Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

First Test of the Ashes series begins today1
‘యాషెస్‌’ సమరానికి సిద్ధం

టెస్టు క్రికెట్‌లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్‌’ సిరీస్‌కు నేటితో తెర లేవనుంది. ఇరు జట్ల ఆటగాళ్లను ఒక్క మంచి ప్రదర్శనతో హీరోలుగా, ఒక్క పరాజయంతో జీరోలుగా మార్చగల ఈ సమరంపై క్రికెట్‌ అభిమానులందరి దృష్టీ నిలిచింది. సొంతగడ్డపై ఆ్రస్టేలియా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నా... ‘బాజ్‌బాల్‌’ తరహా ఆటతో తమకంటూ విజయావకాశాలు ఉన్నాయని ఇంగ్లండ్‌ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడు వారాల పాటు హోరాహోరీ ఆట ఖాయం. పెర్త్‌ స్టేడియంలో పిచ్‌పై పచ్చిక ఉంది. ఆరంభంలో పేస్, బౌన్స్‌కు బాగా అనుకూలిస్తూ ఆ తర్వాత నెమ్మదించే అవకాశం ఉంది. పెర్త్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో ఆ్రస్టేలియా పర్యటించగా, ఆ సిరీస్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. అంతకుముందు 2021లో ఆసీస్‌ గడ్డపై ఆడిన ఇంగ్లండ్‌ 0–4తో చిత్తుగా ఓడింది. ఈ గణాంకాలు చూస్తే ఎవరిది పైచేయో అర్థమవుతుంది. అయితే కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ పర్యవేక్షణలో దూకుడు కనబరుస్తున్న ఇంగ్లండ్‌ తమ ప్రత్యర్థిని ఓడించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది.ముఖ్యంగా తొలి టెస్టులో ఇద్దరు ఆసీస్‌ ప్రధాన పేసర్లు జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్‌కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. సిరీస్‌లో శుభారంభం చేస్తే దానిని కొనసాగించాలని బెన్‌ స్టోక్స్‌ బృందం పట్టుదలగా ఉంది. అయితే సమర్థుడైన స్టీవ్‌ స్మిత్‌ టీమ్‌కు నాయకత్వం వహించడం ఆసీస్‌కు బలం. ఇద్దరు అరంగేట్రం... ‘స్మిత్‌ను 40 పరుగుల్లోపు ఆపగలిగితే మంచిది. లేదంటే మ్యాచ్‌ చేజారినట్లే’... ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ చేసిన వ్యాఖ్య ఇది. అతని బ్యాటింగ్‌ ప్రభావం ఎలాంటిదో ఇది చెబుతుంది. ఇప్పుడు కూడా స్మిత్‌ బలమైన బ్యాటింగే ఆసీస్‌కు పెద్ద బలం. ఇతర సీనియర్లలో లబుషేన్, హెడ్‌లపై ప్రధానంగా బ్యాటింగ్‌ భారం ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్నా ఉస్మాన్‌ ఖ్వాజా అదృష్టవశాత్తూ ఈ సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు. అతనికి ఓపెనింగ్‌ భాగస్వామిగా కొత్త ఆటగాడు జేక్‌ వెదరాల్డ్‌ బరిలోకి దిగుతాడు. కీపర్‌ అలెక్స్‌ కేరీకి కూడా టెస్టు బ్యాటర్‌గా మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలు దాటి కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. గాయాల కారణంగా రెగ్యులర్‌ కెపె్టన్‌ కమిన్స్, హేజల్‌వుడ్‌ తొలి టెస్టు నుంచి తప్పుకోవడంతో బౌలింగ్‌లో సీనియర్‌ మిచెల్‌ స్టార్క్‌పై చాలా పెద్ద బాధ్యత ఉంది. బోలండ్‌ అతనికి తగిన భాగస్వామి కాగా, మరో పేసర్‌ బ్రెండన్‌ డగెట్‌ తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఎప్పటిలాగే ఏకైక స్పిన్నర్‌ లయన్‌ ప్రత్యర్థి కి సవాల్‌ విసురుతున్నాడు. 2019 తర్వాత ఆ్రస్టేలియా జట్టు తరఫున ఒకే టెస్టులో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేయడం ఇదే తొలిసారి. స్పిన్నర్‌ లేకుండా... తొలి టెస్టు వరకు మాత్రం ఆసీస్‌తో పోలిస్తే ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. ఆర్చర్, మార్క్‌వుడ్‌లాంటి ఫాస్టెస్ట్‌ బౌలర్లతో పాటు అట్కిన్సన్, కార్స్‌ ఆడనుండగా బౌలింగ్‌లో స్టోక్స్‌ కీలక పాత్ర పోషించడం ఖాయం. తుది జట్టులో ఇంగ్లండ్‌ ఒక్క స్పిన్నర్‌ను కూడా తీసుకోవడం లేదు. బ్యాటింగ్‌తో భారత్‌తో సిరీస్‌ సహా గత కొంతకాలంగా టాప్‌–7లో ఎలాంటి మార్పూ లేదు. పెద్దగా రాణించకపోయినా క్రాలీ, పోప్‌లపై జట్టు నమ్మకం ఉంచింది. డకెట్, బ్రూక్, స్టోక్స్‌ ఎలా ఆడతారనేది ఆసక్తికరం. అందరి దృష్టీ ఇప్పుడు జో రూట్‌పై నిలిచింది. ఆధునిక టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు ఉన్న రూట్‌ ఆసీస్‌ గడ్డపై ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతని తాజా ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సిరీస్‌లో ఆ లోటును పూర్తి చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, జట్టుపరంగా చూసినా కూడా రూట్‌ ఆట సిరీస్‌ ఫలితాన్ని నిర్దేశించగలదు. 34-32ఓవరాల్‌గా 73 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే...ఆ్రస్టేలియా 34, ఇంగ్లండ్‌ 32 గెలవడం ఇరు జట్ల మధ్య పోటీని చూపిస్తోంది.152-111యాషెస్‌ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య మొత్తం 361 టెస్టులు జరిగాయి. ఆ్రస్టేలియా 152 గెలవగా, ఇంగ్లండ్‌ 111 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 13సొంతగడ్డపై జరిగిన గత 15 యాషెస్‌ టెస్టుల్లో ఆ్రస్టేలియా 13 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకుంది. ఒక్కదాంట్లోనూ ఓడలేదు. 2011 జనవరి తర్వాత ఇక్కడ ఇంగ్లండ్‌ ఒక్క టెస్టు కూడా నెగ్గలేకపోయింది. 2023 తర్వాత ఓవరాల్‌గా అన్ని జట్లపై కలిపి ఆడిన 18 టెస్టుల్లో ఆసీస్‌ 14 గెలిచింది. ఆసీస్‌ గడ్డపై ఆడిన గత మూడు ‘యాషెస్‌’లలో ఇంగ్లండ్‌ 0–5, 0–4, 0–4తో ఓడింది.

Indian football team drops another six places2
142వ ర్యాంక్‌లో భారత్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత ఫుట్‌బాల్‌ జట్టు ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత వెనుకబడింది. ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో 0–1 గోల్స్‌ తేడాతో ఓడిన టీమిండియా ఆరు స్థానాలు కోల్పోయి 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్‌నకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన భారత జట్టుకు గత తొమ్మిదేళ్లలో ఇదే చెత్త ర్యాంక్‌. చివరిసారిగా 2016 అక్టోబర్‌లో 148వ ర్యాంక్‌లో నిలిచిన భారత్‌ జట్టుకు ఆ తర్వాత ఇదే అత్యధిక ర్యాంక్‌. 2023 డిసెంబర్‌లో 102వ స్థానంలో ఉన్న టీమిండియా... వరుస పరాజయాల కారణంగా 40 స్థానాలు దిగజారింది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 27వ ర్యాంక్‌లో ఉంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి టీమిండియా అత్యుత్తమంగా 1996లో 94వ స్థానం దక్కించుకుంది. ర్యాన్‌ విలియమ్స్‌కు అనుమతి ఆ్రస్టేలియా ఆటగాడు ర్యాన్‌ విలియమ్స్‌ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ‘ఫిఫా’ అంగీకారం తెలిపింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ర్యాన్‌ విలియమ్స్‌ ఇటీవల ఆసీస్‌ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దీంతో అతడు భారత జట్టు సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వివరాలు వెల్లడించింది. 32 ఏళ్ల ర్యాన్‌ ఆ్రస్టేలియా పాస్‌పోర్ట్‌ అప్పగించి భారత పౌరసత్వం పొందాడు. విలియమ్స్‌ తల్లి ముంబైలో జన్మించడంతో అతడికి ముందు నుంచే భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉంది. మరిప్పుడు జాతీయ జట్టు తరఫున అతడికి అవకాశం దక్కుతుందా చూడాలి. ‘ర్యాన్‌ విలియమ్స్‌కు సంబంధించిన అసోసియేషన్‌ మార్పు అభ్యర్థనను ఫిఫా ఆమోదించింది. దీంతో ర్యాన్‌ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి అధికారికంగా అర్హత పొందాడు’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ వెల్లడించింది. ఆ్రస్టేలియా అండర్‌–20, అండర్‌–23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ర్యాన్‌... సీనియర్‌ టీమ్‌ తరఫున దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఇంగ్లిష్‌ క్లబ్‌లు ఫుల్హామ్, పోర్ట్స్‌మౌత్‌ తరఫున కూడా ర్యాన్‌ మ్యాచ్‌లు ఆడాడు.

India a semi final against Bangladesh A in Rising Stars Asia Cup today3
‘ఫైనల్‌’ లక్ష్యంగా భారత్‌ ‘ఎ’ బరిలోకి

దోహా: రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ క్రికెట్‌ టి20 టోర్నీలో జోరు మీదున్న భారత ‘ఎ’ జట్టు ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నేడు బంగ్లాదేశ్‌ ‘ఎ’తో జరిగే సెమీఫైనల్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి బ్యాటర్ల సహకారం లభిస్తే చాలు భారత్‌ విజయానికి ఢోకా ఉండదు. ఈ టోర్నీలో వైభవ్‌ 201 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్లలో కెపె్టన్‌ జితేశ్‌ శర్మ సహా నమన్‌ ధీర్, ప్రియాన్‌‡్ష ఆర్య, నేహల్‌ వధేరాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు ఏ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయారు. కీలకమైన సెమీస్‌లో వీరంతా బాధ్యత కనబరిస్తేనే బంగ్లాపై విజయం సాధించవచ్చు. లేదంటే ఊహించని ఫలితం ఎదురైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ టోర్నీలో భారత్‌లాగే బంగ్లాదేశ్‌ కూడా దీటుగా రాణించింది. అఫ్గానిస్తాన్‌ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్లను కంగుతినిపించిన బంగ్లా... భారత్‌తో క్లిష్టమైన పోరుకు సై అంటోంది. పేసర్‌ రిపొన్‌ మోండల్, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రకీబుల్‌ హసన్‌ల నుంచి భారత బ్యాటర్లకు సవాళ్లు ఎదురవొచ్చు. భారత బౌలర్లలో గుర్జప్‌నీత్, స్పిన్నర్‌ హర్‌‡్ష దూబేలు నిలకడగా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. కీలకమైన సెమీస్‌లోనూ వీరి జోరు కొనసాగాలని జట్టు ఆశిస్తోంది. శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌ ‘ఎ’తో శ్రీలంక ‘ఎ’ తలపడుతుంది. ఈ రెండు సెమీఫైనల్స్‌లో చిరకాల ప్రత్యర్థులు గెలిస్తే... ఆదివారం జరిగే ఫైనల్‌ సమరం దాయాదుల మధ్యే జరిగే అవకాశముంది. భారత్‌ ‘ఎ’ జట్టు: జితేశ్‌ (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, ప్రియాన్ష్ నేహల్, నమన్‌ ధీర్, సూర్యాన్ష్ రమణ్‌దీప్, హర్ష్ దూబే, అశుతోష్, యశ్‌ ఠాకూర్, గుర్జప్‌నీత్, వైశాక్‌. బంగ్లాదేశ్‌ ‘ఎ’ జట్టు: అక్బర్‌ అలీ (కెప్టెన్‌), హబీబుర్, యాసిర్‌ అలీ, జీషాన్, అరిఫుల్‌ ఇస్లామ్, రకీబుల్, మహిదుల్, అహ్మద్‌ రేహాన్, రిపొన్‌ మోండల్, అబు హిదార్, గఫార్, అబ్రార్‌.

Batting coach Sitanshu Kotak is unhappy with the comments on Gambhir4
‘గంభీర్‌పై విమర్శలేల’

గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓడిపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలపై భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు పనిగట్టుకొని గంభీర్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అతను వ్యాఖ్యానించాడు. భారత జట్టు పరాజయంలో ఆటగాళ్ల పాత్రను వదిలి కోచ్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం లేదని కొటక్‌ అన్నాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో అతను గురువారం మీడియాతో మాట్లాడాడు. ‘గంభీర్, గంభీర్‌ అంటూ ఒకే వ్యక్తిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. నేను కూడా సహాయక సిబ్బందిలో భాగం కాబట్టి చాలా బాధగా ఉంది. కొందరికి తమ వ్యక్తిగత అజెండాలు ఉండవచ్చు. అందుకే పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది’ అని కొటక్‌ స్పందించాడు. ఓటమి బాధ్యతను గంభీర్‌ తన మీదకు వేసుకున్నాడని కొటక్‌ గుర్తు చేశాడు. ‘మ్యాచ్‌ ఓడిపోయాక ఫలానా బ్యాటర్‌ బాగా ఆడలేదని లేదా ఫలానా బౌలర్‌ ఇలా ఆడలేదని ఎవరూ విమర్శించడం లేదు. బ్యాటింగ్‌లో ఇలా ఉంటే బాగుండేదని ఎవరూ సూచించడం లేదు. కోల్‌కతాలో పిచ్‌ గురించి మాట్లాడుతూ గంభీర్‌ ఓటమి బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు. క్యురేటర్‌పై ఎవరూ విమర్శలు చేయకుండా కాపాడేందుకే అతను ఇలా చేశాడు’ అని తమ హెడ్‌ కోచ్‌ను సితాన్షు వెనకేసుకొచ్చాడు. బ్యాటర్‌ క్రీజ్‌లోకి వెళ్లేటప్పుడు ఇలాగే ఆడాలని తాము చెప్పలేమని, పరిస్థితిని బట్టి అతను తన ఆటను మార్చుకుంటాడని కోచ్‌ అన్నాడు. నేడు గిల్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ రెండో టెస్టు నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగానే అనిపిస్తున్నా... టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. కోల్‌కతా టెస్టు రెండో రోజు మెడ నొప్పితో తప్పుకున్న అనంతరం ఇప్పటి వరకు గిల్‌కు చికిత్స కొనసాగుతూనే ఉంది. అతను ఆ తర్వాత ఒక్కసారి కూడా మైదానంలోకి దిగలేదు. అయితే మ్యాచ్‌కు ముందు రోజు గిల్‌ను ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని కొటక్‌ వెల్లడించాడు. ‘గిల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. అయితే అతను ఆడే విషయంపై టీమ్‌ వైద్యులు, ఫిజియో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు సాయంత్రం ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ కోలుకున్నా... టెస్టు మధ్యలో మెడ నొప్పి తిరగబడితే కష్టం కదా. గిల్‌ లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటే’ అని సితాన్షు వివరించాడు.

Humpy in the World Rapid and Blitz Chess Championship ring5
ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ బరిలో హంపి

దోహా: వచ్చే నెలలో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత స్టార్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగనున్నారు. డిసెంబర్‌ 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మహిళల ర్యాపిడ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి డిఫెండింగ్‌ చాంపియన్‌గా పోటీపడనుంది. గత ఏడాది న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌షిప్‌లో హంపి 8.5 పాయింట్లతో విజేతగా అవతరించి రెండోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈసారి హంపితోపాటు భారత్‌ నుంచి మరో 12 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి, వంతిక, పద్మిని రౌత్, సవిత శ్రీ, నందిత, నూతక్కి ప్రియాంక, ఇషా శర్మ, రక్షిత, చర్వీ తమ ఎంట్రీలను ఖరారు చేశారు. ఓపెన్‌ విభాగంలో భారత్‌ నుంచి గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద, పెంటేల హరికృష్ణ, కార్తీక్‌ వెంకటరామన్, రాజా రితి్వక్‌ తదితరులు బరిలో ఉన్నారు.

Gold for Indian female golfer6
పసిడి ‘దీక్ష’

టోక్యో: భారత బధిర క్రీడాకారిణి దీక్షా డాగర్‌ డెఫిలింపిక్స్‌లో టైటిల్‌ నిలబెట్టుకుంది. బధిరుల విశ్వక్రీడల్లో గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే గోల్ఫ్‌ ఫైనల్లో ఆమె వరుసగా 68, 65, 72 స్కోర్లతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మొత్తం 21 మంది తలపడగా భారత ప్లేయరే అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా 24 ఏళ్ల దీక్ష వరుస డెఫిలింపిక్స్‌ల్లో విజేతగా నిలిచిన గోల్ఫర్‌గా ఘనతకెక్కింది. నాలుగేళ్ల క్రితం 2021లో జరిగిన బధిర విశ్వక్రీడల్లోనూ ఆమె బంగారు పతకంతో మెరిసింది. అంతక్రితం 2017లో జరిగిన క్రీడల్లో ఆమె రజతం గెలుచుకుంది. పాల్గొన్న ప్రతి మెగా ఈవెంట్‌లోనూ ఆమె పతకంతోనే తిరిగొచ్చింది. జకార్తాలో 2018లో జరిగిన రెగ్యులర్‌ ఆసియా క్రీడల్లోనూ ఆమె పోటీ పడింది. ఆ మరుసటి ఏడాది (2019) మహిళల యూరోపియన్‌ టూర్‌లో 18 ఏళ్ల వయసులో టైటిల్‌ గెలిచింది. అదితి అశోక్‌ తర్వాత ఈ టైటిల్‌ గెలిచిన రెండో భారత గోల్ఫర్‌గా ఘనత వహించింది. ఈ పోటీల్లో భారత్‌ తరఫున ఆమెతో పాటు హర్‌‡్ష సింగ్, విభు త్యాగిలు కూడా పోటీపడినప్పటికీ వీళ్లిద్దరు వరుసగా 12వ, 14వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. మాహిత్‌ ‘ట్రిపుల్‌ ధమాకా’ భారత రైఫిల్‌ షూటర్‌ మాహిత్‌ సంధూ డెఫిలింపిక్స్‌లో ట్రిపుల్‌ ధమాకా సాధించింది. 50 మీటర్ల ప్రోన్‌ ఈవెంట్‌లో ఆమె 246.1 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకుంది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఆమె 619.7 స్కోరుతో కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఈ మెగా ఈవెంట్‌లో మాహిత్‌ 10 మీటర్ల మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం, 10 మీటర్ల వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గింది. ఆమె మూడు పతకాలతో ఒక్క షూటింగ్‌ క్రీడాంశంలోనే భారత్‌ డజను పతకాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం భారత్‌ 4 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో ఆరో స్థానంలో ఉంది.

MLRIT support for athletes7
క్రీడాకారులకు ఎంఎల్‌ఆర్‌ఐటీ చేయూత

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న క్రీడాకారులకు తమ వంతుగా చేయూత ఇస్తున్నామని మర్రి లక్ష్మణ్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) విద్యా సంస్థ తెలిపింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో సహా ఇప్పటి వరకు 146 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కోటా కింద బీటెక్, ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సులలో పూర్తిగా ఉచిత విద్య అందించినట్టు ఎంఎల్‌ఆర్‌ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ‘యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడానికి, వారికి ఉన్నత విద్యలో అవకాశాలు అందించడానికి 2017–18లో ఈ ఉచిత ప్రవేశాలు ప్రారంభించాం. చదువు, క్రీడల మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ, అర్హులైన విద్యార్థులు రెండు రంగాల్లోనూ రాణించేలా చూడటమే మా లక్ష్యం’ అని రాజశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. గతంలో నిఖత్‌కు ఐదు లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ అందించామని, భవిష్యత్‌లోనూ మరింత మంది క్రీడాకారులకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

Pakistan T20I Tri Series 2025: Zimbabwe Set 163 Runs Target To Sri Lanka8
రాణించిన సికందర్‌ రజా.. కష్టాల్లో శ్రీలంక

పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌లో ఇవాళ (నవంబర్‌ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (49), కెప్టెన్‌ సికందర్‌ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.మరుమణి 10, బ్రెండన్‌ టేలర్‌ 11, ర్యాన్‌ బర్ల్‌ 18, మున్యోంగ డకౌట్‌, ముసేకివా 11, బ్రాడ్‌ ఈవాన్స్‌ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్‌ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్‌ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్‌ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్‌ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్‌ తీశారు.52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకఅనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక​ (0), కుసాల్‌ మెండిస్‌ (6), కుసాల్‌ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్‌ (9) ఔట్‌ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్‌లో ఉన్నారు.కాగా, పాకిస్తాన్‌ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఓ మ్యాచ్‌ జరిగింది. నవంబర్‌ 18న జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.బెన్నెట్‌ (49), మరుమణి (30), సికందర్‌ రజా (34 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. పాక్‌ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.లక్ష్య ఛేదనలో పాక్‌ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్‌ జమాన్‌ (44), ఉస్మాన్‌ ఖాన్‌ (37 నాటౌట్‌) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్‌ నవాజ్‌ (21 నాటౌట్‌) బ్యాట్‌తోనూ రాణించి పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు.

Nikhat Zareen wins gold medal at World Boxing Cup9
స్వర్ణం గెలిచిన నిఖత్‌ జరీన్‌

భారత బాక్సింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (Nikhat Zareen) వరల్డ్ బాక్సింగ్ కప్‌లో (World Boxing Cup 2025) స్వర్ణ పతకం (51 కిలోల విభాగంలో) కైవసం చేసుకుంది. ఇవాళ (నవంబర్‌ 20) జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జువాన్ యి గువోపై 5–0తో గెలుపొందింది. నిఖత్‌ సాధించిన ఈ పతకంతో ప్రస్తుత బాక్సింగ్‌ కప్‌లో భారత మహిళలు సాధించిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. నిఖత్‌కు ముందు 48 కిలోల విభాగంలో మినాక్షి హూడా, 54 కిలోల విభాగంలో ప్రీతి పవార్, 70 కిలోల విభాగంలో అరుంధతి, 80+ కిలోల విభాగంలో నూపుర్ శెఓరన్ స్వర్ణాలు సాధించారు.మాజీ ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్..‌ దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. ఈ టోర్నీలో నిఖత్‌ వెయిట్‌ కేటగిరీలో ఐదుగురు బాక్సర్లు మాత్రమే బరిలోకి దిగారు. దీంతో నేరుగా సెమీఫైనల్‌ ఆడిన నిఖత్‌ 5–0తో జెనీవా గుల్‌సెవర్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను చిత్తు చేసింది. భుజం గాయంతో దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన నిఖత్‌ ఈ టోర్నీతోనే బరిలోకి దిగింది. 2024 ఫిబ్రవరిలో స్ట్రాంజా మెమోరియల్‌ టోర్నీలో సాధించిన విజయం తర్వాత నిఖత్‌ గెలిచిన తొలి పతకం ఇదే.చదవండి: ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన

Wedding bells for Mandhana and Muchhal, Couple confirms engagement on Instagram, nuptials soon..!10
ముచ్చల్‌తో నిశ్చితార్థాన్ని ధృవీకరించిన మంధన

భారత మహిళా జట్టు స్టార్‌ క్రికెటర్‌, టీమిండియా 'క్వీన్‌' స్మృతి మంధన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీఠలెక్కబోతుందన్న ప్రచారం నిజమైంది. సంగీత దర్శకుడు, సింగర్‌ పాలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) నిశ్చితార్థాన్ని మంధన స్వయంగా ధృవీకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరి జెమిమా రోడ్రిగ్స్ షేర్ చేసిన వీడియోలో మంధన తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌‌ను చూపిస్తూ మున్నా భాయ్‌ MBBS సినిమాలోని "సమ్జో హో హీ గయా" పాటకు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను మంధన స్వయంగా రీపోస్ట్ చేస్తూ, ముచ్చల్‌తో తన నిశ్చితార్థాన్ని అఫీషియల్‌ చేసింది. మంధన-ముచ్చల్‌ 2019లో స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. సంగీతం, క్రీడలపై ఆసక్తి వారిని దగ్గర చేసింది. ఐదు సంవత్సరాల డేటింగ్ అనంతరం 2024లో వీరు తమ అనుబంధాన్ని బహిర్గతం చేశారు. ముచ్చల్ తరచూ మంధన ఆడే మ్యాచ్‌లలో కనిపిస్తూ ఆమెకు మద్దతు పలుకుతుంటాడు. మంధన-ముచ్చల్‌ వివాహా తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సోషల్‌మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆహ్వాన పత్రిక వైరలవుతుంది. దీని ప్రకారం వీరి పెళ్లి మరికొద్ది రోజుల్లో (నవంబర్ 23న) జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, సాంగ్లీల్లో జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సన్నాహకాలు కూడా పూర్తయ్యాయని సమాచారం​. మంధన ఇటీవలే భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. జగజ్జేతగా నిలిచిన కొద్ది రోజుల్లోనే మంధన జీవితంలో మరో పెద్ద విజయోత్సవం జరగడం ఖాయమైంది. మంధన-ముచ్చల్‌ వివాహాం క్రికెట్‌తో పాటు సంగీత అభిమానుల్లోనే ఆనందాన్ని నింపనుంది. చదవండి: కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌ పేరు ప్రకటన

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement