Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Smat 2025: Arjun Tendulkar Stars Against IPL Winner-Led Side With Stunning All-Round Show1
అద‌ర‌గొట్టిన అర్జున్ టెండూల్క‌ర్‌.. వణికిపోయిన బ్యాటర్లు

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మంగ‌ళ‌వారం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌చిన్ త‌న‌యుడు, గోవా ఆల్‌రౌండ‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత బౌలింగ్‌లో 3 వికెట్ల‌తో సత్తాచాటిన అర్జున్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లో 16 ప‌రుగులు చేశాడు. అర్జున్‌ పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. మధ్యప్రదేశ్‌ ఓపెనర్లు అంకుష్ సింగ్, శివాంగ్‌ కుమార్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ వెంకటేష్‌ అయ్యర్‌ను అద్భుతమైన బంతితో జూనియర్‌ టెండూల్కర్‌ బోల్తా కొట్టించాడు. బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అర్జున్‌ దూకుడుగా ఆడి గోవాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్‌లో అతడిని గోవా టీమ్‌ మెనెజ్‌మెంట్‌ ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసింది. కానీ బౌలింగ్‌లో రాణిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.ల‌క్నోలోకి అర్జున్‌కాగా అర్జున్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. రాబోయో ఐపీఎల్ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించ‌నున్నాడు. ఐపీఎల్ 2026కు ముందు ముంబై ఇండియ‌న్స్ నుంచి అర్జున్‌ను ల‌క్నో ట్రేడ్ చేసుకుంది. అర్జున్ ఐపీఎల్-2021 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో వున్నప్పటికి.. 2023 సీజ‌న్‌లో అరంగేట్రం చేశాడు. ఈ జూనియర్ టెండూల్కర్ ఇప్పటివరకు ముంబై ఫ్రాంచైజీ తరపున కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. జ‌ట్టులో బుమ్రా, బౌల్ట్ వంటి బౌల‌ర్లు ఉండ‌డంతో అర్జున్‌కు పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్క‌లేదు. ఇప్పుడు ల‌క్నో త‌ర‌పున అర్జున్‌కు ఎక్కువ‌గా ఛాన్స్ ల‌భించే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.గోవా ఘ‌న విజ‌యం..ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌పై గోవా 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఎంపీ నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గోవా కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.3 ఓవ‌ర్ల‌లో చేధించింది.కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(50 బంతుల్లో 75) అజేయ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు అభినవ్‌ 55 పరుగులతో రాణించాడు.చదవండి: సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Sarfaraz Khans maiden T20 ton puts him in spotlight for IPL Auction 20262
సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

ఐపీఎల్‌-2025 మినీ వేలానికి ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్‌.. మంగళవారం లక్నో వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టిం‍చాడు. కేవలం 47 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ముంబైక‌ర్‌ స‌రిగ్గా వంద ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అతడితో వెటరన్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించాడు. కాగా గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో వేలం అన్‌సోల్డ్‌గా మిగిలిన స‌ర్ఫరాజ్ ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఐదేసిన శార్థూల్‌..ఇక 221 పరుగుల భారీ లక్ష్య చేధనలో అస్సాం జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ముంబై కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో అస్సాం పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

Will Jacks included in England playing XI for 2nd Ashes Test vs AUS3
ఇంగ్లండ్ తుది జట్టు ప్ర‌క‌ట‌న‌.. మూడేళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టుని ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ కోసం ఒకే ఒక్క మార్పు చేసింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.జాక్స్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లడ్ తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు అతడు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అతడిని జ‌ట్టులోకి తీసుకురావ‌డం వెనుక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ మాస్ట‌ర్ మైండ్ ఉంది. జాక్స్‌ను కేవలం స్పిన్ ఎంపికగా కాకుండా, అతని బ్యాటింగ్‌ సామర్థ్యం కారణంగానే తుది జ‌ట్టులో చోటు ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవ‌డం కోస‌మే రెగ్యూల‌ర్ స్పిన్న‌ర్ బ‌షీర్ కాకుండా జాక్స్ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. గురువారం(డిసెంబ‌ర్ 4) నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా ఈ యాషెస్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదేజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

Englands unsung Test wall Robin Smith passes away unexpectedly at 62 in Perth4
క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని రాబిన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచారని వారు చెప్పుకొచ్చారు.కానీ ఆయన మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ దర్యాప్తులో మరణ కారణం నిర్ధారించబడుతుందని తెలిపారు. 2004లో రిటైర్మెంట్ తర్వాత ఆయన మద్యానికి బానిసై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ స్మిత్ మరణానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.'ది జడ్జ్'గా పేరొందిన స్మిత్‌.. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ , కోర్ట్నీ వాల్ష్ వంటి పేస్ దళంతో కూడిన వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 43.67 సగటుతో 4236 టెస్టు పరుగులు చేశారు. ఆయన కెరీర్‌లో తొమ్మిది టెస్టు సెంచరీలు ఉన్నాయి.అదేవిధంగా ఆయన 71 వన్డేలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఆయన దిట్ట. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్‌(167 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదుర్స్‌..రాబిన్ స్మిత్ డర్బన్‌లో జన్మించినప్పటికీ 1983లో ఇంగ్లండ్‌కు వచ్చి హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో చేరారు. మొత్తంగా 17 సీజన్లలో ఆయన 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించారు. స్మిత్ మృతిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Vaibhav Suryavanshi puts Ajit Agarkar on notice with maiden century in Syed Mushtaq Ali Trophy5
వండ‌ర్ కిడ్ వ‌చ్చేస్తున్నాడు.. సైడ్ ప్లీజ్‌!

మొన్న ఐపీఎల్‌.. నిన్న ఆసియాక‌ప్.. నేడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఆ 14 ఏళ్ల యువ సంచల‌నం దూకుడును ఎవ‌రూ ఆప‌లేక‌పోతున్నారు. త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో చిన్న‌నాటి స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లిల‌ను గుర్తు చేస్తున్నాడు. అవ‌తలి ఎండ్‌లో బౌల‌ర్ ఎవ‌రైన డోంట్ కేర్‌. అత‌డికి తెలిసిందల్లా బంతి బౌండ‌రీకి త‌ర‌లించ‌డ‌మే.అత‌డు క్రీజులో ఉన్నాడంటే సీనియ‌ర్ బౌల‌ర్ల‌కు సైతం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా సీనియ‌ర్ బౌల‌ర్ల‌ను అత‌డు ఎదుర్కొంటున్న తీరు అత్య‌ద్భుతం. 15 ఏళ్ల నిండ‌క‌ముందే రికార్డుల‌కు కేరాఫ్ అడ్రాస్‌గా మారిన ఆ చిచ్చ‌రపిడుగు ఎవ‌రో ఈపాటికే మీకు ఆర్ధ‌మైపోయింటుంది. అత‌డే భార‌త అండ‌ర్‌-19 స్టార్ ఓపెన‌ర్‌, బిహార్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ.స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మంగ‌ళ‌వారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా మ‌హారాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సూర్య‌వంశీ విధ్వంసక‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. మందకొడి పిచ్‌పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది ప‌డిన చోట.. వైభ‌వ్ మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు.31 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన బిహార్ జ‌ట్టును వైభ‌వ్ త‌న అద్బుత బ్యాటింగ్‌తో ఓ యోధుడిలా పోరాడాడు. ఆకాష్ రాజ్‌, అయూష్‌తో విలువైన భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో సూర్య‌వంశీ కేవ‌లం 58 బంతుల్లో సెంచ‌రీని పూర్తి చేశాడు. అయితే ఇది అత‌డి స్టాండ‌ర్డ్స్ ప్ర‌కారం "స్లో నాక్" అనే చెప్పాలి. ఎందుకంటే టీ20లలో అతని సగటు స్ట్రైక్ రేట్ 217.88. అంతకుముందు వైభ‌వ్ టీ20ల్లో 32, 35 బంతుల్లో రెండు శతకాలు బాదాడు. ఓవ‌రాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. అనంత‌రం ఆ ల‌క్ష్యాన్ని మ‌హారాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి చేధించింది.తొలి ప్లేయ‌ర్‌గా..ఈ సెంచ‌రీతో వైభ‌వ్ సూర్య‌వంశీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. . సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్‌ జోల్‌ పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో జోల్ ఆల్‌టైమ్ రికార్డును ఈ బిహారీ బ్రేక్ చేశాడు.సీనియర్ జట్టు ఎంట్రీ ఎప్పుడు?వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బిహార్ సీనియర్ ఆటగాళ్లు తడబడినప్పటికీ వైభవ్ మాత్రం మేఘాలయపై 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఏడాదిలో వైభవ్ కేవలం 15 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి మూడు సెంచరీలు సాధించాడు. దీంతో అతడు త్వరలోనే భారత సీనియర్ టీ20 జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంత చిన్న వయస్సులో అతడి నిలకడైన ఆట తీరు, సీనియర్ బౌలర్లపై అతను చూపిస్తున్న ఆధిపత్యం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ను ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది. అతడు వయస్సు తక్కువ కావడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టులోకి రాకపోయినా.. 15 ఏళ్ల నిండ‌గానే జాతీయ జ‌ట్టు త‌ర‌పున డెబ్యూ చేయ‌డం ఖాయం.గిల్ చోటుకు ఎస‌రు?అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూల్స్ ప్ర‌కారం.. ఓ ఆట‌గాడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరేంగ్ర‌టం చేయ‌డానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. వైభవ్‌ మార్చి 27, 2011 న జన్మించాడు. కాబట్టి అతడు మార్చి 27, 2026 తర్వాతే సీనియర్ జాతీయ జట్టు త‌ర‌పున‌ ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అంటే వ‌చ్చే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సైకిల్‌లో భార‌త జ‌ట్టు త‌ర‌పున ప్రాతినిథ్యం వ‌హించాడు. ఒక‌వేళ అత‌డు రాబోయో రోజుల్లో కూడా ఇదే జోరును కొన‌సాగిస్తే వైస్ కెప్టెన్ గిల్ స్ధానం డెంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే. ప్ర‌స్తుతం టీ20ల్లో భార‌త జట్టు ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ‌, గిల్ ప్రారంభిస్తున్నారు. అభిషేక్ దుమ్ములేపుతున్న‌ప్ప‌టికి గిల్ ఆశించినంత మేర రాణించ‌లేక‌పోతున్నాడు. త‌దుప‌రి మ్యాచ్‌లో కూడా గిల్ ఇదే పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తే అత‌డి స్ధానాన్ని శాంస‌న్ లేదా వైభ‌వ్‌తో భ‌ర్తీ చేసే అవ‌కాశ‌ముంది.స్పీడ్ గ‌న్స్‌ను ఎదుర్కోగ‌ల‌డా?అయితే సూర్య‌వంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఇది సరైన వయస్సు కాదు అని, జోష్ హాజిల్‌వుడ్, కగిసో రబాడ లేదా మార్క్ వుడ్ వంటి ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడం అతనికి చాలా కష్టమని కొంత‌మంది మాజీలు వాదిస్తున్నారు. కానీ సూర్య‌వంశీ ఇప్ప‌టికే ఐపీఎల్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, వెటరన్ ఇషాంత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ వంటి స్పీడ్‌స్టార్ల‌ను ఉతికారేశాడు. కాబ‌ట్టి అత‌డికి ప్రీమియ‌ర్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొవ‌డం పెద్ద టాస్క్ ఏమి కాదు.చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?

Hardik Pandyas compensates with 77-run knock in SMAT 20256
హార్దిక్ పాండ్యా విధ్వంసం..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో అద‌ర‌గొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా.. మం‍గళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.ఆసియాకప్‌-2025లో గాయపడిన తర్వాత పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. తన పునరాగమనంలో పాండ్యా బంతితో రాణించలేకపోయినప్పటికి బ్యాట్‌తో మాత్రం విధ్వంసం సృష్టించాడు. 225పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను హార్దిక్ ఉతికారేశాడు.తన ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలపెట్టినప్పటికి.. క్రీజులో సెటిల్ అయ్యాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 183.33గా ఉంది. అతడితో పాటు విష్ణు సోలంకి(43), శివాలిక్‌ శర్మ(47) మెరుపులు మెరిపించారు.225 పరుగుల లక్ష్యాన్ని బరోడా కేవలం మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 52 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పాండ్యా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఈ టీ20 సిరీస్‌కు ముం‍దు హార్దిక్‌ మరో రెండు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడనున్నాడు.చదవండి: IND vs SA: అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?Hardik Pandya is back with a bang. smashed 77 not out and won the game for Baroda against Punjab.#SMAT2025 #HardikPandya pic.twitter.com/KmmVpawkgQ— The last dance (@26lastdance) December 2, 2025

 R Ashwins blunt take as India drop Nitish Reddy for 1st ODI vs SA7
అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? మ‌రెందుకు సెలెక్ట్‌ చేశారు?

రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో భారత్‌ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.రాంచీ వన్డేలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్‌ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు."జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్‌లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు. కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశూ పేర్కొన్నాడు.చదవండి: Ashes 2025-26: అనుకున్న‌దే జ‌రిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్‌

Usman Khawaja out of Gabba Test8
అనుకున్న‌దే జ‌రిగింది..! ఆస్ట్రేలియా భారీ షాక్‌

ఇంగ్లండ్‌తో రెండో యాషెస్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ త‌గిలింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖవాజా దూర‌మ‌య్యాడు. ఖవాజా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ కారణం చేతనే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అయితే రెండో టెస్టుకు దాదాపు పది రోజుల విశ్రాంతి లభించడంతో అతడు కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కానీ ఉస్మాన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు.మంగళవారం 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ సెషన్‌లో ఖవాజా పాల్గోన్నాడు. కానీ అతడు అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఖవాజాను రెండో టెస్టు జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడి స్ధానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం సీఎ వెల్లడించలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. సెకెండ్ టెస్టులో కూడా ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. అదే విధంగా ఖవాజా స్ధానంలో తుది జట్టులోకి ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్ రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ టెస్టుకు కూడా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో మ్యాచ్‌లను కంగారుల జట్టుకు సారథ్యం వహించనున్నాడు.రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: మరోసారి పేట్రేగిపోయిన వైభవ్‌ సూర్యవంశీ

ABHISHEK SHARMA SMASHED FIFTY FROM JUST 18 BALLS AGAINST BARODA IN SMAT 20259
మరోసారి దడదడలాడించిన అభిషేక్‌ శర్మ

ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) తన అరివీర భయంకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20లకు విరామం రావడంతో దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడుతున్న అభిషేక్‌.. ఇక్కడ కూడా ప్రత్యర్దులను చీల్చిచెండాతున్నాడు.ఈ టోర్నీలో పంజాబ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. రెండు రోజుల కిందట బెంగాల్‌పై సుడిగాలి శతకం (52 బంతుల్లో 148) బాదాడు. ఇవాళ (డిసెంబర్‌ 2) బరోడాపై మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం​ 18 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అనంతరం రాజ్‌ లింబాని బౌలింగ్‌లో ఔటయ్యాడు. అభిషేక్‌తో పాటు అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (32 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నమన్‌ ధిర్‌ (28 బంతుల్లో 39) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బరోడా ఆటగాళ్లు కూడా చెలరేగి ఆడుతున్నారు. 4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేశారు. ఓపెనర్లు శాశ్వత్‌ రావత్‌ 30, విష్ణు సోలంకి 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, దీనికి ముందు బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 12 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. పొట్టి క్రికెట్‌లో అది మూడో వేగవంతమైన అర్ద సెంచరీ.

Vaibhav Suryavanshi Scored Maiden Century In SMAT10
మరోసారి పేట్రేగిపోయిన వైభవ్‌ సూర్యవంశీ

యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి పేట్రేగిపోయాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీ తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైన వైభవ్‌ ఎట్టకేలకు మహారాష్ట్ర బౌలర్లపై జూలు విదిల్చాడు. 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. వైభవ్‌ ధాటికి ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు బిహార్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.మరో చరిత్రఈ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ మరో విభాగంలో చరిత్ర సృష్టించాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్‌ జోల్‌ పేరిట ఉండేది. జోల్‌ 18 ఏళ్ల, 118 రోజుల వయసులో ముంబైపై 63 బంతుల్లో 109 పరుగులు చేశాడు.సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో వైభవ్‌కు ఇదే తొలి శతకం. ఓవరాల్‌గా 16 మ్యాచ్‌ల టీ20 కెరీర్‌లో మూడవది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement