Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Arjun Tendulkar  Saaniya Chandhok Married Wedding Video Goes Viral1
ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఇంట శుభకార్యం జరిగింది. సచిన్‌- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్‌ అర్జున్‌ టెండుల్కర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌తో గురువారం అతడి పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గతేడాది నిశ్చితార్థంకాగా గతేడాది ఆగష్టులో అర్జున్‌- సానియా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితుల నడుమ గోప్యంగా ఈ వేడుక జరుగగా.. కొన్నిరోజుల తర్వాత సచిన్‌ టెండుల్కర్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఇటీవల అర్జున్‌- సానియా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.Saree, sunshine, and Sara’s signature glow."#SaraTendulkar #ArjunTendulkar #SachinTendulkar pic.twitter.com/cbNHRG0pR9— Nitika Sharma (@Nitika3012) March 5, 2026అంబానీ కుటుంబం ఆధ్వర్యంలోముకేశ్‌ అంబానీ కుటుంబం జామ్‌నగర్‌లో కాబోయే వధూవరుల కోసం పార్టీ ఏర్పాటు చేసింది. అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ వివాహం జరిగిన చోట అర్జున్‌- సానియాల పెళ్లి వేడుకలను ఆరంభించింది. గణేషుడి ఆశీర్వాదంతో పాటు అంబానీ కుటుంబం వీరికి శుభాకాంక్షలు అందజేసింది.ఈ సందర్భంగా నీతా అంబానీకి ధన్యవాదాలు తెలిపిన సచిన్‌ టెండుల్కర్‌.. కాబోయే కోడలిపై ప్రేమను కురిపించాడు. తన కుమారుడు అర్జున్‌.. అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకున్నాడని కొనియాడాడు. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని.. కలకాలం ఇలాగే జీవించాలని ఆకాంక్షించాడు.ముంబైలో పెళ్లి వేడుకఅనంతరం ముంబైలో మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు జరుగగా.. పెళ్లి వేడుక (Arjun Tendulkar- Saaniya Chandhok Wedding)గురువారం జరిగింది. కాగా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనుమరాలే సానియా చందోక్‌. ఆమె కూడా ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. సచిన్‌ కుమార్తె సారా టెండుల్కర్‌కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్‌ టెండుల్కర్‌ కంటే వయసులో ఓ ఏడాది పెద్ద.Sara Tendulkar dancing at the sangeet ceremony of her brother Arjun Tendulkar. 💃✨ pic.twitter.com/fltLHqIdYC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026ఇక అర్జున్‌ టెండుల్కర్‌ వివాహానికి దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని దంపతులు, సురేశ్‌ రైనా దంపతులు సహా భారత మాజీ క్రికెటర్లలో చాలా మంది సతీసమేతంగా విచ్చేశారు. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుక కోసం తరలివచ్చారు. వ్యాపార దిగ్గజం ముకేశ్- నీతా అంబానీ దంపతులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: మాజీ భార్యకు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా స్టార్‌ Arjun Tendulkar, the son of Sachin Tendulkar, got married to Saaniya Chandhok today in Mumbai.❤️Congratulations to Arjun and Saaniya. Best wishes for a happy life together. 💐 pic.twitter.com/HhkU9is64F— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 5, 2026

ICC Tournament Postponed Due To USA Israel Iran War2
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా

అమెరికా, ఇజ్రాయిల్‌–ఇరాన్ యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఇప్పటికే పాకిస్తాన్‌ షాహీన్స్‌-ఇంగ్లండ్‌ లయన్స్‌ మధ్య అబుదాబీలో జరగాల్సిన అనధికారిక వన్డే సిరీస్‌ రద్దు కాగా.. తాజాగా ఐసీసీ టోర్నీ వాయిదా పడింది. నేపాల్‌లోని ఖాట్మండు వేదికగా మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ICC Men’s Cricket World Cup League 2లో పలు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఈ మ్యాచ్‌లలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొనాల్సి ఉంది. వాయిదా విషయాన్ని క్రికెట్ నేపాల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.కాగా, ICC Men’s Cricket World Cup League 2 టోర్నీ ద్వారా 2027 వన్డే ప్రపంచకప్‌లో నాలుగు బెర్త్‌లు ఖరారవుతాయి. ఈ క్వాలిఫయర్‌ టోర్నీ వాయిదా ఆయా జట్ల అర్హత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లతో పాటు యూఎస్‌ఏ, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌, కెనడా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో యుద్దం పరోక్షంగానూ క్రికెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్దం కారణంగా గల్ఫ్‌లో దుబాయ్‌ సహా ప్రధాన విమానాశ్రయాలన్నీ మూసివేయడంతో టీ20 ప్రపంచకప్‌ 2026లో పాల్గొన్న పలు జట్లు స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోయాయి. మరోపక్క సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగించుకున్న పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు కూడా అక్కడే ఇరుక్కుపోయింది. ఈ విషయాలను ఐసీసీ దగ్గరుండి పరిశీలిస్తూ.. ఆయా జట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తుంది.

T20 World Cup 2026: 3 records that can be broken in today India vs England match3
భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 5) అ‍త్యంత​ కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్‌ ఉన్నా, ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్‌ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్‌లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.అత్యధిక టీమ్‌ టోటల్‌నేటి మ్యాచ్‌లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో అత్యధిక టీమ్‌ టోటల్‌ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్‌లో వాంఖడే మైదానంలోనే విండీస్‌పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్‌ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.డేంజర్‌లో విరాట్‌ రికార్డునేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్‌ సెమీఫైనల్లో విండీస్‌పై విరాట్‌ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌, నాటౌట్‌) నేటి వరకు టీ20 ప్రపంచకప్‌ నాకౌట్స్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.ఎవరు గెలిచినా రికార్డేనేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్‌కు చేరాయి. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్‌ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరగా.. ఇంగ్లండ్‌ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది.

Pakistan Player Misbehaves With A Female In T20 World Cup, Punished Brutally4
ప్రపంచకప్‌ సందర్భంగా పాక్‌ క్రికెటర్‌ అసభ్య ప్రవర్తన.. మహిళతో..!

పాకిస్తాన్‌ క్రికెటర్‌కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్‌ 2026 సందర్భంగా ఓ పాక్‌ క్రికెటర్‌ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్‌-8 దశలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్‌ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో ఓ పాక్‌ ఆటగాడు మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్‌ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్‌మెంట్‌కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం. మహిళను వేధించిన ఆ పాక్‌ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్‌మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.కాగా, పాక్‌ ఆటగాళ్లపై, సపోర్ట్‌ స్టాఫ్‌పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్‌ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్‌ దేశాల హోటల్‌ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్‌ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో పాక్‌ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్‌-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ సాధించి సెమీస్‌కు అర్హత సాధించి ఉండేది. అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్‌ చేసినా గెలిచినా, పాక్‌ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న కారణంగా గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. ఇదే న్యూజిలాండ్‌ జట్టు సెమీస్‌లో గ్రూప్‌-1 టాపర్‌ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

T20 WC 2026 SA VS NZ: A batting show from Tim Seifert and Finn Allen at Eden Gardens. Both are set to represent KKR in IPL 20265
ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న న్యూజిలాండ్‌ చిచ్చరపిడుగులు

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్‌ మినీ వేలంలో కేకేఆర్‌ ఫ్రాంచైజీ టిమ్‌ సీఫర్ట్‌ (రూ. 1.5 కోట్లు), ఫిన్‌ అల్లెన్‌ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ న్యూజిలాండ్‌ ఓపెనింగ్‌ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్‌ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్‌) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. మరో ఎండ్‌లో సీఫర్ట్‌ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్‌, సీఫర్ట్‌ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్‌ హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డన్స్‌లో కావడం​ విశేషం. అల్లెన్‌, సీఫర్ట్‌ విధ్వంసకాండ చూశాక కేకేఆర్‌ అభిమానుల్లో ఎక్కడలేని జోష్‌ వచ్చింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్‌కు అల్లెన్‌, సీఫర్ట్‌ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్‌ వచ్చే సీజన్‌లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్‌ సీజన్‌లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్‌ మరోసారి టైటిల్‌ ఎగరేసుకుపోవడం​ ఖాయం. దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్‌ను రెండో సారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో వీరిద్దరి ఫామ్‌ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు. తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అల్లెన్‌-సీఫర్ట్‌ జోడి.. ఈ ఎడిషన్లో 100 ప్లస్‌ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్‌ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్‌ రికార్డు నెలకొల్పింది. మొత్తంగా అల్లెన్‌-సీఫర్ట్‌ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్‌ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్‌ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్‌ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది.

T20 WC 2026 Semis: Shocking Scenes In SA vs NZ, Players, Fans, Commentators Shocked6
T20 WC 2026: సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో షాకింగ్‌ సన్నివేశం

సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మధ్య నిన్న (మార్చి 4) జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2026 తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షాకింగ్‌ సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్ తొలి బంతిలో కగిసో రబాడా వేసిన అద్భుత బంతికి టిమ్‌ సీఫర్ట్ క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా, ఓ బెయిల్‌ ఎగిరి ఏకంగా బౌండరీ రోప్‌పై పడింది. దీంతో ఆటగాళ్లు, అభిమానులు, వ్యాఖ్యాతలు అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరిగాయి.pic.twitter.com/ZjIVl2UxEz— crictalk (@crictalk7) March 4, 2026మ్యాచ్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం​ 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ ఫిన్‌ అల్లెన్‌ బీభత్సమైన సెంచరీతో (33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్‌) కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. టీ20 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ ఇదే తొలి సెంచరీ. ఈ సెంచరీతో అల్లెన్‌ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 77 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును మార్కో యాన్సెన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి ట్రిస్టన్‌ స్టబ్స్‌ (29) కాసేపు సహకరించాడు. అంతకుముందు డెవాల్డ్‌ బ్రెవిస్‌ (34) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. వీరు మినహా సౌతాఫ్రికా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. మార్క్రమ్‌ 18, డికాక్‌ 10, మిల్ర్‌ 6, బాష్‌ 2, రికెల్టన్‌, రబాడ డకౌటయ్యారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను రచిన్‌ (4-0-29-2), మ్యాట్‌ హెన్రీ (4-0-34-2), కోల్‌ మెక్‌కోంచి (1-0-9-2), ఫెర్గూసన్‌ (4-0-29-1), మిచెల్‌ సాంట్నర్‌ (4-0-25-0) దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టిమ్‌ సీఫర్డ్‌ (58), ఫిన్‌ అల్లెన్‌ (100 నాటౌట్‌) 9 ఓవర్లలో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. సీఫర్ట్‌ ఔటయ్యాక మరింత రెచ్చిపోయిన అల్లెన్‌ కేవలం బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. అతనికి రచిన్‌ (13 నాటౌట్‌) సహకరించాడు.2021 ఎడిషన్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరడం​ ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్‌ సాధించే అవకాశం వచ్చింది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ తమ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం పోరాడుతుంది.

Moeen Ali Barred From The Hundred 2026 After Supporting Pakistan Participation7
మొయిన్‌ అలీపై నిషేధం..!

ఇంగ్లండ్ వెటరన్‌ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్‌ లీగ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్‌ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు. నాలుగు సీజన్ల పాటు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌కు నాయకత్వం వహించిన మొయిన్‌కు ఈ అవమానం జరగడానికి చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. అతను పాక్‌ ఆటగాళ్లకు మద్దతు తెలపడం​. ఈసారి హండ్రెడ్ లీగ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లపై షాడో బ్యాన్‌ ఉంది. ఈ లీగ్‌లో మెజార్టీ ఫ్రాంచైజీలను భారతీయులు, ముఖ్యంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు చేజిక్కించుకోవడంతో పాక్‌ ఆటగాళ్లను తీసుకోకూడదని అనధికారిక నిర్ణయం జరిగింది. ఇలా జరగడాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌తో పాటు మొయిన్‌ అలీ కూడా వ్యతిరేకించాడు. ECB వివక్షకు వ్యతిరేకంగా కట్టుబడి ఉందని నమ్ముతున్నంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అలాగే దక్షిణాఫ్రికాలో జరిగిన జాతి వివక్షను ఉదాహరించి, ఇప్పుడు అదే విధమైన వివక్ష పాకిస్తాన్ ఆటగాళ్లపై జరుగుతోందని వ్యాఖ్యానించాడు. పాక్‌ ఆటగాళ్లకు మద్దతుగా మొయిన్‌ చేసిన ఈ వ్యాఖ్యలే అతన్ని ఏ హండ్రెడ్‌ లీగ్‌ ఫ్రాంచైజీ నామినేట్‌ చేయకపోవడానికి కారణంగా తెలుస్తుంది.మరి​న్ని కారణాలు..గత నిర్ణయాలు: గత సీజన్‌లో మొయిన్‌ CPL కోసం హండ్రెడ్‌ లీగ్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఈ చర్య లీగ్‌ పట్ల అతని కమిట్‌మెంట్‌ను ప్రశ్నార్థకంగా మార్చింది. అందుకే ఏ ఫ్రాంచైజీ అతన్ని నామినేట్‌ చేయలేదు. వేలం ధర: మొయిన్‌ బేస్ ప్రైస్ £75,000 ఉండటం ఫ్రాంచైజీలను వెనక్కి తగ్గేలా చేసింది. వయసు: సీజన్ ప్రారంభ సమయానికి అతని వయసు 39 ఏళ్లు అవుతుంది. నిలకడలేమి: మొయిన్‌ను ఈ సీజన్‌లో హండ్రెడ్‌ ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి మరో కారణం అతని నిలకడలేమి. మొయిన్‌ కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇతర లీగ్‌లలో ఆడేందుకు NOCలు పొందాడు. అయితే, ఇటీవల అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుని యార్క్‌షైర్ తరఫున T20 బ్లాస్ట్‌లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ నిలకడలేమే అతనికి మరో మైనస్‌గా మారింది.తలుపులు మూసుకుపోలేదు మొయిన్‌కు హండ్రెడ్ లీగ్‌ 2026 తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. జూన్‌లో జరిగే వైల్డ్ కార్డ్ సైనింగ్స్ ద్వారా అవకాశం లభించవచ్చు. ప్రతి ఫ్రాంచైజీ T20 బ్లాస్ట్ ప్రదర్శన ఆధారంగా £31,000 కాంట్రాక్ట్‌తో ఇద్దరు ఆటగాళ్లను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంపిక చేసుకుంటుంది. యార్క్‌షైర్ తరఫున మంచి ప్రదర్శన చేస్తే మొయిన్ మళ్లీ హండ్రెడ్ లీగ్‌లో కనిపించే అవకాశం ఉంది.

Finn Allen Breaks many records by his 33 balls hundred against south africa in T20 WC 2026 1st semi final8
33 బంతుల్లో శతకం.. రికార్డుల మోత మోగించిన కివీస్‌ యోధుడు

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నిన్న (మార్చి 4) జరిగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు చేరింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ కేవలం​ 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ ఫిన్‌ అల్లెన్‌ బీభత్సమైన సెంచరీతో కివీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అల్లెన్‌ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన సెంచరీ చేసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సెంచరీతో అల్లెన్‌ రికార్డుల మోత మోగించాడు.టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ.ఓవరాల్‌ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టుపై ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ.ఓవరాల్‌గా (ఫుల్‌ మెంబర్లు, సభ్య దేశాలు) టీ20ల్లో ఇది మూడో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.ఓవరాల్‌గా ఓ ఫుల్‌ మెంబర్‌ జట్టు తరఫున సికందర్‌ రజాతో (గాంబియాపై 33 బంతుల్లో శతకం) పాటు జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల చరిత్రలో తొలి శతకం.టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ.టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌తో (11 ఫోర్లు, 7 సిక్సర్లు) కలిసి ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీ కౌంట్‌ (10 ఫోర్లు, 8 సిక్సర్లు). ఓ టీ20 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు-20.టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌ లేదా ఫైనల్స్‌లో కనీసం 30 బంతులు ఆడిన కోటాలో విరాట్‌ కోహ్లితో పాటు అతి తక్కువ డాట్‌ బాల్స్‌ (3). టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తరఫున మూడో శతకం (మెక్‌కల్లమ్‌, ఫిలిప్‌).ఈ ఇన్నింగ్స్‌తో అల్లెన్‌ మరిన్ని చిన్నా చితకా రికార్డులను కూడా బ్రేక్‌ చేసి న్యూజిలాండ్‌ను ప్రపంచకప్‌ కల సాకారం చేసే దిశగా తీసుకెళ్లాడు. 2021 ఎడిషన్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరడం​ ఇదే మొదటిసారి. ఆ ఎడిషన్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం ఎదుర్కొని తృటిలో ప్రపంచ ఛాంపియన్‌ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కివీస్‌కు మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్‌ సాధించే అవకాశం వచ్చింది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో న్యూజిలాండ్‌ తమ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం పోరాడుతుంది.

Indias semi final match against England today9
భారత్‌ ఫైనల్‌ గురి

3-2 టి20 వరల్డ్‌ కప్‌లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్‌ 3 గెలిచి, 2 ఓడింది. గత టి20 ప్రపంచ కప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన సందర్భంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించే ముందంజ వేసింది. అంతకుముందు 2022 సెమీఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన ఇంగ్లండ్‌ ఆపై టైటిల్‌నూ సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి టైటిల్‌ పోరుకు ముందు ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీస్‌ సమరంలోనే ముఖాముఖికి సిద్ధమయ్యాయి. తాజా టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే రెండు జట్లూ కూడా ‘లోపాలు లేని అత్యుత్తమ ఆటతీరు’ను కనబర్చలేకపోయాయి. ఇంగ్లండ్‌ ప్రస్థానం తడబడుతూనే సాగగా... భారత్‌ కూడా తమపై ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. అయితే ఇక్కడి వరకు ఎలా వచ్చామన్నది ముఖ్యం కాదు మిగిలిన రెండు మ్యాచ్‌లు ఎలా గెలవడం అనేదే ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత్‌ సొంతగడ్డపై సత్తా చాటుతుందా లేక ఇంగ్లండ్‌ అనూహ్య ఫలితాన్ని సాధిస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించే క్రమంలో అసలైన నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. నేడు వాంఖెడే మైదానంలో జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన ప్రత్యర్థులతో పోలిస్తే ఇంగ్లండ్‌ మరీ బలంగా ఏమీ లేదు. అయితే నాకౌట్‌ మ్యాచ్‌ ఒత్తిడిని అధిగమించి టీమిండియా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ స్ఫూర్తిదాయక సారథ్యంలో ఇంగ్లండ్‌ ఒక్కో అడుగు వేస్తూ సెమీస్‌కు చేరింది. టి20 వరల్డ్‌ కప్‌ను రెండేసిసార్లు గెలుచుకున్న ఈ రెండు జట్లు మూడో టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకు వేసేందుకు నేటి పోరులో ఎలా చెలరేగుతాయో చూడాలి. మార్పుల్లేకుండా... పిచ్, వేదికతో సంబంధం లేకుండా భారత జట్టు అన్ని రకాలుగా ఈ మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉంది. కొత్తగా వ్యూహాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా బెస్ట్‌–11తో తుది జట్టు ఎంపిక కూడా ఖాయమైనట్లే. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మైదానంలో ఇంగ్లండ్‌పైనే అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఆటతో తన రాకను ఘనంగా ప్రదర్శించాడు. నాటి మ్యాచ్‌లో 54 బంతుల్లోనే 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో అతను ఏకంగా 135 పరుగులు సాధించాడు. ఇప్పుడు అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిషేక్‌ భావిస్తున్నాడు. విండీస్‌పై గత మ్యాచ్‌లో తడబడినా ఈసారి చెలరేగితే తిరుగుండదు. మరో ఓపెనర్‌ సంజు సామ్సన్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. అదే జోరు కొనసాగించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఆపై ఇషాన్, సూర్య, తిలక్‌లతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా జట్టు భారీ స్కోరు చేయడం ఖాయం. హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబేలు చివర్లో వేగంగా అందించే పరుగులు దీనికి అదనం. ఎనిమిదో స్థానంలో అక్షర్‌ పటేల్‌లాంటి ఆటగాడు ఉండటం టీమిండియా బలం. పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌ ఎప్పటిలాగే ఆరంభంలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలిగితే మన జట్టు పని మరింత సులువవుతుంది. అక్షర్‌తో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌ ఉన్న వరుణ్‌ చక్రవర్తిని ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కత్తి మీద సామే. ఇంగ్లండ్‌పై ఘనమైన రికార్డు ఉన్న స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించాలనే భావిస్తున్నా... ఎవరినీ పక్కన పెట్టలేని పరిస్థితి. బుధవారం సిద్ధి వినాయక ఆలయంలో అభిషేక్, అక్షర్, ఇషాన్‌ కీలకం విల్‌ జాక్స్‌... ఈ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ చాలా సాధారణ ఆటతీరు కనబర్చింది. అతి కష్టమ్మీద నేపాల్‌పై 4 పరుగులతో నెగ్గి ఆపై విండీస్‌ చేతిలో ఓడింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో కూడా స్వల్ప లక్ష్యాలను ఛేదించే క్రమంలో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై చచ్చీ చెడి గెలిచింది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా విధ్వంసకర ఆటకు చిరునామాగా నిలిచిన టీమ్‌ ఇప్పుడు అతి కష్టమ్మీద గెలుపు గీత దాటుతోంది. టోర్నీ మొత్తంలో బెస్ట్‌ ఓపెనింగ్‌ జోడీ అంటూ బరిలోకి దిగిన బట్లర్, ఫిల్‌ సాల్ట్‌ 7 మ్యాచ్‌లలో కలిపి 84 పరుగులే జోడించగలిగారు. ఏ మ్యాచ్‌లోనూ గరిష్టంగా నాలుగు ఓవర్లకు మించి వీరి భాగస్వామ్యం సాగలేదు. అయినా సరే మరో ప్రత్యామ్నాయం లేక మరోసారి జట్టు వీరినే నమ్ముకుంటోంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన బట్లర్‌ 7 మ్యాచ్‌లలో కలిపి చేసింది 62 పరుగులే! అయినా సరే, అతని స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ ఒక్క మ్యాచ్‌లోనైనా రావాలని ఇంగ్లండ్‌ కోరుకుంటోంది. బెతెల్, బాంటన్‌లను నమ్మే స్థితి లేకపోవడంతో కెప్టెన్ బ్రూక్‌ మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడటం అవసరం. ఆల్‌రౌండర్‌గా స్యామ్‌ కరన్‌ పెద్దగా ఆకట్టుకోకపోయినా....ఈ టోర్నీలో నాలుగు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు నెగ్గిన విల్‌ జాక్స్‌ కీలకం కానున్నాడు. ఆర్చర్‌తో పాటు రెండో పేసర్‌గా ఒవర్టన్‌పై భారం ఉంది. పిచ్‌ కొంత అనుకూలిస్తే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్, డాసన్‌ కూడా ప్రభావం చూపగలరని జట్టు నమ్ముతోంది. పిచ్, వాతావరణం వాంఖెడే పిచ్‌ మొదటి నుంచీ బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. మంచి బౌన్స్, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లకు అవకాశం ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్‌ ఇక్కడ ఆడగా... ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌లు ఆడింది. మంచు ప్రభావం ఉంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్‌ రోజున వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం సమస్య కలిగించినా...రిజర్వ్‌ డే ఉంది. 17-12 భారత్, ఇంగ్లండ్‌ మధ్య 29 టి20 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 17 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. తుది జట్లు (అంచనా) భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్, తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్ దీప్, బుమ్రా, వరుణ్‌. ఇంగ్లండ్‌: బ్రూక్‌ (కెప్టెన్ ), సాల్ట్, బట్లర్, బెతెల్, బాంటన్, కరన్, ఒవర్టన్, జాక్స్, డాసన్, ఆర్చర్, రషీద్‌.

New Zealand in the T20 World Cup 2026 final10
కివీస్‌ కిర్రాక్‌ షో

చోకర్స్‌... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్‌ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్‌ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్‌ మొదలు, సూపర్‌–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్‌ కొచ్చేసరికి చేతులెత్తేసింది. కోల్‌కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్‌లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్‌రేట్‌తో సెమీఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్‌ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిన్‌ అలెన్‌ (33 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. సఫారీ జట్టు మూగబోయింది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. కివీస్‌ బౌలర్లు మెక్‌కోన్‌కీ (2/9), రచిన్‌ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ అలెన్‌ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్‌ సీఫెర్ట్‌ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ (2021లో తొలిసారి రన్నరప్‌)... నేడు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్‌ కోసం తలపడుతుంది. టాపార్డర్‌ తడబాటు కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (18), డికాక్‌ (10), రికెల్టన్‌ (0) ఇలా టాప్‌–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్‌ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్‌ (6), అప్పటిదాకా టాప్‌స్కోరర్‌ అయిన బ్రెవిస్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్‌ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), యాన్సెన్‌ ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్‌ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. అలెన్‌ ధన్‌ ధనాధన్‌ తొలి ఓవర్లో సీఫెర్ట్‌ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్‌ ఫోర్‌ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్‌ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్‌ వేసిన పవర్‌ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్‌ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్‌ను దాటేశాయి. 6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్‌లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్‌ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్‌ స్ట్రోక్స్‌ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్‌ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్‌ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్‌ను అవుట్‌ చేశాడు. కానీ కివీస్‌ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్‌ సాఫల్యానికి ఆలస్యమైంది. అలెన్‌ దూకుడుతో న్యూజిలాండ్‌ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్‌ వేసిన 13వ ఓవర్లో అలెన్‌ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్‌ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్‌ లక్ష్యాన్ని కూడా చేరుకుంది. 33 టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అలెన్‌ రికార్డు నెలకొల్పాడు. క్రిస్‌ గేల్‌ (2016లో ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్‌ సవరించాడు.6 ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 18; డికాక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) మెక్‌కోన్‌కీ 10; రికెల్టన్‌ (సి) అలెన్‌ (బి) మెక్‌కోన్‌కీ 0; బ్రెవిస్‌ (సి) సాంట్నర్‌ (బి) నీషమ్‌ 34; మిల్లర్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 6; స్టబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 29; యాన్సెన్‌ (నాటౌట్‌) 55; బాష్‌ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్‌ (బి) హెన్రీ 0; కేశవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్‌: హెన్రీ 4–0–34–2, మెక్‌కోన్‌కీ 1–0–9–2, ఫెర్గూసన్‌ 4–0–29–1, నీషమ్‌ 3–0–42–1, సాంట్నర్‌ 4–0–25–0, రచిన్‌ రవీంద్ర 4–0–29–2. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (బి) రబడ 58; అలెన్‌ (నాటౌట్‌) 100; రచిన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 173. వికెట్‌ పతనం: 1–117. బౌలింగ్‌: యాన్సెన్‌ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్‌గిడి 2–0–22–0, బాష్‌ 2–0–35–0, కేశవ్‌ 3–0–33–0.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement