Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

T20 WC 2026: England beat Scotland by 5 wickets1
T20 WC 2026: స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శ‌నివారం కోల్‌క‌తా వేదిక‌గా స్కాట్లాండ్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 19.4 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగులకు ఆలౌటైంది.కెప్టెన్ రిచీ బెరింగ్టన్(49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మైకేల్ జోన్స్(33), బ్రూస్‌(24) రాణించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో అదిల్ ర‌షీద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్చ‌ర్, డాస‌న్ త‌లా రెండు వికెట్లు సాధించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డిన‌ప్ప‌టికి, మిడిల్ ఆర్డర్ రాణించడంతో విజ‌యాన్ని అందుకుంది.టామ్ బాంట‌న్‌(41 బంతుల్లో 63 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో స‌త్తాచాట‌గా.. జాకబ్ బెథెల్(32), సామ్ కర్రన్(28) రాణించారు. స్కాట్లాండ్ బౌల‌ర్ల‌లో మెక్‌ముల్ల‌న్‌, బ్రాడ్‌ వీల్, కుర్రీ త‌లా వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-సిలో ఇంగ్లండ్ రెండో స్థానానికి చేరుకోగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది.

Indias Likely Playing XI For T20 World Cup 2026 Match Against Pakistan2
పాక్‌తో మ్యాచ్.. భార‌త తుది జ‌ట్టు ఇదే! వారిద్ద‌రిపై వేటు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా కీల‌క పోరుకు సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియా.. అదే జోరును దాయాది జ‌ట్టుపై కూడా కొన‌సాగించాల‌ని భావిస్తోంది.అయితే ఈ హైవోల్టేజ్ కోసం భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అనారోగ్యం కార‌ణంగా న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మైన విధ్వంసక‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ.. తిరిగి పాక్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఒక‌వేళ ఇదే జ‌రిగితే సంజూ శాంస‌న్‌పై వేటు ప‌డ‌నుంది.గ‌త మ్యాచ్‌లో సంజూకు అవ‌కాశం ల‌భించిన‌ప్ప‌టికి స‌ద్వినియోగ ప‌రుచుకోలేక‌పోయాడు. దూకుడుగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అదేవిధంగా కొలంబో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవ‌కాశముండ‌డంతో కుల్దీప్ యాద‌వ్ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. న‌మీబియాతో మ్యాచ్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకున్న అర్ష్‌దీప్ సింగ్ లేదా రింకూ సింగ్‌లో ఎవ‌రో ఒక‌రిని ప‌క్క‌న పెట్టే అవ‌కాశ‌ముంది. పాక్‌పై కుల్దీప్ యాద‌వ్‌కు అద్భుత‌మైన రికార్డు (3 టీ20ల్లో 8 వికెట్లు) ఉంది. కాబ‌ట్టి అత‌డిని తుది జ‌ట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో ఆదివారం వర్షం కురిసే అవకాశం 90 శాతం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక‌వేళ మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ద‌క్కుతుంది.పాక్‌తో మ్యాచ్‌కు భార‌త తుది జ‌ట్టు(అంచ‌నా): సంజు శాంసన్/అభిషేక్ శ‌ర్మ‌,ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్‌), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

Should India be afraid of Usman Tariq in IND vs PAK?3
'అత‌డితో జాగ్ర‌త్త‌'.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్‌

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిఖ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని భార‌త జ‌ట్టును భ‌జ్జీ హెచ్చ‌రించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భార‌త్ గెలుస్తుంద‌ని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జ‌ట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుత‌మైన స్పిన్న‌ర్ ఉన్నాడు. అత‌డిని భార‌త బ్యాట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఆడాలి. అయితే మ‌న జ‌ట్టుపై పూర్తి న‌మ్మ‌కం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్ప‌టిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగ‌ర‌వేస్తార‌ని ఆశిస్తున్నాము అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ త‌న బౌలింగ్ యాక్ష‌న్‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాట‌ర్లు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను త‌ల‌పిస్తోంది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌పై వివాదాలు త‌లెత్తిన‌ప్ప‌టికి.. ఐసీసీ మాత్రం క్లియ‌రెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 4 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పాక్ జ‌ట్టు కూడా అత‌డిపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకుంది.చ‌ద‌వండి: T20 WC 2026: భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

Pak Captain Salman Agha Asked About Shaking Hands With Indian Players.4
భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ పోరుకు స‌మయం అస‌న్న‌మైంది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో భాగంగా ఆదివారం దాయాది జ‌ట్లు తాడోపేడో తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ఇప్ప‌టికే కొలంబోకు చేరుకున్న ఇరు జ‌ట్లు.. శ‌నివారం సాయంత్రం త‌మ ప్రాక్టీస్ సెష‌న్ష్‌లలో పాల్గోనున్నాయి.కాగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్‌ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆసియాక‌ప్‌లో చోటు చేసుకున్న హ్యాండ్ షేక్ వివాదంపై అఘా మాట్లాడాడు. దేశాల మ‌ధ్య ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా, మైదానంలో మాత్రం క్రీడా స్పూర్తిని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆఘా చెప్పుకొచ్చాడు."క్రికెట్ ఎల్ల‌ప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఆడాలి. క్రీడ‌ల్లో రాజ‌కీయాల‌కు తావులేదు. క్రికెట్ ఒక‌ జెంటిల్‌మ్యాన్ గేమ్. ప్ర‌తీ ఒక్క‌రూ హుందాగా వ్య‌వ‌హ‌రించాలి" సల్మాన్ పేర్కొన్నాడు. అదేవిధంగా రేప‌టి మ్యాచ్‌లో భారత్-పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా అన్న ప్రశ్నకు.. "రేపు మీకే తెలుస్తుంది" అని సల్మాన్ సమాధానమిచ్చాడు. టీమిండియా ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త్వ‌ర‌గా కోలుకోవాలని, రేపటి మ్యాచ్‌లో ఆడాలని తాను కోరుకుంటున్నట్లు అఘా తెలిపాడు.కాగా పెహ‌ల్గ‌మ్ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా ఆసియాక‌ప్‌లో పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త్ క‌ర‌చాల‌నం నిర‌కారించింది. ఆ త‌ర్వాత భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, అండ‌ర్‌-19 జ‌ట్టు కూడా అదే బాట‌లో న‌డిచింది. అప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో పాక్ ప్లేయ‌ర్ల‌తో భార‌త్ హ్యాండ్ షేక్ చేయ‌లేదు. ఇప్పుడు పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవ‌కాశ‌ముంది.

T20 World Cup 2026: Ireland Beat by Oman 96 runs5
ఒమ‌న్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్.. సెమీస్ ఆశ‌లు స‌జీవం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఐర్లాండ్ బోణీ కొట్టింది. శ‌నివారం కొలంబో వేదిక‌గా జ‌రిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఒమన్‌పై 96 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఐరీష్ జ‌ట్టు త‌మ సెమీస్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.టాపార్డ‌ర్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు లోర్కాన్ టక్కర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా ట‌క్క‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. టక్కర్ కేవలం 51 బంతుల్లో 94 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. డెలానీ 30 బంతుల్లో 56 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లోనే 5 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో ష‌కీల్ అహ్మ‌ద్ మూడు, క‌లీం రెండు వికెట్లు సాధించారు. అనంత‌రం భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 139 పరుగులకే కుప్ప‌కూలింది.ఒమన్ బ్యాటర్లలో ఆమిర్ కలీం (50),హమ్మద్ మీర్జా (46) రాణించ‌గా.. మిగితా ప్లేయ‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బారీ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్ చెరో రెండు వికెట్లు తీశారు.

Abhishek Sharmas parents reach Colombo while IND vs PAK availability still uncertain6
కొలంబోకు చేరుకున్న అభిషేక్ త‌ల్లిదండ్రులు.. పాక్‌తో మ్యాచ్‌కు డౌటే

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో కొలంబో వేదిక‌గా ఆదివారం పాకిస్తాన్‌-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడుతాడా లేదా? అన్న‌ది ఇంకా క్లారిటీ లేదు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు.అయితే ఆస్ప‌త్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్ అయినప్ప‌టికి ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించిక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. కానీ అభిషేక్ భార‌త జ‌ట్టుతో కలిసి కొలంబోలో అడుగుపెట్టాడు. అత‌డు ప్ర‌స్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.కాగా శనివారం (ఫిబ్రవరి 14) సాయంత్రం జరిగే నెట్ సెషన్‌లో అభిషేక్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రాక్టీస్ తర్వాతే అతను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. అయితే అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అభిషేక్‌ను చూసేందుకు అత‌డి త‌ల్లిదండ్రులు కొలంబోకు చేరుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా కోలుకోకపోతే సంజూ శాంస‌న్ ఓపెన‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.

Kuldeep Yadav To Replace Indias Top Wicket-Taker vs Pakistan?7
పాక్‌తో మ్యాచ్‌.. అర్ష్‌దీప్ సింగ్ కంటే అత‌డే బెట‌ర్‌: గవాస్కర్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా టోర్నీలో బాగంగా ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 15) కొలంబో వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి దాయాది జ‌ట్టుకు మ‌రోసారి ఓట‌మి రుచిని చూపించాల‌ని భార‌త్ ప‌ట్టుద‌ల‌తో ఉంది.అయితే పాక్ జ‌ట్టులో అద్భుత‌మైన స్పిన్న‌ర్లు ఉండ‌డంతో భార‌త్‌కు జ‌ట్టుకు గ‌ట్టి పోటీ ఎదురు కానుంది అని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త టీమ్ మెనెజ్‌మెంట్‌కు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీల‌క సూచన చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్‌ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. కాగా గురువారం(ఫిబ్ర‌వ‌రి 12) నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ, అర్ష్‌దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు."న‌మీబియాతో మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్లంద‌రూ వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ ఓ వికెట్ ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అత‌డితో మూడు ఓవర్లు మాత్ర‌మే కెప్టెన్ బౌలింగ్ చేయించాడు. శివమ్ దూబే సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాను పూర్తి చేశాడు. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌ను రొటేట్ చేసిన విధానం చూస్తుంటే పాక్ మ్యాచ్ కోసం ఒక ప్రణాళికతో ఉన్న‌ట్లు క‌న్పిస్తోంది. పాక్‌తో మ్యాచ్‌కు అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌ను జ‌ట్టులోకి తీసుకునే అవకాశ‌ముంది. అందుకేనేమో న‌మీబియాతో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌కు బ‌దులుగా పాండ్యాతో మొద‌టి ఓవ‌ర్‌ను బౌలింగ్ వేయించాడు. అదేవిధంగా శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువ‌గా అనుకూలిస్తాయి. భారత్ గతంలోనూ ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడింది. కాబ‌ట్టి కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవడం మేలు" అని గవాస్కర్ 'స్టార్ స్పోర్ట్స్' డిబేట్‌లో పేర్కొన్నాడు.చ‌ద‌వండి: Vaibhav Suryavanshi: క్రికెట్‌కు బ్రేక్‌.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ

Vaibhav Suryavanshi to prepare for 10th board exams before IPL 20268
క్రికెట్‌కు బ్రేక్‌.. పదో తరగతి పరీక్షలు రాయనున్న వైభవ్‌ సూర్యవంశీ

నిన్న‌టివ‌ర‌కు మైదానంలో బౌల‌ర్ల‌ను బెంబేలెత్తించిన‌ భార‌త యువ‌ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఇప్పుడు క్లాస్‌రూమ్‌లో కూర్చుని ప‌రీక్ష‌లు రాసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్‌ఈ పదో తరగతి బోర్డు పరీక్షలకు అత‌డు హాజ‌రు కానున్నాడు. బిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వైభవ్‌ ఈ పరీక్షలు రాయనున్నాడు.వైభవ్ సూర్యవంశీ మా పాఠశాలలో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కానున్నాడు. అత‌డికి ఇప్ప‌టికే అడ్మిట్ కార్డ్ అందించాము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, త‌ల్లిదండ్రులు వైభ‌వ్ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అతడు ఇంకా విద్యార్ధి కాబట్టి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదు. అందరితో కలిసే పరీక్షలు రాయనున్నాడు. అందుకు తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోడార్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ సిన్హా పేర్కొన్నారు.కాగా 14 ఏళ్ల వైభ‌వ్ ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ త‌ర‌పున కేవ‌లం 15 బంతుల్లో సెంచ‌రీ సాధించి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఆ త‌ర్వాత కూడా భార‌త్-ఎ జ‌ట్టు, అండ‌ర్-19 జ‌ట్టు త‌ర‌పున సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు. ఇటీవ‌ల జ‌రిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో సైతం దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో 175 పరుగులతో సత్తాచాటిన వైభ‌వ్‌.. భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. మొత్తంగా 439 పరుగులు చేసిన వైభవ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గా నిలిచాడు.చ‌ద‌వండి: వారెవ్వా జింబాబ్వే

Rahul Dravid gets emotional as Chinnaswamy stadium stands named 9
‘చిన్నస్వామి’లో కుంబ్లే, ద్రవిడ్‌ స్టాండ్స్‌

బెంగళూరు: చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియం కొత్త స్టాండ్‌లతో ముస్తాబవుతోంది. భారత దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే పేర్లతో చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్‌లను ఏర్పాటు చేయాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) నిర్ణయించింది. మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కమిటీ భారత్‌ తరఫున వన్డేలు, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన కుంబ్లే, టెస్టు క్రికెట్లో సచిన్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పరుగుల వీరుడు ద్రవిడ్‌లు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ స్టాండ్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మాజీ మహిళా క్రికెటర్‌ శాంతా రంగస్వామి పేరిట మరో స్టాండ్‌ను ఏర్పాటు చేస్తారు. అనిల్‌ కుంబ్లే కేఎస్‌సీఏ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సహచరులు ద్రవిడ్, శాంతా రంగస్వామిలతో స్టాండ్లను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పాడు.

Indian polo team prevails10
భారత పోలో జట్టు పైచేయి

సాక్షి, హైదరాబాద్‌: రాధా టీఎంటీ అంతర్జాతీయ ఎరీనా పోలో చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. లక్సెంబర్గ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 15–5 గోల్స్‌ తేడాతో నెగ్గింది. తొలి చక్కర్‌ ముగిశాక భారత్‌ 6–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్‌ తరఫున యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్, కున్వల్‌ విశాల్‌ సింగ్‌ 3 గోల్స్, మొహమ్మద్‌ నయీముద్దీన్‌ ఒక గోల్‌ చేశారు. రెండో చక్కర్‌లో భారత్‌ ఐదు గోల్స్‌ చేసి, రెండు గోల్స్‌ సమరి్పంచుకుంది. ఈ చక్కర్‌లో భారత్‌కు చెతానియా 2 గోల్స్, యూసుఫ్‌ అజ్మీ 2 గోల్స్‌ చేయగా, పెనాల్టీ ద్వారా మరో గోల్‌ వచి్చంది. చివరిదైన మూడో చక్కర్‌లో భారత్‌ నాలుగు గోల్స్‌ సాధించింది. చెతానియా, యూసుఫ్‌ అజ్మీ రెండు గోల్స్‌ చొప్పున చేశారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement