ప్రధాన వార్తలు
7 పరుగులకే 5 వికెట్లు.. కట్ చేస్తే స్కోర్ ఎంతంటే..?
సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో అత్యుత్తమ కమ్బ్యాక్ ఇచ్చిన జట్టుగా ప్రిటోరియా క్యాపిటల్స్ నిలిచిపోనుంది. కఠినమైన పిచ్పై ఆ జట్టు 7 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అనూహ్య రీతిలో పుంజుకొని గౌరవప్రదమైన స్కోర్ చేసింది. అంతేకాకుండా ఆ స్కోర్ను విజయవంతంగా డిఫెండ్ చేసుకొని, 21 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జోహనెస్బర్గ్ వేదికగా నిన్న (జనవరి 17) ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ఉపయోగించిన పిచ్ బ్యాటర్లకు చాలా కఠినంగా ఉండింది. ఈ పిచ్పై తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ 7 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.ఈ దశలో డెవాల్డ్ బ్రెవిస్ (47 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు)–షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (50 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ అనూహ్య పోరాటం చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. వీరిద్దరు ఆరో వికెట్కు 103 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రెవిస్-రూథర్ఫోర్డ్ భాగస్వామ్యానికి ముందు ప్రిటోరియా ఇన్నింగ్స్లో నలుగురు డకౌట్లయ్యారు.జోబర్గ్ బౌలర్లలో డేనియల్ వారెల్ (4-1-12-2), వియాన్ ముల్దర్ (4-1-34-2), డుయాన్ జన్సెన్ (4-0-27-1), బర్గర్ (4-0-32-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి క్యాపిటల్స్ టాపార్డర్ కకావికలమైంది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ప్రిటోరియా బౌలర్లు అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నారు. లిజాడ్ విలియమ్స్ (4-0-25-3), కేశవ్ మహారాజ్ (4-0-15-3), రోస్టన్ ఛేజ్ (4-0-11-1), గిడ్యోన్ పీటర్స్ (3-0-25-1) ధాటికి సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. సూపర్ కింగ్స్ మినుకుమినుకుమంటున్న అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది.
శివాలెత్తిన మార్క్రమ్.. విధ్వంసకర శతకం
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డర్బన్ సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెలరేగిపోయాడు. పార్ల్ రాయల్స్తో నిన్న (జనవరి 17) జరిగిన కీలక మ్యాచ్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా సూపర్ జెయింట్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.శివాలెత్తిన మార్క్రమ్తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్.. మార్క్రమ్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. మార్క్రమ్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 లీగ్లో తన రెండో శతకాన్ని నమోదు చేశాడు.సికందర్ రజా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మార్క్రమ్ శివాలెత్తిపోయాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 28 పరుగులు పిండుకున్నాడు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో మార్క్రమ్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. సునీల్ నరైన్ 4, జోస్ బట్లర్ 1, కేన్ విలియమ్సన్ 22, హెన్రిచ్ క్లాసెన్ 29, లియామ్ లివింగ్స్టోన్ 19 పరుగులకు ఔటయ్యారు.రాయల్స్ బౌలర్లలో హర్దస్ విల్యోన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఫోర్టుయిన్, బార్ట్మన్, పోట్గెటర్ తలో వికెట్ తీశారు.అనంతరం 190 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్స్ తడబడింది. సునీల్ నరైన్ (4-0-18-2), సైమన్ హార్మర్ (4-1-13-1), మార్క్రమ్ (2-0-9-1), లివింగ్స్టోన్ (3-0-25-1), కొయెట్జీ (3-0-31-2), మపాకా (2-0-10-1) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది.రాయల్స్ ఇన్నింగ్స్లో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. వెర్రిన్ (23), హెర్మన్ (18), సికందర్ రజా (21), ఫోర్టుయిన్ (35 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రాయల్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ జట్టుతో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, ఎంఐ కేప్టౌన్ మధ్య పోటీ జరుగుతుంది.
విహాన్ విజృంభణ
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో అమెరికాపై అలవోక విజయం సాధించిన ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు... రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 18 పరుగుల తేడాతో (డక్వర్త్–లూయీస్ పద్ధతిలో) బంగ్లాదేశ్పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7), హర్వంశ్ పంగలియా (2) విఫలమైనా... యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్లు), అభిజ్ఞాన్ కుందు (112 బంతుల్లో 80; 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా... వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ చక్కటి పోరాటం కనబర్చారు. ఫలితంగా యంగ్ ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గంటకు పైగా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలుత భారత ఇన్నింగ్స్ను 49 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్కు మరోసారి వర్షం అడ్డుపడింది. దీంతో బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజీజుల్ హకీమ్ (72 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో పోరాడగా... మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 106/2తో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాదేశ్... భారత బౌలర్ల జోరుతో మరో 40 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్లో ఈ నెల 26న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.స్కోరు వివరాలు భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కలామ్ (బి) ఫహద్ 6; వైభవ్ (సి) ఫహద్ (బి) ఇక్బాల్ 72; వేదాంత్ (సి) రిఫత్ (బి) ఫహద్ 0; విహాన్ (సి) అబ్రార్ (బి) అజీజుల్ 7; అభిజ్ఞాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 80; హర్వంశ్ (సి) రిఫత్ (బి) ఇక్బాల్ 2; కనిష్క్ (సి) (సబ్) అబ్దుల్లా (బి) అజీజుల్ 28; అంబరీష్ (సి) ఫరీద్ (బి) పర్వేజ్ 5; ఖిలాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 8; హెనిల్ (నాటౌట్) 7; దీపేశ్ (సి) రిజాన్ (బి) ఫహద్ 11; ఎక్స్ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 238. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–53, 4–115, 5–119, 6–173, 7–194, 8–208, 9–224, 10–238. బౌలింగ్: అల్ ఫహద్ 9.2–1–38–5; ఇక్బాల్ 8–1–45–2; పర్వేజ్ 10–1–46–1; అజీజుల్ 10–1–42–2; రిజాన్ 8–0–43–0; సాద్ ఇస్లామ్ 2.2–0–18–0; బషీర్ 1–0–6–0. బంగ్లాదేశ్ అండర్–19 ఇన్నింగ్స్: జవాద్ అబ్రార్ (సి) హెనిల్ (బి) దీపేశ్ 5; రిఫత్ (సి) అభిజ్ఞాన్ (బి) కనిష్క్ 37; అజీజుల్ (సి) కనిష్క్ (బి) ఖిలాన్ 51; కలామ్ (సి అండ్ బి) విహాన్ 15; పర్వేజ్ (సి) కనిష్క్ (బి) విహాన్ 7; రిజాన్ (సి) హెనిల్ (బి) విహాన్ 15; బషీర్ (సి) వైభవ్ (బి) విహాన్ 2; ఫరీద్ (సి) దీపేశ్ (బి) ఖిలాన్ 1; ఫహద్ (రనౌట్) 0; ఇక్బాల్ (సి) ఆయుశ్ (బి) హెనిల్ 2; ఇస్లామ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (28.3 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–6, 2–62, 3–106, 4–124, 5–126, 6–129, 7–138, 8–143, 9–144, 10–146. బౌలింగ్: దీపేశ్ 4–0–27–1; హెనిల్ 4.3–1–17–1; అంబరీష్ 3–0–18–0; కనిష్క్ 6–0–22–1; ఖిలాన్ 6–0–35–2; ఆయుశ్ 1–0–7–0; విహాన్ 4–0–14–4.
స్మృతి చేజారిన సెంచరీ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరీ్ణత 20 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (41 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగింది. 10 పరుగులకే జట్టు 4 వికెట్లు కోల్పోయిన దశలో లూసీ హామిల్టన్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్లు), స్నేహ్ రాణా (22; 3 ఫోర్లు)లతో కలిసి క్యాపిటల్స్ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. బెల్, సయాలీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (61 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేసింది. త్రుటిలో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్న ఆమె... జార్జియా వోల్ (42 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి రెండో వికెట్కు 142 పరుగుల్ని జోడించింది.స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: షఫాలీ (సి) రావత్ (బి) బెల్ 62; లిజెల్లీ (బి) బెల్ 4; వోల్వార్ట్ (బి) బెల్ 0; జెమీమా (బి) సయాలీ 4; మరిజాన్ (బి) సయాలీ 0; నికీ (ఎల్బీ) (బి) రావత్ 12; మిన్ను మణి (సి) మంధాన (బి) డిక్లెర్క్ 5; స్నేహ్ రాణా (బి) రావత్ 22; హామిల్టన్ (సి) రాధ (బి) సయాలీ 36; శ్రీచరణి నాటౌట్ 11; నందిని రనౌట్ 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–10, 4–10, 5–69, 6–74, 7–108, 8–130, 9–164, 10–166. బౌలింగ్: బెల్ 4–0–26–3, సయాలీ 3–0–27–3, శ్రేయాంక 3–0–44–0, డిక్లెర్క్ 4–0–31–1, ప్రేమ రావత్ 3–0–16–2, రాధా యాదవ్ 3–0–21–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ హారిస్ (సి) షఫాలీ (బి) మరిజాన్ 1; స్మృతి (సి) హామిల్టన్ (బి) నందిని 96; జార్జియా వోల్ నాటౌట్ 54; రిచా ఘోష్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–14, 2–156. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–21–1, లూసీ హామిల్టన్ 3.2–0–37–0, నందిని శర్మ 4–0–34–1, శ్రీచరణి 3–0–26–0, స్నేహ్ రాణా 1–0–13–0, షఫాలీ 1–0–14–0, మిన్ను మణి 2–0–20–0.
‘గ్రాండ్’ సమరానికి సిద్ధం
సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టెన్నిస్ టోర్నీ కోసం సూపర్ స్టార్లు అల్కరాజ్, సినెర్లతో పాటు 25వ గ్రాండ్స్లామ్పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్లో రెండుసార్లు తుది మెట్టుపై టైటిల్ చేజార్చుకున్న స్వియాటెక్ ఫేవరెట్గా సమరానికి సై అంటోంది.మెల్బోర్న్: స్పానిష్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ ఆస్ట్రేలియా గడ్డపై బోణీ కోసం సిద్ధమవుతుంటే సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తనకు అచ్చొచి్చన ఓపెన్లోనే 25వ గ్రాండ్స్లామ్ సాకారం చేసుకోవాలని చూస్తున్నాడు. వీళ్లిద్దరిని దాటేసి వరుసగా మూడో ఏడాది కూడా టైటిల్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఇటలీ స్టార్, వరల్డ్ నంబర్వన్ యానిక్ సినెర్ పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేడు మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరం. ‘హ్యాట్రిక్’ వేటలో సినెర్... తొలి రౌండ్లో గ్యాస్టన్ (ఫ్రాన్స్)ను ఎదుర్కొంటాడు. 22 ఏళ్ల స్పెయిన్ స్టార్ అల్కరాజ్ ఇక్కడ తప్ప మిగతా మూడు గ్రాండ్స్లామ్లు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లను రెండేసి సార్లు చేజిక్కించుకున్నాడు. ఆరు గ్రాండ్స్లామ్లను సాధించినప్పటికీ ఈ స్పెయిన్ టాప్సీడ్కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇంకా వెలితిగానే ఉంది. గత రెండేళ్లుగా (2024, 2025) క్వార్టర్ ఫైనల్ అంచెను దాటని అతను ఈసారైనా ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న జొకోవిచ్ చిరస్మరణీయమైన 25వ టైటిల్ కోసం రాకెట్కు పదును పెడుతున్నాడు. ఇక్కడ పది టైటిల్స్ సాధించిన జొకో 11వ టైటిల్ సాధిస్తే తన కెరీర్కు గ్రాండ్గా వీడ్కోలు పలికే అవకాశముంది. మూడేళ్ల క్రితం 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియా ఓపెన్లో విజేతగా నిలిచాడు. అదే ఏడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లను గెలిచిన ఈ సెర్బియన్ ఆల్టైమ్ గ్రేట్... రెండేళ్లుగా ‘25వ గ్రాండ్స్లామ్’ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ హేమాహేమీలతో పాటు రెండు సార్లు (2020, 2024) రన్నరప్తోనే సరిపెట్టుకున్న జర్మనీ ప్లేయర్, మూడో సీడ్ జ్వెరెవ్, ఐదో సీడ్ లోరెంజొ మ్యూసెటి (ఇటలీ), రష్యన్ స్టార్లు రుబ్లెవ్, మెద్వెదెవ్, 2014 చాంపియన్, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ వావ్రింకా సైతం ఆసీస్ బరిలోకి దిగుతున్నారు. వావ్రింకాకు వీనస్ విలియమ్స్కు ఇచి్చనట్లే నిర్వాహకులు వైల్డ్కార్ట్ ఎంట్రీ ఇచ్చారు. స్వియాటెక్ ఈసారైనా! పోలండ్ స్టార్ ఇగా స్వియాటెక్ను ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆఖరి దాకా ఊరించి చివరకు నిరాశపరుస్తోంది. 2022తో పాటు గతేడాది కూడా రన్నరప్తోనే సరిపెట్టుకున్న స్వియాటెక్ ఈ సారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. అమెరికన్ టెన్నిస్ స్టార్ మాడిసన్ కీస్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టైటల్ వేటకు సిద్ధమవగా, జెస్సికా పెగూలా (అమెరికా), ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్), 2021 రన్నరప్ కరొలినా మ్యుచొవా (చెక్ రిపబ్లిక్), 2024 రన్నరప్ కోకో గాఫ్ (అమెరికా), రెండుసార్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ (2023, 2024) సాధించిన బెలారస్ స్టార్, టాప్ సీడ్ సబలెంక టోర్నీ ఫేవరేట్లుగా ఉన్నారు.
సిరీస్ విజయంపై గురి
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్ను చిత్తు చేసింది. ఇప్పుడు వన్డేల్లో చరిత్ర చూస్తే భారత్లో న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ నెగ్గలేదు. కానీ గత మ్యాచ్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే అలాంటి అవకాశం ఇక్కడా కనిపిస్తోంది. గతంలో మూడు సార్లు ఆ జట్టు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సవాల్ మధ్య స్వదేశంలో తమ రికార్డును నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2019 మార్చి తర్వాత సొంతగడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోని రికార్డును భారత్ కొనసాగిస్తుందా లేక సంచలనం నమోదవుతుందా చూడాలి. ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేడు జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. ప్రత్యరి్థతో పోలిస్తే సొంతగడ్డపై భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా...పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఇక్కడ అడుగు పెట్టిన కివీస్ కూడా తమ ఆటతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి ఆట ఆసక్తికరంగా సాగవచ్చు. అర్ష్ దీప్కు చాన్స్! భారత బ్యాటింగ్ టాప్–5 విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రోహిత్, గిల్ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తున్నారు. అయితే రోహిత్ తన జోరును భారీ స్కోరుగా మార్చాల్సి ఉంది. గత మ్యాచ్లో తక్కువ పరుగులే చేసినా...కోహ్లి ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయిలో రాణిస్తుండగా... రాహుల్ రాజ్కోట్లో సెంచరీతో తానేమిటో చూపించాడు. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. ఆరో స్థానంలో నితీశ్ రెడ్డిని కొనసాగిస్తారా లేక స్పిన్నర్ ఆయుశ్ బదోనికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా చూడాలి. నితీశ్ను పూర్తి స్థాయి ఆల్రౌండర్గా జట్టు ఉపయోగించుకోవడం లేదు. స్పిన్నర్గా కుల్దీప్ ప్రదర్శన కీలకం కానుంది. జడేజా బౌలింగ్ ప్రదర్శనను చూస్తూ అతని బ్యాటింగ్ను ఎవరూ పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతను వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓవరాల్గా భారత్లోనైతే 2013 తర్వాత అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ ఖాయం. మూడో పేసర్గా వైవిధ్యం కోసం ప్రసిధ్ స్థానంలో అర్ష్ దీప్ను ప్రయతి్నంచవచ్చు. తొలి రెండు వన్డేల్లో ప్రసిధ్ పెద్దగా ఆకట్టుకోలేదు. కుర్రాళ్లు సమష్టిగా... ‘న్యూజిలాండ్ ఇంత సులువుగా విజయం సాధించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’...అంటూ రెండో వన్డే తర్వాత దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య భారత్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మిచెల్, యంగ్లను నిలువరించడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వే, నికోల్స్ కూడా ఓపెనర్లుగా రాణిస్తే కివీస్ కూడా మంచి స్కోరుపై దృష్టి పెట్టవచ్చు. ఫిలిప్స్లాంటి హిట్టర్తో పాటు మంచి బ్యాటింగ్ పదును ఉన్న కెప్టెన్ బ్రేస్వెల్ మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ మొదటినుంచీ భారత్ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్లతో జట్టు బౌలింగ్ ఆధారపడి ఉంది. ఆఫ్ స్పిన్నర్గా బ్రేస్వెల్ ఉన్నాడు కాబట్టి తొలి వన్డే తరహాలోనే లెనాక్స్ స్థానంలో లెగ్స్పిన్నర్ ఆదిత్య అశోక్కు చోటు దక్కవచ్చు. ఎనిమిది మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న ఆటగాళ్లతో పర్యటనకు వచ్చి వన్డే సిరీస్ గెలవగలిగితే న్యూజిలాండ్కు ఇది పెద్ద ఘనత అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, నితీశ్/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జేమీసన్, ఫోక్స్, ఆదిత్య.
బంగ్లాదేశ్పై భారత్ విజయం
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ టీమ్పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కుర్రాళ్ల టీమ్ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు తీశాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 238 పరుగులు చేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు 80 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ తరఫున పేసర్ అల్ ఫహద్ ఐదు వికెట్లు తీశాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో కమల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్కు గుడ్ న్యూస్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ధ్రువీకరించింది. ప్రభుత్వం కొన్ని కఠిన నిబంధనలతో కూడిన అనుమతిని మంజూరు చేసినట్లు కేఎస్సీఏ తెలిపింది. "ప్రభుత్వం విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్నస్వామి స్టేడియం మళ్లీ క్రికెట్ పోటీలతో కళకళలాడనుంది" అని కేఎస్సీఏ ప్రతినిధి వినయ్ మృత్యుంజయ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.సర్కార్ నిబంధనలు ఇవే..స్టేడియం లోపల, వెలుపల రద్దీని పర్యవేక్షించడానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ సుమారు రూ.4.5 కోట్ల ఖర్చుతో అత్యాధునిక ఏఐ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కర్ణాటక సర్కార్ ప్రతిపాదించింది. అభిమానులు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్లను పూర్తిగా మార్చాలని ప్రభుత్వం సూచించింది. కాగా ఐపీఎల్-2025 ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచిన అనంతరం.. చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో అప్పటి నుంచి చిన్నస్వామి మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. మహిళల ప్రపంచకప్ 2025, మెన్స్ టీ20 ప్రపంచకప్-2026 వేదికల జాబితా నుండి కూడా ఈ వేదికను తొలిగించారు. అయితే తిరిగి మళ్లీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ కళ సంతరించుకోనుండడంలో కొత్తగా ఎన్నికైన కేఎస్సీఏ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ది కీలక పాత్ర.చదవండి: WPL 2026: ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.యూపీ కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. లానింగ్ కేవలం 45 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసింది. ఆమెతో పాటు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ సైతం దుమ్ములేపింది. లిచ్ఫీల్డ్ 37 బంతుల్లో 61 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్కివర్ బ్రంట్ రెండు, నికోలా కారీ,మాథ్యూస్, అమన్జ్యోత్ కౌర్ తలా వికెట్ సాధించారు.పోరాడిన ఓడిన ముంబై..అనంతరం లక్ష్య చేధనలో ముంబై ఘనమైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు హేలీ మథ్యూస్(13), సజన(10) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్ (15), నాట్ స్కివర్-బ్రంట్ (15) నిరాశపరిచారు.చివర్లో అమేలియా కెర్(49 నాటౌట్) అమంజోత్ కౌర్(41) పోరాడినప్పటికీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్, ఎకిలిస్టోన్, దీప్తీ శర్మ తలా వికెట్ సాధించారు. కాగా ఈ టోర్నీలో యూపీతో ఆడిన రెండు మ్యాచ్లలోనూ ముంబై ఓటమి పాలైంది.చదవండి: కివీస్తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్
‘ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుంది’
టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్ టెన్ని...
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏ...
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో మ్...
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బె...
ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓ...
వైభవ్, అభిజ్ఞాన్ హాఫ్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో జర...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
