Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Akash Deep Ruled Out of IPL1
ఐపీఎల్‌కు ఆకాశ్‌దీప్‌ దూరం

కోల్‌కతా: మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా... అతని సరసన మరో ఫాస్ట్‌ బౌలర్‌ ఆకాశ్‌దీప్‌ కూడా చేరాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్‌దీప్‌ కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్‌ 19వ సీజన్‌ నుంచి ఆకాశ్‌దీప్‌ తప్పుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో జూన్‌ తొలి వారంలో జరిగే ఏకైక టెస్టుకు కూడా ఆకాశ్‌దీప్‌ దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బిహార్‌కు చెందిన 29 ఏళ్ల ఆకాశ్‌దీప్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారత్‌ తరఫున 10 టెస్టులు ఆడిన అతను 28 వికెట్లుపడగొట్టాడు. ఐపీఎల్‌లో 2022 నుంచి 2024 వరకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఆడిన ఆకాశ్‌దీప్‌ గత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆకాశ్‌దీప్‌ 10 వికెట్లు తీశాడు.

Indias Tour of Ireland in June2
జూన్‌లో ఐర్లాండ్‌లో భారత్‌ పర్యటన

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు బెల్‌ఫాస్ట్‌ నగరంలో ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. జూన్‌ 26న తొలి మ్యాచ్, జూన్‌ 28న రెండో మ్యాచ్‌ జరుగుతుంది. జూన్‌ 20న స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ముగిశాక భారత జట్టు ఐర్లాండ్‌కు బయలుదేరుతుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ జట్టుతో టీమిండియా ఐదు టి20 మ్యాచ్‌లు (జూలై 1, 4, 7, 9, 11), మూడు వన్డేలు (జూలై 14, 16, 19) ఆడుతుంది.

Tanvi and Isharani Defeated in Semifinals3
సెమీస్‌లో తన్వీ, ఇషారాణి ఓటమి

న్యూఢిల్లీ: ఓర్లియాన్స్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. ఫ్రాన్స్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్స్‌ తన్వీ శర్మ, ఇషారాణి బారువా ఓటమి పాలయ్యారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)తో జరిగిన తొలి సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 9–21, 16–21తో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో ఇషారాణి 12–21, 21–23తో పిచామన్‌ ఒపాట్‌నిపుత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ఓడిన తనీ్వ, ఇషారాణిలకు 3,625 డాలర్ల (రూ. 3 లక్షల 39 వేలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 4900 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Anahat Singh Advances to Indian Open Squash Tournament Title Clash4
టైటిల్‌ పోరుకు అనాహత్‌ సింగ్‌

ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌కే టైటిల్‌ లభించనుంది. ఎందుకంటే భారత్‌కే చెందిన ఇద్దరు ప్లేయర్లు అభయ్‌ సింగ్, వీర్‌ చోత్రాని ఫైనల్లోకి దూసుకొచ్చారు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్, టాప్‌ సీడ్‌ అనాహత్‌ సింగ్‌ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ప్రపంచ 20వ ర్యాంకర్‌ అనాహత్‌ 11–6, 9–11, 11–8, 11–2తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ హనా మొతాజ్‌ (ఈజిప్‌్ట)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో వీర్‌ చోత్రాని 11–7, 11–5, 5–11, 11–6తో సంజయ్‌ జీవా (మలేసియా)పై, అభయ్‌ సింగ్‌ 11–9, 9–11, 11–3, 11–8తో అమీòÙన్‌రాజ్‌ చందారన్‌ (మలేసియా)పై విజయం సాధించారు.

LSG Owner Sanjiv Goenka-Rishabh Pant And Team Visit Ayodhya5
అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు

ఐపీఎల్‌ 2026 సీజన్‌కు మరో వారం రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. రిషబ్‌ పంత్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ సన్నద్ధతకు ముందు అయోధ్యలోని రామజన్మ భూమిని దర్శించుకుంది. శనివారం కెప్టెన్ రిషభ్ పంత్, ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా సహా క్రికెటర్లు అయోధ్య బాలరాముడి దీవెనలు అందుకున్నారు. ఐపీఎల్‌ 19వ సీజన్‌ ఘనంగా ఆరంభించాలని రాముడిని కోరుకుంటున్నట్లు లక్నో ఫ్రాంచైజీ తెలిపింది.ఈ సందర్భంగా శనివారం తమ టీమ్ అయోధ్య రాముడిని దర్శించుకున్న ఫోటోలను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.‘రాముడికి ప్రార్ధనలు చేయడం కొత్తమే కాదు. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ.. మా జట్టు ఆటగాళ్లందరు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ రాముడి ఆశీర్వాదం ఉంటే అన్నీ అనుకూలంగా జరుగుతాయి’ అని సంజీవ్ గొయెంకా ఏఎన్‌ఐతో తెలిపాడు.ఐపీఎల్‌లో మూడుసార్లు ఫ్లే ఆఫ్స్‌ వరకూ పరిమితమైన లక్నో సూపర్ జెయింట్స్ గత సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆరే విజయాలతో నాకౌట్‌కు ముందే నిష్క్రమించింది. అయితే.. ఈసారి కొత్త జెర్సీతో ఆడనున్న లక్నో మైదానంలో చెలరేగిపోవాలనుకుంటోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 11న మ్యాచ్‌తో లక్నో టోర్నీలో అడుగు పెట్టనుంది.

ICC Not Our Master BCB Ex-Official Fumes Amid Suspension Threat6
‘ఐసీసీ మా యాజమాని కాదు’

బంగ్లాదేశ్‌లో ఇటీవలే ఎన్నికైన కొత్త క్రికెట్‌ బోర్డు తమ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌తో అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి విచారణ కమిటీ ఏర్పాటుకు సంబంధించి జాతీయ క్రీడా మండలి (ఎన్‌ఎస్‌సీ) ఐసీసీని ఆశ్రయిస్తూ గెజిట్‌ను విడుదల చేయడం తమను ఆశ్చర్యపరిచిందని బీసీబీ పేర్కొంది. ఈ గెజిట్‌ ఎన్నికైన పరిపాలన స్థిరత్వం, స్వాతంత్ర్యం, కొనసాగింపు విషయంలో అనిశ్చితి సృష్టించే అవకాశముందని తెలిపింది. ఇదే విషయమై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్‌ అష్రఫుల్‌ హక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బీసీబీ దేశ క్రీడామండలి పరిధిలో ఉందని, ఏమైనా అభ్యంతరాలుంటే బీసీబీకి చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత బోర్డు మాత్రం ఐసీసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా అనిపించింది. బంగ్లా క్రికెట్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఐసీసీ మా యాజమాని కాదు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో మాకు సభ్యత్వమున్నప్పటికీ తొలి ప్రాధాన్యత మాత్రం నేషనల్‌ స్పోర్ట్స్‌ పాలసీ (ఎన్‌ఎస్‌సీ)దే. బీసీబీ రాజ్యాంగం మేరకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు అంతర్గత వ్యవహారాల్లో ఐసీసీ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉంది. అయితే ఐసీసీ మాకు సహాయకులు, మంచి మిత్రులు’ అని చెప్పుకొచ్చాడు. అంతకముందు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి రిలీజ్‌ చేయడం కూడా బంగ్లా క్రికెట్‌ బోర్డుకు రుచించలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌ సమయంలో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరించడంతో, వేదికలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ తేల్చిచెప్పింది. దీంతో బంగ్లా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చదవండి: కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

Kolkata Knight Riders pacer Akash Deep Ruled Out Ahead IPL 20267
కేకేఆర్‌కు మరో దెబ్బ.. కీలక ఆటగాడు దూరం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే మూడుసార్లు చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కుడి మోకాలి గాయం కారణంగా కేకేఆర్‌ స్టార్‌ బౌలర్‌ హర్షిత్‌ రానా ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తాజాగా కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్‌ ఆకాశ్‌దీప్‌ నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆకాశ్‌ దీప్‌ దాదాపు ఎనిమిది వారాల పాటు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ ధృవీకరించాల్సి ఉంది.‘ఆకాశ్‌ దీప్‌ నడుము కింది భాగం స్ట్రెస్‌కు గురి కావడంతో నొప్పి తీవ్రత పెరిగింది. అతడు కోలుకునేందుకు కనీసం 8 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశముంది. దీంతో ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశాలు లేవు’ అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఆకాశ్‌దీప్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. కోటికి కొనుగోలు చేసింది. మరోవైపు శ్రీలంక పేసర్‌ మతీషా పతిరానా విషయంలోనూ ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ సీజన్‌లో రానా ఆడుతాడా? లేదా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ ఎదురుదెబ్బలతో ప్రస్తుతం కేకేఆర్‌ బౌలింగ్‌ విభాగంలో వైభవ్‌ అరోరా, ఉమ్రాన్‌ మాలిక్‌, బ్లెసింగ్‌ ముజరబానీ, కార్తిక్‌ త్యాగి మాత్రమే ఉన్నారు. ఇప్పటికే వీరితో ట్రయల్‌ బౌలింగ్‌ను ప్రారంభించింది.చదవండి: అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

Navdeep Saini Sends Finn Allen Middle Stump KKR Intra Squad Match8
అమ్ముడుపోని బౌలర్‌ విధ్వంసం!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ప్రాక్టీస్‌ను ఆరంభించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌లో ఐపీఎల్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన నవదీప్‌ సైనీ విజృంభించాడు. న్యూజిలాండ్‌ విధ్వంసరకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాక్టీస్‌లో భాగంగా ​​కేకేఆర్‌ ఆటగాళ్లంతా శుక్రవారం పర్పుల్‌ నైట్స్‌, గోల్డెన్‌ నైట్స్‌గా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడారు. గోల్డెన్‌ నైట్స్‌ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పర్పుల్‌ నైట్స్‌కు శుభారంభం లభించింది. ఫిన్‌ అలెన్‌ 10 బంతుల్లోనే 23 పరుగులు బాదాడు. అయితే వేలంలో అమ్ముడుపోని నవదీప్‌ సైనీ బౌలింగ్‌కు వచ్చిన తరుణంలో అతడు వేసిన తొలి బంతిని ఫిన్‌ అలెన్‌ సిక్సర్‌గా మలిచాడు. అయితే ఆ తర్వాత బంతిని సైనీ యార్కర్‌ వేయగా ఫిన్‌ అలెన్‌ వికెట్‌ నుంచి పక్కకు జరిగి భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఫిన్‌ అలెన్‌ కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కాగా ఫిన్‌ అలెన్‌ను కోల్‌కతా రూ. 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పర్పుల్‌ నైట్స్‌ 6 వికెట్ల తేడాతో గోల్డెన్‌ నైట్స్‌పై విజయం సాధించింది. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 55 బంతుల్లోనే 103 పరుగుల మెరుపు సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకముందు గోల్డెన్‌ నైట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. టిమ్‌ సీఫెర్ట్‌ (45), సార్థక్‌ రాజన్‌ (37), రింకూ సింగ్‌ (40) రాణించారు. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో ఫిన్‌ అలెన్‌ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 200 స్ట్రైక్‌రేట్‌తో 298 పరుగులు సాధించాడు. ఇందులో సౌతాఫ్రికాపై 33 బంతుల్లోనే సెంచరీ సాధించిన ఫిన్‌ అలెన్‌ అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. తొలి విడతలో ముంబైతో పాటు ఎస్‌ఆర్‌హెచ్‌, పంజాబ్‌, లక్నోతో ఆడనుంది.Finn Allen got out early but the trailer has been shown, the picture will be seen in the IPL match. pic.twitter.com/eYBvOwCHdO— Ayush🎃 (@AyushBandhe) March 20, 2026చదవండి: ‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

Ex-India Star Targets One BCCI Employee After Quitting Commentary9
‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’

బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్‌ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్‌ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. శివరామకృష్ణన్‌ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్‌కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1984లో ఇంగ్లండ్‌పై ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్‌ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి సత్తా చాటాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్‌ తరఫున శివరామకృష్ణన్‌ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026

Aakash Chopra Slams IPL 2026 Overseas Stars Raise Eyebrows Missing Start10
‘వస్తారు కోట్లు పట్టుకెళ్తారు.. ప్రయోజనమెవరికీ’!

ఐపీఎల్‌ 2026 సీజన్‌ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్‌లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్‌ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ కూడా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయంతో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా క్రికెట్‌ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్‌ స్టార్క్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్‌ హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్‌ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. కానీ నిజానికి అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్‌ టీ20 క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్‌ యాషెస్‌ సిరీస్‌ తర్వాత మళ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్‌ బౌలర్‌ లోకీ ఫెర్గూసన్‌ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్‌ ఐపీఎల్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. ప్రస్తుతం ఫెర్గూసన్‌ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్‌ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్‌లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్‌ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్‌లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు.

Advertisement
Advertisement
 
Advertisement