Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

WPL 2026: RCB scored 178 for 6 against gujarat giants1
చెలరేగిన గౌతమి నాయక్‌.. ఆర్సీబీ భారీ స్కోర్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో ఆర్సీబీ తమ జోరును కొనసాగిస్తుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేసిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 19) గుజరాత్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ చేసి భారీ స్కోర్‌ చేసింది.టాస్‌ ఓడి ప్రత్యర్థి ఆహ్వానం మేరకు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన గౌతమి నాయక్‌ ఊహించని రీతిలో చెలరేగింది. 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేసింది. స్టార్‌ ప్లేయర్‌ మంధనతో (26) కలిసి మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించింది.అనంతరం రిచా ఘోష్‌తో (27) కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. గౌతమి నాయక్‌ ఔటయ్యాక ఆఖర్లో రాధా యాదవ్‌ (17), శ్రేయాంక పాటిల్‌ (8) బ్యాట్‌ ఝులిపించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా వాల్‌ తలో పరుగు చేసి ఔట్‌ కాగా.. డి క్లెర్క్‌ (4), శ్రేయాంక (8) అజేయంగా నిలిచారు.గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌, కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ తలో 2 వికెట్లు తీయగా.. రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సోఫి డివైన్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, ఈ ఎడిషన్‌లో ఆర్సీబీ వరుసగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఎవరీ గౌతమి నాయక్‌..?మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల గౌతమి నాయక్‌ను ఆర్సీబీ ఈ సీజన్‌ వేలంలో రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ (ఆఫ్‌) ఆల్‌రౌండర్‌ అయిన ఈమె​కు దేశవాలీ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుంది. గౌతమి బరోడా, మహారాష్ట్ర జట్లకు ప్రాతినిథ్యం వహించింది. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో రత్నగిరి జెట్స్‌ తరఫున సత్తా చాటి ఆర్సీబీని ఆకర్శించింది.

ICC under 19 world cup 2026: Pakistan beat scotland by 6 wickets2
ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్‌

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ పతనాన్ని శాశించాడు. మొమిన్‌ కమర్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌ తలో వికెట్‌ తీశారు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన థామస్‌ నైట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్‌ (33), ఓల్లీ జోన్స్‌ (30), మను సరస్వత్‌ (25), రోరి గ్రాంట్‌ (21), ఫిన్లే కార్టర్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్‌కు సరస్వత్‌, ఫిన్లే జోన్స్‌ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్‌ ఖాన్‌ (75), అహ్మద్‌ హుసేన్‌ (47) పాక్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్‌ ఫర్హాన్‌ (18 నాటౌట్‌) పాక్‌ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అలీ హసన్‌ బలోచ్‌ 15, స్టార్‌ బ్యాటర్‌ సమీర్‌ మిన్హాస్‌ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో ఓల్లీ జోన్స్‌, సరస్వత్‌ తలో 2 వికెట్లు తీశారు. కాగా, ఈ మెగా టోర్నీలో పాక్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌ సూపర్‌-8కు చేరుకుంటుంది.ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ బుల్‌బులియా, జేసన్‌ రోల్స్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇవాళే మరో మ్యాచ్‌ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది.

Pat Cummins Ruled Out Of Australia's Opening T20 World Cup Fixtures3
ఆస్ట్రేలియాకు భారీ షాక్‌

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం లేకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. కమిన్స్‌ మూడు లేదా నాలుగో మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ప్రకటించాడు. కమిన్స్‌ వేగంగా పురోగతి సాధిస్తే ‍ప్రణాళికలు మారవచ్చని చెప్పుకొచ్చాడు. కమిన్స్‌ గత కొంతకాలంగా లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌ ఆడినా, గాయం తిరగబెట్టడంతో ఆతర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే అవకాశం లేకపోవడంతో, వరల్డ్‌కప్ తొలి రెండు మ్యాచ్‌లు సహా, దానికి ముందు పాకిస్తాన్‌లో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా అందుబాటులో ఉండడంలేదు. పాక్‌తో సిరీస్‌కు కమిన్స్‌ సహా నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండడం​ లేదు. ప్రపంచకప్‌ జట్టులో ఉన్న వీరికి విశ్రాంతినిచ్చారు. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకైనా కమిన్స్‌ అందుబాటులో లేకపోవడం​ ఆస్ట్రేలియాకు పెద్ద లోటే అవుతుంది. అతని అనుభవం, డెత్ ఓవర్లలో బౌలింగ్ నైపుణ్యం జట్టుకు చాలా కీలకం. అసలే ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టు అంతంతమాత్రంగా ఉంది. కమిన్స్‌ లాంటి ఆటగాడు ఒక్క మ్యాచ్‌కు దూరమైనా, ఆ జట్టు టైటిల్‌ గెలిచే అవకాశాలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచకప్‌లో ఆసీస్‌ ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో మొదలవుతుంది. ఆసీస్‌ రెండో మ్యాచ్‌ జింబాబ్వేతో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌..ఒమన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక జట్లతో గ్రూప్‌-బిలో ఉంది. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్‌), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

T20 World Cup fresh twist, Pakistan to review participation amid Bangladesh issue4
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్‌కు వంత పాడుతున్న పాక్‌

2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రికెట్‌లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కార‌ణాల‌ను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో జరగబోయే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్‌ బోర్డు, భారత్‌లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్‌ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్‌లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోగా, భారత్‌లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్‌ ఆడబోమని ఓవరాక్షన్‌ చేస్తుంది. బంగ్లాదేశ్‌ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్‌ క్రికెట్‌ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్‌ ఎంట్రీతో ప్రపంచకప్‌లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంత‌కాలంగా బంగ్లాదేశ్‌-భార‌త్ మ‌ధ్య రాజకీయ ఉద్రిక్త‌లు నెల‌కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుద‌ల చేయ‌డంతో ఈ ఉద్రిక్త‌లు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువుల‌పై దాడులు పెరిగిపోతుండ‌డంతో బీసీసీఐ ఆదేశాల మేర‌కు కేకేఆర్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.దీన్ని ఘోర అవ‌మానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. త‌మ జ‌ట్టును వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్ పంప‌బోమ‌ని, వేదిక‌ల‌ను శ్రీలంక‌కు మార్చాల‌ని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్ర‌సారాల‌ను త‌మ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ‌ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదిక‌ల‌గా ఆడాల్సి ఉంది.

James Neesham cancels India tour, to join BPL instead5
భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సంచలన​ నిర్ణయం

న్యూజిలాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్‌లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్‌షాహీ వారియర్స్ (నీషమ్‌ బీపీఎల్‌ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్‌తో సిరీస్‌ న్యూజిలాండ్‌ జట్టుకు ప్రపంచకప్‌కు ముందు రిహార్సల్‌గా భావించబడుతోంది. ఈ సిరీస్‌​కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్‌ జట్టులోనూ ఉంటారు. నీషమ్‌ కూడా న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. నీషమ్‌ను ప్రపంచకప్‌ ‍ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్‌ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌‍ జట్టులో లేకపోవడం​ న్యూజిలాండ్‌కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్‌తో సిరీస్‌ అయినా, ప్రపంచకప్‌ అయినా నీషబ్‌ లేని లోటు న్యూజిలాండ్‌ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్‌ 2025-26 ఎడిషన్‌లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్‌ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్‌షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్‌షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చట్టోగ్రామ్ రాయల్స్‌తో (తొలి క్వాలిఫయర్‌) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు..హెన్రీ నికోల్స్‌, విల్‌ యంగ్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (కెప్టెన్‌), నిక్‌ కెల్లీ, డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, జకరీ ఫౌల్క్స్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, డెవాన్‌ కాన్వే, మిచెల్‌ హే, ఆదిత్య అశోక్‌, క్రిస్టియన్‌ క్లార్క్‌, కైల్‌ జేమీసన్‌, జేడన్‌ లెన్నాక్స్‌, మైఖేల్‌ రే

Rohit Sharma, Ravindra Jadeja And More: The Villains Behind Indias ODI Series Loss vs New Zealand6
టీమిండియా సిరీస్‌ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు

భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భార‌త్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్‌.. నేడు వన్డే సిరీస్‌. స్వదేశంలో న్యూజిలాండ్‌పై వ‌న్డే సిరీస్‌ను భార‌త్ కోల్పోవ‌డం ఇదే తొలిసారి.ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్‌.. నోహిట్‌ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్‌లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్‌ అన్నట్లుగా రోహిత్‌ మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.జడేజా అట్టర్ ప్లాప్‌రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్‌లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్‌లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్‌తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో ప్రధాన ఆల్‌రౌండర్‌గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.శ్రేయస్ సైలెంట్‌..ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్‌లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్‌కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.బౌలింగ్ ఫెయిల్‌ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి!

Team india fans demand gautam gambhir sacking after new zealand ODI series loss7
గౌతమ్‌ గంభీర్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్‌కు ముందు వరకు గంభీర్‌ను టెస్ట్‌ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్‌ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్‌ (న్యూజిలాండ్‌) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్‌ పేలవ ప్రదర్శన టెస్ట్‌లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్‌ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్‌ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్‌కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్‌ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్‌ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్‌ ట్రోఫీ ఒక్కటే.గంభీర్‌ పేలవ ప్రదర్శన టెస్ట్‌ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్‌ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్‌ కోచ్‌గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్‌ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారని టాక్‌. రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్‌మన్‌ గిల్‌కు టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్‌దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్‌కు అన్యాయం చేసి గిల్‌ను టీ20ల్లోనూ ప్రమోట్‌ చేయాలని గంభీర్‌ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్‌ షమీ లాంటి సీనియర్‌ను అకారణంగా తప్పించి, హర్షిత్‌ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్‌ ఖాన్‌, మహ్మద్‌ సిరాజ్‌ గంభీర్‌ రాజకీయాలకు బలైయ్యారనే టాక్‌ కూడా నడుస్తుంది. కోచ్‌గా తన పనితనంపై ఫోకస్‌ పెట్టకుండా గంభీర్‌ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్‌పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్‌ ప్రమోట్‌ చేసిన శుభ్‌మన్‌ గిల్‌ సైతం భారత కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్‌ తొలిసారి న్యూజిలాండ్‌ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్‌ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్‌ల్లోనూ గిల్‌ (కెప్టెన్‌గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్‌లో (ఇంగ్లండ్‌) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్‌ స్వీప్‌) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్‌ తన గురువు గంభీర్‌తో పోటీ పడుతున్నాడు.

Mary Kom Divorce Saga: Love Silence And A Very Public Fallout8
సంపాదనలేని భర్త వద్దు.. భార్యే నా ATM?.. అసలేం జరిగింది?

ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌. అతడు కరుంగ్‌ ఓన్‌కోలర్‌.. ఫుట్‌బాల్‌ ఆటగాడు. న్యాయవాది కూడా!బాక్సర్‌గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టానంటాడు కరుంగ్‌. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.వివాహేతర సంబంధం మచ్చకోమ్‌ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్‌ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్‌కోలర్‌తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్‌ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.అయితే, ఈ విషయం గురించి ఓన్‌కోలర్‌ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్‌ అదాలత్‌లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్‌ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.సాక్ష్యంగా మెసేజ్‌లుఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్‌కోలర్‌ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్‌ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్‌ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.మేరీ కోమ్‌ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్‌కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్‌కోలర్‌ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్‌ ఇటీవల తెలిపింది. తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.సంపాదన లేకుండా నాపై ఆధారపడిఅప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్‌ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్‌లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.తాను కష్టపడి బాక్సింగ్‌ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్‌ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్‌కోలర్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు.పిల్లలకు తల్లినయ్యానుపెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్‌ కోసం తాను తన కెరీర్‌నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్‌తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్‌, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?మేరీ కోమ్‌- ఓన్‌కోలర్‌ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.ఏదేమైనా మేరీ కోమ్‌ వంటి దిగ్గజ బాక్సర్‌ రింగ్‌లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

Reasons why south african cricketers prefer migration to other countries, especially england9
పరాయి దేశానికి వలస వెళ్లిన మరో సౌతాఫ్రికా క్రికెటర్‌

సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది ఓ కల. అయితే సౌతాఫ్రికన్లు మాత్రం ఇందుకు భిన్నం. ఈ మాట చెప్పడానికి కారణాలు లేకపోలేదు. క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ క్రీడ చరిత్రలో అత్యధిక శాతం వలస వెళ్లిన వాళ్లు సౌతాఫ్రికన్లే. వలస వెళ్లడమే కాదు.. దేశం మారాక వారిలో అధిక​ శాతం మంది స్టార్‌ క్రికెటర్లయ్యారు.సౌతాఫ్రికన్లే ఎక్కువ శాతం ఎందుకు విదేశాల్లో కెరీర్‌లు ప్లాన్‌ చేసుకుంటున్నారన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పేరుకు పెద్ద దేశమే అయినా, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆర్దిక వనరులు మాత్రం అంతంతమాత్రమే. క్రికెటర్లు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ఇదే ప్రధాన కారణం.చరిత్ర చూసుకుంటే, సౌతాఫ్రికాలో పుట్టిన క్రికెటర్లు ఎక్కువ శాతం ఇంగ్లండ్‌కు వలస వెళ్లారు. ఇందుకు కారణం కోల్పాక్‌ ఒప్పందాలు. ఈ ఒప్పందాల మేరకు 2010లో రూపొందించిన యూరోపియన్ యూనియన్ చట్టాల్లో.. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో స్థానిక ఆటగాళ్లుగా ఆడే అవకాశం పొందారు. సౌతాఫ్రికాతో పోల్చుకుంటే ఇంగ్లండ్‌లో మెరుగైన వేతనాలు, సౌకర్యాలు, స్థిరమైన కెరీర్ మరియు భవిష్యత్తు, అదనంగా కుటుంబ భద్రత అధికంగా లభిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ శాతం మంది సౌతాఫ్రికాలో జన్మించినా ఇంగ్లండ్‌లో కెరీర్‌ను ప్లాన్‌ చేసుకోవాలని అనుకుంటారు.ఉదాహరణకు.. సౌతాఫ్రికా దేశవాలీ క్రికెట్‌తో పోలిస్తే, ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో అధిక వేతనాలు లభిస్తాయి. ఇంగ్లండ్‌ కౌంటీలతో ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే స్థిరమైన ఆదాయం కూడా ఉంటుంది. ఈ కారణంగా కెవిన్‌ పీటర్సన్‌, జేసన్‌ రాయ్‌, జోనాథన్‌ ట్రాట్‌, ఆండ్రూ స్ట్రాస్‌, మ్యాట్‌ ప్రయర్‌ లాంటి సౌతాఫ్రికన్లు ఇంగ్లండ్‌కు వలస వెళ్లి, అక్కడ స్టార్లుగా ఎదిగారు. వీరికి ముందు అలన్‌ లాంబ్‌, క్రిస్‌ స్మిత్‌, డెర్క్‌ రాండల్‌ లాంటి వారు కూడా సౌతాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్‌ దిగ్గజాలుగా మారారు.ఆర్దిక అవకాశాలు కాకుండా సౌతాఫ్రికన్లు ఇతర దేశాలకు వలస వెల్లడానికి మరో కారణం కెరీర్‌ స్థిరత్వం. ఇతర దేశాలతో పోలిస్తే.. సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ అవకాశాలు రావడం కాస్త కష్టం. వర్ణానికి సంబంధించిన రిజర్వేషన్ల కారణంగా ఆ జట్టులో పరిమిత అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాల్లో ఈ సమస్య ఉండదు. పౌరసత్వం పొందాకా ఆటలో రాణించగలిగితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.సౌతాఫ్రికన్లు వలసల బాట పట్టడానికి మరో కారణం కుటుంబ భద్రత మరియు జీవన ప్రమాణాలు. సౌతాఫ్రికాలోని సామాజిక–రాజకీయ అస్థిరత, నేరాల రేటు కారణంగా ఆటగాళ్లు కుటుంబ భద్రత కోసం వలస వెళ్తారు. సౌతాఫ్రికాతో పోలిస్తే ఇతర దేశాల్లో పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉండటం​ వల్ల వారు వలసలకు ప్రాధాన్యత ఇస్తారు.క్రికెట్‌లో సౌతాఫ్రికన్ల వలసలకు మరో ప్రధాన కారణం బోర్డు పరిపాలనలో అంతర్గత సమస్యలు. ఆర్దిక సమస్యలతో కొట్టిమిట్టాడే క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. పాలనా సమస్యల కారణంగా మరింత పతనమవుతుంది. బోర్డు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఆటగాళ్లను వలసలు వెళ్లేలా ప్రేరేపిస్తాయి.వీటికి తోడు ప్రైవేట్‌ టీ20ల్లో లీగ్‌ల్లో పాల్గొనడంపై పరిమితులు ఉండటం సౌతాఫ్రికన్లను వలసలకుప్రోత్సహిస్తుంది. ఇటీవలికాలంలో చాలామంది సౌతాఫ్రికన్లు డబ్బు అధికంగా లభించే ప్రైవేటు టీ20 లీగ్‌ల కోసం జాతీయ జట్టు అవకాశాలను కూడా తృణప్రాయంగా వదిలిపెట్టారు. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఇందుకు ప్రధాన ఉదాహరణ.ప్రైవేటు టీ20 లీగ్‌ల ప్రభావంతో ప్రస్తుతం సౌతాఫ్రికన్ల వలసల రేటు తగ్గినప్పటికీ.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురుచూసే వారు మాత్రం ఇంకా పక్క దేశాలవైపు చూస్తూనే ఉన్నారు. తాజాగా సౌతాఫ్రికా ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేజే స్మట్స్‌ జాతీయ జట్టు అవకాశాలు రాకపోవడంతో ఇటలీకి వలస వెళ్లాడు. భార్య ద్వారా ఆ దేశ పౌరసత్వం పొంది 2026 టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా చోటు సంపాదించాడు. స్మట్స్‌ ఇతర దేశ జాతీయ జట్టుకు ఎంపికైన నేపథ్యంలోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.క్రికెట్‌ చరి​త్రలో ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించిన సౌతాఫ్రికన్లు (ఇంగ్లండ్‌ కాకుండా)..ఆస్ట్రేలియామార్నస్‌ లబూషేన్‌కీగన్‌ మాథ్యూస్‌ఫిరోస్‌ ఎర్ఫాన్‌క్లైవ్‌ ఇంగ్లిస్‌న్యూజిలాండ్‌గ్రాంట్‌ ఇలియట్‌నీల్‌ వాగ్నర్‌డెవాన్‌ కాన్వేలూక్‌ రోంచిక్రిస్‌ కేన్స్‌నమీబియాడేవిడ్‌ వీస్‌జింబాబ్వే గ్యారీ బ్యాలెన్స్‌

When will Virat Kohli and Rohit Sharma play next for India after New Zealands ODI defeat?10
భార‌త జెర్సీలో మ‌ళ్లీ రో-కోలు క‌నిపించేది ఎప్పుడంటే?

టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శ‌ర్మల ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌. న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ ముగియ‌డంతో రో-కో ద్వ‌యం దాదాపు 6 నెలల పాటు భార‌త జెర్సీలో క‌న్పించ‌రు. మ‌ళ్లీ వ‌చ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జ‌రిగే మూడు వ‌న్డేల సిరీస్‌లో వీరిద్ద‌రూ భార‌త్ త‌ర‌పున ఆడ‌నున్నారు.అంత‌కంటే మందు జూన్‌లో అఫ్గానిస్తాన్ జ‌ట్టు మూడు వ‌న్డేల సిరీస్ కోసం భార‌త ప‌ర్య‌ట‌న‌కు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖ‌రారు కాలేదు. ఒక‌వేళ అఫ్గానిస్తాన్‌తో భార‌త్ ఆడితే విరాట్‌-రోహిత్ కూడా బ‌రిలోకి దిగ‌నున్నారు. లేదంటే ఆ త‌ర్వాత నెల‌లో ఇంగ్లండ్‌పై క‌చ్చితంగా ఆడ‌నున్నారు.కాగా ఇప్ప‌టికే టీ20, టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లిలు.. ప్ర‌స్తుతం కేవ‌లం వ‌న్డే ఫార్మాట్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో వ‌న్డేల త‌ర్వాత టీమిండియా టీ20 సిరీస్‌లు ఎక్కువగా ఆడ‌నుంది. వీరిద్ద‌రూ టీ20ల‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో వ‌న్డే సిరీస్ షెడ్యూల్ వ‌ర‌కు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు ఐపీఎల్‌లో మాత్రం త‌మ త‌మ జ‌ట్లు త‌ర‌పున సంద‌డి చేయ‌నున్నారు. ఈ ఏడాది ఆఖ‌రిలో మాత్రం విరాట్‌, రోహిత్ వ‌రుస అంత‌ర్జాతీయ సిరీస్‌ల‌లో బీజీబీజీగా గ‌డ‌ప‌నున్నారు. ఇంగ్లండ్‌తో వ‌న్డేలు ముగిసిన త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో భార‌త్ వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య విండీస్‌తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంత‌రం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్‌.. రోహిత్ ఫ‌ట్‌ఇక తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ ప‌రిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్‌ కీలకం!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement