ప్రధాన వార్తలు
పోలార్డ్ రాక.. మారిన ముంబై ఇండియన్స్ ఫేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అనూహ్య పరాజయాలు ఎదుర్కొని ఎలిమినేషన్ అంచున ఉన్న ముంబై ఇండియన్స్ కేప్టౌన్కు (MI Cape town) దిగ్గజ టీ20 ఆటగాడు కీరన్ పోలార్డ్ జీవం పోశాడు. రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ జాతీయ విధుల కోసం జట్టును వీడటంతో, అతని స్థానాన్ని భర్తీ చేసిన పోలీ.. నిన్న (జనవరి 16) సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్పై ఎంఐ గెలుపులో తనవంతు పాత్ర పోషించాడు.అప్పటికి 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండిన కేప్టౌన్.. పోలార్డ్ రాకతో తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పార్ల్ రాయల్స్, సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకోగా.. చివరి బెర్త్ కోసం ఎం కేప్టౌన్, జోబర్గ్ సూపర్ కింగ్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ పోటీపడుతున్నాయి.సన్రైజర్స్పై పోలార్డ్ తొలుత బంతితో (2-0-9-0), ఆతర్వాత బ్యాట్తో (14 బంతుల్లో 20; 2 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో కేప్టౌన్ ఈస్ట్రన్కేప్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్రన్కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగా.. కేప్టౌన్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు వికెట్లతో సత్తా చాటిన కేప్టౌన్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.బాష్తో పాటు ట్రెంట్ బౌల్ట్ (4-0-28-3), రబాడ (3-0-20-1), జార్జ్ లిండే (4-0-34-1) సత్తా చాటడంతో ఈస్ట్రన్కేప్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆఖర్లో మార్కో జన్సెన్ (42) రాణించడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈస్ట్రన్కేప్లో స్టార్ బ్యాటర్లు డికాక్ (0), బెయిర్స్టో (15), స్టబ్స్ (4) విఫలయ్యారు.ఛేదనలో కేప్టౌన్ కూడా తడబడింది. జన్సెన్ (4-0-23-2), ముత్తుసామి (3.2-0-25-2), నోర్జే (4-0-29-1), మిల్నే (3-0-26-1), కోల్స్ (2-0-13-1) సత్తా చాటి కేప్టౌన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే కీలక దశలో లిండే (31), పోలార్డ్ (20) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి కేప్టౌన్ను గెలిపించారు. అంతకుముందు రిజా హెండ్రిక్స్ (41) రాణించాడు. ఫలితంగా కేప్టౌన్ అతికష్టం మీద గట్టెక్కింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపుపై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత క్రికెట్లో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తొలగింపు చర్చలు మళ్లీ వేడెక్కాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తివారి ఆరోపణల ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కారణం. అగార్కర్ తీసుకున్న నిర్ణయంపై గంభీర్ ప్రభావం చూపాడు. అగార్కర్ బలమైన వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఒంటరిగా తీసుకోలేడు. ఈ సమయంలోనే గంభీర్ ప్రభావం చూపాడు. సాధారణంగానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చీఫ్ సెలెక్టర్ కోచ్ సూచనలు తీసుకుంటాడు. రోహిత్ వన్డే కెప్టెన్సీ తొలగింపులో ఇదే జరిగింది. రోహిత్కు జరిగిన అన్యాయానికి గంభీర్, అగార్కర్ బాధ్యత వహించాలి. రోహిత్ను తొలగించిన తీరు తనకు అభిమానిగా, మాజీ సహచరుడిగా చాలా బాధ పెట్టింది. అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీని, అంతకుముందే టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ను ఇలా తొలగించడం సబబు కాదు. రోహిత్ నుండి శుభ్మన్ గిల్కు వన్డే కెప్టెన్సీ బదిలీ చేసే ప్రక్రియ సాఫీగా జరగాల్సింది. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ వరకు రోహిత్ను కెప్టెన్సీలో కొనసాగించి, ఆతర్వాత గిల్కు బాధ్యతలు అప్పగించాల్సింది. 2027 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేయడం తగదని తివారి అభిప్రాయపడ్డాడు. తివారి చేసిన ఈ వ్యాఖ్యలతో గంభీర్–అగార్కర్ జంటపై మళ్లీ దృష్టి పడింది. నాయకత్వ మార్పులు ఎలా జరుగుతున్నాయి.. అవి సరైన రీతిలో కమ్యూనికేట్ అవుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కొన్ని నెలలకే కెప్టెన్సీ తొలగించబడ్డాడు. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రోహిత్ శర్మ వంటి విజయవంతమైన కెప్టెన్కు గౌరవప్రదంగా మార్చి ఉండాల్సిందనే వాదన బలపడుతుంది. గిల్ నియామకం భవిష్యత్తుకు సంకేతం అయినప్పటికీ, రోహిత్ను తొలగించిన తీరు గౌరవప్రదంగా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్ వెటరన్లు
దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్ అయితే మరీనూ. ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో (130 నాటౌట్, 67 నాటౌట్, 82, 110 నాటౌట్) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్ భాయ్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.మరో ఆసీస్ వెటరన్, టెస్ట్ ప్లేయర్గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్బాష్ లీగ్లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్ తాజా సెంచరీ చేసిన మ్యాచ్లోనే స్టీవ్ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.విరాట్ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్ పీక్స్లో ఉన్నప్పటి విరాట్ను గుర్తు చేస్తున్నాడు. విరాట్ గత 8 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు.వీరే కాకుండా ఫాబ్ ఫోర్లోని మరో వెటరన్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్ వెటరన్ బౌలర్ పేరు మిచెల్ స్టార్క్. స్టార్క్ తాజాగా ముగిసిన యాషెస్ 2025-26లో 5 మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్లో అతను బ్యాట్తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం.ప్రస్తుతం జో రూట్ వయసు 35, మిచెల్ స్టార్క్ వయసు 35, స్టీవ్ స్మిత్ వయసు 36, విరాట్ కోహ్లి వయసు 37, రోహిత్ శర్మ వయసు 38, డేవిడ్ వార్నర్ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్ తగలనుందని తెలుస్తుంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలంప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో జడేజా తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్లో 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో (8-0-44-0) సీన్ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్కు వేదిక అయిన రాజ్కోట్ జడేజాకు హోం గ్రౌండ్. కానీ, ఆ మ్యాచ్ తర్వాత జడేజా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.జడేజా ఫిట్గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా కామెంట్ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్ పటేల్ ఇదివరకే కర్చీఫ్ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది.
భారీ సెంచరీతో కదం తొక్కిన జడేజా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర ఫైనల్స్కు చేరింది. నిన్న (జనవరి 16) జరిగిన రెండో సెమీఫైనల్లో పంజాబ్పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జనవరి 18న జరిగే ఫైనల్లో విదర్భతో అమీతుమీకి సిద్దమైంది.ఓపెనర్ విశ్వరాజ్ జడేజా అజేయ శతకంతో చెలరేగి సౌరాష్ట్రను ఒంటిచేత్తో గెలిపించాడు. 127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేసి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. జడేజాకు గత మూడు మ్యాచ్ల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (87) పవర్ప్లేలోనే విధ్వంసం (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. అనంతరం అన్మోల్ప్రీత్ సింగ్ (105 బంతుల్లో 100) అద్భుతమైన శతకం సాధించాడు. అయితే మధ్యలో నమన్ ధీర్, నేహల్ వాధేరా వరుసగా ఔట్ కావడంతో పంజాబ్ రన్రేట్ దెబ్బతింది. చివర్లో రమన్దీప్ సింగ్తో కలిసి అన్మోల్ప్రీత్ కొన్ని బౌండరీలు సాధించినా, చేతన్ సకారియా (4/60) ధాటికి దిగువ వరుస కూలిపోయింది. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు జడేజా, హర్విక్ దేశాయ్ (64) శుభారంభాన్ని అందించారు. పవర్ప్లేలోనే వీరు 92 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 151/0కి చేరింది. అప్పటికే మ్యాచ్ దాదాపు సౌరాష్ట్ర వైపు మళ్లింది. దేశాయ్ ఔటైన తర్వాత కూడా జడేజా తన దూకుడు కొనసాగించాడు. కేవలం 74 బంతుల్లో శతకం పూర్తి చేసి, తర్వాత మరింత వేగంగా ఆడాడు. హార్విక్ ఔటయ్యాక వచ్చిన ప్రేరక్ మాంకడ్ (52*) కూడా జడేజాకు తోడుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలు చేరింది.
సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ కొట్టింది. నిన్న (జనవరి 16) జరిగిన తమ తొలి మ్యాచ్లో తమ కంటే మెరుగైన సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత సౌతాఫ్రికాను 238 పరుగులకే ఆలౌట్ చేసి, 28 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఖలీద్ అహ్మద్ (74), ఫైసల్ షినోజాదా (81), ఉజైరుల్లా నియాజాయ్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి ఆఫ్ఘనిస్తాన్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆతర్వాత అబ్దుల్ అజీజ్, ఖటిర్ స్టానిక్జాయ్ తలో 2, నూరిస్తానీ ఒమర్జాయ్, హఫీజ్ జద్రాన్ చెరో వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బేశారు. ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ ఫీలర్డు మైదానంలో పదరసంలా కదిలారు. ఏకంగా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లను రనౌట్ చేశారు.సౌతాఫ్రికా విషయానికొస్తే.. తొలుత బౌలింగ్లో బుయండా మజోలా, కోర్నే బోథా తలో 3, జేజే బస్సన్ ఓ వికెట్ తీసి రాణించారు. ఆతర్వాత బ్యాటింగ్లో జేసన్ రోల్స్ (98) అద్భుతంగా రాణించినా సౌతాఫ్రికాను గట్టెక్కించలేకపోయాడు. రోల్స్ సెంచరీకి ముందు రనౌట్ కావడంతో సౌతాఫ్రికా పరిస్థితి తారుమారయ్యింది. చివర్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒత్తిడికి లోనై అనవసరపు రనౌట్లయ్యారు. ఫలితంగా మ్యాచ్ను కోల్పోయారు. ఈ గెలుపు క్రెడిట్ ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లకే దక్కుతుంది.కాగా, ప్రపంచకప్లో భాగంగా నిన్ననే జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు కూడా బోణీ కొట్టాయి. ఇంగ్లండ్ పాకిస్తాన్ను.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ను చిత్తుగా ఓడించాయి. ఇవాళ (జనవరి 17) బంగ్లాదేశ్ భారత్తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఇదివరకే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో యూఎస్ఏపై ఘన విజయం సాధించింది.
శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్కు ఊహించని అవకాశం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమైన రవి బిష్ణోయ్కు ఊహించని ఆఫర్ వచ్చింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు ఎంపికైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడటంతో వారి స్థానాలు భర్తీ చేసే సువర్ణావకాశం వీరికి దక్కింది. శ్రేయస్, బిష్ణోయ్ను న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.జనవరి 21, 23, 25 తేదీల్లో జరగబోయే తొలి మూడు మ్యాచ్ల్లో శ్రేయస్ తిలక్ వర్మ స్థానంలో ఆడనున్నారు. తిలక్ ఐదు మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు మాత్రమే దూరమైన విషయం తెలిసిందే. బిష్ణోయ్ మాత్రం సిరీస్ మొత్తానికి సుందర్కు రీప్లేస్మెంట్గా ఉంటాడు. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానమేనని తెలుస్తుంది.సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. సుందర్కు స్కాన్స్లో సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అని తేలింది. దీంతో అతనికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది.శ్రేయస్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2023 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో ఆడారు. ఆతర్వాత అతను క్రమంగా టీమిండియా టీ20 సర్కిల్స్ నుంచి మాయమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించడంతో శ్రేయస్కు భారత టీ20 జట్టులో స్థానం కల్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తిలక్ గాయపడటంతో అతనికి ఊహించని విధంగా భారత టీ20 బెర్త్ దక్కింది. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్తో మొదటి మూడు టీ20ల్లో రాణిస్తే, ఆ సిరీస్ మొత్తానికి కొనసాగించడంతో పాటు ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ గత ఐపీఎల్లో 175.07 స్ట్రయిక్రేట్తో 604 పరుగులతో సత్తా చాటడంతో, తన జట్టు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఫైనల్స్కు కూడా చేర్చాడు.రవి బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఈ కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ చివరిగా 2025 జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత వరుణ్ చక్రవర్తి కారణంగా అతనికి అవకాశాలు రాలేదు. వరుణ్ దాదాపు ప్రతి మ్యాచ్లో రాణిస్తూ భారత స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని కబ్జా చేశాడు. దీంతో బిష్ణోయ్కు అవకాశాలు రాలేదు. తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో బిష్ణోయ్కు ఊహించని అవకాశం దక్కింది. తొలుత సుందర్ స్థానాన్ని మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. రియాన్ పరాగ్ పేరు పరిశీలనలో కూడా ఉండింది. అయితే ఊహించని విధంగా భారత సెలెక్టర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్కు అవకాశం కల్పించారు. బిష్ణోయ్ ఇప్పటివరకు భారత్ తరఫున 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు మ్యాచ్లు), రవి బిష్ణోయ్
క్వార్టర్స్లో ఓడిన లక్ష్యసేన్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఒకే ఒక్కడు లక్ష్యసేన్ మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరగా... అతనూ అంతకుమించి ముందంజ వేయలేకపోయాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21–17, 13–21, 18–21తో చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ యి చేతిలో పరాజయం చవిచూశాడు. 2021 ప్రపంచ చాంపియíÙప్ కాంస్య పతక విజేత అయిన లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో 21–19, 21–10తో జపాన్ ఆటగాడు కెంట నిషిమొతోపై అలవోక విజయం సాధించాడు. సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్, మాళవిక బన్సోద్ గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లలో పరాజయంపాలయ్యారు. పురుషుల సింగిల్స్లో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్)తో జరిగిన పోరులో శ్రీకాంత్ 14–21, 21–17, 17–21తో ఐదో సీడ్ ఫ్రాన్స్ ప్లేయర్ ధాటికి పరాజయం చవిచూశాడు. ప్రణయ్ కూడా 21–18, 19–21, 14–21తో ఎనిమిదో సీడ్ లోహ్ కియన్ యూ (సింగపూర్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్ హన్ యూవ్ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 22–20, 22–24, 21–23తో ఏడో సీడ్ లి యిజింగ్–లూయో జుమిన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. వివాదాస్పద నిర్ణయంతో.... పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 27–25, 21–23, 19–21తో ప్రపంచ 22వ ర్యాంకు జోడీ హిరోకి మిదొరికవ–క్యోహే యామషిత (జపాన్) చేతిలో ఓడింది. భారత, జపాన్ జోడీలు అప్పటికే చెరో గేమ్ గెలిచాయి. నిర్ణాయక గేమ్లో హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి దశలో స్కోరు 15–15 వద్ద దురదృష్టవశాత్తు నెట్కు సాత్విక్ తగిలాడు. దీంతో చైర్ అంపైర్ ప్రత్యర్థి జోడీకి పాయింట్ ఇచ్చాడు. వెంటనే దీనిపై అంపైర్కు సాత్విక్ వివరణ ఇచ్చాడు. చిరాగ్ వీడియో రిఫరల్ను పరిశీలించాలని కోరాడు. కానీ చైర్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో ఇది భారత జోడీ తిరిగి పుంజుకోకుండా చేసింది. ప్రతీ గేమ్లోనూ అసాధారణ పోరాటపటిమ కనబరిచిన అగ్రశ్రేణి భారత ద్వయం ఇంత జరిగినా కూడా తమ పరాజయానికి సాకుగా ఈ ప్రతికూలతను చెప్పనేలేదు. కీలకమైన సమయంలో ప్రత్యర్థి జోడీనే తమకన్నా మిన్నగా పాయింట్లు సాధించడం వల్లే ఓడిపోయామని సాత్విక్ జంట మ్యాచ్ ముగిసిన అనంతరం వెల్లడించింది.
జోరు మీదున్న భారత కుర్రాళ్లు
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్లో ఐదు సార్లు చాంపియన్ భారత జట్టు మరో టైటిల్ వేటలో తమ జోరు కొనసాగించేందుకు రెండో మ్యాచ్ బరిలోకి దిగుతోంది. నేడు (శనివారం) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్–19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెపె్టన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ బలంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక బ్యాటర్లు. మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్లో జట్టు బలం. దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్లతో జట్టు బౌలింగ్ కూడా పదునుగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్–19 టీమ్ అద్భుత ఫామ్లో ఉంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్లు నెగ్గడంతో పాటు ఆసియా కప్లో కూడా జట్టు ఫైనల్ చేరింది. గత 17 మ్యాచ్లలో భారత్ 14 గెలిచింది. తొలి మ్యాచ్లో అమెరికాను భారత్ చిత్తు చేయగా...టోర్నీలో బంగ్లాకు ఇదే తొలి మ్యాచ్. బంగ్లా టీమ్లో కెపె్టన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతావారికి పెద్దగా అనుభవం లేదు. హకీమ్తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్లోనూ రాణించిన జవాద్ అబ్రార్ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం ఉండగా... జింబాబ్వేలో పేస్కు అనుకూలించే పిచ్లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లా ఆశిస్తోంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్. భారత్ గెలుపు బోణీ... అండర్–19 వరల్డ్ కప్ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ సూదిని (52 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెనిల్ పటేల్ (5/16) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం పదే పదే వాన అంతరాయం కలిగించడంతో భారత్ ల్యన్ని డక్వర్త్ – లూయీస్ ప్రకారం 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (19), వైభవ్ సూర్యవంశీ (2) విఫలమైనా... అభిజ్ఞాన్ కుందు (41 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించాడు.
బెంగళూరు ‘హ్యాట్రిక్’
నవీ ముంబై: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా ఆడిన మూడు మ్యాచ్లు గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 32 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై నెగ్గింది. మొదట బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. రాధా యాదవ్ (47 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచా ఘోష్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. భారతి (20 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించింది. శ్రేయాంక పాటిల్ (5/23) ఐదు వికెట్లు తీయడం విశేషం. లీగ్లో నేడు ముంబైతో యూపీ తలపడనుంది.43 పరుగులకే 4 వికెట్లు! ఆరంభంలో గుజరాత్ కట్టుదిట్టమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్తో బెంగళూరును కష్టాల్లోకి నెట్టింది. గ్రేస్ హారిస్ (17), హేమలత (4)లను వరుస ఓవర్లలో కాశ్వీ గౌతమ్ అవుట్ చేసింది. తర్వాత స్మృతి మంధాన (5)ను రేణుక, గౌతమి (9)ని సోఫీ డివైన్ పెవిలియన్ చేర్చడంతో 5.3 ఓవర్లలో 43 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. ‘పవర్ ప్లే’లోనే పనైపోయిన బెంగళూరుకు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన రాధా కొత్త ఊపిరి పోసింది. రిచా ఘోష్తో కలిసి సులువుగా పరుగులు చక్కబెట్టింది. రిచా తన సహజశైలిలో చెలరేగగా, రాధ కూడా బౌండరీలు బాదింది. దీంతో 50 స్కోరుకు ముందే 4 వికెట్లను కోల్పోయిన బెంగళూరు మరో వికెట్ కోల్పోకుండానే 12.3 ఓవర్లలో వంద దాటేసింది. రాధ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. చివర్లో నదైన్ డిక్లెర్క్ (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుపులతో జట్టు భారీ స్కోరు చేసింది. ధాటిగా మొదలై... జెయింట్స్ లక్ష్యఛేదన ధాటిగా మొదలైంది. ఫోర్లు, భారీ సిక్సర్తో విరుచుకుపడిన బెత్ మూనీ (14 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత సోఫీ (8), కెప్టెన్ గార్డ్నర్ (3), కనిక (16), జార్జియా వేర్హమ్ (13) వరుసగా విఫలం కావడంతో 70/5 స్కోరు వద్ద జట్టు ఓటమి దిశగా పయనించింది. భారతి, తనూజ (21) చేసిన పరుగులతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. గురువారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గ్రేస్ (ఎల్బీ) (బి) కాశ్వీ 17; స్మృతి (సి) రాజేశ్వరి (బి) రేణుక 5; హేమలత (సి) శివాని (బి) కాశ్వీ 4; గౌతమి (ఎల్బీ) (బి) డివైన్ 9; రాధ (సి) వేర్హమ్ (బి) డివైన్ 66; రిచా (సి) గార్డ్నర్ (బి) వేర్హమ్ 44; డిక్లెర్క్ (సి) రాజేశ్వరి (బి) డివైన్ 26; అరుంధతి (నాటౌట్) 2; శ్రేయాంక (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–26, 2–33, 3–39, 4–43, 5–148, 6–179, 7–180. బౌలింగ్: రేణుక 4–0–41–1, కాశ్వీ 4–0–42–2, గార్డ్నర్ 4–0–32–0, డివైన్ 4–0–31–3, వేర్హమ్ 4–0–35–1. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (ఎల్బీ) (బి) శ్రేయాంక 27; డివైన్ (సి) అండ్ (బి) అరుంధతి 8; కనిక (ఎల్బీ) (బి) శ్రేయాంక 16; గార్డ్నర్ (సి) రిచా (బి) బెల్ 3; వేర్హమ్ (సి) రాధ (బి) డిక్లెర్క్ 13; భారతి (సి) గ్రేస్ (బి) బెల్ 39; కాశ్వీ (సి) గ్రేస్ (బి) శ్రేయాంక 18; తనూజ (సి) స్మృతి (బి) శ్రేయాంక 21; శివాని (సి) అరుంధతి (బి) బెల్ 0; రాజేశ్వరి నాటౌట్ 0; రేణుక (సి) అరుంధతి (బి) శ్రేయాంక 2; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 150. వికెట్ల పతనం: 1–34, 2–38, 3–46, 4–63, 5–70, 6–126, 7–139, 8–139, 9–148, 10–150. బౌలింగ్: లారెన్ బెల్ 4–0–29–3, లిన్సీ స్మిత్ 2–0–27–0, అరుంధతి 4–0–31–1, శ్రేయాంక 3.5–0– 23–5, డిక్లెర్క్ 3–0–30–1, రాధ 2–0–9–0.
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏ...
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్కు ఊహించని అవకాశం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్,...
జోరు మీదున్న భారత కుర్రాళ్లు
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్లో ఐదు సార్లు చాంపి...
బెంగళూరు ‘హ్యాట్రిక్’
నవీ ముంబై: మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళ...
‘సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్’కు సర్వం సిద్దం
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహ...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
