ప్రధాన వార్తలు
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్గా కొనసాగించిన శుబ్మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.వైస్ కెప్టెన్గా రీఎంట్రీటీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్తో వైస్ కెప్టెన్గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్కు కష్టాలు మొదలయ్యాయి. గిల్ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్డౌన్లో.. ఆ తర్వాత మిడిలార్డర్కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.వరుస మ్యాచ్లలో విఫలం వికెట్ కీపర్గానూ సంజూకు బదులు ఫినిషర్గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.నిరూపించుకున్న సంజూఅహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్ను తప్పించడం సంచలనంగా మారింది.అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదుఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్కప్ జట్టులోనూ అతడు లేడు.మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజమే.అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
గిల్కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026కు ప్రకటించిన భారత జట్టులో గిల్కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో తిరిగి ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ నియమించింది.ఈ ఏడాది ఆసియాకప్తో తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన గిల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా గిల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. తొలి మూడు మ్యాచ్లలో ఘోరంగా విఫలమైన గిల్ను ఆఖరి రెండు టీ20లకు గాయం పేరిట టీమ్ మెనెజ్మెంట్ పక్కన పెట్టింది. దీంతో అతడి స్దానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇకపై సంజూను ఓపెనర్గా కొనసాగించాలని మెనెజ్మెంట్ నిర్ణయించారు. ఈ కారణంతోనే గిల్ను వరల్డ్కప్ జట్టు నుంచి పక్కన పెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం ధ్రువీకరించాడు. గిల్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, గత టీ20 వరల్డ్కప్లో కూడా అతడు ఆడలేదని అగార్కర్ వెల్లడించాడు.కిషన్కు ఛాన్స్..!ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కిషన్ను వరల్డ్కప్ జట్టులోకి తీసుకుంది. అయితే నిన్నటి వరకు టీ20 జట్టులో భాగంగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జితీష్ శర్మపై సెలక్టర్లు వేటు వేశారు. అతడి స్ధానంలోనే సెకెండ్ వికెట్ కీపర్గా కిషన్ను సెలక్ట్ చేశారు. అదేవిధంగా సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టునే వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఇదే జట్టు న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో తలపడనుంది.కిషన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కాగా టీ20 వరల్డ్కప్-2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై జరిగే ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ ఇదే జట్టు ఆడుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఇక అనూహ్య రీతిలో.. వైస్ కెప్టెన్గా ఉన్న గిల్ (Shubman Gill)కు ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) సూర్య డిప్యూటీగా నియమితుడయ్యాడు. మరోవైపు.. జితేశ్ శర్మ విషయంలోనూ యాజమాన్యం ఊహించని నిర్ణయం తీసుకుంది.జితేశ్కూ దక్కని చోటు.. దూసుకు వచ్చిన ఇషాన్తుదిజట్టులో గిల్ ఉండేలా.. సంజూ ఓపెనింగ్ స్థానం త్యాగం చేయించిన మేనేజ్మెంట్.. వికెట్ కీపర్గా జితేశ్కు పెద్ద పీట వేసి లోయర్ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్ జట్టు నుంచి జితేశ్ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్గా, బ్యాటర్గా దుమ్ములేపిన ఇషాన్ కిషన్ను తీసుకువచ్చింది. అతడిని బ్యాకప్ ఓపెనర్గా ఉపయోగించుకుంటామని తెలిపింది.అదే విధంగా.. నయా ఫినిషర్గా పేరొందిన రింకూ సింగ్ను మేనేజ్మెంట్ కనికరించింది. మరోసారి వరల్డ్కప్ జట్టులో భాగమయ్యే అవకాశం ఇచ్చింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలోనే గిల్ను జట్టు నుంచి తప్పించినట్లు స్పష్టమవుతోంది. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్కప్ టోర్నీకి ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కొత్తగా బీసీసీఐ కార్యదర్శిఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.చదవండి: WC 2026: ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?.. ‘ఎక్స్ ఫ్యాక్టర్’ ఎవరంటే?
ఒకప్పుడు విలన్.. ఈసారి హీరో అవుతాడా?
టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న సదరు భారత బౌలర్.. న్యూజిలాండ్తో మ్యాచ్లో 23, అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో 19 పరుగులు ఇచ్చాడు.మిస్టరీ స్పిన్నర్తో ఫలితాలు రాబట్టవచ్చని జట్టులోకి తీసుకుంటే అతడి వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదు. అలా తొలి ప్రపంచకప్ టోర్నీయే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కీలక మ్యాచ్లలో వికెట్లు తీయకపోవడంతో కొందరు అభిమానులు సైతం అతడిని ఓ భారంగా, విలన్గా అభివర్ణించారు కూడా!ఇక అతడి పని అయిపోయినట్లేనని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జాతీయ జట్టులో చోటు కరువైంది. కానీ అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా శ్రమించాడు. ఐపీఎల్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. అతడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు మెంటార్గా ఉన్న వ్యక్తి టీమిండియా హెడ్కోచ్గా రావడంతో అతడి పునరాగమనానికి బాటలు పడ్డాయి.ముఖ్యంగా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి 2.0 వర్షన్ చూపించాడు అతడు!.. ఈ ఏడాది టీమిండియా 20 టీ20లలో ఏకంగా 36 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశాలపై ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్గా నిలిచాడు.రీఎంట్రీలో సూపర్ హిట్అవును.. ఈ ఉపోద్ఘాతమంగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించే!.. గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో ఈ మిస్టరీ స్పిన్నర్దే కీలక పాత్ర. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ... మ్యాచ్ను తమవైపు తిప్పగల సత్తా ఉందని నమ్మిన మేనేజ్మెంట్కు అందుకు తగ్గ ఫలితాలు చూపించాడు. మొత్తంగా రీఎంట్రీలో అతడు ఏకంగా 49 వికెట్లు కూల్చడం అతడి నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. తన వైవిధ్యభరితమైన బౌలింగ్తో గూగ్లీ, క్యారమ్ బాల్, స్లేడర్.. ఇలా వివిధ రీతుల్లో బంతులు సంధిస్తూ బ్యాటర్లను తిప్పలు పెడుతూ వికెట్లు పడగొట్టాడు. అతడి లైన్ అండ్ లెంగ్త్ కూడా ఓ పట్టాన బ్యాటర్కు అర్థం కాదు.అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసి.. భారీ భాగస్వామ్యాలను విడదీయడంలోనూ వరుణ్ దిట్ట. వికెట్లు తీయడం మీద మాత్రమే అతడి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. 2025లో అతడి ఎకానమీ 6.7గా ఉంది.తాజాగా అహ్మదాబాద్లో ఐదో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఓవరాల్గా ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లలో కలిపి పది వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.ఒకప్పుడు విలన్.. ఇపుడు హీరోఇక ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉపఖండ పిచ్లపై జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వరుణ్ చక్రవర్తి ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కాబోతున్నాడు. ఆటలో నైపుణ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వరుణ్.. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడం పక్కా. గత ఏడాది కాలంగా అతడి గణాంకాలు, నిలకడైన ఆటే ఇందుకు నిదర్శనం.అట్లు ఇటీవల ఆసియా కప్-2025 టీ20లో భారత్ చాంపియన్గా నిలవడంలో వరుణ్దే ముఖ్య పాత్ర. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపిన ఈ రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత కూడా వరుసమ్యాచ్లలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని.. ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్గా ఈ ఏడాదిని ముగించాడు.కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా 2022లో సెమీ ఫైనల్ చేరినా ఆఖరి వరకు పోరాడలేకపోయింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలుచుకుంది. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
T20 Match: భారత్– శ్రీలంక జట్లు ముమ్మర ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్ : భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ20 సిరీస్ కోసం రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ ఆదివారం జరగనుండగా.. రెండో మ్యాచ్ 23న జరగనుంది. శుక్రవారం వైఎస్సార్ స్టేడియంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సన్నాహకంగా భావిస్తున్న ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు విశాఖ వేదికగా ఫ్లడ్లైట్ల వెలుతురులో జరగనుండగా మిగిలిన మూడు మ్యాచ్లు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు. శ్రీలంక జట్టు ఈసారి యువ స్పిన్నర్లతో భారత్ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండు చేతులతోనూ స్పిన్ చేయగల సామర్థ్యం ఉన్న శశినితో పాటు కావ్య, రష్మిక వంటి యువ క్రీడాకారిణులు ఆ జట్టుకు అదనపు బలంగా మారారు. కెప్టెన్ చమరి ఆటతో పాటు ఇనోకా బౌలింగ్ కూడా లంకకు కీలకం కానుంది. బ్యాటింగ్ విభాగంలో ఇటీవల వరల్డ్ కప్లో రాణించిన హాసిని, విష్మి, హరిషత, నీలాక్షిక వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో శ్రీలంక పటిష్టంగా కనిపిస్తోంది.బలంగా టీమిండియామరోవైపు భారత జట్టు కూడా సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా జట్టులో కీలక మార్పులు చేసింది. రాధ, యాస్టికా, నయాలి స్థానాల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కమలిని, స్పిన్నర్ వైష్ణవిలను తుది జట్టులోకి తీసుకుంది. ప్రాక్టీస్ సెషన్లో చురుగ్గా పాల్గొన్న వీరిద్దరూ విశాఖ వేదికగా టీ20 అరంగేట్రం చేయబోతున్నారు. భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు దీప్తి, షఫాలీ, జెమిమా, రిచా వంటి స్టార్ క్రీడాకారిణులు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. తొలి మ్యాచ్లో విజయం సాధించి సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?: రవిశాస్త్రి ఫైర్
గత ఏడాది కాలంగా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అభిషేక్ శర్మకు సరైన ఓపెనింగ్ జోడీగా వచ్చి వరుస శతకాలతో అలరించాడు. కానీ ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా వైస్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడంతో సంజూ స్థానం గల్లంతైంది.గిల్ వరుస వైఫల్యాలుగిల్ను ఆడించే క్రమంలో సంజూను తొలుత మూడో స్థానంలో.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఒకటీ రెండు మ్యాచ్లలో ఆడించి.. అనంతరం తుదిజట్టు నుంచే తప్పించింది యాజమాన్యం. మరోవైపు.. గిల్ (Shubman Gill) పునరాగమనంలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.సంజూ ధనాధన్సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి గిల్ కేవలం 33 పరుగులే చేశాడు. ఇందులో ఓ గోల్డెన్ డక్ కూడా ఉంది. ఇక పాదానికి గాయమైన కారణంగా గిల్ సౌతాఫ్రికా (IND vs SA)తో ఆఖరిదైన ఐదో టీ20కి దూరమయ్యాడు. దీంతో సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు ఇచ్చిన మేనేజ్మెంట్ ప్రయోగాలకు వెళ్లకుండా ఈసారి అతడిని ఓపెనర్గానే పంపింది.వచ్చిన అవకాశాన్ని సంజూ సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 37 పరుగులు సాధించాడు. అయితే, జార్జ్ లిండే అద్భుత బంతితో సంజూను బౌల్డ్ చేశాడు. కాగా గిల్ మూడు మ్యాచ్లలో కలిపి చేసిన పరుగుల కంటే కూడా సంజూ ఈ ఒక్క ఇన్నింగ్స్లో చేసిన పరుగులే ఎక్కువ కావడం గమనార్హం.గిల్ గాయపడితే ఇతడిని ఆడిస్తారా?ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కామెంట్రీలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో అతడు అసలు ఎందుకు లేడు? ఇలాంటి ఆటగాడిని పక్కనపెడతారా? ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఇతడిని ఆడిస్తారా?టాపార్డర్లో సంజూ సహజమైన శైలిలో ఆడగలడు. సౌతాఫ్రికా గడ్డ మీద టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు బాదాడు. అతడొక విధ్వంసకర బ్యాటర్, డేంజరస్ ప్లేయర్. అద్భుతమైన షాట్లు ఆడటంలో దిట్ట. అయినా సరే అతడిని పక్కనపెడతారా?’’ అంటూ రవిశాస్త్రి యాజమాన్యం విధానాలను తప్పుబట్టాడు.కాగా అహ్మదాబాద్తో సౌతాఫ్రికాతో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన పద్నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్లో 8 వేల పరుగుల మార్కును అందుకుని.. ఈ ఫీట్ నమోదు చేసిన ఏడో భారత బ్యాటర్గా అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!1000 T20I runs ✅8000 T20 runs ✅@IamSanjuSamson crosses some big milestones in splendid style! 🤩#INDvSA 5th T20I | LIVE NOW 👉 https://t.co/adG06ykx8o pic.twitter.com/F8O8ZAUz19— Star Sports (@StarSportsIndia) December 19, 2025
అతడు ఎక్కడో తప్పిపోయాడు.. వీళ్లు అద్భుతం: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలిచిన టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ముగించింది. స్వదేశంలో సత్తా చాటి ప్రొటిస్ జట్టును 3-1తో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆసాంతం బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా విజయంతోనే సమాధానమిచ్చింది.అయితే, ఈ సిరీస్ మొత్తంలో బ్యాటర్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విఫలమయ్యాడు. టీ20 సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 14 నెలలుగా అతడి ఫామ్ ఆందోళనకరంగా మారింది. సౌతాఫ్రికాతో తాజా సిరీస్లో మొత్తం కలిపి కేవలం 34 పరుగులు (నాలుగు ఇన్నింగ్స్) మాత్రమే చేయడం గమనార్హం.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాంసౌతాఫ్రికాతో ఐదో టీ20లో విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన ఫామ్పై స్పందించాడు. ‘‘ఈ సిరీస్లో ఎలా ఆడాలని అనుకున్నామో.. ఆది నుంచి అదే విధంగా ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలోనూ పటిష్టం కావాలని భావించాము. అందుకు తగ్గ ఫలితం మీ కళ్ల ముందే ఉంది.దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు అది అద్భుతమైన ఫలితం ఇచ్చింది. బుమ్రా (Jasprit Bumrah)తో పవర్ ప్లేలో ఒక్క ఓవర్ మాత్రమే వేయించి.. డెత్ ఓవర్లలోనూ వాడాలని అనుకున్నాము. ఈ సిరీస్లో మేము ప్రయత్నించాలనుకున్న ప్రతి ఒక్కటి ప్రయత్నించి చూశాము.అతడు ఎక్కడో తప్పిపోయాడుఅయితే, ‘సూర్య ది బ్యాటర్’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా తన వైఫల్యాన్ని అంగీకరించాడు. ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. కష్టాల్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఐదో టీ20లో సూర్య ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.టెస్టులలో వైట్వాష్.. వైట్బాల్ సిరీస్లు కైవసంకాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు గురైన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1తో గెలుచుకుంది. తాజాగా అహ్మదాబాద్లో శుక్రవారం నాటి ఐదో టీ20లో గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ అనంతరం.. భారత టీ20 జట్టు సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్-2026 టోర్నమెంట్ బరిలో దిగనుంది. Team India seal it in style! 🇮🇳🏆 A 3–1 series win and their 8th straight bilateral T20I series triumph.#INDvSA 5th T20I Match Highlights 👉 https://t.co/Sp7QQIzWtp pic.twitter.com/MyM6LVIHTE— Star Sports (@StarSportsIndia) December 19, 2025చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్ ఆసియా కప్-2025 టోర్నీ టైటిల్ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలోని భారత్ 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. పవర్ప్లేలో 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లంకను కాసేపు కెప్టెన్ విమత్ దిన్సార (32; 4 ఫోర్లు), చమిక హీనతిగల (42; 3 ఫోర్లు) ఆదుకున్నారు. ఇద్దరు తర్వాతి 6 ఓవర్ల పాటు వికెట్ పడనీయకుండా నాలుగో వికెట్కు 45 పరుగులు జతచేశారు.ఆఖర్లో సేత్మిక సేనెవిరత్నే (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో లంక 130 పైచిలుకు స్కోరు చేయగలిగింది. యువ భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (7), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 9)లు విఫలమయ్యారు. 25/2 స్కోరు వద్ద లంక పండగ చేసుకుంది.విహాన్ మల్హోత్ర, ఆరోన్ జార్జ్ ధనాధన్అయితే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్ర (45 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాదీ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (49 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ శతకాలతో లంకేయుల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరు జట్టును గెలిపించేదాకా క్రీజును అట్టిపెట్టుకోవడంతో లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు.అబేధ్యమైన మూడో వికెట్కు విహాన్, ఆరోన్ 114 పరుగులు జోడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ విహాన్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వర్షం వల్ల ఈ యూత్ వన్డేను 20 ఓవర్లకు కుదించారు.పదకొండేళ్ల తర్వాతఇక మరో సెమీఫైనల్లో దుబాయ్లోని ది సెవెన్స్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా 8 వికెట్ల తేడాతోనే బంగ్లాదేశ్పై గెలుపొందింది. వర్షం కారణంగా 27 ఓవర్లకు మ్యాచ్ కుదించగా.. బంగ్లాదేశ్ 26.3 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 16.3 ఓవర్లలోనే పాకిస్తాన్ కేవలం రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. తద్వారా ఫైనల్కు అర్హత సాధించింది.కాగా పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ (అండర్–19లో) ఆసియా కప్ ఫైనల్లో తలపడనున్నాయి. చివరిసారిగా 2014లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ను ఓడించిన యువ భారత్ టైటిల్ సాధించింది. కాగా తాజా ఆసియా కప్ లీగ్ దశ మ్యాచ్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.వేదిక, టైమింగ్స్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటేభారత్- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్కు దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదిక. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు మ్యాచ్ మొదలు అవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్) యాప్లో ప్రత్యక్ష ప్రసారం.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్
వరల్డ్కప్ జట్టు ప్రకటన నేడే.. అతడికి నో ఛాన్స్!
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనే భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటించనుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా వరల్డ్ కప్నకు ఎంపికయ్యే జట్టే ఆడుతుంది.కాగా ఫిబ్రవరి 7న మొదలయ్యే వరల్డ్ కప్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్-2024లో చాంపియన్గా నిలిచిన తర్వాతి నుంచి తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనను (35 మ్యాచ్లలో 26 విజయాలు) చూస్తే టీమ్ ఎంపికలో ఎలాంటి సంచలనాలు ఉండే అవకాశం లేదు.కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదుకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటర్గా ఏడాదికి పైగా విఫలమవుతున్నా సరే... టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతడి కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు. విధ్వంసకర ఓపెనర్గా అదరగొడుతున్న అభిషేక్ శర్మకు.. వరుసగా విఫలమవుతున్నా సరే వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్నే జోడీగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక రిజర్వు ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి టాపార్డర్లో యశస్వి జైస్వాల్కు చోటు కష్టమే.రింకూ సింగ్కు మొండిచేయి!మరోవైపు.. ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్కు స్థానం ఇస్తే.. నయా ఫినిషర్గా సత్తా చాటిన రింకూ సింగ్కు మొండిచేయి తప్పకపోవచ్చు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ ఫినిషర్గా రాణిస్తున్నాడు. మరోవైపు.. జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే కూడా తమ వంతు సాయం అందించనున్నారు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు (అంచనా)అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు అతడు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు వార్తా సంస్థ PTIకి వెల్లడించాయి.కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma).. తొలుత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు.. అనంతరం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్య రీతిలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు ముందు అతడిని వన్డే కెప్టెన్సీ తప్పించింది బీసీసీఐ.మునుపెన్నడూ లేని విధంగాఈ క్రమంలో ఫిట్నెస్పై దృష్టి సారించిన రోహిత్ శర్మ.. దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. మునుపెన్నడూ లేని విధంగా మరింత ఫిట్గా మారి.. ఆసీస్ గడ్డ మీద శతకంతో చెలరేగిన హిట్మ్యాన్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డేల్లోనూ అదరగొట్టాడు. అయితే, ప్రస్తుతం రోహిత్తో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2027కి సిద్ధమయ్యే క్రమంలో రో-కో మ్యాచ్ ప్రాక్టీస్ గురించి చర్చలు వచ్చాయి. ఇలాంటి సమయంలో బీసీసీఐ భారత జట్టులోని ప్రతి సభ్యుడు కచ్చితంగా కనీసం రెండు దేశీ మ్యాచ్లు అయినా ఆడాలని ఆదేశించింది. రో-కోలకే కాకుండా ప్రతి ఒక్క ఆటగాడికి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఢిల్లీ జట్టులో విరాట్ కోహ్లి అయితే, ఎంసీఏ చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ శుక్రవారం మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ముంబై జట్టుకు అందుబాటులో లేడని తెలిపాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీకి ప్రకటించిన జట్టులో తొలి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేసింది. ఈ పరిణాల క్రమంలో శుక్రవారం రాత్రి ఎంసీఏ వర్గాలు మరోసారి రోహిత్ శర్మ విషయంపై స్పందిస్తూ.. అతడు కనీసం రెండు మ్యాచ్లకు అవైలబుల్గా ఉంటాడని స్పష్టం చేశాయి. కోహ్లి పేరు ప్రకటన తర్వాత రోహిత్ సైతం ఈ మేర యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముంబై జట్టుకు చెందిన టీమిండియా స్టార్లు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ శివం దూబే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. టీ20 ప్రపంచకప్-2026 దృష్ట్యా వారిద్దరికి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ముంబై మాజీ కెప్టెన్ అజింక్య రహానే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా డిసెంబరు 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ మొదలుకానుంది.చదవండి: విరాట్ కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త.. కెప్టెన్గా రిషభ్ పంత్
ధీరజ్కు రెండు పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ జాతీయ సీనియర్ ఆర్చ...
సాత్విక్–చిరాగ్ జోడీకి రెండో విజయం
హాంగ్జౌ: వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్...
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములే...
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు...
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
మరోసారి మెగా ఫైనల్లో భారత్- పాకిస్తాన్ తలపడనున్న...
వరల్డ్కప్ జట్టు ప్రకటన నేడే.. అతడికి నో ఛాన్స్!
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్ కప్-2026లో పాల్గొనే ...
రోహిత్ శర్మ యూటర్న్!
టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తన నిర్ణయా...
పంత్ కెప్టెన్సీలో కోహ్లి
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే...
క్రీడలు
#INDvsSA : టి20లో భారత్ గెలుపు ...సిరీస్ టీమిండియా సొంతం (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
వీడియోలు
సంజుపై వాతావరణం కూడా పగబట్టింది.. పొగ మంచు దెబ్బకు నాలుగో టీ20 రద్దు
IPL Auction 2026: ఈసారి కూడా కప్పు పాయే!
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
ఐపీఎల్ మినీ ఆక్షన్ ఎన్ని కోట్లంటే?
IPL 2026: ఐపీఎల్ మినీ వేలం
BCCI: అక్షర్ పటేల్ స్థానంలో అతడే
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
