Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

England won by 4 wkts aganist New Zealand1
టీ20 వరల్డ్‌ కప్‌: ఇంగ్లండ్‌ 'హ్యాట్రిక్‌'

కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్‌ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్‌ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్‌ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశాన్ని కివీస్‌ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), టీమ్‌ సీఫెర్ట్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్‌ బాంటన్‌ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్‌ అలెన్‌ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్‌ ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన రేహన్‌ అహ్మద్‌ తన తొలి బంతికే రచిన్‌ రవీంద్ర (11)ను అవుట్‌ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్‌ మిడిలార్డర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు సాల్ట్‌ (2), బట్లర్‌ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెతెల్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్‌ బాధ్యత తీసుకోగా, స్యామ్‌ కరన్‌ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ చేసి కివీస్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్‌ అహ్మద్‌ (7 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్‌ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్‌ ప్రధాన పేస్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్‌ ఫలితం తర్వాత కివీస్‌ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. పాక్‌ సెమీస్‌ చేరాలంటే... నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరిగే ‘గ్రూప్‌–2’ సూపర్‌–8 మ్యాచ్‌ మూడో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేస్తుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ చేరుకుంటుంది. పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే మ్యాచ్‌లో గెలవడంతో పాటు రన్‌రేట్‌లో కూడా కివీస్‌ను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది. పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి లేదా శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. టి20 ప్రపంచకప్‌లో నేడుశ్రీలంక X పాకిస్తాన్‌వేదిక: పల్లెకెలె, రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 35; అలెన్‌ (సి) బెతెల్‌ (బి) జాక్స్‌ 29; రచిన్‌ (సి) బెతెల్‌ (బి) రేహన్‌ 11; ఫిలిప్స్‌ (బి) జాక్స్‌ 39; చాప్‌మన్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 15; మిచెల్‌ (సి) జాక్స్‌ (బి) డాసన్‌ 3; సాంట్నర్‌ (నాటౌట్‌) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్‌ 14; హెన్రీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్‌: ఆర్చర్‌ 3–1–24–0, డాసన్‌ 4–0–32–1, కరన్‌ 1–0–10–0, రషీద్‌ 4–0–28–2, జాక్స్‌ 4–0–23–2, బెతెల్‌ 1–0–13–0, రేహన్‌ 3–0–28–2. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సీఫెర్ట్‌ (బి) హెన్రీ 2; బట్లర్‌ (సి) సీఫెర్ట్‌ (బి) ఫెర్గూసన్‌ 0; బ్రూక్‌ (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 26; బెతెల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 21; బాంటన్‌ (సి) చాప్‌మన్‌ (బి) రచిన్‌ 33; కరన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 24; జాక్స్‌ (నాటౌట్‌) 32; రేహన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్‌: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్‌ 2–0–14–1, సాంట్నర్‌ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్‌ 4–0–43–1, రచిన్‌ 4–0–19–3, సోధి 2–0–21–0.

IND vs WI: Rinku Singh set to rejoin team after performing father last rites2
T20 WC: రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం!

టీమిండియా స్టార్‌ రింకూ సింగ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అతడి తండ్రి ఖాంచంద్‌ సింగ్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాటంలో ఓడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.తండ్రి పాడె మోస్తూ..దీంతో రింకూ సింగ్‌ (Rinku Singh) హుటాహుటిన స్వస్థలానికి పయనమయ్యాడు. భారత జట్టును వీడి.. చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చేరుకున్నాడు. కన్నీళ్లను దిగమింగుకుని తండ్రి పాడె మోస్తూ.. సోదరులతో కలిసి అంత్యక్రియలు పూర్తి చేశాడు.ఈ నేపథ్యంలో రింకూ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ తిరిగి టీమిండియాతో చేరేందుకు అతడు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి రింకూ సన్నిహితులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి అలీఘర్‌కు రింకూ రోడ్డు మార్గంలో వచ్చాడు. తండ్రి అంత్యక్రియలకు అతడు హాజరయ్యాడు.आंखों में आंसू, कंधे पर पिता की अर्थी…क्रिकेटर रिंकू सिंह के पिताजी के निधन की खबर बेहद दुखद है। इस कठिन घड़ी में रिंकू और उनके परिवार के साथ पूरे देश की संवेदनाएं हैं।ईश्वर दिवंगत आत्मा को शांति दे और परिवार को यह दुःख सहने की शक्ति प्रदान करे। 🙏#RinkuSinghFatherDemise pic.twitter.com/PUSPVIAt3l— Dinesh Kumar (@DineshRedBull) February 27, 2026రింకూ తిరిగి జట్టుతో చేరతాడుతన నలుగురు అన్మదమ్ములతో కలిసి రింకూ కార్యక్రమం పూర్తి చేశాడు’’ అని చెప్పారు. మరోవైపు.. రింకూ అన్న మాట్లాడుతూ.. ‘‘మా నాన్న అంత్యక్రియల కోసమే రింకూ ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమం పూర్తైంది. కోల్‌కతాలో మ్యాచ్‌ కోసం రింకూ తిరిగి జట్టుతో చేరతాడు’’ అని స్పష్టం చేశాడు.కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలనికాగా టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8లో టీమిండియా ఆదివారం కీలక మ్యాచ్‌ ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా వెస్టిండీస్‌ జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. భారత్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంతటి కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండాలని రింకూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.బ్యాట్‌ ఝులిపించనేలేదుఇక లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసే రింకూ ఇప్పటి వరకు మెరుగ్గా ఆడనేలేదు. లీగ్‌ దశలో నాలుగు.. సూపర్‌-8లో సౌతాఫ్రికాతో మ్యాచ్‌తో కలిపి మొత్తంగా 24 పరుగులే చేయగలిగాడు. అయితే, కొన్నిసార్లు ఏకంగా అతడిని ఎనిమిదో స్థానంలో ఆడించడం కూడా ప్రభావం చూపింది. కాగా జింబాబ్వేతో గురువారం నాటి మ్యాచ్‌కు రింకూ అందుబాటులో ఉన్నా.. అతడిని బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. చెన్నై వేదికగా ఈ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది టీమిండియా.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Two day delay expected IPL 2026 to begin from March 28: Report3
IPL 2026: ఐపీఎల్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌!!... ముందుగా షెడ్యూల్‌ చేసినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్నట్లు సమాచారం.గతేడాది ఇలాగతేడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్‌.. జూన్‌ 3న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్‌-2026 టోర్నీ మార్చి 26న ఆరంభం కానుందని తొలుత పాలక మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది. డిసెంబరులో జరిగిన వేలానికి ముందు ఈ మేరకు సమాచారం అందించింది.కారణం ఇదేనా?అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌ మార్చి 28న మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫైనల్‌ను మే 31న నిర్వహించనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్‌ ఆరంభ తేదీకి సంబంధించి పాలక మండలి వచ్చే వారం సమావేశమై డేట్‌ ఫిక్స్‌ చేయనున్నట్లు వెల్లడించింది.అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈమేరకు తేదీల్లో మార్పు చేసినట్లు పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తమిళనాడు (చెన్నై), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) హోం గ్రౌండ్స్‌గా ఉండగా.. అసోంలోని గువాహటి రాజస్తాన్‌ రాయల్స్‌కి రెండో హోం గ్రౌండ్‌.ఆర్సీబీకి స్టేడియం దొరికిందా?ఇక ఐపీఎల్‌ రెండు రోజులు ఆలస్యంగా ఆరంభం కావడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం అయితే.. గత ఎడిషన్‌ విజేత ఆర్సీబీకి ఇంతవరకు తమ హోం గ్రౌండ్‌పై ఇంత వరకు స్పష్టత రానట్లు సమాచారం. కాగా మొట్టమొదటిసారి ట్రోఫీ గెలిచిన సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు చర్య విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయోత్సవ విషాదంబెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ఎలాంటి అనుమతి లేకుండా పిలుపునివ్వగా భారీ ఎత్తున అభిమానులు కదలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేసులు నమోదు కావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఈసారి తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి తరలించాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ వేదికల కోసం ఇప్పటికే నవీ ముంబై, రాయ్‌పూర్‌, పుణెలను ఎంచుకుని ఆయా స్థానిక బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

T20 WC 2026 Matt Henry to head back home after England Super 8 clash4
T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్‌ స్టార్‌

న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం స్వదేశానికి పయనం కానున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో సెమీస్‌ చేరడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ ముందుకు సాగుతోంది. సూపర్‌-8లో తొలుత పాక్‌తో కివీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. వర్షం వల్ల టాస్‌ పడకుండానే రద్దై పోయింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ వచ్చింది.నెట్‌ రన్‌రేటు పరంగానూఇక తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. దసున్‌ షనక బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసి నెట్‌ రన్‌రేటును భారీగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలతో కూడన గ్రూప్‌-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది.రెండో బెర్తు కోసం న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కివీస్‌ మూడు పాయింట్లతో ముందంజలో ఉంది. ఇక శుక్రవారం ఇంగ్లండ్‌తో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిచిందంటే న్యూజిలాండ్‌ నేరుగా సెమీస్‌ చేరుతుంది.ఈ నేపథ్యంలో కొలంబో వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకుఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం కివీస్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ జట్టును వీడనున్నాడు. తమ రెండో బిడ్డకు స్వాగతం పలికేందుకు స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయం గురించి కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాట్‌, హోలీల రెండో సంతానం కోసం మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.ఆ కుటుంబానికి ఇది అత్యంత కీలకమైన, ఆనందాయకమైన సమయం. వారికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాం. ఇక జట్టు విషయానికొస్తే.. గతం సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు అదృష్టం మా వైపు ఉంటుందనే అనుకుంటున్నాం.మ్యాట్‌తో పాటు మాకు కూడా స్టార్లు కలిసి రావాలి. ఈ టోర్నీ తుది దశలో అతడు తప్పక జట్టుతో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు తప్పక సెమీస్‌ చేరుతుందని.. అప్పటికి మ్యాట్‌ హెన్రీ మళ్లీ జట్టుతో కలుస్తాడని వాల్టర్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మార్చి 4న తొలి సెమీ ఫైనల్‌.. మార్చి 5న రెండో సెమీస్‌ మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Shreyas Iyer 5 off 13 after a golden duck Is justifies Agarkar T20 WC Snub call5
గోల్డెన్‌ డక్‌!.. మరోసారి శ్రేయస్‌ అయ్యర్‌ ఫెయిల్‌

టీమిండియా తరఫున చివరగా న్యూజిలాండ్‌తో వన్డేతో బరిలోకి దిగాడు శ్రేయస్‌ అయ్యర్‌. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ పది బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రేయస్‌ (Shreyas Iyer) చేసిన పరుగులు వరుసగా.. 49, 8, 3. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-1తో టీమిండియాను ఓడించి.. తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. కివీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత టీ20 ప్రపంచకప్‌-2026తో టీమిండియా బిజీగా మారగా.. శ్రేయస్‌ అయ్యర్‌ లోకల్‌ టీ20 టోర్నీలో భాగమయ్యాడు. నవీ ముంబై వేదికగా డీవై పాటిల్‌ టీ20 కప్‌లో ఈ ముంబైకర్‌ BPCL జట్టుకు ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్‌ఇందులో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో BPCL తలపడగా.. శ్రేయస్‌ అయ్యర్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో BPCL ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Shreyas Iyer ( Sarpanch Sahab ) Punjab Kings Captain Performances In Random DY Patil Tournament Against Club Level Bowlers - 1st Match 0(1) - 2nd Match 5(13) while chasing 200 Few Days Back , People Were Doing His Paid PR That He Deserves To Be In The T20 World Cup Squad 😂 pic.twitter.com/03yuOVEQXX— Stubbsy  (@spideypant_) February 25, 2026మరోసారి ఫెయిల్‌ఇక రెండో మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. రిలయన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ముంబైకర్‌ పదమూడు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో BPCL 65 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది.ఈ నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ వరుస వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున పరుగుల వరద పారించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడిని కరుణించలేదు.అగార్కర్‌ నిర్ణయం సరైందేనంటూ సెటైర్లుఆసియా టీ20 కప్‌-2025 ఆడిన జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ శ్రేయస్‌ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు కూడా శ్రేయస్‌ పేరు వినిపించగా.. అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు.ఇలాంటి తరుణంలో.. ఐపీఎల్‌-2026 టోర్నీకి ముందు లోకల్‌ టోర్నమెంట్లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇలా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. శ్రేయస్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకుండా అగార్కర్‌ మంచి నిర్ణయమే తీసుకున్నాడంటూ కొంతమంది ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, అతడి అభిమానులు మాత్రం త్వరలోనే మునుపటి శ్రేయస్‌ అయ్యర్‌ను చూడబోతున్నారంటూ మద్దతుగా నిలుస్తున్నారు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

Feels less pressure when Down Order: Sanjay Manjrekar on Tilak Varma6
Tilak Varma: నాకే చోటు లేదా?.. మెరుపులతో ఇరగదీశాడు!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ తనదైన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. సౌతాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో దిగాడు. అయితే, ఐదు మ్యాచ్‌లలోనూ తిలక్‌ వర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.తిలక్‌ ప్రదర్శన ఇలా..ముఖ్యంగా ఈ హైదరాబాదీ బ్యాటర్‌ స్ట్రైక్‌రేటుపై విమర్శలు వచ్చాయి. లీగ్‌ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లపై తిలక్‌ వర్మ వరుసగా.. 25, 25 , 25, 31 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో రెండు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.టాపార్డర్‌ నుంచి తీసేశారు!అయితే, తాజాగా జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌లో మాత్రం తిలక్‌ వర్మ ఇరగదీశాడు. నిజానికి ఈ మ్యాచ్‌కు ముందు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు తుదిజట్టులో చోటు దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్లాండర్లే (ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ) ఉన్న కారణంగా.. ఒకరిపై వేటు తప్పదనే విశ్లేషణలు వినిపించాయి.ఊహించినట్లుగానే టాపార్డర్‌ మారింది. అభిషేక్‌ శర్మకు జోడీగా.. ఓపెనర్‌గా రైట్‌ హ్యాండర్‌ సంజూ శాంసన్‌ తిరిగి రాగా.. ఇషాన్‌ను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఊహించని రీతిలో తిలక్‌ వర్మను లోయర్‌ ఆర్డర్‌కు పంపించారు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఇప్పటికే తిలక్‌కు ఉంది.16 బంతుల్లోనే ఇక జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన తిలక్‌ వర్మ మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్ట్రైక్‌రేటు 275. ఇలా మేనేజ్‌మెంట్‌ చేసిన ప్రయోగం ఫలించి.. తిలక్‌ వర్మ విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు.డౌన్‌ ఆర్డర్‌కు పంపడం మంచిదైందిఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తిలక్‌ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘‘తిలక్‌ వర్మను డౌన్‌ ఆర్డర్‌కు పంపి టీమిండియా మంచి పని చేసింది. లోయర్‌ ఆర్డర్‌లో అతడు బ్యాటింగ్‌ చేయడం నేను ఇప్పటికే చూశాను.నిజానికి ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనుక రావడం వల్ల.. టాపార్డర్‌తో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హార్దిక్‌ పాండ్యా ఐదు, తిలక్‌ ఆరో స్థానంలో రావడం వారితో పాటు జట్టుకు మేలు చేసింది. నిజానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ను ఐదు, హార్దిక్‌ను ఏడో స్థానంలో సూర్య పంపడం చూసి నేను షాకయ్యాను. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో తిలక్‌, హార్దిక్‌లను సరైన స్థానాల్లో ఆడించి ఫలితం రాబట్టారు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ టీమిండియా నాయకత్వ బృందాన్ని అభినందించాడు. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 72 పరుగుల తేడాతో గెలిచి.. సెమీస్‌ అవకాశాలు మెరుగుపరచుకుంది.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

 Cricket Was Never The Plan: RCB India Star About His Unplanned Journey7
డిఫెన్స్‌ ఆఫీసర్‌ కాబోయి.. క్రికెటర్‌గా: టీమిండియా స్టార్‌

టీమిండియా స్టార్‌ జితేశ్‌ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.భారత టీ20 జట్టులోమహారాష్ట్రకు చెందిన జితేశ్‌ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. 162 పరుగులు చేశాడు.చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఆర్సీబీ స్టార్‌ఇక ఐపీఎల్‌లో గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్‌.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ గైర్హాజరీలో పలు మ్యాచ్‌లకు సారథిగానూ జితేశ్‌ వ్యవహరించడం విశేషం.డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడినిఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పాడ్‌కాస్ట్‌లో జితేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘నా కెరీర్‌లో క్రికెట్‌ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.మార్కుల కోసమే క్రికెట్‌లోకిఅది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాను.అప్పుడు వికెట్‌ కీపర్‌ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్‌ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్‌ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.ఆ ఇద్దరిది కీలక పాత్రఆ తర్వాత ఓసారి నేను దినేశ్‌ కార్తిక్‌ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్‌ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్‌లో గొప్ప టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పగలను’’ అని జితేశ్‌ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

IND W vs AUS W: Georgia Voll 100 Australia Beat India Won ODI series8
IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్‌

ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్‌ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్‌ సేన.. వన్డే సిరీస్‌లో మాత్రం మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఆసీస్‌కు సమర్పించుకుంది.తొలుత బ్యాటింగ్‌మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్‌ను ఓడించింది. హోబర్ట్‌ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్‌ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్‌ (11) మాత్రం విఫలమైంది.హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకంకెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్‌ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌, అలనా కింగ్‌, ఆష్లే గార్డ్‌నర్‌ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్‌ షట్‌, నికోలా క్యారీ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్‌లో కెప్టెన్‌ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ ఫోబే లిచిఫీల్డ్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌ అదరగొట్టారు.Georgia Voll had us all nervous on 99 😅 She's got her second ODI ton 👏 #AUSvIND pic.twitter.com/eP41Tfx5Qp— cricket.com.au (@cricketcomau) February 27, 2026జార్జియా శతకంతో..లిచిఫీల్డ్‌ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్‌ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్‌ (10) విఫలమైంది.అయితే, ఆష్లే​ గార్డ్‌నర్‌ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఇక భారత్‌- ఆసీస్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్‌ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Suryakumar Not Happy With One Aspect In India Win Over Zimbabwe9
జింబాబ్వేపై గెలిచాం.. కానీ: సూర్యకుమార్‌ అసంతృప్తి

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత జట్టు సెమీస్‌ అవకాశాలు మెరుగుపడ్డాయి. సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన సూర్యకుమార్‌ సేన.. జింబాబ్వేపై గురువారం నాటి మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో గెలిచి నష్టాన్ని పూడ్చుకుంది.ఇక తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచిందంటే టీమిండియా సెమీ ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం పడి ఆటంకం కలిగితే.. అపుడు నెట్‌ రన్‌రేటు కీలకం అవుతుంది. ప్రస్తుతానికి భారత్‌ (-0.100) కంటే విండీస్‌ (+1.791) ఈ విషయంలో మెరుగ్గా ఉంది.భారీ తేడాతో గెలిచి ఉంటే బాగుండేదినిజానికి జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్‌ గెలిచినప్పటికీ.. ఇంకాస్త భారీ తేడాతో గెలిచి ఉంటే రన్‌రేటు మెరుగయ్యేది. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత బౌలర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు కలిసి 150కి పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 256 పరుగులు రాబట్టారు. అయితే, జింబాబ్వేను తక్కువ స్కోరుకే అవుట్‌ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌, మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. ఇక శివం దూబే వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 46 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి 20 ఓవర్లలో జింబాబ్వే ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేయగలిగింది.మా బ్యాటర్లు సూపర్‌.. కానీ బౌలర్లేఈ నేపథ్యంలో జింబాబ్వేపై విజయానంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క బ్యాటర్‌ తమ వంతుగా పరుగులు ఇచ్చి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇంతకంటే ఏ ఆటగాడు ఎక్కువగా ఏమీ చేయలేడు. అయితే, బంతితో మా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాల్సింది’’ అని బౌలర్ల ఆటతీరుపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఏదేమైనా గెలుపు గెలుపేనని.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మాత్రం తాము బౌలింగ్‌ పరంగా మరింత స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్న ఫలితం సులువుగా రాబట్టగలమని సూర్య పేర్కొన్నాడు. కోల్‌కతాకు వెళ్లిన తర్వాతే తుదిజట్టు కూర్పు గురించి ఆలోచిస్తామని.. సెమీస్‌ చేరే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని అన్నాడు.అదరగొట్టిన అర్ష్‌దీప్‌కాగా ఆదివారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా భారత్‌- వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. ఈ మ్యాచ్‌ ఫలితంతో రెండో సెమీ ఫైనలిస్టు ఎవరో తేలుతుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో మ్యాచ్‌లో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, శివం దూబే తలా ఒక్క వికెట్‌ తీశారు.భారత్‌ వర్సెస్‌ జింబాబ్వే స్కోర్లు👉వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై👉భారత్‌: 256/4(20)👉జింబాబ్వే: 184/6(20) 👉ఫలితం: 72 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు.చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం.. దంచికొట్టిన అర్జున్‌ టెండుల్కర్‌

 Did you see where Dube was bowling: Kriss Srikanth Slams IND Strategy10
అదేం బౌలింగ్‌?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్‌.ఏకంగా 256 పరుగులుఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్‌ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ భారత బౌలింగ్‌ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్‌ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. నోబాల్‌, వైడ్‌లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.ఇది బ్యాటింగ్‌ పిచ్‌ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్‌ పిచ్‌. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా?అసలు దూబే ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్‌ స్టంప్‌ మీదకు బాల్‌ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్‌ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్‌ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్‌ చేయించాలి.ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్‌ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.చదవండి: T20 WC 2026: భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ రోజు వర్షం పడితే..?

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement