Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India in the final battle of the T20 World Cup 20261
పరుగుల వరదతో ఫైనల్లోకి

భారత జట్టు స్కోరు 253 పరుగులు... ఇందులో 18 ఫోర్లు, 19 సిక్స్‌లు.. వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఏ జట్టూ కూడా ఇంత లక్ష్యాన్ని ఛేదించలేదు. ఇక గెలుపు లాంఛనమే, ఫైనల్‌ చేరడం ఖాయమనే అనిపించింది. కానీ ఇంగ్లండ్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. భారీ స్కోరును చూసి బెదిరిపోకుండా ఆ జట్టు కూడా 21 ఫోర్లు, 15 సిక్స్‌లతో ఆఖరి వరకూ పోరాడింది... కానీ అదృష్టవశాత్తూ టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగులతో సూర్యకుమార్‌ బృందం గట్టెక్కింది. గత మ్యాచ్‌ తరహాలోనే సంజు సామ్సన్‌ మరో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించగా... ఇంగ్లండ్‌ తరఫున జాకబ్‌ బెతెల్‌ శతకం జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. చివర్లో కట్టుదిట్టమైన మన బౌలింగ్‌ భారత్‌ను ఫైనల్‌కు చేర్చింది. టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు ఇక ఒకే ఒక్క విజయం భారత్‌కు కావాలి. ఆదివారం ఆఖరి సమరంలో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడమే టీమిండియాకు మిగిలింది. ముంబై: టి20 వరల్డ్‌ కప్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో భారత జట్టు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. వరుసగా రెండోసారి మన టీమ్‌ తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం వాంఖెడే మైదానంలో హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్‌ సమరంలో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సంజు సామ్సన్‌ (42 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా... శివమ్‌ దూబే (25 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడిపోయింది. జాకబ్‌ బెతెల్‌ (48 బంతుల్లో 105; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో పోరాడినా జట్టుకు ఓటమి తప్పలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడుతుంది. భారత్, కివీస్‌ మధ్య టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ జరగడం ఇదే తొలిసారి. పోటీ పడి సిక్సర్లు బాది... ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9) మరోసారి విఫలమైనా... సామ్సన్, ఇషాన్‌ భాగస్వామ్యంతో భారత్‌ దూసుకుపోయింది. ఆర్చర్‌ తొలి ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సామ్సన్‌ అతని రెండో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. మరోవైపు ఇషాన్‌ కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 67 పరుగులకు చేరింది. డాసన్‌ ఓవర్లో భారీ సిక్స్‌తో 26 బంతుల్లో సామ్సన్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, స్యామ్‌ కరన్‌ ఓవర్లో ఇద్దరూ కలిసి 20 పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు జోడించిన తర్వాత ఎట్టకేలకు ఇషాన్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. అయితే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహంతో బ్యాటింగ్‌లో ముందుగా దూబేను పంపిన భారత్‌ ఫలితం రాబట్టింది. రషీద్‌ ఓవర్లో 2 భారీ సిక్స్‌లతో అతను చెలరేగాడు. ఆ తర్వాత ఆర్చర్‌ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు బాదిన సామ్సన్‌ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్‌ (11) ఎక్కువసేపు నిలవలేకపోగా, ఒవర్టన్‌ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడు ఫోర్లు కొట్టాడు. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21; 3 సిక్స్‌లు) ఏకంగా మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 20వ ఓవర్లో పాండ్యా మరో 2 సిక్స్‌లు కొట్టడంతో స్కోరు 250 దాటింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్‌ 76 పరుగులు సాధించడం విశేషం. టాపార్డర్‌ విఫలం... భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆరంభంలోనే ఫిల్‌ సాల్ట్‌ (5) వికెట్‌ కోల్పోయింది. జోస్‌ బట్లర్‌ (17 బంతుల్లో 25; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్‌ (7), టామ్‌ బాంటన్‌ (17) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే బెతెల్‌ మాత్రం పోరాటపటిమ కనబర్చాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అతను వరుణ్‌ చక్రవర్తి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదడం విశేషం. పాండ్యా ఓవర్లోనూ అతను వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టాడు. మరోవైపు విల్‌ జాక్స్‌ (20 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బెతెల్‌కు సహకరించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 77 పరుగులు జోడించారు. జాక్స్‌ అవుటైన తర్వాత స్యామ్‌ కరన్‌ (18)తో కలిసి గెలిపించేందుకు బెతెల్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆఖరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఓవర్లు వేసిన బుమ్రా 14 పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్‌ భారత్‌ వైపు మళ్లింది. 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న బెతెల్‌... శివమ్‌ దూబే వేసిన చివరి ఓవర్‌ తొలి బంతికి రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు కోల్పోయింది. తర్వాతి ఐదు బంతుల్లో ఆర్చర్‌ (19 నాటౌట్‌) మూడు సిక్స్‌లు బాదినా లాభం లేకపోయింది. 17 ఓవర్ల వరకు ఇంగ్లండ్‌దే పైచేయి... దాదాపు అసాధ్యమైన లక్ష్యమే అయినా ఇంగ్లండ్‌ పూర్తిగా తడబడలేదు. వికెట్లు పడుతున్నా పరుగుల వేగం మాత్రం తగ్గించలేదు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లను పోలిస్తే 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. 10 ఓవర్లలో స్కోర్లు 119, 119తో సమంగా ఉండగా 15 ఓవర్లలో 177, 185తో ఇంగ్లండ్‌ ముందంజలో ఉంది. 17 ఓవర్లలో 205/4, 209/5తో వారిదే పైచేయి. అయితే చివరి 3 ఓవర్లు తేడా చూపించాయి. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో తిలక్‌ కొట్టిన 3 సిక్స్‌లు కీలకంగా మారాయి. దూబే వేసిన ఆఖరి ఓవర్లో 30 పరుగులు కాపాడుకోవాల్సి వచ్చింది కాబట్టి భారత్‌ బతికిపోయింది. మరికొన్ని పరుగులు తక్కువగా ఉన్నా కష్టమయ్యేది. సామ్సన్‌ క్యాచ్‌ వదిలేసి... గత మ్యాచ్‌ తరహాలో ఈసారి కూడా సామ్సన్‌ దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అయితే అతనికి ఈసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. సామ్సన్‌ 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆర్చర్‌ బౌలింగ్‌లో మిడాన్‌ వద్ద కెప్టెన్‌ బ్రూక్‌ అతి సునాయాస క్యాచ్‌ వదిలేశాడు. దానికి ఇంగ్లండ్‌ ఫలితం అనుభవించింది. క్యాచ్‌ చేజారడమే కాదు, ఈ క్షణం బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఇంగ్లండ్‌ లయను బాగా దెబ్బ తీసింది. అప్పటి వరకు పరిస్థితి నియంత్రణలోనే ఉన్నా ఆ తర్వాత భారత్‌ పరుగుల వరద మొదలైంది. ఈ క్యాచ్‌ను బ్రూక్‌ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. లైఫ్‌ లభించిన తర్వాత సామ్సన్‌ 36 బంతుల్లో 74 పరుగులు బాదాడు. ఆ ఒక్క ఓవర్లోనే... భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆటగాళ్లంతా ఏ బౌలర్‌ను వదలకుండా ప్రతీ ఓవర్లో బౌండరీలతో చెలరేగారు. అయితే జాక్స్‌ వేసిన ఒక్క 14వ ఓవర్‌ మాత్రమే దీనికి మినహాయింపు. ఈ ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా 7 పరుగులే ఇచ్చిన జాక్స్‌ తొలి బంతికే సామ్సన్‌ వికెట్‌ తీశాడు. అక్షర్‌ అదరహో... మైదానంలో అక్షర్‌ పటేల్‌ ఫీల్డింగ్‌ భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. ముందుగా సులువైన క్యాచ్‌ అందుకొని సాల్ట్‌ వెనుదిరిగేందుకు కారణమైన అక్షర్‌ ఆ తర్వాత అసాధారణ క్యాచ్‌తో బ్రూక్‌ను వెనక్కి పంపాడు. బుమ్రా వేసిన తొలి బంతికే బ్రూక్‌ షాట్‌ ఆడగా బంతి ఫీల్డర్లపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. కానీ పాయింట్‌ నుంచి అక్షర్‌ వెనుదిరిగి చాలా దూరం పరుగెత్తాడు. బంతి కిందకు పడిపోతున్న దశలో చేతులూ పూర్తిగా చాపి అందుకున్న అతను నేలపై పడినా పట్టు కోల్పోలేదు. అనంతరం కీలక దశలో బౌండరీ వద్ద పరుగెడుతూ వచ్చి జాక్స్‌ క్యాచ్‌ను అందుకున్న అతను పట్టు కోల్పోయి బౌండరీ దాటుతున్నట్లు అనిపించిన సమయంలో దూబే వైపు విసిరాడు. ఈ క్యాచ్‌తో మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ వైపు మొగ్గింది.5 టి20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్న ఐదో భారత క్రికెటర్‌ సంజు సామ్సన్‌. గతంలో యువరాజ్‌ సింగ్‌ (2007లో ఆ్రస్టేలియాపై సెమీఫైనల్లో), ఇర్ఫాన్‌ పఠాన్‌ (2007లో పాకిస్తాన్‌పై ఫైనల్లో), విరాట్‌ కోహ్లి (2014లో దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో; 2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో), అక్షర్‌ పటేల్‌ (2024లో ఇంగ్లండ్‌పై సెమీఫైనల్లో) ఈ ఘనత సాధించారు.4 ఐసీసీ టోర్నీల్లో అత్యధికంగా నాలుగోసారి భారత్‌–న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2007లో, 2024లో విజేతగా నిలిచిన భారత్‌ 2014లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.105 టి20 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెతెల్‌ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఫిన్‌ అలెన్‌ (100 నాటౌట్‌) స్కోరును బెతెల్‌ రెండో సెమీఫైనల్లో అధిగమించాడు.స్కోరు వివరాలు భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 89; అభిషేక్‌ (సి) సాల్ట్‌ (బి) జాక్స్‌ 9; ఇషాన్‌ కిషన్‌ (సి) జాక్స్‌ (బి) రషీద్‌ 39; దూబే (రనౌట్‌) 43; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 11; పాండ్యా (రనౌట్‌) 27; తిలక్‌ (బి) ఆర్చర్‌ 21; అక్షర్‌ (నాటౌట్‌) 2; వరుణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–20, 2–117, 3–160, 4–190, 5–212, 6–236, 7–251. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–61–1, జాక్స్‌ 4–0–40–2, ఒవర్టన్‌ 3–0–36–0, స్యామ్‌ కరన్‌ 4–0–53–0, ఆదిల్‌ రషీద్‌ 4–0–41–2, లియామ్‌ డాసన్‌ 1–0–19–0. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) అక్షర్‌ (బి) పాండ్యా 5; బట్లర్‌ (బి) వరుణ్‌ 25; హ్యారీ బ్రూక్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) బుమ్రా 7; బెతెల్‌ (రనౌట్‌) 105; బాంటన్‌ (బి) అక్షర్‌ 17; జాక్స్‌ (సి) శివమ్‌ దూబే (బి) అర్ష్ దీప్ 35; స్యామ్‌ కరన్‌ (సి) తిలక్‌ వర్మ (బి) హార్దిక్‌ పాండ్యా 18; ఒవర్టన్‌ (నాటౌట్‌) 2; ఆర్చర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 246. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–64, 4–95, 5–172, 6–222, 7–225. బౌలింగ్‌: అర్ష్ దీప్ సింగ్‌ 4–0–51–1, హార్దిక్‌ పాండ్యా 4–0–38–2, జస్‌ప్రీత్‌ బుమ్రా 4–0–33–1, వరుణ్‌ 4–0–64–1, అక్షర్‌ పటేల్‌ 3–0–35–1, శివమ్‌ దూబే 1–0–22–0.

Indias only day night pink ball Test against Australia begins today2
ఏకైక ‘టెస్టు’కు భారత్‌ రె‘ఢీ’

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనను టి20 సిరీస్‌ విజయంతో మొదలుపెట్టిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ మొదలవడంతోనే కంగారు పడింది. అన్నీ ఓడి వైట్‌వాష్‌ అయ్యింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత్‌కు మిగిలిందల్లా ఈ ‘టెస్టే’. నాలుగు రోజులపాటు జరిగే ఏకైక డే అండ్‌ నైట్‌ పింక్‌బాల్‌ టెస్టును గెలుచుకొని అత్యంత సంతృప్తికరంగా స్వదేశం చేరవచ్చు. ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో ఇరు జట్లు చెరో సిరీస్‌ గెలుచుకున్నాయి. అయితే పాయింట్ల పరంగా చూస్తే భారత అమ్మాయిలు బాగా వెనుకబడి ఉన్నారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ విజేతకు 2 పాయింట్లు లభించడంతో ఒక టి20, అన్నీ వన్డేలు గెలుపొందిన ఆ్రస్టేలియా 8 పాయింట్లతో పైచేయిగా ఉంది. రెండు టి20 విజయాలతో భారత్‌ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. ఇప్పుడు టెస్టు గెలిస్తేనే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడే భారత్‌ 8–8 పాయింట్లతో ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను పంచుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... ఆతిథ్య జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అజేయమే కానీ... ఇక్కడి వన్డే సిరీస్‌ను పక్కనబెడితే సంప్రదాయ ఫార్మాట్‌లో హర్మన్‌ బృందం అజేయంగా ఉంది. 2023 నుంచి ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై వరుసగా గెలిచింది. అయితే ఈ మూడు సొంతగడ్డపై జరిగాయి. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన ఫామ్‌లో ఉంది. ప్రతీకతో కలిసి చక్కని ఆరంభం ఇవ్వగలిగితే జెమీమా, హర్మన్, షఫాలీ వర్మ మిగతా బ్యాటింగ్‌ భారాన్ని పంచుకుంటారు. దీప్తి, రిచా ఘోష్‌లు కూడా ఆతిథ్య బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటే బ్యాటింగ్‌లో ఏ బెంగా ఉండదు. బౌలింగే మెరుగు పడాల్సి ఉంది. క్రాంతి, స్నేహ్‌ రాణా, సయాలీ, కాశీ్వలు సమష్టిగా రాణించాలి. ఆత్మవిశ్వాసంతో ఆసీస్‌ ఓడినా, గెలిచినా... సొంతగడ్డపై ఆ్రస్టేలియా దుర్బేధ్యమైన ప్రత్యర్థి. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు ‘పింక్‌ బాల్‌’ టెస్టులు ఇక్కడే జరిగాయి. డేనైట్‌ టెస్టులో ఈ జట్టుకున్నంత అనుభవం ఇంకే జట్టుకు లేదు. ఫోబీ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్‌ పెరీ, కెప్టెన్ అలీసా హీలీ సొంతగడ్డపై తప్పకుండా రాణిస్తారు. తాలియా, ల్యూసీ హామిల్టన్, అలనా కింగ్, డార్సీ బ్రౌన్‌లతో కూడిన బౌలింగ్‌ దళమైతే మనకంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌ తర్వాత అన్ని ఫార్మాట్‌ల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న అలీసా హీలీకి గెలుపు బహుమతి అందించాలని ఆసీస్‌ బృందం భావిస్తోంది. పిచ్, వాతావరణం ఇది పోటాపోటీ పిచ్‌. నాణ్యమైన బౌలింగ్‌కు... పాతుకుపోతే బ్యాటింగ్‌కు సమాన అవకాశముంది. దేశవాళీ షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో సీజన్‌ అంతా అదే జరిగింది. పచ్చికతో తొలిరోజు బౌలింగ్‌కు బాగా అనుకూలించడంతో బ్యాటర్లకు కష్టాలు తప్పవు. పిచ్‌ పాతబడే కొద్దీ స్పిన్నర్లు మాయ చేస్తారు. తుది జట్లు (అంచనా) భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, షఫాలీ, జెమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్‌/సయాలీ, కాశ్వీ గౌతమ్, స్నేహ్‌ రాణా, క్రాంతి గౌడ్‌. ఆ్రస్టేలియా: అలీసా హీలీ (కెప్టెన్ ), ఫోబీ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎలీస్‌ పెరీ, అనాబెల్‌ సదర్లాండ్, బెత్‌ మూనీ, యాష్లీ గార్డ్‌నర్, తాలియా, అలానా కింగ్, ల్యూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్‌.

Arjun Tendulkar wedding in grand style3
ఘనంగా అర్జున్‌ టెండూల్కర్‌ వివాహం

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు, యువ క్రికెటర్‌ అర్జున్‌ టెండూల్కర్‌ ఒక ఇంటి వాడయ్యాడు. 26 ఏళ్ల అర్జున్‌ వివాహం గురువారం సానియా చందోక్‌తో ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన దేశంలోని ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ కుటుంబం, భారత మాజీ క్రికెటర్లు ధోని, రాహుల్‌ ద్రవిడ్, అనిల్‌ కుంబ్లే, వీరేంద్ర సెహ్వగ్, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్, కైఫ్, జహీర్‌ ఖాన్, ఐసీసీ చైర్మన్‌ జై షా, సినీ తారలు అమితాబ్‌ బచ్చన్, షారుఖ్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్‌ తదితరులంతా అతిథులుగా పెళ్లిలో పాల్గొన్నారు. ఆల్‌రౌండర్‌ అర్జున్‌ దేశవాళీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 77 మ్యాచ్‌లు ఆడాడు.

Lakshya Sen in the quarterfinals of the All England Badminton Championship4
క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ షి యుకీ (చైనా)ను బోల్తా కొట్టించిన లక్ష్య సేన్‌... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 81 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–23, 21–10తో గెలుపొందాడు. గతంలో లాంగ్‌ అంగుస్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిపోయిన లక్ష్య సేన్‌ నాలుగో ప్రయత్నంలో విజయం అందుకోవడం విశేషం. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా)తో ఆడతాడు. టాంగ్‌ చున్‌ మన్‌–సె యింగ్‌ సుయెట్‌ (హాంకాంగ్‌)లతో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో 8–9తో వెనుకబడిన దశలో భారత జోడీ గాయంతో వైదొలిగింది.

T20 World Cup 2026 Semis: India Beat England Thriller Enters Final5
నరాలు తెగే ఉత్కంఠ: టీమిండియా ధనాధన్‌ షో.. .. దర్జాగా ఫైనల్‌కు

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.253 పరుగులుముంబైలోని వాంఖడేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ మరోసారి ధనాధన్‌ దంచికొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులతో ఈ వికెట్‌ కీపర్‌బ్యాటర్‌ అదరగొట్టాడు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39) కూడా వేగంగా ఆడగా.. ఆల్‌రౌండర్లు శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపులు మెరిపించారు. తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) సైతం రాణించాడు.ఇంగ్లండ్‌ బౌలర్లలో విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్‌కు ఒక వికెట్‌ దక్కింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (5), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (7)​ వికెట్లు కోల్పోయింది.పట్టువదలని విక్రమార్కుడిలాఇక టామ్‌ బాంటన్‌ (17) కాసేపు నిలబడగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా జేకబ్‌ బెతెల్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో పాతుకుపోయాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం బాది.. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్‌ అలెన్‌ (న్యూజిలాండ్‌) రికార్డు సమం చేశాడు.నరాలు తెగే ఉత్కంఠఅదే జోరు కొనసాగిస్తూ బెతెల్ భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. అయితే, పద్దెనిమిదో ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ క్రమంలో రెండు ఓవర్లలో ఇంగ్లండ్‌ విజయ సమీకరణం 39 పరుగులుగా మారింది.అయితే, హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పందొమ్మిదో ఓవర్లో సిక్స్‌ బాది బెతెల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 బంతుల్లోనే 102 పరుగులు సాధించాడు. దీంతో ఉత్కంఠ పెరిగింది. అయితే, పాండ్యా మూడో బంతికి సామ్‌ కర్రాన్‌ (18)ను అవుట్‌ చేశాడు. పాండ్యా బౌలింగ్‌లో కర్రాన్‌ బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న తిలక్‌ అద్భుతంగా క్యాచ్‌పట్టాడు.ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోతన ఓవర్లో పాండ్యా 9 పరుగులే ఇవ్వగా.. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్‌ గెలుపునకు 30 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని శివం దూబేకు ఇచ్చాడు. అతడి ఓవర్లో తొలి బంతికే బెతెల్‌ (105) రనౌట్‌ అయ్యాడు. దీంతో ఐదు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ 22 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్చర్ ఆఖరి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టినా లాభం లేకుండా పోయింది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో ట్రోఫీ కోసం సూర్యకుమార్‌ సేన తలపడుతుంది.స్కోర్లు: భారత్ - 253/7(20)ఇంగ్లండ్ - 246/7(20)ఫలితం: ఏడు పరుగుల తేడాతో భారత్ గెలుపు.

T20 WC 2026: India Creates History Becomes 1st Team in World To6
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్‌ రికార్డు

టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్‌ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ఐదు సార్లు👉వెస్టిండీస్‌- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

PCB Reshuffles selection committee again after T20 WC exit7
పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలక పరిణామం.. ఈసారి..

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. సెలక్టర్‌ పదవికి అలీం దర్‌ రాజీనామా చేయగా.. అతడి స్థానంలో ఇద్దరిని సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ జట్టు విఫలమైన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్‌ చేరకుండానేగ్రూప్‌ దశలో ఫర్వాలేదనిపించిన సల్మాన్‌ ఆఘా బృందం.. సూపర్‌-8లో మాత్రం చేతులెత్తేసింది. ఫలితంగా సెమీ ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టుపై.. ముఖ్యంగా సీనియర్లు బాబర్‌ ఆజం (Babar Azam), షాబాద్‌ ఖాన్‌, షాహిన్‌ ఆఫ్రిదిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.అలీం దర్‌ రాజీనామాఈ క్రమంలో సెలక్టర్‌, మాజీ అంపైర్‌ అలీం దర్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. శ్రీలంకలో తమ మ్యాచ్‌ల దృష్ట్యా హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ (Mike Hesson), మరో సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ బాబర్‌, షాదాబ్‌లను ఆడించాలని పట్టుపట్టగా.. అలీం మాత్రం వ్యతిరేకించినట్లు సమాచారం.అంతేకాదు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక చేయాలని అలీం వాదించగా.. మిగతా వారు అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలతో నొచ్చుకున్న అలీం దర్‌ తన పదవికి రాజీనామా చేశాడు.సెలక్టర్లు మాజీ కెప్టెన్లు ఈ నేపథ్యంలో పీసీబీ ఇద్దరిని జాతీయ సెలక్షన్‌ కమిటీలో చేర్చింది. మాజీ కెప్టెన్లు మిస్బా ఉల్‌ హక్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు మెన్స్‌ సెలక్షన్‌ కమిటీలో చోటు ఇచ్చింది. కాగా ఆకిబ్‌ జావేద్‌, అసద్‌ షఫీక్‌లతో కలిసి వీరిద్దరు సెలక్టర్లుగా పనిచేయనున్నారు. కాగా అలీం దర్‌ గతేడాది అక్టోబరులో పాక్‌ పురుషుల జట్టు కెప్టెన్‌గా వచ్చాడు. అయితే, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ అతి జోక్యం, ఆకిబ్‌ జావేద్‌ అతడికే వంతపాడిన నేపథ్యంలో విసుగు చెంది రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా జియో సూపర్‌ వెల్లడించింది.గతంలో ఇలా..ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ అహ్మద్‌ గతంలో పాకిస్తాన్‌ అండర్‌-19 జట్టు పాక్‌ షాహీన్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. మరోవైపు.. మిస్బా ఉల్‌ హక్‌ గతంలో పాక్‌ జట్టు హెడ్‌కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలే నిర్వర్తించాడు. అంతేకాదు.. పీసీబీ క్రికెట్‌ టెక్నికల్‌ కమిటీలో సభ్యుడిగానూ సేవలు అందించాడు. ఇప్పుడు మరోసారి సెలక్టర్‌గా తిరిగి వచ్చాడు. ఇక బాబర్‌, షాదాబ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2026: రషీద్‌ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌

T20 WC 2026 Semis IND vs ENG: Sanju Scripts History Breaks Rohit Record8
T20 WC 2026: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ అదరగొట్టాడు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మూడో ఓవర్లో తనకు లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.Ohhhhh, Harry Brook! 😳Sanju Samson makes the most of the lifeline and sends it into the stands! 🚀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/zOWfIEAdUv— Star Sports (@StarSportsIndia) March 5, 2026మరోసారి సెంచరీ మిస్‌అయితే, దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు ఫామ్‌లేమితో సతమతమైన సంజూ ఓపెనర్‌గా జట్టులో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ అతడి స్థానాన్ని భర్తీ చేసి అదరగొట్టాడు.అయితే, మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరం కాగా.. తొలిసారి సంజూకు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో వేగంగా ఆడిన సంజూ 8 బంతుల్లో 22 పరుగులు చేసి అవుటయ్యాడు.అనంతరం సూపర్‌-8 జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా తిరిగి తుదిజట్టులోకి వచ్చిన సంజూ.. 15 బంతుల్లో 24 రన్స్‌ చేయగలిగాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ ఈసారి సంజూపై నమ్మకం ఉంచింది. ఈ ‍క్రమంలో వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజూ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌ను గెలిపించి సెమీ ఫైనల్‌కు చేర్చాడు. అయితే, మూడు పరుగులతో అక్కడ సెంచరీ మిస్సయ్యాడు.8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టితాజాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ సంజూ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో పద్నాలుగో ఓవర్లో విల్‌ జాక్స్‌ బౌలింగ్‌కు దిగాడు. అతడి బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించిన సంజూ.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించి.. సెంచరీకి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Just Hardik Pandya things at the Wankhede Stadium! 🔥🚨 RECORD ALERT: 19 sixes by #TeamIndia - the most in an innings in ICC Men's T20 World Cup history!ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/JdGVdpz1B4— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఇక ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9)తో కలిసి తొలి వికెట్‌కు 20 పరుగులు జోడించిన సంజూ.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (39)తో కలిసి రెండో వికెట్‌కు 45 బంతుల్లో 97 పరుగులు, శివం దూబేతో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది.చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.టీ20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు👉సంజూ శాంసన్‌- 16 సిక్స్‌లు- 2026లో👉రోహిత్‌ శర్మ- 15 సిక్స్‌లు- 2024లో👉శివం దూబే- 15 సిక్స్‌లు- 2026లో👉ఇషాన్‌ కిషన్‌- 14 సిక్స్‌లు- 2026లో👉హార్దిక్‌ పాండ్యా- 14 సిక్స్‌లు- 2026లో👉యువరాజ్‌ సింగ్‌- 12 సిక్స్‌లు- 2007లో.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

T20 WC 2026 Semis IND vs ENG: Abhishek Sharma Flops Again Fans Slams9
IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్‌.. జట్టు నుంచి తీసేయండి!

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్లోనూ పేలవ ఆట తీరుతో తేలిపోయాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా అభిమానులు సైతం అభిషేక్‌ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీ20 ప్రపంచకప్‌-2026 ఆరంభం నుంచి అభిషేక్‌ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ డకౌట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సూపర్‌-8 దశలో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పదిహేను పరుగులకే పెవిలియన్‌ చేరిన అభిషేక్‌.. పసికూన జింబాబ్వేతో మ్యాచ్‌లో మాత్రం అర్ధ శతకంతో రాణించాడు.పాత కథే పునరావృతంఅయితే, సూపర్‌-8లో కీలకమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మరోసారి తేలిపోయాడు అభిషేక్‌ శర్మ. పట్టుమని పది పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో సెమీ ఫైనల్లో అతడిని ఆడించే విషయంలో పునరాలోచన చేయాలని మాజీ క్రికెటర్లు సూచించారు. అయితే, యాజమాన్యం మాత్రం అభిషేక్‌పై నమ్మకం ఉంచగా.. అతడు పాత కథనే పునరావృతం చేశాడు.తొమ్మిది పరుగులే చేసిముంబై వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఏడు బంతుల్లో రెండు ఫోర్లు బాది కేవలం తొమ్మిది పరుగులే చేసి నిష్క్రమించాడు. రెండో ఓవర్లో విల్‌ జాక్స్‌ బంతితో రంగంలోకి దిగి ఆఖర్లో స్లోబాల్‌ వేశాడు. ఈ క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన అభిషేక్‌.. బంతిని గాల్లోకి లేపగా డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చిన ఫిల్‌ సాల్ట్‌ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో అభిషేక్‌ శర్మ పెవిలియన్‌ చేరాడు. మరోసారి ఆఫ్‌ స్పిన్నర్‌ చేతికి చిక్కి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటి వరకు అభిషేక్‌ శర్మ ఈ టోర్నీలో చేసిన పరుగులు 89. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా అభిమానులు అభిషేక్‌పై భగ్గుమంటున్నారు. ‘‘ నువ్విక మారవా?.. అతడిని జట్టు నుంచి తీసేయండి’’ అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

T20 WC 2026 2nd Semis IND vs ENG: Toss Update Both Playing XIs 10
T20 WC 2nd Semis: ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో కీలక పోరు... రెండో సెమీ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ... ముంబైలోని వాంఖడే వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌... ఫలితంగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.భారత్‌ భారీ స్కోరునిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ భారీ హాఫ్‌ సెంచరీ (42 బంతుల్లో 89) బాదగా.. ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), తిలక్‌ వర్మ (7 బంతుల్లో 21),హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించారు.UPDATES: ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపులక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ పై టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్‌.. ఈసారి కూడా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది.ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌దూబే బౌలింగ్‌లో బెతల్‌ రన్‌ ఔట్‌ (105) అయ్యాడు.పదిహేడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 209-515 ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 185-5కర్రాన్‌ 5, బెతెల్‌ 81 పరుగులతో ఉ‍న్నారు.13.6: ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో జాక్స్‌ (35) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా పట్టిన శివం దూబే.పదమూడు ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 160-4విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. బెతెల్‌ 65, విల్‌ జాక్స్‌ 35 పరుగులతో ఉన్నారు.పది ఓవర్లలో ఇంగ్లండ్‌ స్కోరు: 119-4నాలుగో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌7.3: అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో టామ్‌ బాంటన్‌ (5 బంతుల్లో 17) బౌల్డ్‌. క్రీజులోకి విల్‌ జాక్స్‌. స్కోరు: 95-4(7.3).బెతెల్‌ 39 పరుగులతో ఉన్నాడు. విజయానికి 75 బంతుల్లో 159 పరుగులు కావాలి.మూడో వికెట్‌ డౌన్‌5.5: వరుణ్‌ చక్రవర్తి అద్భుత రీతిలో బట్లర్‌ (25)ను బౌల్డ్‌ చేశాడు. స్కోరు: 64-3(5.5). బెతెల్‌ 26 పరుగులతో ఉన్నాడు.రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌4.1: బుమ్రా బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ (7) ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌పటేల్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. ఫలింగా ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జేకబ్‌ బెతెల్‌ క్రీజులోకి రాగా.. బట్లర్‌ 25 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 38-2(4.2).తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌1.1: హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5) అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. క్రీజులోకి బ్రూక్‌. బట్లర్‌ ఎనిమిది పరుగులతో ఉన్నాడు. స్కోరు: 14-1(1.2)భారత్‌ స్కోరు: 253-7ఏడో వికెట్‌ డౌన్‌19.5: ఆఖరి ఓవర్‌ఐదో బంతికి పాండ్యా రనౌట్‌ (12 బంతుల్లో 27). వరుణ్‌ చక్రవర్తి క్రీజులోకి రాగా.. అక్షర్‌ పటేల్‌ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌18.5: తిలక్‌ వర్మ రూపంలో ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌. ఆర్చర్‌ బౌలింగ్‌లో తిలక్‌ బౌల్డ్‌ (7 బంతుల్లో 21). అక్షర్‌ క్రీజులోకి రాగా.. పాండ్యా 14 రన్స్‌తో ఉన్నాడు. స్కోరు: 237-6(19)ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌17.3: సామ్‌ కర్రాన్‌ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి.. హార్దిక్‌ పాండ్యాతో సమన్వయ లోపం కారణంగా దూబే (25 బంతుల్లో 43) రనౌట్‌. తిలక్‌ వర్మ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్‌ డౌన్‌15.4: ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ స్టంపౌట్‌. స్కోరు: 190-4 (16). హార్దిక్‌ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. దూబే35 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 177-3సూర్య 5, దూబే 28 పరుగులతో ఉన్నారు.సంజూ శాంసన్‌ అవుట్‌13.1: సంజూ శాంసన్‌ మరోసారి సెంచరీ మిస్సయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. విల్‌ జాక్స్‌బౌలింగ్‌లో తొందరపడి షాట్‌కు యత్నించి.. ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు రాబట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. దూబే 18 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 160-3(13.1)రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా9.3: మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించిన ఇషాన్‌ కిషన్‌.. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో విల్‌ జాక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేసి నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులో వచ్చాడు. సంజూ 66 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 117-2(9.3). 8.3: వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియాAnother must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026సంజూ హాఫ్‌ సెంచరీవెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ హాఫ్‌ సెంచరీ బాదిన సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. డాసన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది మరీ ఈ మైలురాయి చేరుకున్నాడు.పవర్‌ ప్లేలో భారత్‌ స్కోరు: 67-1(6)సంజూ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 41 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ 9 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.తొలి వికెట్‌ డౌన్‌1.6: విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (7 బంతుల్లో 9) అవుట్‌. సంజూ 11 పరుగులతో ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 20-1(2)సైలెంట్‌ చేసేస్తాంటాస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ బాగుంది. వికెట్‌ పాతబడే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అనుకుంటున్నాం. అందుకే మేము ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాము.ఒక మార్పుతో బరిలోకిటీమిండియాకు ఈ పిచ్‌పై ఆడిన అనుభవం మాకంటే ఎక్కువే. అయితే, టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. టీమిండియా మద్దతుదారులు నిశ్శబ్దంగా ఉండేలా చేస్తాం. రెహాన్‌ అహ్మద్‌ స్థానంలో ఓవర్టన్‌ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.అదే జట్టు..ఇక టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘సెమీ ఫైనల్‌. బిగ్‌ గేమ్‌. మేము ముందుగా బ్యాటింగ్‌ చేయాలనే అనుకున్నాం. ఇక్కడ అంతగా డ్యూ ఉంటుందని అనుకోవడం లేదు. పిచ్‌ బాగుంది. క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు ధన్యవాదాలు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.Harry Brook calls it right, and England will bowl first in the semi-final! ✌️What do you make of the decision? 👀ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/Zabmv2MsVT— Star Sports (@StarSportsIndia) March 5, 2026భారత్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ తుదిజట్లుభారత్‌అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.ఇంగ్లండ్‌ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ బ్రూక్(కెప్టెన్‌), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.చదవండి: T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement