Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli As Impact Player For First Time In His IPL Career 1
విరాట్‌ కోహ్లి అరుదైన ఫీట్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రావ‌డం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి త‌న కెరీర్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓపెన‌ర్‌గానే బ‌రిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోనూ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ కోహ్లి ప్ర‌ధాన జ‌ట్టులో స‌భ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి చీల‌మండ గాయంతో ఇబ్బంది ప‌డ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లి ఫీల్ఢింగ్‌కు దూరంగా ఉన్నాడు. ల‌క్నోతో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో క‌నిపించ‌డంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే క‌నిపించింది. అయితే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ రూల్ బ్యాట‌ర్ల‌కు ఉప‌యోగ‌క‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే కోహ్లి ల‌క్నోతో మ్యాచ్‌లో తొలుత తుది జ‌ట్టులో లేక‌పోయేస‌రికి అభిమానులు కంగారు ప‌డిన‌ప్ప‌టికీ కెప్టెన్ ప‌టిదార్ మ్యాచ్‌లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌స్తాడ‌ని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇‍♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026

Royal Challengers Bengaluru Beat Lucknow Super Giants By 5 Wickets2
కోహ్లి, రసిక్‌ సలామ్‌ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026

Ball Goes Out Of Stadium As Mitchell Marsh Slams 102 Meter Six Viral3
మిచెల్‌ మార్ష్‌ కళ్లు చెదిరే సిక్సర్‌!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ క‌ళ్లు చెదిరే సిక్స్‌తో మెరిశాడు. ఆర్సీబీ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన‌ ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ ఆఖ‌రి బంతిని మార్ష్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్స్ సందించాడు. 102 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన బంతి స్టేడియం అవ‌త‌ల ప‌డింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి 146 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు.102M SIX BY MITCHELL MARSH. 🤯 pic.twitter.com/YwUmYWUYx8— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2026

Rishabh Pant That Forced Him To Leave Field Mid-Match Vs RCB4
హాజిల్‌వుడ్‌ దెబ్బ.. పంత్‌ అబ్బ!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ఆర్సీబీ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ వేసిన బంతి పంత్‌ను గాయపర్చింది. లక్నో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. 12 పరుగుల చేసి మార్కరమ్‌ ఔటైన తర్వాత పంత్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌ హాజిల్‌వుడ్‌ వేశాడు. హాజిల్‌వుడ్‌ వేసిన తొలి మూడు బంతులను పంత్‌ జాగ్రత్తగా ఆడాడు. నాలుగో బంతిని పంత్‌ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్సయ్యి పంత్‌ ఎడమ మోచేతిని బలంగా తాకింది. బంతి బులెట్‌లా దూసుకురావడంతో దెబ్బకు పంత్‌ మోచేతి వాచిపోయింది. ఈ సమయంలో పంత్‌ నొప్పిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టడం కెమెరాలకు చిక్కింది. ఫిజియో వచ్చి పంత్‌ను పరీక్షించాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌ అయిన పంత్‌ డగౌట్‌కు వెళ్లిపోతున్న క్రమంలో హాజిల్‌వుడ్‌కు గాయమైన తన మోచేతిని చూపించడం గమనార్హం. అయితే ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బందిగా కనిపించిన పంత్‌ ఆరు బంతులెదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంత్‌ తర్వాతి మ్యాచ్‌ ఆడేది అనుమానమే. మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు.Rishabh Pant gets a blow on his Elbow What a bowling this by RCB ❤️, Hazlewood ☠️ test match lines and result for him ! Krunal gets 2 wickets! #RCBvsLSG #IPL2026 pic.twitter.com/BvRTGLn4lo— Cricket IQ (@S17Anurag) April 15, 2026Rishabh Pant retired hurt, it's a big loss for the rcb.I hope he is fine and a comeback stringer, till then the opposition will miss him the t20s.💔 pic.twitter.com/qV8TPYrWjh— Sujeet Suman (@sujeetsuman1991) April 15, 2026

IPL 2026: Dhoni Likely Fit Vs MI Match Sarfaraz Khan position Danger5
ధోని ఆగ‌మ‌నం.. అత‌డిపై వేటు త‌ప్ప‌దా!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రెండు వ‌రుస‌ విజ‌యాల‌తో జోష్ మీద క‌నిపిస్తున్న చెన్నై సూప‌ర్‌కింగ్స్ (సీఎస్‌కే) అభిమానుల‌కు శుభ‌వార్త‌. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్త‌న్న ధోని ఎంట్రీకి సంబంధించి సీఎస్‌కే యాజ‌మాన్యం కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. తాజా సమాచారం మేర‌కు అనుకున్న‌దానికంటే ముందుగానే ధోని సీఎస్‌కే జ‌ట్టుతో జాయిన్ అవ్వ‌నున్నాడు. ఏప్రిల్ 23న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ధోని బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కండ‌రాల గాయంతో టోర్నీలో సీఎస్‌కే ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న ధోని కేకేఆర్‌తో జ‌రిగిన నాలుగో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని అంతా భావించారు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. కానీ ధోని కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆడ‌లేదు. కండ‌రాల గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధోని ఏప్రిల్ 18న స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో ఆడ‌తాడా లేదా అన్న‌ది స్ప‌ష్టంగా తెలియదు. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల‌న్నీ ఇప్ప‌టికే అమ్ముడైపోయాయి. అయితే ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో మాత్రం క‌చ్చితంగా బ‌రిలోకి దిగ‌నున్నాడు.స‌ర్ఫ‌రాజ్ స్థానానికి ఎస‌రు?అయితే ధోని జ‌ట్టులోకి రానుండ‌డంతో ఎవ‌రు త‌మ‌ స్థానాన్ని త్యాగం చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. శాంస‌న్‌, ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, శివ‌మ్ దూబేలను ప‌క్క‌న‌బెట్టే సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చు. కాబ‌ట్టి సీఎస్‌కే ముందున్న ఆప్ష‌న్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ మాత్ర‌మే. ఈ సీజ‌న్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోతున్నాడు. ప‌రుగులు సాధిస్తున్న‌ప్ప‌టికీ వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాడు. దీంతో ధోని జ‌ట్టులోకి వ‌స్తే స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌పై వేటు ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇక సీఎస్‌కే సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.చదవండి: బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

Vinod Kambli Has Brain Clot Risk Of Brain Stroke Reveals Friend6
‘ఏ క్షణమైనా బ్రెయిన్‌స్ట్రోక్‌.. సిగరెట్లు అడుక్కుంటున్నాడు’

వినోద్‌ కాంబ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90వ దశకంలో భారత క్రికెట్‌ వర్గాల్లో అతడి పేరు మారుమ్రోగిపోయింది. అతడి చిన్ననాటి స్నేహితుడు సచిన్‌ టెండుల్కర్‌కు కాంబ్లీని పోటీగా భావించేవారు.అయితే, సచిన్‌ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా దిగ్గజంగా నీరాజనాలు అందుకునే స్థాయికి చేరుకోగా.. చెడు వ్యసనాల వల్ల కాంబ్లీ కెరీర్‌ నాశనమైంది. ముఖ్యంగా మితిమీరిన స్థాయిలో మద్యం తాగడం అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి.మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ఈ క్రమంలో 2024 డిసెంబరులో వినోద్‌ కాంబ్లీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో థానెలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. వైద్యానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో.. 1983లో టీమిండియాకు తొలిసారి వరల్డ్‌కప్‌ అందించిన భారత క్రికెటర్ల బృందం అతడికి ఆర్థికంగా సాయం చేసింది. కాంబ్లీ స్థానిక స్నేహితులు సైతం అతడికి అండగా నిలిచారు.ఆర్థిక సాయం అందిస్తున్నాంఅయితే, కాంబ్లీ ఇంత వరకు పూర్తి స్థాయిలో కోలుకోనేలేదు. ఈ నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ స్నేహితుడు మార్కస్‌ కౌటో తాజాగా షాకింగ్‌ విషయం వెల్లడించాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మా స్నేహితులందరినీ ఒక్క చోట చేర్చేలా వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాను. అందులో చాలా మంది క్రికెటర్లే ఉన్నారు. కాంబ్లీకి మేమంతా ఆర్థికంగా సాయం అందిస్తున్నాం.గత ఆరు నెలలుగా కాంబ్లీ జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయింది. రోజురోజుకీ తన పరిస్థితి దిగజారిపోతోంది. వినోద్‌ మెదడులో రక్తం గడ్డ కట్టింది. అయితే, ఇప్పుడు ఆ గడ్డను తీసేస్తే ప్రాణాలకే ప్రమాదం అట. అతడు ముందుజాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి సర్జరీ కష్టం అన్నారు.ఏ క్షణాన్నైనా బ్రెయిన్‌స్ట్రోక్‌ దాని వల్ల ఏ క్షణాన్నైనా వినోద్‌కు బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. అయితే, అతడి మనో సంకల్పం వల్ల ఇప్పటికైతే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వినోద్‌ ఇప్పటికే మద్యం మానేశాడు.సిగరెట్లు అడుక్కుంటున్నాడుఅయితే, సిగరెట్‌ తాగే అలవాటు మానుకోలేక సతమతమవుతున్నాడు. ఆటో డ్రైవర్లను కూడా సిగరెట్లు అడుగుతున్నారు. వాళ్లు కూడా సరేనని.. వినోద్‌ కాంబ్లీతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంబరపడుతున్నారు. కానీ.. తమ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకోలేకపోతున్నారు’’ అని మార్కస్‌ చెప్పుకొచ్చాడు. చదవండి: సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌.. టాప్‌-5 ప్లేయర్లు వీరే!

IPL 2026: Royal Challengers Bangalore Vs LSG Match Live Updates7
IPL 2026: లక్నోపై ఆ‍ర్సీబీ విజయం

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఆర్సీబీ నాలుగో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బుధ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ల‌క్నో విధించిన 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వగా, ప‌టిదార్ (27), జితేశ్ శ‌ర్మ (23) రాణించారు. మ‌ధ్య‌లో వ‌రుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన‌ప్ప‌టికీ చివ‌ర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్‌), షెప‌ర్డ్ (14 నాటౌట్‌)_ఆర్సీబీని విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ప్రిన్స్ యాద‌వ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదో వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన జితేశ్‌ ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ముకుల్‌ చౌదరీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంతకముందు 49 పరుగులు చేసిన కోహ్లి అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పడిక్కల్‌ (10) రూపంలో ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. అవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పడిక్కల్‌ హిమ్మత్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోహ్లి (45), పటిదార్‌ (7) క్రీజులో ఉన్నారు.కోహ్లి దూకుడు..లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి దంచికొడుతున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తున్న కోహ్లి 20 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది.147 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఫిల్‌ సాల్ట్‌ (7) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రిన్స్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సాల్ట్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. కోహ్లి (12), పడిక్కల్‌ (5) క్రీజులో ఉన్నారు.ఆర్సీబీ టార్గెట్‌ 147 పరుగులుఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ముకుల్‌ చౌదరీ (39), ఆయుశ్‌ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్‌ సలామ్‌ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్‌ కుమార్‌ 3, కృనాల్‌ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో కృనాల్‌ ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు.పంత్‌ ఔట్‌..లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన పంత్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ లో సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముకుల్‌ రాయ్‌ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గాయపడిన పంత్‌ మరోసారి బ్యాటింగ్‌కు వచ్చాడు.నాలుగు వికెట్లు డౌన్‌ లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో రజత్‌ పటీదార్‌కు క్యాచ్‌ ఇచ్చుకుని అబ్దుల్‌ సమద్‌ డకౌట్‌ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 90గా ఉంది. లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌ బౌల్డ్‌ అయ్యాడు. 35 బాల్స్‌ ఆడిన కృనాల్‌ పాండ్యా 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 40 పరులుగు బాదాడు. ప్రస్తుతం స్కోరు 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 75గా ఉంది. లక్నో సూపర్‌జెయింట్స్‌ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో పూరన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం లక్నో 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ పంత్‌ గాయానికి గురయ్యాడు. హాజిల్‌వుడ్‌ వేసిన బంతి పంత్‌ మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన పంత్‌ను ఫిజియో పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మైదానం వీడాడు. ప్రస్తుతం లక్నో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నోఆర్సీబీతో మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన మార్క‌ర‌మ్ ర‌షీక్ స‌లామ్ బౌలింగ్‌లో ప‌డిక్క‌ల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ల‌క్నో వికెట్ న‌ష్ట‌పోయి 32 ప‌రుగులు చేసింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఆర్సీబీ, ల‌క్నోలు ఇప్ప‌టివ‌ర‌కు ముఖాముఖి పోరులో 6 సార్లు త‌ల‌ప‌డ‌గా.. నాలుగుసార్లు ఆర్సీబీ, రెండుసార్లు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ విజ‌యాలు సాధించాయి. అయితే చిన్న‌స్వామి స్టేడియంలో త‌ల‌ప‌డిన రెండు సంద‌ర్భాల్లో ఇరుజ‌ట్లు చెరొక‌ మ్యాచ్‌ నెగ్గాయి.ఆర్సీబీ తుదిజ‌ట్టు: ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్‌ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలామ్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.ల‌క్నో తుది జ‌ట్టు: మార్క‌ర‌మ్‌, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

Who Can Replace Suryakumar As India Next T20I Captain Top 5 Options8
సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?!

సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్‌ హిట్‌ అవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ (2028)తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్‌ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.విషమ పరీక్షఈ టూర్‌లో అటు సారథిగా, ఇటు ప్లేయర్‌గా సూర్యకుమార్‌కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్‌ గంభీర్‌ 2028 ఒలింపిక్స్‌ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్‌ ఒలింపిక్స్‌ సమయానికి ఫిట్‌గా ఉంటాడా అనేది అనుమానమే.‘సూర్యకుమార్‌ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనకు అతడే కెప్టెన్‌ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్‌ కనీసం ఒక్క హాఫ్‌సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్‌... వరల్డ్‌కప్‌ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్‌పై 18 పరుగులు, ఇంగ్లండ్‌పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్‌... న్యూజిలాండ్‌తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌ కాగల అర్హత ఉన్న టాప్‌-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?శుబ్‌మన్‌ గిల్‌ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్‌ గిల్‌. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్‌ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్‌-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.అయితే, ఐపీఎల్‌-2026లో గనుక బ్యాటర్‌గా గిల్‌ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్‌లేమి కారణంగా గిల్‌ను టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.హార్దిక్‌ పాండ్యానిజానికి 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కెప్టెన్‌ కావాల్సింది హార్దిక్‌ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.ఆ సమయంలో.. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది.సంజూ శాంసన్‌జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్‌... టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్‌-8 నాకౌట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 రన్స్‌తో దుమ్ములేపాడు.ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.అక్షర్‌ పటేల్‌టీ20 వరల్డ్‌కప్‌-2026లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్‌ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.శ్రేయస్‌ అయ్యర్‌ముంబై సారథిగా, ఐపీఎల్‌లో వివిధ జట్ల కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెలిచింది. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఇరగదీసి ఫైనల్‌కు చేర్చాడు. అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Munaf Patel Defends Gautam Gambhir About Kohli-Rohit Retire-Test Cricket9
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

టీమిండియా మాజీ ఆట‌గాడు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌలింగ్ కోచ్‌ మునాఫ్ ప‌టేల్ భార‌త జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌ గౌత‌మ్ గంభీర్ విష‌యంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్‌గా గంభీర్‌ను తొల‌గిస్తే టీమిండియాలో విప‌త్తు త‌ప్ప‌దంటూ బీసీసీఐని హెచ్చ‌రించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌కు టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు మిశ్ర‌మ ఫలితాల‌ను అందుకుంది. చాంపియ‌న్స్ ట్రోఫీ, ఆసియా క‌ప్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు భార‌త్ గంభీర్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే వ‌చ్చాయి. అయితే ఇదే స‌మ‌యంలో జ‌ట్టులో సీనియ‌ర్లైన రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకోవ‌డం వెనుక గంభీర్ పాత్ర ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. వ‌న్డే, టీ20 ఫార్మాట్‌లో గంభీర్ కోచ్‌గా ప‌ర్వాలేద‌నిపించినప్ప‌టికీ టెస్టు ఫార్మాట్‌లో దారుణంగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అత‌న్ని కోచ్‌గా త‌ప్పించాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలోనే మునాఫ్ ప‌టేల్ గంభీర్‌కు అండ‌గా నిలిచాడు. మునాఫ్ ప‌టేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అత‌ని తత్వాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. త‌న క‌ఠిన నిర్ణ‌యాల‌తో శ‌త్రువుల‌ను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్‌గా త‌న ప‌నిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నాడ‌ని మాత్రం బలంగా చెప్ప‌గ‌ల‌ను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్‌సీఏ క్రికెట్ అకాడ‌మీలో సౌక‌ర్యాల్లో కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని మునాఫ్ పేర్కొన్నాడు. ఆట‌గాళ్ల ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్‌, రీహాబిలిటేష‌న్ సెంట‌ర్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు వినియోగించే ఎన్‌సీఏ అకాడ‌మీలో ప్ర‌స్తుతం బ‌ల‌మైన వ్య‌వ‌స్థ క‌నిపించ‌డం లేద‌ని తెలిపాడు. వెంట‌నే ఎన్‌సీఏ అకాడ‌మీని ప‌టిష్ట‌ప‌రిచేందుకు బీసీసీఐ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవస‌ర‌ముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెర‌పిస్టులు, కోచ్‌లు, స‌రైన శిక్ష‌ణ వంటి ప్రాథ‌మిక సౌక‌ర్యాల‌ను మ‌రింత మెరుగుపరచాల‌ని మునాఫ్ వెల్ల‌డించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్ర‌మాణాల‌ను మెరుగుప‌రిచే ల‌క్ష్యంతో బీసీసీఐ 2000 సంవ‌త్స‌రంలో బెంగ‌ళూరు కేంద్రంగా ఎన్‌సీఏ అకాడ‌మీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్ల‌కే రిటైర్మెంట్‌!

Vaibhav Sooryavanshi Set To Play Asian Games Selectors feels He is ready10
వైభవ్‌ సూర్యవంశీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సెలక్టర్లు ఈ బుడ్డోకి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదే భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న 15 ఏళ్ల వైభవ్‌ (Vaibhav Suryavanshi)... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టడం నిశ్చయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్‌ 19వ సీజన్‌ అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. అనంతరం జింబాబ్వేతోనూ టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ పర్యటనలకు కుదరకపోయినా..ఈ పర్యటనల కోసం త్వరలోనే జట్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 35 మంది ప్రాబబుల్స్‌ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో వైభవ్‌ పేరు కూడా ఉంది. ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ టెండూల్కర్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... ఆ వయసుకన్నా ముందే వైభవ్‌ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌తో పాటు దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సూర్యవంశీని సీనియర్‌ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఆసియా క్రీడల వరకైనాఈ నేపథ్యంలో ఒకవేళ తక్షణమే అతడికి అవకాశం కల్పించకున్నా... ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా క్రీడల వరకైనా సీనియర్‌ టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయమే. ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనుండగా... అదే సమయంలో టీమిండియా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. ఆ సమయంలో రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయాల్సి వస్తే... అందులో ఒక దాంట్లో సూర్యవంశీని ఎంపిక చేయొచ్చు అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘35 మంది ప్రాబబుల్స్‌ నుంచి సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వారందరి వీసా పనులు ప్రారంభమయ్యాయి. వైభవ్‌ను ఎంపిక చేయాలంటే..వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శనను సెలక్టర్లు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో నాలుగో ఓపెనర్‌ అవసరమేముంది. అంతకు కావాలి అంటే యశస్వి జైస్వాల్‌ కూడా ఉన్నాడు. వైభవ్‌ను ఎంపిక చేయాలి అంటే అభిషేక్, సంజూలను తీసుకోకపోవడానికి బలమైన కారణం అంటూ ఉండాలి. వారిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టినా... కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఆసియా క్రీడల సమయంలో మాత్రం రెండు జట్లు అనివార్యమే కాబట్టి వైభవ్‌ను ఎంపిక చేయవచ్చు’ అని అయన అన్నారు. పసిడి పతకాలుకాగా 2023లో తొలిసారి ఆసియా క్రీడలకు బీసీసీఐ పురుష, మహిళా జట్లను పంపగా.. రెండు జట్లు స్వర్ణ పతకాలు గెలిచాయి. రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో టీమిండియా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు గోల్డ్‌ మెడల్‌అందుకున్నాయి.చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement