Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI Announced India U19 squad for Asia Cup, Vaibhav Suryavanshi In1
భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిసెంబరు 14న భారత్‌- పాక్‌ మ్యాచ్‌గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌ 1 విజేత, క్వాలిఫయర్‌ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్‌-‘బి’ నుంచి బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, క్వాలిఫయర్‌-2 విజేత రేసులో ఉన్నాయి.ఇక అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్‌-1 విజేతతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్‌’లో క్వాలిఫయర్‌-3 విజేతతో తలపడుతుంది.కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్‌ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్‌’ వేదికగా రెండో సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌- ‘బి’ గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌ విజేతల మధ్య టైటిల్‌ పోరు జరుగుతుంది.సెమీస్‌లోనే ఇంటిబాటఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్‌ మండలి టీ20 రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్‌ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్‌ ఫైనల్‌ చేరింది. టైటిల్‌ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్‌), ​వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), యువరాజ్‌ గోహిల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఎ.పటేల్‌, నమన్‌ పుష్పక్‌, డి. దీపేశ్‌, హెనిల్‌ పటేల్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ఉద్ధవ్‌ మోహన్‌, ఆరోన్‌ జార్జ్‌.స్టాండ్‌ బై ప్లేయర్లు: రాహుల్‌ కుమార్‌, హేముచుందేశన్‌ జె, బీకే కిషోర్‌, ఆదిత్య రావత్‌.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Gambhir Is Not My Relative: R Ashwin Lambasts Indian Players Loss To SA2
గంభీర్‌ నా బంధువు కాదు.. తప్పంతా వాళ్లదే: అశ్విన్‌ ఆగ్రహం

టీమిండియా సిరీస్‌ పరాజయానికి హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్‌వాష్‌ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ​కోచ్‌ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.అది సరైంది కాదు‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్‌ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.తప్పంతా వాళ్లదేభారత క్రికెట్‌ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్‌ బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.కోచ్‌, కెప్టెన్‌ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?గంభీర్‌ నా బంధువు కాదు.. గంభీర్‌ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్‌ వివరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్‌కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ఇక భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్‌ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌ అయిన విషయం తెలిసిందే. చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Dono Takleef Mein Hain, Shaadi Jaldi: Palash Muchhal Mother On Wedding Row3
‘భార్య’తో ఇంటికి రావాలని కలలు కన్నాడు.. కానీ: పలాష్‌ ముచ్చల్‌ తల్లి

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన పెళ్లి (Smriti Mandhana) గురించి సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌ ఆమెను మోసం చేసిన కారణంగానే వివాహం నిరవధికంగా వాయిదా పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు తోడు పలాష్‌తో చాట్‌ చేసింది తానేనంటూ ఓ అమ్మాయి గురువారం ధ్రువీకరించింది.స్మృతి తన ఆరాధ్య క్రికెటర్‌ అని, అలాంటి అమ్మాయికి పలాష్‌ నిజస్వరూపం తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశానని సదరు యువతి పేర్కొంది. అయితే, పలాష్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ చాట్స్‌ కూడా చాన్నాళ్ల ‍క్రితం నాటివంటూ ట్విస్టు ఇచ్చింది.మరోవైపు.. స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధాన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కూడా పెళ్లి గురించి ఎలాంటి స్పందన రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో పలాష్‌ ముచ్చల్‌ (Palash Mucchal) తల్లి అమిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు.మానసిక వేదన వర్ణనాతీతంహిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘పెళ్లి జరగాల్సిన రోజు ఎదురైన పరిణామాలతో ఇద్దరూ తీవ్రమైన బాధలో కూరుకుపోయారు. ఇద్దరి మానసిక వేదన వర్ణనాతీతం. తన వధువు (భార్య)తో ఇంట్లో అడుగుపెట్టాలని పలాష్‌ కలలు కన్నాడు.తొందర్లోనే పెళ్లి!నేను కూడా కోడలికి ఘనంగా స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేసుకున్నాను. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. తొందర్లోనే పెళ్లి జరుగుతుంది’’ అని అమిత ముచ్చల్‌ (Amita Mucchal) పేర్కొన్నారు. అయితే, మంధాన కుటుంబం మాత్రం స్మృతి- పలాష్‌ల పెళ్లి విషయమై స్పందించలేదు.ఘనంగా వేడుకలుకాగా 2019 ప్రేమలో ఉన్న స్మృతి- పలాష్‌.. 2024లో తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. స్మృతి స్వస్థలం సాంగ్లీలో నవంబరు 23న వివాహ వేడుకకు ముహూర్తం ఖరారు కాగా.. హల్దీ, సంగీత్‌, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.అయితే, ఊహించని రీతిలో పెళ్లికి గంటల ముందు కార్యక్రమం వాయిదా పడింది. స్మృతి తండ్రి గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ఆ తర్వాత పలాష్‌ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. పలాష్‌ స్మృతిని మోసం చేశాడని.. అతడితో గొడవ పడే క్రమంలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందని సోషల్‌ మీడియాలో గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లారు.ఆ వీడియోలు డిలీట్‌ చేసిన స్మృతిఈ నేపథ్యంలో పలాష్‌ తల్లి అమిత ముచ్చల్‌ స్పందిస్తూ.. స్మృతి తండ్రి అంటే తన కుమారుడికి ఎంతో ఇష్టమని.. ఆయన అనారోగ్యం పాలు కావడం తట్టుకోలేక అతడూ ఆస్పత్రి పాలయ్యాడని తెలిపారు. స్మృతి కంటే ముందు పలాషే వివాహాన్ని వాయిదా వేద్దామని చెప్పారు. తాజాగా ఆమె మరోసారి పైవిధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. స్మృతి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలన్నీ డిలీట్‌ చేయడం గమనార్హం.చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్‌ ఎంత?

WPL 2026 Mega Auction: Sold Out Telugu Players Shree Charani Tops List4
WPL 2026: వేలంలో సత్తా చాటిన మన అమ్మాయిలు

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)- 2026 వేలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు అమ్మాయిలు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌-2025లో విజయంలో భాగమైన శ్రీచరణి, అరుంధతి రెడ్డి (హైదరాబాద్‌) మరో సందేహం లేకుండా ఎంపికయ్యారు. అరుంధతి రెడ్డిని రూ. 75 లక్షలకు ఆర్‌సీబీ జట్టు ఎంచుకుంది.గొంగడి త్రిషకు తొలిసారి చాన్స్‌అండర్‌–19 వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిషకు తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో చాన్స్‌ లభించడం విశేషం. మమత మాదివాల, నల్లా క్రాంతి రెడ్డి కూడా ఎంపికయ్యారు. గొంగడి త్రిషను రూ. 10 లక్షలకు యూపీ వారియర్స్‌... మమతను రూ. 10 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌... క్రాంతి రెడ్డిని రూ. 10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్నాయి. శ్రీచరణి స్థాయి పెరిగింది... వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన నల్లపు రెడ్డి శ్రీచరణి 2025 డబ్ల్యూపీఎల్‌లో రూ.55 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడింది. ఇటీవలి వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రధాన పాత్ర పోషించడంతో సహజంగానే ఆమె స్థాయి పెరిగింది. వేలానికి ముందు ఆమెను విడుదల చేసిన ఢిల్లీ ఇక్కడ మళ్లీ పోటీ పడింది. కనీస విలువ రూ.30 లక్షలతో మొదలై ఢిల్లీ, యూపీ మధ్య పోరు సాగింది. చివరకు రూ.1.30 కోట్ల వద్ద వేలం ముగిసింది. ఈ మేరకు.. ఢిల్లీ భారీ మొత్తంతో తమ ప్లేయర్‌ను తిరిగి సొంతం చేసుకుంది.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Former captain Sunil Gavaskar came out in support of Gambhir5
మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే: గావస్కర్‌

న్యూఢిల్లీ: భారత జట్టు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ కోల్పోయింది. దాంతో హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ గంభీర్‌కు అండగా నిలిచాడు. కోచ్‌ కేవలం జట్టును సిద్ధం చేస్తాడని... మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని గావస్కర్‌ అన్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 30 పరుగులతో ఓడిన టీమిండియా... రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం భారత జట్టు మూడో టెస్టు సిరీస్‌ ఓటమి చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో 0–3తో ఓడిన టీమిండియా, ఆస్ట్రేలియాలో 1–3తో సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో గావస్కర్‌ మాట్లాడుతూ... ‘అతడు ఒక కోచ్‌. జట్టును సిద్ధం చేయడం అతడి పని. తనకున్న అనుభవంతో ఎలా ఆడాలో చెప్పగలడు. కానీ, మైదానంలో ఆడాల్సింది ప్లేయర్లే. ఈ సిరీస్‌ పరాజయానికి గంభీర్‌ను బాధ్యుడిని చేయాలంటున్న వారికి నేను ఓ సూటి ప్రశ్న వేస్తున్నా. గంభీర్‌ నేతృత్వంలోనే భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ గెలిచింది. అప్పుడు అతడిని వన్డే, టి20ల్లో జీవితాంతం కోచ్‌గా ఉంచాలని మీరు చెప్పారా. మరి అలాంటిది ఇప్పుడు టెస్టు సిరీస్‌ ఓడినప్పుడు అతడిని తొలగించాలని ఎలా డిమాండ్‌ చేయగలరు. ఒక జట్టు బాగా రాణించనప్పుడు మాత్రమే కోచ్‌ వైపు చూస్తారు’ అని గావస్కర్‌ అన్నాడు. మూడు ఫార్మాట్లకు గంభీర్‌ను కోచ్‌గా కొనసాగించడాన్ని సన్నీ సమర్థించాడు. ఇంగ్లండ్‌ జట్టుకు బ్రెండన్‌ మెక్‌ల్లమ్‌ అన్ని ఫార్మాట్లలో కోచింగ్‌ ఇస్తున్న అంశాన్ని గుర్తు చేశాడు.

Deepti Sharma fetches huge price in Womens Premier League auction6
డబ్ల్యూపీఎల్‌ వేలంలో దీప్తి ధమాకా

భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో భారీ విలువ దక్కింది. 2026 సీజన్‌ కోసం నిర్వహించిన మెగా వేలంలో దీప్తిని అత్యధికంగా రూ.3 కోట్ల 20 లక్షలకు ఆమె గత జట్టు యూపీ వారియర్స్‌ సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌ వేలం చరిత్రలో అత్యధిక మొత్తం 2023లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)కు దక్కగా... దీప్తి రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా మూడుసార్లు ఢిల్లీని ఫైనల్‌కు చేర్చిన ఆ్రస్టేలియా దిగ్గజం మెగ్‌ లానింగ్‌ను రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ తమ సారథిగా ఎంచుకునే అవకాశం ఉంది. వరల్డ్‌ కప్‌ విజయంలో భాగమైన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.1.30 కోట్లు ఇచ్చి మళ్లీ తమ జట్టులోకి తీసుకుంది. న్యూఢిల్లీ: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) –2026 సీజన్‌ కోసం గురువారం నిర్వహించిన వేలంలో 67 మంది మహిళా క్రికెటర్లను ఐదు ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరిలో 23 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 276 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా, గరిష్టంగా 73 ఖాళీలు ఉండగా... తమకు కావాల్సిన ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు టీమ్‌లు ఓవరాల్‌గా రూ. 40.80 కోట్లు ఖర్చు చేశాయి. భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు అత్యధికంగా రూ.3.20 కోట్లు దక్కాయి. విదేశీ ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ స్టార్‌ అమేలియా కెర్‌కు రూ. 3 కోట్లు లభించగా... 11 మంది ప్లేయర్లకు కనీసం రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలు దక్కాయి. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు రెండు నగరాల్లో డబ్ల్యూపీఎల్‌ జరుగుతుంది. ముంబైలోని డీవై పాటిల్, వడోదరలోని కొటాంబి స్టేడియంలను టోర్నీకి వేదికలుగా నిర్ణయించారు. 2023లో మొదటిసారి డబ్ల్యూపీఎల్‌ వేలం జరిగింది. ఆ తర్వాత జరిగిన మెగా వేలం ఇదే కావడం గమనార్హం. తొలిసారి జట్లకు రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) కార్డును వాడుకునే అవకాశం కల్పించారు. వేలానికి ముందు యూపీ వారియర్స్‌ వద్ద ఏకంగా రూ.14.50 కోట్లు ఉండటంతో ఆ జట్టు చురుగ్గా పాల్గొని గరిష్టంగా 17 మంది ఆటగాళ్లను ఎంచుకుంది. డబ్ల్యూపీఎల్‌ వేలం విశేషాలు » ఆస్ట్రేలియా కెప్టెన్‌ అలీసా హీలీతో వేలం మొదలైంది. వన్డే వరల్డ్‌ కప్‌లో చెలరేగిన ఆమె ప్రాథమిక ధర రూ.50 లక్షలు కాగా... ఏ జట్టు కూడా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. » దీప్తి కోసం 2023లో యూపీ వారియర్స్‌ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ సీజన్‌కు ముందు ఆమెను విడుదల చేసింది. వేలంలో దీప్తి కనీస విలువ రూ. 50 లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ సిద్ధం కాగా... యూపీ ఆర్‌టీఎం కార్డును వాడుకొని తమ జట్టులోకి ఎంచుకుంది. » డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు కెప్టెన్‌గా ఢిల్లీని ఫైనల్‌ చేర్చిన ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లానింగ్‌ కనీస ధర రూ.50 లక్షల నుంచి ఢిల్లీ, యూపీ పోటీ పడగా, చివరకు రూ.1.9 కోట్లతో యూపీ సొంతమైంది. » వేలంలో భారీ మొత్తం పలికిన ప్లేయర్ల జాబితాలో శిఖా పాండే కాస్త ఆశ్చర్యకరంగా అనిపించింది. భారత జట్టుకు ఎప్పుడో దూరమైన 36 ఏళ్ల శిఖా అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడి దాదాపు మూడేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం కరీబియన్‌ లీగ్‌ సహా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతూ ఫిట్‌గా ఉండటం ఆమె ఎంపికకు ప్రధాన కారణం. ఆర్‌సీబీతో పోటీ పడిన యూపీ చివరకు శిఖాను సొంతం చేసుకుంది.» వరల్డ్‌కప్‌ విజేత, కడప బిడ్డ శ్రీచరణిని రూ.1.30 కోట్లతో ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది.వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల వివరాలు (విలువ రూ.లలో)ఢిల్లీ క్యాపిటల్స్‌: షినెల్‌ హెన్రీ (1.30 కోట్లు), శ్రీచరణి (1.30 కోట్లు), వోల్‌వార్ట్‌ (1.10 కోట్లు), స్నేహ్‌ రాణా (50 లక్షలు), మిన్ను మణి (40 లక్షలు), లిజెల్‌ లీ (30 లక్షలు), తానియా భాటియా (30 లక్షలు), నందిని శర్మ (20 లక్షలు), దియా యాదవ్‌ (10 లక్షలు), మమత మదివాల (10 లక్షలు), లూసీ హామిల్టన్‌ (10 లక్షలు).గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డివైన్‌ (2 కోట్లు), జార్జ్‌ వేర్‌హామ్‌ (1 కోటి), భారతి ఫుల్‌మలీ (70 లక్షలు), కాశ్వీ గౌతమ్‌ (65 లక్షలు), రేణుకా సింగ్‌ (60 లక్షలు), కిమ్‌ గార్త్‌ (50 లక్షలు), యస్తిక భాటియా (50 లక్షలు), డానీ వ్యాట్‌ (50 లక్షలు), తనూజ కన్వర్‌ (45 లక్షలు), అనుష్క శర్మ (45 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్‌ (40 లక్షలు), టిటాస్‌ సాధు (30 లక్షలు), కనిక అహుజా (30 లక్షలు), ఆయుషి సోని (30 లక్షలు), హ్యాపీ కుమారి (10 లక్షలు), శివాని సింగ్‌ (10 లక్షలు).ముంబై ఇండియన్స్‌: అమేలియా కెర్‌ (3 కోట్లు), సజీవన్‌ సజన (75 లక్షలు), షబి్నమ్‌ ఇస్మాయిల్‌ (60 లక్షలు), నికోలా క్యారీ (30 లక్షలు), సైకా ఇషాక్‌ (30 లక్షలు), సంస్కృతి గుప్తా (20 లక్షలు), త్రివేణి వశిష్ట (20 లక్షలు), రాహిలా ఫిర్దోస్‌ (10 లక్షలు), పూనమ్‌ ఖెమ్మార్‌ (10 లక్షలు), నల్లా క్రాంతి రెడ్డి (10 లక్షలు), మిలీ ఇలింగ్‌వర్త్‌ (10 లక్షలు).రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: లారెన్‌ బెల్‌ (90 లక్షలు), పూజ వస్త్రకర్‌ (85 లక్షలు), అరుంధతి రెడ్డి (75 లక్షలు), గ్రేస్‌ హారిస్‌ (75 లక్షలు), డిక్లెర్క్‌ (65 లక్షలు), రాధ యాదవ్‌ (65 లక్షలు), జార్జ్‌ వోల్‌ (60 లక్షలు), లిన్సీ స్మిత్‌ (30 లక్షలు), హేమలత దయాళన్‌ (30 లక్షలు), ప్రేమ రావత్‌ (20 లక్షలు), గౌతమ్‌ నాయక్‌ (10 లక్షలు), ప్రత్యూష కుమార్‌ (10 లక్షలు).యూపీ వారియర్స్‌: దీప్తి శర్మ (3.20 కోట్లు), శిఖా పాండే (2.40 కోట్లు), మెగ్‌ లానింగ్‌ (1.90 కోట్లు), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (1.20 కోట్లు), ఆశా శోభన (1.10 కోట్లు), సోఫీ ఎకెల్‌స్టోన్‌ (85 లక్షలు), డియాండ్రా డాటిన్‌ (80 లక్షలు), కిరణ్‌ నవ్‌గిరే (60 లక్షలు), హర్లీన్‌ డియోల్‌ (50 లక్షలు), క్రాంతి గౌడ్‌ (50 లక్షలు), ప్రతీక రావల్‌ (50 లక్షలు), క్లో ట్రయాన్‌ (30 లక్షలు), శిప్రా గిరి (10 లక్షలు), సిమ్రన్‌ షేక్‌ (10 లక్షలు), తారా నోరిస్‌ (10 లక్షలు), సుమన్‌ మీనా (10 లక్షలు), గొంగడి త్రిష (రూ. 10 లక్షలు). వీరికి నిరాశ అంతర్జాతీయ క్రికెట్‌లో తమదైన గుర్తింపు ఉన్న పలువురు ప్లేయర్లకు ఈసారి డబ్ల్యూపీఎల్‌ వేలంలో నిరాశే మిగిలింది. అలీసా హీలీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ...విదేశీ ప్లేయర్లలో ఎమీ జోన్స్, హీతర్‌ నైట్, చమరి అటపట్టు, అలానా కింగ్, తజ్‌మీన్‌ బ్రిట్స్, సోఫీయా డంక్లీ, సుజీ బేట్స్‌ తది తరులను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో లీగ్‌లో అవకాశం దక్కించుకొని ఈసారి వేలంలో ఎంపిక కాని భారత ప్లేయర్ల జాబితాలో ఉమా ఛెత్రి, సైమా ఠాకూర్‌లతోపాటు సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్‌), యషశ్రీ (హైదరాబాద్‌) ఉన్నారు.

WPL 2026 Auction: Check Top 10 most Expensive Signings This Time7
WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026 మెగా వేలంలో భారత క్రికెటర్లు దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి సత్తా చాటారు. వన్డే వరల్డ్‌కప్‌-2025లో వీరిద్దరు అదరగొట్టిన విషయం తెలిసిందే. దీప్తి ఈ మెగా టోర్నీలో 215 పరుగులు సాధించడంతో పాటు.. 22 వికెట్లు కూల్చింది.మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి (Shree Charani) పద్నాలుగు వికెట్లతో దుమ్ములేపింది. ఈ క్రమంలో అంచనాలకు అనుగుణంగా దీప్తి శర్మ ఈసారి వేలంపాటలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలవగా.. శ్రీచరణి సైతం జాక్‌పాట్‌ అందుకుంది.మరి డబ్ల్యూపీఎల్‌ 2026 మెగా వేలంలో వీరితో పాటు అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరో చూసేద్దామా!దీప్తి శర్మ (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌అమెలియా కెర్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 3 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్‌శిఖా పాండే (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 20 లక్షలు- రూ. 2.4 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 2 కోట్లకు కొనుక్కున్న గుజరాత్‌ జెయింట్స్‌మెగ్‌ లానింగ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.90 కోట్లకు సొంతం చేసుకున్న యూపీ వారియర్స్‌శ్రీచరణి (భారత్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.3 ​కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌చినెలె హెన్రి (వెస్టిండీస్‌)👉ఆల్‌రౌండర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.30 కోట్లకు కొనుక్కున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఫోబే లిచిఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 50 లక్షలు- రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్‌లారా వొల్వర్ట్‌ (సౌతాఫ్రికా)👉బ్యాటర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ఆశా శోభన (భారత్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్స్‌లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)👉బౌలర్‌- కనీస ధర రూ. 30 లక్షలు- రూ. 90 లక్షలకు కొనుక్కున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.చదవండి: WPL 2026 Auction Updates: ఎవరికి ఎంత ధర?

Smriti Mandhana wedding controversy Woman behind leaked chats speaks out8
చాట్‌లను బ‌య‌ట‌పెట్టింది నేనే..

టీమిండియా మహిళా స్టార్ క్రికెట‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి ఆగిపోవ‌డానికి తానే కార‌ణ‌మ‌ని ఓ యువ‌తి అంగీక‌రించింది. స్మృతి మంచి కోరే ఇదంతా చేశాన‌ని, త‌న‌కు మ‌రో ఉద్దేశం ఏదీ లేద‌ని వెల్ల‌డించింది. ప‌లాష్ ముచ్చ‌ల్‌తో జ‌రిగిన చాటింగ్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లను బ‌య‌ట‌పెట్టింది తానేన‌ని తెలిపింది. ప‌లాష్ ఎలాంటి వాడో తెలియాల‌న్న భావ‌న‌తోనే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. అయితే ప‌లాష్‌తో 4 నెల‌ల క్రితం చాటింగ్ చేశాన‌ని, అత‌డి పెళ్లి ఆగిపోవ‌డానికి వీటికి సంబంధం లేద‌ని తెలిపింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా తాను కొరియోగ్రాఫ‌ర్ కాద‌ని క్లారిటీ ఇచ్చింది. తాను వెలుగులోకి రావాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అంది. ఈ మేర‌కు తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.''స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణ‌మైన చాట్‌లను పోస్ట్ చేసిన వ్యక్తి నేనే. నా గుర్తింపును నేను ఎప్పుడూ వెల్లడించాలనుకోలేదు. ప‌లాష్‌తో నేను ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు. మా మ‌ధ్య చాట్‌లు మే-జూలై 2025 వరకు జరిగాయి. ఒక నెల మాత్రమే కొనసాగాయి. అతడిని నేను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి రిలేష‌న్‌లోనూ లేను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్మృతి మంధానను ఆరాధిస్తాను. ప్రజలు తెలుసుకోవాలని భావించాను కాబట్టే నేను అతడి (ప‌లాష్ ముచ్చ‌ల్‌) గురించి బహిర్గతం చేశాను.నేను కొరియోగ్రాఫర్‌ను కాదు. అతడు మోసం చేసిన వ్యక్తిని కూడా కాదు. ప‌లాష్‌తో చేసిన చాట్‌ను బ‌య‌ట‌పెట్టినందుకు ఊహించని విధంగా నాపై వ్య‌తిరేక‌త రావ‌డంతో నా సోష‌ల్ మీడియా ఖాతాను (Social Media Account) ప్రైవేట్ మోడ్‌లో పెట్టాల్సివ‌చ్చింది. ప‌లాష్‌తో జ‌రిపిన చాట్‌లను గ‌మ‌నిస్తే.. నేను తప్పు చేయలేదన్న విష‌యం స్పష్టంగా తెలుస్తుంది. ఏ మ‌హిళ‌కు అన్యాయం నేను చేయ‌లేదు. దయచేసి నన్ను టార్గెట్ చేయ‌వ‌ద్ద‌ని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అంటూ వేడుకుంది.చ‌ద‌వండి: ఆగిన స్మృతి.. జెమీమా రోడ్రిగ్స్ సంచ‌ల‌న నిర్ణ‌యంకాగా, స్మృతి, ప‌లాష్ పెళ్లి ఆగిపోయిన నేప‌థ్యంలో మేరీ డికోస్టా అనే యువ‌తి పేరుతో అన‌ధికారిక‌ చాటింగ్ స్క్రీన్‌షాట్లు వెలుగులోకి వ‌చ్చాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఫ‌లితంగా సోష‌ల్ మీడియా ఖాతాను ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేసింది. అయితే ఈ వివాదంపై స్మృతి మంధాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ (Palash Muchhal) కుటుంబాలు ఇప్ప‌టివ‌రకు అధికారికంగా స్పందించ‌లేదు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Jemimah Rodrigues to stay in India to support Smriti Mandhana9
డబ్ల్యూబీబీఎల్‌కు జెమీమా దూరం

బ్రిస్బేన్‌: భారత క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌... మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ (డబ్ల్యూబీబీఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. టీమిండియా వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన నేపథ్యంలో... సహచరిణికి అండగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. దీంతో డబ్ల్యూబీబీఎల్‌ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని నిర్వాహకులకు తెలిపింది. జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకొని తమ ప్లేయర్‌కు వెసులుబాటు కలి్పంచింది. వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం జెమీమీ డబ్ల్యూబీబీఎల్‌లో పాల్గొనేందుకు ఆ్రస్టేలియా వెళ్లింది. కొన్ని రోజుల ప్రాక్టీస్‌ అనంతరం భారత ఓపెనర్‌ స్మృతి మంధాన వివాహం కోసం స్వదేశానికి తిరిగి వచ్చింది. అయితే వివాహం జరగాల్సిన రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి వాయిదా పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తిరిగి ఆ్రస్టేలియా వెళ్లకూండా స్మృతికి తోడుగా ఉండాలని జెమీమా నిర్ణయించుకుంది. డబ్ల్యూబీబీఎల్‌లో జెమీమా బ్రిస్బేన్‌ హీట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ‘జెమీమా అభ్యర్థనను ఫ్రాంచైజీ అర్థం చేసుకుంది. మహిళల బిగ్‌ బాష్‌ లీగ్‌ తదుపరి మ్యాచ్‌ల నుంచి ఆమెను విడుదల చేసింది’ అని బ్రిస్బేన్‌ హీట్‌ జట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో డబ్ల్యూబీబీఎల్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు జెమీమా దూరం అయింది. భారత జట్టు తొలిసారి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ గెలవడంలో జెమీమా కీలక పాత్ర పోషించింది. సెమీఫైనల్లో ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ ఆ్రస్టేలియాపై అజేయ శతకంతో జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చింది.

Junior World Cup Hockey Tournament from today10
నిరీక్షణ ముగించాలని...

భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించి 50 ఏళ్లు గడిచాయి. 1975లో ఒక్కసారి మాత్రమే భారత సీనియర్‌ జట్టు ప్రపంచకప్‌ టైటిల్‌ను అందుకుంది. ఆ తర్వాత 12 సార్లు ప్రపంచకప్‌ టోర్నీ జరిగినా భారత జట్టు మాత్రం కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. సీనియర్‌ జట్టుతో పోలిస్తే భారత జూనియర్‌ పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్‌లో నిలకడగా రాణిస్తోంది. రెండుసార్లు జగజ్జేతగా నిలిచింది. ఒకసారి రన్నరప్‌ ట్రోఫీని అందుకుంది. మూడుసార్లు మూడో స్థానంలో నిలిచింది. చివరిసారి 2016లో సొంతగడ్డపై ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్‌... తొమ్మిదేళ్ల టైటిల్‌ నిరీక్షణకు సొంతగడ్డపై తెర దించాలని, ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా అవతరించాలనే లక్ష్యంతో నేడు మొదలయ్యే మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగనుంది. చెన్నై/మదురై: గత 12 ఏళ్లలో నాలుగోసారి జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ అండర్‌–21 హాకీ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. చెన్నై, మదురై నగరాల్లో జరిగే ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. 46 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో తొలిసారి 24 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2009లో 20 జట్లు బరిలోకి దిగగా... ఆ తర్వాత జరిగిన నాలుగు ప్రపంచకప్‌లలో 16 జట్లు పోటీపడ్డాయి. ఈసారి 24 జట్లకు అవకాశం కల్పించారు. మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టు అర్హత సాధించినా... భారత్‌తో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్‌ స్థానాన్ని ఒమన్‌ జట్టుతో భర్తీ చేశారు. నేడు జరిగే తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో చిలీ జట్టుతో భారత్‌ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30 నుంచి ఈ మ్యాచ్‌ జరుగుతుంది. అనంతరం భారత్‌ 29న ఒమన్‌ జట్టుతో, డిసెంబర్‌ 2న స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడుతుంది. సీనియర్‌ జట్టు దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న భారత జూనియర్‌ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌కు ప్రపంచ నంబర్‌వన్, ఏడుసార్లు విజేత జర్మనీ జట్టు నుంచి గట్టిపోటీ ఎదురవనుంది. ఇటీవల మలేసియాలో జరిగిన సుల్తాన్‌ ఆఫ్‌ జొహోర్‌ కప్‌లో భారత జట్టు రజత పతకం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. అయితే పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశమే భారత్‌ను వేధిస్తోంది. జొహోర్‌ కప్‌లో భారత జట్టుకు 53 పెనాల్టీ కార్నర్‌లు లభించగా... కేవలం ఎనిమిదింటిని మాత్రమే గోల్స్‌గా మలిచింది. ‘అవును. పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచే అంశంపై మేము దృష్టి పెట్టాం. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో రోజుకు 200–300 సార్లు డ్రాగ్‌ ఫ్లిక్‌ చేశాము. ఈ సాధన ఫలితాలు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నాం’ అని హెడ్‌ కోచ్‌ శ్రీజేశ్‌ వ్యాఖ్యానించాడు. రోహిత్‌ సారథ్యంలో భారత జట్టు ఈ మెగా టోర్నీలో ఆడనుంది. ఇప్పటికే భారత సీనియర్‌ జట్టుకు 21 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన డ్రాగ్‌ఫ్లికర్‌ అరిజిత్‌ సింగ్‌ హుండల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ గ్రూప్‌లో ఎవరున్నారంటే... గ్రూప్‌ ‘ఎ’: కెనడా, జర్మనీ, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా. గ్రూప్‌ ‘బి’: భారత్, చిలీ, ఒమన్, స్విట్జర్లాండ్‌. గ్రూప్‌ ‘సి’: జపాన్, న్యూజిలాండ్, చైనా, అర్జెంటీనా. గ్రూప్‌ ‘డి’: బెల్జియం, స్పెయిన్, ఈజిప్‌్ట, నమీబియా. గ్రూప్‌ ‘ఇ’: ఇంగ్లండ్, మలేసియా, నెదర్లాండ్స్, ఆ్రస్టియా. గ్రూప్‌ ‘ఎఫ్‌’: ఆస్ట్రేలియా, కొరియా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్‌.ముందుకెళ్లాలంటే... మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. వరుసగా ఐదు రోజులపాటు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మూడు రోజులు ఎనిమిది లీగ్‌ మ్యాచ్‌ల చొప్పున... ఆ తర్వాతి రెండు రోజులు నాలుగు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తారు. లీగ్‌ దశ ముగిశాక ఆరు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లు... ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచిన మేటి రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మిగతా 16 జట్లు వర్గీకరణ మ్యాచ్‌లు ఆడతాయి. 5 ఇప్పటి వరకు ఐదు జట్లు మాత్రమే జూనియర్‌ ప్రపంచకప్‌లో విజేతలుగా నిలిచాయి. ఈ జాబితాలో జర్మనీ, భారత్, అర్జెంటీనా, ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ ఉన్నాయి.4 జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. గతంలో భారత్‌ 2013, 2016, 2021లలో కూడా ఈ మెగా ఈవెంట్‌కు వేదికగా నిలిచింది.7 ఇప్పటి వరకు 13 సార్లు జూనియర్‌ ప్రపంచకప్‌ జరిగింది. అత్యధికంగా జర్మనీ జట్టు 7 సార్లు టైటిల్‌ సాధించింది. భారత్‌ (2001, 2016) అర్జెంటీనా (2005, 2021) జట్లు రెండు సార్లు చొప్పున చాంపియన్స్‌గా నిలిచాయి. ఆస్ట్రేలియా (1997), పాకిస్తాన్‌ (1979) ఒక్కోసారి టైటిల్‌ అందుకున్నాయి.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement