వాత ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో రెండంకెల స్కోర్ చేసింది జాక్స్, కర్రన్ మాత్రమే. బ్రూక్ శతక్కొట్టుడు కారణంగా ఇంగ్లండ్ 19వ ఓవర్ తొలి బంతికి విజయతీరాలు తాకింది (8 వికెట్ల నష్టానికి).ఈ మ్యాచ్ విన్నింగ్ శతకంతో బ్రూక్ రికార్డుల మోత మోగించాడు. తద్వారా తన జట్టును సెమీస్కు కూడా చేర్చాడు. బ్రూక్ సాధించిన ఆ రికార్డులు ఏంటంటే..?టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీహ్యారీ బ్రూక్- 50 బంతులు (తాజా మ్యాచ్లో)అలెక్స్ హేల్స్- 60జోస్ బట్లర్- 67టీ20 వరల్డ్కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్లుబ్రూక్- 100 (తాజా మ్యాచ్లో)క్రిస్ గేల్- 98 లోర్కాన్ టక్కర్- 94 నాటౌట్రోహిత్ శర్మ- 92ఈ సెంచరీతో బ్రూక్ ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతనికి ముందు జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ ఈ ఘనత సాధించారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జట్టు సూపర్-8లో వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, దర్జాగా సెమీస్కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయినట్లే. అధికారికంగా గ్రూప్-2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక పోటీ పడతాయి. గ్రూప్-1లో సెమీస్ రేసులో వెస్టిండీస్, సౌతాఫ్రికా దూసుకుపోతున్నాయి. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమితో ఆ గ్రూప్లో భారత్ సెమీస్ బెర్త్ను సంక్లిష్టం చేసుకుంది.
సచిన్ను ఎల్బీగా ప్రకటించడం తప్పే
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఎల్బీడబ్ల్యూగా అవుటివ్వడం ముమ్మాటికీ తప్పేనని వెస్టిండీస్ దిగ్గజ అంపైర్ స్టీవ్ బక్నర్ అంగీకరించారు. అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం కలిగిన ఆయన 2009లో అంపైరింగ్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 1989 నుంచి 2009 వరకు వరుసగా జరిగిన ఐదు వన్డే ప్రపంచకప్లకు ఫీల్డ్ అంపైర్గా పనిచేశారు. తాజాగా 79 ఏళ్ల బక్నర్ రెండు దశాబ్దాల తర్వాత విండీస్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ ఇంటర్వ్యూలో తన పొరపాటును అంగీకరించారు. అంపైరింగ్ కెరీర్లోనే అది అత్యంత పేలవమైన నిర్ణయంగా చెప్పుకొచ్చారు. 2003–04లో ఆ్రస్టేలియా పర్యటనలో భారత్ ఆడిన టెస్టు సిరీస్లో సచిన్ను వికెట్ల ముందు దొరికిపోయినట్లు (ఎల్బీడబ్ల్యూ)గా బక్నర్ ప్రకటించారు. కానీ రిప్లేలో బంతి వికెట్లకు దూరంగా పైనుంచి వెళుతున్నట్లు స్పష్టమైంది. దీనిపై అప్పటి మేటి టీవీ వ్యాఖ్యాత టోనీ గ్రెగ్ అంపైరింగ్లోనే అత్యంత చెత్త నిర్ణయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలు ఏమైందంటే... ఇది 22 ఏళ్ల క్రితం సంగతి. బ్రిస్బేన్లో భారత్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్లో జాసన్ గిలెస్పీ వేసిన బంతిని సచిన్ డిఫెండ్ చేయబోగా అది అతని ప్యాడ్లను తగిలింది. వెంటనే బౌలర్, జట్టు సహచరులంతా ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అరుస్తూ అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ బక్నర్ అప్పీలుకు బదులుగా తన చేతి వేలు పైకెత్తాడు. ఎంతో అనుభవజ్ఞుడైన సచిన్కు బంతి గమనం బాగా గుర్తు. అది ఎల్బీడబ్ల్యూ కానేకాదని అతని గట్టి నమ్మకం అందుకే నిరాశగా వెనుదిరిగాడు. మరుసటి ఏడాది (2005) పాక్తో కోల్కతాలో జరిగిన మ్యాచ్లోనూ సచిన్ను తప్పుడు నిర్ణయంతో బక్నర్ పెవిలియన్కు పంపించారు. రజాక్ సంధించిన బంతి టెండూల్కర్ బ్యాట్ తగలకుండా ఫీల్డర్ చేతుల్లో పడింది. అప్పుడు క్యాచ్ అవుట్గా ప్రకటించారు.
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్కు
టి20 వరల్డ్ కప్లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పెట్టినా ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో ఇంకా తడబాటు... వరుసగా నాలుగు మ్యాచ్లలో తానూ విఫలం కావడంతో విమర్శల ఒత్తిడి... ఇలాంటి స్థితిలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదనపు బాధ్యత తీసుకున్నాడు... 61 మ్యాచ్ల కెరీర్లో తొలిసారి మూడో స్థానంలోకి దిగి జట్టును గెలిపించే భారాన్ని భుజాన వేసుకున్నాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో తనొక్కడే 100 పరుగులు చేసి ఒంటిచేత్తో టీమ్ను సెమీఫైనల్కు చేర్చాడు. బ్యాటింగ్లో సాధారణ స్కోరుకే పరిమితమైన పాకిస్తాన్... బౌలింగ్లో ఇతర బ్యాటర్లను నిలువరించగలిగింది గానీ బ్రూక్ను ఆపలేక మ్యాచ్ను అప్పగించింది. ఫలితంగా ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి! పల్లెకెలె: టి20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ వరుసగా ఐదోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ‘సూపర్–8’లో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–2 మ్యాచ్లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై నెగ్గింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఫర్హాన్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 100; 10 ఫోర్లు, 4 సిక్స్లు) కెరీర్లో తొలి టి20 సెంచరీతో జట్టును గెలిపించాడు. మొదటి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్ ఇప్పుడు పాక్పై గెలిచి ముందంజ వేసింది. మరోవైపు పాక్ సెమీస్ చేరే అవకాశాలకు గండిపడింది. చివరి మ్యాచ్లో శ్రీలంకపై తప్పనిసరిగా గెలవడంతో పాటు ఇతర సమీకరణాలు, రన్రేట్లపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. దక్కని శుభారంభం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్కు శుభారంభం లభించలేదు. సయీమ్ అయూబ్ (7), కెప్టెన్ సల్మాన్ ఆగా (5) తమ వైఫల్యాలను కొనసాగించారు. ఈ దశలో ఫర్హాన్, బాబర్ ఆజమ్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్ప్లేలో ఒక్క సిక్సర్ కూడా లేకుండా పాక్ 46 పరుగులు చేసింది. ఆ తర్వాతా ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో జట్టు ఒకదశలో వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే కొట్టలేకపోయింది! ఈ క్రమంలో బాబర్ వెనుదిరగ్గా, ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రం కాస్త దూకుడుగా ఆడాడు. మరోవైపు 37 బంతుల్లో ఫర్హాన్ అర్ధసెంచరీ పూర్తయింది. 16 ఓవర్లలో స్కోరు 126/4. అయితే చివరి 4 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే చేసిన టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. షాదాబ్ (11 బంతుల్లో 23; 4 ఫోర్లు) కాస్త ధాటిని ప్రదర్శించడంతో స్కోరు 160 పరుగులు దాటింది. హడలెత్తించిన అఫ్రిది ఛేదనలో ఇంగ్లండ్ను ఆరంభంలోనే షాహిన్ షా అఫ్రిది దెబ్బ తీశాడు. తన తొలి బంతికే ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను... తన రెండో ఓవర్లో జోస్ బట్లర్ (2)ను, మూడో ఓవర్లో బెతెల్ (8)ను వెనక్కి పంపించాడు. అయితే ఈ స్థితిలో బ్రూక్ ఎదురుదాడితో పరుగులు రాబట్టాడు. నవాజ్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లేలో టీమ్ స్కోరు 53 పరుగులకు చేరింది. తక్కువ వ్యవధిలో బాంటన్ (2), స్యామ్ కరన్ (16) అవుటైనా... మరోవైపు బ్రూక్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా అతను అదే ధాటిని కొనసాగించగా, విల్ జాక్స్ (23 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్స్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అలవోకగా షాట్లు ఆడిన బ్రూక్... అఫ్రిది బౌలింగ్లో మిడాఫ్ మీదుగా భారీ సిక్స్తో శతకం పూర్తి చేసుకున్నాడు. విజయానికి చేరువైన దశలో 6 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత తడబడినా... చివరకు ఐదు బంతుల ముందే ఇంగ్లండ్ గట్టెక్కింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (ఎల్బీ) (బి) ఒవర్టన్ 63; అయూబ్ (సి) బెతెల్ (బి) ఆర్చర్ 7; సల్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 5; బాబర్ (బి) ఒవర్టన్ 25; ఫఖర్ (సి) డాసన్ (బి) రషీద్ 25; షాదాబ్ (రనౌట్) 23; ఉస్మాన్ (సి) ఒవర్టన్ (బి) డాసన్ 8; నవాజ్ (ఎల్బీ) (బి) డాసన్ 0; అఫ్రిది (సి) స్యామ్ కరన్ (బి) ఆర్చర్ 2; సల్మాన్ మీర్జా (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–14, 2–27, 3–73, 4–122, 5–132, 6–146, 7–146, 8–149, 9–164. బౌలింగ్: ఆర్చర్ 4–0–32–2, ఒవర్టన్ 3–0–26–2, డాసన్ 4–0–24–3, స్యామ్ కరన్ 3–0–24–0, రషీద్ 4–0– 31–1, జాక్స్ 2–0–27–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 0; బట్లర్ (సి) ఉస్మాన్ (బి) షాహిన్ అఫ్రిది 2; బ్రూక్ (బి) షాహిన్ అఫ్రిది 100; బెతెల్ (సి) ఫర్హాన్ (బి) షాహిన్ అఫ్రిది 8; బాంటన్ (సి) ఉస్మాన్ (బి) తారిఖ్ 2; స్యామ్ కరన్ (సి) నవాజ్ (బి) తారిఖ్ 16; జాక్స్ (బి) నవాజ్ 28; ఒవర్టన్ (స్టంప్డ్) ఉస్మాన్ (బి) నవాజ్ 0; డాసన్ (నాటౌట్) 1; ఆర్చర్ (నాటౌట్) 5; మొత్తం (19.1 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–35, 4–58, 5–103, 6–155, 7–160, 8–161. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–30–4, సల్మాన్ మీర్జా 3.1–0–26–0, సయీమ్ అయూబ్ 2–0–21–0, నవాజ్ 3–0–26–2, షాదాబ్ ఖాన్ 3–0–31–0, ఉస్మాన్ తారిఖ్ 4–0–31–2. 3 ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. గతంలో జోస్ బట్లర్, డేవిడ్ మలాన్ మాత్రమే ఈ ఘనత నమోదు చేశారు. ఓవరాల్గా ఏ జట్టు తరఫునైనా టి20 ప్రపంచకప్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా కూడా బ్రూక్ గుర్తింపు పొందాడు. టి20 ప్రపంచకప్లో నేడుశ్రీలంక X న్యూజిలాండ్వేదిక: కొలంబో రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
‘శుభమ్’ ఆరంభం
హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్కు చేరుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తుదిపోరులోనూ అదే జోరు కనబరుస్తోంది. ఎనిమిది సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటకపై ఏమాత్రం అదురు బెదురు లేకుండా సాధికారికంగా ఆడుతోంది. మంగళవారం ప్రారంభమైన రంజీ ఫైనల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూకశ్మీర్ జట్టు... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 87 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. శుభమ్ పుండిర్ (221 బంతుల్లో 117 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో విజృంభించగా... యావర్ హసన్ (150 బంతుల్లో 88; 13 ఫోర్లు), అబ్దుల్ సమద్ (67 బంతుల్లో 52 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో మెరిశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కటి ఆటతీరు కనబరుస్తున్న జమ్మూకశ్మీర్ జట్టు... స్టార్లతో నిండి ఉన్న కర్ణాటకపై అదే దూకుడు కనబర్చింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (6) విఫలం కాగా... మరో ఓపెనర్ యావర్ హసన్తో కలిసి శుభమ్ రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో యావర్ 77 బంతుల్లో శుభమ్ 100 బంతుల్లో హాఫ్సెంచరీలు పూర్తి చేసుకున్నారు. శుభమ్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడితే... యావర్ మాత్రం ఎడాపెడా బౌండరీలు బాదాడు. కర్ణాటక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ ద్వయం 244 బంతుల్లో 139 పరుగులు జోడించింది. ప్రసిధ్ బౌన్సర్కు గాయపడిన కెపె్టన్ పారస్ డోగ్రా (9) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగ్గా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్... శుభమ్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్కు 144 బంతుల్లో 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో శుభమ్ భారీ సిక్స్ సాయంతో 186 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్, సెమీఫైనల్లో బెంగాల్పై విజయాలు సాధించిన జమ్మూకశీ్మర్ జట్టు... కర్ణాటకపై సైతం చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. కర్ణాటక జట్టు తరఫున ఈ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో జమ్మూకశ్మీర్ ప్లేయర్లు పరుగుల వరద పారించడం విశేషం. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న జమ్మూకశీ్మర్ జట్టు రెండో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందనేది కీలకం. స్కోరు వివరాలు జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: కమ్రాన్ ఇక్బాల్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 6; యావర్ హసన్ (సి) కేఎల్ రాహుల్ (బి) ప్రసిధ్ 88; శుభమ్ (బ్యాటింగ్) 117; పారస్ డోగ్రా (రిటైర్డ్ హర్ట్) 9; అబ్దుల్ సమద్ (బ్యాటింగ్) 52; ఎక్స్ట్రాలు 12; మొత్తం (87 ఓవర్లలో 2 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–18, 2–157, 2–179. బౌలింగ్: విద్యాధర్ పాటిల్ 16–0–66–0; విజయ్ కుమార్ వైశాఖ్ 18–6–25–0; ప్రసిధ్ కృష్ణ 16–5–36–2; శ్రేయస్ గోపాల్ 17–1–79–0; శిఖర్ షెట్టి 20–0–68–0.
మరోసారి ‘షూటౌట్’లో...
హోబర్ట్: ప్రొ హాకీ లీగ్లో భారత పురుషుల హాకీ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. మొదటి ఐదు మ్యాచ్ల్లో నిర్ణీత సమయంలో ఓటమి పాలైన టీమిండియా... తర్వాతి రెండు మ్యాచ్ల్లో ‘షూటౌట్’లో ఓడిపోయింది. రెండో అంచె పోటీల్లో భాగంగా మంగళవారం స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–4 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. స్పెయిన్కు రెండు పాయింట్లు, భారత్కు ఒక పాయింట్ లభించింది. నిర్ణీత సమయంలో 59 నిమిషాల వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... 59వ నిమిషంలో గోల్ సమర్పించుకుంది. దాంతో స్పెయిన్ 1–1తో స్కోరును సమం చేసింది. ఆట 19వ నిమిషంలో మణీందర్ సింగ్ గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలి విజయం దిశగా సాగింది. మరో రెండు నిమిషాలు పూర్తయితే భారత్కు తొలి గెలుపు ఖాయమయ్యే స్థితిలో స్పెయిన్ ప్లేయర్ బ్రూనో ఫాంట్ గోల్ చేశాడు. చివరి 13 సెకన్లలో స్పెయిన్కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకున్న భారత్ వాటిని నిలువరించింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో స్పెయిన్ ఆటగాళ్లు తొలి నాలుగు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా... భారత్ తరఫున అభిషేక్, కెప్టెన్ హార్దిక్ సింగ్ గురి తప్పడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్లో స్పెయిన్కు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు, భారత్కు నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు అన్నింటిని వృథా చేశాయి. నేడు జరిగే రెండో అంచె చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత జట్టు రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటిన ఇంటికి బయలు దేరి వెళ్లిపోయాడు.దీంతో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్కు రింకూ దూరమయ్యాడు. అతడు ఎప్పుడు తిరిగి వస్తాడన్నది కూడా స్పష్టత లేదు. రింకూ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని స్థానిక ఆస్పత్రిలో వెంటిటేలర్పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు రింకూ జట్టును వీడాడు. కాగా ఈ మెగా టోర్నీలో రింకూకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఆఖరి ఓవర్లలోనే క్రీజులోకి వచ్చాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్లో ముందుగానే బ్యాటింగ్కు వచ్చినప్పటికి.. డకౌటై పెవిలియన్కు చేరాడు.అయితే సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి పాల్వడంతో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్కు చాలా కీలకం. ఇటువంటి మ్యాచ్కు ముందు రింకూ జట్టును వీడడం గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి.
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తె...
పాక్ కెప్టెన్పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బ...
రుతుజా జోడీ ఓటమి
దుబాయ్: భారత మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్వన్ ...
హర్మన్ప్రీత్ దూరం
న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగిన పురుషుల ప్రొ లీగ్ తొ...
బ్రూక్ శతకంతో ఇంగ్లండ్ సెమీస్కు
టి20 వరల్డ్ కప్లో ‘సూపర్ ఎయిట్స్’లోకి అడుగు పె...
‘శుభమ్’ ఆరంభం
హుబ్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి ప్రతిష్టాత్మక...
తండ్రికి సీరియస్.. జట్టును వీడిన భారత పవర్ హిట్టర్
టీ20 ప్రపంచకప్-2026లో జింబాబ్వేతో సూపర్-8 మ్య...
రాణించిన పాక్ బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పల్లెకలే వేదికగ...
క్రీడలు
హైదరాబాద్ : ఈకో రన్ 2.0లో బిగ్ బాస్ దివి వద్త్య సందడి (ఫొటోలు)
సోఫీ షైన్ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
ప్రియురాలు సోఫీ షైన్తో గబ్బర్ శిఖర్ పెళ్లి.. సంగీత్ నైట్ ఫోటోలు
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
నెక్లెస్ రోడ్డులో సందడిగా ఉమెన్ పింకథాన్ రన్ (ఫొటోలు)
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
వీడియోలు
రెండుకు రెండూ గెలిచినా సెమీస్ చేరడం కష్టమేనా..!
కొంపముంచిన గంభీర్
సూపర్ 8లో హై ఓల్టేజ్ ఫైట్..! ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
ఆసీస్ ఆఖరి పోరాటం పరువు కోసం గెలుపు
నేడు పరువు పోరు.. ఆస్ట్రేలియా Vs ఒమన్
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
T20 World Cup : ఇది మాములు COMEBACK కాదు
పాకిస్తాన్ అమ్మాయిల దెబ్బకు పారిపోయిన PCB Chairman
