Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs NZ: Gavaskar blames poor starts urges batters to learn from Kohli1
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!

న్యూజిలాండ్‌ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్‌కు తొలిసారి భారత్‌ వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్‌ సిరీస్‌ కోల్పోయేందుకు కారణమని గావస్కర్‌ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్‌లు ఎలా నిర్మించాలో విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్‌లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్‌లాంటి బ్యాటర్‌ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్‌ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్‌ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్‌ పేర్కొన్నారు. చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగు

Africa Cup Of Nations 2026: Senegal Beat Morocco Win trophy2
ప్రైజ్‌మనీ రూ. 90 కోట్ల 86 లక్షలు 

రబాట్‌ (మొరాకో): నాటకీయ పరిణామాల మధ్య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో సెనెగల్‌ జట్టు పైచేయి సాధించింది. రెండోసారి ఆఫ్రికా కప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో సెనెగల్‌ 1–0 గోల్‌ తేడాతో ఆతిథ్య మొరాకో జట్టును ఓడించింది. 2021లో తొలిసారి సెనెగల్‌ ఆఫ్రికా కప్‌ టైటిల్‌ను సాధించింది. ఈ ఓటమితో 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్రికా చాంపియన్‌గా నిలవాలని ఆశించిన మొరాకో జట్టుకు నిరాశే ఎదురైంది. డియాజ్‌ను తోసేసిన డియాఫ్‌మ్యాచ్‌ రెండో అర్ధభాగం స్టాపేజ్‌ సమయంలో మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడంపై దుమారం చెలరేగింది. ‘డి’ ఏరియా లోపల మొరాకో ప్లేయర్‌ బ్రహిమ్‌ డియాజ్‌ను సెనెగల్‌ ప్లేయర్‌ ఎల్‌ హాద్జి మలిక్‌ డియాఫ్‌ తోసేశాడు. దాంతో రిఫరీ జీన్‌ జాక్వెస్‌ మొరాకో జట్టుకు పెనాల్టీ కిక్‌ను ప్రదానం చేశాడు. నిరసనఈ నిర్ణయంతో సెనెగల్‌ ఆటగాళ్లతోపాటు మైదానంలోని ఆ జట్టు అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య కొంచెంసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. రిఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ సెనెగల్‌ ఆటగాళ్లు మైదానాన్ని కూడా వీడారు. టీవీ రిప్లేలు చూశాక మొరాకో జట్టుకు రిఫరీ పెనాల్టీ ఇవ్వడం సరైనదేనని తేలింది. దాంతో 14 నిమిషాల తర్వాత మళ్లీ సెనెగల్‌ ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. పెనాల్టిని గోల్‌గా మలిచి, కొన్ని నిమిషాలు సెనెగల్‌ను నిలువరిస్తే మొరాకో ఖాతాలో 50 ఏళ్ల తర్వాత ఆఫ్రికా కప్‌ చేరేది. కానీ అలా జరగలేదు. సువర్ణావకాశం చేజారిందిఈ టోర్నీలో 5 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన మొరాకో స్టార్‌ బ్రహిమ్‌ డియాజ్‌ పెనాల్టిని తీసుకోవడానికి వచ్చాడు. తీవ్రమైన ఒత్తిడిలో డియాజ్‌ బంతిని నేరుగా కొట్టడం... సెనెగల్‌ గోల్‌కీపర్‌ ఎడువార్డో మెండీ దానిని నిలువరించడం జరిగిపోయింది. దాంతో మొరాకో సువర్ణావకాశం చేజారింది. స్టాపేజ్‌ సమయం ముగియడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలోని నాలుగో నిమిషంలో కెపె్టన్‌ ఇద్రిసా గుయె అందించిన పాస్‌ను ‘డి’ ఏరియా లోపల అందుకున్న పాపె గుయె లక్ష్యానికి చేర్చడంతో సెనెగల్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు మొరాకో ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సెనెగల్‌ సమర్థంగా అడ్డుకొని టైటిల్‌ను ఖాయం చేసుకుంది. రూ. 90 కోట్ల 86 లక్షలు ఆఫ్రికా కప్‌ టైటిల్‌ సాధించిన సెనెగల్‌ జట్టుకు 1 కోటి డాలర్ల (రూ. 90 కోట్ల 86 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన మొరాకో జట్టు ఖాతాలో 40 లక్షల డాలర్లు (రూ. 36 కోట్ల 34 లక్షలు) చేరాయి. మూడో స్థానం పొందిన నైజీరియా జట్టుకు 25 లక్షల డాలర్లు (రూ. 22 కోట్ల 71 లక్షలు), నాలుగో స్థానంలో నిలిచిన ఈజిప్ట్‌ జట్టుకు 13 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 81 లక్షలు) లభించాయి. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన మాలి, ఐవరీకోస్ట్, అల్జీరియా, కామెరూన్‌ జట్లకు 8 లక్షల డాలర్ల (రూ. 7 కోట్ల 26 లక్షలు) చొప్పున అందజేశారు. 121 మొత్తం 24 జట్ల మధ్య గత డిసెంబర్‌ 21 నుంచి జనవరి 18 వరకు జరిగిన ఆఫ్రికా కప్‌ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌లు జరిగాయి. 121 గోల్స్‌ నమోదయ్యాయి. మొరాకో ప్లేయర్‌ బ్రహిమ్‌ డియాజ్‌ 5 గోల్స్‌తో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టోర్నీ ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డును సెనెగల్‌కు చెందిన సాదియోమానె గెల్చుకోగా... ‘ఉత్తమ గోల్‌కీపర్‌’గా మొరాకోకు చెందిన యాసిన్‌ బునుయ్‌ నిలిచాడు. 2027లో ఎక్కడంటే.... తదుపరి ఆఫ్రికా కప్‌ టోర్నీకి తొలిసారి మూడు దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2027లో జరిగే ఈ టోర్నీ కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో జరుగుతుంది. 69 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో రెండుసార్లు మాత్రమే రెండు దేశాలు సంయుక్తంగా (2000లో ఘనా–నైజీరియా; 2012లో ఈక్వెటోరియల్‌ గినీ–గాబోన్‌) ఆతిథ్యమిచ్చాయి. చదవండి: ఆమె మనిషి కాదు!

Royal Challengers Bengaluru beat Gujarat Giants by 8 wickets3
ప్లే ఆఫ్స్‌ చేరిన ఆర్సీబీ

వడోదర: బెంగళూరు... అదే జోరు! నవీ ముంబైలో ఇప్పటికే ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్‌ ఇలా డబ్ల్యూపీఎల్‌ ప్రత్యర్థులన్నింటిపై విజయాలు సాధించింది. ఇప్పుడు వేదిక వడోదరకు మారినా... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తీరేం మారలేదు! రెండో రౌండ్‌ విజయాలనూ మొదలుపెట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో సోమవారం జరిగిన పోరులో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్‌సీబీ 61 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. వరుసగా ఐదో విజయంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గౌతమి నాయక్‌ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేసింది. రిచా ఘోష్‌ (20 బంతుల్లో 27; 3 సిక్స్‌లు) వేగంగా పరుగులు చేసింది. స్మృతి మంధాన (23 బంతుల్లో 26; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. జెయింట్స్‌ బౌలర్లలో కాశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్‌నర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులే చేయగలిగింది. కెపె్టన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరిగా పోరాడింది. సయాలీ సత్‌గరే (3/21), నదిన్‌ డిక్లెర్క్‌ (2/17) చావుదెబ్బ తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్‌ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: గ్రేస్‌ హారిస్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) రేణుక 1; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్‌నర్‌ 26; జార్జియా వోల్‌ (బి) కాశ్వీ 1; గౌతమి (బి) గార్డ్‌నర్‌ 73; రిచా ఘోష్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) సోఫీ డివైన్‌ 27; డిక్లెర్క్‌ (నాటౌట్‌) 4; రాధ (సి) భారతి (బి) కాశ్వీ 17; శ్రేయాంక (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–69, 4–138, 5–142, 6–170. బౌలింగ్‌: రేణుక 4–0–23–1, కాశ్వీ గౌతమ్‌ 4–0–38–2, అష్లే గార్డ్‌నర్‌ 4–0–43–2, హ్యాపీ కుమారి 1–0–10–0, సోఫీ డివైన్‌ 4–0–25–1, జార్జియా వేర్‌హమ్‌ 1–0–13–0, తనూజ 2–0–20–0. గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (బి) సయాలీ 3; సోఫీ డివైన్‌ (సి) వోల్‌ (బి) సయాలీ 0; అనుష్క (సి) రాధ (బి) డిక్లెర్క్‌ 18; కనిక (బి) బెల్‌ 0; ఆష్లే గార్డ్‌నర్‌ (సి) రావత్‌ (బి) సయాలీ 54; కాశ్వీ (బి) రాధ 4; జార్జియా వేర్‌హమ్‌ (సి) సయాలీ (బి) డిక్లెర్క్‌ 2; భారతి (సి) హారిస్‌ (బి) శ్రేయాంక 14; తనూజ (నాటౌట్‌) 11; రేణుక (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 117. వికెట్ల పతనం: 1–3, 2–4, 3–5, 4–34, 5–48, 6–56, 7–97, 8–103. బౌలింగ్‌: లారెన్‌ బెల్‌ 4–1–23–1, సయాలీ 4–0–21–3, డిక్లెర్క్‌ 4–0–17–2, రాధ యాదవ్‌ 4–0–34–1, శ్రేయాంక 4–0–19–1.

Shubman Gill confirmed to play Ranji Trophy 4
‘రంజీ’ బరిలో గిల్‌

న్యూఢిల్లీ: భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ విశ్రాంతి తీసుకోకుండా వెంటనే రంజీ ట్రోఫీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. గిల్‌ సారథ్యంలోని టీమిండియా 1–2తో తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆదివారమే కివీస్‌తో ఈ సిరీస్‌ ముగిసింది. రోజుల వ్యవధిలోనే గురువారం నుంచి సౌరాష్ట్రతో తలపడే పంజాబ్‌ తరఫున రంజీ మ్యాచ్‌ బరిలోకి దిగేందుకు గిల్‌ సై అంటున్నాడు. 26 ఏళ్ల ఈ కెప్టెన్ విశ్రాంతి గురించి ఆలోచించడం లేదని, రాజ్‌కోట్‌లో జరిగే రంజీ పోరు కోసం ఇండోర్‌ నుంచి నేరుగా అక్కడికే పయనమవుతాడని పంజాబ్‌ జట్టు వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో మాదిరిగా ఈసారి కూడా రంజీ ట్రోఫీకి మధ్యలో విరామమిచ్చారు. ముస్తాక్‌ అలీ టి20, విజయ్‌ హజారే వన్డే టోరీ్నల కోసం రంజీలకు బ్రేక్‌ ఇచ్చారు. ఈ రెండు పరిమిత ఓవర్ల ఈవెంట్లు ముగియడంతో గురువారం నుంచి దేశవ్యాప్తంగా మిగిలిన రెండు రౌండ్‌ల రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్ని కొనసాగించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో పంజాబ్‌ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడింది. ఒక మ్యాచ్‌ గెలిచి మరో మ్యాచ్‌ ఓడింది. మిగతా మూడింటిని ‘డ్రా’ చేసుకున్న పంజాబ్‌ 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇంకా మూడే లీగ్‌ మ్యాచ్‌లున్నాయి. నాకౌట్‌ దశకు అర్హత సాధించాలంటే ఈ మూడు మ్యాచ్‌ల్నీ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. గిల్‌ రాకతో పంజాబ్‌ పటిష్టంగా మారింది.

Scotland could replace Bangladesh at next month T20 World Cup5
బంగ్లాదేశ్‌ ఆడకపోతే స్కాట్లాండ్‌కు అవకాశం! 

టి20 ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లను భద్రతాకారణాలతో భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్‌ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. తాము వరల్డ్‌ కప్‌ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్‌ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్‌ను మార్చి ఐర్లాండ్‌ మ్యాచ్‌ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్‌–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

Daryl Mitchell powers New Zealand to maiden ODI Series win6
భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగు

130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్‌పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డరైల్‌ మిచెల్‌ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్‌ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్‌పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్‌ ఒక్కడే భారత్‌లో భారత్‌పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్‌ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్‌కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ అందించి కివీస్‌ హీరోగా మారాడు. భారత్‌లో భారత్‌పై మిచెల్‌ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌ లీగ్‌ మ్యాచ్, సెమీఫైనల్‌లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్‌ రేట్‌తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్‌ ట్రోఫీలో కూడా లీగ్‌ మ్యాచ్‌లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్‌ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్‌లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో కూడా కివీస్‌ ఓడింది. సిరీస్‌కు సిద్ధమై... భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు మిచెల్‌ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్‌ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్‌ తరహాలో నెమ్మదైన పిచ్‌లు ఉండే లింకన్, మౌంట్‌ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్‌ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్‌ షాట్‌’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్‌ స్వీప్‌ల సాధన దీనికి అదనం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్‌ మీదుగా లాఫ్టెడ్‌ షాట్‌ ఆడటం. రాజ్‌కోట్‌ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్‌లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్‌ సమస్య పెరిగింది. కుల్దీప్‌ తొలి ఓవర్లోనే సిక్స్‌తో మొదలు పెట్టిన మిచెల్‌ ...అతని బౌలింగ్‌లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్‌ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్‌ ఒక సిరీస్‌లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్‌ కారణం. అన్ని ఫార్మాట్‌లలో... న్యూజిలాండ్‌ జట్టులో మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్‌ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్‌పై 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టెస్టు టీమ్‌లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్‌ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్‌ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ ఆరంభంలో స్పిన్‌ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో పాటు జూనియర్‌ స్థాయిలో పెర్త్‌లో ఎక్కువగా క్రికెట్‌ ఆడిన మిచెల్‌కు స్పిన్‌ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్‌–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్‌లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్‌లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్‌... ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు, మరో ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం

WPL 2026: RCB scored 178 for 6 against gujarat giants7
చెలరేగిన గౌతమి నాయక్‌.. ఆర్సీబీ భారీ స్కోర్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్‌ చేసింది.టాస్‌ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్‌ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్‌ ప్లేయర్‌ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్‌ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8) బ్యాట్‌ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వాల్‌ తలో పరుగు చేసి ఔట్‌ కాగా.. డి క్లెర్క్‌ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఎవరీ గౌతమి నాయక్‌..?మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్‌ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్‌) ఆల్‌రౌండర్‌ అయిన ఈమె​కు దేశవాలీ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో రత్నగిరి జెట్స్‌ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది.

ICC under 19 world cup 2026: Pakistan beat scotland by 6 wickets8
ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్‌

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ పతనాన్ని శాశించాడు. మొమిన్‌ కమర్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌ తలో వికెట్‌ తీశారు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన థామస్‌ నైట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్‌ (33), ఓల్లీ జోన్స్‌ (30), మను సరస్వత్‌ (25), రోరి గ్రాంట్‌ (21), ఫిన్లే కార్టర్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్‌కు సరస్వత్‌, ఫిన్లే జోన్స్‌ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్‌ ఖాన్‌ (75), అహ్మద్‌ హుసేన్‌ (47) పాక్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్‌ ఫర్హాన్‌ (18 నాటౌట్‌) పాక్‌ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అలీ హసన్‌ బలోచ్‌ 15, స్టార్‌ బ్యాటర్‌ సమీర్‌ మిన్హాస్‌ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో ఓల్లీ జోన్స్‌, సరస్వత్‌ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌ సూపర్‌-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ బుల్‌బులియా, జేసన్‌ రోల్స్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్‌ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది.

Pat Cummins Ruled Out Of Australia's Opening T20 World Cup Fixtures9
ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్‌ మూడు లేదా నాలుగో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్‌ వేగంగా పురోగతి సాధిస్తే ‍ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు. కమిన్స్‌ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్‌కప్ తొలి రెండు మ్యాచ్‌లు సహా, దానికి ముందు పాకిస్తాన్‌లో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్‌తో సిరీస్‌కు కమిన్స్‌ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడం​ లేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకైనా కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం​ ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్‌ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్‌కు దూరమైనా, ఆ జట్టు టైటిల్‌ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్‌లో ఆసీస్‌ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆసీస్‌ రెండో మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌..ఒమన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్‌-బిలో ఉంది. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్‌), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

T20 World Cup fresh twist, Pakistan to review participation amid Bangladesh issue10
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్‌కు వంత పాడుతున్న పాక్‌

2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రికెట్‌లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కార‌ణాల‌ను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో జరగబోయే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్‌ బోర్డు, భారత్‌లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్‌ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్‌లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోగా, భారత్‌లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్‌ ఆడబోమని ఓవరాక్షన్‌ చేస్తుంది. బంగ్లాదేశ్‌ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఎంట్రీతో ప్రపంచకప్‌లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంత‌కాలంగా బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య రాజకీయ ఉద్రిక్త‌లు నెల‌కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుద‌ల చేయ‌డంతో ఈ ఉద్రిక్త‌లు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువుల‌పై దాడులు పెరిగిపోతుండ‌డంతో బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.దీన్ని ఘోర అవ‌మానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్ పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను శ్రీలంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ‌ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదిక‌ల‌గా ఆడాల్సి ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement