ప్రధాన వార్తలు
యశస్వి, వైభవ్ మెరుపులు
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ మంగళవారం జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్ (8), రోహిత్ (5), సూర్యకుమార్ (6), తిలక్ (14), హార్దిక్ (9) విఫలమయ్యారు. దంచుడే... దంచుడు మ్యాచ్ను రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో జైస్వాల్ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో వైభవ్ రెండు సిక్స్లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ రెండు, వైభవ్ ఒక సిక్స్ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్లో హార్దిక్ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురేల్ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దుల్ 39; జురేల్ (ఎల్బీ) ఘజన్ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 20; హెట్మైర్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్ 1–0–22–0; హార్దిక్ 2–0–17–0; శార్దుల్ 2–0– 36–1; ఘజన్ఫర్ 2–0–21–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ (సి) జురేల్ (బి) సందీప్ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ (సి) హెట్మైర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్ఫోర్డ్ (సి) సందీప్ (బి) దేశ్పాండే 25; శార్దుల్ (సి) జురేల్ (బి) సందీప్ 8; దీపక్ (నాటౌట్) 5; బౌల్ట్ (రనౌట్) 1; బుమ్రా (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్: ఆర్చర్ 2–0–17–1; బర్గర్ 2–0–21–2; సందీప్ 3–0–26 –2; దేశ్పాండే 2–0–29–1; బిష్ణోయ్ 2–0–25–2.
ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
గ్రనాడా (స్పెయిన్): రైఫిల్, పిస్టల్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత బృందం పసిడి పతకంతో, ప్రపంచ రికార్డుతో ప్రారంభించింది. మంగళవారం మొదలైన సీజన్ తొలి ప్రపంచకప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముకేశ్ నేలవల్లి, హరియాణా అమ్మాయి పలక్ గులియా అద్భుతం చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ముకేశ్–పలక్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు. 42 జోడీలు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో ముకేశ్ (294)–పలక్ (287) ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో... కియాన్జున్ యావో–హు కాయ్ (చైనా) జోడీ 586 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాయి. వెరోనికా–అకోస్ కరోలీ (హంగేరి; 580 పాయింట్లు), నటాలియా ప్రాడో–నికోలస్ మౌరెర్ (అమెరికా; 578 పాయింట్లు) జోడీలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి కాంస్య పతక మ్యాచ్కు అర్హత పొందాయి. ఫైనల్లో ముకేశ్ (244.7 పాయింట్లు)–పలక్ (243 పాయింట్లు) జోడీ 487.7 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్షిప్లో నిగీనా సైదుకులోవా–ముఖమ్మద్ కమలోవ్ (ఉజ్బెకిస్తాన్; 481.3 పాయింట్లు) నెలకొల్పిన ప్రపంచ రికార్డును ముకేశ్–పలక్ బద్దలు కొట్టారు. కియాన్జున్ యావో –హు కాయ్ (484.8 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని గెల్చుకుంది. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్కు నిరాశే మిగిలింది. క్వాలిఫయింగ్లో సోనమ్–గజానన్ (భారత్; 631.4 పాయింట్లు) జోడీ ఆరో స్థానంలో ... శ్రుతి–అర్ష్ దీప్ సింగ్ (భారత్; 628 పాయింట్లు) జంట 19వ స్థానంలో నిలిచింది.గురి పెడితే పతకమే...గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల ముకేశ్ కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. బరిలో దిగిన ప్రతి టోర్నీలో ఏదో ఒక పతకంతో తిరిగొస్తున్నాడు. రెండేళ్ల క్రితం పెరూలో జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ముకేశ్ స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచాడు. అదే ఈవెంట్లో మరో రెండు కాంస్యాలు కూడా సాధించాడు. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్లో ముకేశ్ స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచాడు. ఈ సంవత్సరమే న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో ముకేశ్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నాడు. సీనియర్స్థాయిలో తొలిసారి ప్రపంచకప్లో పసిడి పతకంతో ముకేశ్ శుభారంభం చేసి తనకెంతో ఉజ్వల భవిష్యత్ ఉందని చాటి చెప్పాడు.
భారత రెజ్లర్ లలిత్కు రజత పతకం
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్లు లలిత్ (55 కేజీలు) రజత పతకం... సునీల్ (87 కేజీలు) కాంస్య పతకం నెగ్గారు. ఫైనల్లో లలిత్ 0–9తో బొటిరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సునీల్ 5–4తో రసులోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలిచాడు. 77 కేజీల కాంస్య పతక బౌట్లో భారత రెజ్లర్ అమన్ 14–15తో యోంగన్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.
ఫైనల్లో జైస్మీన్
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు జైస్మీన్ లంబోరియా (57 కేజీలు), మీనాక్షి హుడా (48 కేజీలు), విశ్వనాథ్ సురేశ్ (50 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో జైస్మీన్ 3–2తో నిగీనా ఉక్తమోవా (ఉజ్బెకిస్తాన్)పై, మీనాక్షి 4–1తో థిప్సాచా (థాయ్లాండ్)పై, విశ్వనాథ్ 5–0తో సాన్జార్ (కజకిస్తాన్)పై, సచిన్ 4–1తో రువామ్థామ్ (థాయ్లాండ్)పై గెలిచారు. ఆకాశ్ (75 కేజీలు), లోకేశ్ (85 కేజీలు), నరేందర్ బెర్వాల్ (ప్లస్ 90 కేజీలు), హర్‡్ష (90 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్గా ఈ టోరీ్నలో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి ప్రవేశించారు.
ముంబై ఇండియన్స్ను చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్ విధ్వంసం సృష్టించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు.
బుమ్రాను ఉతికారేసిన వైభవ్ సూర్యవంశీ
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను సైతం వదల్లేదు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో బుమ్రాను సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వైభవ్ మాత్రం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా బుమ్రాను ఉతికారేశాడు.రాజస్తాన్ ఇన్నింగ్స్లో బుమ్రా తను వేసిన తొలి బంతినే వైభవ్ అద్భుతమైన సిక్సర్గా మలిచాడు. ఆషాట్కు బుమ్రా సైతం ఫిదా అయిపోయాడు. బుమ్రా నవ్వుతూ తన ఎండ్ వైపు వెళ్లిపోయాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని కూడా సూర్యవంశీ స్టాండ్స్కు పంపించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రాకే చుక్కులు చూపించావు.. బుడ్డోడా నీవు గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. కాగా వైభవ్ ఈ మ్యాచ్లో కేవలం 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.ఇక గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను వర్షం కారణంగా కేవలం 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: ముంబై ఇండియన్స్లోకి వైభవ్ సూర్యవంశీ?
రవిశాస్త్రికి అరుదైన గౌరవం
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయించింది. గురువారం (ఏప్రిల్ 9) రవిశాస్త్రి పేరిట స్టాండ్ను ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా రవిశాస్త్రి స్టాండ్ అధికారికంగా ప్రారంభం కానుంది. కేవలం రవిశాస్త్రి మాత్రమే కాకుండా మరికొందరు దిగ్గజాలను కూడా అదే రోజున ఎంసీఏ సత్కరించనుంది.భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎదుల్జీ పేరును వాంఖడే స్టేడియం గేట్కు పెట్టనున్నారు. అదేవిధంగా దివంగత దిగ్గజ బ్యాటర్ దిలీప్ సర్దేశాయ్ పేరును కూడా వాంఖడేలోని ఒక గేట్కు పెట్టాలని ఎంసీఎ నిర్ణయించింది.కాగా రవిశాస్త్రి భారత క్రికెట్కు నాలుగు దశాబ్ధాల సేవలను అందించాడు. ప్లేయర్గా, కోచ్గా భారత జట్టు విజయాల్లో భాగమయ్యాడు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా శాస్త్రి ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు తొలి భారత క్రికెటర్ కూడా శాస్త్రినే కావడం విశేషం. రవిశాస్త్రి తన కెరీర్లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి దాదాపు 7,000 పరుగులు, 280 వికెట్లు తీశారు.
ముంబై ఇండియన్స్లోకి వైభవ్ సూర్యవంశీ?
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరు. ఐపీఎల్-2026 సీజన్లోనూ వైభవ్ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. 15 ఏళ్ల వైభవ్ తన సంచలన బ్యాటింగ్తో వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం వణికిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా 31 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు మూడో మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్ వంటి పవర్ఫుల్ బౌలింగ్ ఎటాక్ను ఎదుర్కొనేందుకు వైభవ్ సిద్దమయ్యాడు.మంగళవారం రాజస్తాన్ రాయల్స్ గౌహతి వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. అయితే ఈమ్యాచ్కు ముందు బీసీసీఐ మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ త్వరలోనే ముంబై ఇండియన్స్ తరపున ఆడే అవకాశముందని పరాంజ్పే జోస్యం చెప్పాడు."ఈ రోజు వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు జట్టుపైనే ఆడబోతున్నాడు. భవిష్యత్తులో ట్రేడింగ్ ద్వారా లేదా వేలంలో భారీ ధరకు వైభవ్ను ముంబై సొంతం చేసుకునే అవకాశం ఉందని" అని పరాంజ్పే ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా గౌహతి వేదికగా రాజస్తాన్-ముంబై మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో టాస్ కూడా ఇంకా పడలేదు.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డు
అత్యంత పిన్న వయస్సులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన బాలుడిగా కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ నిలిచాడు. రెండు సంవత్సరాల 11 నెలల వయసులో ఈ ఘనత సాధించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు అసాధారణ రికార్డులను నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) స్థానం సాధించిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ నిలిచాడు. 15 నిమిషాల 52 సెకండ్స్ లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకండ్స్ లలో 21 చెస్ బోర్డ్ లను అమర్చి రెండు ప్రపంచ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాడు.జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో మంగళవారం వేడుకగా ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ ప్రపంచ రికార్డ్ సాధించి, భరతమాత ముద్దు బిడ్డగా, అపార మేధస్సు కలిగిన స్వామి వివేకానందునిగా అవతరించాడని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశంసించారు. మరోవైపు.. తన మనవడి ప్రతిభను చూసి మంత్రి సురేఖ మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, శ్రీయాన్ష్ తల్లి కొండా సుస్మిత పటేల్ ఉద్వేగంతో ఆనంద భాష్పాలు రాల్చారు.కాగా రాయ్ చెస్ అకాడమీ తరఫున క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొండా శ్రేయాన్ష్ పటేల్కు ట్రోఫీలు, సర్టిఫికెట్ లను ప్రదానం చేశారు. త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారంతో పాటు సర్టిఫికెట్ను శ్రేయాన్ష్ కృష్ణ పటేల్ పొందనున్నాడు.
భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!
ఐపీఎల్-2026 సీజన్ తర్వాత భారత అండర్-19, అండర్-25జట్లు రెడ్ బాల్ సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. యువ ఆటగాళ్లలలో రెడ్ బాల్ స్కిల్స్ను వెలికితీసేందుకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఒక ప్రత్యేక ట్రైనింగ్ క్యాంప్ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.ఈ అండర్-25 హై-పెర్ఫార్మెన్స్ క్యాంప్ కోసం 25 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసింది. అయితే ఈ లిస్ట్లో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రేలకు చోటు దక్కలేదు. వీరిద్దరూ ఐపీఎల్-2026లో బీజీగా ఉండడంతో బోర్డు పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రధాన జట్టులో మాత్రం వారు చోటు దక్కించుకునే అవకాశముంది.కాగా శ్రీలంక టూర్ కంటే ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. దేశవ్యాప్తంగా 64 మంది యువ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. వీరిని 4 జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో 16 మంది ఉంటారు.ఇందుకోసం సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో రాణించిన 25 మందిని, రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో సత్తాచాటిన 25 మందిని ఎంపికచేశారు. మిగిలిన 14 మందిలో అండర్-19 వరల్డ్కప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు.ఈ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్లో రాణించిన వారికి 'ఇండియా ఎమర్జింగ్'(అండర్-25) ప్రధాన జట్టులో చోటు దక్కనుంది. ఈ జట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్లు ఆడనుంది. మొత్తం ఈ క్యాంప్ మొత్తం దిగ్గజ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జరగనుంది.బీసీసీఐ అండర్-25 షార్ట్లిస్ట్ ప్లేయర్స్ వీరే:ఆయుష్ దోసేజా, యష్ ధుల్, మయాంక్ వర్మ, ఆయుష్ పాండే, శాశ్వత్ రావత్, మహేష్ పిథియా, రాజ్ లింబాని, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, అకిబ్ ఖాన్, కార్తీక్ యాదవ్, విద్యాధర్ పాటిల్, కె. హిమతేజ, భువనగిరి పున్నయ్య, పుఖ్రాజ్ మాన్, యశ్వర్ధన్ దలాల్, పార్థ్ వత్స్, ఈడెన్ ఆపిల్ టామ్, హిమాన్షు సింగ్, అమన్ మోఖాడే.చదవండి: David Warner Arrest: ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ అరెస్టు
నిఖత్కు నిరాశ
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
‘పసిడి’ రేసులో లలిత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లిం...
వైదొలిగిన సాత్విక్–చిరాగ్ జోడీ
నింగ్బో (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ...
భారత్కు ఐదు పతకాలు ఖాయం
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా సీనియర్ బాక్సింగ్...
ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
ముంబైపై రాజస్తాన్ ఘన విజయంగౌహతి వేదికగా ముంబై ఇండ...
SRH: ‘అతడు లేనిలోటు తీరనిది.. బ్యాటర్ల వల్లే ఓటములు’
ఐపీఎల్-2026లో సన్రైజర్స్ హైదరాబాద్కు మిశ్రమ ఫల...
'ఇండియన్ ఏజెంట్' అన్నారు.. ఇప్పుడు ఏకంగా బోర్డు ప్రెసిడెంట్గా
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుం...
ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ షాక్
ఐపీఎల్-2026లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి మంచ...
క్రీడలు
ఉప్పల్ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)
ఉప్పల్లో క్రికెట్ ఉత్సాహం (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, జితేష్ శర్మ (ఫోటోలు)
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
వీడియోలు
CSK ఫ్యాన్ ను ఒక ఆట ఆడుకున్న RCB అమ్మాయి...
‘ఇష్టం లేకపోతే తప్పుకో'.. సంజుపై CSK ఫ్యాన్స్ ఆగ్రహం
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
కష్టాల్లో టీమిండియాను గెలిపించాడు.. ప్రచారంలో సంజూ ని ఆకాశానికి ఎత్తేసిన మోడీ
అయ్యర్ కు మ్యాచ్ గెలిచిన ఆ సంతోషం దక్కలేదు..!
5 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం
దూసుకెళ్తున్న పంజాబ్
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
తొలి మ్యాచ్ లోనే ఓడిపోయినా.. కప్ మాత్రం సీఎస్కేదేనా..?
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
