Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Women World Cup 2025: Australia Beat Pakistan By 107 Runs1
World Cup 2025: పాక్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC World Cup)లో మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా రెండో విజయం సాధించింది. టోర్నీలో తొలుత న్యూజిలాండ్‌ వుమెన్‌ను 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన ఆసీస్‌ జట్టు.. తాజాగా పాకిస్తాన్‌ (Aus W vs Pak W)పై ఘన విజయం సాధించింది.కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఆసీస్‌.. పాక్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్‌ (10).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎలిస్‌ పెర్రీ (5) విఫలం కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.మూనీ సెంచరీ.. అలనా హాఫ్‌ సెంచరీఆ తర్వాత కూడా పాక్‌ బౌలర్లు విజృంభించడంతో ఐదో నంబర్‌ ప్లేయర్‌ అనాబెల్‌ సదర్లాండ్‌ (1) సహా ఆ తర్వాత వచ్చిన ఆష్లే గార్డ్‌నర్‌ (1), తహీలా మెగ్రాత్‌ (5), జార్జియా వారేహామ్‌ (0), కిమ్‌ గార్త్‌ (11) పెవిలియన్‌కు క్యూ కట్టారు.ఈ నేపథ్యంలో కేవలం 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆసీస్‌ను బెత్‌ మూనీ (Beth Mooney), అలనా కింగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు. మూనీ 114 బంతుల్లో 109 పరుగులతో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.చెలరేగిన ఆసీస్‌ బౌలర్లుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు ఆసీస్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. కిమ్‌ గార్త్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ సదాఫ్‌ షమాస్‌ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించగా.. మునీబా అలీ (3)ని మేగన్‌ షట్‌ వెనక్కి పంపింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన సిద్రా ఆమిన్‌ (35) కాసేపు పోరాడగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఆమెను అవుట్‌ చేసింది.ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ సిద్రా నవాజ్‌ (5) వికెట్‌ను కిమ్‌ గార్త్‌ తన ఖాతాలో వేసుకోగా.. నటాలియా పర్వేజ్‌ (1)ను మేగన్‌ పెవిలియన్‌కు పంపింది. ఇక కెప్టెన్‌ ఫాతిమా సనా 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సదర్లాండ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కాగా.. డయానా బేగ్‌ (7)ను జార్జియా వారేహామ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది.114 పరుగులకే కుప్పకూలిన పాక్‌ఈ క్రమంలో 86 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన పాక్‌ను లక్ష్యం దిశగా నడిపించేందుకు స్పిన్నర్లు రమీన్‌ షమీమ్‌ (15), నష్రా సంధు (11) విఫలయత్నం చేశారు. అయితే, అలనా బౌలింగ్‌లో నష్రా తొమ్మిదో వికెట్‌గా.. సదర్లాండ్‌ బౌలింగ్‌లో షమీమ్‌ పదో వికెట్‌గా వెనుదిరగడంతో పాక్‌ పోరాటం ముగిసిపోయింది.ఈ క్రమంలో 36.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్‌ అయిన పాక్‌.. ఆసీస్‌ చేతిలో 107 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇదిలా ఉంటే.. ఆసీస్‌ తమ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. వర్షం కారణంగా టాస్‌ పడకుండానే ఆ మ్యాచ్‌ రద్దైపోయింది.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

After regular India snubs Shami turns to Ranji Trophy to prove himself2
మహ్మద్‌ షమీ కీలక నిర్ణయం

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami)కి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్‌ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్‌ క్రికెటర్‌కు ఇప్పుడు జట్టులో చోటే కరువైంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో గాయం తాలూకు బాధను దిగమింగి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు షమీ.సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్‌లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు.చాంపియన్‌ జట్టులోకోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ.. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే, ఈ వన్డే టోర్నీలో షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి తొమ్మిది వికెట్లు తీయగలిగాడు.రెండేళ్ల నుంచీ నిరాశే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పరిస్థితి ఇలా ఉంటే.. టెస్టుల్లో మాత్రం షమీకి రెండేళ్ల నుంచీ నిరాశే ఎదురవుతోంది. ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా అతడిని పక్కనపెట్టినట్లు టీమిండియా మేనేజ్‌మెంట్‌ చెబుతోంది. మరోవైపు.. ఇటీవల దులిప్‌ ట్రోఫీలో బెంగాల్‌ తరఫున బరిలోకి దిగిన షమీ.. 34 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీయగలిగాడు.షమీ కీలక నిర్ణయంఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడే జట్టులోనూ అతడికి చోటి వ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. షమీ గురించి అప్‌డేట్‌ లేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి బెంగాల్‌ కోచ్‌ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరేడు రోజుల క్రితం షమీతో మాట్లాడాను. అతడు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. రంజీ ట్రోఫీలో మా ఓపెనింగ్‌ మ్యాచ్‌ నుంచే అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేఇదిలా ఉంటే.. బీసీసీఐ అధికారి ఒకరు షమీ గురించి ప్రస్తావన రాగా.. ‘‘టీమిండియాలోకి షమీ తిరిగి రావడం ప్రస్తుతం కష్టమే. ఇటీవల దులిప్‌ మ్యాచ్‌లోనూ అతడు రాణించలేకపోయాడు. రోజురోజుకీ వయసు మీద పడుతోంది. యువ ఆటగాళ్లతో అతడు పోటీ పడలేడు.అయితే, ఐపీఎల్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే.. అతడు ఆడక తప్పని పరిస్థితి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా షమీకి టీమిండియా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయినట్లేననే సంకేతాలు ఇచ్చారు సదరు అధికారి. కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన 35 ఏళ్ల షమీ కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.చదవండి: IND vs AUS: 462 వికెట్లు.. స్వింగ్ సుల్తాన్‌.. క‌ట్ చేస్తే! ఊహించ‌ని విధంగా కెరీర్‌కు ఎండ్ కార్డ్‌?

AUS W vs PAK W: Australia scripts history Become 1st Team In World To3
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా..

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వుమెన్‌ వన్డే క్రికెట్‌లో తొమ్మిదో వికెట్‌కు వందకు పైగా స్కోరు జతచేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఇంత వరకు ఏ మహిళా జట్టుకు సాధ్యం కాని ఘనత సాధించింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC Womens World Cup 2025)లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు ఈ ఫీట్‌ నమోదు చేసింది. ప్రపంచకప్‌ టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్‌ శ్రీలంక వేదికగా తమ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో ఆసీస్‌ (Aus W vs Pak W)తో తాజా మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బౌలింగ్‌ చేసింది.టాపార్డర్‌ కుదేలైనా..అయితే, పాక్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ టాపార్డర్‌ కుదేలైంది. ఓపెనర్లు కెప్టెన్‌ అలిసా హేలీ (20), ఫోబే లిచ్‌ఫీల్డ్‌ (10) నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఎలిస్‌ పెర్రీ 5 పరుగులకే నిష్క్రమించింది.మిగిలిన వాళ్లలో కిమ్‌ గార్త్‌ (11) తప్ప అంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన బెత్‌ మూనీ, పదో స్థానంలో వచ్చిన అలనా కింగ్‌ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశారు. మూనీ సెంచరీ (114 బంతుల్లో 109)తో చెలరేగగా.. అలనా 49 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.మూనీ- అలనా కలిసి తొమ్మిదో వికెట్‌కు 106 పరుగులు జోడించారు. తద్వారా మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ప్రపంచ రికార్డు సాధించారు.ప్రపంచంలోనే తొలి జట్టుగా..ఇక 76 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ.. మూనీ- అలనా రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు స్కోరు చేయగలిగింది. కాగా మహిళల వన్డే చరిత్రలో ఏడు ఎక్కువ వికెట్లు పడిన తర్వాత అత్యధిక పరుగులు సాధించిన జట్టుగానూ ఆసీస్‌ నిలిచింది. ఏడో వికెట్‌ పడిన తర్వాత ఆసీస్‌ 145 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డూ ఆసీస్‌ పేరు మీదేఐసీసీ పురుషుల వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆసీస్‌ 91 పరుగులకే ఏడు వికెట్ల నష్టపోయిన వేళ.. గ్లెన్‌ మాక్స్‌ వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌ కలిసి అద్భుతం చేశారు. ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 202 పరుగులు జోడించి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆసీస్‌ను నిలిపారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

ICC WC 2025 Aus W vs Pak W: Mooney Sensational Century Alana 504
పాక్‌ బౌలర్ల విజృంభణ.. సంతోషాన్ని ఆవిరి చేసిన ఆసీస్‌ బ్యాటర్‌

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (Beth Mooney) అద్భుత శతకంతో చెలరేగింది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో వంద పరుగుల మార్కును దాటి.. జట్టుకు మెరుగైన స్కోరు అందించింది. ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి పాక్‌ సంబరాలపై నీళ్లు చల్లింది.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 (ICC Women's ODI World Cup)లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్‌- పాకిస్తాన్‌ (Aus W vs Pak W) జట్ల మధ్య మ్యాచ్‌కు బుధవారం షెడ్యూల్‌ ఖరారైంది. ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.పాక్‌ బౌలర్ల విజృంభణకెప్టెన్‌ ఫాతిమా సనాతో పాటు సైదా ఇక్బాల్‌ ఆది నుంచే చెలరేగి ఆసీస్‌ ఓపెనింగ్‌ జంటను విడదీశారు. ఈ క్రమంలో ఓపెనర్లలో ఫొబు లిచ్‌ఫీల్డ్‌ 10, కెప్టెన్‌ అలిసా హేలీ 20 పరుగులకే పరిమితం కాగా.. వన్‌డౌన్లో వచ్చిన ఎలిస్‌ పెర్రీ (5) దారుణంగా విఫలమైంది. నష్రా సంధు బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగింది.పాక్‌ బౌలర్ల ధాటికి ఐదో స్థానంలో వచ్చిన అనాబెల్‌ సదర్లాండ్‌ (1), ఆష్లే గార్డ్‌నర్‌ (1), తాహిలా మెగ్రాత్‌ (5) ఇలా వచ్చి అలా వెళ్లగా.. జార్జియా వారేహమ్‌ (0), కిమ్‌ గార్త్‌ (11) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ.. ఆల్‌రౌండర్‌ అలనా కింగ్‌తో కలిసి అద్భుత పోరాటం చేసింది.బెత్‌ మూనీ సంచలన ఇన్నింగ్స్‌ఆసీస్‌ 76 పరుగులకే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. బెత్‌ మూనీ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ 114 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 109 పరుగులు సాధించింది. అయితే, ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఫాతిమా సనా బౌలింగ్‌లో సదాఫ్‌ షమాస్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో మూనీ అవుటైపోయింది.ఏకంగా 106 పరుగులు జోడించి.. పాక్‌ సంబరాలపై నీళ్లుమరో ఎండ్‌లో అలనా కింగ్‌ 49 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 106 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. మూనీ, అలనా అద్భుత ప్రదర్శన కారణంగా ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.దీంతో ఆదిలోనే వరుస వికెట్లు తీసిన పాక్‌ జట్టుకు ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఇక పాక్‌ బౌలర్లలో నష్రా సంధు అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రమీన్‌ షమీమ్‌, ఫాతిమా సనా చెరో రెండు.. డయానా బేగ్‌, సదియా ఇక్బాల్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పాక్‌పై బ్యాట్‌తో విజృంభించిన బెత్‌ మూనీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్‌ అంటూ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను కొనియాడుతున్నారు.చదవండి: అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు Alert 🚨 - You are watching one of the greatest comeback of all time as Australia 🇦🇺 were 76/7, but at the end scored 221/9 👏🏻- Beth Mooney and Alana King had a unbeaten partnership of 106 🔥 with Mooney's epic 💯 & King's 50 🥶- What's your take 🤔pic.twitter.com/nRkac6VuZy— Richard Kettleborough (@RichKettle07) October 8, 2025

IND squad to leave for AUS on This Date Gambhir to host dinner at residence5
టీమిండియాకు గంభీర్‌ డిన్నర్‌ పార్టీ!.. రోహిత్‌- కోహ్లి ఓ రోజు ముందుగానే..

ఇటీవలే ఆసియా టీ20 కప్‌-2025 (Asia Cup) గెలిచిన టీమిండియా వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపనుంది. అక్టోబరు నెల మొత్తం భారత క్రికెట్‌ జట్టు ఆటలో తలమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ మొదలుపెట్టిన టీమిండియా.. తొలి మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి జయభేరి మెగించింది.ఇరుజట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టుకు అక్టోబరు 10- 14 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన (India Tour Of Australia 2025)కు బయల్దేరనుంది. అక్టోబరు 15వ తేదీనే గిల్‌ సేన భారత్‌ నుంచి ఆసీస్‌కు పయనం కానున్నట్లు సమాచారం.టీమిండియాకు గంభీర్‌ డిన్నర్‌ పార్టీ!అయితే, అంతకంటే ముందు హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) టీమిండియాకు తన నివాసంలో డిన్నర్‌ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆసీస్‌ టూర్‌కు ముందు... వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుబ్‌మన్‌ గిల్‌ను కొత్త సారథిగా ఎంపిక చేసింది.అయితే, రోహిత్‌ను ఓపెనర్‌గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌- హెడ్‌కోచ్‌ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసే దిగ్గజ కెప్టెన్‌పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.రోహిత్‌- కోహ్లి ఓ రోజు ముందుగానే..ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లి ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో గంభీర్‌.. గిల్‌ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావడం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రో-కోలకు గంభీర్‌తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి.కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత మూడు వన్డేల సిరీస్‌.. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత్‌- ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియాశుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియాసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌. చదవండి: టీమిండియాతో సిరీస్‌లకు ఆసీస్‌ జట్ల ప్రకటన

There might be Messy end for Agarkar: Former Cricketer stunning RoKo claim6
అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదు: మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar)పై ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మ (Rohit Sharma)- విరాట్‌ కోహ్లి (Virat Kohli) విషయంలో అగార్కర్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించాడు. ఈ ఇద్దరు దిగ్గజ కెప్టెన్లు.. ముఖ్యంగా కోహ్లి.. అగ్కార్‌ను తప్పక ఓడించితీరతాడని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్‌- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు టెస్టులకు కూడా రిటైర్మెంట్‌ ఇచ్చాడు. రో- కో ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతుండగా.. బీసీసీఐ ఇటీవల అనూహ్య నిర్ణయం తీసుకుంది.శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలుఇటీవలే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన రోహిత్‌ శర్మ వన్డే కెప్టెన్‌గా తప్పించి.. శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా గిల్‌ వన్డే సారథిగా తన ప్రయాణం మొదలుపెడతాడని వెల్లడించింది. ఇక ఈ జట్టులో రోహిత్‌, కోహ్లి ఆటగాళ్లుగా కొనసాగనున్నారు.రో- కోకు పరోక్షంగా వార్నింగ్‌ఇక రోహిత్‌పై వేటు వేయడం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. రో- కో వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు ఆడతారని గ్యారెంటీ లేదని పేర్కొన్నాడు. అందుకే గిల్‌ను కెప్టెన్‌ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. వరల్డ్‌కప్‌ నాటికి జట్టులో ఉండాలంటే దేశీ క్రికెట్‌ కూడా ఆడకతప్పదని రో- కోకు పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చాడు.అగార్కర్‌కు అవమానకర ముగింపు తప్పదుఈ విషయం గురించి స్టీవ్‌ హార్మిసన్‌ తాజాగా స్పందించాడు. ‘‘దురదృష్టవశాత్తూ.. చివరికి అగార్కర్‌ అవమానకరమైన ముగింపు తప్పదని భావిస్తున్నా. ఈ పోటీలో మాజీ కెప్టెన్లు గెలుస్తారా? లేదంటే మాజీ ఆల్‌రౌండర్‌దే గెలుపా? అంటే.. కచ్చితంగా ఆ ఇద్దరే గెలుస్తారని అనుకుంటున్నా.అలా కాకుండా కేవలం కోహ్లి- శర్మలను రెచ్చగొట్టడానికి.. వారిని ఎలాగైనా వరల్డ్‌కప్‌లో ఆడించాలనే ఉద్దేశంతో అగార్కర్‌ ఈ మాటలు అంటే అది వేరే సంగతి. నిజంగా అదొక మంచి విషయమే అవుతుంది. అలా కాకుండా వారి గురించి ఉద్దేశపూర్వకంగానే ఇలా మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము.కోహ్లి మాత్రం కచ్చితంగా..రోహిత్‌ కంటే కోహ్లికి వన్డేల్లో గొప్ప రికార్డు ఉంది. రోహిత్‌ కోహ్లి కంటే వయసులోనూ కాస్త పెద్దవాడు. కాబట్టి వరల్డ్‌కప్‌ నాటికి రోహిత్‌ విషయం ఎలా ఉన్నా.. కోహ్లి మాత్రం కచ్చితంగా కొనసాగుతాడనే అనుకుంటున్నా.ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి జట్లపై 350 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి లేకుంటే టీమిండియా ఎలా గెలవగలదు?.. బహుశా కోహ్లి మనసులో కూడా ఇదే ఉండి ఉంటుంది. ఏదేమైనా అగార్కర్‌కు ఈ విషయంలో ఓటమి తప్పదు.ఛేజింగ్‌ కింగ్‌ఒకవేళ అగార్కర్‌ నిజంగానే రో- కో గురించి అలా అన్నాడా? లేదంటే అనువాద తప్పిదాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియవు’’ అని స్టీవ్‌ హార్మిసన్‌ పేర్కొన్నాడు. కాగా వన్డేల్లో ఛేజింగ్‌లోనే కోహ్లి 28 శతకాలు బాది 8064 పరుగులు రాబట్టాడు. ఇందులో 41 హాఫ్‌ సెంచరీలు కూడా ఉండటం విశేషం. అత్యుత్తమ స్కోరు 183. అంతేకాదు.. 300 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లి ఏకంగా ఏడు సెంచరీలు నమోదు చేయడం అతడు ఛేజింగ్‌ కింగ్‌ అనడానికి మరో నిదర్శనం.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్‌

ICC Test rankings: Siraj Rises to career best Jaiswal Slips out of top 57
ICC: దుమ్మురేపిన సిరాజ్‌.. కెరీర్‌ బెస్ట్‌!.. దిగజారిన జైసూ ర్యాంకు

టీమిండియా స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఇటీవలి కాలంలో సూపర్‌ ఫామ్‌ కనబరుస్తున్న ఈ హైదరాబాదీ బౌలర్‌లో కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్‌ సాధించాడు. ఈ క్రమంలో మూడు స్థానాలు ఎగబాకి పన్నెండో ర్యాంకుకు చేరుకున్నాడు.అగ్రస్థానం బుమ్రాదేఅంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ ((ICC) Latest Test Rankings)ను బుధవారం ప్రకటించింది. బౌలర్ల విభాగంలో టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jaspreet Bumrah) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. కగిసో రబడ, మ్యాట్‌ హెన్రీ, ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ టాప్‌-5లో కొనసాగుతున్నారు.సిరాజ్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా ఆ తర్వాతి స్థానాల్లో నొమన్‌ అలీ, స్కాట్‌ బోలాండ్‌, నాథన్‌ లియోన్‌, మార్కో యాన్సెన్‌, మిచెల్‌ స్టార్క్‌, గస్‌ అట్కిన్సన్‌ కొనసాగుతుండగా.. జేడన్‌ సీల్స్‌, ప్రభాత్‌ జయసూర్య, షమాన్‌ జోసెఫ్‌లను వెనక్కి నెట్టి సిరాజ్‌ పన్నెండో స్థానానికి దూసుకువచ్చాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 718 రేటింగ్‌ పాయింట్లు సాధించాడు.ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు తీసిన సిరాజ్‌.. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో తొలి టెస్టులోనూ ఫామ్‌ కొనసాగించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఏడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలోనే కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు సాధించాడు.రూట్‌.. రైట్‌ రైట్‌మరోవైపు.. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌ టాప్‌ ర్యాంకులో కొనసాగుతుండగా.. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రెండు స్థానాలు దిగజారి టాప్‌-5లో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా ఐదో స్థానంలోకి రాగా.. శ్రీలంక స్టార్‌ కమిందు మెండిస్‌ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఆరో స్థానానికి చేరుకున్నాడు.దిగజారిన జైసూ ర్యాంకుఇక జైస్వాల్‌ ఐదో ర్యాంకు నుంచి ఏడుకు పడిపోయాడు. అయితే, టీమిండియా మరో స్టార్‌ రిషభ్‌ పంత్‌ మాత్రం తన ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా రిషభ్‌ ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు, విండీస్‌తో తొలి టెస్టుకు దూరమైనా తన ర్యాంకును నిలబెట్టుకోగా.. వెస్టిండీస్‌తో మొదటి టెస్టులో విఫలమైన జైసూ (36) ఈ మేరకు చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.టాప్‌లోనే జడ్డూఅదే విధంగా.. టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్‌ స్టార్‌ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు స్థానాలు ఎగబాకి పదకొండో ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా విండీస్‌ తొలి టెస్టులో అజేయ శతకం (104) బాదిన జడ్డూ.. నాలుగు వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.చదవండి: వైభవ్‌ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్‌ గడ్డపై టీమిండియా గర్జన

It was Dravid: Rohit Sharma omits Gambhir name from CT 2025 credit list8
ద్రవిడ్‌ వల్లే సాధ్యమైంది.. చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాం: రోహిత్‌ శర్మ

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) వల్లే తమకు వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ఉద్వాసనకు గురైన తర్వాత రోహిత్‌ శర్మ తొలిసారి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు.ముంబైలో జరిగిన CEAT క్రికెట్‌ రేటింగ్‌ అవార్డు ప్రదానోత్సం కార్యక్రమంలో రోహిత్‌ పాల్గొన్నాడు. ఈ ఏడాది సారథిగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచినందుకుగానూ ప్రత్యేక పురస్కారం అందుకున్నాడు.ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదుఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ జట్టంటే నాకెంతో ఇష్టం. వారితో కలిసి ఆడటం, వారితో కలిసి ప్రయాణించడం గొప్ప విషయం. ఇదేదో ఒకటీ, రెండేళ్లలో సాధ్యమైంది కాదు. చాలా ఏళ్లుగా శ్రమిస్తున్న మాకు దక్కిన ప్రతిఫలం.చాలాసార్లు ఫైనల్‌ వరకు వచ్చి.. ట్రోఫీని చేజార్చుకున్నాం. అయితే, ఈసారి మాత్రం తప్పులు పునరావృతం కానివ్వద్దని నిర్ణయించుకున్నాం. ఒకరో.. ఇద్దరో ఆటగాళ్ల వల్ల ఇది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు గొప్పగా రాణిస్తేనే అనుకున్న ఫలితాన్ని రాబట్టగలం.నాకు, రాహుల్‌ భాయ్‌కు..చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలుపులో భాగమైన ఆటగాళ్లంతా.. టైటిల్‌కు అర్హులు. మేమంతా ఎన్నో ఏళ్లుగా దీనికోసం శ్రమిస్తున్నాం. కేవలం ఆట మీదే దృష్టి పెట్టాము. జట్టు నుంచి నాకు, రాహుల్‌ భాయ్‌కు అందిన సహకారం గొప్పది.టీ20 ప్రపంచకప్‌-2024లో మేము సిద్ధం చేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం. వాటినే చాంపియన్స్‌ ట్రోఫీ-2025లోనూ కొనసాగించాము. అయితే, 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో మాత్రం ఓడిపోయాము. ఆ తర్వాత మాలో పట్టుదల మరింత పెరిగింది’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.గంభీర్‌కు రోహిత్‌ కౌంటర్‌కాగా ద్రవిడ్‌ మార్గదర్శనంలో.. రోహిత్‌ కెప్టెన్సీలో 2024లో పొట్టి ప్రపంచకప్‌ గెలిచింది టీమిండియా. ఆ తర్వాత ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేయగా.. గౌతం గంభీర్‌ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో గంభీర్‌ మార్గదర్శనం చేసినా.. దాని వెనుక ద్రవిడ్‌ ఏళ్ల శ్రమ ఉందని రోహిత్‌ పరోక్షంగా చెప్పడం గమనార్హం.ఇక వన్డే కెప్టెన్‌గా కొనసాగాలనుకున్న రోహిత్‌ శర్మను తప్పించి.. శుబ్‌మన్‌ గిల్‌ను సారథి చేయడం వెనుక గంభీర్‌ హస్తం ఉందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఇలా తాను రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని చెప్పడం గమనార్హం. పరోక్షంగా గంభీర్‌కు హిట్‌మ్యాన్‌ ఇలా కౌంటర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ పలికిన రోహిత్‌.. వన్డేల్లో కొనసాగుతున్నాడు. మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ ఇప్పటికే టీమిండియా టెస్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 జట్టు నాయకుడిగా ఉన్నాడు.చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్‌

Toh itna lamba: Chahal breaks silence on Dhanashree cheating claim9
నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..

తన మాజీ భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ను ఉద్దేశించి టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (Yuzuvendra Chahal) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తన పేరు వాడుకోనిదే ఒకరికి పూట గడవదని అనిపిస్తే.. వారు అలా చేయడాన్ని తాను తప్పుపట్టనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ప్రేమ పాఠాలు..అసలు విషయం ఏమిటంటే.. యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మ వద్ద డాన్స్‌ పాఠాలు నేర్చుకునే క్రమంలో చహల్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరిద్దరు 2020లో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఎక్కడైనా జంటగా వెళ్తూ అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. 2025లో విడాకులు తీసుకుని అభిమానులకు షాకిచ్చారు.ఈ సందర్భంగా తాము 2022 నుంచే విడిగా ఉంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడం గమనార్హం. అయితే, విడాకుల తర్వాత పరస్పర ఆరోపణలతో ఇద్దరూ రచ్చకెక్కారు. అధికారికంగా విడాకులు మంజూరు కావడానికి ముందే.. బాలీవుడ్‌ నటి, ఆర్జే మహ్‌వశ్‌తో చహల్‌ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.అతడే వదిలిపెట్టాడుఅంతేకాదు.. ధనశ్రీ రూ. 4 కోట్ల భరణం తీసుకున్న నేపథ్యంలో.. ‘‘ఎవరి తిండి వారే సంపాదించుకోవాలి’’ అనే కోట్‌ ఉన్న షర్ట్‌ వేసుకుని కోర్టుకు వచ్చాడు చహల్‌. ఈ పరిణామాల నేపథ్యంలో ధనశ్రీ స్పందిస్తూ.. తాను విడాకులు తీసుకోవాలని అనుకోలేదని.. అతడే తనను వదిలిపెట్టాడంటూ చహల్‌పై ఆరోపణలు చేసింది. ఏదేమైనా చహల్‌ సంతోషంగా ఉంటే చాలని పేర్కొంది.పెళ్లైన రెండు నెలల్లోనేతాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ధనశ్రీ.. తోటి కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ.. పెళ్లైన రెండు నెలల్లోనే చహల్‌ తనను మోసం చేశాడని.. అయినా తాను సర్దుకుపోయినట్లు తెలిపింది. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కాగా.. చహల్‌ తాజాగా హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ధనశ్రీ వ్యాఖ్యలను ఖండించాడు.‘‘ఒకవేళ ఏదైనా బంధంలో ఓ వ్యక్తి రెండు నెలల్లోనే మోసగాడని తెలిస్తే.. అయినా అతడితో కలిసి ఎవరైనా జీవిస్తారా?.. నా దృష్టిలో ఇది ముగిసిన అధ్యాయం. అయిందేదో అయిపోయింది. నేను జీవితంలో ముందుకు సాగుతున్నాను.నాలుగున్నరేళ్ల కాపురం.. మోసగాడినే అయితే..కానీ కొందరు అదే పట్టుకుని వేలాడుతున్నారు. అయినా, మేమే నాలుగున్నరేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్నాము. కలిసి కాపురం చేశాం. ఒకవేళ నేను నిజంగా మోసగాడినే అయితే.. ఆ వ్యక్తి అంతకాలం నాతో ఎలా కలిసి ఉంటారు?.. నా పేరు చెప్పుకోనిదే ఒకరికి పూట గడవదు అంటే అలాగే చేసుకోనివ్వండి.వారి మాటలు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. ఈ విషయంపై నేను స్పందించడం ఇదే ఆఖరిసారి. ముగిసిన అధ్యాయం గురించి మరోసారి మాట్లాడను. నేను ఒక క్రీడాకారుడిని. మోసగాడిని కాదు’’ అని చహల్‌.. ధనశ్రీకి ఘాటు కౌంటర్‌ ఇచ్చాడు.టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్‌.. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఈ రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ చివరగా.. 2023లో టీమిండియాకు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లలో కలిపి 221 వికెట్లు తీసిన చహల్‌... అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు.చదవండి: తిట్టకు అమ్మా!.. ఏదో ఒకరోజు ఇంట్లో పట్టనంత డబ్బు సంపాదిస్తా.. కట్‌చేస్తే..

Prithvi Shaw chills with girlfriend after fighting with Musheer Khan in practice match10
ముషీర్‌ ఖాన్‌తో గొడవ తర్వాత గర్ల్‌ ఫ్రెండ్‌తో చిల్‌ అయిన పృథ్వీ షా

వివాదాలు, క్రమశిక్షణ లేమి కారణంగా బ్రహాండమైన కెరీర్‌ను నాశనం చేసుకున్న మహారాష్ట్ర బ్యాటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి వార్తల్లో నిలిచాడు. నిన్న (అక్టోబర్‌ 7) ముంబైతో జరిగిన రంజీ వార్మప్‌ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (181) చేసిన అనంతరం షా తన మాజీ సహచరుడు ముషీర్‌ ఖాన్‌తో (Musheer Khan) గొడవ పడ్డాడు.వాస్తవానికి ముషీర్‌ ఖానే మొదట షాను గెలికాడు. షాను ఔట్‌ చేసిన ఆనందంలో ముషీర్‌ వ్యంగ్యంగా థ్యాంక్యూ అని అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన షా.. ఒక్కసారిగా ముషీర్‌పైకి దూసుకొచ్చి, కాలర్‌ పట్టుకొని బ్యాట్‌ ఎత్తాడు. అంపైర్లు, సహచరులు వారించడంతో షా తగ్గి పెవిలియన్‌ వైపు వెళ్లబోయాడు.పోయే క్రమంలో మరో ముంబై ఆటగాడు షమ్స్‌ ములానీ కూడా షాను ఏదో అన్నాడు. దీనికి కూడా షా ఘాటుగానే స్పందించాడు. ఈ గొడవల కారణంగా షా చేసిన సూపర్‌ సెంచరీ మరుగున పడింది. మిస్‌ బిహేవియర్‌ కారణంగా అందరూ షానే తప్పుబడుతున్నారు. ఈ వివాదాల కారణంగానే ఎక్కడో ఉండాల్సిన వాడు ఇంకా దేశవాలీ క్రికెట్‌లోనే మిగిలిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇంత వివాదం జరిగిన తర్వాత షా తన సోషల్‌మీడియా పోస్ట్‌ కారణంగా మరోసారి వార్తల్లోకెక్కడం విశేషం. మ్యాచ్‌ ముగిసిన అనంతరం షా తన ప్రేయసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్‌తో (Akriti Agarwal) కలిసి రిలాక్స్ అవుతున్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.గత కొంతకాలంగా షా-అకృతి మధ్య ప్రేయాణం​ నడుస్తుందన్న టాక్‌ నడుస్తుంది. వీరిద్దరూ ఇటీవల గణేశ్ చతుర్థి వేడుకల్లో కలిసి కనిపించారు. షా కొంతకాలం క్రితం మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకృతితో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్‌మీడియా టాక్‌.ఎవరీ అకృతి..?అకృతి అగర్వాల్‌ ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ముంబైలోని నిర్మలా కాలేజీ నుంచి BMS పూర్తి చేసిన అకృతి.. కోవిడ్ సమయంలో డాన్స్, లైఫ్‌స్టైల్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యింది.షా సెకెండ్‌ ఇన్నింగ్స్‌18 ఏళ్ల వయసులో వెస్టిండీస్‌పై టెస్ట్ సెంచరీతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న షా.. ఆతర్వాత ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ లేమి, వివాదాల కారణంగా కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు.ఇటీవలే క్రికెటర్‌గా జన్మనిచ్చిన ముంబై టీమ్‌ కూడా షాను వదిలేసింది. దీంతో అతను మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ జట్టు తరఫున కూడా వరుస సెంచరీలతో అదరగొడుతున్న షా.. టీమిండియాలో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. షా తన ఆఫ్‌ ద ఫీల్డ్‌ యాక్టివిటీస్‌ను పక్కన పెడితే క్రికెటర్‌గా మంచి భవిష్యత్తు ఉంటుంది. షా కంటే జూనియర్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌ ఇప్పుడు రెండు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌ అయిపోయాడు. కానీ, షా మాత్రం టీమిండియాలో చోటు కోసం​ పోరాడుతున్నాడు. చదవండి: సంచలన వార్త.. దేశం​ కోసం భారీ డీల్‌ను వదులుకున్న కమిన్స్‌, హెడ్‌..?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement