ప్రధాన వార్తలు
T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. సౌతాఫ్రికా టీ20 లీగ్లో జోబర్గ్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఫెరీరా.. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు.ప్రిటోరియా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ భుజం బలంగా నేలకు తాకింది. దీంతో ఫెరీరా తీవ్రమైన నొప్పితో విలవిలాడాడు. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉండడంతో ఫెరీరా తప్పనిసారి పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చాడు. కానీ కేవలం ఒకే ఒక బంతి మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ ముగిశాక అతడిని స్కానింగ్కు తరలించగా.. భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు. ఫెరీరా కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకొనే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సౌతాఫ్రికాకు నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫెరీరా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ తర్వాత ప్రధాన ఫినిషర్గా ఫెరీరా ఉన్నాడు. 2024 నుంచి టీ20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగి ఉన్న బ్యాటర్గా ఫెరీరా కొనసాగుతున్నాడు.86 ఇన్నింగ్స్లలో 177.08 స్ట్రైక్ రేటుతో 1716 పరుగులు చేశాడు. గత నెలలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా డోనోవన్ దుమ్ములేపాడు. అతడి ఆఫ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలడు. ఒక వేళ అతడు ఈ టోర్నీకి దూరమైతే ర్యాన్ రికెల్టన్ లేదా ట్రిస్టన్ స్టబ్స్ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.టీ20 వరల్డ్ కప్ 2026 కోసం దక్షిణాఫ్రికా జట్టు:ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కోర్బిన్ బాష్, డేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్ (కీపర్), టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, జేసన్ స్మిత్.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. 20 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలఖారులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో ఆసీస్ ఆతిథ్య పాక్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు.అయితే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, గ్లెన్ మాక్స్వెల్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ కూడా పాక్స్తాన్కు వెళ్లడం లేదు. వీరంతా నేరుగా శ్రీలంకలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్లో చేరనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు హాజిల్వుడ్, డేవిడ్ గాయపడిన సంగతి తెలిసిందే.హాజిల్వుడ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోగా.. డేవిడ్ తొడ కండరాల గాయంతో బిగ్ బాష్ లీగ్ మధ్యలో వైదొలగాడు. అయితే వీరిద్దరూ వరల్డ్కప్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.జట్టులోకి యువ ఆటగాళ్లు..ఇక బిగ్ బాష్ లీగ్లో అదరగొట్టిన పేసర్ మహ్లి బియర్డ్మాన్, ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్కు తొలిసారి ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల బియర్డ్మాన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో వీరిద్దరికి జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్-2026 వేలంలో ఎడ్వర్డ్స్ను రూ.3 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక పాక్-ఆసీస్ టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు టి20 మ్యాచ్లు లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి.పాక్తో టీ20లకు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాచదవండి: న్యూజిలాండ్తో సిరీస్ ఓటమి.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
ఆమె మనిషి కాదు!
వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రత్యర్థులు ఎవరైనా... తగ్గేదేలా అంటోంది దక్షిణ కొరియా సూపర్స్టార్ షట్లర్ ఆన్ సె యంగ్. బ్యాడ్మింటన్ సీజన్లోని రెండో టోర్నమెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆన్ సె యంగ్ టైటిల్ నిలబెట్టుకుంది.మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో విజేతగా నిలిచి ఈ ఏడాది ఘనంగా ప్రారంభించిన ఈ ప్రపంచ నంబర్వన్ అదే జోరును న్యూఢిల్లీలోనూ కొనసాగించింది. తుది పోరులో ఆన్ సె యంగ్కు గట్టిపోటీ ఇస్తుందనుకున్న ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి కొరియా స్టార్ ధాటికి తేలిపోయింది.కెరీర్లో 22వసారి వాంగ్ జి యితో ఆడిన ఆన్ సె యంగ్ 18వసారి చైనా ప్లేయర్ను ఓడించి తన కెరీర్లో 36వ సింగిల్స్ టైటిల్ను జమ చేసుకుంది. గత ఏడాది చివరి నాలుగు టోర్నీలో విజేతగా నిలిచిన ఆన్ సె యంగ్ ఈ ఏడాది ఆడిన రెండు టోర్నీలలోనూ టైటిల్ సొంతం చేసుకొని ‘సిక్సర్’ నమోదు చేసింది. న్యూఢిల్లీ: ‘ఆమె మనిషి కాదు... రోబో’ అని ఆన్ సె యంగ్ గురించి ఆమె ప్రత్యర్థులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిజమే అనుకోవాలి. కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత నిలకడగా విజయాలు నమోదు చేస్తున్న ఆన్ సె యంగ్ కొత్త ఏడాదిలోనూ చెలరేగిపోతోంది. ఆదివారం ముగిసిన ఇండియా ఓపెన్ టోర్నీలో ఈ టాప్ సీడ్ ప్లేయర్ చాంపియన్గా నిలిచింది. గత ఏడాది టైటిల్ సాధించిన ఈ కొరియా సూపర్స్టార్ ... ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.43 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆన్ సె యంగ్ 21–13, 21–11తో వాంగ్ జి యిపై గెలిచింది. ఆన్ సె యంగ్కు 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 12వ ర్యాంకర్ లిన్ చున్ యి (చైనీస్ తైపీ) టైటిల్ గెలిచాడు. ఫైనల్లో లిన్ చున్ యి 21–10, 21–18తో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.ప్రైజ్మనీ ఎంతంటే?లిన్ చున్ యికి 66,500 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీతోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. మహిళల డబుల్స్లో లియు షెంగ్షు –టాన్ నింగ్ (చైనా) జోడీ టైటిల్ దక్కించుకుంది. ఫైనల్లో లియు–టాన్ నింగ్ 21–11, 21–18తో యుకీ ఫుకుషిమా–సయాకా మత్సుమోతో (జపాన్)లపై గెలిచారు.పురుషుల డబుల్స్ ఫైనల్లో లియాంగ్ వెకెంగ్–వాంగ్ చాంగ్ (చైనా) ద్వయం 17–21, 25–23, 21–16తో హిరోకి మిదోరికావా–క్యోహె యామషిటా (జపాన్) జోడీపై నెగ్గి టైటిల్ అందుకుంది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో డెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జంట 19–21, 25–23, 21–18తో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీపై విజయం సాధించి టైటిల్ హస్తగతం చేసుకుంది.
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో వన్డే సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.టీ20 జట్టులో గిల్ లేకపోవడంతో వన్డే సిరీస్లో జట్టును నడిపించనున్నాడు. అప్పటివరకు గిల్ భారత తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్ పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు. అంతా మనోళ్లే అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. మ్యాచ్ రద్దున్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్
‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. చాంపియన్ విదర్భ
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన విదర్భ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ సౌరాష్ట్రపై గెలుపొందింది. ‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. గతేడాది తుదిమెట్టుపై బోల్తా పడ్డ విదర్భ... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయవంతమైంది. మొదట బ్యాటింగ్కు దిగిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ తైడే (118 బంతుల్లో 128; 15 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కగా... యశ్ రాథోడ్ (61 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. అమన్ మోఖడే (33), రవికుమార్ సమర్థ్ (25) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 213/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించిన విదర్భ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్ష్ దూబే (17), మొహమ్మద్ ఫైజ్ (19) ఎక్కువసేపు నిలవలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వర్ 4 వికెట్లు పడగొట్టగా... చేతన్ సకారియా, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. 279 పరుగులకు ఆలౌట్అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (92 బంతుల్లో 88; 10 ఫోర్లు), చిరాగ్ జానీ (63 బంతుల్లో 64; 3 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెపె్టన్ హార్విక్ దేశాయ్ (20), విశ్వరాజ్ జడేజా (9), పర్స్వరాజ్ రాణా (7) విఫలమయ్యారు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... నచికేత్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. విదర్భ ప్లేయర్లు అథర్వ తైడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అమన్ మోఖడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్ర మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ విదర్భ జట్టుకు విన్నర్స్ ట్రోఫీ అందించారు. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో
కోహ్లి వీరోచితం సరిపోలేదు
భారత్ ముందున్న లక్ష్యం 338 అసాధారణమైంది. దీన్ని ఛేదించే క్రమంలో 71/4 స్కోరు వద్దే టీమిండియా కుదేలైంది. అప్పటికే రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అవుట్! ఉన్నది కోహ్లి ఒక్కడే! ఈ చేజింగ్ కింగ్... నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి 159 స్కోరు వరకు తీసుకెళ్లాడు. జడేజా నిర్లక్ష్యంగా ఆడినా... హర్షిత్ రాణాతో ఒడ్డున పడేసేందుకు కడదాకా శ్రమించాడు. 40 బంతుల్లో 61 పరుగుల సమీకరణం గెలుపుపై ధీమాను తెచి్చంది. ఇలాంటి తరుణంలో 277 స్కోరు వద్ద హర్షిత్ ని్రష్కమించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. కోహ్లి వీరోచిత పోరాటానికి అండగా నిలిచేవారే లేకపోవడంతో చివరకు 41 పరుగులతో మ్యాచ్ ఓడిన భారత్ సిరీస్ను 1–2తో చేజార్చుకుంది. ఇండోర్: ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో దెబ్బ కొట్టిన న్యూజిలాండ్... ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లోనూ కంగుతినిపించింది. మూడు వన్డేల సిరీస్ను ఓటమితో మొదలుపెట్టిన బ్రేస్వెల్ సారథ్యంలోని కివీస్ ఆ తర్వాత వరుస మ్యాచ్లు గెలిచి సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. వన్డే సిరీస్ను చేజార్చుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా కెపె్టన్ శుబ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా న్యూజిలాండ్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ డరైల్ మిచెల్ (131 బంతుల్లో 137; 15 ఫోర్లు, 3 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 106; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ను నాలుగో వికెట్కు 219 పరుగులు జోడించడం ద్వారా మిచెల్, ఫిలిప్స్ భారీస్కోరుకు బాట వేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. విరాట్ కోహ్లి (108 బంతుల్లో 124; 10 ఫోర్లు, 3 సిక్స్లు) వన్డేల్లో 54వ శతకం సాధించాడు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 53; 2 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షిత్ రాణా (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తదుపరి ఇరు జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ 21న నాగ్పూర్లో జరగనుంది. నిర్ల్యక్షంగా ఆడి... పెద్ద లక్ష్యం ముందుంటే బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై పెద్దగా కష్టపడకుండానే రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ (3), కేఎల్ రాహుల్ (1) నిర్లక్ష్యంగా అవుటయ్యారు. 13వ ఓవర్ ముగియకముందే 71/4 స్కోరు వద్ద భారత్ లక్ష్యానికి దూరమైంది. వచ్చిరాగానే సిక్స్తో అలరించిన కోహ్లి అడపాదడపా బౌండరీలు బాదాడు. నితీశ్ రెడ్డితో కలిసి మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత సింగిల్స్, డబుల్స్తో ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. నితీశ్ కొట్టిన ఫోర్తో భారత్ స్కోరు 20వ ఓవర్లో 100కు చేరింది. తర్వాత కోహ్లి 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్స్లు బాదిన నితీశ్ కూడా 52 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే నితీశ్ను క్లార్క్ అవుట్ చేయడంతో ఐదో వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి ముందుండి... తర్వాత కోహ్లికి జతయిన జడేజా (12) నిరాశపరిచాడు. కానీ హర్షిత్ రాణా బ్యాటర్ను తలపించే ఆటతీరుతో చక్కని భాగస్వామ్యానికి బాట వేశాడు. 37వ ఓవర్లో భారత్ 200 దాటింది. హర్షిత్తో పాటు కోహ్లి కూడా షాట్లు ఆడటంతో ఈ దశలో వేగంగా పరుగులు వచ్చాయి. ఈ జోరు సాగుతుండటంతో పోయిన ప్రాణం లేచివచ్చినట్లుగా భారత్ గెలుపుపై ఆశలు చిగురించాయి. దీంతోపాటు ‘కింగ్’ కోహ్లి 91 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరుకుంది. భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్న హర్షిత్ 41 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే అతను అవుటవడంతో 69 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యానికి, భారత్ ఆశలకు తెరపడింది. 292 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా, మరో రెండు బంతులకే భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రోహిత్ (బి) హర్షిత్ 5; నికోల్స్ (బి) అర్ష్ దీప్ 0; యంగ్ (సి) జడేజా (బి) హర్షిత్ 30; మిచెల్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 137; ఫిలిప్స్ (సి) రాహుల్ (బి) అర్ష్దీప్ 106; బ్రేస్వెల్ (నాటౌట్) 28; మిచెల్ హే (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 2; జాక్ ఫోక్స్ (సి) కుల్దీప్ (బి) అర్ష్దీప్ 10; క్లార్క్ (బి) హర్షిత్ 11; జేమీసన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–58, 4–277, 5–283, 6–286, 7–304, 8–327. బౌలింగ్: అర్ష్దీప్ 10–1–63–3, హర్షిత్ 10–0–84–3, సిరాజ్ 10–0–43–1, నితీశ్ 8–0–53–0, కుల్దీప్ 6–0–48–1, జడేజా 6–0–41–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లార్క్ (బి) ఫోక్స్ 11; గిల్ (బి) జేమీసన్ 23; కోహ్లి (సి) మిచెల్ (బి) క్లార్క్ 124; అయ్యర్ (సి) ఫోక్స్ (బి) క్లార్క్ 3; రాహుల్ (సి) ఫిలిప్స్ (బి) లెనాక్స్ 1; నితీశ్ (సి) యంగ్ (బి) క్లార్క్ 53; జడేజా (సి) యంగ్ (బి) లెనాక్స్ 12; హర్షిత్ (సి) నికోల్స్ (బి) ఫోక్స్ 52; సిరాజ్ (సి) హే (బి) ఫోక్స్ 0; కుల్దీప్ (రనౌట్) 5; అర్ష్దీప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 296. వికెట్ల పతనం: 1–28, 2–45, 3–68, 4–71, 5–159, 6–178, 7–277, 8–277, 9–292, 10–296. బౌలింగ్: జేమీసన్ 9–0–58–1, ఫోక్స్ 9–0–77–3, క్లార్క్ 9–0–54–3, లెనాక్స్ 10–0–42–2, మిచెల్ 1–0–10–0, ఫిలిప్స్ 8–0–54–0. 1: భారత్లో భారత జట్టుతో న్యూజిలాండ్ ఇప్పటి వరకు 8 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడింది. ఏడుసార్లు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.1: ఇండోర్లోని హోల్కర్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడింది. ఈ వేదికపై వరుసగా ఏడు వన్డేల్లో నెగ్గిన టీమిండియాకు న్యూజిలాండ్ తొలిసారి ఓటమి రుచి చూపించింది. 6: భారత్లో భారత జట్టును ఓడించి వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆరో జట్టు న్యూజిలాండ్. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఈ ఘనత సాధించాయి.9: కోహ్లి సెంచరీ సాధించిన వన్డేలో భారత జట్టు ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి.
యూకీ బాంబ్రీ జోడీ శుభారంభం
ఆక్లాండ్: కొత్త ఏడాదిలో భారత డబుల్స్ టెన్నిస్ స...
హైదరాబాద్ వేదికగా...
సాక్షి, హైదరాబాద్: పలు ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట...
‘ఈ క్షణం ఎల్లకాలం గుర్తుండిపోతుంది’
టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు ఆడిన ఉక్రెయిన్ టెన్ని...
ఐ డోంట్ కేర్: సబలెంకా రియాక్షన్ వైరల్
బెలారస్ టెన్నిస్ స్టార్ అరియానా సబలెంకా కొత్త ఏ...
‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. చాంపియన్ విదర్భ
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసార...
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర...
కోహ్లి వీరోచితం సరిపోలేదు
భారత్ ముందున్న లక్ష్యం 338 అసాధారణమైంది. దీన్ని ఛ...
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసై...
క్రీడలు
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్ (ఫొటోలు)
భారత క్రికెటర్కు ‘గిఫ్ట్’.. తిరిగొచ్చిన తండ్రి ఉద్యోగం!
జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్, హర్మన్
2025 ఏడాది మధుర క్షణాలను షేర్ చేసిన సూర్యకుమార్ సతీమణి (ఫోటోలు)
2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
పాక్ బాటలో బంగ్లాదేశ్..! అదే జరిగితే
అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా
Vaibhav : 15వ బర్త్డే లోపు భారత్కు ప్రపంచకప్ గిఫ్ట్ ఇస్తాడా ...?
విధ్వంసకర ఇన్నింగ్స్ తో రెచ్చిపోయిన సోఫియా డివైన్
ముంబైలో యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ కార్యక్రమం
మహిళా షూటర్ పై లైంగిక దాడి.. జాతీయ కోచ్ అంకుశ్ పై వేటు
రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్
ఇండియాలో మేం ఆడలేం! ICCకి బంగ్లా క్రికెట్ బోర్డు సంచలన లేఖ
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
