Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Travis Head and Jake Weatherald surpass Rohit-Gill to break massive Test feat vs ENG1
గిల్‌-రోహిత్‌ రికార్డు బద్దలు

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఓపెనింగ్‌ జోడీ జేక్‌ వెదరాల్డ్‌-ట్రవిస్‌ హెడ్‌ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తద్వారా ఇంగ్లండ్‌పై డే అండ్‌ నైట్‌ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు టీమిండియా ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌ శర్మ-శుభ్‌మన్‌ గిల్‌ పేరిట ఉండేది. ఈ జోడీ 2021 అహ్మదాబాద్‌ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు (325/9) మరో తొమ్మిది పరుగులు జోడించిన అనంతరం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు 334 పరుగుల వద్ద తెరపడింది. లబూషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టడంతో జోఫ్రా ఆర్చర్‌ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్‌ గడ్డపై తొలి శతకం బాదిన రూట్‌ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్‌ వికెట్‌ బ్రెండన్‌ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్‌ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌కు తలో వికెట్‌ దక్కింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 76, బ్రూక్‌ 31, స్టోక్స్‌ 19, విల్‌ జాక్స్‌ 19, అట్కిన్సన్‌ 4 పరుగులు చేయగా.. డకెట్‌, పోప్‌, జేమీ స్మిత్‌, కార్స్‌ డకౌట్లయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అరంగేట్రం టెస్ట్‌లో విఫలమైన ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ చెలరేగి ఆడాడు. శైలికి భిన్నంగా హెడ్‌ నిదానంగా ఆడాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన తర్వాత బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో హెడ్‌ (33) ఔటయ్యాడు. అనంతరం లబూషేన్‌ వెదరాల్డ్‌తో జత కలిశాడు. హెడ్‌ ఔటయ్యాక వెదరాల్డ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లబూషేన్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయమైన 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు టీ విరామం సమయానికి వెదరాల్డ్‌ 59, లబూషేన్‌ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 130/1గా ఉంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 204 పరుగులు వెనుకపడి ఉంది.

Root Remains 138 Not Out, England 1st Innings ends at 3342
అజేయ రూట్‌.. ముగిసిన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు (325/9) మరో 9 పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్‌ కోల్పోయింది. లబూషేన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టడంతో జోఫ్రా ఆర్చర్‌ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆసీస్‌ గడ్డపై తొలి శతకం బాదిన రూట్‌ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్‌ వికెట్‌ బ్రెండన్‌ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్‌ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్‌ నెసర్‌, స్కాట్‌ బోలాండ్‌కు తలో వికెట్‌ దక్కింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే 76, బ్రూక్‌ 31, స్టోక్స్‌ 19, విల్‌ జాక్స్‌ 19, అట్కిన్సన్‌ 4 పరుగులు చేయగా.. డకెట్‌, పోప్‌, జేమీ స్మిత్‌, కార్స్‌ డకౌట్లయ్యారు.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్‌ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌, అదే స్కోర్‌ వద్ద వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను డకౌట్‌ చేశాడు. స్టార్క్‌ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆతర్వాత కుదురుకుంది.రూట్‌, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్‌ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు. బ్రూక్‌ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన స్టోక్స్‌ ఇంగ్లిస్‌ అద్భుతమైన డైరెక్ట్‌ త్రో కారణంగా రనౌటయ్యాడు.ఆతర్వాత జేమీ డకౌట్‌ కాగా.. జాక్స్‌ పోరాడే ప్రయత్నంలో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆతర్వాత వచ్చిన అట్కిన్సన్‌, కార్స్‌ ఇలా వచ్చి అలా వెళ్లారు. రూట్‌ ఆర్చర్‌తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ 7.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. వెదరాల్డ్‌ 15, ట్రవిస్‌ హెడ్‌ 3 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆసీస్‌ ఇంకా 312 పరుగులు వెనుకపడి ఉంది.

NZ VS WI 1st Test: HUNDRED FOR SHAI HOPE IN THE 4th INNINGS3
హోప్‌ వీరోచిత శతకం.. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే..!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్‌ స్టార్‌ బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ (Shai Hope) అద్భుత శతకంతో మెరిశాడు. కంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే ఈ సెంచరీ నమోదు చేశాడు. 531 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను (103) కొనసాగిస్తున్నాడు. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్నాడు.జస్టిన్‌ గ్రీవ్స్‌తో (42) కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 110 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవాలంటే ఇంకా 349 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్‌ 182/4గా ఉంది. నాలుగో రోజు మూడో సెషన్‌ ఆట కొనసాగుతుంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలవలేదు.అంతకుముందు టామ్‌ లాథమ్‌ (145), రచిన్‌ రవీంద్ర (176) భారీ శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (466/8) చేసింది. కీమర్‌ రోచ్‌ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి ముందు.. జేకబ్‌ డఫీ ఐదేయడంతో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ హోప్‌ (56) రాణించాడు. తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (52) అర్ద సెంచరీతో పర్వాలేదనిపించాడు.అంతకుముందు న్యూజిలాండ్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. విండీస్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 231 పరుగులకే ఆలౌటైంది. కేన్‌ విలియమ్సన్‌ (52) ఒక్కడే కివీస్‌ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇది.

Special story on Joe root test cricket journey in last 5 years4
5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్‌ క్రికెట్‌పై రూట్‌ పంజా

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్‌ బాల్‌) ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ (Joe Root) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అప్పటికే 39 సెంచరీలు చేసినా, రూట్‌కు ఆసీస్‌ గడ్డపై ఇదే తొలి శతకం. కాబట్టి ఈ సెంచరీ రూట్‌కు చాలా ప్రత్యేకం. ఈ సెంచరీ ఆసీస్‌ దిగ్గజ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్‌కు కూడా చాలా ప్రత్యేకమే.ఎందుకంటే, ఈ యాషెస్‌ సిరీస్‌లో రూట్‌ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని హేడెన్‌ సవాల్‌ చేశాడు. బ్రిస్బేన్‌ టెస్ట్‌లో సెంచరీ చేసి రూట్‌ తన ప్రతిష్ట పెంచుకోవడంతో పాటు హేడెన్‌ పరువు కూడా కాపాడాడు. తాజా సెంచరీ నేపథ్యంలో రూట్‌ టెస్ట్‌ కెరీర్‌పై ఓ ప్రత్యేక కథనం.2012లో మొదలైన రూట్‌ టెస్ట్‌ కెరీర్‌ 2020 వరకు ఓ మోస్తరుగా సాగింది. అరంగేట్రం ఇయర్‌లో కేవలం రెండు ఇన్నింగ్స్‌లకే పరిమితమైన అతను.. ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 93 పరుగులు చేశాడు. ఆతర్వాతి ఏడాది నుంచి రూట్‌ కెరీర్‌ క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. 2013లో 2 సెంచరీలు.. ఆతర్వాత వరుసగా మూడేళ్లు మూడుమూడు సెంచరీలు, ఆతర్వాత వరుసగా మూడేళ్లు రెండ్రెండు సెంచరీలు చేశాడు.2020 తర్వాత రూట్‌ కెరీర్‌ ఊహించని మలుపు తిరిగింది. అప్పటివరకు సాధారణ బ్యాటర్‌గా కొనసాగిన అతను ఒక్కసారిగా బీస్ట్‌ మోడ్‌లోకి వచ్చాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడంతో పాటు తన జట్టుకు అపురూప విజయాలనందించాడు. రూట్‌ అత్యుత్తమ ఫామ్‌ను అందుకునే సమయానికి టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి కూడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వీరికి స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ కూడా తోడయ్యారు.ఈ నలుగురు కలిసి 2020 దశకం ప్రారంభంలో టెస్ట్‌ క్రికెట్‌ను ఓ ఊపు ఊపారు. వీరి పుణ్యమా అని పోయిన టెస్ట్‌ క్రికెట్‌ క్రేజ్‌ తిరిగి వచ్చింది. టీ20లకు అలవాటు పడిపోయిన అభిమానులు వీరి బ్యాటింగ్‌ విన్యాసాల కారణంగా టెస్ట్‌లను కూడా ఫాలో అవడం​ మొదలుపెట్టారు. ఫాబ్‌-4గా కీర్తించబడే ఈ నలుగురు దిగ్గజాలు ఘన చరిత్ర కలిగిన సుదీర్ఘ ఫార్మాట్‌కు పునర్జన్మ కల్పించారు.ఇక్కడ రూట్‌ ప్రస్తావన ఉంది కాబట్టి, మనం గమనించాల్సిన ఓ హైలైట్‌ అంశం ఉంది. ముందుగా చెప్పుకున్నట్లు రూట్‌ 2.0 సమయానికి ఫాబ్‌-4లో మిగతా ముగ్గురు (విరాట్‌, స్మిత్‌, కేన్‌) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నారు. రూట్‌ అప్పుడప్పుడే వారితో పోటీపడటం​ మొదలుపెట్టాడు. 2021కి ముందు రూట్‌ 177 ఇన్నింగ్స్‌ల్లో 17 సెంచరీలు చేయగా.. అప్పటికే విరాట్‌ ఖాతాలో 27 (147 ఇన్నింగ్స్‌లు), స్మిత్‌ ఖాతాలో 26 (135), కేన్‌ మామ ఖాతాలో 23 టెస్ట్‌ శతకాలు (143) ఉన్నాయి.ఐదేళ్లు తిరిగే సరికి ఫాబ్‌-4 ఆటగాళ్ల సెంచరీల క్రమం తిరిగబడిపోయింది. 2020 తర్వాత రూట్‌ ఏకంగా 23 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరించగా.. 2021 నాటికి టాప్‌ ప్లేస్‌లో ఉండిన విరాట్‌ గడిచిన ఐదేళ్లలో కేవలం 3 సెంచరీలకు మాత్రమే పరిమితమై ఆఖరి స్థానానికి చేరాడు. ఈ ఐదేళ్లలో స్మిత్‌, కేన్‌ మామ తలో 10 సెంచరీలు చేసి కెరీర్‌లు నిలకడగా కొనసాగించారు.2021లో 6, 2022లో 5, 2023లో 2, 2024లో 6, తాజా సెంచరీతో కలుపుకొని రూట్‌ ఈ ఏడాది ఇప్పటికే 4 సెంచరీలు చేశాడు. ఫాబ్‌-4లో ప్రస్తుతం రూట్‌ 40 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. స్మిత్‌ 36, కేన్‌ 33, విరాట్‌ 30 సెంచరీలతో వరుస స్థానాల్లో ఉన్నారు.అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రూట్‌ (59) విరాట్‌ (84) తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రోహిత్‌ శర్మ (50), కేన్‌ (48), స్మిత్‌ (48) టాప్‌-5లో ఉన్నారు.రూట్‌ టెస్ట్‌ల్లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలో దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలవడం​ ఖాయం. పరుగుల విషయంలో సచిన్‌కు మరో 2300 దూరంలో ఉన్న రూట్‌.. మరో 12 సెంచరీలు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. రూట్‌ అజేయ సెంచరీతో (135) ఆదుకోవడంతో ఇంగ్లండ్‌ తొలి రోజు గౌరవప్రదమైన స్థానంలో ఉంది. రూట్‌కు జాక్‌ క్రాలే (76) సహకరించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 325/9గా ఉంది. 264 పరుగుల వద్దే తొమ్మిదో వికెట్‌ కోల్పోయినా, రూట్‌ జోఫ్రా ఆర్చర్‌ (32 నాటౌట్‌) సాయంతో 300 పరుగుల మార్కును దాటించాడు. స్టార్క్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు.

ILT20 2025: Though Pollard Shine, MIE Lost the match to Gulf Giants5
పోరాల్డ్‌ మెరిసినా, ముంబై ఓడెన్‌..!

దుబాయ్‌ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. నిన్న (డిసెంబర్‌ 4) గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐఎ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.కెప్టెన్‌ పోలార్డ్‌ (33 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో, నికోలస్‌ పూరన్‌ (39 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించారు. ఆఖర్లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (6 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించాడు. మిగతా బ్యాటర్లలో ముహమ్మద్‌ వసీం 1, బెయిర్‌స్టో 11, బాంటన్‌ 6, తేజిందర్‌ దిల్లాన్‌ 15, రషీద్‌ ఖాన్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేశారు. జెయింట్స్‌ బౌలర్లలో నువాన్‌ తుషార, అజ్మతుల్లా తలో 2, హైదర్‌ రజ్జాక్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన జెయింట్స్‌ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పథుమ్‌ నిస్సంక (42 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో 14.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిస్సంకకు మొయిన్‌ అలీ (26), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (39 నాటౌట్‌) సహకరించారు. ఎంఐ బౌలర్లలో వోక్స్‌కు 2, ఘజనఫర్‌కు ఓ వికెట్‌ దక్కింది.

Team India opener Abhishek Sharma impressed with an all round performance6
అభిషేక్‌ ఆల్‌రౌండ్‌ షో

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9 బంతుల్లో 34; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు; 3/23) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 54 పరుగుల తేడాతో పుదుచ్చేరిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... సలీల్‌ అరోరా (44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాన్‌వీర్‌ సింగ్‌ (38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (37; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో విజయ్‌ రాజా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సిదాక్‌ సింగ్‌ (61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్‌ 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆయుశ్‌ గోయల్‌ 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ 3 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌ ‘సి’లో రెండో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 7 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై గెలిచింది. ముంబైకి కేరళ షాక్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టుకు షాక్‌ తగిలింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 15 పరుగుల తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. మొదట కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విష్ణు వినోద్‌ (43 నాటౌట్‌; 3 ఫోర్లు), మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (32; 3 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షర్ఫుద్దీన్‌ (15 బంతుల్లో 35 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ముంబై బౌలర్లలో శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు అనూహ్యంగా ఓడింది. లక్ష్యం పెద్దది కాకపోయినా... ముంబై జట్టు 19.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌ సెంచరీ హీరో సర్ఫరాజ్‌ ఖాన్‌ (40 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా... టీమిండియా టి20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (32; 4 ఫోర్లు), అజింక్యా రహానే (32; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కేరళ బౌలర్‌ కేఎమ్‌ ఆసిఫ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తొలి బంతికి సాయిరాజ్‌ పాటిల్‌ (13)ను అవుట్‌ చేసిన అతడు... మూడో బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ను, నాలుగో బంతికి శార్దుల్‌ ఠాకూర్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడిలో పడ్డ ముంబై విజయానికి దూరమైంది. ఆసిఫ్‌ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై, అస్సాం 58 పరుగుల తేడాతో విదర్భపై, ఉత్తరప్రదేశ్‌ 40 పరుగుల తేడాతో చండీగఢ్‌పై, జార్ఖండ్‌ 7 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై, గోవా 5 వికెట్ల తేడాతో బిహార్‌పై, ఢిల్లీ 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, ఒడిశా ఒక పరుగు తేడాతో రైల్వేస్‌పై, మధ్యప్రదేశ్‌ 21 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, తమిళనాడు 61 పరుగుల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి.

McLaren driver Norris comments on Piastri7
నేను గెలిచేందుకు మా వాణ్ని ఓడిపొమ్మంటానా?

అబుదాబి: ఈ సీజన్‌ ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ కోసం జట్టు సహచరుడు పియా్రస్టితో ఎలాంటి మంతనాలు ఉండవని లాండో నోరిస్‌ వ్యాఖ్యానించాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్లలో నోరిస్‌ 408 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్కార్‌ పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. గత ఆదివారం ఖతర్‌ గ్రాండ్‌ప్రి గెలుపొందడంతో రెడ్‌బుల్‌ రేసర్‌ వెర్‌స్టాపెన్‌ (396) రెండో స్థానంలోకి దూసుకురావడంతోనే ఈ సీజన్‌ ‘ఫార్ములా’ ఆఖరి మజిలీకి చేరింది. ఈ ఆదివారం జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రిపై రేసింగ్‌ ప్రియుల ఆసక్తిని పెంచింది. ఈ రేసుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌లతో కలిసి నోరిస్‌ పాల్గొన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా... గెలవాలని నాకున్నా గెలిపించేందుకు సహకరించమని అడగను. దీనికి ఆస్కార్‌ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. తప్పనిసరి అని నేను భావించను’ అని నోరిస్‌ స్పష్టం చేశాడు. ఇద్దరు మెక్‌లారెన్‌ డ్రైవర్ల (పియాస్ట్రి, నోరిస్‌)లో నోరిస్‌కే టైటిల్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతలా అంటే అబుదాబిలో వెర్‌స్టాపెన్‌ గెలిచినా కూడా నోరిస్‌ టాప్‌–3లో ఉంటే చాలు మెక్‌లారెన్‌ జట్టు 17 ఏళ్ల తర్వాత ఫార్ములావన్‌ విజేతగా నిలుస్తుంది. 2008లో హామిల్టన్‌ తర్వాత మరే మెక్‌లారెన్‌ డ్రైవర్‌ విజేతగా నిలువలేకపోయాడు. మరోవైపు వెర్‌స్టాపెన్‌ మాట్లాడుతూ ఆఖరి రేసులో ఏమైనా జరగొచ్చని, రేసు ఆషామాïÙగా ఉండబోదని చెప్పాడు.

Four medals for Telangana swimmers8
తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్‌–19 బాలుర విభాగంలో సుహాస్‌ ప్రీతమ్‌ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సుహాస్‌ 2 నిమిషాల 06.28 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్‌ మొంగం తీర్థు సామ (2ని:11.24 సెకన్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్‌–19 బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్‌ (4ని:40.41 సెకన్లు) రజత పతకం సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొంగం తీర్థు సామ (4ని:39.85 సెకన్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అండర్‌–17 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తెలంగాణకు చెందిన ఇషాన్‌ దాస్‌ (25.93 సెకన్లు) రజతం, గౌతమ్‌ శశివర్ధన్‌ (26.25 సెకన్లు) కాంస్యం సాధించారు.

Hyderabad pacer to miss ODIs and T20s9
టెస్టు ఫార్మాట్‌కే పరిమితమా!

దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కోసం అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ సిరాజ్‌కు ఇందులో చోటు కల్పించలేదు. సిరీస్‌ నుంచి విశ్రాంతి నిచ్చారా అనుకుంటే దానికి ముందు వన్డే సిరీస్‌లో కూడా అతను ఆడలేదు. తగినంత విరామం లభించిన అతను ఇప్పుడుదేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. అంతకుముందు ఆ్రస్టేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కూడా సిరాజ్‌ను ఎంపిక చేయలేదు. టి20 వరల్డ్‌ కప్‌ చేరువైన నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనను బట్టి చూస్తే సిరాజ్‌కు అవకాశం సందేహంగానే కనిపిస్తోంది. వన్డేల విషయంలో కూడా అతని ఎంపికపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షి క్రీడా విభాగం : సరిగ్గా నాలుగు నెలల క్రితం... ఇంగ్లండ్‌ గడ్డపై ఓవల్‌ టెస్టులో అసాధారణ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించిన హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా చివరి రోజు పోరాటయోధుడిలా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని కుప్పకూల్చిన అతను... భారత్‌ను సిరీస్‌ కోల్పోయే ప్రమాదం నుంచి కాపాడటంతో పాటు ఒక రకంగా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పరువు నిలబెట్టాడు. లేదంటే భారత్‌ 1–3తో ఓడి తిరుగుముఖం పట్టేది. అలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత సిరాజ్‌ ఒక్కసారిగా తెర వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అసలు భారత జట్టులో ఉన్నాడా లేదా అనే సందేహాల మధ్య అతని ఆట కొనసాగుతోంది. నిజానికి ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చెలరేగినా... అప్పటికే అతను వన్డే ఫార్మాట్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. టి20ల్లో కూడా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధించడంతో పాటు ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా రాణిస్తున్న బౌలర్లలో అతనూ ఒకడు. కానీ తాజా పరిణామాలు చూస్తే 31 ఏళ్ల సిరాజ్‌ను ఒక ఫార్మాట్‌కే పరిమితం చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిలకడైన ప్రదర్శన... ఓవరాల్‌గా సిరాజ్‌ వన్డే కెరీర్‌ రికార్డు చాలా బాగుంది. 47 వన్డేల్లో కేవలం 24.67 సగటుతో అతను 73 వికెట్లు పడగొట్టాడు. గత కొంత కాలంగా ఫార్మాట్‌కు తగినట్లు తన ఆటను మార్చుకుంటూ నిలకడైన ప్రదర్శనతో సిరాజ్‌ తనను తాను ‘ఆల్‌ ఫార్మాట్‌ బౌలర్‌’గా మలచుకున్నాడు. ప్రస్తుతం భారత బౌలింగ్‌ దళంలో బుమ్రా తర్వాత నిస్సందేహంగా రెండో స్థానం తనదే. నిజానికి చాంపియన్స్‌ ట్రోఫీలో సిరాజ్‌కు చోటు దక్కకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. అంతకుముందు రెండేళ్లలో భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. బంతి పాతబడితే ప్రభావం చూపలేకపోతున్నాడంటూ కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన వివరణ కూడా సరైంది కాదని అందరికీ అర్థమైంది. ఓవల్‌ టెస్టు ప్రదర్శనతో పాటు వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూసుకుంటే సిరాజ్‌కు వన్డేల్లోనూ వరుస సిరీస్‌లలో స్థానం లభించాలి. ఆ్రస్టేలియా గడ్డపై ఆడిన 3 వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా కేవలం 4.94 ఎకానమీతో పరుగులివ్వడం చక్కటి ప్రదర్శనే. కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వచ్చేసరికి టీమ్‌లో స్థానం లేదు. గత రెండు వన్డేల్లో ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణాల బౌలింగ్‌ ప్రదర్శన చూస్తుంటే సిరాజ్‌ కచ్చితంగా ఇంతకంటే బాగా బౌలింగ్‌ చేసేవాడనే అభిప్రాయం అన్ని వైపుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు టి20లకు కూడా ఎంపిక చేయకపోవడం, త్వరలోనే వరల్డ్‌ కప్‌కు కూడా దాదాపు ఇదే జట్టు ఎంపికయ్యే అవకాశం ఉండటంతో ఈ ఫార్మాట్‌లో సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది. విశ్రాంతి ఇచ్చారా...వేటు వేశారా... సిరాజ్‌కు వన్డే, టి20 ఫార్మాట్‌లలో స్థానం లభించకపోవడంపై కావాల్సినంత చర్చ జరగడం లేదని అర్థమవుతోంది. సెలక్టర్లు సాధారణంగా తమ ఎంపికపై ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడినా అసలు సిరాజ్‌ పేరును కూడా ప్రస్తావించనే లేదు. జట్టుకు దూరమైన షమీ గురించి కూడా మాట్లాడిన అగార్కర్‌... రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న ఆటగాడి గురించి సమాచారం ఇవ్వడం లేదు. బుమ్రా ఫిట్‌నెస్, విశ్రాంతి విషయంలో ప్రతీ సిరీస్, ప్రతీ మ్యాచ్‌ సందర్భంగా సెలక్టర్లు స్పష్టతనిస్తున్నారు. అదే సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారా లేక వేటు వేశారా కూడా తెలియడం లేదు. సిరాజ్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఎలాంటి గాయాల సమస్యలు లేవు. తాను ఎలాంటి విశ్రాంతి కోరుకోవడం లేదు. ఏ స్థితిలోనైనా మైదానంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడాడు కాబట్టి విశ్రాంతి అవసరమని భావించి ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదని అనిపించింది. నిజానికి సిరాజ్‌కు విరామం ఇవ్వాలని అనుకుంటే స్వదేశంలో పేసర్లకు ప్రాధాన్యత లేని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇవ్వాల్సింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను మొత్తం 49 ఓవర్లే బౌలింగ్‌ చేశాడు. వెంటనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లోనూ ఆడించడం అంటే ఈ ఫార్మాట్‌లోనే అతని అవసరాన్ని చూపించింది. కానీ ఎలాంటి కారణం లేకుండా ఇప్పుడు వన్డే, టి20ల నుంచి అతడిని పక్కన పెట్టారు. లోయర్‌ ఆర్డర్‌లో కొన్ని పరుగులు సాధించే హర్షిత్‌ రాణా వల్ల సిరాజ్‌ స్థానం సందేహంలో పడినట్లు కనిపిస్తోంది. కానీ సిరాజ్‌ లాంటి టాప్‌ బౌలర్‌ను బ్యాటింగ్‌ కారణంగా పక్కన పెట్టడంతో అర్థం లేదు. మున్ముందు సిరాజ్‌ విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

Hardik Pandyas match has changed venue10
జనం తాకిడిని ఊహించి...

సాక్షి, హైదరాబాద్‌: భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున ఆడుతున్నాడు. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతని మెరుపు ప్రదర్శనను అభిమానులు ప్రత్యక్షంగా చూశారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌తో బరోడా తలపడాల్సి ఉంది. అయితే నగరం మధ్యన కీలక ప్రాంతంలో మైదానం ఉండటం... ఫెన్సింగ్‌ మినహా తగిన భద్రతా ఏర్పాట్లు లేని జింఖానా మైదానంలో మ్యాచ్‌పై పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. పాండ్యా ఆట కోసం జనం ఎగబడితే వారిని నిలువరించడం కష్టం కావడంతో పాటు పరిస్థితి పూర్తిగా చేయి దాటే ప్రమాదం ఉండటంతో ఇదే విషయాన్ని బుధవారం రాత్రి హెచ్‌సీఏ అధికారులకు తెలియజేశారు. ఏదైనా అనుకోనిది జరిగితే హెచ్‌సీఏను పూర్తిగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. దాంతో ఈ మ్యాచ్‌ను మెరుగైన సౌకర్యాలు ఉన్న ఉప్పల్‌ స్టేడియానికి మార్చాల్సి వచ్చింది. ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన బెంగాల్, సర్వీసెస్‌ మ్యాచ్‌ను జింఖానా మైదానంలో నిర్వహించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా గుజరాత్‌ 14.1 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్యా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. అనంతరం బరోడా 6.4 ఓవర్లలో 2 వికెట్లకు 74 పరుగులు చేసి నెగ్గింది. హార్దిక్‌ పాండ్యా 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. షమీకి 4 వికెట్లు: సర్వీసెస్‌పై బెంగాల్‌ గెలుపుజింఖానా మైదానంలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. సర్వీసెస్‌ 18.2 ఓవర్లలో 165 పరుగులకుఆలౌటైంది. బెంగాల్‌ జట్టుకు ఆడుతున్న భారత పేసర్లు షమీ 3.2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... ఆకాశ్‌దీప్‌ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బెంగాల్‌ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్‌ పొరెల్‌ (56; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిమన్యు ఈశ్వరన్‌ (58; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేసి బెంగాల్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement