ప్రధాన వార్తలు
శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్స్వీప్
వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా మహిళల జట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా డక్వర్త్ లూయిస్ పద్దతిలో 40 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జార్జియా వోల్ (53 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో మెరిసింది. చివర్లో నికోలా కేరీ (24 నాటౌట్), సోఫీ మొలినెక్స్ (25) రాణించారు. అయితే ఆసీస్ చేసిన స్కోరులో సగం పరుగులు జార్జియావే ఉండడం విశేషం. కాగా జార్జియా వోల్కు ఇదే తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం విశేషం.వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీయగా, జాజ్రా క్లాక్స్టన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (30 నాటౌట్), డియాండ్రా దొతిన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ఎలీస్పెర్రీ, మేగన్ స్కాట్,లూసీ హామిల్టన్ తలా ఒక వికెట్ తీశారు. అయితే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో పిచ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ను నిలిపివేసి డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. సెంచరీతో విధ్వంసం సృష్టించిన జార్జియా వోల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోగా, అలానా కింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరగనుంది.
‘ప్లేయర్ ఆఫ్ ఇయర్’ రేసులో హార్దిక్, నవ్నీత్ కౌర్
న్యూఢిల్లీ: భారత హాకీ స్టార్ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్, ఫార్వర్డ్ ప్లేయర్లు సుఖ్జీత్ సింగ్, సంజయ్లతో పాటు డిఫెండర్ అభిషేక్ హాకీ ఇండియా (హెచ్ఐ) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో ఉన్నారు. హెచ్ఐ వార్షిక అవార్డుల్లో ఈ నలుగురు హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్ పేరిట ప్రదానం చేసే ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు నామినేట్ అయ్యారు.మహిళల కేటగిరీలో ఈ అవార్డు కోసం సలీమా టెటె, నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సవిత పోటీపడుతున్నారు. న్యూఢిల్లీలో ఈ శుక్రవారంఅట్టహాసంగా అవార్డుల వేడుక నిర్వహించేందుకు హాకీ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు, పురుషుల సీనియర్ కేటగిరీలతో పాటు వర్ధమాన క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టేలా అండర్–21 విభాగంలోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు ప్రదానం చేయనుంది. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు.దీని కోసం 32 మంది నామినీలతో తుది జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో విజేతను శుక్రవారం వేడుకలో ప్రకటిస్తారు. జీవిత సాఫల్య పురస్కారంగా ప్రెసిడెంట్ అవార్డు, ఆటగాళ్లతో పాటు అంపైర్, మేనేజర్, టెక్నికల్ అఫీషియల్ అవార్డులు కూడా ఉంటాయి. ఈ అవార్డుల వేడుకలోనే ఆసియా కప్లో విజేతగా నిలిచిన సీనియర్ పురుషులు జట్టును, జూనియర్ ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ చెప్పారు. అవార్డులకు ఎంపికైన నామినీలు గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్: ప్రిన్స్దీప్ సింగ్, కిషన్ బహదూర్, బిచూ దేవి కరిబం, సూరజ్ కర్కేరా. డిఫెండర్ ఆఫ్ ద ఇయర్: సంజయ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్. మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్: హార్దిక్ సింగ్, సుమిత్, రాజ్ కుమార్ పాల్, నీలకంఠ శర్మ. ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్: సుఖ్జీత్, అభిషేక్, నవ్నీత్ కౌర్, శిలానంద్ లాక్రా. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 అమ్మాయిలు): సాక్షి రాణా, జ్యోతి సింగ్, సునెలితా టొప్పో, కనిక సివచ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (అండర్–21 పురుషులు): ప్రిన్స్ దీప్, మన్మీత్, అన్మోల్ ఎక్కా, అర్‡్షదీప్ సింగ్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (మహిళలు): నవ్నీత్ కౌర్, సలీమా టెటె, లాల్రెమ్సియామి, సవిత. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (పురుషులు): హార్దిక్ సింగ్, సుఖ్జీత్, సంజయ్, అభిషేక్.
మరో 4 రోజుల్లో ఐపీఎల్.. ఇంకా భారత్కు రాని స్టార్ ప్లేయర్
ఐపీఎల్-2026 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేస్ అస్త్రం మిచెల్ స్టార్క్ మాత్రం జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) నుంచి లీగ్లో ఆడేందుకు స్టార్ సీమర్కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదని తెలిసింది.ఈ శనివారం లీగ్ ప్రారంభమవుతున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఏప్రిల్ 1న జరుగనుంది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే మొదటి మ్యాచ్కల్లా అతను అందుబాటులో ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.సోమవారం మీడియా సమావేశంలో క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. "ఆసీస్ బోర్డు నుంచి ఎన్వోసీ కోసం మేం ఎదురుచూస్తున్నాం. అది వస్తే స్టార్క్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉండేది చెప్పగలం. ఈ మేరకు సీఏతో సంప్రదింపులు జరుపుతున్నాం" అని అన్నాడు. ఫిట్నెస్ సమస్యలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, నెట్స్లో అతను బౌలింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారముందని చెప్పాడు. క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల రావు మాట్లాడుతూ అతను వస్తున్నాడని, ఎన్ఓసీ ఆలస్యమే అసలు సమస్యని పేర్కొన్నాడు.ఎన్ఓసీ జారీ చేస్తే తొలి మ్యాచ్ నుంచే స్టార్క్ అందుబాటులో ఉంటాడని చెప్పాడు. పేసర్ నటరాజన్ వందశాతం ఫిట్నెస్తో ఉన్నాడని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. గత సీజన్లో భుజం గాయం వల్ల నట్టు కేవలం రెండే మ్యాచ్లు ఆడాడు.చదవండి: IPL 2026: సన్రైజర్స్కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే
సన్రైజర్స్కు భారీ శుభవార్త.. ఇక దబిడి దిబిడే
ఐపీఎల్-2026 సీజన్ ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఊహించిన దానికంటే ముందే జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీతో తొలి మ్యాచ్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మంగళవారం బెంగళూరులో అడుగుపెట్టనుంది.అయితే కమ్మిన్స్ కూడా నేడే బెంగళూరుకు చేరుకోనున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా కమ్మిన్స్ గత కొంత కాలంగా తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతడు టీ20 ప్రపంచకప్-2026 నుంచి కూడా తప్పుకొన్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2026 సీజన్లో కూడా ఫస్ట్ హాఫ్కు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తమ జట్టు పగ్గాలను ఇషాన్ కిషన్కు అప్పగించింది. కానీ ఇప్పుడు కమ్మిన్స్ ముందుగానే భారత్కు చేరుకుంటుండటం ఆరెంజ్ ఆర్మీకి భారీ ఊరట కలిగించే ఆంశంగా చెప్పాలి.కమ్మిన్స్ తుది జట్టులో ఉంటాడా?అయితే కమిన్స్ ముందుగానే వచ్చినా.. మార్చి 28న ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మార్చి 25న ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల అధికారిక సమావేశానికి ఎస్ఆర్హెచ్ తరపున ఇషాన్ కిషన్ హాజరుకానున్నట్లు క్రిక్బజ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.దీని బట్టి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు కిషన్ జట్టు నడిపించనున్నాడని స్పష్టమవుతోంది. ఏదేమైనప్పటికి కమ్మిన్స్ జట్టుతో కలవడం ఎస్ఆర్హెచ్ కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ప్రాక్టీస్లో కానీ, మ్యాచ్ సమయంలో కానీ కమ్మిన్స్ తన అనుభవాన్ని పంచుకోనున్నాడు.మరోవైపు శ్రీలంక స్పీడ్స్టార్ ఎషాన్ మలింగ కూడా ఎస్ఆర్హెచ్ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ ఆడేందుకు శ్రీలంక క్రికెట్ ఎన్వోసీ మంజూరు చేసింది. ఇప్పుడు కమ్మిన్స్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తే సన్రైజర్స్ బౌలింగ్ యూనిట్ పటిష్టంగా మారనుంది.ఎస్ఆర్హెచ్ జట్టుబ్యాటర్లు: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరన్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ఆల్ రౌండర్లు: హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రెయిన్ ఫులేట్రా, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిబౌలర్లు: పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి
IPL 2026: ‘పరాగ్కు అంత సీన్ లేదు’
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రియాన్ పరాగ్ ఎంపికవడం వెనుక ఫ్రాంచైజీ పెద్దల నుంచి ప్రత్యేక మద్దతు గట్టిగా ఉందంటూ భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ కెప్టెన్గా పరాగ్ ఎంపిక తనను ఆశ్చర్చపరిచిందన్నాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. ఎందుకంటే అది రాజస్థాన్ ప్రాంచైజీ పెద్దల నిర్ణయం. అక్కడ రియాన్ పరాగ్ను వాళ్లు రాజులా చూసుకుంటారు. రాజస్థాన్ పరాగ్ను ఆకాశానికెత్తుతోంది కానీ అతడికి అంత సీన్ లేదు. గతేడాది పరాగ్కు అంతగా కలిసిరాలేదు. సంజూ శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్గా సేవలందించిన పరాగ్లో నాయకత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని ఈ సీజన్లోనూ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. సంజూ శాంసన్ను రూ. 18 కోట్లకు చెన్నై ట్రేడింగ్ చేసుకున్నప్పటికీ అతడి స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్లు రాజస్థాన్కు బదిలీ అయ్యారు. జడేజా, జైస్వాల్, ధ్రువ్ జురేల్ లాంటి నాయకత్వ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిచ్చాడు.‘గత సీజన్తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా వీరికి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. టాప్ ఐదుగురిలో ఇద్దరు రాణించినా రాజస్థాన్కు తిరుగుండదు. జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు పెద్ద బలం కానుంది. హెట్మైర్, జడేజా, షనక, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 50-50 శాతమే’ అని తెలిపాడు. ఇక రియాన్ పరాగ్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ల్లో 393 పరుగులు సాధించాడు. కేకేఆర్తో జరిగిన మ్యచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2017 నుంచి రాజస్థాన్ రాయల్స్కే ఆడుతున్న రియాన్ పరాగ్ ఇప్పటివరకు 84 మ్యాచ్ల్లో ఏడు అర్థశతకాలతో 1566 పరుగులు సాధించాడు. అయితే పరాగ్లో నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్ను చెన్నై సూపర్కింగ్స్తో ఆడనుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!
సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. అయితే డబ్ల్యూపీఎల్- 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆల్రౌండర్ అనుష్క శర్మకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారతీ ఫుల్మాలిని ప్రోటీస్తో సిరీస్కూ కొనసాగించారు. అద్భుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్న భారతీకి ఆసీస్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు 22 ఏళ్ల పేసర్ కాశ్వి గౌతమ్కు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.అయితే యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ, స్నేహ రాణాలను ఈ సిరీస్కు సెలెక్టర్లు పక్కన పెట్టారు. కాగా ఈ సిరీస్ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగనుంది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ప్రోటీస్ గడ్డపై ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు:హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.సిరీస్ షెడ్యూల్:1.ఏప్రిల్ 17: మొదటి టీ20 (డర్బన్)2.ఏప్రిల్ 19: రెండో టీ20 (డర్బన్)3.ఏప్రిల్ 22: మూడో టీ20 (జోహన్నెస్బర్గ్)4.ఏప్రిల్ 25: నాలుగో టీ20 (జోహన్నెస్బర్గ్)5.ఏప్రిల్ 27: ఐదో టీ20 (బెనోని)చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!
IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే!
ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైన వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా మ్యాచ్ రోజుల్లో ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లకు ఇకపై అనుమతి ఉండదని పేర్కొంది.కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు..ఏ జట్టు కూడా సాధన సమయంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్లను లేదా నెట్లను వాడకూడదు. ప్రతి సెషన్కు తాజాగా సిద్ధం చేసిన పిచ్లను తప్పనిసరిగా అందించాలి. ఉదాహరణకు, ఉదయం ‘టీమ్ బి’ ఉపయోగించిన పిచ్పై సాయంత్రం ‘టీమ్ ఎ’ సాధన చేయకూడదు.జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మొదటి జట్టు ఉపయోగించిన నెట్లను రెండవ జట్టుకు ఇవ్వరాదు.మ్యాచ్ జరిగే రోజులలో ప్రాక్టీస్కు అనుమతి ఉండదు. మ్యాచ్ జరిగే రోజున ప్రధాన ప్రాంగణంలో ఎలాంటి ఫిట్నెస్ పరీక్ష జరగదు.ప్రాక్టీస్ రోజుల్లో (ప్రీ టోర్నమెంట్, టోర్నీ జరుగుతున్న సమయంలో), గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్లోకి, మైదానంలోకి అనుమతిస్తారు.ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనంలో ప్రయాణిస్తారు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి జట్టు ప్రాక్టీస్ను వీక్షించే అవకాశం వీరికి కల్పిస్తారు.అదనపు సహాయక సిబ్బంది (త్రో డౌన్ స్పెషలిస్ట్/నెట్ బౌలర్లు) జాబితా వివరాలను బీసీసీఐకి సమర్పించాలి. బీసీసీఐ ఆమోదం పొందిన తర్వాతే వీరికి గుర్తింపు పత్రాలు జారీ చేయబడతాయి.ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చేటప్పుడు టీమ్ బస్సును మాత్రమే ఉపయోగించాలి. జట్లు రెండు బృందాలుగా ప్రయాణించవచ్చు.మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్, ఫిట్నెస్ టెస్ట్కు సంబంధించి ఎలాంటి అభ్యర్థన వచ్చినా స్థానిక మేనేజర్ను సంప్రదించాల్సి ఉంటుంది.మ్యాచ్ రోజు మార్గదర్శకాలు..పీఎంవోఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజున తమ గుర్తింపు పత్రాన్ని తీసుకురావడం తప్పనిసరి. మొదటిసారి గుర్తింపు పత్రాన్ని తీసుకురాని పక్షంలో, హెచ్చరికతో సరిపెడతారు. కానీ రెండోసారి అదే తప్పు చేస్తే ఆయా జట్టుకు జరిమానా విధించబడుతుంది.ఆటగాళ్లు నారింజ లేదా ఊదా రంగు టోపీలు ధరించాలి. ఒకవేళ ఆటగాళ్లు టోపీలు ధరించకపోతే, ప్రసారంలో కనిపించేంత వరకు మొదటి రెండు ఓవర్ల పాటు ఆ క్యాప్లను ధరించాలి.మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో ఫ్లాపీలు, స్లీవ్లెస్ జెర్సీలు ధరించేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. ఆటగాళ్లు రూల్ను పాటించకపోతే తొలిసారి హెచ్చరించడం జరుగుతుంది. రెండోసారి మాత్రం జరిమానా విధించడం జరుగుతుంది.ఐపీఎల్ 2025 సీజన్ మాదిరిగానే, మ్యాచ్ రోజుల్లో టీమ్ డాక్టర్తో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు.ఆటగాళ్ల జెర్సీ నంబర్లలో మార్పు ఉన్నట్లయితే, ఆయా ఫ్రాంచైజీలు నిబంధనల ప్రకారం 24 గంటల ముందే వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. చదవండి: సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన
‘గంభీర్.. మొరటుతనం తగ్గించుకో’
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావం అందరికి తెలిసిందే. గతంలో ఆటగాడిగానైనా, ఇప్పుడు కోచ్గానైనా అదే దూకుడు మంత్రం గంభీర్ను ప్రత్యేకంగా నిలిపింది. కొన్నిసార్లు అదే దూకుడుతనం గొడవలకు కూడా దారి తీసింది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీతో వైరం కూడా అలాంటి కోవకు చెందినదే. అయితే కోచ్గా గంభీర్ అంత కఠినంగా, మొరటుగా ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. అదే సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడంలోనూ విజయవంతమయ్యాడని ప్రశంసించాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘నిజానికి గంభీర్ కాస్త మొరటు వ్యక్తే కావొచ్చు. కానీ అతనో పోరాటయోధుడు. నేను అతడితో కలిసి ఆడాను. అతడు పోటీతత్వం కలవాడు. ప్రతీ మ్యాచ్ను భారత్ గెలవాలని బలంగా కోరుకునేవాడు. జట్టు కోసమే ఎప్పుడు మాట్లాడుతాడు. ఎల్లప్పుడూ సమిష్టితత్వాన్ని కోరుకుంటాడు. కోచ్గా గంభీర్కు అసలైన సవాల్ ముందుంది.సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్ (వైట్బాల్క్రికెట్) గంభీర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం. అక్కడి పరిస్థితులు అతనికి పరీక్షే అయినప్పటికీ కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఇక రెడ్బాల్ (టెస్టు క్రికెట్)లో ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ గంభీర్కు ఒక ఉదాహరణ. కోచ్గా అతను కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’అని చెప్పుకొచ్చాడు. భారత ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ రెండు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు. అందులో ఒకటి 2025 చాంపియన్స్ ట్రోఫీ కాగా, మరొకటి 2026 టీ20 ప్రపంచకప్. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీ కానుంది. ఇం2్లండ్లో సుదీర్ఘమైన వైట్ బాల్ సిరీస్కు ముందు భారత్ అఫ్గానిస్థాన్, ఐర్లాండ్లతో సిరీస్లు ఆడనుంది.చదవండి: ‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
‘ఆ రూల్కు నేనెప్పుడూ వ్యతిరేకమే’!
ఐపీఎల్లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్రౌండర్గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్ను వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. అక్షర్ మాట్లాడుతూ.. ‘ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్రౌండర్ను. గతంలో మేం ఈ రోల్ (బ్యాటింగ్, బౌలింగ్ చేసేవారు) కోసం ఆల్రౌండర్ను ఎంపిక చేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్, బౌలర్ను వాడుకుంటున్నది. అదే సమయంలో మనకు ఆల్రౌండర్ అవసరమా? అన్న చర్చ తలెత్తుతున్నది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా. మనం వాటిని పాటించాలి తప్పదు’ అని అన్నాడు. గతంలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇదే విషయమై అక్షర్ స్పందిస్తూ.. ‘18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలి గాయమే. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడే బౌలింగ్ చేసి నా వేలిని కాపాడుకున్నా. ఏడు మ్యాచ్ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయింది.’ అని చెప్పుకొచ్చాడు. అక్షర్పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న లక్నో సూపర్జెయింట్స్తో ఆడనుంది.
విమర్శలొచ్చినా వెనక్కి తగ్గని రహానే!
గత సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) నిరాశజనక ప్రదర్శన చేసింది. జట్టుగా కేకేఆర్ విఫలమైనా, బ్యాటర్గా మాత్రం టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. 14 మ్యాచ్ల్లో 390 పరుగులు సాధించి కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రహానే సారథ్యంలో 14 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించిన కేకేఆర్ 8వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే వైదొలగింది. రహానే తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టు ఓటములపై ప్రభావం చూపించింది. అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా కేకేఆర్ టైటిల్ కొట్టాలని రహానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ తన ప్రాక్టీస్ను ముమ్మరం చేసింది. ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మిగిలిఉన్న నేపథ్యంలో అన్ని జట్లు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్లతో బిజీగా గడుపుతున్నాయి. సోమవారం రాత్రి కేకేఆర్ జట్టు కూడా ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో రహానే బ్యాటింగ్లో దుమ్మురేపాడు. 25 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ల నుంచి బ్యాటింగ్లో గేర్ మార్చిన రహానే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తున్నాడు. ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లోనూ రహానే అదే జోరు కనబరిచాడు. ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. మరో బ్యాటర్ కామెరున్ గ్రీన్ కూడా 30 బంతుల్లో 52 పరుగులు చేసి వెనుదిరిగాడు. న్యూజిలాండ్ సంచలనం ఫిన్ అలెన్ కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. గాయపడిన ఆకాశ్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌరబ్ దూబే ఫిన్ అలెన్ను వెనక్కి పంపించాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈడెన్ గార్డెన్లో స్పిన్ వనరులను వినియోగించుకోవడంలో విఫలమైన రహానే కెప్టెన్గా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా జట్టుపై ప్రభావం చూపించాయి. అయితే తాజా సీజన్ ప్రారంభానికి ముందే బ్యాటర్గా తానేంటో నిరూపించుకున్న రహానే కెప్టెన్సీలోనూ అదే జోరు చూపించాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ తన తొలి మ్యాచ్ను మార్చి 29న ముంబై ఇండియన్స్తో ఆడనుంది.చదవండి: విదేశీ ఆటగాళ్లకు బెదిరింపులు!
బెదిరింపులకు లొంగని 11 ఏళ్ల చిన్నది!
ఫార్ములా వన్ రేసులో రారాజులే ఎక్కువగా కనిపిస్తా...
సెమీస్లో తన్వీ, ఇషారాణి ఓటమి
న్యూఢిల్లీ: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ ...
టైటిల్ పోరుకు అనాహత్ సింగ్
ముంబై: జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర...
జపాన్ స్టార్కు షాకిచ్చిన తాన్వి శర్మ
ఓర్లియాన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల...
'అతడు మరొక అభిషేక్ శర్మ.. వారికి టెన్షన్ మొదలైంది'
పంజాబ్ యువ సంచలనం సలీల్ అరోరా తొలిసారి ఐపీఎల్లో ఆ...
జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది?
ఐపీఎల్-2026 సీజన్కు ముందు భారత పేస్ గుర్రం, ముంబ...
ఎస్ఆర్హెచ్కు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్-2026 సీజన్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ...
భారత పర్యటనకు ఆసీస్ జట్టు.. షెడ్యూల్ ఖరారు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే ఏడాది భారత్లో ప...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసేటోడు ఇంకా పుట్టలే..! రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
