Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli and Rohit Sharma fever grips Vadodara ahead of first ODI1
ప్రాక్టీస్‌లో టీమిండియా

వడోదర: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్‌లో కోహ్లి, రోహిత్‌ మంచి టచ్‌లో కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌ బంతులను ప్రాక్టీస్‌ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్‌ చాటుకున్నారు. కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కూడా నెట్స్‌లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్‌ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, మొహమ్మద్‌ సిరాజ్‌ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. వన్డే సిరీస్‌ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జరగనుంది.

PV Sindhu advances to Malaysia Open semis after Yamaguchi retires2
సెమీస్‌లో సింధు 

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత స్టార్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ అకానె యామగుచి (జపాన్‌)తో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ సింధు తొలి గేమ్‌ను 13 నిమిషాల్లో 21–11తో సొంతం చేసుకుంది. అనంతరం ప్రపంచ మూడో ర్యాంకర్‌ అకానె యామగుచి గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. దాంతో సింధును విజేతగా ప్రకటించారు. ఈ గెలుపుతో ముఖాముఖి రికార్డులో యామగుచిపై సింధు ఆధిక్యం 15–12కు పెరిగింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ వాంగ్‌ జి యి (చైనా)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 3–2తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 10–21, 21–23తో ఫజర్‌ అల్ఫియాన్‌–షోహిబుల్‌ ఫిక్రీ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సాతి్వక్‌–చిరాగ్‌లకు 9,062 డాలర్ల (రూ. 8 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6600 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

WPL 2026: Royal Challengers Bengaluru beat Mumbai Indians by 3 wickets3
WPL 2026: డిక్లెర్క్‌ ధమాకా 

ముంబై: నదైన్‌ డిక్లెర్క్‌... ఇటీవల వన్డే వరల్డ్‌ కప్‌లో చెలరేగిన ఈ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటింది. బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేసిన ఈ బెంగళూరు ప్లేయర్‌ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగింది. తమ జట్టుకు ఓటమి ఖాయమైన దశలో దూకుడైన బ్యాటింగ్‌తో గెలిపించింది. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా... డిక్లెర్క్‌ వరుసగా 6, 4, 6, 4 బాది ముగించింది. శుక్రవారం జరిగిన నాలుగో సీజన్‌ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్ ముంబైని ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజన (25 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలా కేరీ (29 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 49 బంతుల్లోనే 82 పరుగులు జోడించారు. డిక్లెర్క్‌ (4/26)కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డిక్లెర్క్‌ (44 బంతుల్లో 63 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగింది. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్‌ జెయింట్స్‌తో యూపీ వారియర్స్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ (రాత్రి గం. 7:30 నుంచి) తలపడతాయి. స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. సజన దూకుడు... డబ్ల్యూపీఎల్‌ నాలుగో సీజన్‌ మ్యాచ్‌ ‘మెయిడిన్‌ ఓవర్‌’తో మొదలు కావడం విశేషం. లారెన్‌ బెల్‌ వేసిన ఈ ఓవర్లో అమేలియా కెర్‌ (4) ఒక్క పరుగు కూడా తీయలేకపోయింది. అయితే లిన్సే స్మిత్‌ వేసిన తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లతో కమలిని ధాటిని ప్రదర్శించింది. స్మిత్‌ తర్వాతి ఓవర్లో కూడా కమలిని 2 ఫోర్లు కొట్టగా, నాట్‌ సివర్‌ (4) మరో ఫోర్‌ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై 34 పరుగులు చేసింది. పవర్‌ప్లే తర్వాత కమలిని, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (17 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి మూడో వికెట్‌కు 28 పరుగులు జోడించారు. వీరిద్దరిని నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్‌ చేసి బెంగళూరు పైచేయి సాధించింది. ఈ దశలో కేరీ, సజన కలిసి జట్టును ఆదుకున్నారు. 2, 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద సజన ఇచి్చన సులువైన క్యాచ్‌లను హేమలత, సయాలీ వదిలేయడం కూడా ముంబైకి కలిసొచి్చంది. రాధ యాదవ్‌ వేసిన ఓవర్లో కేరీ ఫోర్‌ కొట్టగా, ఆ తర్వాత సజన 6, 4 బాదడంతో 15 పరుగులు లభించాయి. ఆ తర్వాత సజన మరింత చెలరేగిపోయింది. అరుంధతి, డిక్లెర్క్‌ వేసిన వరుస ఓవర్లలో కలిపి 9 బంతుల వ్యవధిలో ఆమె 5 ఫోర్లు బాదడం విశేషం. ఎట్టకేలకు చివరి ఓవర్లో వీరిద్దరిని ఆర్‌సీబీ నిలువరించగలిగింది. తొలి బంతికి సజన, ఐదో బంతికి కేరీని డిక్లెర్క్‌ అవుట్‌ చేయగా... ఈ ఓవర్లో 5 పరుగులే వచ్చాయి. కీలక భాగస్వామ్యం... ఛేదనలో బెంగళూరుకు గ్రేస్‌ హారిస్‌ (12 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (13 బంతుల్లో 18; 4 ఫోర్లు) చక్కటి బౌండరీలతో మెరుగైన ఆరంభాన్నే అందించారు. కేరీ వేసిన మూడో ఓవర్లో వీరిద్దరు మరింత ధాటిగా ఆడారు. స్మృతి 2 ఫోర్లు కొట్టగా, హారిస్‌ సిక్స్, ఫోర్‌ బాదింది. ఫలితంగా ఈ ఓవర్లో 20 పరుగులు లభించాయి. అయితే తొలి వికెట్‌కు 23 బంతుల్లో 40 పరుగులు జోడించిన అనంతరం ఏడు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత కూడా బెంగళూరు బౌలర్లు పట్టు చేజారనీయలేదు. కేవలం మూడు పరుగుల వ్యవధిలో హేమలత (7)ను అమన్‌జోత్‌ అవుట్‌ చేయగా...అమేలియా తన మొదటి ఓవర్లోనే రాధ యాదవ్‌ (1), రిచా ఘోష్‌ (6)లను వెనక్కి పంపించింది. ఆ తర్వాత డిక్లెర్క్, అరుంధతి రెడ్డి (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. ఒకే ఓవర్లో అరుంధతి, శ్రేయాంక (1) అవుటైనా... డిక్లెర్క్‌ ఒంటి చేత్తో గెలిపించింది. 4, 36, 40 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదంనుంచి తప్పించుకున్న ఆమె దీనిని పూర్తిగా వాడుకుంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: అమేలియా (సి) అరుంధతి (బి) బెల్‌ 4; కమలిని (బి) శ్రేయాంక 32; నాట్‌ సివర్‌ (స్టంప్డ్‌) రిచా (బి) డిక్లెర్క్‌ 4; హర్మన్‌ప్రీత్‌ (సి) రిచా (బి) డిక్లెర్క్‌ 20; నికోలా కేరీ (సి) హేమలత (బి) డిక్లెర్క్‌ 40; సజన (సి) స్మతి (బి) డిక్లెర్క్‌ 45; అమన్‌జోత్‌ (నాటౌట్‌) 0; పూనమ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–21, 2–35, 3–63, 4–67, 5–149, 6–154. బౌలింగ్‌: బెల్‌ 4–1–14–1, లిన్సే 2–0–23–0, అరుంధతి 4–0–37–0, డిక్లెర్క్‌ 4–0–26–4, శ్రేయాంక 4–0–32–1, రాధ 2–0–21–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) షబ్నిమ్‌ (బి) నాట్‌ సివర్‌ 25; స్మృతి (సి) పూనమ్‌ (బి) షబి్నమ్‌ 18; హేమలత (ఎల్బీ) (బి) అమన్‌జోత్‌ 7; రిచా (సి) కేరీ (బి) అమేలియా 6; రాధ (బి) అమేలియా 1; డిక్లెర్క్‌ (నాటౌట్‌) 63; అరుంధతి (సి) అమేలియా (బి) కేరీ 20; శ్రేయాంక (బి) కేరీ 1; ప్రేమ (నాటౌట్‌) 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–40, 2–47, 3–62, 4–63, 5–65, 6–117, 7–121. బౌలింగ్‌: నాట్‌ సివర్‌ 4–0–47–1, షబి్నమ్‌ 4–0–26–1, కేరీ 4–0–35–2, అమన్‌జోత్‌ 3–0–18–1, అమేలియా కెర్‌4–0–13–2, సైకా 1–0–13–0.

Royal Challengers Bangalore won the first WPL match against Mumbai indians4
తొలి మ్యాచ్‌లో ఛాంపియన్‌కు షాక్.. ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సూపర్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఝలక్ ఇచ్చింది. ముంబయి నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఛేదనలో నదినే డి క్లార్క్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. కేవలం 44 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచింది. కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌లో ముంబయి క్రికెటర్ సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది. ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌తో రాణించింది.

Sajeevan Sajana  Firey Knock Helps Mumbai set 155-run target for Bengaluru to win5
చెలరేగిన సజన.. ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ముంబైని బ్యాటింగ్‌కు అహ్హనించింది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు.ముంబై జట్టు 11 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగుల‌కే 4 కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది.ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు.అయితే ముంబై ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సజన రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచే తప్పించుకుంది. రెండు సునాయస క్యాచ్‌లను ఆర్సీబీ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ

BCCI 1st Reaction On Bangladesh's Demand To Move Its T20 World Cup Matches Out Of India6
భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ

టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌కు రావడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరిన సంగ‌తి తెలిసిందే.అయితే అందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ విముఖ‌త చూపించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఇక ఈ విష‌యంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు.ఈ మీటింగ్‌లో బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీయ‌స్ లక్ష్మణ్ పాల్గోన్నారు. అయితే ఈ స‌మావేశంలో కేవ‌లం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించిన విష‌యాలు మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్లు దేవజిత్ సైకియా స్ప‌ష్టం చేశారు."కేవ‌లం సీఓఈ, క్రికెట్ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. దానిపై ఐసీసీయే తుది నిర్ణ‌యం తీసుకుంటుంది" సైకియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.కాగా ఇటీవ‌ల భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన ఉద్రిక్తలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే బంగ్లా స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. బంగ్లా అభ్యర్ధను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం.

Paul Stirling to lead, Lorcan Tucker his deputy as Ireland name T20 World Cup 2026 squad7
టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఐర్లాండ్‌ జట్టు ప్రకటన

భారత్‌, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ సారథ్యం వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ లొర్కాన్ టక్కర్ వ్యవహరించనున్నాడు.అయితే ఈ జ‌ట్టులో అన్నదమ్ముల జోడీలు ఉన్నాయి. మార్క్ అడైర్‌, రాస్ అడైర్‌తో పాటు హ్యారీ టెక్టర్‌, టిమ్ టెక్టర్‌ బ్రదర్స్‌ వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్, ఆల్ రౌండర్ కర్టిస్ కాంఫర్ స్టార్ ప్లేయర్లను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు.ఈ మెగా టోర్నీలో ఐర్లాండ్.. ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్‌లతో పాటు గ్రూపు-బిలో ఉంది. ఐరీష్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కోలంబో వేదికగా శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ఐర్లాండ్.. న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించింది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్‌ జట్టుపాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.చదవండి: BBL 2025-26: ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..

Travis Head And Cameron Green to miss remainder of BBL 2025-26 to prepare for T20 World Cup 20268
ట్రావిస్ హెడ్ కీలక నిర్ణయం..

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. యాషెస్ సిరీస్ ముగియడంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ ఇప్పటికే బ్రిస్బేన్ హీట్ జట్టులో చేరారు.ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్‌గా ఖవాజా వ్యవహరించనున్నాడు. జనవరి 10న సిడ్నీ థండర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లబుషేన్, ఖవాజా ఆడనున్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌, స్పిన్నర్ టాడ్ మర్ఫీ సిడ్నీ సిక్సర్స్ తరపున బరిలోకి దిగనున్నారు.హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌కు వీరద్దరూ అందుబాటులో ఉండనున్నారు. యాషెస్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' నిలిచిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత జనవరి 16న సిడ్నీతో జరిగే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ తరపున స్టార్క్ ఆడనున్నాడు.స్టార్క్ బీబీఎల్‌లో ఆడనుండడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలెక్స్ కారీ (అడిలైడ్ స్ట్రైకర్స్), జోష్ ఇంగ్లిష్‌ రిచర్డ్‌సన్ (పెర్త్ స్కార్చర్స్), బ్రెండన్ డాగెట్ (మెల్బోర్న్ రెనెగేడ్స్) కూడా తమ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.హెడ్‌, గ్రీన్ దూరం...అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్‌, కామెరూన్ గ్రీన్ దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి హెడ్‌ అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, గ్రీన్‌ పెర్త్‌ స్కార్చర్స్‌ తరపున ఆడాల్సి ఉండేది. కానీ వర్క్‌లోడ్‌ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరూ విశ్రాంతి తీసుకోనున్నారు. నేరుగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. హెడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో హెడ్ 629 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?

MI vs RCB WPL 2026: Mandhana opts to bowl, Both Teams Playing 11s9
WPL 2026: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026 సీజ‌న్‌కు తెర‌లేచింది. తొలి మ్యాచ్‌లో న‌వీ ముంబై వేదిక‌గా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి ‍మంధాన తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అయితే తొలి మ్యాచ్‌కు ముంబై స్టార్‌ ప్లేయర్‌ హీలీ మాథ్యూస్‌ దూరమైంది. అదేవిధంగా ఆసీస్‌ ప్లేయర్‌ నికోలా కారీ ముంబై తరపున డబ్ల్యూపీఎల్‌ అరంగేట్రం చేసింది. ఆర్సీబీ తరపున అయితే ఏకంగా ఆరుగురు అరంగేట్రం చేశాఉరు. గ్రేస్ హారిస్,లిన్సే స్మిత్, లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి స్టార్‌ ప్లేయర్లకు ఆర్సీబీ తరపున ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం.తుది జట్లుముంబై ఇండియన్స్: నాట్ స్కివర్-బ్రంట్, జి కమలిని(వికెట్ కీపర్‌), అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), అమంజోత్ కౌర్, నికోలా కారీ, పూనమ్ ఖేమ్నార్, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజీవన్ సజన, సైకా ఇషాక్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్‌), గ్రేస్ హారిస్, దయాళన్ హేమలత, రిచా ఘోష్(వికెట్ కీపర్‌), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, లిన్సే స్మిత్, లారెన్ బెల్ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్‌..ఇక డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ వేడుకను బీసీసీఐ ఘనం‍గా నిర్వహించింది. తొలుత మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు మహిళా సాధికారతపై ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్‌తో, యో యో హనీ సింగ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?

Predicted India Playing XI for 1st ODI vs NZ: Will Nitish Kumar Reddy join Shreyas Iyer in comeback?10
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్‌?

భార‌త పురుష‌ల‌ క్రికెట్ జ‌ట్టు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త్‌-న్యూజిలాండ్ మ‌ధ్య మూడు వ‌న్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డే వ‌డోద‌ర వేదిక‌గా ఆదివారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు త‌మ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ తిరిగి రావ‌డంతో జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు. అదేవిధంగా వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇటీవ‌ల జ‌రిగిన అన్ని ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో అత‌డు ఉత్త‌ర్ణీత సాధించాడు. దీంతో అత‌డు కూడా కివీస్‌తో సిరీస్‌లో ఆడ‌నున్నాడు. బ్రేస్‌వెల్ సార‌థ్యంలో కివీస్‌ జ‌ట్టు కూడా భార‌త్ గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. సిరీస్‌ను విజ‌యంతో ఆరంభించాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. అయితే ప‌ర్యాట‌క జ‌ట్టుతో పోలిస్తే టీమిండియా ప‌టిష్టంగా ఉంది. ఈ సిరీస్ కివీ స్టార్ ప్లేయ‌ర్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియ‌మ్స‌న్ దూర‌మ‌య్యారు. భార‌త్ మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో బ‌లంగా ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త తుది జ‌ట్టు కూర్పుపై ఓ లుక్కేద్దాం.య‌శ‌స్వికి నో ఛాన్స్‌..?సౌతాఫ్రికా సిరీస్‌కు శుభ్‌మ‌న్ గిల్ దూరంగా ఉండ‌డంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి య‌శ‌స్వి జైశ్వాల్ ఆరంభించాడు. గిల్ తిరిగి రావ‌డంతో ఓపెన‌ర్ జైశ్వాల్ బెంచ్‌కే ప‌రిమితం కానున్నాడు. మూడు, నాలుగు స్ధాన‌ల్లో విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్‌కు రానున్నారు.అయితే తుది జ‌ట్టులో ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. కాగా హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వ‌డంతో నితీశ్‌కు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు ద‌క్కింది. అదేవిధంగా రిష‌బ్ పంత్ మ‌రోసారి తుది జ‌ట్టులో చోటు ద‌క్కే సూచ‌న‌లు క‌న్పించ‌నున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగ‌నున్నాడు.సౌతాఫ్రికా సిరీస్‌లోనూ పంత్ బెంచ్‌కే ప‌రిమతం కావాల్సి వ‌చ్చింది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌గా ర‌వీంద్ర జడేజా చోటు ద‌క్కించుకోనున్నాడు. ఫాస్ట్ బౌల‌ర్ల కోటాలో హ‌ర్షిత్ రాణాపై జ‌ట్టు మెనెజ్‌మెంట్ న‌మ్మ‌కం ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత‌డితో పాటు అర్ష్‌దీప్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్ బంతిని పంచుకోనున్నారు. స్పెష‌లిస్టు స్పిన్న‌ర్‌గా కుల్దీప్ యాద‌వ్ ఉండ‌నున్నాడు.కివీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాదవ్‌, సిరాజ్‌చదవండి: WPL 2026: గుజరాత్‌ జెయింట్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement