ప్రధాన వార్తలు
సౌతాఫ్రికా విజయం.. రసపట్టులో టీ20 సిరీస్!
న్యూజిలాండ్, సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ రసవత్తరంగా మారింది. ఆదివారం వెల్లింగ్టన్ వేదికగ2ఆ జరిగిన నాలుగో టీ20లో దక్షిణాఫ్రికా 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా 2-2తో రెండు జట్లు సమంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కొన్నర్ ఎస్తర్హూజిన్ (36 బంతుల్లో 57, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవవగా, రుబిన్ హెర్మన్ (28 నాటౌట్), టోనీ డి జోర్జి (23) రాణించారు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. టిమ్ రాబిన్సన్ (22 బంతుల్లో 32) టాప్ స్కోరర్గా నిలవగా, డేన్ క్లెవర్ (26) పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 3 వికెట్లు పడగొట్టగా, బార్త్మన్, సుబ్రెయన్, కేశవ్ మహరాజ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అర్థసెంచరీతో మెరిసిన ఎస్తర్హుజిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. వియాన్ ముల్డర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత టోనీ డిజార్జి, ఎస్తర్ హుజిన్లు రెండో వికెట్కు 81 పరుగులు జోడించి సఫారీ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. టోనీ ఔటైన తర్వాత కఈజులోకి వచ్చిన రుబిన్ హెర్మన్ ధాటిగా ఆడాడు. ఎస్తర్హుజిన్ పెవిలియన్ చేరిన తర్వాత ఇన్నింగ్స్ చివర్లో జాసన్ స్మిత్, డియాన్ ఫెరస్టర్లు బ్యాట్ ఝలిపించడంతో సౌతాఫ్రికా గౌరప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం ఛేదనలో ఆది నుంచే తడబడిన న్యూజిలాండ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టీ20 బుధవారం జరగనుంది.
పంజాబ్ కింగ్స్లో లుకలుకలు!
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ది ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్నట్లుగా ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి కొనసాగుతున్న ఫ్రాంచైజీల్లో పంజాబ్ కూడా ఒకటి. అయితే 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరుకున్న సందర్భాలు మూడుసార్లు మాత్రమే. అయితే గత సీజన్లో జట్టును మొత్తం ప్రక్షాళన చేసిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలై రన్నరప్కే పరిమితమైంది. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ యాజమాన్యంలో తలెత్తిన వివాదాల కారణంగానే ఇన్నేళ్లుగా వెనుకబడిపోయిందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. పంజాబ్ కింగ్స్లో తెరవెనుక పరిస్థితులు ఎప్పుడూ సాఫీగా సాగలేదని, ఏదో ఒక విషయంలో లుకలుకలు తలెత్తేవని తెలిపాడు. పఠాన్ మాట్లాడుతూ.. ‘2008 తొలి సీజన్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ (అప్పటిక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)ప్లేఆఫ్స్కు చేరింది. తొలి సీజన్ తర్వాత పంజాబ్ క్రమంగా తమ పట్టును కోల్పోయింది. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ మూడో ఏడాదికే కెప్టెన్సీ మారిపోయింది. అదే వివాదాలకు దారి తీసింది. యాజమానులు, కోచ్లు ఇద్దరూ క్రికెట్పై కనీస అవగాహన లేనివారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి. ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేది. నిజానికి పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతిజింటా ఎక్కువ వాటా ఉన్నప్పటికీ, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా జట్టులో భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్టనర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో అది ప్రదర్శనపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 18 ఏళ్లలో పంజాబ్ కింగ్స్కు 12 మంది కెప్టెన్లు మారడంతో జట్టుపై నమ్మకం తగ్గిపోయింది. ఇప్పుడు అది జట్టుపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ను సరైన దిశలో నడిపిస్తాడనే నమ్మకం కలుగుతున్నది. కాగా పఠాన్ ఐపీఎల్లో తొలి మూడు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 42 మ్యాచ్ల్లో 47 వికెట్లు పడగొట్టడంతో పాటు 603 పరుగులు సాధించాడు. చదవండి: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది'
అంచనాలు అందుకుంటాం!
ఐపీఎల్ 2026 సీజన్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ కింగ్స్కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రధాన బలం. గతేడాది సీజన్లో కెప్టెన్ా అయ్యర్ పంజాబ్ను ఫైనల్ చేర్చాడు. కానీ తుది పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి రన్నరప్కే పరిమితమయింది. కానీ ఈసారి మాత్రం అభిమానులు తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఐపీఎల్ కప్పు కొల్లగొడతామని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్కు సిద్ధమవుతున్న తరుణంలో అయ్యర్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు.‘గాయం వల్ల నేను దాదాపు ఏడు కేజీలు బరువు తగ్గాను. దాని నుంచి కోలుకొని రావడం పెద్ద సవాల్గా నిలిచింది. నాకైన గాయం చాలా ప్రమాదకరమైనది. అయితే రెండు నెలల తీవ్రంగా కష్టపడిన తర్వాత ఇప్పుడు శరీరాకృతి బాగుంది. కానీ ఫిట్గా ఉంటూనే ఏడు కేజీల బరువు పెరగాలంటే చాలా శ్రమించాలి. నాకు సవాళ్లు అంటే చాలా ఇష్టం. తప్పకుండా పరిస్థితిని అధిగమిస్తా. ఇలాంటివి ఎన్నోసార్లు అనుభవించా. కమ్బ్యాక్ చేసి భారత జట్టుకు ఆడిన రోజులు ఉన్నాయి. గతేడాది మేం ఫైనల్కు వచ్చాం. రన్నరప్గా నిలిచాం.దీంతో ఈసారి మాపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడానికి కష్టపడతాం. విజయాలు సాధించి ట్రోఫీని అందుకుంటాం. ప్రతి మ్యాచ్కు మూడు రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మైదానం ఆవల ఉండే బాండింగ్తోనే మ్యాచ్లో మెరుగ్గా రాణించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది’ అని శ్రేయస్ తెలిపాడు. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.చదవండి: అయోధ్య రాముడి సేవలో లక్నో జట్టు
నాలుగో టీ20లో సౌతాఫ్రికా చిత్తు.. సిరీస్ న్యూజిలాండ్ సొంతం
వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మహిళలతో జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ ఉమెన్స్ టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1తో న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ప్రోటీస్ ఆల్రౌండర్ అనేరీ డెర్క్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 55 పరుగులు చేసింది. ఆమెతో పాటు లాస్ 30 పరుగులతో రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 3 వికెట్లతో అదరగొట్టింది. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ స్టార్ ఆల్రౌండర్ సోఫీ డివైన్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీలియా కేర్ 31 పరుగులతో రాణించింది. సౌతాఫ్రికా బౌలర్లలో క్లో ట్రయాన్ 2 వికెట్లు తీసింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20 క్రైస్ట్చర్చ్ వేదికగా మార్చి 25న జరగనుంది.చదవండి: IPL 2026: '250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది'
'250 స్కోర్ కొట్టినా.. సన్రైజర్స్ ఓడిపోతుంది'
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. గత సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్.. ఈసారి మాత్రం ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆరెంజ్ ఆర్మీ తమ హోం గ్రౌండ్లో ప్రాక్టీస్ను మొదలు పెట్టింది.అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడం ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ సీజన్ మధ్యలో ఎస్ఆర్హెచ్ జట్టులో చేరే అవకాశముంది. దీంతో అప్పటివరకు సన్రైజర్స్ జట్టును స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నడిపించనున్నాడు. మరోవైపు గత సీజన్లో దుమ్ములేపిన శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగ అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది.అంతేకాకుండా వేలంలో కొన్న బౌలింగ్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ను బౌలింగ్ కష్టాలు వెంటాడడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత ఎస్ఆర్హెచ్ జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ తప్ప చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్ అంటూ లేరు.ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్కు బౌలింగ్ అతి పెద్ద సవాలుగా మారనుందని అతడు అభిప్రాయపడ్డాడు."కమ్మిన్స్, మలింగ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం చాలా వీక్గా కన్పిస్తోంది. కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయి. బ్రైడన్ కార్స్ జట్టులో ఉన్నప్పటికి ఉపఖండ పిచ్లపై అతడికి అనుభవం లేదు. అలా అని కేవలం భారత బౌలర్లతో ఆడడం చాలా ప్రమాదకరం. జట్టులో అమిత్ కుమార్, ప్రఫుల్ హింజ్, సాకిబ్ హుస్సేన్, ఓంకర్ తర్మాలే, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ హర్ష్ దూబే వంటి యువ బౌలర్లు ఉన్నారు.హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్కు మాత్రమే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. ఈ బలహీనమైన బౌలింగ్ లైనప్తో ఎస్ఆర్హెచ్ ఎలా మేనెజ్చేస్తోందో ఆర్ధం కావడం లేదు. ఒకవేళ బ్యాటర్లు 250 పరుగులు చేసినా, బౌలర్లు ఆ టోటల్ను డిఫెండ్ చేసుకునేలా లేరు" అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్లోకి
వేలంలో అన్సోల్డ్.. కట్ చేస్తే! ఇప్పుడు కేకేఆర్లోకి
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కాగా.. ఇప్పుడు మరో ఫాస్ట్ బౌలర్ ఈ జాబితాలోకి చేరాడు. స్పీడ్ స్టార్ ఆకాష్ దీప్ సైతం గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకొన్నాడు.మరోవైపు శ్రీలంక మతీషా పతిరానకు ఇంకా ఎన్వోసీ లభించలేదు. అతడు ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బంగ్లాస్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను కూడా కేకేఆర్ కోల్పోయింది. అతడి స్ధానంలో ఇప్పటికే జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజరాబానీని జట్టులోకి కేకేఆర్ తీసుకుంది. అయితే ఇప్పుడు హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ స్ధానాలను భర్తీ చేసే పనిలో పడింది.కేకేఆర్లోకి సిమర్జీత్ హర్షిత్ రాణా స్ధానంలో ఢిల్లీ పేసర్ సిమర్జీత్ సింగ్ను తీసుకోవాలని కేకేఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడిని ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సిమర్జీత్ గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. అంతకుముందు సీఎస్కే తరపున మూడు సీజన్ల పాటు ఆడాడు. పవర్ప్లేలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా అద్భుతమైన యార్కర్లు కూడా సంధించగలడు. అయితే గతేడాది జరిగిన వేలంలో మాత్రం అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఇప్పుడు హర్షిత్ రాణా గాయం రూపంలో అతడికి మరోసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కనుంది. ఇక ఆకాష్ దీప్ స్ధానాన్ని ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ ఆకాశ్ మధ్వాల్తో భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్వాల్కు ఐపీఎల్ అనుభవం ఉంది. ఐపీఎల్-2023 ఎలిమినేటర్లో 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. అయితే మధ్వాల్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా!? ఎప్పుడంటే?
భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడుతున్నాయా? ఈ ఏడాది ఆగస్టులో బంగ్లా పర్యటనకు టీమిండియా వెళ్లనుందా? అంటే అవునానే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి గతేడాది జూలైలో బంగ్లాదేశ్ టూర్కు భారత్ వెళ్లాల్సి ఉండేది. కానీ అదే సమయంలో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. బంగ్లాలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో ఈ వైట్బాల్ సిరీస్ను 2026 ఆగస్టుకు వాయిదా వేశారు. కానీ ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో ఈ వైట్బాల్ సిరీస్లపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఐపీఎల్ నుంచి ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ను బీసీసీఐ తప్పించింది.అందుకు నిరసనగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకొంది. దీంతో పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లా-భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడడ ఇక కష్టమే అని అంతా భావించారు. కానీ బంగ్లాదేశ్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. దీంతో భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్ ప్రకారం జరగనున్నట్లు బంగ్లా క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆగస్టులో కాకుండా ఈ సిరీస్లో సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది."భారత్ పర్యటను సెప్టెంబర్కు ఐర్లాండ్ సిరీస్ను మరో విండోలో నిర్వహించాలని కోరాము. కానీ వారి బీజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఐరీష్ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నామని" ఓ బీసీబీ సీనియర్ అధికారి క్రిక్బజ్తో పేర్కొన్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.చదవండి: ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ
ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఈ ధనధాన్ క్రికెట్ పండగ మార్చి 28 నుంచి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. గత సీజన్లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఈ ఏడాది ఎలా రాణిస్తాడో అని అందరూ వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఐపీఎల్-2025 సీజన్తో పాటు అండర్-19 క్రికెట్ స్ధాయిలో వైభవ్ దుమ్ములేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్ది కీలక పాత్ర. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ సత్తాచాటేందుకు వైభవ్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు? అని సదరు విలేఖరి ప్రశ్నించాడు.అందుకు వైభవ్ నవ్వుతూ.. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుండి మూడు వేల పరుగులు చేస్తానని చెబుతా అని బదులిచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఎక్స్లో షేర్ చేసింది.అయితే ఇదే ప్రశ్నకు వైభవ్ తర్వాత సీరియస్గా సమాధనమిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను సహజశైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగత మైలురాయిల కంటే జట్టుకు ట్రోఫీ అందించడమే నా ప్రధాన లక్ష్యం" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: IPL 2026: ఇషాన్ కిషన్పై యువ ప్లేయర్ సీరియస్..
ఇషాన్ కిషన్పై యువ ప్లేయర్ సీరియస్..
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. గత సీజన్లో లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్.. ఈసారి మాత్రం టైటిల్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో శనివారం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్కు వింత అనుభవం ఎదురైంది. సన్రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ.. కిషన్పై సీరియస్ అయ్యాడు.అసలేమి జరిగిందంటే?మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 8వ ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్లో కిషన్ తొలి నాలుగు బంతులను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. అయితే ఆ తర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుతమైన ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. కిషన్ డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్న ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే జీషన్ అన్సారీ మాత్రం కిషన్కు ఫైరీ సెంఢాప్ ఇచ్చాడు. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక ఆడింది చాలు, పెవిలియన్కు వెళ్లిపోమని సైగ చూశాడు. జీషన్ రియాక్షన్ చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. కిషన్ మాత్రం నవ్వుతూ డగౌట్కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు.Send off to Ishan Kishan 🤯During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.The team atmosphere doesn’t seem to be very good.pic.twitter.com/3b75QtTh3F— Stubbsy (@spideypant_) March 21, 2026చదవండి: IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్తో అన్ని జట్లను భయపెడుతున్నారు. శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.సన్రైజర్స్ రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత సన్రైజర్స్-ఎ జట్టు తరపున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.అతడి ఇన్నింగ్స్లో 7 సిక్స్లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతడితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్-ఎ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సన్రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంతరం సన్రైజర్స్ బి టీమ్ తరపున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శర్మ(4) నిరాశపరిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨 He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥 He nearly Missed well deserved hundred Will IPL 2026 gonna be going hot for Abhishek's career ?? pic.twitter.com/dDaFiYgKQi— Kiara (@crickiara) March 21, 2026
మెస్సీ @ 900 గోల్స్
ఫోర్ట్ లాడెర్డేల్ (అమెరికా): అర్జెంటీనా స్టార్...
క్వార్టర్స్లో తాన్వి, మాళవిక
ఓర్లియాన్స్ (ఫ్రాన్స్): ఓర్లియాన్స్ మాస్టర్స్ ...
2028లో భారత్లో వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్కు ఆతి...
అమెరికాపై వెనిజులా చరిత్రాత్మక విజయం
వెనిజులా బేస్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. రాజక...
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైద...
పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్
ఆసియాకప్-2025 సందర్భంగా ఓ పాకిస్తానీ టీవీ క్రికెట...
ఐపీఎల్కు ఆకాశ్దీప్ దూరం
కోల్కతా: మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నై...
జూన్లో ఐర్లాండ్లో భారత్ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్లో ఐర్లాండ్లో భారత పురుష...
క్రీడలు
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)
వీడియోలు
మాతో పెట్టుకోవద్దు.. పాక్కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్
అమ్మకంలో కూడా తగ్గని క్రేజ్... RCB టీమ్ కొత్త ఓనర్ ఎవరంటే..?
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
CSK డెన్ లోకి చెట్టా గ్రాండ్ ఎంట్రీ
తిలక్ వర్మకు పెద్ది బ్యాట్ గిఫ్ట్ V ఇచ్చిన రామ్ చరణ్
సంజూ ఎంట్రీ వెనుక గేమ్ ప్లాన్..అసలు విషయం రివీల్ చేసిన గంభీర్
టీం ఇండియా కొత్త కోచ్ గా MS ధోని
SRHకు ఫ్యాన్స్ కు షాక్.. కమిన్స్ లేకుండానే బరిలోకి..
కేఎల్ రాహుల్-సంజూ.. నామన్ అవార్డ్స్లో హార్ట్ టచింగ్ మూమెంట్
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
