Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

He is fit physically But: Basit Ali Drops Huge Remark On Babar Azam1
‘అతడు మానసికంగా అన్‌ఫిట్‌.. అందుకే చోటు కరువు’

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్‌ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ హెడ్‌కోచ్‌ మైక్‌ హెసన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్‌ జట్టా?’’ అంటూ ఫైర్‌ అయ్యాడు.పాకిస్తాన్‌ క్రికెట్‌ను నాశనం చేయడంలో...ఇక చీఫ్‌ సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌ను నాశనం చేయడంలో ఆకిబ్‌ జావేద్‌ పాత్ర కూడా ఉంది. మైక్‌ హసన్‌కు తన సెలక్షన్‌ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్‌కోచ్‌ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్‌ఫిట్‌అదే విధంగా.. బాబర్‌ ఆజంను బంగ్లాదేశ్‌ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్‌ జావేద్‌ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్‌ అలీ స్పందించాడు. ఆకిబ్‌ చెప్పినట్లు బాబర్‌కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్‌ ఆజం శారీరకంగా ఫిట్‌గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్‌ఫిట్‌’’ అంటూ బసిత్‌ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్‌ ఆజం గత కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్‌ జావేద్‌ మాత్రం ఫిట్‌గా లేనందువల్లే సెలక్ట్‌ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పాకిస్తాన్‌ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్‌.. ఈసారి సూపర్‌-8కు చేరుకున్నా.. సెమీస్‌ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్‌ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

DC to win IPL 2026, Sanju Samson to win Orange Cap: Aakash Chopra2
స‌న్‌రైజ‌ర్స్‌, సీఎస్‌కే, ముంబై కాదు.. ఆ జ‌ట్టే ఐపీఎల్ విజేత‌!

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ పండగకు సమయం అసన్నమవుతోంది. ఐపీఎల్‌-2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుతాయో, టైటిల్ విజేత ఎవరన్నదానిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన అంచనాలను వెల్లడించాడు. ఆకాష్ చోప్రా ఇటీవల క్రిక్స్ యాప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పలు ప్రశ్నలు చోప్రాకు ఎదురయ్యాయి.హోస్ట్‌: ఆరెంజ్‌ క్యాప్‌(అత్యధిక పరుగులు) ఎవరు గెలుస్తారు?ఆకాష్‌ చోప్రా: సంజూ శాంసన్. (ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సీఎస్‌కే తరపున ఆడనున్నాడు.)హోస్ట్‌: పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) ఎవరు గెలుస్తారు?చోప్రా: జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)హోస్ట్‌: ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి దక్కుతుంది?చోప్రా: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం).హోస్ట్‌: ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి?చోప్రా: ముంబై ఇండియన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్ కింగ్స్ జట్లు చేరుతాయి.హోస్ట్‌: ఐపీఎల్‌ ట్రోఫీని ఎవరు సొంతం చేసుకుంటారు?చోప్రా: ఈసారి మనం సరికొత్త ఛాంపియన్‌ను చూడబోతున్నాము. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్‌కాగా చోప్రా ప్లే ఆఫ్స్‌కు చేరే జట్ల జాబితాలో ఐదు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు చోటు ఇవ్వకపోవడం గమనార్హం.

Pakistan Team, Mohsin Naqvi Blasted By Ex-Star After Bangladesh Humiliation3
మ్యాచ్‌లు గెలవరు.. మరి ట్రోఫీలను దొంగలిస్తారా?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 త‌ర్వాత పాకిస్తాన్‌కు మ‌రో ఘోర ప‌ర‌భావం ఎదురైంది. ఆదివారం ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో 11 ప‌రుగుల తేడాతో పాక్‌ ఓట‌మి పాలైంది. 290 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన 279 ప‌రుగులకు ఆలౌటైంది.దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ కోల్పోయింది. బంగ్లాపై పాక్ ఓ వ‌న్డే సిరీస్ ఓడిపోవ‌డం 11 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి కావ‌డం గ‌మనార్హం. దీంతో పాక్ జ‌ట్టపై ఆ దేశ మాజీ క్రికెట‌ర్ క‌మ్రాన్ అక్మ‌ల్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు.పాక్ క్రికెట్ ప్ర‌తిష్ట రోజు రోజుకు దిగ‌జారిపోతుంద‌ని అక్మల్ మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సెమీస్‌కు కూడా చేరకుండా సూపర్‌-8 స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దారుణంగా ఉంది. నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్లు కూడా పాక్‌తో సిరీస్ ఆడి, మనల్ని ఓడించి టెస్ట్ హోదా పొందాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 350 పరుగుల మార్క్ సులువుగా దాటేలా కన్పించింది. కానీ లిట్టన్ దాస్ నెమ్మదిగా ఆడడంతో 290 పరుగులకే పరిమితమైంది. అయినప్పటికీ మన జట్టు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది" అని అక్మల్ ఓ ఛానల్ డిబేట్‌లో పేర్కొన్నాడు.అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీపై కూడా అతడు పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. మైదానంలో మ్యాచ్‌లు గెలవనప్పుడు.. ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తీసుకువస్తారా? అంటూ ఎద్దేవా చేశాడు. కాగా ఆసియాకప్‌-2025 ట్రోఫీని నఖ్వీ చేతుల మీదగా భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. ఇప్పటికీ ట్రోఫీ ఛాంపియన్ భారత్ వద్దకు చేరలేదు.చదవండి: చరిత్ర చెరిగిపోదు: బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌

Ish Sodhi Ruled Out Of Remainder T20I Series Vs South Africa Reason Is4
NZ vs SA: న్యూజిలాండ్‌కు మరో షాక్‌!

సౌతాఫ్రికాతో తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ ఇష్‌ సోధికి గాయమైంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో సోధి బొటనవేలుకు గాయం కాగా.. స్కానింగ్‌లో భాగంగా వేలు విరిగిపోయినట్లు తేలింది.నాలుగు వారాల విశ్రాంతి ఫలితంగా ఇష్‌ సోధికి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ‍క్రమంలో సౌతాఫ్రికాతో తొలి టీ20కి దూరమైన ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లకూ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. సఫారీలతో రెండో టీ20 సందర్భంగా కివీస్‌ స్పీడ్‌స్టర్‌ లాకీ ఫెర్గూసన్‌ జట్టుతో చేరనున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌.. స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా మౌంట్‌ మాంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సఫారీ జట్టుతో తలపడింది.91 పరుగులకే ఆలౌట్‌ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌... 14.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. నీషమ్‌ (21 బంతుల్లో 26 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కాన్వే (1), లాథమ్‌ (7), రాబిన్‌సన్‌ (6), అరంగేట్ర ఆటగాడు నిక్‌ కెల్లీ (2), జాకబ్స్‌ (10), సాంట్నర్‌ (15) విఫలమయ్యారు.ఎన్‌కబని మొకొనాకు 3 వికెట్లుఇక ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన నలుగురు సఫారీ ప్లేయర్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎన్‌కబని మొకొనా (Nqobani Mokoena) 3 వికెట్లు పడగొట్టగా... కోట్జీ, బార్ట్‌మన్, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ తలా రెండు వికెట్లు తీశారు.సాంట్నర్‌ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చిఅనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ కానర్‌ ఎస్తెర్హుజెన్‌ (48 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సాంట్నర్‌ 4 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ ద్వారా నలుగురు (కానర్‌ ఎస్లుర్హుజెన్, డియాన్‌ ఫారెస్టర్, జోర్డాన్‌ హెర్మన్, ఎన్‌కబరి మొకొనా) సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇరు జట్ల మధ్య హామిల్టన్‌లో మంగళవారం రెండో టీ20 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

Rohit Sharma Fans As Gill Shown As CT Winning Captain BCCI Awards5
ఇదేం పద్ధతి?.. బీసీసీఐపై రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఫైర్‌

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదేం పద్ధతి.. చరిత్ర చెరిగిపోదు.. మీ కుట్రలు ఫలించవు’’ అంటూ తీవ్ర స్థాయిలో సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం ‘నమన్‌-2026’లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం.రెండు ఐసీసీ టైటిళ్లువిరాట్‌ కోహ్లి (Virat Kohli) తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni-3)తర్వాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు.ఇక 2024లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. గతేడాది టెస్టులకూ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న హిట్‌మ్యాన్‌కు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది,వన్డే కెప్టెన్‌గా ఇప్పటికీ సిరీస్‌ గెలవని గిల్‌గతేడాది.. అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి.. శుబ్‌మన్‌ గిల్‌ను సారథిగా నియమించింది. గిల్‌ కెప్టెన్సీలో భారత్‌ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్‌ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడిన గిల్‌ సేన.. సొంతగడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.ఇదిలా ఉంటే.. నమన్‌ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు గిల్‌కు దక్కింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్‌గా, ఇటు సారథిగా గిల్‌ అత్యుత్తమ ఆటతీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది.ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విన్నింగ్‌ కెప్టెన్‌?ఈ నేపథ్యంలో గిల్‌ మాట్లాడుతున్న సమయంలో.. నిర్వాహకులు.. ‘శుబ్‌మన్‌ గిల్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 విన్నింగ్‌ కెప్టెన్‌’’ అని అతడి పేరును స్క్రీన్‌పై వేశారు. ఇదే రోహిత్‌ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.ఇంత వరకు ఒక్క వన్డే సిరీస్‌ గెలవని కెప్టెన్‌కు ఏకంగా చాంపియన్స్‌ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్‌ అని వేయడం ఏమిటని, రోహిత్‌ శర్మ ఘనత చెరిపేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలు అంటిస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కామెంట్‌ చేస్తుండగా.. రోహిత్‌ను అవమానించేందుకే ఇలా చేశారంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.చదవండి: : అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడుReally???? pic.twitter.com/R0w8hrjFZq— Rohan💫 (@rohann__45) March 15, 2026

Pakistan lodge plaint over Bangladesh review in 3rd ODI6
ఆఖరి ఓవర్‌లో హైడ్రామా.. అంపైర్ నిర్ణయంపై పాక్ సీరియ‌స్‌

ఢాకా వేదిక‌గా ఆదివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 11 ప‌రుగుల తేడాతో పాకిస‌తాన్ ఓట‌మి పాలైంది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1తో పాక్ కోల్పోయింది. 290 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన 279 ప‌రుగులకు ఆలౌటైంది.వైస్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా(106), షాహీన్ అఫ్రిది(37) ఆఖరి పోరాడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. దీంతో 11 ఏళ్ల తర్వాత బంగ్లాకు వన్డే సిరీస్‌ను పాక్ సమర్పించుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది.ఏమి జరిగిందంటే?పాకిస్తాన్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 పరుగులు కావాలి. ఆ ఓవర్ వేసే బాధ్యతను బంగ్లా కెప్టెన్ స్పిన్నర్ రిషాద్‌కు అప్పగించాడు. రిషాద్ తొలి రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాలేదు. ఆ తర్వాత మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతి డాట్ అయింది.ఐదో బంతిని రిషాద్ లెగ్ సైడ్ వేశాడు. ఆ బంతిని షాహీన్ డౌన్ ది లెగ్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. కానీ షాట్ క‌న‌క్ట్ కాలేదు. దీంతో అంపైర్ వైడ్‌గా ప్ర‌క‌టించాడు. అయితే వికెట్ కీప‌ర్ లిట్ట‌న్ దాస్ సూచ‌న మేర‌కు బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఇక్క‌డే వివాదం చోటు చేసుకుంది.రూల్స్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించిన 15 సెకన్లలోపే డీఆర్‌ఎస్ కోరాలి. కానీ నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లా కెప్టెన్‌ స్క్రీన్‌పై రీప్లే చూసిన తర్వాతే రివ్యూ కోరాడని పాక్‌ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

Rahul Dravid Credits India Strong Talent Over Recent ICC Triumphs7
అతడి ఆట అసాధారణం.. గంభీర్‌పై ద్రవిడ్‌ ప్రశంసలు

వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యేకంగా అభినందించాడు. గత మూడు దశాబ్దాల్లో మన క్రికెట్‌ జట్టు ఎంతో పురోగతి సాధించి అత్యుత్తమ స్థాయికి చేరిందని అతను అభిప్రాయపడ్డాడు. మన దేశంలో ప్రతిభకు ఏనాడూ కొదవ లేదని, ఇప్పుడు అలాంటి ప్రతిభ ఫలితాలను అందించడం సంతోషంగా ఉందని ద్రవిడ్‌ అన్నాడు. భారత్‌ ఇటీవల వరుసగా సీనియర్, అండర్‌–19 విభాగాల్లో కలిసి ఐదు ఐసీసీ టోర్నీల్లో గెలుచుకున్న విషయాన్ని ‘ది వాల్‌’ గుర్తు చేశాడు. సూర్యకుమార్, గంభీర్‌ బృందంపై ప్రశంసలు‘మన దేశంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను ఎప్పుడూ కొరత లేదు. మైదానం బయట వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలనూ బోర్డు అందించింది. అత్యుత్తమ మౌలిక సౌకర్యాలతో పాటు మంచి కోచ్‌లు, సరైన పరిపాలకులు ఉన్నారు. జూనియర్‌ స్థాయిలో, దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన వ్యవస్థ ఉంది. కానీ కొన్నిసార్లు మైదానంలో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అంతా అద్భుతంగా సాగుతోంది. ప్రతిభకు తగిన విధంగా ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ను చూస్తే మన జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ ఒత్తిడి, సవాళ్లను అధిగమించి విజేతగా నిలవడం అంత సులువు కాదు. కానీ సూర్యకుమార్, గంభీర్‌ బృందం దానిని చేసి చూపించింది’ అని ద్రవిడ్‌ విశ్లేషించాడు. అతడి ఆట అసాధారణంసామ్సన్‌ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా ద్రవిడ్‌ అతడిపై ప్రశంసలు కురిపించాడు. ‘సామ్సన్‌ వరల్డ్‌ కప్‌ చివరి మూడు మ్యాచ్‌లలో ఆడిన తీరు అసాధారణం. సుదీర్ఘ కాలంగా అతను టీమ్‌లో ఉన్నాడు. కొన్నిసార్లు బాగా ఆడినా మరికొన్ని సార్లు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి ఆటగాడు భారత్‌కు ఎంతో అవసరమైన కీలక సమయంలో సత్తా చాటి విజయంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని ద్రవిడ్‌ అన్నాడు. బీసీసీఐ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు లభించడం పట్ల ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం, దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గొప్ప గౌరవమని అతను స్పందించాడు. చదవండి: ‘ఇది ఆరంభం మాత్రమే’

Former Pakistan captain Sarfaraz Ahmed announces retirement8
రిటైర్మెంట్‌ ప్రకటించిన పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌... అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆటలోని అన్నీ ఫార్మాట్‌ల నుంచి అతడు తప్పుకుంటున్నట్లు ఆదివారం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. 2023లో చివరిసారిగా ఆ్రస్టేలియాతో టెస్టు మ్యాచ్‌ ఆడిన సర్ఫరాజ్‌... జాతీయ సెలెక్షన్‌ కమిటీ మెంబర్‌గా, పాకిస్తాన్‌ అండర్‌–19 జట్టు మెంటార్‌గా వ్యవహరించాడు.త్వరలో అతడు పాక్‌ టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో... తాజాగా కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు సమాచారం. 38 ఏళ్ల సర్ఫరాజ్‌ జూనియర్‌ స్థాయిలో 2006లో అండర్‌–19 ప్రపంచకప్‌ అందించడంతో పాటు... 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ జట్టును విజేతగా నిలిపాడు.కెరీర్‌లో 54 టెస్టులాడి 3031 పరుగులు చేసిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌... 117 వన్డేల్లో 2315 పరుగులు, 61 టి20ల్లో 818 పరుగులు చేశాడు. గతేడాది అజహర్‌ మెహమూద్‌ పాకిస్తాన్‌ టెస్టు జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించగా... అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఇప్పుడా స్థానాన్ని సర్ఫరాజ్‌ భర్తీ చేయనున్నాడు.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?

IPL 2026: Full list of injured players9
టీమ్‌లకు గాయాల బెడద.. స్టార్‌ ప్లేయర్లు దూరం?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు జట్లకు గాయాల బెడద మొదలైంది. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు తమ కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.కేకేఆర్‌కు డబుల్ షాక్‌..!ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు మూడు సార్లు ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు యువ పేస‌ర్ మోకాలి గాయం స‌ర్జ‌రీ కార‌ణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అత‌డి స్ధానంలో ఆకాశ్ మ‌ధ్వాల్ లేదా చేత‌న్ స‌కారియాను తీసుకునే అవ‌కాశ‌ముంది.మ‌రోవైపు వేలంలో రూ.18 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి మ‌రి కొనుగోలు చేసిన శ్రీలంక స్పీడ్ స్టార్ మ‌తీషా ప‌తిరాన సైతం ప‌క్క‌టెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు కూడా ఈ ఏడాది సీజ‌న్‌లో ఆడేది అనుమాన‌మే. అంతేకాకుండా రాజ‌కీయ ఉద్రిక్త‌ల కార‌ణంగా బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మ‌న్‌ను కూడా కేకేఆర్ కోల్పోవ‌ల్సి వ‌చ్చింది. అయితే అత‌డి స్దానంలో జింబాబ్వే స్పీడ్ గ‌న్ బ్లెస్సింగ్ ముజరబానీని జ‌ట్టులోకి తీసుకున్నారు.ఆర్సీబీ ఆందోళనఈ టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్‌, ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. హేజిల్‌వుడ్ ప్ర‌స్తుతం ప‌క్క‌టెముకుల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.మ‌రోవైపు వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకున్న పేస‌ర్ య‌శ్ ద‌యాల్ ఆడ‌డంపై కూడా సందిగ్ధం నెల‌కొంది. ఓ మహిళ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ మోసం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కెప్టెన్ సాబ్ వ‌స్తాడా?స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ అందుబాటుపై కూడా ఇంకా క్లారిటీ లేదు. కమ్మిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగానే ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ సమయానికి తను పూర్తిగా కోలుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమ్మిన్స్ తెలిపాడు.అదేవిధంగా మరో ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అంతేకాకుంగా గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ సైతం గాయంతో పోరాడుతున్నాడు. అతడు కూడా టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.న్యూజిలాండ్ స్పీడ్ ‍స్టార్ ఆడమ్ మిల్నే కూడా ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో రూ.2.25 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా ఈ జాబితాలో ఉన్నాడు.గాయం కారణంగా పొట్టి ప్రపంచకప్ మధ్యలోనే వైదొలిగాడు. సీఎస్‌కే యువ ఆటగాడు ప్రశాంత్ వీర్ అందుబాటుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. మార్చి 28 నుంచి ఐపీఎల్‌-19వ సీజన్‌ ప్రారంభం కానుంది.చదవండి: ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?

BCCI-banned IPL founder Lalit Modi interested in buying Rajasthan Royals10
ఐపీఎల్ సృష్టికర్త రీ ఎంట్రీ!?

ఐపీఎల్ సృష్టికర్త, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ.. తిరిగి ఈ క్యాష్ రిచ్ లీగ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి పాలకమండలి సభ్యునిగా కాకుండా.. ఓ జట్టు సహా యజమానిగా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో మోదీ భాగస్వామిగా చేరేందుకు ఆసక్తి చూపుతున్నాండంట. రాజస్తాన్ రాయల్స్ ఓనర్ మనోజ్ బడాలే జట్టులోని తన వాటాను విక్రయించేందుకు సిద్దమయ్యాడు. రాయల్స్‌లో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ ఆధినేత అయిన మనోజ్ బడాలే 65 శాతం వాటాను క‌లిగి ఉన్నాడు.మ‌రో 35 శాతం వాటాను గెర్రీ కార్డినాల్(15 శాతం) , లాచ్లాన్ ముర్డోక్(13), కల్ సోమాని, టైగర్ గ్లోబల్, సంస్థ క‌లిగి ఉన్నాయి. అయితే లలిత్ మోదీ ఇప్ప‌టికే మైనారిటీ వాటా కలిగిన కల్ సోమానితో క‌లిసి బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.ఈ విక్రయానికి సంబంధించి మార్చి 16న లండన్‌లో కీలకమైన చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో మోదీ,సోమాని బృందం పాల్గొనే అవకాశం ఉంది. కాగా లలిత్ మోదీపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఒ‍కవేళ అతడు రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కచ్చితంగా ప్రభుత్వం, బీసీసీఐ నుంచి అడ్డంకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజస్తాన్ జట్టును కొనుగోలు చేయాలంటే సుమారు రూ.9,200 కోట్ల నుండి రూ. 11,000 కోట్లు వరకు వెచ్చించాలి. రాయల్స్ జట్టును కొనుగోలు చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఇంటర్నెట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: Gautam Gambhir: అతడికి 6 ఓవర్లు చాలు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తాడు

Advertisement
Advertisement
 
Advertisement

వీడియోలు