ప్రధాన వార్తలు
పాక్ను చిత్తు చేసిన భారత్.. సూపర్-8కు సూర్య సేన
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ (0) త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఇషాన్ కిషన్ మాత్రం సంచలన ప్రదర్శన కనబరిచాడు. కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ ఔటయ్యాక తిలక్ వర్మ (25), సూర్యకుమార్ యాదవ్ (32) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ చివరిలో శివం దూబే (27)., రింకూ సింగ్(4 బంతుల్లో 11) మెరుపులు మెరిపించారు. ఫలితంగా 170 పైగా భారత్ స్కోర్ సాధించగల్గింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగట్టగా.. సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన భారత బౌలర్లుఅనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. టీమిండియా బౌలర్ల ధాటికి దాయాది జట్టు 18 ఓవర్లలో కేవలం ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్పై భారత్కు ఇది 8వ విజయం కావడం విశేషం.
తిలక్ వర్మపై గంభీర్ సీరియస్
టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ వర్మ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన తిలక్ తన జిడ్డు బ్యాటింగ్తో విసిగించాడు. ఓ వైపు ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుంటే తిలక్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ హెడ్కోచ్ గంభీర్ అగ్రహానికి గురయ్యాడు.డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్, తిలక్ వర్మతో చాలా సీరియస్గా మాట్లాడాడు. వేగంగా ఆడాలని, టార్గెట్ 170 దాటాలని గంభీర్ గట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా 24 బంతుల్లో 104.17 స్ట్రైక్ రేటుతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు.pic.twitter.com/1MeAVMJPtQ— crictalk (@crictalk7) February 15, 2026
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. యువరాజ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి.. ఇషాన్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన కిషన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్పై టీ20ల్లో అత్యంతవేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్లో పాక్పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్లో 27 బంతుల్లోనే ఆర్ధ శతకం బాదిన ఇషాన్.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు.
T20 WC 2026: అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్న అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్తో ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన హైవోల్టేజీ మ్యాచ్లో డకౌటైన అతను.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మొదటి రెండు మ్యాచ్ల్లో డకౌటైన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ ఈ అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్ తమ వరల్డ్కప్ కెరీర్లలో ఒక్క పరుగు కూడా చేయకపోవడం మరో విశేషం.ప్రస్తుత ప్రపంచకప్లో యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే) అభిషేక్.. ఇవాళ పాక్తో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా రచించిన వూహ్యంలో చిక్కుకున్న అభిషేక్ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్కు గత ఆరు ఇన్నింగ్స్ల్లో ఇది నాలుగో డకౌట్ కావడం మరో విశేషం.కోహ్లి రికార్డు సమంపాక్పై డకౌట్ కావడంతో అభిషేక్ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ తరఫున రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో రెండు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా (3) టాప్ ప్లేస్లో ఉన్నాడు.సంజూతో సమానంగా..!తాజా డకౌట్తో అభిషేక్ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20ల్లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్లైన ఆటగాడిగా సంజూ శాంసన్ సరసన చేరాడు. అభిషేక్, సంజూ తమ టీ20 కెరీర్లలో తలో ఐదు సార్లు డకౌటయ్యారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (10) అగ్రస్థానంలో ఉన్నాడు.భారీ స్కోర్ దిశగా టీమిండియాపాక్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు తొలి 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ బౌలర్లను ఊచకోత కోసి ఔటయ్యాడు. అంతకుముందు అభిషేక్ డకౌటయ్యాడు. ప్రస్తుతం సూర్యకుమార్ (21), తిలక్ వర్మ (25) క్రీజ్లో ఉన్నారు.
IND vs PAK: అరెరే అభిషేక్.. ఇలా చేశావేంటి?
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో డకౌటైన అభిషేక్.. ఇప్పుడు కొలంబో వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్లో చెత్త షాట్ ఆడి అభిషేక్ ఔటయ్యాడు.అమెరికాతో మ్యాచ్ తర్వాత అభిషేక్ కడుపు ఇన్ఫెక్షన్ గురయ్యాడు. దీంతో నమీబియాతో మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే పూర్తి ఫిట్నెస్ పాక్తో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. దాయాది జట్టుకు అభిషేక్ చుక్కలు చూపిస్తాడు అని భారత అభిమానులు భావించారు.కానీ ఈ పంజాబీ బ్యాటర్ తన చెత్త బ్యాటింగ్తో అందరిని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్కు ముందు అభిషేక్ను ఉద్దేశించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ త్వరగా కోలుకోవాలని, మ్యాచ్లో ఆడాలని కోరుకుంటున్నట్లు సల్మాన్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే తొలి ఓవర్ వేసిన సల్మాన్.. అభిషేక్పై పైచేయి సాధించాడు. దీంతో అభిషేక్ను ఔట్ చేసిన అనంతరం సల్మాన్ సంబరాల్లో మునిగితేలిపోయాడు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్
T20 WC 2026: యూఎస్ఏకు మరో విజయం.. అదే జరిగితే పాక్ ఇంటికే..!
టీ20 ప్రపంచకప్ 2026లో యూఎస్ఏ మరో విజయం సాధించింది. ఇప్పటికే నెదర్లాండ్స్పై గెలుపొందిన అమెరికా.. తాజాగా (ఫిబ్రవరి 15) నమీబియాను కూడా మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. యూఎస్ఏకు సూపర్-8కు చేరే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ రెండు విజయాలు భారీ ఊరట కలిగిస్తాయి. ఎందుకంటే ఈ జట్టు ఆడుతున్నది రెండో ప్రపంచకప్పే అయినా, పలు చిరస్మరణీయ విజయాలు సాధించి, చిన్న జట్లలో మేటి జట్టుగా పేరు తెచ్చుకుంది. తమ కంటే ముందు నుంచే ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్స్, నమీబియా లాంటి జట్లను ఓడించడం యూఎస్ఏను ప్రత్యేకంగా నిలుపుతుంది. గత ఎడిషన్లో (2024) ఈ జట్టు, వారి కంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్ను ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఎడిషన్లోనూ యూఎస్ఏ నుంచి ఆ స్థాయి ప్రదర్శన ఆశించినప్పటికీ వీలు పడలేదు. అయితే పాక్తో పాటు భారత్కు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఎడిషన్లోనూ యూఎస్ఏకు సూపర్-8కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. పాక్.. భారత్, నమీబియా చేతుల్లో ఓడితే యూఎస్ఏకు సూపర్-8 బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇది జరిగితే పాక్, యూఎస్ఏ ఖాతాల్లో తలో నాలుగు పాయింట్లు ఉంటాయి. అప్పుడు పాక్ కంటే మెరుగైన రన్రేట్ కలిగి ఉంటే, యూఎస్ఏ సూపర్-8కి అర్హత సాధిస్తుంది. ఇలా జరగడం కష్టమైనా, అవకాశాలను మాత్రం తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారత్, నమీబియాకు పాక్ను ఓడించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. నమీబియాకు గతంలో వారి కంటే మెరుగైన జట్లకు షాకిచ్చిన అనుభవం ఉంది. ఇది మరోసారి రిపీటైతే మాత్రం యూఎస్ఏ సూపర్-8కు, పాక్ ఇంటికి చేరతాయి.యూఎస్ఏ-నమీబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో యూఎస్ఏ 31 పరుగుల తేఆతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (199-4) చేసిన యూఎస్ఏ.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. యూఎస్ఏ తరఫున బ్యాటింగ్లో కెప్టెన్ మోనాంక్ పటేల్ (52), సంజయ్ కృష్ణమూర్తి (68 నాటౌట్) రాణించారు. నమీబియా బౌలర్లలో మైబుర్గ్, కెప్టెన్ ఎరాస్మస్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం నమీబియా యూఎస్ఏ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఎస్ఏ బౌలర్లు నమీబియా బ్యాటర్లను కట్టడి చేశారు. స్కాల్విక్ 2, శుభమ్ రంజనే, నేత్రావల్కర్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు. నమీబియా ఇన్నింగ్స్లో ఓపెనర్ స్టీన్కాంప్ (58) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs pakistan Match live Updates: పాకిస్తాన్పై భారత్ ఘన విజయంకొలంబో వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(44) ఒక్కడే మెరుగ్గా రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా రెండు వికెట్లు సాధించారు. 👉16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పాక్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 17 ఓవర్లకు పాక్ స్కోర్: 109/7విజయానికి చేరువలో భారత్79 పరుగుల వద్ద పాక్ ఏడో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన షాదాబ్ ఖాన్ తిలక్ వర్మ బౌలింగ్లో ఔటయ్యాడు.పీకల్లోతు కష్టాల్లో పాక్78 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన మహ్మద్ నవాజ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు.👉ఉస్మాన్ ఖాన్(44) రూపంలో పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది.ఉస్మాన్ ఖాన్ దూకుడు..9 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 40 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు.పాక్ నాలుగో వికెట్ డౌన్34 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన బాబర్ ఆజం.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 6 ఓవర్లకు పాక్ స్కోర్: 38/4పాక్ మూడో వికెట్ డౌన్13 పరుగుల వద్ద పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సల్మాన్ అలీ అఘా.. బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.పాకిస్తాన్కు భారీ షాక్176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు తొలి ఓవర్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్లో సైమ్ అయూబ్(6) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 6 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది.పాక్ టార్గెట్ ఎంతంటే?కొలంబో వేదికగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు.సూర్య కుమార్ ఔట్159 పరుగుల వద్ద కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ను టీమిండియా కోల్పోయింది. 32 పరుగులు చేసిన సూర్య.. ఉస్మాన్ తరీఖ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు భారత్ స్కోర్: 159/5ఒకే ఓవర్లో రెండు వికెట్లుటీమిండియా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్లో తిలక్ వర్మ(25) రెండో బంతికి వికెట్లు ముందు దొరికిపోగా.. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా డకౌట్గా వెనుదిరిగాడు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్ఇషాన్ కిషన్ ఔటైన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(21), తిలక్ వర్మ(25) ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవర్లకు భారత్ స్కోర్: 125/2ఇషాన్ కిషన్ ఔట్ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్కు తెరపడింది. 40 బంతుల్లో 77 పరుగులు చేసిన కిషన్.. సైమ్ అయూబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 89/2చెలరేగి ఆడుతున్న ఇషాన్పాక్తో మ్యాచ్లో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడుతున్నాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇషాన్ 72 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. 8 ఓవర్లకు భారత్ స్కోర్: 82/1దూకుడుగా ఆడుతున్న ఇషాన్5 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అభిషేక్ తొలి ఓవర్లోనే వెనుదిరిగినప్పటికి కిషన్ మాత్రం(36) దూకుడుగా ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ డకౌట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. సల్మాన్ అలీ బౌలింగ్లో షాహిన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఇషాన్ కిషన్(12) మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 16/1బౌలింగ్ ఎంచుకున్న పాక్కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ బ్లాక్బాస్టర్ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. నమీబియాతో మ్యాచ్కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో సంజూ శాంసన్పై వేటు పడింది. అదేవిధంగా అర్ష్దీప్ సింగ్ స్ధానంలో కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కింది. పాక్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రాపాకిస్థాన్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్కాసేపటిలో టాస్టీ20 ప్రపంచకప్-2026లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మెగా పోరుకు సర్వం సిద్దమైంది. మరి కాసేపటిలో కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షూరూ కానుంది. ఇప్పటికే మైదానానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు వార్మాప్ అవుతున్నారు.
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహాసంగ్రామాలను తలపిస్తాయి. ప్రత్యేకించి ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోరాటాలు అంతకుమించిన అనుభూతిని కలిగిస్తాయి. మరీ ప్రత్యేకించి, టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్ల పోటీ ప్రళయ వాతావరణాన్ని సూచిస్తుంది.గెలుపోటములు ఎలా ఉన్నా, మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే ఇరు దేశాల అభిమానుల మధ్య వార్ మొదలవుతుంది. ఈ పరిస్థితి దాయాదుల సమరానికి మరింత హైప్ తెచ్చిపెడుతుంది. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, అభిమానుల భావోద్వేగాలు ఈ మ్యాచ్లను మరింత ప్రత్యేకం చేస్తాయి. ఈ హైప్ భారత్, పాక్ అభిమానులనే కాక, విశ్వవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది.భారీ అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కొలంబోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు ఉండేవి. బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయానికి నిరసనగా పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.అయితే ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాక్ ఈ మ్యాచ్ ఆడేందుకు తిరిగి అంగీకరించింది. జరగదనున్న మ్యాచ్ తిరిగి కార్యరూపం దాల్చడం ఈ మ్యాచ్ హైప్ను పీక్స్కు చేర్చింది. ఈ భారీ అంచనాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో భారత్-పాక్ మ్యాచ్ హెడ్ టు హెడ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. ఈ మెగా టోర్నీలో భారత్కు పాక్పై స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ ఏకంగా ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. పాక్ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే గెలుపొందింది. టీమిండియా ఇవాళ జరుగబోయే మ్యాచ్లోనూ గెలిచి పొట్టి ప్రపంచకప్లో తమ రికార్డును (8-1 మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే, ఇది అంత కష్టమేమీ కాకపోవచ్చు. గత కొంతకాలంగా టీమిండియా పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలు సాధిస్తూ నంబర్ వన్ స్థానంలో ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు భీకర ఫామ్లో ఉన్నారు. ప్రస్తుత పాక్ జట్టును టీమిండియా ఆడుతూపాడుతూ చిత్తు చేయవచ్చు. అలాగని ఉదాసీనంగా వ్యవహరిస్తే, 2021 ఎడిషన్లో ఎదురైన పరాభవం పునరావృతమయేక్య ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి టీమిండియా చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే లాజిక్ను అమలు చేస్తే బాగుంటుంది. మరో గంటలో (రాత్రి 7 గంటలకు) ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే టీవీలకు అతుక్కుపోయారు.వరుణుడి భయంఓ పక్క అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే, కొలొంబో వాతావరణం మాత్రం అందరినీ కలవరపెడుతుంది. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్ని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ కొన్ని ఓవర్లు జరిగినా చాలని దేవుళ్లను ప్రార్దిస్తున్నారు.ఒకవేళ మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్, పాక్కు చెరో పాయింట్ లభిస్తుంది. తద్వారా ఈ రెండు జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. భారత అభిమానులు మాత్రం ఈ మ్యాచ్ పూర్తిగా జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఈ జట్టుతో పాక్ సునాయాసంగా చిత్తు చేయవచ్చు. తద్వారా టీ20 ప్రపంచకప్లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవచ్చు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన భారత్-పాక్ సమరాలు..తొలి ఘట్టం – 2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ రెండు సార్లు తలపడ్డాయి. గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ టై అయ్యింది, కానీ బౌలౌట్లో భారత్ గెలిచింది. అదే టోర్నమెంట్ ఫైనల్లో మళ్లీ తలపడగా, ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఇది భారత్-పాక్ టీ20 వరల్డ్కప్ పోరాటాలకు ఆరంభం. భారత్ ఆధిపత్యం అనంతరం 2012, 2014, 2016 వరల్డ్కప్లలో భారత్ వరుస విజయాలు సాధించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనలతో భారత్ పాక్పై ఆధిపత్యం కొనసాగించింది. పాక్ చరిత్రాత్మక విజయం – 2021 దుబాయ్లో జరిగిన 2021 వరల్డ్కప్లో పాక్ భారత్ను 10 వికెట్ల తేడాతో ఓడించింది. ఇది పాక్కి వరల్డ్కప్ చరిత్రలో భారత్పై తొలి విజయం. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అద్భుత బ్యాటింగ్తో ఆ మ్యాచ్ పాక్ అభిమానులకు మరపురాని జ్ఞాపకం అయ్యింది. తిరిగి భారత్ ఆధిపత్యం 2022, 2024 వరల్డ్కప్లలో భారత్ మళ్లీ పాక్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఈ గెలుపుల్లో కీలక పాత్ర పోషించారు.
అదరగొట్టిన అరుంధతి.. ఆసీస్పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్పై డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల దాటికి 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.కంగారూ జట్టు బ్యాటర్లలో జార్జియా వేర్హామ్(30) టాప్ స్కోరర్గా నిలవగా, లిచ్ఫీల్డ్(26), పెర్రీ(20) రాణించారు. భారత పేసర్ అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించింది. అరుధతితో పాటు మరో తెలుగు అమ్మాయి శ్రీ చరణి, పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు సాధించారు.అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ షఫాలీ వర్మ తన మెరుపు బ్యాటింగ్తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. షఫాలీ కేవలం 11 బంతుల్లోనే 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి ఔటైంది. అయితే భారత్ స్కోర్ 50/1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఆట నిలిచిపోయే సమయానికి 21 పరుగులు ముందుంజలో ఉండడంతో భారత్ను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి హర్మన్ సేన దూసుకెళ్లింది. రెండో టీ20 కాన్బెర్రా వేదికగా ఫిబ్రవరి 19న జరగనుంది.
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ వద్దతిలో) గెలుపొందింది.ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు జూలు విదిల్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ను 133 పరుగులకే (18 ఓవర్లలో) కుప్పకూల్చారు. పేసర్లు రేణుకా సింగ్ (4-1-14-2), అరుంధతి రెడ్డి (4-0-22-4), క్రాంతి గౌడ్ (3-0-39-0) నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ప్లేయర్ల భరతం పట్టారు. స్పిన్నర్లు శ్రీ చరణి (3-0-14-2), దీప్తి శర్మ (2-0-19-1) కూడా సత్తా చాటారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (2-0-24-0) ఒక్కరే కాస్త ధారాళంగా పరుగులు సమర్పించుకుంది.ఆసీస్ ఇన్నింగ్స్లో జార్జియా వేర్హమ్ (30) టాప్ స్కోరర్ కాగా.. ఫోబ్ లిచ్ఫీల్డ్ (26), ఎల్లిస్ పెర్రీ (20), జార్జియా వాల్ (18), నికోలా క్యారీ (12) రెండంకెల స్కోర్లు చేశారు. బెత్ మూనీ (5), ఆష్లే గార్డ్నర్ (4), అన్నాబెల్ సదర్ల్యాండ్ (3), కిమ్ గార్త్ (2), డార్సీ బ్రౌన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కొత్త కెప్టెన్ సోఫీ మోలినెక్స్ 6 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో వరుణుడు పలు మార్పులు ఆటంకం కలిగించాడు. జట్టు స్కోర్ 50-1 (5.1 ఓవర్లలో) వద్ద ఉండగా.. భారీ వర్షం ప్రారంభమై, ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన భారత్ను విజేతగా ప్రకటించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ వర్మ (11 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్సర్లు) సహజ శైలిలో విరుచుకుపడింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి స్మృతి మంధన (16), జెమీమా రోడ్రిగ్స్ (9) క్రీజ్లో ఉన్నారు. షఫాలీ వికెట్ మోలినెక్స్కు దక్కింది. ఈ సిరీస్లో రెండో టీ20 ఫిబ్రవరి 19న కాన్బెర్రా వేదికగా జరుగనుంది.
సెమీస్లో రష్మిక జోడీ
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్య...
స్నేహిత్ శుభారంభం
చెన్నై: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చె...
సహజ, రష్మిక ఓటమి
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య డబ్ల్యూ75 మహిళల ...
ముకేశ్కు స్వర్ణం, కాంస్యం
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత్...
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం
India vs pakistan Match live Updates: పాకిస్తాన్ప...
భారత్-పాక్ హైవోల్టేజీ మ్యాచ్.. చరిత్ర ఏం చెబుతుందంటే..?
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ మహా...
అదరగొట్టిన అరుంధతి.. ఆసీస్పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు విజ...
ఆసీస్ గడ్డపై జూలు విదిల్చిన టీమిండియా.. తొలి టీ20లో ఘన విజయం
2026 ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘన విజయ...
క్రీడలు
విశాఖ : దుమ్మురేపిన రైడర్లు.. ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఉత్సాహంగా హరేకృష్ణ రన్ 2026 (ఫొటోలు)
టి20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుక అదుర్స్ (ఫొటోలు)
సాక్షి మీడియా గ్రూప్, తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెంపుల్ రన్ (ఫొటోలు)
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
వీడియోలు
కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ
T20 World Cup: తొందర పడితే ప్రమాదమే అంత ఈజీ కాదు..
నమీబియాను చిత్తు చేసిన భారత్
T20: నేడు నమీబియాతో భారత్ పోరు.. ఆ ముగ్గురు ప్లేయర్లు ఔట్..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ నమీబియాతో భారత్
ఆస్పత్రిలో చేరిన అభిషేక్.. భారత్ కు బిగ్ షాక్
నా కోసం మా నాన్న పోలీస్ జాబ్ వదిలేశాడు.. నా ఇన్స్పిరేషన్ ఎవరంటే..?
పాక్ యూటర్న్.. భారత్ తో పోరుకు సిద్ధం
టీ20 ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
