Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

TG20 League 2026: Anurag Nalgonda Knights beat Karimnagar Diamonds1
రాణించిన నితీశ్‌ రెడ్డి.. కరీంనగర్‌పై నల్గొండ గెలుపు

టీజీ20 లీగ్‌ 2026లో నల్గొండ నైట్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్‌ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్‌ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో).వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ జట్టు.. నల్గొండ బౌలర్లు వరుణ్‌ గౌడ్‌ (2-0-8-3), రక్షణ్‌ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ​్‌ ఖాన్‌ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది.కరీంనగర్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. మిగతా ప్లేయర్లలో షరన్‌ (15), షుభమ్‌ శర్మ (20), హరిశ్‌ ఠాకూర్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం లక్ష్య ఛేదనకు ముందు వరుణుడు మరోసారి ఆటకు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. ఛేదనలో నల్గొండ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా, నితీశ్‌ రెడ్డి (52), దివేశ్‌ సింగ్‌ (36 నాటౌట్‌) బాధ్యతాయుంగా ఆడారు. నితీశ్‌ నల్గొండను గెలుపు తీరాలకు చేర్చిన తర్వాత ఔట్‌ కాగా.. దివేశ్‌, అర్ఫాజ్‌ ఖాన్‌ (6 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో 18 బంతులు మిగిలుండగానే నల్గొండ జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.

KL Rahul vs Rishabh Pant: IPL Captaincy Stats Comparison2
రాహుల్‌ వర్సెస్‌ పంత్‌.. ఢిల్లీ కెప్టెన్‌ ఎవరైతే బాగుంటుంది..?

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు జరిగిన భారీ ట్రేడ్‌లో రిషబ్‌ పంత్‌ లక్నో నుంచి ఢిల్లీకి చేరగా.. ఢిల్లీ నుంచి కుల్దీప్‌ యాదవ్‌ లక్నోకు వెళ్లిపోయాడు. పంత్‌ తిరిగి ఢిల్లీకి చేరడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతున్నప్పటికీ.. జట్టు కెప్టెన్‌గా ఎవరుంటారన్నది ప్రస్తుతం అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ కొనసాగుతుండగా.. వచ్చే సీజన్‌లో అతన్ని తప్పించి కేఎల్‌ రాహుల్‌కు పగ్గాలు అప్పజెబుతారని ప్రచారం జరిగింది. ఈలోపే లక్నో కెప్టెన్‌గా ఉన్న పంత్‌ ఢిల్లీకి చేరాడు. పంత్‌ చేరికతో ఢిల్లీ కెప్టెన్సీ కోసం ట్రయాంగులర్‌ ఫైట్‌ నెలకొన్నట్లు కనిపిస్తుంది.2027 సీజన్‌లో కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటినుంచే తలలు పట్టుకొని కూర్చుంది. గత సీజన్‌కు ముందు తొలుత రాహుల్‌నే కెప్టెన్‌గా నియమించాలని డీసీ యాజమాన్యం భావించినప్పటికీ.. అతడు అయిష్టత వ్యక్తం చేయడంతో అక్షర్‌కు పగ్గాలు అప్పజెప్పింది.అయితే గత సీజన్‌లో అక్షర్‌ జట్టును విజయవంతంగా నడిపించలేకపోవడంతో యాజామాన్యం మరోసారి రాహుల్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈలోపు అనూహ్యంగా పంత్‌ జట్టులోకి వచ్చాడు. పంత్‌కు గతంలో డీసీ కెప్టెన్‌గా ఓ మోస్తరు ట్రాక్‌ రికార్డు ఉండటంతో కెప్టెన్సీ విషయంలో యాజమాన్యం గందరగోళంలో పడింది.ఈ నేపథ్యంలో తదుపరి సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరుంటే బాగుంటుందనే చర్చ అభిమానుల్లో జోరందుకుంది. గణాంకాలను బట్టి చూస్తే పంత్‌ కంటే రాహుల్‌కే మెరుగైన ట్రాక్‌ రికార్డు ఉంది. పంత్‌ 2021 నుంచి 2026 మధ్య 71 మ్యాచ్‌ల్లో నాయకత్వం (ఢిల్లీ, లక్నో) వహించగా.. 33 విజయాలు, 36 పరాజయాలు, రెండు టై ఫలితాలు నమోదయ్యాయి. అతడి విజయశాతం 46.47 శాతంగా ఉంది.రాహుల్‌ విషయానికొస్తే.. 2020 నుంచి 2024 మధ్య అతడు 64 మ్యాచ్‌ల్లో జట్లను నడిపించాడు. ఇందులో 31 విజయాలు, 31 పరాజయాలు, రెండు టై ఫలితాలు సాధించాడు. అతడి విజయాల శాతం 48.43గా ఉంది. డీసీ యాజమాన్యం గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే, రాహుల్‌వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. పైగా అతడు వ్యక్తిగతంగానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాకుండా గత రెండు సీజన్‌లుగా ఢిల్లీ జట్టులో కొనసాగుతూ సహచర ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది, యాజమాన్యంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ లెక్కన యాజమాన్యంతో పాటు బృంద సభ్యులు, అభిమానులు రాహుల్‌కే ఓటేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం యాజమాన్యానిదే.

New Zealand Lose Key Player Before Series Decider vs England3
సిరీస్‌ డిసైడర్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌

ఇంగ్లండ్‌తో సిరీస్‌ డిసైడర్‌ టెస్ట్‌ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. జేమీసన్‌ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడుతున్నాడు.అతడి పనిభారాన్ని నియంత్రించేందుకు జట్టు యాజమాన్యం ముందుగానే మూడో టెస్ట్‌కు విశ్రాంతినివ్వాలని డిసైడ్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ ఇదివరకే వెల్లడించాడు.జేమీసన్‌ ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు కీలక బౌలర్‌గా నిలిచాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి, మ్యాచ్‌ మొత్తం ఆరు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓడిపోయినప్పటికీ, అతడి బౌలింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తర్వాత ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో కూడా అతడు నాలుగు వికెట్లు సాధించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్‌ 253 పరుగుల భారీ విజయానికి బాటలు వేశాడు. రెండు టెస్టుల్లో మొత్తం 10 వికెట్లు తీసిన జేమీసన్‌ సగటు 24.20గా ఉండటం అతడి ప్రభావాన్ని తెలియజేస్తోంది.జేమీసన్‌ స్థానంలో వైట్‌బాల్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడో టెస్ట్‌ నాటింగ్హమ్‌ వేదికగా రేపటి నుంచి (జూన్‌ 25) ప్రారంభం కానుంది. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌ 1-1తో సమంగా ఉంది.తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో టెస్టులో న్యూజిలాండ్‌ అద్భుతంగా పునరాగమనం చేసి సిరీస్‌ను సమం చేసింది. దీంతో మూడో టెస్టు విజేతే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల దృష్ట్యా కూడా ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 66.67 శాతం పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ రేసులోనూ ముందంజ వేయాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

INDIA A vs SRI LANKA A FOUR DAY MATCHES START TOMORROW4
రేపటి నుంచి భారత్‌-శ్రీలంక తొలి టెస్ట్‌

శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్‌ సిరీస్‌ను విజయవంతంగా ముగించిన భారత్‌-ఏ జట్టు ఇప్పుడు రెడ్‌బాల్‌ క్రికెట్‌పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్‌ రేపటి నుంచి (జూన్‌ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. భారత్‌-ఏ జట్టుకు వికెట్‌కీపర్‌-బ్యాటర్‌ ధృవ్‌ జురెల్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్‌కు ఇది కెప్టెన్‌గా కీలక అవకాశం. జట్టు వైస్‌ కెప్టెన్‌గా దేవదత్‌ పడిక్కల్‌ వ్యవహరించనున్నాడు. ఇటీవల ముగిసిన ట్రై-నేషన్‌ ‘ఏ’ సిరీస్‌లో భారత్‌-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్‌లో కొనసాగించాలని భారత్‌-ఏ లక్ష్యంగా పెట్టుకుంది. గాలే పిచ్‌ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్‌ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్‌ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.జట్ల వివరాలు..భారత ఏ జట్టు: సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, అమన్‌ మోఖడే, ఆయుశ్‌ పాండే, షేక్‌ రషీద్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, హర్షిత్‌ దూబే, అన్షుల్‌ కంబోజ్‌, సరాన్ష్‌ జైన్‌, ఆకిబ్‌ నబీ దార్‌, ధృవ్‌ జురెల్‌, ఎన్‌ జగదీశన్‌, గుర్నూర్‌ బ్రార్‌, యశ్‌ ఠాకూర్‌, జీషన్‌ అన్సారీశ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్‌ బండార, అహాన్‌ విక్రమసింఘే, అసంక మనోజ్‌, పవంత వీరసింఘే, సహాన్‌ అరచ్చిగే (కెప్టెన్‌), రవిందు ఫెర్నాండో, దిలుమ్‌ సుదీర, ప్రవీణ్‌ మనీషా, కేషారా నువంత, సోహన్‌ డి లివేరా, నిరోషన్‌ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్‌ షిరాజ్‌, చమిక గుణశేఖర, దులాజ్‌ సముదిత,

TG20 League 2026: Anurag Nalgonda Knights vs Karimnagar Diamonds match updates5
కరీంనగర్‌పై నల్గొండ గెలుపు

కరీంనగర్‌పై నల్గొండ గెలుపుటీజీ20 లీగ్‌ 2026లో నల్గొండ నైట్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ (జూన్‌ 24) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కరీంనగర్‌ డైమండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో). లక్ష్యం దిశగా సాగుతున్న నల్గొండవరుణుడు అంతరాయం కలిగించడంతో నల్గొండ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 117 పరుగులకు కుదించారు. 10 ఓవర్ల తర్వాత నల్గొండ స్కోర్‌ 76-3గా ఉంది. ఆ జట్టు గెలవాలంటే మరో 42 బంతుల్లో 41 పరుగులు చేయాలి. చెలరేగిన రక్షణ్‌, వరుణ్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కరీంనగర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీంనగర్‌ జట్టు.. నల్గొండ బౌలర్లు వరున్‌ గౌడ్‌ (2-0-8-3), రక్షణ్‌ రెడ్డి (3-0-13-3), అర్ఫాజ్‌ ఖాన్‌ (4-0-29-2) ధాటికి 20 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (46) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌ చేయగా.. షరన్‌ (15), షుభమ్‌ శర్మ (20), హరిశ్‌ ఠాకూర్‌ (21) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కష్టాల్లో కరీంనగర్‌వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్‌ తిరిగి మొదలైంది. వర్షానికి ముందే 9వ ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. అదే ఓవర్‌ చివరి బంతికి, మరుసటి ఓవర్‌ తొలి బంతికి మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత 14 ఓవర్‌ వరకు జాగ్రత్తగా ఆడిన కరీంనగర్‌.. 15వ ఓవర్‌ మూడో బంతికి మరో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. రక్షణ్‌ రెడ్డి బౌలింగ్‌లో షుభమ్‌ శర్మ (20) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 102-6గా ఉంది. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు కోల్పోయిన కరీంనగర్‌కరీంనగర్‌ జట్టు 9వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. వరుణ్‌ గౌడ్‌ బౌలింగ్‌లో తొలుత సాత్విక్‌ రెడ్డి (1), ఆతర్వాత షరణ్‌ (15) ఔటయ్యారు. తొలి వికెట్‌ కోల్పోయిన కరీంనగర్‌.. 8 ఓవర్ల తర్వాత స్కోర్‌ ఎంతంటే..?7.1వ ఓవర్‌- 61 పరుగుల వద్ద కరీంనగర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న తన్మయ్‌ అగర్వాల్‌ (46) అర్ఫాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 62-1గా ఉంది.టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న నల్గొండటీజీ20 లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ (జూన్‌ 23) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో అనురాగ్‌ నల్గొండ నైట్స్‌, కరీంనగర్‌ డైమండ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నల్గొండ జట్టు టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు..నల్గొండ నైట్స్‌:రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), ప్రణవ్‌ సూర్యదేవర, అనికేత్‌ రెడ్డి, గౌరవ్‌ రెడ్డి, పి. నితీశ్‌ రెడ్డి, వరుణ్‌ గౌడ్‌, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, టి. హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), దివేశ్‌ సింగ్‌, చిన్నట్ల ర‍క్షణ్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను. కరీంనగర్‌ డైమండ్స్:తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), సాయి శరణ్‌ రావూరి, సాత్విక్‌ రెడ్డి, రాహుల్‌ రాదేశ్‌, చందన్‌ సహాని, నారాయణ తేజ టీవీఎస్‌, హరీశ్‌ ఠాకూర్‌, శుభమ్‌ శర్మ, సతీశ్‌ కుమార్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, దినేశ్‌ రాథోడ్‌

Vaibhav Suryavanshi brother Aashirvad slams another brilliant century6
వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడి మరో భారీ సెంచరీ.. పదేళ్లకే!

భారత సంచలన క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుతం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌లో ఉన్నాడు. అతడి అంతర్జాతీయ టీ20 అరంగేట్రం దాదాపుగా ఖరారై పోయింది. ఇలాంటి తరుణంలో వైభవ్‌ సూర్యవంశీ.. తన తమ్ముడి గురించి షేర్‌ చేసిన పోస్టు వైరల్‌గా మారింది.టీమిండియాతో ఐర్లాండ్‌కుబిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పద్నాలుగేళ్లకే రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు. రాయల్స్‌ ఓపెనర్‌గా 2025లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 2026లో సంచలన ప్రదర్శనతో మెరిశాడు.ఆరెంజ్‌ క్యాప్‌పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ అత్యధిక పరుగుల వీరుడిగా.. ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో భారత్‌- ‘ఎ’ జట్టుతో పాటు.. టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు పదిహేనేళ్ల వైభవ్‌. ఇక శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్‌ లీగ్‌ దశలో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.అయితే, ఫైనల్‌ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించిన వైభవ్‌.. జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం టీమిండియాతో కలిసి ఐర్లాండ్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో తన తమ్ముడి విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ ఇన్‌స్టా స్టోరీ షేర్‌ చేశాడు.తమ్ముడూ తగ్గేదేలేసమస్తిపూర్‌ స్థానిక ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రిషవ్‌ ఎలెవన్‌కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్‌ తమ్ముడు, పదేళ్ల ఆశీర్వాద్‌ సూర్యవంశీ.. భారీ శతకం సాధించాడు. వైశాలి ఎలెవన్‌పై 119 బంతుల్లో 19 బౌండరీలు, ఆరు సిక్సర్లు బాది 168 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా దిగిన ఆశీర్వాద్‌ శతక ఇన్నింగ్స్‌ కారణంగా రిషవ్‌ ఎలెవన్‌ ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన స్కోరు కార్డును షేర్‌ చేస్తూ తమ్ముడి ప్రదర్శన పట్ల వైభవ్‌ మురిసిపోయాడు.కాగా ఆశీర్వాద్‌ ఇటీవలే తేజ్‌పూర్‌ క్రికెట్‌ అకాడమీ తరఫున మ్యాచ్‌ ఆడి.. 87 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. ఇప్పుడిలా మరో సెంచరీ సాధించాడు. కాగా వైభవ్‌కు అన్న ఉజ్వల్‌, తమ్ముడు ఆశీర్వాద్‌ ఉన్నారు. చదవండి: డ్రెసింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ!

Jasprit Bumrah Challenged By Another Pacer, ICC Declares New No. 1 In Rankings7
బుమ్రాకు పోటీ.. కొత్త నంబర్‌ వన్‌

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు సుకున్నాయి. ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌, భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డేలు, శ్రీలంక-వెస్టిండీస్ టీ20 సిరీస్‌ల ప్రదర్శనల ఆధారంగా పలువురు ఆటగాళ్ల ర్యాంకులు మారాయి. ముఖ్యంగా టెస్టు బౌలర్ల విభాగంలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాకు గట్టి సవాల్ ఎదురైంది.న్యూజిలాండ్ ఫాస్ట్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టి బుమ్రాతో కలిసి సంయుక్త నంబర్‌-1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇద్దరూ ప్రస్తుతం 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఒంటరిగా ఉన్న బుమ్రాకు ఇప్పుడు హెన్రీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హెన్రీ ఏకంగా 6 స్థానాలు ఎగబాకి టాప్‌ ప్లేస్‌కు దూసుకొచ్చాడు.ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో హెన్రీ అసాధారణ ప్రతిభ కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి మొత్తం 11 వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అతడి ప్రదర్శనతో న్యూజిలాండ్ సిరీస్‌ను 1-1తో సమం చేసుకోగలిగింది. ఇంగ్లండ్‌పై ఒక టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఇవే.మరోవైపు టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ మళ్లీ నంబర్‌-1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల అగ్రస్థానాన్ని దక్కించుకున్న హ్యారీ బ్రూక్‌ రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ చేసిన 77 పరుగుల ఇన్నింగ్స్ అతడిని తిరిగి అగ్రస్థానానికి చేర్చింది. ప్రస్తుతం రూట్ 871 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హ్యారీ బ్రూక్ 866 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.వన్డే ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌ కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 238 పరుగులు చేసిన అతడు.. మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 791 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. 815 పాయింట్లు కలిగిన డారిల్‌ మిచెల్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.అదే సమయంలో మూడు సంవత్సరాల తర్వాత వన్డేల్లోకి తిరిగి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ ర్యాంక్‌కు చేరుకోగా, యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ ఏకంగా 84 స్థానాలు ఎగబాకి 71వ స్థానంలో నిలిచాడు.ఇతర ముఖ్య మార్పుల్లో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ 13 స్థానాలు మెరుగుపరుచుకుని 40వ ర్యాంక్‌కు (టెస్ట్‌) చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాట్‌ రెన్షా టీ20 బ్యాటర్ల జాబితాలో 70 స్థానాలు ఎగబాకాడు. భారత పేసర్ అర్షదీప్‌ సింగ్‌ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ ర్యాంక్‌కు (వన్డేల్లో) చేరుకున్నాడు.

TG20 League 2026: Warangal Warriors Harshit Choudhary Slams 48 Ball 1008
శతక్కొట్టిన హర్షిత్‌ చౌదరి.. బోణీ కొట్టిన వరంగల్‌

తెలంగాణ టీ20 లీగ్‌-2026 (టీజీ20)లో మూడో శతకం నమోదైంది. వరంగల్‌ వారియర్స్‌ ఓపెనర్‌ హర్షిత్‌ చౌదరి శతక్కొట్టాడు. ఖమ్మం ఏసెస్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 48 బంతుల్లో హర్షిత్‌ వంద పరుగుల మార్కు అందుకున్నాడు. అతడి శతక ఇన్నింగ్స్‌లో తొ మ్మిది ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.వరంగల్‌కు తొలుత ఓటమికాగా జూన్‌ 21న టీజీ20 లీగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్‌ వారియర్స్‌ కెప్టెన్‌ అమన్‌ రావు లీగ్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఉప్పల్‌ వేదికగా సోమవారం మెదక్‌ ఫాల్కన్స్‌పై 32 బంతుల్లోనే శతక్కొట్టాడు.తద్వారా లీగ్‌లో మొట్టమొదటి సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు ఈ కరీంనగర్‌ అబ్బాయి. అయితే, ఆ వెంటనే మెదక్‌ సారథి తిలక్‌ వర్మ కూడా సెంచరీ చేసి.. లీగ్‌లో రెండో శతకం నమోదు చేయడంతో పాటు.. వరంగల్‌పై తన జట్టుకు విజయం అందించాడు.ఖమ్మం స్కోరు 202తాజాగా తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ఖమ్మం ఏసెస్‌ను ఎదుర్కొన్న వరంగల్‌.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఖమ్మం బ్యాటర్లలో మయాంక్‌ గుప్త (54), మికిల్‌ జైస్వాల్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు.చెలరేగిన హర్షిత్‌.. వరంగల్‌ బోణీవరంగల్‌ బౌలర్లలో మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, అభిషేక్‌ చెరో మూడు వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, హుసేన్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్‌ ఆదిలోనే కెప్టెన్‌ అమన్‌రావు (7) వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ హర్షిత్‌ చౌదరి శతకంతో చెలరేగాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొన్న హర్షిత్‌ పదకొండు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో రిషికేత్‌ సిసోడియా (27) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో వరంగల్‌ను విజయతీరాలకు చేర్చాడు హర్షిత్‌ చౌదరి. ఫలితంగా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వరంగల్‌.. ఖమ్మంపై ఐదు వికెట్ల తేడాతో (208-5) విజయం సాధించింది.ఇక సీజన్‌లో వరంగల్‌కు ఇదే తొలి గెలుపు. టీమిండియా స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ వరంగల్‌ జట్టుతో పాటు స్టేడియానికి వచ్చినప్పటికీ.. అతడు విశ్రాంతి తీసుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో వరంగల్‌ తరఫున సిరాజ్‌ బరిలో దిగనున్నాడు.చదవండి: డ్రెసింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కి నో ఎంట్రీ!One of the finest knocks Uppal has seen! 🤩A hundred that raised the bar for batters all over!Harshit Choudhary deserves ALL the accolades, leading his side to a memorable first win. ⚡️#AKAvWW #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/fQrjo7xfgE— tg20official (@tg20official) June 24, 2026

Vaibhav Sooryavanshi Barred From Indian Dressing Room For UK Tour9
డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

వండర్‌కిడ్‌ వైభవ్‌ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికైనా, అతడికి జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి మాత్రం ప్రవేశం లేదు. ఎందుకంటే, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ), అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అమలు చేస్తున్న బాలల భద్రతా నిబంధనల ప్రకారం, 16 ఏళ్ల లోపు ఆటగాళ్లు పూర్తిస్థాయి పెద్దల డ్రెస్సింగ్‌ రూమ్‌లను ఉపయోగించకూడదు. ఈ నిబంధనల నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్‌ కోసం ఈసీబీ ప్రత్యేక డ్రెస్సింగ్‌ రూమ్‌ కేటాయించింది.మ్యాచ్‌ల సమయంలో మాత్రం వైభవ్‌ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లవచ్చు. సహచర ఆటగాళ్లతో మాట్లాడడం, జట్టు సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ మ్యాచ్‌కు ముందు, తర్వాత దుస్తులు మార్చుకోవడం వంటి కార్యక్రమాల కోసం తప్పనిసరిగా ప్రత్యేక గదినే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈసీబీ ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.ప్రస్తుతం వైభవ్‌ ఎదుర్కొంటున్న పరిస్థితినే 15 ఏళ్ల మ్యాక్స్‌ డౌమన్‌ అనే స్టార్‌ ఫుట్‌బాలర్‌ ఎదుర్కొంటున్నాడు. ఆర్సెనల్‌ క్లబ్‌కు ఆడే డౌమన్‌కు కూడా వైభవ్‌లాగే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తున్నాయి. అతనికి కూడా క్లబ్‌లో ప్రత్యేక మార్పిడి గది ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌ల కోసం వైభవ్‌ భారత జట్టుతో కలిసి యూకేకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లలో అతడు ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన అతి పిన్న వయస్కుడైన భారత అంతర్జాతీయ క్రికెటర్‌ రికార్డును బద్దలు కొడతాడు.వైభవ్‌ ఐపీఎల్‌ 2026లో అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు శ్రీలంకలో జరిగిన ఏ-జట్ల ట్రై సిరీస్‌లోనూ చెలరేగి ఆడాడు. లంకతో జరిగిన ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగుల తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు టైటిల్‌ అందించాడు.ఈ ప్రదర్శన తర్వాత అభిమానులంతా వైభవ్‌ భారత సీనియర్‌ జట్టు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐర్లాండ్‌తో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జూన్‌ 26, 28 తేదీల్లో జరుగనుంది. అనంతరం జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ షెడ్యూలైంది.బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిందివైభవ్‌ యూకే ‍పర్యటన నేపథ్యంలో బీసీసీఐ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైభవ్‌ సంరక్షణ, మానసిక సౌకర్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అతడి తల్లిదండ్రులను కూడా యూకే పర్యటనకు అనుమతిచ్చింది. టీమిండియాలో అందరూ పెద్దవారే ఉండటంతో, వైభవ్‌ కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం ఉపయోగపడుతుందని బీసీసీఐ భావించింది.

Former New Zealand Pacer Bob Blair Passed Away At 9410
న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఐకాన్‌ కన్నుమూత

న్యూజిలాండ్‌ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. కివీస్‌ ఐకానిక్‌ క్రికెటర్‌ బాబ్‌ బ్లేయర్‌ కన్నుమూశాడు. తన 94వ పుట్టినరోజే ఇంగ్లండ్‌తో ఆయన తుదిశ్వాస విడిచాడు. కాగా న్యూజిలాండ్‌ తరఫున 1952- 1964 మధ్య బాబ్‌ బ్లేయర్‌ పందొమ్మిది టెస్టులు ఆడారు. ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఖాతాలో 43 వికెట్లు ఉన్నాయి.ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వెల్లింగ్‌టన్‌కు సుదీర్ఘకాలం పాటు ప్రాతినిథ్యం వహించిన బాబ్‌ బ్లేయర్‌ (Bob Blair).. 59 మ్యాచ్‌లలోనే 330కి పైగా వికెట్లు పడగొట్టాడు. 1956-57 సీజన్‌లో మొత్తంగా 46 వికెట్లు కూల్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్‌గా నిలిచాడు. అదే సీజన్లో ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటాడు.ఆ విషాద ఘటనతో పాపులర్‌న్యూజిలాండ్‌ జట్టు 1953లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అప్పుడు బ్లేయర్‌కు 21 ఏళ్లు. ఓవైపు మ్యాచ్‌కు రంగం సిద్ధం కాగా.. అదే సమయంలో అతడికి కాబోయే భార్య నెరిస్సా లవ్‌.. తంగివయ్ రైలు దుర్ఘటనలో మరణించదన్న వార్త వచ్చింది.అయినప్పటికీ జట్టు కోసం బాధ దిగమింగిన బ్లేయర్‌ పదో నంబర్‌ బ్యాటర్‌గా రంగంలోకి దిగి.. బెర్ట్‌ సట్లిఫ్‌తో కలిసి ఆఖరి వికెట్‌కు 33 పరుగుల జోడించాడు. సౌతాఫ్రికా స్పిన్నర్‌ హూ టేఫీల్డ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ ఓవర్లోనే 25 పరుగులు రాబట్టడం నాడు వరల్డ్‌ రికార్డు.కోచ్‌గానూ..ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్‌ క్రికెట్‌, క్రికెట్‌ సౌతాఫ్రికా 2024లో ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్‌ కోసం.. తంగివయ్‌ షీల్డ్‌ను ప్రవేశపెట్టింది. కాగా 1986లో బార్బరాను పెళ్లి చేసుక్ను బ్లేయర్‌ ఆమెతో కలిసి చెషైర్‌లో సెటిల్‌ అయ్యాడు. క్వీన్స్‌లాండ్‌, జింబాబ్వే, సౌతాఫ్రికా, నార్తర్న్‌ ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ జట్లకు కోచ్‌గానూ వ్యవహరించాడు. చదవండి: ఒకరు వదిలించుకున్నారు.. మరొకరు దక్కించుకున్నారు!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement