Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IND vs NZ 2nd T20I: Hardik Pandya Murali Karthik Animated Chat Goes Viral1
మాజీ క్రికెటర్‌తో హార్దిక్‌ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్‌

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్‌ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్‌ పడగొట్టిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు.వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76), కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌).. ఆల్‌రౌండర్‌ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టడంతో భారత్‌ 15.2 ఓవర్లలోనే కివీస్‌ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్‌తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్‌ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్‌ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్‌ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్‌ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్‌ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్‌ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్‌ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్‌ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026

Sarfaraz credits Azhar after double ton former captain Slams Selectors2
అతడొక అటాకింగ్‌ ప్లేయర్‌: సెలక్టర్లపై అజారుద్దీన్‌ ఫైర్‌

టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్‌లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 227 పరుగులు సాధించాడు.ఐదో డబుల్‌ సెంచరీ ఫలితంగా హైదరాబాద్‌తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఐదో డబుల్‌ సెంచరీ చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్‌ పార్కర్‌ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.ఈ సీజన్‌లో సర్ఫరాజ్‌ విజయ్‌ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్‌ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. అజారుద్దీన్‌కు క్రెడిట్‌ ఇచ్చాడు.ఎలా ఆడాలో చూపించారు‘‘నా కెరీర్‌లో పెద్దగా రివర్స్‌ స్వింగ్‌ షాట్లు ఆడలేదు. అజర్‌ సర్‌ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్‌ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.ఇక్కడ (ఉప్పల్‌) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అజర్‌ సర్‌ చెప్పారు. ఇన్‌స్వింగ్‌ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్‌ ఖాన్‌ అజారుద్దీన్‌ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్‌ సెంచరీ విషయంలో క్రెడిట్‌ మొత్తం సర్ఫరాజ్‌కే దక్కాలి. తను నా ఆఫీస్‌కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు.అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్‌ బ్యాటర్‌. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్‌ విమర్శించాడు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

IND vs AUS Test: BCCI Announces Women Squad Harman to lead3
ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని పదిహేను మంది సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా గతేడాది మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 గెలిచిన భారత జట్టు.. ఆ తర్వాత స్వదేశంలో శ్రీలంకతో వైట్‌బాల్‌ సిరీస్‌లలో విజయాలు సాధించింది.ఆస్ట్రేలియా పర్యటనప్రస్తుతం జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లంతా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026తో బిజీగా ఉన్నారు. జనవరి 9న మొదలైన ఈ టీ20 లీగ్‌.. ఫిబ్రవరి 5న ఫైనల్‌తో ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటన (India Women Tour Of Australia)కు వెళ్లనుంది. ఫిబ్రవరి 15 నుంచి మర్చి 6 మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు.. ఒక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది.ప్రతీకా రావల్‌కూ చోటుఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20, వన్డే జట్లను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా టెస్టు జట్టును కూడా అనౌన్స్‌ చేసింది. ఈ జట్టులో ప్రతీకా రావల్‌కు కూడా చోటు దక్కడం విశేషం. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో స్మృతి మంధానకు ఓపెనింగ్‌ జోడీగా రాణించిన ప్రతీకా.. అనూహ్య రీతిలో గాయపడి కీలక మ్యాచ్‌లకు దూరమైంది.అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న ప్రతీకా త్వరలోనే జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. ఇక మరో ఓపెనింగ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మకు కూడా టెస్టు జట్టులో సెలక్టర్లు స్థానం కల్పించారు.ఆస్ట్రేలియా వుమెన్‌తో ఏకైక టెస్టుకు భారత మహిళా జట్టుహర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), ఉమా ఛెత్రీ (వికెట్‌ కీపర్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, స్నేహ్‌ శర్మ, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే. చదవండి: ప్రత్యేకంగా ఏమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది: ఇషాన్‌ కిషన్‌

Nothing special For Lunch Asked Myself: Ishan Kishan On To 32 Ball 764
‘నేనేమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది’

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్‌ (6), అభిషేక్‌ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ జట్టును ఆదుకున్నాడు.ఇషాన్‌ ధనాధన్‌కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్‌ కిషన్‌.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య, దూబే మెరుపులుఇక ఇషాన్‌తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్‌పూర్‌ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదుఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్‌ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్‌ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్‌ తీసుకోకుండానే పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.పవర్‌ప్లే అత్యంత ముఖ్యం​ముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్‌ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్‌ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.దేశవాళీ క్రికెట్‌లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్‌ తరఫున కెప్టెన్‌గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.సరైన సమాధానం దొరికిందిఅయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్‌ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్‌ కిషన్‌ చెప్పుకొచ్చాడు.కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్‌ కిషన్‌ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఏకంగా ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపిక చేశారు. ఆధిక్యంలో టీమిండియాఅయితే, పునరాగమనంలో అంటే కివీస్‌తో తొలి టీ20లో మాత్రం ఇషాన్‌ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮‍💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm— Star Sports (@StarSportsIndia) January 23, 2026

Smriti friend claims Palash was caught cheating Cricketers beat him up: Report5
ఆమెతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన పలాష్‌.. చితకబాదిన క్రికెటర్లు?!

భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం గురించి మరోసారి చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకుని స్మృతి మంచి పని చేసిందని.. లేదంటే మోసగాడి చేతిలో బలైపోయి ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.నవంబరు 23నఅసలేం జరిగిందంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2025లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కేందుకు స్మృతి మంధాన సిద్ధమైంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్‌తో నవంబరు 23న ఆమె వివాహానికి ముహూర్తం ఖరారైంది. అయితే, అనూహ్య రీతిలో పెళ్లి వాయిదా పడింది. ఆ తర్వాత తమ వివాహం రద్దైనట్లు స్మృతి- పలాష్‌ విడివిడిగా అధికారిక ప్రకటన చేశారు.కాగా తనతో ప్రైవేట్‌గా చాట్‌ చేశాడంటూ పలాష్‌ ముచ్చల్‌ గురించి ఓ మహిళ సోషల్‌ మీడియాలో స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసింది. అందులో స్మృతిని కించపరిచినట్లుగా అతడి మాటలు ఉన్నాయి. అంతేకాదు పెళ్లికి కొన్ని గంటల ముందు పలాష్‌ వేరే మహిళతో గదిలో ఉన్నాడనే వదంతులూ వచ్చాయి.ఒకే మంచం మీద వేరే మహిళతో ఇప్పుడు ఆ రూమర్లు నిజమే అనేలా స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడిగా చెప్పుకొంటున్న నటుడు- నిర్మాత విద్యాన్‌ మానే వ్యాఖ్యలు చేశాడు. హిందుస్తాన్‌ సిటీతో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు స్మృతి పెళ్లి వేడుకల్లో నేనూ ఉన్నాను. గదిలో ఒకే మంచం మీద వేరే మహిళతో అతడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.అతడిని కొట్టారుఅప్పుడు పరిస్థితి మొత్తం గంభీరంగా.. భయానకంగా మారిపోయింది. స్మృతి సహచర క్రికెటర్లు అతడిని కొట్టారు. ముచ్చల్‌ కుటుంబం మొత్తం దొంగబుద్ధి కలవారే!.. అతడు స్మృతిని పెళ్లి చేసుకుని సాంగ్లిలో సెటిల్‌ అవుతాడని నేను అనుకున్నా. కానీ అంతా తలకిందులైపోయింది’’ అని విద్యాన్‌ మానే చెప్పుకొచ్చాడు. కాగా స్మృతి పెళ్లి సంగీత్‌, మెహందీ, హల్దీ వేడుకల్లో క్రికెటర్లు శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్‌ సందడి చేశారు. ఈ నలుగురు ఆమె ప్రాణ స్నేహితులు. మోసం చేశాడుకాగా ఫిలిం ఫైనాన్సర్‌గా ఉన్న తన దగ్గరకు వచ్చిన పలాష్‌.. నజరియా అనే సినిమా తీస్తున్నానని.. ఇందుకు పెట్టుబడి పెట్టమని కోరినట్లు విద్యాన్‌ మానే ఈ సందర్భంగా తెలిపాడు. ఇందుకోసం విడతల వారీగా డబ్బు ఇచ్చానని.. అయితే, సినిమా పనులు మొదలుకాకపోగా.. ఆ తర్వాత పలాష్‌ ఫోన్‌ ఎత్తడం కూడా మానేశాడని ఆరోపించాడు. నిరాధార ఆరోపణలుఈ క్రమంలోనే అతడిపై చీటింగ్‌ కేసు పెట్టినట్లు వెల్లడించాడు. అయితే, పలాష్‌ మాత్రం ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని కొట్టిపారేశాడు. తన లాయర్‌ ద్వారా చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వెల్లడించాడు.ఇదిలా ఉంటే.. పెళ్లి రద్దు తర్వాత ఆటపైనే పూర్తిగా దృష్టి సారించింది స్మృతి. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూపీఎల్‌)-2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీని నిలిపింది. చదవండి: ఎవరినీ నమ్మను.. ఆమెకు బ్రేకప్‌ చెప్పిన టీమిండియా స్టార్‌!.. పోస్ట్‌ వైరల్‌

T20 WC 2026: ICC DRC Is Unlikely To Resolve Bangladesh Concerns, Why?6
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్‌ తప్పదు!

టీ20 ప్రపంచకప్‌-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్‌ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు​, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్‌సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్‌సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్‌సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్‌)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్‌ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్‌ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్‌ అమీనుల్‌ ఇస్లామ్‌ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్‌–19 వరల్డ్‌ కప్‌ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్‌ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్‌ కప్‌ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

Afridi Babar named in Pakistan T20I squad for Australia series7
పాక్‌ టి20 జట్టులో షాహిన్, బాబర్‌

కరాచీ: పాకిస్తాన్‌ సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరిగే టి20 సిరీస్‌ కోసం షాహిన్‌ అఫ్రిదిని ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకోవడంతో అతనికి ఎప్పట్లాగే రెగ్యులర్‌ జట్టులో చోటు ఇచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా ఇటీవల శ్రీలంకతో ఆడిన పాకిస్తాన్‌ జట్టే... త్వరలో ఆస్ట్రేలియాతోనూ మూడు టి20ల ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడుతుంది. ఆ్రస్టేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌ జట్టుకు ఆడిన బాబర్‌ ఆజమ్‌ కూడా పాక్‌ జట్టులోకి వచ్చాడు. భారత్, శ్రీలంకలో జరగబోయే మెగా ఈవెంట్‌కు ముందు పాక్, ఆసీస్‌లకు ఇది చివరి సన్నాహక టోర్నీ! 3 మ్యాచ్‌లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియమే ఆతిథ్యమిస్తుంది. ఈ నెల 29, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. ఈ టోర్నీ కోసం ఆస్ట్రేలియా ఈ నెల 28న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. పాకిస్తాన్‌ జట్టు: సల్మాన్‌ అలీ ఆఘా (కెపె్టన్‌), అబ్రార్‌ అహ్మద్, బాబర్‌ ఆజమ్, ఫహీమ్, ఫఖర్‌ జమాన్, ఖ్వాజా మొహమ్మద్, మొహమ్మద్‌ నవాజ్, సల్మాన్‌ మీర్జా, మొహమ్మద్‌ వసీమ్, నసీమ్‌ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, షాహిన్‌ షా అఫ్రిది, షాదాబ్‌ ఖాన్, ఉస్మాన్‌ ఖాన్, ఉస్మాన్‌ తారిఖ్‌.

Suryakumar Yadav reveals how Ishan Kishan tested his patience in 2nd T20I vs NZ8
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్‌

రాయ్‌పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో టీమిండియా అద‌ర‌గొట్టింది. బౌలింగ్‌లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి బ్యాటింగ్‌లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 15.2 ఓవ‌ర్ల‌లో చేధించింది.త‌ద్వారా న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో విఫ‌ల‌మైన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్‌.. రాయ్‌పూర్‌లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్‌పై సూర్య‌కుమార్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించాడు. పవర్‌ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్య‌కొనియాడాడు. "ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో, మ్యాచ్‌కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అత‌డి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌ను నేను ఎప్పుడూ చూడ‌లేదు. ప‌వ‌ర్‌ప్లేలో తొలి రెండు ఓవ‌ర్ల‌లో మాకు కేవ‌లం 8 ప‌రుగుల‌కే వ‌చ్చాయి. అటువంటిది ప‌వ‌ర్‌ప్లేను 75 ప‌రుగుల‌తో ముగించ‌డం నిజంగా గ్రేట్‌. ఆ క్రెడిట్ మొత్తం కిష‌న్‌కే ద‌క్కాలి. 200 పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేట‌ప్పుడు బ్యాట‌ర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్‌లే మేము ఆశిస్తాము. ప్ర‌తీ ఒక్కరూ పూర్తి స్వేచ్చ‌గా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఇషాన్ స‌రిగ్గా అదే చేశాడు.ప‌వ‌ర్‌ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(న‌వ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడ‌డంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు స‌మ‌యం దొరికింది. చాలా రోజుల త‌ర్వాత హాఫ్ సెంచ‌రీ చేయ‌డం సంతోషంగా ఉంది. గ‌త మూడు వారాల నుంచి నెట్స్‌లో ఎక్కువ‌గా గ‌డిపాను. వాటి ఫ‌లితం ఈ మ్యాచ్‌లో స్ప‌ష్టంగా క‌న్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 ప‌రుగులు చేసేలా క‌నిపించింది. కానీ కుల్దీప్ యాద‌వ్‌, వ‌రుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధిని క‌ట్ట‌డి చేశారు. దూబే కూడా కీల‌క ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్‌లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.

India beat Kiwis by 7 wickets in second T209
సూర్య, ఇషాన్‌ విధ్వంసం

టి20ల్లో భారత్‌ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్‌ తొలి పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్‌ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్‌ కిషన్‌ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఫార్మాట్‌లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి. రాయ్‌పూర్‌: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్‌ సాంట్నర్‌ (27 బంతుల్లో 47 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రచిన్‌ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్‌ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (37 బంతుల్లో 82 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య, శివమ్‌ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్‌ పటేల్‌ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది. హాఫ్‌ సెంచరీ లేకుండానే... న్యూజిలాండ్‌ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సీఫెర్ట్‌ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్‌ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్‌ తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్‌’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్‌ 2 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదాడు. వరుణ్‌ ఓవర్లోనూ రెండు సిక్స్‌లతో రచిన్‌ జోరు కొనసాగించగా... కుల్దీప్‌ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్‌ ఫిలిప్స్‌ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్‌ (18), రచిన్‌ పెవిలియన్‌ చేరడంతో కివీస్‌ స్కోరు వేగం మందగించింది. చాప్‌మన్‌ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్‌ (15 నాటౌట్‌) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అభిషేక్‌ శర్మ ‘డకౌట్‌’ ఇన్నింగ్స్‌ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్‌ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్‌ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్‌ మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్‌ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన ఇషాన్‌... సాంట్నర్‌ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్‌ నుంచే వచ్చాయి. ఇషాన్‌ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్‌ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్‌ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్‌), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్‌ 19; సీఫెర్ట్‌ (సి) ఇషాన్‌ (బి) వరుణ్‌ 24; రచిన్‌ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్‌ 44; ఫిలిప్స్‌ (సి) పాండ్యా (బి) కుల్దీప్‌ 19; మిచెల్‌ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్‌మన్‌ (సి) అభిషేక్‌ (బి) పాండ్యా 10; సాంట్నర్‌ (నాటౌట్‌) 47; ఫోక్స్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్‌: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్‌ 3–1–35–1, వరుణ్‌ 4–0–35–1, కుల్దీప్‌ 4–0–35–2, అభిషేక్‌ 1–0–12–0, దూబే 1–0–7–1. భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) రచిన్‌ (బి) హెన్రీ 6; అభిషేక్‌ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 82; శివమ్‌ దూబే (నాటౌట్‌) 36; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్‌: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్‌ 3–0–67–0, సాంట్నర్‌ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్‌ 0.2–0–2–0.

Kalinga Lancers in the Mens Hockey India League final10
ఫైనల్లో కళింగ లాన్సర్స్‌

భువనేశ్వర్‌: పురుషుల హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో వేదాంత కళింగ లాన్సర్స్‌ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కళింగ లాన్సర్స్‌ జట్టు 2–1 గోల్స్‌తో రాంచీ రాయల్స్‌పై గెలుపొందడంతో నేరుగా టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. కళింగ తరఫున అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (12వ, 32వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించగా, రాంచీ రాయల్స్‌ జట్టులో మన్‌దీప్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్‌ చేశాడు. రాంచీకి ఫైనల్‌ చేరే అర్హత రెండో క్వాలిఫయర్‌ రూపంలో ఇంకా సజీవంగానే ఉంది. ఆదివారం ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా రాంచీతో హైదరాబాద్‌ తుఫాన్స్‌ తలపడుతుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో కళింగ లాన్సర్స్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు గత ఏడాది రన్నరప్‌ హైదరాబాద్‌ తుఫాన్స్‌ జట్టు రెండో క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో హైదరాబాద్‌ జట్టు 2–0తో హెచ్‌ఐఎల్‌ జీసీ జట్టుపై విజయం సాధించింది. తుఫాన్స్‌ స్ట్రయికర్‌ శిలానంద్‌ లాక్రా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. అతను 16వ, 39వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించాడు. హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ జీన్‌ పాల్‌ డానెబర్గ్‌ ప్రత్యర్థి గోల్స్‌ చేయకుండా అడ్డుగోడ కట్టేశాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement