Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Kamalini ruled out of WPL, Vaishnavi Sharma named replacement1
ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

డబ్ల్యూపీఎల్‌ 2026 ఎడిషన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం​ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్‌ బ్యాటర్‌ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్‌ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.17 ఏళ్ల కమిలిని ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.వైష్ణవి శర్మతో భర్తీ 20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్‌-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. డబ్ల్యూపీఎల్‌ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్‌ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్‌ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు చాలా కీలకం.

History of IND VS NZ T20I Bilateral series2
రేపటి నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్‌స్టార్‌ యాప్‌ మరియు వెబ్‌సైట్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.షెడ్యూల్‌..తొలి టీ20- నాగ్‌పూర్‌రెండో టీ20- రాయ్‌పూర్‌మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురంఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.జట్లు..భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, అభిషేక్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, సంజూ శా​ంసన్‌, ఇషాన్‌ కిషన్‌, అర్షదీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, జస్ప్రీత్‌ బుమ్రా, రవి బిష్ణోయ్‌, వరుణ్‌ చక్రవర్తిన్యూజిలాండ్: మిచెల్‌ సా​ంట్నర్‌ (కెప్టెన్‌), మార్క్‌ చాప్‌మన్‌, టిమ్‌ రాబిన్సన్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, డారిల్‌ మిచెల్‌, బెవాన్‌ జాకబ్స్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్‌, డెవాన్‌ కాన్వే, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ, కైల్‌ జేమీసన్‌, ఐష్‌ సోది, క్రిస్టియన్‌ క్లార్క్‌ఈ సిరీస్‌ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్‌ మూడు, భారత్‌ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది.ఆతర్వాత 2012లో న్యూజిలాండ్‌ తొలిసారి టీ20 సిరీస్‌ ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).అనంతరం 2017-18లో న్యూజిలాండ్‌ మరోసారి భారత్‌లో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు భారత్‌ 2-1 తేడాతో కైవసం​ చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ విక్టరీ సాధించింది.ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్‌ న్యూజిలాండ్‌లో పర్యటించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.2019-20లో భారత్‌ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్‌ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్‌ కోహ్లి టీ20 కెరీర్‌లోనూ ఈ సిరీస్‌ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.అనంతరం 2021-22లో న్యూజిలాండ్‌ 3 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను కూడా భారత్‌ క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది.2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. రెండు సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్‌లను కైవసం చేసుకుంది.శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకంఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో గిల్‌ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Son of Australia legend gets major recognition after defecting to England3
ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డారెన్‌ లెహ్‌మన్‌ కొడుకు జేక్‌ లెహ్‌మన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్‌ను 2024-25 సీజన్‌కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్‌ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక​ ఈ అవార్డు లభించింది.ఆసీస్‌ దేశవాలీ క్రికెట్‌లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్‌ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్‌షైర్‌ కౌంటీతో లోకల్‌ ప్లేయర్‌ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్‌ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్‌ విషయంలో ఇదే జరిగింది. జేక్‌ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవడం​ వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.షెఫీల్డ్ షీల్డ్‌లో రికార్డు ప్రదర్శన జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్‌లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్‌ ఫైనల్లో జేక్‌ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్‌బాల్ టైటిల్‌ను అందించింది.తండ్రి వారసత్వం జేక్‌ తండ్రి డారెన్‌ లెహ్‌మన్‌ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్‌ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్‌లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడటం నా కలజేక్‌ ఆసీస్‌ తరఫున ఆడే అవకాశాల కోసం​ సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్‌ కౌంటీ హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు.

Kahan Aim Kar Rahe Ho: Gambhir Asks Hardik Pandya Video Viral4
నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్‌తో గంభీర్‌.. వీడియో వైరల్‌

సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు సన్నాహకంగా కివీస్‌తో జరిగే ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్‌ సేన ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టేసింది.హార్దిక్‌ పాండ్యా రీఎంట్రీహెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్‌-2025 మ్యాచ్‌లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్‌.. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో టీ20 సిరీస్‌, ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కుపెట్టావు?ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్‌ సెషన్‌లో బంతితో, బ్యాట్‌తో హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్‌ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్‌రౌండర్‌.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్‌- హార్దిక్‌ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్‌ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్‌.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. ఇందుకు హార్దిక్‌.. ‘‘మొదటి టైర్‌లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్‌ టైర్‌లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు. బుమ్రా కూడాఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా కివీస్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి టీమిండియాతో చేరాడు. కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌-2026 జరుగనుంది. ఇందుకు భారత్‌- శ్రీలంక వేదికలు.చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!Sound On 🔊 Dialling up the intensity as #TeamIndia steps into T20I mode to take on New Zealand ⚡️ #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/RSE2DXLFXA— BCCI (@BCCI) January 20, 2026

RCB becomes the First team to win 6 Consecutive matches in WPL history5
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ

మహిళల ఐపీఎల్‌లో (WPL) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్‌ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్‌లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్జ్‌, ముంబై ఇండియన్స్‌పై వరుస విజయాలు సాధించింది. FIRST TEAM TO PLAYOFFS - ITS RCB...!!!!- The Historic moment with 6 consecutive wins. 💥 pic.twitter.com/ufVqDnuPZq— Johns. (@CricCrazyJohns) January 19, 2026అంతకుముందు ఎడిషన్‌లో (2025) తమ చివరి మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. లీగ్‌ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్‌ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీతాజాగా గుజరాత్‌ జెయింట్స్‌పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్‌తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది.నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్‌ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, అనామక ప్లేయర్‌ గౌతమి నాయక్‌ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మంధన (26), రిచా ఘోష్‌ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించారు. గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2, రేణుకా సింగ్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్‌ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్‌ (4-0-17-2), లారెన్‌ బెల్‌ (4-1-23-1), రాధా యాదవ్‌ (4-0-34-1), శ్రేయాంక పాటిల్‌ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఆష్లే గార్డ్‌నర్‌ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్‌ (11 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

Rasooli, Zadran star as Afghanistan cruise past West Indies6
వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌

ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్‌ రిపీటైంది.దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్‌ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. సెదిఖుల్లా అటల్‌ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్‌ తడబడింది. జియా ఉర్‌ రెహ్మాన్‌ (4-0-36-3), రషీద్‌ ఖాన్‌ (4-0-19-2), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (4-0-29-2), నూర్‌ అహ్మద్‌ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో సాంప్సన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), మోటీ (28), ఫోర్డ్‌ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌ చెరో 4, జాంగూ, హెట్‌మైర్‌, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.

Shreyas Iyer may not needed for T20 WC Tilak Varma set to return soon7
శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!

చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్‌ అయ్యర్‌. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.అయితే, తిలక్‌ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.శస్త్రచికిత్స విజయవంతంపొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్‌ టార్షన్‌ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.వేగంగా కోలుకుంటున్న తిలక్‌స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్‌ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్‌ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.బరిలోకి దిగేందుకు సైటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. తిలక్‌ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్‌ ట్రెయినింగ్‌ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కి చేరుకుంటాడు.ఒకవేళ ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే కివీస్‌తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్‌ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్‌ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్‌ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్‌ వర్మ.. ఆసియా కప్‌-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవి బిష్ణోయి.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

Is Gambhir Listening R Ashwin Pinpoints Big Flaws In Gill Captaincy8
గిల్‌ కెప్టెన్సీపై అశ్విన్‌ ఘాటు విమర్శలు

టెస్టులకు రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్‌కు అప్పగించింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్‌గా గిల్‌ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో టెస్టుల్లో వైట్‌వాష్‌ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్‌ తొలిసారి 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్‌ సేనకు న్యూజిలాండ్‌ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్‌లను చూసి నేర్చుకోకివీస్‌ సిరీస్‌లో ముఖ్యంగా ఇండోర్‌లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్‌ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్‌కు ఏ బౌలర్‌తో బౌలింగ్‌ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్‌తో సిరీస్‌లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్‌ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్‌కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్‌ ఫిలిప్స్‌ ఫాస్ట్‌ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్‌ వేరే విధంగా ఉండేది. డారిల్‌ మిచెల్‌ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్‌ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్‌.. గిల్‌ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్‌ నెత్తిన మిచెల్‌ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్‌పై రహానే, జహీర్‌ ఖాన్‌ ఫైర్‌!

BCCI Plans Rs 7 Cr Shock To Kohli Rohit To Axe On A+ Grade: Report9
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్‌!

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్‌ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్‌లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్‌లో బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్‌లో బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మతో పాటు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రధాన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్‌లో ఉన్న రిషభ్‌ పంత్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, మొహమ్మద్‌ షమీ, కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్‌లో ఉన్న రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్‌ సుందర్‌, ముకేశ్‌ కుమార్‌, సంజూ శాంసన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ, రజత్‌ పాటిదార్‌, ధ్రువ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, ఆకాశ్‌ దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్‌ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్‌ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్‌తదుపరి అపెక్స్‌ మీటింగ్‌లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్‌ అండ్‌ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు భారీ షాక్‌ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్‌లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్‌ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్‌లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్‌లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి

IND vs NZ: Debutant who dismissed Kohli twice Added to NZ T20I squad10
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్‌ యంగ్‌స్టార్‌కి గోల్డెన్‌ ఛాన్స్‌

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన యువ పేసర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్‌లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్‌ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ వెల్లడించింది. స్టార్‌ ఆటగాడు మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్‌కాప్స్‌ (న్యూజిలాండ్‌)తో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్‌లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్‌ బ్రేస్‌వెల్‌ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్‌పూర్‌లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్‌ బ్రేస్‌వెల్‌ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్‌ ఆడిన కివీస్‌ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్‌ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్‌ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్‌ సందర్భంగానే క్రిస్టియన్‌ క్లార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్‌తో తొలి వన్డేలో హర్షిత్‌ రాణాను అవుట్‌ చేసి తన ఖాతాలో తొలి వికెట్‌ జమచేసుకున్న క్లార్క్‌.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్‌ మీడియం పేసర్‌.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌ జట్టులోనూ క్రిస్టియన్‌ క్లార్క్‌ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్‌లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్‌ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు (అప్‌డేటెడ్‌)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్‌, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్‌లకు).షెడ్యూల్‌: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి న్యూజిలాండ్‌ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement