ప్రధాన వార్తలు
స్మృతి మంధాన కీలక నిర్ణయం
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్లో జరిగే 'ద హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. గత సీజన్కు వరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ ఒరిజినల్స్గా ఉండేది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా..మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70% వాటాను కొనుగొలు చేశారు. దీంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరును లక్నో సూపర్ జెయింట్స్గా మార్చారు. మాంచెస్టర్ జట్టులో మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. స్మృతికి 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది 2022 సీజన్లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా మంధాన నిలిచింది. ఇక మాంచెస్టర్ పురుషల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్ జూలై 21 నుంచి ఆరంభం కానుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
Under 19 World Cup 2026: భారత్ శుభారంభం
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్షోతో అదరగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.ఈ టార్గెట్ను భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభవ్ సూర్యవంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశపరిచినప్పటికి.. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌలర్లలో రిత్విక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో జనవరి 17న బంగ్లాదేశ్తో తలపడనుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అతడి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.వివాదానికి కారణం ఏంటంటే?ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు."ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: IND vs USA: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు.
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..
అండర్-19 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తీవ్ర నిరాశపరిచాడు. ఈ టోర్నీలో భాగంగా అమెరికాతో జరుగుతున్న మ్యాచ్లో సూర్యవంశీ తన మార్క్ చూపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది.దీంతో స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ తనదైన శైలిలో విరుచుకుపడతాడని అంతా భావించారు. కానీ 14 ఏళ్ల వైభవ్ మాత్రం తుస్సుమన్పించాడు. 2 పరుగులు చేసిన సూర్యవంశీ.. రిత్విక్ అప్పిడి బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ప్రత్యర్ధి జట్టు సంబరాల్లో మునిగితేలిపోయింది. బౌలింగ్లో మాత్రం వైభవ్ ఓ వికెట్ పడగొట్టాడు.వర్షం అటంకి..కాగా భారత్ లక్ష్య చేధనకు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4 ఓవర్లలో భారత్ స్కోర్ 21/1 వద్ద ఉండగా.. వర్షం అంతరాయం కలిగించింది. క్రీజులో అయూశ్ మాత్రే(15), త్రివేది(2) ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లలో హెనిల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిసెంబర్ 2025 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా స్టార్క్ ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్లో స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. యాషెస్ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో సొంతం చేసుకోవడంలో స్టార్క్ది కీలక పాత్ర.ఈ ఐదు టెస్టుల సిరీస్లో స్టార్క్ ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హాజిల్వుడ్ గాయాల కారణంగా దూరం కవడంతో.. పేస్ దళాన్ని స్టార్క్ ముందుండి నడిపించాడు. కేవలం బౌలింగ్లోనే కాకుండా, బ్యాటింగ్లోనూ అతడు సత్తాచాటాడు.బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో అతడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ కారణంగానే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం వెస్టిండీస్కు ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ పోటీపడ్డారు. కానీ వారిద్దరికంటే స్టార్క్ ప్రదర్శనలు మెరుగ్గా ఉండడంతో అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై స్టార్క్ స్పందించాడు."ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ విజయంలో భాగం కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా దృష్టి ఇప్పుడు 'ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్పై ఉంది" అని స్టార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ అవార్డును ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ గెలుచుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా డిసెంబర్ 2023లో పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు.చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
చెలరేగిన భారత బౌలర్లు.. 107 పరుగులకే అమెరికా ఆలౌట్
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా బులవాయో వేదికగా అమెరికాతో జరగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు యువ భారత బౌలర్ల ధాటికి 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టీమిండియా పేసర్ హెనిల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్తో అమెరికా నడ్డి విరిచాడు.హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. అమరీందర్ గిల్, అర్జున్ మహేష్ వంటి కీలక వికెట్లను హెనిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్గా నిలివగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్ల వివరాలు:భారత్: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, హెనిల్ పటేల్, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్, ఖిలాన్ పటేల్అమెరికా: సాహిల్ గార్గ్,అమరీందర్ గిల్, అర్జున్ మహేష్,ఉత్కర్ష్ శ్రీవాస్తవ,అద్నిత్ జంబ్, అమోఘ్ ఆరేపల్లి, నితీష్ సుదిని, ఆదిత్ కప్పా, శబరీష్ ప్రసాద్, రిషబ్ షింపీ, రిత్విక్ అప్సిడి
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే సమాధనం ఎక్కువగా వినిపిస్తోంది. జడేజా టెస్టు క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతడి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్లోనూ కేవలం 27 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ను ఎందుకు వన్డే జట్టులోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా పేలవ ఫామ్ గురుంచి కూడా అతడు మాట్లాడాడు."నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు. కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళంగా ఉన్నాడు.ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్కోట్ వన్డేలో భారత్కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అక్షర్ పటేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్షర్ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడొక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం బెటర్" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో మరోసారి భారత జట్టులో ఆల్రౌండర్ల కొరత కన్పిస్తోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేల నుంచి కూడా తప్పుకొనే అవకాశముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలా మంది మాజీలు సూచిస్తున్నారు.చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు.
ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్ జట్టు వరుసగా నాలుగో ఎడిషన్లో ప్లే ఆఫ్స్కు చేరింది. 2025-26 ఎడిషన్లో భాగంగా నిన్న (జనవరి 14) జోబర్గ్ సూపర్ కింగ్స్పై గెలుపుతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో అరంగేట్రం ఆటగాడు జేమ్స్ కోల్స్ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్కు గెలిపించాడు.తొలుత బ్యాటింగ్లో (34 బంతుల్లో 61; 10 ఫోర్లు) ఇరగదీసి, ఆతర్వాత బౌలింగ్లోనూ (4-0-34-2) సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. కోల్స్, డికాక్ (54) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లలో జానీ బెయిర్స్టో 18, మాథ్యూ బ్రీట్జ్కీ 3, జోర్డన్ హెర్మన్ 13, ట్రిస్టన్ స్టబ్స్ 23 (నాటౌట్) పరుగులు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో డొనొవన్ ఫెరియెరా 2, నండ్రే బర్గర్, అకీల్ హొసేన్, వియన్ ముల్దర్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో.. ముత్తుసామి (4-0-26-3), కోల్స్ (4-0-34-2), మార్కో జన్సెన్ (3.1-0-33-2), నోర్జే (4-0-13-1), ఆడమ్ మిల్నే (3-0-10-1) ధాటికి సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలో 117 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టు తరఫున 30 పరుగులు చేసిన జేమ్స్ విన్స్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఐదు మంది రెండంకెల స్కోర్లు చేయగలగినా, ఒక్కరే 20 పరుగుల మార్కును దాటారు. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టు సన్రైజర్స్. పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మిగతా ప్లే ఆఫ్స్ బెర్త్లక కోసం పోటీ పడుతున్నాయి.
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆసీస్-పాక్ మూడు టీ20లు ఆడనున్నాయి. ప్రపంచకప్కు సన్నాహకంగా ఇరు జట్లకు ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న లాహోర్కు చేరుకుంటుంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. ప్రపంచకప్లో పాల్గొనే ఆసీస్ జట్టే ఈ సిరీస్లోనూ కొనసాగనుంది. ప్రపంచకప్ కోసం పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది.ఆస్ట్రేలియా జట్టు 2022 మార్చిలో చివరిసారిగా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో టెస్ట్, టీ20 సిరీస్లను ఆసీస్ గెలుచుకోగా.. వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు సాగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీపడుతున్నాయి. పాకిస్తాన్.. టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో ఉండగా.. ఆ జట్టు ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. ఆస్ట్రేలియా గ్రూప్-బిలో ఉంది. పాకిస్తాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది.
T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్గా భారతీయుడు
ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్ దేశాల జట్లలో భారతీయులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్లలో సైతం భారతీయులు అవకాశాల కోసం పోటీపడుతున్నారు.న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. కనీసం ఒక్క భారత మూలాలున్న ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలికాలంలో సౌతాఫ్రికాలో సైతం భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్, యూఎస్ఏ, ఒమన్, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్-2026 కోసం ఎంపిక రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్ జట్టు కెప్టెన్గా జతిందర్ సింగ్.. కెనడా జట్టు కెప్టెన్గా దిల్ప్రీత్ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా.. తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు. వీరే కాక ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులో ఐష్ సోధి, రచిన్ రవీంద్ర, నెదర్లాండ్ జట్టులో ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.ఓవరాల్గా చూస్తే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్ కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం చాలామంది భారతీయులు ఉన్నారు.ఇదిలా ఉంటే, భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా దిల్ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు గ్రూప్-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.కెనడా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు: దిల్ప్రీత్ బజ్వా (C), అజయ్వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సమ్రా
12 ఏళ్ల తర్వాత భారత్కు ఫిఫా ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్లోకి అ...
ముగిసిన సింధు పోరాటం.. సెమీస్లో ఓటమి
మలేషియా ఓపెన్-2026లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
ఇక నుంచి రూ. 20 లక్షలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు...
ఆటుపోట్లను దాటుకుంటూ... అడ్డంకులు ఎదురైనా..
గ్రేటర్ నోయిడా: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన...
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు...
ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్
సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్ట్రన్కేప్...
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్-2026కు ముందు ఆస్ట్రేలియా జట్టు పాక...
T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్గా భారతీయుడు
ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్ జట్లలో భారతీయ మూల...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
భీమవరంలో పురోహితుల క్రికెట్ లీగ్.. పంచెకట్టులో బౌండరీ షాట్స్..!
అండర్-19 వరల్డ్ కప్ టీమ్ వచ్చేసింది.. అందరి కళ్లు అతడిపైనే..!
