Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC breaks silence on travel bias allegations WI SA Delayed Departures1
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్‌–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్‌ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్‌ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్‌ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్‌ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్‌ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫ్లయిట్‌లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ, ప్లేయర్‌ ఆకీల్‌ హొసేన్‌ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్‌ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్‌ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్‌ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్‌ వాన్‌ విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్‌ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్‌ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ సీజన్‌ కోసం పలువురు వెస్టిండీస్‌ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్‌మన్‌ పావెల్‌ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), రూథర్‌ఫర్డ్‌ (ముంబై ఇండియన్స్‌), హెట్‌మైర్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), రొమారియో షెఫర్డ్‌ (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

Agarkar Even Stood Against Gambhir Daring Decisions Leads IND WC Win2
గంభీర్‌కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?

టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్‌.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రం తిరుగులేని కోచ్‌ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ గెలిచిన భారత్‌.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్‌ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్‌ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌ విజయవంతమైన కోచ్‌ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్‌ గంభీర్‌ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ గెలవడంలో క్రెడిట్‌ గంభీర్‌ ఒక్కడికే కాకుండా.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్‌.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్‌ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్‌ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్‌ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్‌ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సూర్యకుమార్‌ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్‌ ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్‌ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్‌-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్‌ జోడీగా సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్‌-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్‌ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్‌ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్‌ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్‌ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్‌- అగార్కర్‌ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. గంభీర్‌ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్‌. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్‌లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్‌ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్‌ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్‌ కిషన్‌.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్‌ బాల్‌ క్రికెట్‌లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్‌ పంత్‌. ధ్రువ్‌ జురెల్‌ కారణంగా ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్‌ కన్విన్స్‌ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్‌ సెలక్టర్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్‌.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్‌ కిషన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్‌ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్‌ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత గంభీర్‌ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్‌ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026

Secret Behind Jasprit Bumrah Dangerous Slow Ball Deliveries3
స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

జస్‌ప్రీత్‌ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌తో డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ స్పెషలిస్ట్‌గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలవడమే గాక జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ సందర్భంగా డెత్‌ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.అహ్మదాబాద్‌ వేదికగా కిషోర్‌ త్రివేదీ క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్‌ సెంటర్‌కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్‌ పట్ల ఇంట్రెస్ట్‌ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్‌లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్‌కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్‌ వేసేవాడు. దీంతో కిశోర్‌ త్రివేది కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్‌ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. కోచ్‌ మాటలు పాటించి..బౌన్సర్లు తగ్గించి స్వింగ్‌, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్‌గా ఎదిగే అవకాశముంటుందని కోచ్‌ కిశోర్‌ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్‌ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్‌లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్‌ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో బౌలింగ్‌తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.తొలి పరిచయం!బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌పై అతని చిన్ననాటి కోచ్‌ కిశోర్‌ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్‌లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్‌గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్‌ బౌలింగ్‌ యాక్షన్‌. స్లో ఆర్థడాక్స్‌ను మీడియం బౌలింగ్‌కు మిక్స్‌ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్‌ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 8మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్‌లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు.

Babar Azam Takes Drastic Step After PCB Drops Him From Pakistan Vs Bangladesh4
బాబ‌ర్ ఆజం సంచ‌ల‌న నిర్ణ‌యం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఘోర ప‌రాభావం త‌ర్వాత పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (PCB) క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందులో భాగాంగానే బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజంను సెలెక్ట‌ర్లు త‌ప్పించారు. వ‌న్డే జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉన్న బాబ‌ర్‌ను త‌ప్పించ‌డం పెద్ద చ‌ర్చానీయంశ‌మైంది.దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా ఇటీవ‌ల ముగిసిన పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో బాబ‌ర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడుటీమ్ మేనేజ్‌మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ మార్చినప్పటికీ ఫలితం లేకపోయింది.బాబర్ 4 ఇన్నింగ్స్‌ల్లో 22.75 స‌గ‌టుతో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్ర‌మంలోనే పీసీబీ సెలెక్ష‌న్ క‌మిటీ అత‌డిపై వేటు వేసింది. ఇక జ‌ట్టు నుంచి ఉద్వాస‌నకు గురైన బాబ‌ర్ ఆజం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ నుండి అత‌డు తప్పుకున్నాడు.కొన్నాళ్లపాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు 'జియో న్యూస్‌' తమ కథనంలో పేర్కొంది. బాబర్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.బాబర్‌ను తిరిగి మళ్లీ పాకిస్తాన్ సూపర్‌-2026 సీజన్‌లో చూసే అవకాశముంది. ఈ టోర్నీలో పెషావర్ జల్మీ కెప్టెన్‌గా ఆజం వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది పీఎస్‌ఎల్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

I don't think India were the best team in the tournament: Steve Harmison5
'భార‌త్ గొప్ప జ‌ట్టేమి కాదు'.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ అక్కసు

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్-2026 ట్రోఫీని భార‌త జ‌ట్టు సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో 96 ప‌రుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచి చ‌రిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్‌-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్‌ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్‌లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్‌కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్‌ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్‌కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్‌-8లో భారత్‌ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్‌స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Sanjay Manjrekar Controversial Comments About Team India6
వివాదంలో సంజయ్‌ మంజ్రేకర్‌!

భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ తాను సంతోషంగా లేనంటూ పేర్కొన్నాడు. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ, తన దృష్టిలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిచినప్పుడే అన్ని ఫార్మాట్లలో చాంపియన్‌గా భారత్‌ పరిపూర్ణమవుతుందని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.ఇదే విషయమై సంజయ్‌ మంజ్రేకర్‌ తన సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించాడు.‘క్రికెట్‌ అభిమానులు అన్ని ఐసీసీ ట్రోఫీలను ఒకలా చూడలేరు. నా దృష్టిలో టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఎక్కువ ప్రాధానత్య ఉంటుంది. టీ20 వరల్డ్‌కప్‌ గెలవడం కంటే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌, ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గెలిస్తే వచ్చే మజా వేరుగా ఉంటుంది. ఐసీసీ టైటిల్స్‌ ర్యాంకింగ్‌ ప్రకారం చూస్తే మొదట వన్డే వరల్డ్‌కప్‌, రెండో స్థానంలో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌, మూడో స్థానంలో టీ20 ప్రపంచకప్‌, నాలుగో స్థానంలో చాంపియన్స్‌ ట్రోఫీ ఉంటాయి. కనీసం వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను టీమిండియా గెలవాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపాడు.మీ తలకు తుపాకీ పెట్టారా?అయితే సంజయ్‌ మంజ్రేకర్‌ మాటలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భారత్‌ ఐసీసీ ట్రోఫీలు గెలవడం సంజయ్‌కు ఇష్టం లేదేమో’ అంటూ కొందరు వ్యాఖ్యానించారు. ఇక కమెడియన్‌ అబిజిత్‌ గంగూలీ సంజయ్‌ మంజ్రేకర్‌కు ‘ఎక్స్‌’ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘మీరు చెప్పింది నిజమే కావొచ్చు. కానీ టీ20 ప్రపంచకప్‌ గెలిచిందని సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు తగదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీ తలకు తుపాకీ పెట్టి ఎవరు ఇలా చెప్పమని అడగరు. సానియా మీర్జా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ అందుకుంది.. కానీ అది సింగిల్స్‌లో కాదు డబుల్స్‌లో అన్నట్లుగా మీరు చెప్పిన విషయముంది. ఫార్మాట్‌ ముఖ్యం కాదు ఆమె నంబర్‌వన్‌ ర్యాంకు అందుకోవడం గొప్ప విషయం. అలాగే భారత్‌ కూడా ఏ ఫార్మాట్‌లో కప్పు కొట్టాలన్నది ముఖ్యం కాదు.’ అని ట్వీట్‌ చేశాడు.ఇదేమీ కొత్త కాదు..కాగా సంజయ్‌ మంజ్రేకర్‌ వివాదంలో చిక్కుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2024లో బోర్డర్ గావస్కర్‌ సిరస్ సందర్భంగ ‘కోచ్‌ గౌతమ్ గంభీర్‌ ప్రెస్‌ కానఫఫరెన్స్‌కు దూరంగా ఉంటే మంచిదేమో. మీడియ సమావేశాల కంటే కోచ్‌గా తన పని తాను సక్రమంగా చేస్తే మంచిదనుకుంటా’ అని వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. మొత్తం మీద తన చర్యలతో సంజయ్ మంజ్రేకర్ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.చదవండి: టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

Smriti Mandhana retains top spot in Women's ODI rankings7
టాప్‌ ర్యాంక్‌లోనే స్మృతి

భారత డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన నిలకడగా ఒకటో ర్యాంక్‌లో కొనసాగుతోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8వ) ర్యాంక్‌లోనూ ఏ మార్పూ లేదు. అయితే జెమీమా రోడ్రిగ్స్‌ ఒక స్థానాన్ని కోల్పోయి 12వ ర్యాంక్‌లో ఉంది. ఆ్రస్టేలియా పర్యటనలో క్లీన్‌స్వీప్‌ అయిన మూడు వన్డేల సిరీస్‌లో జెమీమా నిరాశపరిచింది.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

Sanjay Manjrekar Slams Gautam Gambhir Despite T20 World Cup Win8
'గంభీర్ చాలా పెద్ద త‌ప్పు చేశాడు'

టీ20 ప్రపంచ‌క‌ప్‌-2026లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలుత తుది జ‌ట్టులోనే లేని శాంస‌న్ ఏకంగా ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కీలకమైన చివరి మూడు మ్యాచ్‌లో సంజూ (97, 89, 89) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌లు ఆడాడు.ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శాంస‌న్‌.. స్ట్రైక్ రేట్ 199.37 321 పరుగులు చేశాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేకర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను భారత్ సొంతం చేసుకున్న‌ప్ప‌టికి.. సంజూను స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలో గంభీర్‌ ఆధ్వర్యంలోని టీమ్ మేనేజ్‌మెంట్ "తీవ్రమైన తప్పిదాలు" చేసిందని మంజ్రేకర్ విమర్శించాడు. టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌ల‌లో శాంస‌న్‌ను తుది జ‌ట్టు నుంచి త‌ప్పించ‌డాన్ని అత‌డు త‌ప్పుబట్టాడు."సంజూ శాంస‌న్ విష‌యంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర‌మైన త‌ప్పిదాలు చేసింది. ద‌క్షిణాఫ్రికా వంటి ప‌టిష్ట‌మైన జ‌ట్టుపై ఓపెన‌ర్‌గా వ‌చ్చి సంజూ వ‌రుస సెంచ‌రీల‌తో స‌త్తాచాటాడు. ఆ త‌ర్వాత శుభ్‌మ‌న్‌ గిల్ కేవ‌లం టెస్టుల్లో బాగా ఆడాడని అతడిని మళ్ళీ టీ20ల్లోకి తీసుకొచ్చి సంజూను లోయార్డ‌ర్‌కు డిమోట్ చేశారు.దీంతో శాంస‌న్ త‌న రిథ‌మ్‌ను కోల్పోయాడు. ఈ కార‌ణంతో అత‌డిని తుది జ‌ట్టు నుంచి సైతం త‌ప్పించారు. అయితే ఒక మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం కావడంతో సంజూ మ‌ళ్లీ అవ‌కాశం ద‌క్కింది. మూడో స్ధానంలో ఇబ్బంది ప‌డుతున్న తిలక్ వ‌ర్మ‌ను బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో వెన‌క్కి నెట్టి ఆ స్ధానంలో కిషన్‌ను బ్యాటింగ్‌కు పంపారు. కిష‌న్ స్దానంలో సంజూ మ‌ళ్లీ ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. ఈసారి అత‌డు దుమ్ములేపాడు. ఏకంగా త‌న అద్భుత‌ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో జ‌ట్టును ఛాంపియ‌న్‌గా నిలిపాడు. అనుకోకుండా జ‌ట్టులోకి వ‌చ్చిన సంజూ చ‌రిత్ర‌ను తిరగ‌రాశాడు. అతడికి ఓపెనింగ్‌ స్ధానమే సరైనది" అని మంజ్రేకర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లలో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

Mitchell Santner To Lead, Finn Allen Rested As New Zealand Name Squad For SA Series9
న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం

టీ20 ప్రపంచకప్‌-2026 తర్వాత న్యూజిలాండ్ తమ మొదటి అంతర్జాతీయ సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో 18 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది.ఈ జ‌ట్టుకు మిచెల్ సాంట్నర్ జట్టుకు సారథ్యం వ‌హించ‌నున్నాడు. అదేవిధంగా ప్రపంచ కప్ జట్టులో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మాట్ హెన్రీలు వంటి స్టార్ ప్లేయ‌ర్లకు సెలెక్ట‌ర్లు విశ్రాంతి ఇచ్చారు.కటేన్ క్లార్క్, నిక్ కెల్లీ, జేడన్ లెన్నాక్స్‌ల‌కు సెలెక్ట‌ర్లు పిలుపునిచ్చారు. అలాగే ఆల్‌రౌండ‌ర్ జోష్ క్లార్క్‌స‌న్‌ దాదాపు రెండున్నరేళ్ల తర్వాత జ‌ట్టులోకి వ‌చ్చాడు. బెవాన్ జాకబ్స్, జాక్ ఫౌల్క్స్,టిమ్ రాబిన్సన్ కూడా పునరాగమనం చేశారు. వీరు ముగ్గురు భార‌త్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో భాగంగా ఉన్నారు.కాగా కెప్టెన్ శాంట్న‌ర్ తొలి మూడు మ్యాచ్‌ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. ఆ త‌ర్వాత ఆఖ‌రి రెండు టీ20ల్లో టామ్ లాథ‌మ్ కివీస్ జ‌ట్టును నడిపించ‌నున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 రన్నరప్‌గా న్యూజిలాండ్‌ నిలిచిన సంగతి తెలిసిందే.సౌతాఫ్రికా సిరీస్‌కు న్యూజిలాండ్ జ‌ట్టుకటేన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, బెవాన్ జాకబ్స్, కైల్ జెమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, జేడన్ లెన్నాక్స్, కోల్ మెక్కాన్చీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సీర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి.చదవండి: T20 WC 2026: 'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

 Pakistan Cricketer Busts Umpires Favour India Claim In Blunt Admission10
'భార‌త్ ఒక ఛాంపియ‌న్ జ‌ట్టు.. తప్పులు వెతకడం ఆపండి'

టీ20 వరల్డ్‌కప్-2026 విజేత టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు అనుకూలంగా బ్యాటింగ్ పిచ్‌లు సిద్ధం చేశారనే ఆరోపణలను వసీం కొట్టిపారేశాడు. భారత్ ఒక అద్భుతమైన జట్టు అని అతడు కొనియాడాడు.కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఓవరాల్‌గా మూడు సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది.అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. కొంతమంది మాత్రం భారత్ 'పిచ్‌ల రిగ్గింగ్' చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో ఓ పాకిస్తాన్ టీవీ ఛానల్ డిబేట్‌లో వసీం భారత్‌కు మద్దతుగా నిలిచాడు."పాకిస్తాన్ కంటే భారత్ చాలా పెద్ద జట్టు. ఈ విజయానికి వారు అన్ని రకాల అర్హులు. అంపైర్లు భారత్‌కు సహకరిస్తారని లేదా వారు స్పిన్ అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకుంటారని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఈ టోర్నీలో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా లేనప్పటికి వారు అద్భుతంగా ఆడారు. తప్పులు వెతకడం మానేసి, ఒక క్రికెట్ జట్టు ఉన్న దేశంగా మనం వారిని అభినందించాలి. పాక్ కంటే భారత్ అద్భుతమైన జట్టు అన్న విషయాన్ని మనం అంగీకరించాలి"అని వసీం పేర్కొన్నాడు. కాగా కొంతమంది పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం భారత విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement