Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

India Script World Record Aaron Vaibhav Led Ind U19 WC Final Win vs Afg1
చరిత్ర సృష్టించిన భారత్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్‌ వరల్డ్‌కప్‌ టోర్నమెంట్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. ఏకంగా 310 పరుగులకు పైగా టార్గెట్‌ను పూర్తి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు సాధించింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌-2026 టోర్నీ రెండో సెమీ ఫైనల్లో భారత్‌.. అఫ్గనిస్తాన్‌తో తలపడింది. హరారేలో టాస్‌ గెలిచిన అఫ్గన్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 310 పరుగులు సాధించింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాల వల్ల ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.కొండంత లక్ష్యం కొండంత లక్ష్యం ముందున్నా దూకుడుగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన యువ భారత్‌ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఓపెనర్లలో ఆరోన్‌ జార్జ్‌ శతక్కొట్టగా (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు).. వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు అర్ధ శతకం సాధించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే కూడా హాఫ్‌ సెంచరీ (59 బంతుల్లో 62) సాధించాడు.ఇదే అత్యధిక లక్ష్య ఛేదనవీరికి తోడు విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ విజయాన్ని ఖరారు చేశారు. ఈ క్రమంలో కేవలం 41.1 ఓవర్లలోనే యువ భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్‌కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఆరోన్‌కు లభించింది. కాగా అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన.ఇంతకుముందు 2006లో న్యూజిలాండ్‌ ఐర్లాండ్‌ విధించిన 305 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేయగా.. 2022లో సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ ఇచ్చిన 294 పరుగుల టార్గెట్‌ను ఫినిష్‌ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి పదహారు ఎడిషన్లు పూర్తి కాగా.. భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది పదోసారి కావడం విశేషం.ఇంగ్లండ్‌ వర్సెస్‌ భారత్‌మరో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. బులవాయోలో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది.ఇంగ్లండ్‌ కెప్టెన్‌ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్‌ ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక శుక్రవారం జరిగే వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌- ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.Highest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | #INDvENG | FRI, 6th FEB, 1 PM #ENGvIND pic.twitter.com/LMRhFgBzST— Star Sports (@StarSportsIndia) February 4, 2026

T20 WC Warm Up Match: Ishan Tilak Shines IND Score 240 Vs SA2
ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోరు

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన ఇషాన్‌ కిషన్‌తో పాటు.. రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు.ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసంనవీ ముంబై వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్‌ దంచికొట్టి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు.ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తిలక్‌ హాఫ్‌ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.CRUNCHING STROKE! 💥In the slot, and Tilak Varma deposits it deep into the stands! 🙌🏻ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/htSk1AxhpZ— Star Sports (@StarSportsIndia) February 4, 2026రాణించిన సూర్య, అక్షర్‌, హార్దిక్‌మరోవైపు.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30) వేగంగా ఆడే ప్రయత్నంలో.. క్వెనా మఫాకా బౌలింగ్‌లో జార్జ్‌ లిండేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 30) రాణించారు. రింకూ సింగ్‌ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్, అన్రిచ్‌ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.చదవండి: T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

U19 WC 2026 2nd Semis: Aaron 100 India Beat Afghanistan Enters Final3
WC 2026: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీ-2026లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. హరారే వేదికగా సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వే వేదికగా జనవరి 15న ప్రపంచకప్‌ టోర్నీ మొదలైన విషయం తెలిసిందే.ఆది నుంచి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న భారత జట్టు.. సూపర్‌ సిక్స్‌ దశలో నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రెండో సెమీ ఫైనల్లో బుధవారం అఫ్గన్‌ జట్టుతో తలపడింది.ఇద్దరు శతకాలు బాదిహరారేలో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. అయితే, వికెట్లు తీయలేక భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. అఫ్గన్‌ బ్యాటర్లలో ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగి.. అఫ్గన్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్‌ 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్ చౌహాన్‌ తలా రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆయుశ్‌ మాత్రే సేన ఆది నుంచే దూకుడుగా ఆడింది. శతక్కొట్టిన హైదరాబాదీ బ్యాటర్‌ఓపెనర్లలో వైభవ్‌ సూర్యవంశీ (33 బంతుల్లో 68) ధనాధన్‌ దంచికొట్టగా... హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ శతకం (104 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సత్తా చాటాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే 59 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు.మిగతా వారిలో విహాన్‌ మల్హోత్రా (47 బంతుల్లో 38), వేదాంత్‌ త్రివేది (6 బంతుల్లో 5) అజేయంగా నిలిచి భారత్‌ గెలుపును ఖరారు చేశారు. టాపార్డర్‌ దంచికొట్టడంతో అఫ్గన్‌ విధించిన లక్ష్యాన్ని భారత్‌ 41.1 ఓవర్లలోనే ఊదేసింది. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 311 పరుగులు సాధించి.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ రెండు వికెట్లు తీయగా.. వహీదుల్లా జద్రాన్‌కు ఒక వికెట్‌ దక్కింది. కాగా తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం ఫైనల్‌ జరుగనుంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారుHighest successful run-chase ✔️Stunning batting display ✔️10th final calling ✔️Team India colts deliver a clinical show to set up a finals date with England! 🇮🇳🫰🏻NEXT ON ICC MEN'S U19 World Cup 👉 FINAL | IND 🆚 ENG | FRI, 6th FEB, 1 PM pic.twitter.com/Pzay5mAdoI— Star Sports (@StarSportsIndia) February 4, 2026

T20 WC Warm Up: Ishan Kishan Replaces Sanju Slams 20 Ball Fifty vs SA4
T20 WC: ఓపెనర్‌గా వచ్చి.. దంచికొట్టిన ఇషాన్‌ కిషన్‌

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు టీమిండియా సిద్ధమైంది. సన్నాహకాల్లో భాగంగా బుధవారం సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌తో బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా వచ్చాడు.6, 6, 4, 6విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు జోడీగా వచ్చిన ఇషాన్‌.. ధనాధన్‌ దంచికొట్టాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా ఐదో ఓవర్లో ప్రొటిస్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే రంగంలోకి దిగగా.. ఇషాన్‌ అతడి బౌలింగ్‌ను చితక్కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్లో సిక్సర్‌ బాదిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఐదో బంతిని బౌండరీకి తరలించాడు. ఆరో బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు. అలా నాలుగు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు.20 బంతుల్లోనేఈ క్రమంలో 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ (53) పూర్తి చేసుకున్నాడు ఇషాన్‌ కిషన్‌. సిక్సర్‌తో యాభై పరుగుల మార్కు దాటిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్‌ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.కాగా టీ20 వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా నవీ ముంబైలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24), ఇషాన్‌ కిషన్‌ (20 బంతుల్లో 53) రిటైర్డ్‌ అవుట్‌గా నిష్క్రమించారు. టీ20 వరల్డ్‌కప్‌-2026 జట్లు భారత్‌అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ,సంజు శాంసన్,హార్దిక్ పాండ్యా,రింకూ సింగ్,శివం దూబే,అక్షర్ పటేల్,అర్ష్‌దీప్ సింగ్,వరుణ్ చక్రవర్తి,జస్ప్రీత్ బుమ్రా,వాషింగ్టన్ సుందర్,హర్షిత్ రాణా,కుల్దీప్ యాదవ్.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌),క్వింటన్ డి కాక్,ర్యాన్ రికెల్టన్ (వారం),డెవాల్డ్ బ్రెవిస్,ట్రిస్టన్ స్టబ్స్,జాసన్ స్మిత్,డేవిడ్ మిల్లర్,మార్కో యాన్సెన్,జార్జ్ లిండే,కార్బిన్ బాష్,కేశవ్ మహారాజ్,క్వేనా మఫాకా,లుంగీ ఎన్గిడి,అన్రిచ్ నోర్ట్జే,కగిసో రబడ.చదవండి: WC 2026: వరల్డ్‌కప్‌ సెమీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసంT20 WC IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్‌!When you’re in form, everything goes your way!😮‍💨ICC Men's #T20WorldCup | Warm-Up Match | 👉 #INDvSA | LIVE NOW ➡️ https://t.co/KpRezrTaFe pic.twitter.com/51Mr18qE1g— Star Sports (@StarSportsIndia) February 4, 2026

IND vs PAK Will 100 Percent Happen: Ashwin T20 WC Prediction PCB Boycott5
T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్‌ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్‌- పాక్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ భారత్‌లో జరుగుతుండగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడనుంది.పాక్‌ ఓవరాక్షన్‌అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తామని పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ మాత్రం టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్‌ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్‌ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్‌కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్‌ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్‌కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్‌ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్‌ తటస్థవేదిక మీదే పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్‌ను బహిష్కరించడం టెక్నికల్‌గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్‌కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్‌ బంగ్లాదేశ్‌కు వంతపాడుతూ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే...

 U19 WC 2026 IND v AFG Semis: Vaibhav Suryavanshi Fiery 33 Ball 68 Video6
World Cup 2026: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం

భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు ధనాధన్‌ దంచికొట్టాడు.24 బంతుల్లోనే..కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 68 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.𝐅𝐀𝐒𝐓. 𝐅𝐄𝐀𝐑𝐋𝐄𝐒𝐒. 𝐅𝐈𝐅𝐓𝐘.Vaibhav Sooryavanshi goes full throttle in the SEMI-FINAL chase! 🚀#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/skcIOVMznz— Star Sports (@StarSportsIndia) February 4, 2026సుడిగాలి ఇన్నింగ్స్‌వైభవ్‌ సూర్యవంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ తొమ్మిది ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో నూరిస్తాని ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో మూడో బంతికి.. ఒస్మాన్‌ సదాత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో వైభవ్‌ సూర్యవంశీ పెవిలియన్‌ చేరాడు. కాగా ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌తో కలిసి మరో ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ తొలి వికెట్‌కు 57 బంతుల్లో 90 పరుగులు జోడించాడు.311 పరుగుల లక్ష్యంకాగా వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్లో భాగంగా జింబాబ్వేలోని హరారే వేదికగా టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఫైజల్‌ షినోజాదా (110), ఉజైరుల్లా నియాజాయ్‌ (101 నాటౌట్‌) శతకాలతో చెలరేగారు.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి అఫ్గనిస్తాన్‌ 310 పరుగులు సాధించింది. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమే లభించింది. పది ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి యువ భారత జట్టు వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసింది.చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

More Trouble Pak Likely To Miss Out On Potential T20 WC Super 8 Spot Why7
T20 WC: పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్‌.. తాజాగా భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్‌ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) పాక్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఓవరాక్షన్‌ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్‌.. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్‌ క్రికెట్‌ భవిష్యత్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్‌ 8 చేరే అవకాశాలను కూడా పాక్‌ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్‌కప్‌ టోర్నీలో పాక్‌.. భారత్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాతో కలిసి గ్రూప్‌-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్‌.. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్‌ ఆ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్‌ దశలో ఆఖరిగా పాక్‌.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్‌ ఆడకపోతే పాక్‌ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్‌రన్‌రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్‌, నమీబియాలతో మ్యాచ్‌లకు ఆటంకం కలిగితే నెట్‌రన్‌ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్‌లో పాక్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్‌లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్‌ ఓడిపోయి సూపర్‌-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్‌లోనూ పాక్‌కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్‌ రద్దు.. రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్‌ సూపర్‌-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు

U19 WC 2026 IND v AFG Semis: Faisal Uzairullah Centuries Afg Record8
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇందుకు తోడు భారత జట్టు ఫీల్డింగ్‌ తప్పిదాలతో అఫ్గన్‌ బ్యాటర్లుకు లైఫ్‌ ఇచ్చింది. ఫలితంగా అఫ్గనిస్తాన్‌ భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన ఫైజల్‌ షినోజాదాజింబాబ్వేలోని హరారే వేదికగా వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు ఒస్మాన్‌ సదాత్‌ (39), ఖలీద్‌ అహ్మద్‌జాయ్‌ (31) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫైజల్‌ షినోజాదా (Faisal Shinozada) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉజైరుల్లా అజేయ శతకంమొత్తంగా 93 బంతులు ఎదుర్కొన్న ఫైజల్‌.. 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. మరోవైపు.. రనౌట్‌ ప్రమాదాల నుంచి తప్పించుకున్న నాలుగో నంబర్‌ బ్యాటర్‌ ఉజైరుల్లా నియాజాయ్‌ (Uzairullah Niazai) సైతం శతకం పూర్తి చేసుకున్నాడు. కేవలం 86 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 101 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫైజల్‌- ఉజైరుల్లా కలిసి మూడో వికెట్‌కు 130 బంతుల్లో 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా అఫ్గనిస్తాన్‌ ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు రాబట్టింది. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన అఫ్గన్‌ జట్టు ఏకంగా 310 పరుగులు సాధించింది.𝙄𝙩 𝙩𝙤𝙤𝙠 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 𝙩𝙤 𝙨𝙩𝙤𝙥 𝙨𝙤𝙢𝙚𝙩𝙝𝙞𝙣𝙜 𝙨𝙥𝙚𝙘𝙞𝙖𝙡 ✨Deepesh Devendran goes through the gate to hand #TeamIndia a vital wicket 👊#ICCMensU19WC | Semi-Final 2 | #INDvAFG 👉 LIVE NOW ➡️ https://t.co/BH7PyKi0Hq pic.twitter.com/eVzeiSfryl— Star Sports (@StarSportsIndia) February 4, 2026ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరుఅండర్‌-19 వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తాజా ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌, కనిష్క్‌ చౌహాన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అఫ్గన్‌ విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తేనే భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టగలదు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.చదవండి: WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

Dont do this: Ponting reveals pleading to DC to keep Abhishek Sharma9
వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు!

టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టీమిండియా స్టార్‌ అభిషేక్‌ శర్మ. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున సత్తా చాటి.. భారత జట్టులోకి వచ్చిన ఈ పంజాబీ ఆటగాడు.. అనతికాలంలోనే ఓపెనర్‌గా పాతుకుపోయాడు.విధ్వంసకర ఇన్నింగ్స్‌కు మారుపేరుగా మారి ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma). ఇప్పటికే తన ధనాధన్‌ ఆటతో ఎన్నో రికార్డులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. టీ20 ప్రపంచకప్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను నేనేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ (Ricky Ponting) అభిషేక్‌ శర్మ గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్‌కు మొదటి ఐపీఎల్‌ కోచ్‌ను తానేనని.. అతడు భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా ఎదుగుతాడని నాడే అంచనా వేశానని పేర్కొన్నాడు.కాగా అభిషేక్‌ శర్మ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పుడు పాంటింగ్‌ ఢిల్లీ కోచ్‌గా ఉన్నాడు. ఇక ఆర్సీబీతో తన తొలి మ్యాచ్‌లోనే అభిషేక్‌ శర్మ.. ఆరో స్థానంలో వచ్చి 19 బంతుల్లోనే 46 పరుగులతో అజేయంగా నిలిచాడు.టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో తాజాగా నాటి విషయాలు గుర్తు చేసుకున్న రిక్కీ పాంటింగ్‌.. అభిషేక్‌ శర్మను దూరం చేసుకోవద్దని తాను ఢిల్లీ యాజమాన్యానికి ఎంతగానో చెప్పిచూశానని తెలిపాడు. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం 2019 వేలానికి ముందు అతడిని ట్రేడ్‌ చేసిందని వెల్లడించాడు.భవిష్య సూపర్‌స్టార్‌.. వద్దని మొత్తుకున్నా వినలేదు"అతడికి మొదటి ఐపీఎల్‌ కోచ్‌ నేనే. నా మార్గదర్శనంలోనే అతడు అరంగేట్రం చేశాడు. పదిహేడేళ్ల వయసులో ఢిల్లీ తరఫున రంగంలోకి దిగి.. ఆరంభంలోనే అదరగొట్టాడు. తొలి బంతినే బౌలర్‌ మీదుగా స్ట్రెయిట్‌గా బౌండరీకి తరలించాడు. క్లాసీ షాట్లతో అలరించాడు.అప్పుడే అతడు ఓ ప్రత్యేకమైన ఆటగాడని నాకు అర్థమైంది. కానీ ఢిల్లీ యాజమాన్యం మాత్రం అతడిని ట్రేడ్‌ చేయాలని ఫిక్సైంది. అప్పుడు నేను అలా చేయవద్దని మొత్తుకున్నా వినలేదు. భవిష్య సూపర్‌స్టార్‌ ఇతడేనని బలంగా నమ్మాను. అదే విషయం వాళ్లకి చెప్పాను. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండేవి’’ అని రిక్కీ పాంటింగ్‌ ఐసీసీ రివ్యూతో పేర్కొన్నాడు.ధావన్‌ కోసం ట్రేడ్‌ చేసిన ఢిల్లీకాగా శిఖర్‌ ధావన్‌ కోసం ఒప్పందం చేసుకునే క్రమంలో ఢిల్లీ అభిషేక్‌ శర్మను సన్‌రైజర్స్‌కు ట్రేడ్‌ చేసింది. ఇక సన్‌రైజర్స్‌కు మారిన తర్వాత అభిషేక్‌ సృష్టించిన పరుగుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికి 71 ఇన్నింగ్స్‌లో 162కు పైగా స్ట్రైక్‌రేటుతో 1753 పరుగులు సాధించాడు. అదే విధంగా.. టీమిండియా తరఫున ఇప్పటికి 38 మ్యాచ్‌లు ఆడి 1297 రన్స్‌ రాబట్టిన అభిషేక్‌ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి.చదవండి: భారత్‌-పాక్‌ టీ20 ప్రపంచకప్‌ వార్‌.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా

T20 WC 2026 IND vs USA: No Ishan Kishan Chahal Names His India XI10
IND vs USA: భారత తుదిజట్టు ఇదే.. ఇషాన్‌కు నో ఛాన్స్‌!

పొట్టి క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు శనివారం (ఫిబ్రవరి 7)న తెరలేవనుంది. ఈ ఐసీసీ ఈవెంట్లో తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలుత కొలంబో వేదికగా పాకిస్తాన్‌- నెదర్లాండ్స్‌.. ఆ తర్వాత కోల్‌కతాలో వెస్టిండీస్‌- స్కాట్లాండ్‌.. అనంతరం ముంబై వేదికగా టీమిండియా- అమెరికా (IND vs USA) జట్లు తలపడతాయి.ఇందుకోసం ఇప్పటికే జట్లన్నీ ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టేశాయి. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంజూ శాంసన్‌ (Sanju Samson)ను ఓపెనర్‌గా కొనసాగిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.వరుస వైఫల్యాలుగత కొన్నాళ్లుగా సంజూ ఫామ్‌లేమి (10, 6, 0, 24, 6)తో సతమతమవుతుండటం ఇందుకు కారణం. అదే సమయంలో.. చాన్నాళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో వన్‌డౌన్‌లో వచ్చి ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ (103)తో అదరగొట్టాడు.తిలక్‌ వర్మ పునరాగమనంకాగా తిలక్‌ వర్మ గాయం కారణంగా జట్టుకు దూరమైనంద వల్ల ఇషాన్‌ అతడి స్థానంలో వన్‌డౌన్‌లో వచ్చాడు. అయితే, వరల్డ్‌కప్‌ టోర్నీతో తిలక్‌ వర్మ పునరాగమనం చేయనున్నాడు. దీంతో ఇషాన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసి.. సంజూపై మేనేజ్‌మెంట్‌ వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్‌కు నో ఛాన్స్‌ఇలాంటి తరుణంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఆసక్తికర అంచనాతో ముందుకు వచ్చాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. అమెరికాతో తలపడే భారత తుదిజట్టును ఎంచుకున్న చహల్‌.. ఇషాన్‌ కిషన్‌ను పక్కనపెట్టడం విశేషం. అభిషేక్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేయాలని అతడు అభిప్రాయపడ్డాడు.ఇక మూడో స్థానంలోకి తిలక్‌ వర్మ తిరిగివస్తాడన్న చహల్‌.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ యథావిధిగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌.. మిడిలార్డర్‌, ఫినిషర్‌ పాత్రలు పోషిస్తారని తెలిపాడు.కుల్దీప్‌నకు కూడా మొండిచేయితన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తికి చోటిచ్చిన చహల్‌.. ఇద్దరు స్పెషలిస్టు సీమర్లుగా జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌తో పాటు.. స్పిన్‌ దళంలో కుల్దీప్‌ యాదవ్‌కు చహల్‌ మొండిచేయి చూపాడు. కాగా వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌.. పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-‘ఎ’లో ఉంది.టీ20 వరల్డ్‌కప్‌-2026లో అమెరికాతో మ్యాచ్‌కు చహల్‌ ఎంచుకున్న భారత తుదిజట్టుఅభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా.చదవండి: ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి.@yuzi_chahal picks his playing XI for India’s opening fixture! 👀 💪🏻Just 4 days to go before the defending champions begin their journey on T20 cricket’s biggest stage with one clear mission: 𝗥𝗘𝗣𝗘𝗔𝗧 & 𝗗𝗘𝗙𝗘𝗔𝗧 history 🔥🤩ICC Men’s #T20WorldCup 2026 👉 #INDvUSA |… pic.twitter.com/X9KsBx2CjQ— Star Sports (@StarSportsIndia) February 3, 2026

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement