ప్రధాన వార్తలు
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.పాక్ క్రికెటర్ల వెంటపడతాడుఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్లో భజ్జీ బ్రాడ్కాస్టర్గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్ అహ్మద్ అనే ఓ పాక్ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రంలా బిల్డప్ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్ఫామ్లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట.పాకిస్తాన్ తరఫున అతడు 3-4 మ్యాచ్లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అన్నట్లుగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్కాస్టర్గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఉస్మాన్ తారిఖ్ను ప్రశ్నలు అడిగాను.ఆ మ్యాచ్లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్కాస్టర్గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలుచెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్తఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్లు ఆడిన వాడికి 100 మ్యాచ్లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు.కాగా టీమిండియా తరఫున హర్భజన్ సింగ్ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ తన్వీర్ అహ్మద్ పాక్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్ తీశాడు.చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు
ఆసీస్పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్లో తన చివరి వికెట్తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా, ఓవరాల్గా 35 బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్వెల్ (31) విఫలయత్నం చేశారు.
T20 WC 2026: చరిత్ర సృష్టించిన స్టోయినిస్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో స్టోయినిస్ ఓ వికెట్ సహా 6 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అస్ట్రేలియా తరఫున 50 వికెట్లు సహా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.ఆసీస్కు షాకిచ్చిన జింబాబ్వేటీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచలనం నమోదైంది. మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. కొలొంబో వేదికగా జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, మైటి ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి, ఆతర్వాత ఆ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. బ్యాటింగ్లో బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), బౌలింగ్లో బ్లెస్సింగ్ ముజరబానీ (4-0-17-4) చెలరేగిపోయారు. బ్యాటింగ్లో బెన్నెట్తో పాటు మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) కూడా రాణించారు.బౌలింగ్లో ముజరబానీతో పాటు బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) కూడా సత్తా చాటారు.ఆసీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆసీస్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. బౌలింగ్లో ఎల్లిస్ (4-0-34-0), జంపా (4-0-31-0) పరుగులు నియంత్రించినా వికెట్లు తీయలేకపోయారు. డ్వార్షుయిస్ (4-0-40-0)ను జింబాబ్వే బ్యాటర్లు ఉతికి ఆరేశారు. కుహ్నేమన్ (3-0-24-0) ప్రభావం చూపలేకపోయాడు. పార్ట్టైమ్ బౌలర్ మ్యాక్స్వెల్ ఒక్క ఓవర్కే (1-0-14-0) పరిమితమయ్యాడు. గ్రీన్ (1.1-0-6-1), స్టోయినిస్ (2.5-0-17-1) తలో వికెట్ తీశారు. స్టోయినిస్ బౌలింగ్ చేస్తుండగా తీవ్రంగా గాయపడి, ఓవర్ ముగియకుండానే మైదానాన్ని వీడాడు.అనంతరం బ్యాటింగ్లో ఆసీస్ దారుణంగా తేలిపోయింది. ఓపెనర్లు ఇంగ్లిస్ 8, హెడ్ 17 పరుగులు చేయగా.. ఆతర్వాత వచ్చిన గ్రీన్, టిమ్ డేవిడ్ డకౌట్లయ్యారు. ఈ దశలో మ్యాక్స్వెల్ (31), రెన్షా (65) ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే జింబాబ్వే బౌలర్ల ధాటికి వీరు కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో స్టోయినిస్ (6), డ్వార్షుయిస్ (6), జంపా (2), కుహ్నేమన్ (0) ఇలా వచ్చి, అలా పెవిలియన్కు వెళ్లడంతో ఆసీస్ ఘోర పరాజయంపాలైంది. జింబాబ్వే టీ20 ప్రపంచకప్లో ఆసీస్ను ఓడించడం ఇదే మొదటిసారి కాదు. 2007 ఎడిషన్లోనూ ఆ జట్టు ఆసీస్ను మట్టికరిపించింది.
'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు
టీ20 ప్రపంచకప్-2026లో అసలు సిసలైన సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను ఉద్దేశించి పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక 'స్లాగర్' (బంతిని బలంగా బాదడం) అని, బ్యాటింగ్ టెక్నిక్ లేదని అతడు విమర్శించాడు."అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఒక స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. ప్రతీ బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి ఆట తీరు ఉన్నవాళ్లు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అతడు సక్సెస్ అవుతారు. విఫలమయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ దగ్గర సరైన టెక్నిక్ లేదు.ప్రతీ 8 ఇన్నింగ్స్లలో ఒకసారి మాత్రమే అతడు రాణిస్తున్నాడు. మిగిలిన మ్యాచ్లలో తక్కువే పరుగులకే అవుట్ అవుతున్నాడు. అతడు ఒక చోట నిలబడి అన్ని బంతులను ఒకే ఏరియాలో వేయాలని కోరుకుంటాడు. బంతిని బాడీ లైన్ వేస్తే అతను ఇబ్బంది పడతాడు. అదేవిధంగా బంతి కొంచెం స్వింగ్ అయినా అతను ఆడలేడు.అయితే అభిషేక్ను నేనేమి తక్కువ చేసి మాట్లడడం లేదు. అతడి ఆటలో చాలా రిస్క్ ఉందని చెబుతున్నా. తనదైన ప్రత్యర్ధి జట్టును ముప్పు తిప్పలు పెట్టగలడు అని ఓ టీవీ ఛానల్ డిబేట్లో అమీర్ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న అభిషేక్ శర్మను 'స్లాగర్' అని పిలవడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అభిషేక్ లాంటి ఒక్క ప్లేయర్ అయినా మీ జట్టులో ఉన్నారా? అంటూ నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు. కాగా కడుపు ఇన్ఫెక్షన్ వల్ల నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ దూరమయ్యాడు. పాక్తో మ్యాచ్కు ఈ పంజాబీ బ్యాటర్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
T20 WC: ఆసీస్కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్డౌన్లో వచ్చిన గ్రీన్ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్లో సంచలనం.. నేపాల్పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026
అతడు మా ‘వెన్ను’ విరిచాడు.. లేదంటే: నమీబియా కెప్టెన్
పసికూన నమీబియాకు టీ20 వరల్డ్కప్-2026లో వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత నెదర్లాండ్స్తో తలపడ్డ ఎరాస్మస్ బృందం.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.తాజాగా గురువారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో నమీబియా 93 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ (Gerhard Erasmus) తమ పరాజయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతడు మా ‘వెన్ను’ విరిచాడుడెత్ ఓవర్లలో తమ బౌలర్లు అద్భుతంగా రాణించి భారత్ను కట్టడిచేయగలిగారని ఎరాస్మస్ జట్టును ప్రశసించాడు. అదే విధంగా.. టీమిండియా విధించిన భారీ లక్ష్య ఛేదనలో తాము శుభారంభమే అందుకున్నామని ఎరాస్మస్ పేర్కొన్నాడు. అయితే, భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తమ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచి.. కకావికలం చేశాడని పేర్కొన్నాడు.ఈ మేరకు.. ‘‘పవర్ ప్లేలో మా ఆట చూసిన తర్వాత ఆశలు రేకెత్తాయి. ఇది (అరుణ్ జైట్లీ స్టేడియం) చిన్న మైదానం. ఇక మంచు ప్రభావం కూడా ఉంటుంది. 26 ఓవర్ల ఆట తర్వాత ఇది మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. స్పిన్నర్లకు కష్టమేనని భావించాము.అయితే, దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి వేసిన స్పెల్ మా బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచేసింది. లక్ష్య ఛేదనలో అతడు మమ్మల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. ఏదేమైనా డెత్ ఓవర్లలో మా బౌలర్లు కూడా అదరగొట్టారు.మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉందిఇప్పటికీ మేము 100 శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాం. అయితే, ఈ టోర్నీ ముగిసేలోపు కచ్చితంగా మా సత్తా ఏమిటో చూపిస్తాం. మా బ్యాటింగ్లో ఫైర్ పవర్ ఉంది. కానీ ఈరోజు ప్రణాళికలను అమలు చేయలేకపోయాము. గత మ్యాచ్ కూడా ఇక్కడే ఆడాము. పిచ్లో ఎలాంటి మార్పూ లేదు.అయితే, ఈరోజు భారత బౌలర్లు నాణ్యంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బకొట్టారు. ముఖ్యంగా 6- 10 ఓవర్ల మధ్య మా బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేశారు’’ అని నమీబియా కెప్టెన గెర్హాడ్ ఎరాస్మస్ చెప్పుకొచ్చాడు.వరుణ్ అద్భుత స్పెల్కాగా ఢిల్లీ వేదికగా టీమిండియా- నమీబియా గురువారం తలపడిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన నమీబియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.ఇక లక్ష్య ఛేదనలో నమీబియాను వరుణ్ చక్రవర్తి దెబ్బకొట్టాడు. రెండు ఓవర్ల బౌలింగ్లో కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ లారెన్ స్టీన్కాంప్ (29), వన్డౌన్ బ్యాటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (13)లతో పాటు.. జేజే స్మిత్ (0)లను వరుణ్ అవుట్ చేశాడు.Aate hi k̶a̶a̶m̶ magic shuru kar diye! 🥶Varun Chakaravarthy wastes no time, strikes on his very first ball! ☝️ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/spt27bnTnu— Star Sports (@StarSportsIndia) February 12, 2026 కీలక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుటయ్యాడు. చదవండి: T20 WC 2026: పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
పిజ్జాలు తయారు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’
టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది. నేపాల్తో గ్రూప్ ‘సి’ మ్యాచ్లో అంచనాలను తలకిందులు చేస్తూ ఇటలీ అదరగొట్టింది. ముంబైలో గురువారం జరిగిన ఈ పోరులో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్పై జయభేరి మోగించడం విశేషం.క్రిషాన్.. మోస్కా బ్రదర్స్ అదుర్స్ఈ గెలుపులో అన్మదమ్ములు జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్), ఆంటోని మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్)లతో పాటు లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగేది కీలక పాత్ర. నేపాల్ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కలుగమగే ప్రధాన భూమిక పోషించగా.. లక్ష్య ఛేదనలో మోస్కా బ్రదర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇటలీకి తొలి విజయం అందించిన ఈ ముగ్గురు.. ఇటలీ వెలుపల జన్మించిన వారే కావడం గమనార్హం.మోస్కా బ్రదర్స్ తల్లిదండ్రులు ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా.. వీరిద్దరు సిడ్నీలో జన్మించారు. అయితే, ఆ తర్వాత క్లబ్ స్థాయి క్రికెట్లో మెళకువలు నేర్చుకుని ఇటలీకి తిరిగి వచ్చి తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు.శ్రీలంకలో పుట్టి పెరిగిఇక క్రిషాన్ కలుగమగేది మరో స్టోరీ. అతడు శ్రీలంకలో జన్మించాడు. క్రికెట్ అంటే అతడికి పిచ్చి అని చెప్పవచ్చు. చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న కలుగమగే అండర్–15 స్థాయి వరకు శ్రీలంకకే ఆడాడు.అయితే అదే సమయంలో కలుగమగే కుటుంబం ఇటలీ వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటలీలో ఈ ఆట ఉండదు కాబట్టి తన క్రికెట్ కెరీర్ కోల్పోతానని భయంతో అతను వెళ్లడానికి ఇష్టపడలేదు. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు తప్పలేదు. అయితే అక్కడికి వెళ్లాక క్రికెట్ అవకాశాలు రావడంతో పాటు... పరిస్థితి మారి ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.పిజ్జాలు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’నిజానికి కలుగమగే ప్రొఫెషనల్ షెఫ్. ఇటాలియన్ స్పెషల్ పిజ్జాలు తయారు చేసే ‘లా విటా పిజారియా’ అనే హోటల్లో సోమవారం నుంచి శనివారం వరకు ‘షెఫ్’గా అతడు పని చేస్తాడు. కాబట్టి కేవలం ఆదివారాల్లో మాత్రమే అతడికి క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సాధన చేసే కలుగమగే ఏకంగా వరల్డ్కప్ హీరోగా నిలవడం విశేషం.ఇక నేపాల్తో మ్యాచ్లో 34 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. కెప్టెన్ రోహిత్ పౌడేల్ (23), దీపేంద్ర సింగ్ ఐరీ (17), గుల్షాన్ ఝా (3) రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కలుగమగే కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.123 పరుగులకేమ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్రోహిత్ పౌడేల్ (23), ఆసిఫ్ షేక్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇతర ప్రధాన బ్యాటర్లు కుశాల్ భుర్తేల్ (5), దీపేంద్ర సింగ్ ఐరీ (17) ప్రభావం చూపించలేకపోవడంతో నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.ఇంగ్లండ్పై గత మ్యాచ్లో 17 ఫోర్లు, 7 సిక్స్లు బాదిన నేపాల్ బ్యాటర్లు ఈసారి.. 7 ఫోర్లు, 3 సిక్స్లు మాత్రమే నమోదు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగే (3/18) మూడు కీలక వికెట్లతో జట్టును దెబ్బ తీశాడు.మరో 44 బంతులు మిగిలి ఉండగానేఅనంతరం ఛేదనలో ఇటలీ ఎక్కడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంటోనీ మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్లు), జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. The Mosca brothers finish it in style! 🇮🇹🔥A dominant 10-wicket triumph over Nepal as Italy register their first-ever ICC Men’s T20 World Cup win 👏Statement made. History created.Next on ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/lKwkG3OSxX— Star Sports (@StarSportsIndia) February 12, 2026చదవండి: IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
జైశ్వాల్, జడేజా కాదు.. రాజస్తాన్ కెప్టెన్గా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు నూతన సారథిగా ఆల్రౌండర్ రియాన్ పరాగ్ను రాయల్స్ యాజమాన్యం ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై రాజస్తాన్ రాయల్స్ ఫిబ్రవరి 13( శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు అధికారిక ప్రకటన చేయనుంది.గత సీజన్ వరకు కెప్టెన్గా పనిచేసిన సంజూ శాంసన్ స్దానాన్ని పరాగ్ భర్తీ చేయనున్నాడు. తొలుత పరాగ్తో పాటు రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు రాజస్తాన్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ రాజస్తాన్ మేనెజ్మెంట్ మాత్రం పరాగ్ వైపే మొగ్గు చూపినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రియాన్ పరాగ్ 2019 నుంచి రాజస్తాన్ జట్టుతో కొనసాగుతున్నాడు. అస్సాం జట్టుతో పాటు రాజస్తాన్ కెప్టెన్గా కూడా పరాగ్కు పనిచేసిన అనుభవం ఉంది. ఐపీఎల్-2025 సీజన్లో గాయపడిన సంజూ శాంసన్ స్ధానంలో 8 మ్యాచ్లకు పరాగ్ నాయకత్వం వహించాడు. హెడ్ కోచ్ కుమార్ సంగక్కర సూచన మేరకు పరాగ్కు తమ జట్టు పగ్గాలను రాజస్తాన్ అప్పగించినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది సీజన్కు ముందు రాజస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ను సీఎస్కే ట్రేడ్ చేసిన రాజస్తాన్.. అందుకు బదులుగా స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కుర్రాన్లను తమ జట్టులోకి తీసుకుంది. అదేవిధంగా రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా తప్పుకోవడంతో కుమార్ సంగక్కర ఆధ్వర్యంలో రాజస్తాన్ బరిలోకి దిగనుంది.
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్తో మ్యాచ్కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఓ గుడ్ న్యూస్ అందింది. కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. పాక్తో పోరు నాటికి పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది.అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత అభిషేక్కు తీవ్రమైన కడుపు సమస్య రావడంతో న్యూఢిల్లీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అతడు చికిత్స పూర్తి చేసుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. అయితే నమీబియాతో మ్యాచ్కు ముందు అభిషేక్ ప్రాక్టీస్ కూడా చేశాడంట. ఈ విషయాన్ని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ధ్రువీకరించాడు.నమీబియాతో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడుతాడని నేను అనుకుంటున్నాను. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఈ రోజు అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని నాతో చెప్పాడని వరుణ్ అన్నాడు.2 కిలోలు తగ్గిన అభిషేక్అభిషేక్ శర్మ కూడా తన ఫిట్నెస్పై అప్డేట్ ఇచ్చాడు. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడిన అభిషేక్, చికిత్స సమయంలో రెండు కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను కేవలం పప్పు అన్నం మాత్రమే తింటున్నానని ఓ వీడియోలో అభిషేక్ పేర్కొన్నాడు. ఒకవేళ పాక్తో మ్యాచ్కు అభిషేక్ దూరమైతే, భారత ఇన్నింగ్స్ను సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు.
బెల్జియం చేతిలో భారత్ పరాజయం
రూర్కెలా: ప్రొ హాకీ లీగ్ కొత్త సీజన్ను భారత పురు...
ఆకృతికి రజతం... అంజుమ్కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత ష...
నయా రాకెట్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... ...
ప్రిక్వార్టర్ ఫైనల్లో సహజ, రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐ...
పిజ్జాలు తయారు చేసే షెఫ్.. టీ20 వరల్డ్కప్ ’హీరో’
టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది...
జైశ్వాల్, జడేజా కాదు.. రాజస్తాన్ కెప్టెన్గా సూపర్ స్టార్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ సం...
IND vs NAM: అంపైర్తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గె...
పాక్తో మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2026లో భారత క్రికెట్ జట్టు ర...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
