Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

BCCI Denies instruction from ICC to relocate Bangladesh T20 WC matches1
బంగ్లా మ్యాచ్‌ల వేదికలు మార్పు!.. స్పందించిన బీసీసీఐ

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్‌ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.భద్రత విషయంలో.. ఈ క్రమంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్‌లో తాము టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వేదికలను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.స్పందించిన బీసీసీఐఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు.టీ20 ప్రపంచకప్‌-2026లో బంగ్లాదేశ్‌ షెడ్యూల్‌ఫిబ్రవరి 7- వెస్టిండీస్‌తో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగాఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగాఫిబ్రవరి 14- ఇంగ్లండ్‌తో- కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగాఫిబ్రవరి 17- నేపాల్‌తో- ముంబైలోని వాంఖడే వేదికగా.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

IND vs NZ: Washington Sundar ruled out Badoni gets maiden call up2
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌!.. ప్రకటన విడుదల

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్‌కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.ఊహించని ఆటగాడుఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ సుందర్‌ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్‌ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్‌కోట్‌లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన ఆయుశ్‌ బదోని బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం బ్యాటర్‌ అయిన బదోని.. రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!.. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్‌లలో కలిపి 963 పరుగులు చేశాడు.ఫామ్‌లో లేడుఇక లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆయుశ్‌ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్‌ల (1, 12, 3 నాటౌట్‌)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌ వేదిక. ఇదిలా ఉంటే పంత్‌ స్థానంలోధ్రువ్‌ జురెల్‌ జట్టులో చేరిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్‌తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్‌డేటెడ్‌)శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), ఆయుశ్‌ బదోని.చదవండి: ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్‌ కోహ్లి

I send my awards to my mum She: Virat Kohli Reveals Reason3
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్‌ కోహ్లి

వన్డే క్రికెట్‌లో తాను ఛేజింగ్‌ ‘కింగ్‌’నని టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.మా అమ్మకు పంపిస్తానుఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.గుర్గావ్‌లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.దేవుడు నాకు అన్నీ ఇచ్చాడునా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌- కివీస్‌ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడాయి. 93 పరుగులుటాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.మిగిలిన వారిలో శ్రేయస్‌ అయ్యర్‌ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్‌లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్‌గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.చదవండి: క్రికెట్‌ చరిత్రలో అద్భుతం🗣️ If I look back at my whole journey, it's nothing short of a dream come true. ✨🎥 Virat Kohli reflects on his incredible career after becoming the 2⃣nd highest run-getter in men's international cricket🙌👏#TeamIndia | #INDvNZ | @imVkohli | @idfcfirstbank pic.twitter.com/87BgcZlx4b— BCCI (@BCCI) January 11, 2026

Bangladesh umpire presides IND vs NZ 1st ODI after Mustafizur Rahman's blacklisting4
భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం

భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్‌ టీమిండియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరుగబోయే మ్యాచ్‌లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉ‍ద్రిక్తతల నేపథ్యంబంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్‌ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్‌ చేసింది. భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌-2026 గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌ విధుల నిమిత్తం భారత్‌కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.బోణీ కొట్టిన టీమిండియాతొలి వన్డేలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల​్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం భారత్‌ విరాట్‌ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49), ఆఖర్లో ఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది.

Virat Kohli brother Vikas again dismantles Sanjay Manjrekar after IND vs NZ 1st ODI5
విరాట్‌ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్‌ కోహ్లి

లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు. విరాట్‌ సత్తా చాటడంతో న్యూజిలాండ్‌పై భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్‌కు ముందు సచిన్‌ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్‌ రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్‌ సోదరుడు వికాస్‌ కోహ్లి సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్‌పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.విరాట్‌ టెస్ట్‌ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్‌ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్‌ను నేరుగా టార్గెట్‌ చేశాడు.ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే వికాస్‌ సోదరుడు విరాట్‌ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్‌ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్‌ షేర్‌ చేశాడు.ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్‌పై ఈగ కూడా వాలనివ్వని వికాస్‌ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్‌పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్‌ జనవరి 14న న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్‌ రాజ్‌ కోట్‌ వేదికగా జరుగనుంది.

New Zealand captain Michael Bracewell comments after losing 1st ODI to team India6
ప్రపంచ నంబర్‌ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం: న్యూజిలాండ్‌ కెప్టెన్‌

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా టీమిండియాతో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ సిరీస్‌కు న్యూజిలాండ్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా, తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేసింది. ఫీల్డింగ్‌ మినహా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టీమిండియాను భయపెట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఆతర్వాత బౌలింగ్‌లో అద్వితియమైన పోరాటపటిమ కనబర్చింది. సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టుకు ఓ దశలో గెలుపు భయం చూపించింది. బౌలింగ్‌ విభాగంలో ఏకైక అనుభవజ్ఞుడు కైల్‌ జేమీసన్‌తో భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చింది.మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 4 వికెట్లు తీసి టీమిండియాను ఇబ్బంది పెట్టిన జేమీసన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు జీవం పోసిన డారిల్‌ మిచెల్‌ను కొనియాడాడు. తమ జట్టు పోరాటపటిమను ఆకాశానికెత్తాడు.బ్రేస్‌వెల్‌ మాటల్లో.. ఓడినా, గర్వంగా ఉంది. ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం. మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. గాయం నుంచి తిరిగొచ్చిన జేమీసన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. బ్యాటర్లు.. ముఖ్యంగా డారిల్ మిచెల్ తన అనుభవాన్నంతా రంగరించి మంచి స్కోర్‌ చేసేందుకు దోహదపడ్డాడు. అయినా మరో 20-30 పరుగులు చేసుండాల్సింది. మ్యాచ్‌ గతి మార్చే క్షణాలను సృష్టించుకోవడం గురించి మేమెప్పుడూ మాట్లాడుకుంటాం. ఈ రోజు కొన్ని విషయాల్లో బాగా పని చేశాం. కొన్ని కీలక అవకాశాలు కోల్పోయాం. భారత్‌లో లైట్ల వెలుతురులో ఆడటం సులభం కాదని మరోసారి నిరూపితమైంది. ఓడినా మా జట్టు ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తుంది. బ్రేస్‌వెల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వారి జట్టు పోరాట స్పూర్తిని సూచిస్తున్నాయి.మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల​్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం విరాట్‌ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49), ఆఖర్లో ఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) రాణించడంతో భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది.

IND VS NZ 1st ODI: Rohit sharma reaches 650 sixers milestone7
మరో మైలురాయిని తాకిన రోహిత్‌ శర్మ

టీమిండియా వెటరన్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ మరో మైలురాయిని తాకాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన వన్డే మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్ల మైలురాయిని (539 ఇన్నింగ్స్‌ల్లో) చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో రోహిత్‌ ఇప్పటికే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తాజాగా మరో మైలురాయిని తాకి, తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ విభాగంలో రోహిత్‌ తర్వాతి స్థానంలో విండీస్‌ విధ్వంసకర యోధుడు క్రిస్‌ గేల్‌ (551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్సర్లు) ఉన్నాడు.ROHIT SHARMA - 650 SIXES IN INTERNATIONAL CRICKET. ONE & ONLY HITMAN 🥶pic.twitter.com/ENstT40dz6— Johns. (@CricCrazyJohns) January 11, 2026మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. డెవాన్‌ కాన్వే (56), హెన్రీ నికోల్స్‌ (62), డారిల్‌ మిచెల్‌ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్‌, హర్షిత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్‌ ఓ వికెట్‌ తీశారు.అనంతరం 301 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ ఆదిలో సునాయాస విజయం దిశగా సాగినప్పటికీ.. విరాట్‌ కోహ్లి ఔటయ్యాక తడబాటుకు లోనైంది. అయితే కేఎల్‌ రాహుల్‌ (29 నాటౌట్‌) హర్షిత్‌ రాణా (29) సహకారంతో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్‌) మరో సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్ (56), వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (49) కూడా రాణించారు. రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 26; 3 ఫోరు​, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించాడు. మొత్తంగా అందరూ తలో చేయి వేయడంతో భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమీసన్‌ 4, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌ తలో వికెట్‌ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్‌ వేదికగా జనవరి 14న జరుగనుంది.కాగా, ఈ సిరీస్‌కు న్యూజిలాండ్‌ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా తొలి వన్డేలో అ‌ద్భుతంగా రాణించి, ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టు టీమిండియాకు ఊహించని పోటీనిచ్చింది. ఫీల్డింగ్‌లో కాస్త తడబడినా.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సత్తా చాటి ఆకట్టుకుంది.

Coca Cola Brings the Iconic FIFA World Cup Trophy to India After 12 Years8
12 ఏళ్ల భారత్‌కు ఫిఫా ప్రపంచకప్‌

ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత భారత్‌లోకి అడుగుపెట్టింది. కోకా-కోలా భాగస్వామ్యంతో జరుగుతున్న ట్రోఫీ టూర్ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను భారత అభిమానులకు దగ్గర చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ట్రోఫీని న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రి డా. మాన్సుఖ్ మాండవియా, బ్రెజిల్ మాజీ వరల్డ్ కప్ విజేత గిల్బర్టో డి’సిల్వా, క్రీడా చరిత్రకారుడు బోరియా మజుందార్, అలాగే కోకా-కోలా ఇండియా నాయకత్వం హాజరయ్యారు.మంత్రి మాండవియా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో క్రీడలు జాతీయ ప్రాధాన్యతగా మారాయి. 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోని టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం మా లక్ష్యం అని అన్నారు. కోకా-కోలా ఇండియా అధ్యక్షుడు సంకేత్ రే మాట్లాడుతూ.. భారత క్రీడలు విస్తృత భాగస్వామ్యం, బలమైన మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుసంధానం ద్వారా కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. FIFAతో మా దీర్ఘకాలిక భాగస్వామ్యం వల్ల ఇలాంటి చారిత్రాత్మక క్షణాలను భారత అభిమానులకు చేరువ చేస్తున్నామని అన్నారు. ట్రోఫీ విశేషాలు ఫిఫా ప్రపంచకప్‌ ట్రోఫీ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు 6.175 కిలోలు. ఈ ట్రోఫీ రెండు మానవ ఆకృతులు ప్రపంచ గోళాన్ని పైకి ఎత్తిన రూపకల్పనతో 1974లో రూపొందించబడింది. ఈ ట్రోఫీ టూర్‌ 30 దేశాల్లో, 75 స్టాప్‌లతో 150 రోజుల పాటు సాగుతుంది.

Historic moment for Afghanistan legend as Mohammad Nabi features with son Hassan BPL9
క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

క్రికెట్‌ చరిత్రలో అద్భుతం జరిగింది. తండ్రి-కొడుకులు ఒకే జట్టులో కలిసి ఆడి చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025-26లో ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ, అతని కొడుకు హసన్ ఐసాఖిల్ నోఖాలి ఎక్స్‌ప్రెస్ అనే ఫ్రాంచైజీకి కలిసి ప్రాతినిథ్యం వహించారు.క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో గతేడాదే తొలిసారి ఓ తండ్రి-కొడుకుల జోడీ (సుహైల్‌ సత్తార్‌ (50)-యాహ్యా సుహైల్‌ (17), తిమోర్‌-లెస్టే అనే దేశం తరఫున కలిసి టీ20 మ్యాచ్‌ ఆడింది.విండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ సైతం తన కొడుకు తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌తో కలిసి ఓ క్లబ్‌ మ్యాచ్‌ ఆడాడు. తాజాగా మొహమ్మద్‌ నబీ-హసన్ ఐసాఖిల్ కలిసి ఓ టీ20 లీగ్‌ మ్యాచ్‌ ఆడి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించకున్నారు.ప్రస్తుతం నబీ వయసు 41 సంవత్సరాలు కాగా.. హసన్‌ వయసు 19. 2007లో నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు హసన్ 11 నెలల పసికందు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ తండ్రి–కొడుకు ఒకే జట్టులో ఆడటం చారిత్రక ఘట్టంగా నిలిచింది. నబీ కెరీర్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో ఇతనో దిగ్గజం. ప్రపంచ క్రికెట్‌లోనూ మేటి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున సుదీర్ఘ అనుభవం కలిగిన నబీకి కొడుకు హసన్‌తో కలిసి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల ఉంది. ఈ కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.హసన్‌ ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్–ఏ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన హసన్‌ పై రెండు ఫార్మాట్లలో సగటు 50కు చేరువగా పరుగులు సాధించాడు. పొట్టి క్రికెట్‌లో మాత్రం హసన్‌కు అనుభవం కాస్త తక్కువగా ఉంది. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ హసన్‌కు తొలి విదేశీ అసైన్‌మెంట్‌. నోఖాలి ఎక్స్‌ప్రెస్ తరఫున మూడు వారాల పాటు బెంచ్‌లో కూర్చున్న హసన్‌.. తాజాగా ఢాకా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో బీపీఎల్‌ అరంగేట్రం చేశాడు.అరంగేట్రంలోనే విధ్వంసంఅరంగేట్రంలోనే హసన్‌ చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 8 పరుగులతో సెంచరీ చేసే సుదర్ణావకాశాన్ని కోల్పోయాడు. కొడుకు చెలరేగిపోగా, తండి నబీ మాత్రం 17 పరుగులు (2 ఫోర్లు) మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే నబీ బౌలింగ్‌లో సత్తా చాటి 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తండ్రి-కొడుకులు సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్‌పై నోఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అరంగేట్రంలోనే విధ్వంసం సృష్టించిన హసన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

  Indian legends Rohit Sharma and Virat Kohli in a special felicitation ceremony10
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...

వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్‌’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్‌ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్, ‘కింగ్‌’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్‌లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్‌లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్‌ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు