Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Hardik pandya poor form continues in ipl 20261
బ్యాటింగ్ రాదు.. బౌలింగ్ రాదు! నీకు కెప్టెన్సీ అవసరమా?

ఐపీఎల్‌-2026 సీజన్‌లో ముం‍బై ఇండియన్స్ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. కెప్టెన్‌గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా హార్దిక్‌ తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ దారుణంగా విఫలమయ్యాడు.తొలుత బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం కీలక సమయంలో బ్యాటింగ్‌ వచ్చిన హార్దిక్‌.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ర్యాష్‌ షాట్‌ ఆడి తన వికెట్‌ను వికెట్‌ను కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ పరంగా కూడా హార్దిక్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.చెత్త నిర్ణయాలు తీసుకుంటూ జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్‌ పాండ్యా కేవలం 97 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో హార్దిక్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.బ్యాటింగ్‌ రాదు, బౌలింగ్‌ రాదు.. కెప్టెన్సీ అవసరమా హార్దిక్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.సీఎస్‌కే ఘన విజయంఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే స్పిన్నర్‌ అకిల్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్‌ అహ్మద్‌ రెండు, గుర్‌జప్‌నీత్‌, కాంబోజ్‌, ముఖేష్‌ చౌదరి, కాంబోజ్‌ తలా వికెట్‌ సాధించారు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.

Sanju Samson, Akeal Hosein star as Chennai maul Mumbai by 103 runs2
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన సీఎస్‌కే

ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తిరిగి గెలుపు బాట ప‌ట్టింది. గురువారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 103 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ అద‌ర‌గొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. చెన్నై ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌(21), గైక్వాడ్‌(22) రాణించారు. ఈ ఏడాది సీజ‌న్‌లో సంజూకు ఇది రెండో సెంచ‌రీ కావ‌డం విశేషం. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌, అశ్విని కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్ చెరో వికెట్‌ సాధించారు.అకిల్ మ్యాజిక్‌అనంత‌రం 208 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. సీఎస్‌కే స్పిన్న‌ర్ అకిల్ హోస్సేన్ 4 వికెట్ల‌తో ముంబై ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డితో పాటు నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ‌రోసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ముంబై ఇండియ‌న్స్‌కు ఇది ఐదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

Sanju Samson Breaks Multiple IPL Records With Wankhede Century3
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి శ‌త‌క్కొట్టాడు. ఈ ధ‌నాధ‌న్ లీగ్‌లో భాగంగా వాఖండే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్‌లో శాంస‌న్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ముంబై బౌల‌ర్ల‌ను త‌నదైన శైలిలో ఉతికారేశాడు.కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు ఇది 5వ ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఇది అతడికి ఎనిమిదివ సెంచరీ. ఈ క్రమంలో శాంసన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.సూర్య సాధించిన రికార్డులు ఇవేముంబై ఇండియన్స్‌పై సెంచరీ చేసిన మొట్టమొదటి సీఎస్‌కే బ్యాటర్‌గా శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సంజూ కంటే ముందు ఈ సీఎస్‌కే బ్యాటర్ కూడా ముంబైపై ముడెంకల స్కోరును అందుకోలేదు.అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు.ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో శాంసన్‌ నిలిచాడు.టీ20 క్రికెట్‌లో భారత తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ సరసన శాంసన్ నిలిచాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 8 టీ20 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(9), అభిషేక్ శర్మ(9) సంయుక్తంగా అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌

Delhi Capitals announce Ben Ducketts replacement4
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి విధ్వంసకర ప్లేయర్‌

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందే వైదొలిగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ స్ధానాన్ని మరో ఇంగ్లీష్ ప్లేయర్ రెహాన్ అహ్మద్‌తో ఢిల్లీ భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనెజ్‌మెంట్ గురువారం అధికారంగా ప్రకటించింది.ప్రస్తుతం ఢిల్లీ జట్టులో సరైన ఆల్‌రౌండర్లు లేరు. కెప్టెన్ అక్షర్ పటేల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ అయిన రెహాన్‌తో ఢిల్లీ ఒప్పందం కుదర్చుకుంది. రెహాన్ అహ్మద్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. అతడు లెగ్ స్పిన్‌తో పాటు లోయార్డర్‌లో దూకుడుగా బ్యాటింగ్ కూడా చేయగలడు.కాగా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్‌ 'ది హండ్రెడ్' టోర్నీలో సదరన్ బ్రేవ్ జట్టు తరపున ఆడనున్నాడు. స‌ద‌ర్ బ్రేవ్.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ కావ‌డం గ‌మానార్హం. అతడికి వైట్‌బాల్ క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉంది. ఇంగ్లాండ్ తరపున 5 టెస్టులు, 9 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ అంతంతమాత్రంగానే రాణిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ ఐదో స్ధానంలో ఉంది.చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచ‌ల‌నం!

Harmanpreet Kaur breaks Chamari Athapaththus legendary record5
టీమిండియా కెప్టెన్‌ వరల్డ్‌ రికార్డు

సౌతాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ 9 వి​కెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ కోల్పోయింది.అయితే ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హర్మన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(3016) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆటపట్టును హర్మన్ అధిగమించింది. హర్మన్ ఇప్పటివరకు భారత కెప్టెన్‌గా 3017 పరుగులు చేసింది. ఈ జోహాన్స్‌బర్గ్ వన్డే హర్మన్ తన విశ్వరూపం ప్రదర్శించింది. హర్మన్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది.మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీరేహర్మన్‌ప్రీత్ కౌర్-3017చమరి అటపట్టు-3016మెగ్ లానింగ్- 2619షార్లెట్ ఎడ్వర్డ్స్-2529సూజీ బేట్స్-2236చదవండి: IND vs IRE: టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచ‌ల‌నం!

Dont need financial support just prayers: Shapoor Zadran Fight For Life6
‘ఆర్థిక సాయం వద్దు.. ఆ ఒక్క పని చేయండి ప్లీజ్‌’

అఫ్గనిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాపూర్‌ జద్రాన్‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అత్యవసర విభాగంలో ఉంచి అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిరంతరం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం పెద్దగా మెరుగుపడటం లేదని తెలుస్తోంది.‘ఆర్థిక సాయం వద్దుఈ నేపథ్యంలో షాపూర్‌ తమ్ముడు ఘామీ జద్రాన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని.. తన సోదరుడి ఆరోగ్యం బాగుపడేలా ప్రార్థిస్తే చాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ దేవుడి దయ వల్ల ఆర్థికంగా మా కుటుంబం పటిష్టంగానే ఉంది. మాకు ఎలాంటి ఆర్థిక సహాయం అక్కర్లేదు.దయచేసి అందరూ ప్రార్థించండిమా అన్నయ్య బతకాలని దయచేసి అందరూ ప్రార్థించండి. మీ ప్రార్థనల్లో తనకూ చోటు ఇవ్వండి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా షాపూర్‌ జద్రాన్‌ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తెల్ల రక్తకణాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. అతడి రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో అఫ్గన్‌ నుంచి భారత్‌కు తీసుకువచ్చి అత్యాధునిక చికిత్స అందిస్తున్నారు.ఇక్కడి వైద్యులు అద్భుతంఈ విషయం గురించి ఘామి జద్రాన్‌ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో ఉన్న మా డాక్టర్‌.. మా అన్నయ్యను భారత్‌కు తీసుకువెళ్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఢిల్లీకి తీసుకువచ్చాము. భారత్‌లో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అందుకే మేము ఇక్కడికి వచ్చాము.ఇక్కడి వైద్యులు మా అన్నయ్యను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతడిని హీరోగా అభివర్ణిస్తూ సానుకూల దృక్పథం నింపుతున్నారు. వాళ్లంతా అనుభవజ్ఞులైన వైద్యులు. ఇక్కడి ఆస్పత్రి గొప్పగా ఉంది. డాక్టర్లకు ధన్యవాదాలు’’ అని తెలిపాడు.వాళ్లంతా అండగా ఉన్నారుఇక అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బృందం తమకు అండగా ఉందన్న ఘామీ జద్రాన్‌.. ‘‘రాయీస్‌ అహ్మద్‌జాయ్‌, నవ్రోజ్‌ మంగళ్‌, మొహ్మద్‌ నబీ అందరూ ఎప్పటికప్పుడు ఫోన్‌ చేసి అన్నయ్య గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రపంచకప్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌, ఇతర జట్టు సభ్యులు ఆస్పత్రికి వచ్చి అన్నయ్యను చూసి వెళ్లారు.రషీద్‌ ఖాన్‌ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాడు. ఢిల్లీ, ముంబైలలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉన్నపుడు అల్లా ఘజన్‌ఫర్‌ కూడా ఆస్పత్రికి వచ్చి వెళ్లాడు. అతడు ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు. ఒకవేళ అవసరమైతే మా అన్నయ్యను అంబానీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిద్దాం అని చెప్పాడు. అఫ్గనిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ కూడా ఫోన్‌ చేసి మాతో మాట్లాడారు’’ అని తెలిపాడు.చదవండి: లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే: ఆసీస్‌ దిగ్గజం

IPL 2026: Chennai super kings vs Mumbai indians Live updates7
ముంబై ఇండియన్స్‌పై సీఎస్‌కే ఘన విజయం

Chennai super kings vs Mumbai indians Live updates: ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే స్పిన్నర్‌ అకిల్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబై నడ్డివిరిచాడు.అతడితో పాటు నూర్‌ అహ్మద్‌ రెండు, గుర్‌జప్‌నీత్‌, కాంబోజ్‌, ముఖేష్‌ చౌదరి, కాంబోజ్‌ తలా వికెట్‌ సాధించారు. ముంబై బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌(36), తిల‌క్ వ‌ర్మ‌(37) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్దానానికి చేరుకుంది.ముంబై ఏడో వికెట్ డౌన్‌సూర్య‌కుమార్ యాద‌వ్ రూపంలో ముంబై ఇండియ‌న్స్ ఏడో వికెట్ కోల్పోయింది. ముంబై విజ‌యానికి 41 బంతుల్లో 121 ప‌రుగులు కావాలి.కష్టాల్లో ముంబై13 ఓవర్‌ వేసిన నూర్ అహ్మద్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో ముంబై ఇండియన్స్‌ రెండు వికెట్లు కోల్పోయింది. తొలి బంతికి హార్దిక్‌ పాండ్యా(1), రెండో బంతికి షెర్ఫేన్‌ రూథర్‌ ఫర్డ్‌(0) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 86/6ముంబై ఐదో వికెట్‌ డౌన్‌తిలక్‌ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన తిలక్‌.. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై మూడో వికెట్‌ డౌన్‌ముంబై మూడో వికెట్‌ కోల్పోయింది. అకిల్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో నమన్‌ ధీర్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.ముంబై రెండో వికెట్‌ డౌన్‌ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన క్వింటన్‌ డికాక్‌.. ముఖేష్‌ చౌదరి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై ఇండియన్స్‌ స్కోర్‌: 11/2ముంబై తొలి వికెట్ డౌన్‌ముంబై ఇండియ‌న్స్ తొలి వికెట్ కోల్పోయింది. యువ ఓపెన‌ర్ దానిష్ మలేవార్ మ‌రోసారి డౌక‌ట‌య్యాడు. అకిల్ హోస్సేన్ బౌలింగ్‌లో మలేవార్ ఔట‌య్యాడు. సంజూ శాంసన్‌ సూపర్‌ సెంచరీవాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ అజేయ సెంచరీతో చెలరేగాడు. సంజూ 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు డెవాల్డ్‌ బ్రెవిస్‌(21), గైక్వాడ్‌(22) రాణించారు.దీంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌, అశ్విని కుమార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శాంట్నర్‌ తలా వికెట్‌ సాధించారు.సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్‌కార్తీక్ శ‌ర్మ రూపంలో సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 18 ప‌రుగులు చేసిన కార్తీక్ శ‌ర్మ‌.. జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 166/5. క్రీజులో సంజూ శాంసన్‌(78) ఉన్నాడు.12 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 128/412 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్‌(57), కార్తీక్‌ శర్మ(2) ఉన్నారు.సీఎస్‌కే రెండో వికెట్‌ డౌన్‌సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్‌.. శాంట్నర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్‌: 73/2సీఎస్‌కే తొలి వికెట్ డౌన్‌32 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌.. గజన్‌ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న రుతురాజ్‌2 ఓవర్లు ముగిసే సరికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్‌(17), సంజూ శాంసన్‌(5) ఉన్నారు.ఐపీఎల్‌-2026లో మ‌రో కీల‌క పోరుకు తెర‌లేచింది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌కు కూడా ముంబై, సీఎస్‌కే లెజెండ‌రీ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఎంఎస్ ధోని దూర‌మ‌య్యారు. వీరిద్ద‌రూ గాయాల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా సీఎస్‌కే జట్టులోకి ఆయూశ్‌ మాత్రే స్ధానంలో యువ ఆటగాడు కార్తిక్‌ శర్మ వచ్చాడు.తుది జట్లుచెన్నై సూపర్ కింగ్స్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ముఖేష్ చౌదరిముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్‌), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), తిలక్ వర్మ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, జస్ప్రీత్ బుమ్రా, క్రిష్ భగత్, అల్లా మహ్మద్ గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

 Prince Yadav Likely making his T20I debut in the first series after the IPL8
టీమిండియాలోకి ఫాస్ట్ బౌలింగ్ సంచ‌ల‌నం!

ఐపీఎల్‌-2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌తవుతున్న‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు యువ పేస‌ర్ ప్రిన్స్ యాదవ్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. 24 ఏళ్ల ప్రిన్స్ యాద‌వ్ త‌ను ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు.ముఖ్యంగా ఈ ఢిల్లీ పేసర్‌ రెడ్-సాయిల్ పిచ్‌లపై సరైన లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రిన్స్‌ పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో నిలకడగా వికెట్లు తీస్తూ లక్నో ప్రధాన బౌలర్‌గా మారాడు. ఈ ఏడాది సీజన్‌లో ప్రిన్స్ యాదవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో ఉన్నాడు.బుధవారం ఏకానా స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. యార్కర్ల వేయడంలో ప్రిన్స్ దిట్ట. దీంతో అతడిని వీలైనంత త్వరగా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, సిరాజ్ మిన‌హా చెప్పుకోద‌గ్గ ఫాస్ట్ బౌల‌ర్లు లేరు. సిరాజ్ ఎక్కువ‌గా టెస్టుల‌కే మాత్ర‌మే ప‌రిమితమ‌వుతున్నాడు. దీంతో బుమ్రాపై వ‌ర్క్‌లోడ్ ప‌డుతోంది. ఈ క్ర‌మంలో ప్రిన్స్ యాద‌వ్ వంటి యువ సంచ‌ల‌నం జాతీయ జ‌ట్టులోకి వ‌స్తే భార‌త బౌలింగ్ విభాగం మ‌రింత ప‌టిష్టంగా మార‌నుంద‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.आयरलैंड दौरे के लिए Prince Yadav का नाम फाइनल समझिए।Prince Yadav का चयन नहीं हुआ तो घोर जातिवाद समझिए। pic.twitter.com/xvqmzz0S5e— Comrade Yadav (@Comrade6989) April 15, 2026ప్రిన్స్ యాద‌వ్ డొమాస్టిక్ క్రికెట్‌లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 14 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్‌.. 5.15 ఏకానమితో 29 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా 35 టీ20 వికెట్లు కూడా అతడి పేరిట ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో టీ20 జరిగే టీ20 సిరీస్‌లో భారత తరపున ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశముంది.చదవండి: IPL 2026: సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్‌

I See Glimpses Of Brian Lara But: Vaibhav Sooryavanshi Wows Allan Border9
‘లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీ అది నేర్చుకోకుంటే కష్టమే’

భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపై ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇంత చిన్న వయసులో అతడు అంతలా బంతిని బాదడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. ఇంత వరకు తాను ఇలాంటి ఆటగాడిని చూడలేదంటూ కొనియాడాడు. అయితే, అదే సమయంలో వైభవ్‌ చేస్తున్న తప్పును కూడా బోర్డర్‌ ఎత్తి చూపాడు.పరుగుల వరదపద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుతాలు సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్‌కు చెందిన ఈ పిల్లాడు దేశీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ గతేడాది రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను కొని అరంగేట్రం చేయించింది.విధ్వంసకర భారీ సెంచరీయాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటూ పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో) చేసి.. అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై విధ్వంసకర భారీ సెంచరీ (175)తో రాణించి జట్టుకు ట్రోఫీ అందించాడు.ఇక ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ విధ్వంస కొనసాగుతోంది. జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ను కూడా చితక్కొడుతూ... ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో 254 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌లలో టాప్‌-5లో కొనసాగుతున్నాడు.అత్యద్భుతమైన ఆటగాడుఈ నేపథ్యంలో ఆసీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం అలెన్‌ బోర్డర్‌ వైభవ్‌ సూర్యవంశీని ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌ను చూస్తే తనకు వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడని తెలిపాడు.‘‘అతడు అత్యద్భుతమైన ఆటగాడు. గొప్ప ప్రతిభ. 14-15 ఏళ్ల వయసులోనే బంతిని ఇంత గొప్పగా బాదిన ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. అతడొక పవర్‌ హిట్టర్‌. అయితే, ఇప్పుడే అతడి భవిష్యత్తు గురించి అంచనా వేయలేము.లారాను గుర్తు చేస్తున్నాడు.. కానీటెస్టు క్రికెటర్‌గా విజయవంతం అవుతాడా? లేడా? అనేది చెప్పలేను. అయితే, అతడిని చూస్తే మాత్రం నాకు బ్రియన్‌ లారా గుర్తుకువస్తున్నాడు. వైభవ్‌ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. మైదానంలో నలువైపులా అతడు బంతిని బాదగలగాలి. అంతేకాదు.. డిఫెన్స్‌ను మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అలెన్‌ బోర్డర్‌ మిడ్‌-డేతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్‌ వదిలి ఇక్కడికి వచ్చెయ్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Pakistan Withdraw From SAFF Womens Championship In India10
భారత్‌కు రాలేము.. కీల‌క టోర్నీ నుంచి పాకిస్తాన్‌ అవుట్‌

భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న సౌత్ ఏషియ‌న్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (SAFF) మ‌హిళ‌ల ఛాంపియ‌న్‌షిప్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఫుట్‌బాల్ సమాఖ్య ధ్రువీక‌రించింది. ఇరు దేశాల మ‌ధ్య‌ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పీఎఫ్ఎఫ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. పాక్‌ వైదొలగడంతో ఈ టోర్నమెంట్‌ను ఆరు జట్లతో మాత్రమే నిర్వహించనున్నారు.ఈ ఫుట్‌బాల్ టోర్నీ మే 25 నుండి జూన్ 6 వరకు గోవాలోని మార్గావ్ వేదిక‌గా జరగనుంది. మొత్తం ఆరు జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభిజించారు. గ్రూపు-లో నేపాల్‌, శ్రీలంక‌, భూటాన్‌.. గ్రూపు-బిలో భార‌త్‌, బంగ్లాదేశ్‌, మాల్దీవులు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. అయితే సాఎఫ్‌ఫ్ టోర్నీలో భార‌త్‌కు తిరిగిలేని రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా ఐదు సార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.కాగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భార‌త్ వేదిక‌గా జ‌రిగే టోర్నీల‌కు పాక్ దూరంగా ఉండ‌డం ఇదేమి తొలిసారి కాదు. గ‌తేడాది తమిళ‌నాడులో జ‌రిగిన పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుండి పాక్ వైదొలిగింది. అంత‌కుముందు రాజ్‌గిర్‌లో ఆసియా కప్‌-2025కు కూడా తమ సీనియర్ పురుషుల జట్టును పాక్‌ పంపలేదు.భార‌త్ కూడా పాక్ వేదిక‌గా క్రీడా ఈవెంట్ల‌ను బాయ్‌కాట్ చేస్తూ వ‌స్తుంది. ఆసియా టీ20 క‌ప్‌తో పాటు, ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ జ‌ట్టు పాక్‌కు వెళ్ల‌లేదు. త‌మ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ శ్రీలంక‌, దుబాయ్ వేదిక‌ల‌గా ఆడింది.చదవండి: IPL 2026: సీఎస్‌కే జట్టులోకి యార్కర్ల కింగ్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement