Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Players Revolt Against Coach Hesson After T20 WC Debacle1
T20 WC 2026: తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలుస్తోంది పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు. గ్రూప్‌ దశలో అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియా వంటి చిన్న జట్లపై గెలుపొందిన సల్మాన్‌ ఆఘా బృందం.. దాయాది టీమిండియా చేతిలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది.పాకిస్తాన్‌కు భంగపాటుఇక సూపర్‌-8 దశలోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోగా.. తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత శ్రీలంకపై భారీ విజయం సాధించాల్సి ఉండగా.. లంక గట్టి పోరాటం చేయడంతో పాకిస్తాన్‌కు భంగపాటు తప్పలేదు.లంకపై గెలిచినా న్యూజిలాండ్‌తో పోటీలో నెట్‌ రన్‌రేటు పరంగా వెనుకబడి సెమీస్‌ చేరకుండానే పాక్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో విఫలమైన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.భారీ జరిమానాఏకంగా 50 లక్షల రూపాయలు (పాక్‌ కరెన్సీలో) జరిమానా విధించాలని పీసీబీ నిర్ణయించినట్లు స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. మరోవైపు కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై వేటు పడనుందనే వార్తలూ ఊపందుకున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో.. హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌కు వ్యతిరేకంగా పాక్‌ ఆటగాళ్లు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. కోచ్‌ ఏకపక్ష నిర్ణయాల కారణంగా డ్రెసింగ్‌ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పటికే పీసీబీ అధికారులకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.తిరగబడ్డ పాక్‌ క్రికెటర్లు!.. ఇక వేటే!జియో సూపర్‌ కథనం ప్రకారం.. ‘‘టోర్నమెంట్‌ జరుగుతున్న సమయంలోనే చాలా మంది పాకిస్తాన్‌ ప్లేయర్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులను కలసి కోచ్‌ గురించి ఫిర్యాదు చేశారు. కీలక విషయాలను సైతం కెప్టెన్‌తో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్న తీరును వారి దృష్టికి తీసుకువచ్చారు.సొంత నిర్ణయాలతో యాజమాన్యం విషయాల్లోనూ హసన్‌ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరును వివరించారు. ఇందుకు సీనియర్‌ అధికారులు సానుకూలంగా స్పందించి.. సమీక్ష జరుపుతున్నారు. కోచ్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, హసన్‌కు రెండేళ్ల కాంట్రాక్టు ఉంది. కాబట్టి ఇప్పట్లో అతడిని తొలగించే ప్రయత్నం జరగకపోవచ్చు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్‌ బోర్డులో తొలి రాజీనామా

lunar eclipse: India coach on postponing practice session for IND vs ENG2
టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌

టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉంది. గ్రూప్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌అయితే, సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన సూర్యకుమార్‌ సేన.. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో భాగంగా ఇంగ్లండ్‌ (IND vs ENG)తో గురువారం తలపడనుంది టీమిండియా. ఇందుకు ముంబైలోని వాంఖడే మైదానం వేదిక.ఇందుకోసం ఇప్పటికే ముంబై చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది. అయితే, మంగళవారం నాటి చంద్ర గ్రహణం ప్రభావం టీమిండియాపై కూడా పడింది. గ్రహణం కారణంగా సూర్యకుమార్‌ సేన తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను గంటపాటు వాయిదా వేసుకుంది.టీమిండియాపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌కాగా గ్రహణం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 నిమిషాల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయంత్రం 6- 9 గంటల వరకు టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా అంటే ఏడు గంటలకు నెట్‌ సెషన్‌ను ఆరంభించింది. గ్రహణం సమయంలో ఏ పని చేయకూడదని.. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుందేమోనన్న భయంతో భారత జట్టు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అవును.. మా వాళ్లు చెప్పారుఈ విషయం గురించి టీమిండియా కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్పందించాడు. ‘‘అవును.. చంద్ర గ్రహణం గురించి నాకు మా వాళ్లు చెప్పారు. అందుకే సెషన్‌ను వాయిదా వేసుకున్నాం. అయితే, గ్రహణం ఒక్కటే మా రాతను మారుస్తుందనే భయం లేదు. గెలుపు కోసం అత్యుత్తమంగా ప్రయత్నించడమే ముఖ్యమైనది’’ అని మోర్కెల్‌ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌కు ఆఖరిగా బుధవారం కూడా టీమిండియా ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది ఆప్షనల్‌ కావడంతో వరుణ్‌ చక్రవర్తి, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, తిలక్‌ వర్మ మాత్రమే నెట్స్‌లో శ్రమించారు. మిగతా వారు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs ENG: అభిషేక్‌ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి

How Babar Azam Led To Pakistan 1st Big Resignation After T20 WC Fiasco3
T20 WC 2026: బాబర్ ఆజం ఎందుకు?.. తొలి రాజీనామా

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ను పేలవంగా ముగించింది. సూపర్‌-8లో తప్పక భారీ విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో నామమాత్రపు గెలుపుతో సరిపెట్టుకుంది. ఫలితంగా సెమీస్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.గుర్రుగా ఉన్న పీసీబీఐసీసీ ఈవెంట్లో పాక్‌ సెమీ ఫైనల్‌ కూడా చేరకుండానే ఇంటిబాట పట్టడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ నేపథ్యంలో ఇంటా బయటా పాక్‌ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సైతం సల్మాన్‌ ఆఘా (Salman Agha) బృందంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆటగాళ్లకు జరిమానా రూపంలో శిక్ష విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.సెలక్టర్‌ పదవికి రాజీనామాఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత పాక్‌ బోర్డులో తొలి వికెట్‌ పడింది. అలీం దర్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేశాడు. సెలక్షన్‌ కమిటీలోని ఇతర సభ్యులు, హెడ్‌కోచ్‌ మైక్‌ హసన్‌ తీరుకు నిరసనగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన అలీం దర్‌ అక్టోబరు 11, 2024లో పాక్‌ జట్టు సెలక్టర్‌గా నియమితుడయ్యాడు.ఆకిబ్‌ జావేద్‌, అజర్‌ అలీ, అనలిస్టు హసన్‌ చీమాతో కలిసి సెలక్టర్‌ పదవి చేపట్టాడు. అయితే, టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో మైక్‌ హసన్‌ అతి జోక్యం వల్ల అలీం దర్‌ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.బాబర్‌ ఆజం వద్దు అన్నందుకేనా?బాబర్‌ ఆజం, షాదాబ్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ వంటి సీనియర్లను ఎంపిక చేయవద్దని దర్‌ భావించగా.. ఆకిబ్‌ జావేద్‌ మద్దతుతో హసన్‌ ఈ ముగ్గురిని జట్టులో చేర్చినట్లు సమాచారం. అదే విధంగా మహ్మద్‌ రిజ్వాన్‌ను ఆరో స్థానానికి ఎంపిక చేస్తే బాగుంటుందనే అలీం దర్‌ అభిప్రాయాన్ని కూడా వీరు కొట్టివేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆకిబ్‌ జావేద్‌ కోచ్‌ హసన్‌కే మద్దతు పలుకుతూ.. ఇతర సభ్యుల నిర్ణయాలను ప్రభావితం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయిన అలీం దర్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా మంగళవారమే అతడు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు పాక్‌ స్థానిక మీడియా పేర్కొంది. కాగా అలీం దర్‌ వద్దన్నా.. హసన్‌, జావేద్‌ పట్టుబట్టి జట్టులో చేర్చిన బాబర్‌ ఆజం, షాదాబ్‌, ఉస్మాన్‌ ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

T20 WC Ind vs Eng: Ravi Shastri Ready To Snub Abhishek Sharma On 1 Condition4
IND vs ENG: అభిషేక్‌ శర్మను తప్పించండి.. కానీ: రవిశాస్త్రి

టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ గత కొంతకాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అతడి వైఫల్యాలే ఇందుకు కారణం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. కెరీర్‌లో తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడుతున్నాడు.మూడు డకౌట్లువిధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్‌ శర్మ (Abhishek Sharma).. సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ బరిలోకి దిగాడు. అయితే, ఆడిన తొలి మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మొత్తంగా ఆరు మ్యాచ్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 80.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు భారత జట్టు మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) అభిషేక్‌ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుస వైఫల్యాల కారణంగా అతడు మానసికంగా కాస్త కుంగిపోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. అలాంటపుడు తుదిజట్టు నుంచి అభిషేక్‌ శర్మను తప్పించడమే సరైన నిర్ణయమని పేర్కొన్నాడు.అదొక్క మార్పు సరిపోతుందిఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో బ్యాటింగ్‌ తీరును చూసి అంచనాకు రాకూడదు. అతడితో ప్రత్యేకంగా మాట్లాడాలి. మానసికంగా అతడు ఎంత దృఢంగా ఉన్నాడో తెలుసుకోవాలి.ఒకవేళ అభిషేక్‌ శర్మను కొనసాగించకూడదని అనుకుంటే.. ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. లోయర్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ను తీసుకువస్తే సరి. సెమీ ఫైనల్లో తుదజట్టులో అదొక్క మార్పు సరిపోతుంది.అయితే, అభిషేక్‌ శర్మ గత సిరీస్‌లో ఇంగ్లండ్‌ మీద అదరగొట్టిన తీరును మర్చిపోకూడదు. వాంఖడేలో గతంలో అతడి ప్రదర్శన అద్భుతం. అక్కడ అతడు భారీ, వేగవంతమైన శతకాలు బాదాడు. కాబట్టి అభిషేక్‌ శర్మను కొనసాగిస్తే బాగుంటుందనీ అనుకుంటున్నాను ఒకవేళ రింకూను తీసుకురావాలని అనుకుంటే మాత్రం ఓపెనింగ్‌ జోడీ మారక తప్పదు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌పై ఇరగదీసిన అభిషేక్‌కాగా గతేడాది వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 54 బంతుల్లోనే 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇదిలా ఉంటే.. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం వేదికగా భారత్‌- ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్లో తలపడేందుకు రంగం సిద్ధమైంది.చదవండి: అతడిని సెలక్ట్‌ చేసింది ఎవరు?.. BCCI గ్రీన్‌ సిగ్నల్‌!

Sanju Samson Placed In The League Of MS Dhoni, Virat Kohli, Rohit Sharma5
ధోని, కోహ్లీ, రోహిత్‌ గ్రూప్‌లో సంజూ

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్‌కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్‌ సర్కిల్స్‌లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్‌పై చారిత్రక ఇ​న్నింగ్స్‌ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్‌ డమ్‌ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కా​ర్తీక్‌ సంజూను దిగ్గజలు ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్‌. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్‌ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్‌ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్‌ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్‌ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్‌తో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్‌ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్‌లో భారత్‌ ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది.

Kumar Sangakkara father passed away6
కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార్‌ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్‌కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్‌కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్‌ సర్కిల్స్‌తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎస్‌కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.Saddened to hear the demise of Mr. Kshema Sangakkara, a well known Civil Lawyer, father and first coach of Kumar Sangakkara. RIP sir, your contribution to the law and cricket will not be forgotten🙏 pic.twitter.com/qJfIqNv6Zr— Akhila Seneviratne (@AkhilaSene97) March 3, 2026కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడంలో ఎస్‌కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్‌కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్‌ కెరీర్‌ కోసం సమయం వెచ్చించే వారు. ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్‌ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీకి హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

MS Dhoni fined for overspeeding, traffic violation in Ranchi7
నిబంధనలు ఉల్లంఘించిన ధోని.. జరిమానా

నియమ నిబంధనల విషయంలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తాజాగా ఓ నిబంధనను ఉల్లంఘించి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల కిందట ధోని పేరిట రిజిస్టర్‌ అయిన ఓ వాహనం రాంచీలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినట్లు రికార్డైంది. సదరు వాహనం వేగ పరిమితిని మించి ప్రయాణించినట్లు ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ గుర్తించడంతో మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 183 కింద రూ.1000 జరిమానా విధిస్తూ ఈ-చలాన్‌ జారీ చేశారు. ఈ ఘటన ధోని నివాసం సమీపంలో జరిగింది. ఇలాంటి ఘటనలు సర్వసాధారణమే అయినా, ధోని పేరు రావడంతో సోషల్‌ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకుముందే మరో వివాదందీనికి ముందే ధోని మరో వివాదంలో చిక్కుకున్నాడు. రాంచీలోని హార్ము రోడ్‌లో ఉన్న ఆయన పాత నివాస స్థలాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపిస్తూ, ఝార్ఖండ్‌ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఆ స్థలం కేవలం నివాస ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించబడిందని అధికారులు పేర్కొన్నారు. బిజీగా ధోనిట్రాఫిక్‌ చలాన్లు, ఇతర వివాదాలపై అవగాహన లేని ధోని ప్రస్తుతం ఐపీఎల్‌ 2026 సన్నాహకాల్లో బిజీగా ఉన్నాడు. 44 ఏళ్ల ధోనిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ ఈ సీజన్‌కు కూడా రీటైన్‌ చేసుకుంది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కోటాలో (రూ. 4 కోట్లు) అతను ఎంపికయ్యాడు. గత సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. అయితే ధోని వ్యక్తిగంతా రాణించాడు (135.17 స్ట్రైక్‌ రేట్‌తో 196 పరుగులు). ధోనికి వయసు మీదపడినప్పటికీ.. ఆయన వ్యూహాత్మక అవగాహన, జట్టుపై నియంత్రణ CSKకి కీలకంగా మారాయి. ఈసారి జట్టు పునర్నిర్మాణ దశలో ఉన్నందున ధోని చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్‌ లాంటి చాలామంది కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకోవడంలోనూ ధోనిదే కీలకపాత్ర.

T20 WC 2026: New Zealand to take on south africa in 1st semis, who will be the winner8
నేడే సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మధ్య మెగా సమరం

టీ20 ప్రపంచకప్‌ 2026 తది దశకు చేరింది. ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్‌.. రేపు (మార్చి 5) రెండో సెమీఫైనల్‌ జరుగనున్నాయి. సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్లో తలపడనుండగా.. భారత్‌-ఇంగ్లండ్‌ రెండో సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డన్స్‌ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.సౌతాఫ్రికా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ మరి కొద్గి గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, బలాబలాల ప్రకారం ఇరు జట్లు సమానంగా ఉన్నాయన్నది కాదనలేని సత్యం.ప్రస్తుత ఎడిషన్‌లో సౌతాఫ్రికాతో పోలిస్తే న్యూజిలాండ్‌ కాస్త తడబడినా, ఆ జట్టు శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంతటి ప్రతికూల పరిస్థితులను అయినా ఆ జట్టు తమకు అనుకూలంగా మార్చుకున్న సందర్భాలను చాలా చూశాం. ఈ జట్టును ఎప్పుడూ ఫామ్‌ను బట్టి అంచనా వేయలేని పరిస్థితి. ఒక్కసారి లైన్‌లోకి వచ్చారంటే వారిని ఆపడం​ చాలా కష్టం. క్షణాల్లో ఫలితం తారుమారవుతుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత ఎడిషన్‌లో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా దూసుకుపోతుంది. పైగా గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన జోష్‌లో ఉంది. ఫామ్‌ను పరిగణిలోకి తీసుకుంటే ఈ జట్టే టైటిల్‌ ఫేవరెట్లలో ముందుంది.అయితే ఈ జట్టుకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తడబడటం సౌతాఫ్రికాకు పరిపాటి. గతంలో వారు ఇలాంటి అనుభవాలు కోకొల్లలుగా ఎదుర్కొన్నారు. అయితే ఈసారి వారి కసి చూస్తే టైటిల్‌ గెలవకుండా తమను ఎవరూ ఆపలేరన్నట్లుగా ఉంది. జట్టులోకి ప్రతి ఒక్కరు మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఒక్క నాకౌట్‌ ఫోబియా తప్పించి సౌతాఫ్రికాను ఏదీ కలవరపెట్టట్లేదు.హెడ్‌ టు హెడ్‌ రికార్డులు కూడా ఈ జట్టుకే అనుకూలంగా ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు 19 టీ20ల్లో తలపడగా.. సౌతాఫ్రికా 12, న్యూజిలాండ్‌ ఏడింట మాత్రమే గెలుపొందాయి. ప్రపంచకప్‌ సమరాల విషయానికొస్తే.. సౌతాఫ్రికా సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మెగా టోర్నీల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 5 సార్లు ఎదురెదురుపడగా.. ఐదింట సౌతాఫ్రికానే జయకేతనం ఎగురవేసింది.ఇన్ని సానుకూల పరిణామాల మధ్య సౌతాఫ్రికా నేటి మ్యాచ్‌లో మరోసారి హాట్‌ ఫేవరెట్‌గా బరిలో​కి దిగుతుంది. ఏ జట్టు పైచేయి సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.న్యూజిలాండ్‌ సెమీస్‌ను అధిగమించిన సందర్భాలు.. 2021 (ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి)సౌతాఫ్రికా సెమీస్‌ను అధిగమించిన సందర్భాలు.. 2024 (ఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమి)

Multiple new No.1s crowned in latest ICC Women's Rankings9
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం చోటు చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఒకేసారి టాప్‌ ర్యాంక్‌లు మారాయి. ఇలాంటి పరిణామం చాలా అరుదుగా జరుగుతుంది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ను కిందకి దించి స్మృతి మంధన (భారత్‌).. ఇంగ్లండ్‌కు చెందిన సోఫి ఎక్లెస్టోన్‌ను కిందకి దించి అలానా కింగ్‌ (ఆస్ట్రేలియా) అగ్రపీఠాలను అధిరోహించారు.తాజాగా జరిగిన భారత్‌-ఆసీస్‌ వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు. తద్వారా తమతమ విభాగాల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరారు. బౌలింగ్‌ విభాగంలో నాలుగేళ్లు అగ్రపీఠంపై కూర్చున్న సోఫిని అలానా కింగ్‌ తాజా ప్రదర్శనలతో (3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) కిందికి దించింది. కింగ్‌తో పాటు టాప్‌-8లో మరో నలుగురు ఆసీస్‌ బౌలర్లు ఉన్నారు. ఆష్లే గార్డనర్‌ (3), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (5), మెగాన్‌ షట్‌ (7), కిమ్‌ గార్త్‌ (8) స్థానాల్లో నిలిచారు.మంధన విషయానికొస్తే.. గత వారం ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో ఆమె 58, 31 స్కోర్లతో రాణించింది. తద్వారా స్వల్ప తేడాతో వోల్వార్డ్ట్‌ను అధిగమించి టాప్‌ ర్యాంక్‌కు చేరింది. కెరీర్‌లో చివరి వన్డే (భారత్‌తో మూడో వన్డే) ఆడిన ఆలైస్సా హీలీ అద్భుతమైన సెంచరీ చేసి 2 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి, అదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన బెత్‌ మూనీ కూడా 2 స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది.భారత్‌ నుంచి మంధనతో సహా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకుంది. ఆసీస్‌ సిరీస్‌లో రాణించిన ఆమె నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానాకి ఎగబాకింది.బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో భారత్‌ నుంచి ఒక్క దీప్తి శర్మకు మాత్రమే అవకాశం దక్కింది. ఆమె కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. ఇటీవలి ఆసీస్‌ సిరీస్‌లో దీప్తి నామమాత్రపు ప్రదర్శనలు కూడా చేయలేక చతికిలపడింది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ దీప్తి ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ విభాగంలో ఆష్లే గార్డ్‌నర్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుంది.

India to play five ODIs in New Zealand instead of three10
రోహిత్‌, కోహ్లి అభిమానులకు పండగే..!

టీమిండియా దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్‌ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌లు షెడ్యూలయ్యాయి.2027 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా వన్డే మ్యాచ్‌ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్‌ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్‌ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.ఈ అంశం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్‌-విరాట్‌ ఎక్కువ మ్యాచ్‌ల్లో కనబడితే న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్‌కు ముందు రో-కోకు వీలైనంత రియల్‌ ప్రాక్టీస్‌ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్‌ పర్యటనలో వన్డే లెగ్‌ పొడిగించడం​ దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.ఐపీఎల్‌ తర్వాత వన్డేలపై దృష్టిఐపీఎల్‌ 2026 సీజన్‌ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్‌ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్‌ మొదటి వారం​ నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.ఐపీఎల్‌ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్‌ - జూన్‌లో ఆఫ్ఘానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు - జూలైలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లు - ఆగస్టులో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌లు - అక్టోబర్‌లో న్యూజిలాండ్‌ పర్యటన- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement