Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

I Was Reluctant But: Army Veteran On MS Dhoni Getting Honorary Rank1
ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్‌ ధోని. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్‌లో ఉన్నాయి.గౌరవ ఆర్మీ ర్యాంకుఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్‌ రెజిమెంట్‌లో 2011లో అతడికి లెఫ్టినెంట్‌ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్‌ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్‌ బెరెట్‌’ (headgear) సొంతం చేసుకున్నాడు.మొదట్లో నాకు నచ్చలేదుఈ నేపథ్యంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌. అప్పటి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్‌ బెరెట్‌ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.పారాట్రూపర్‌ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్‌ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్‌ బెరెట్‌ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.నిజమైన సైనికుడుధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ‍ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌ కూల్‌. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్‌గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.యూనిఫామ్‌ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్‌గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్‌లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా ధోనిని కొనియాడారు.చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేతThe story behind how MS Dhoni earned the Maroon Beret 🇮🇳 🪖."He went and Served in J&K with our soldiers , He went to the Border" pic.twitter.com/GXMM3cdeHX— MAHIYANK™ (@Mahiyank_78) April 21, 2026

Ravichandran Ashwin Picks Priyansh Arya Better Than Vaibhav Sooryavanshi2
అతడు వైభవ్‌ సూర్యవంశీ కంటే సమర్దుడు..!

భారత మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇద్దరు యువ క్రికెటర్లను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‍రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ‍కంటే పంజాబ్‌ యువ కెరటం​ ప్రియాంశ్‌ ఆర్య చాలా సమర్థుడని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. వైభవ్‌, అయుశ్‌ మాత్రే వంటి యువ ఆటగాళ్లతో పోలిస్తే ప్రియాంశ్ ఓ మెట్టు ముందున్నాడని అన్నాడు. ఎవరినీ తక్కువ చేయడం​ లేదని చెబుతూనే.. ప్రియాంశ్ వద్ద ఉన్న షాట్‌ల వైవిధ్యం, పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉందని కితాబునిచ్చాడు. ఈ లక్షణాలు ప్రియాంశ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని తెలిపాడు.కాగా, అశ్విన్‌ పొగడ్తలకు ఆనుగుణంగానే ప్రియాంశ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెలరేగి ఆడుతున్నాడు. 5 మ్యాచ్‌ల్లో 248.24 స్ట్రయిక్‌రేట్‌తో 211 పరుగులు చేసి లీడింగ్‌ రన్‌స్కోరర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ సాధిస్తున్న వరుస విజయాల్లో ప్రియాంశ్‌ది ప్రధానపాత్ర. తాజాగా లక్నో 37 బంతుల్లో 93 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని కెరీర్‌ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఇలాంటి ప్రదర్శనలే అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకున్నాయి.వైభవ్‌ విషయానికొస్తే.. ఈ బుడ్డోడు కూడా తక్కువేమీ తినలేదు. ఈ సీజన్‌లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. సీఎస్‌కే, ఆర్సీబీపై చేసిన మెరుపు హాఫ్ సెంచరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఆర్సీబీపై ఆడిన ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 78 పరుగులు) అతని టాలెంట్‌ను ప్రపంచానికి మరోసారి రుచి చూపించింది. అయితే ఇటీవల మ్యాచ్‌లలో అతని జట్టు విజయం సాధించకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌.. 236.54 స్ట్రయిక్‌రేట్‌తో 246 పరుగులు చేసి టాప్‌-5 లీడింగ్‌ స్కోరర్ల జాబతాలో ఉన్నాడు.మాత్రే విషయానికొస్తే.. ఇతగాడు కూడా ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఆయుశ్‌ ఈ సీజన్‌లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 201 పరుగులు చేసి సీఎస్‌కే తరఫున నిలకడ ప్రదర్శనలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.మొత్తంగా అశ్విన్‌ వ్యాఖ్యలు ఎవరిని తగ్గించడానికి చేసినవిగా కనిపించలేదు. ప్రతిభను గుర్తించడంలో భాగంగా చేసినవిగా స్పష్టమయ్యాయి. ప్రియాంశ్‌తో పోలిస్తే వైభవ్‌కు అధిక హైప్‌ దక్కింది. టాలెంట్‌ విషయం పక్కన పెడితే, ఏజ్‌ అతనికి అడ్వాంటేజ్‌గా మారింది. 14-15 ఏళ్ల వయసులో వైభవ్‌ రెచ్చిపోతున్న విధానం అందరిని ఆకట్టుకుంటుంది. అతడు షాట్లు ఆడే స్టైల్‌ చూడముచ్చటగా ఉంటుంది. ప్రియాంశ్‌ సైతం ఇలాగే ఆడుతున్నా, వయసులో వైభవ్‌ కంటే కాస్త పెద్ద వాడు (24) కావడం, అతనికి ఆశించిన గుర్తింపు దక్కనివ్వలేదు.

IPL 2026 going vigorously compared to PSL 20263
ఐపీఎల్‌ జోరు.. పీఎస్‌ఎల్‌ బేజారు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026, పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026 ఏకకాలంలో జరుగుతున్న నేపథ్యంలో ఏ లీగ్‌ జోరుగా సాగుతుంది..? ఏ లీగ్‌ బేజారుగా సాగుతుందన్న విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు గత సీజన్‌ నుంచి ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్‌ను ఒకే సమయంలో షెడ్యూల్‌ చేసింది. పీసీబీ తీసుకున్న ఈ తలతిక్క నిర్ణయం పీఎస్‌ఎల్‌ అన్ని విధాల నష్టపోతుంది. ఐపీఎల్‌కు పోటీ కాదు కదా, కనుచూపుమేరల్లో కూడా లేకుండా పోయింది.రెండు లీగ్‌లు ఒకేసారి జరుగుతుండటం​ వల్ల సహజంగానే ఐపీఎల్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. స్వదేశీ, విదేశీ స్టార్లంతా ఇదే లీగ్‌లో ఉండటంతో ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఈ లీగ్‌నే ఫాలో అవుతున్నారు. పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో స్వదేశీ ఆటగాళ్లు, ఔట్‌ డేటెడ్‌ విదేశీ ఆటగాళ్లు మాత్రమే పాల్గొంటున్నారు. దీంతో ఈ లీగ్‌ పరిధి కేవలం​ పాక్‌కు మాత్రమే పరిమితమైంది. బయటి దేశాల్లో పీఎస్‌ఎల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.ప్రస్తుత సీజన్‌లో పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్‌కు అధిక పాపులారిటీ దక్కడానికి మరో కారణం ఐపీఎల్లో‌ జరుగుతున్న విధ్వంసం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు పోటాపోటీగా సాగాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌలర్లు సైతం ఈ సీజన్‌లో పని చక్కబెట్టుకున్నారు. అద్భుతమైన ఫీల్డింగ్‌ విన్యాసాలు, కళ్లు చెదిరే క్యాచ్‌లకు ఈ సీజన్‌ ప్రత్యేకమైన వేదిక అయ్యింది.ఈ సీజన్‌లో 31 మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారీ సంఖ్యలో సిక్సర్లు, బౌండరీలు నమోదయ్యాయి. 4 సెంచరీలు, పదుల సంఖ్యలో అర్ద సెంచరీలు రికార్డయ్యాయి. ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి, మరెన్నో కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. ఏ మాత్రం అంచనాలు లేని బౌలర్లు ఈ సీజన్‌లో చెలరేగిపోతున్నారు. రొటీన్‌కు భిన్నంగా పేసర్లు స్పిన్నర్ల కంటే మెరుగ్గా రాణిస్తున్నారు.జట్ల విషయంలోనూ అంచనాలు లేని జట్లే ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాల్లో పడి ఉన్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగక దూసుకుపోతుంది. ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా అంచనాలకు మించి రాణిస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ముంబై ఇండియన్స్‌ గత మూడు నాలుగు సీజన్ల తరహాలోనే స్లో స్టార్ట్‌ మోడ్‌లో సాగుతుంది. ఎల్‌ఎస్‌జీ, ఢిల్లీ, గుజరాత్‌ పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, ఆన్‌ ఫీల్డ్‌లో అంచనాలను చేరుకోలేకపోతుంది. సీఎస్‌కే పరిస్థితి ముంబై ఇండియన్స్‌ లాగే ఉంది.అంచనాలు ఉన్న జట్లు విఫలమవుతున్నా, అంచనాలు లేని జట్లు అద్భుతాలు చేస్తూ ఈ సీజన్‌ను రక్తి కట్టిస్తున్నారు. లీగ్‌ మే 31 వరకు సాగనున్న నేపథ్యంలో మరిన్ని సిత్రాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐపీఎల్‌ ఈ సీజన్‌లో గతానికి కాస్త భిన్నంగా సాగుతూ అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడా పోటీల రేసులో దూసుకుపోతుంది.పీఎస్‌ఎల్‌ విషయానికొస్తే.. ఆ లీగ్‌ ముగింపుకు దగ్గరగా వచ్చింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ లాగే 31 మ్యాచ్‌లు జరిగినా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన లేదు. బ్యాటింగ్‌ విభాగం సప్పగా, వన్డే క్రికెట్‌ను తలపిస్తుండగా.. నాణ్యత లేని బౌలింగ్‌ జనాలకు బోర్‌ కొట్టిస్తుంది. ఫీల్డింగ్‌ గురించి చెప్పుకోకుంటేనే మంచిది. ప్రపంచంలో ఎక్కడా లేని ఫీల్డింగ్‌ సిత్రాలన్నీ ఈ లీగ్‌లోనే కనిపిస్తాయి. పాక్‌ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ చూస్తే నవ్వు ఆపుకోక తప్పదు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు నయం అనిపిస్తుంది.ఈ లీగ్‌ ఆడుతున్నది అతి తక్కువ మంది విదేశీ ప్లేయర్లు, వీరిలో ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో ఇదే పరిస్థితి. అడపాదడపా లోకల్‌ ఆటగాళ్లే కాస్త నయం అనిపిస్తుంది. పాక్‌కు ఈ లీగ్‌ వల్ల దక్కే ఊరట ఏదైనా ఉందా అంటే, అది బాబర్‌ ఆజమ్‌ ఫామ్‌లోకి రావడ​ం​. ఈ పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ ఈ పీఎస్‌ఎల్‌ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. తాజాగా ఓ సెంచరీ కూడా చేశాడు.ఇది మినహా పీఎస్‌ఎల్‌ మొత్తం మూకీ డ్రామాలాగా సప్పగా సాగుతుంది. ఇప్పటికి పెషావర్‌ జల్మీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. ముల్తాన్‌ సుల్తాన్స్‌, ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ రేసులో ముందు వరుసలో ఉన్నాయి.

After Kohli cuts ties Bengaluru One8 Commune outlet shuts over rent dues4
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేత

టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి బ్రాండ్‌ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్‌ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్‌.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్‌8 కమ్యూన్‌ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్‌ చైన్‌ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్‌, పుణె, కోల్‌కతా, నోయిడా, హైదరాబాద్‌ వంటి సిటీల్లో వన్‌8 కమ్యూన్‌కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్‌8 కమ్యూన్‌ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ ఉంది. ట్రియో హిల్స్‌ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్‌ విఫలమైంది. మెయింటెనెన్స్‌ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్‌ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్‌ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్‌ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్‌ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

Krunal Pandya Asked About Rumours Of Rift With Brother Hardik Reply Viral5
హార్దిక్‌తో విభేదాలు నిజమే!.. కృనాల్‌ రిప్లై వైరల్‌

భారత స్టార్‌ క్రికెటర్లు కృనాల్‌ పాండ్యా- హార్దిక్‌ పాండ్యా మధ్య విభేదాలు తలెత్తినట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణంగా మెదిలిన ఈ అన్నదమ్ములు.. తాజాగా పరస్పరం ఎదురుపడినా పెద్దగా పలకరించుకోకపోవడం ఇందుకు కారణం. ఐపీఎల్‌-2026లో భాగంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టుకు కృనాల్‌ పాండ్యా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఒకప్పటి ఆ ప్రేమ కనబడటం లేదుమరోవైపు మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నా.. ఇరుజట్లు ముఖాముఖి తలపడినపుడు అన్నదమ్ములు ఆప్యాయంగా మెలగడం గతంలో కనిపించేది. అయితే తాజా ఎడిషన్‌లో ఇటీవల ముంబైతో ఆర్సీబీ తలపడగా.. హార్దిక్‌ అవుటైన సమయంలో కృనాల్‌ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.ఆమె విషయంలోనే విభేదాలు? అంతేకాదు మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా ఈ తోబుట్టువులు ఎడముఖం- పెడముఖంగానే కనిపించారు. ఇక హార్దిక్‌ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ ఇటీవల వీరి తల్లిని కలిసింది. ఆ సమయంలో కృనాల్‌ కుటుంబం కూడా ఆమెతోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హార్దిక్‌ నటాషా నుంచి విడిపోయిన కొన్నాళ్లకే మహీక శర్మ అనే మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అంతేకాదు నటాషాతో తనకు కలిగిన కుమారుడు అగస్త్యను కూడా మహీకకే అప్పగించినట్లుగా వదంతులు వస్తున్నాయి.ఈ పరిణామాలే పాండ్యా బ్రదర్స్‌ మధ్య విభేదాలకు కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహీక విషయంలో కృనాల్‌ హార్దిక్‌పై సీరియస్‌గా ఉన్నాడని వాటి సారాంశం. ఈ విషయం గురించి తాజాగా కృనాల్‌ పాండ్యా నర్మగర్భంగా స్పందించాడు.విభేదాలు నిజమే? కృనాల్‌ రిప్లై వైరల్‌​ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో భాగంగా హోస్ట్‌ డానిష్‌ సైత్‌ కృనాల్‌ పాండ్యాను పరోక్షంగా హార్దిక్‌ గురించి అడిగాడు. ‘‘అంతా ఒకేనా? ఏదైనా యుద్ధం జరుగుతోందా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు కృనాల్‌ గట్టిగా నవ్వేశాడు తప్ప బదులివ్వలేదు. ఇక ‘‘కుటుంబ సభ్యుడినైన నన్ను కలవలేదు’’ అని డానిష్‌ జోక్‌ చేయగా.. ‘‘కొన్నిసార్లు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నపుడు ఒక్కోసారి కొందరిని మిస్‌ అవడం సహజమే’’ అని కృనాల్‌ బదులిచ్చాడు.𝗔𝘂𝗿𝗮 + 𝗩𝗶𝗯𝗲𝘀: 𝗞𝗿𝘂𝗻𝗮𝗹 𝗣𝗮𝗻𝗱𝘆𝗮 🤝 𝗠𝗿. 𝗡𝗮𝗴𝘀 😂🥶✌️Krunal’s hairstyles, business ventures, on field tactics & antics, and some personal life secrets - Mr. Nags bowls bouncers to Krunal Pandya on this latest episode of @bigbasket_com presents RCB Insider.… pic.twitter.com/iI4U3KofMI— Royal Challengers Bengaluru (@RCBTweets) April 22, 2026ఇందుకు సమాధానంగా.. ‘‘మీ తమ్ముడిలాగా’’ అని డానిష్‌ అనడంతో.. కృనాల్‌ నవ్వుతూ ముఖం దాచేసుకున్నాడు. అంతే తప్ప మధ్య విభేదాలు లేవని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా విజయం తర్వాత హార్దిక్‌కు కృనాల్‌ శుభాకాంక్షలు చెప్పలేదు. అదే విధంగా కృనాల్‌ బర్త్‌డేకు హార్దిక్‌ విష్‌ చేయలేదు.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

Kagiso Rabada Caught Smoking With GT Member; BCCI Action Incoming?6
స్మోకింగ్‌ చేస్తూ పట్టుబడ్డ గుజరాత్‌ ప్లేయర్‌

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. టీమ్‌ హోటల్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసి అభిమానులు రబాడపై చర్యలుంటాయా అని ఆరా తీస్తున్నారు.ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో స్మోకింగ్‌పై స్పష్టమైన నిషేధం లేదు. అంటే సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా ఇది విమర్శలకు దారి తీస్తోంది.🚨 KAGISO RABADA IS SMOKING !🤯- Kagiso Rabada was smoking and got caught on camera while doing so. At that moment, Rashid Khan and the rest of the staff came and asked him, “What is this?” 👀pic.twitter.com/kF65xT8Mxl— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 22, 2026రబాడాకు డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉన్నందున ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం పరిశీలించే అవకాశం ఉంది. అతను వాడింది కేవలం సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో రబాడ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్ల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే.. గుజరాత్‌ ఈ సీజన్‌లో మధ్యస్త ప్రదర్శనలతో మమ అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 అపజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

BCB Announce T20I Squad vs NZ Provides Big Favour To PCB For PSL7
పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డు

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో బిజీగా ఉంది. కివీస్‌తో సొంతగడ్డపై బంగ్లా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇప్పటికే రెండు వన్డేలు పూర్తి కాగా కివీస్‌, బంగ్లా తలా ఒక మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.ఫామ్‌లో ఉన్న వాళ్లకు విశ్రాంతి?ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) తమ జట్టును తాజాగా ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టు నుంచి నహీద్‌ రాణా, ముస్తాఫిజుర్‌ రహమాన్‌, టస్కిన్‌ అహ్మద్‌లను తప్పించింది. అబ్దుల్‌ గఫార్‌ సక్లెయిన్‌ అనే అన్‌క్యాప్డ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌కు మాత్రం తొలిసారి జట్టులో చోటు కల్పించింది.అదే విధంగా.. ఆసియా క్రీడలు-2023లో బంగ్లాకు ఆడిన రిపర్‌ మొండాల్‌కు కూడా మళ్లీ పిలుపునిచ్చారు సెలక్టర్లు. ఈ జట్టుకు లిటన్‌ దాస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మొహమ్మద్‌ సైఫ్‌ హసన్‌ వైస్‌ కెప్టెన్‌.పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్‌ బోర్డుబంగ్లా పేసర్‌ నహీద్‌ రాణా ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌తో తొలి వన్డేలో ఒక వికెట్‌ తీయగలిగిన 23 ఏళ్ల ఈ రైటార్మ్‌ పేసర్‌.. రెండో వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగాడు. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించి బంగ్లాకు గెలుపు అందించాడు.అలాంటి ఆటగాడిని బంగ్లా బోర్డు టీ20 జట్టు నుంచి తప్పించడం గమనార్హం. కాగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఆడేందుకే నహీద్‌కు జాతీయ జట్టు నుంచి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పీఎస్‌ఎల్‌-2026లో నహీద్‌ రాణా పెషావర్‌ జెల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.జాతీయ జట్టును కాదని.. PSL వైపు మొగ్గుఇప్పటికే ఆ జట్టు తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. అయితే, వన్డే సిరీస్‌ ఆడేందుకు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. పెషావర్‌ జెల్మీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరింది. ఈ నేపథ్యంలోనే టీ20 సిరీస్‌ను కాదని మరీ.. పీఎస్‌ఎల్‌ కోసం నహీద్‌ను పాకిస్తాన్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముస్తాఫిజుర్‌ విషయంలోనూ ఇదే జరిగినట్లు సమాచారం. కాగా చమురు సంక్షోభం కారణంగా పీఎస్‌ఎల్‌ను స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తోంది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB).ఇక సీజన్‌ ఆరంభానికి ముందు అఫ్గనిస్తాన్‌పై పాక్‌ దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొనగా విదేశీ ఆటగాళ్లు ఇక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. ఈ క్రమంలో కరాచీ, లాహోర్‌ వేదికలకు మాత్రమే మ్యాచ్‌లను పరిమితం చేసింది. ఇలాంటి సమయంలో నహీద్‌ రాణా వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పంపడం ద్వారా పీఎస్‌ఎల్‌కు కాస్త ఊరట దక్కేలా చేసింది బంగ్లా బోర్డు.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్‌ జట్టులిటన్ దాస్ (కెప్టెన్), మొహమ్మద్‌ పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తాంజిద్ హసన్ తమీమ్, మొహమ్మద్‌సైఫ్ హసన్ (వైస్ కెప్టెన్), షమీమ్ హొస్సేన్ పట్వారీ, తౌహిద్ హృదయ్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషాద్‌ హొసేన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, తాంజిమ్‌ హసన్‌ సకీబ్‌, రిపన్‌ మొండాల్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌, అబ్దుల్‌ గఫార్‌ సక్లెయిన్‌.చదవండి: SRH vs DC: ఆ రెండు తప్పులే మా కొంపముంచాయి

Steve Smith Becomes AB De Villiers Against Young Pakistan Pacer8
డివిలియర్స్‌ తరహాలో రెచ్చిపోయిన స్టీవ్‌ స్మిత్‌

ఆస్ట్రేలియా వెటరన్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో చెలరేగిపోయాడు. ఈ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టీవ్‌.. నిన్న (ఏప్రిల్‌ 21) రావల్పిండిజ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 167 పరుగుల ఛేదనలో 31 బంతులు ఆడి 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి తన విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.4,6,6,6 - MADNESS BY STEVE SMITH. 🔥 pic.twitter.com/aEBz2VEXzT— Sheri. (@CallMeSheri1_) April 21, 2026ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ యువ పేసర్ రజావుల్లాపై చేసిన దాడి మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. రజావుల్లా వేసిన ఓ ఓవర్‌లో స్టీవ్‌ వరుసగా ఓ బౌండరీ, మూడు సిక్సర్లు బాది వీరంగం సృష్టించాడు. ఈ నాలుగు షాట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇందులో వికెట్ కీపర్‌పై నుంచి కొట్టిన ర్యాంప్ షాట్‌ దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేసింది.ఈ హాఫ్‌ సెంచరీ స్టీవ్‌కు సీజన్‌లో రెండవది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచే మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్‌.. ముల్తాన్ సాధించిన ప్రతి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముల్తాన్‌ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు రావల్పిండిజ్‌ ఈ మ్యాచ్‌లో ఓటమితో లీగ్‌ నుంచి నిష్క్ర​మించింది. ఈ సీజన్‌తోనే పీఎస్‌ఎల్‌ అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో బోణీ కొట్టని ఏకైక జట్టుగా నిలిచింది.ముల్తాన్‌-రావల్పిండిజ్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పిండిజ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డారిల్‌ మిచెల్‌ (58 నాటౌట్‌), డియాన్‌ ఫారెస్టర్‌ (37 నాటౌట్‌) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముల్తాన్‌ స్టీవ్‌ స్మిత్‌ (56), ఆస్టన్‌ టర్నర్‌ (37 నాటౌట్‌) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది.

All Credit Goes to Him: Ishan Kishan Lauds Abhishek Sharma Klassen9
క్రెడిట్‌ మొత్తం అతడికే.. క్లాసెన్‌ అదరగొట్టాడు: ఇషాన్‌ కిషన్‌

ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్‌ మ్యాచ్‌ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్‌ మంచి ఫినిషింగ్‌ ఇచ్చాడు. ఇలాంటి వికెట్‌ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్‌ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్‌ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్‌ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్‌ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్‌ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్‌ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్‌. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.కాగా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్‌ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు​, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్‌లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో ఇషాన్‌ మలింగ అద్భుత స్పెల్‌ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. హర్ష్‌ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్‌ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్‌ మధుషాంక, సకీబ్‌ హుసేన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026

Phil Hughes Moment In West Indies, Match Suspended As Batter Survives Close Call10
ఫిల్‌ హ్యూస్‌ తరహా ఘటన

క్రికెట్‌ వెస్టిండీస్‌ ఆథ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్‌ ఛాంపియన్‌షిప్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్‌ వివియన్‌ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్–ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్‌ ప్రమాదకరంగా మారడంలో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.ట్రినిడాడ్ పేసర్ జేడన్‌ సీల్స్‌ వేసిన బంతి, లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్‌ జెర్మియా లూయిస్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్‌ను కిందపడేసింది. ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్‌ను కాలితో తన్నడం, పిచ్‌ను కొట్టడం కనిపించింది. అనంతరం అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉందని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది.ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్‌ హ్యూస్‌ ఘటనను గుర్తు చేసింది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనలో లూయిస్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించినప్పటికీ, పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement