ప్రధాన వార్తలు
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసు గుర్రం మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్, రోహిత్తో పాటు ఏ ప్లస్లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సిరాజ్, పంత్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్లు సమాచారం.
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్'దే ISPL టైటిల్
తమిళ నటుడు సూర్య కో-ఓనర్గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్కతా టైగర్స్పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
జగజ్జేత భారత్కు భారీ నజరానా
అండర్ 19 ప్రపంచకప్ 2026 విజేత భారత్కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆరోసారి జగజ్జేతగా నిలిచిన యువ భారత జట్టుకు రూ. 7.50 కోట్ల భారీ నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఫైనల్లో భారత్ ఇంగ్లండ్ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ (80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు) ఆడి భారత్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో వైభవ్ వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. జట్టుగానూ భారత్ పలు రికార్డులు సొంతం చేసుకుంది.దేశమంతా గర్విస్తుందిజగజ్జేత భారత్కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్కప్ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామని అన్నారు. ప్రధాని అభినందనలు ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్కప్ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఆరోసారి తాజా టైటిల్తో భారత్ ఆరోసారి అండర్ 19 వరల్డ్కప్ను తమ ఖాతాలో వేసుకుంది. గతంలో భారత్ 2000, 2008, 2012, 2018, 2022 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భారత ఇన్నింగ్స్లో వైభవ్ విధ్వంసకర భారీ శతకాన్ని నమోదు చేయగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (53) అర్ద సెంచరీతో రాణించాడు. అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్ 2026 ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 7) ప్రారంభం కానుంది. ఇవాళే భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలిందని తెలుస్తుంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. బుమ్రా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా అతను శుక్రవారం నాటి నెట్ ప్రాక్టీస్కి హాజరుకాలేదు. దీంతో నేటి మ్యాచ్కు బుమ్రా దూరమవుతాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. ప్రత్యర్ది (యూఎస్ఏ) చిన్నదే అయినా, ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. గత ప్రపంచకప్లో ఇదే జట్టు పాక్కు షాకిచ్చింది. కాబట్టి, బుమ్రా అందుబాటులో లేకపోయినా టీమిండియా మరో పేస్ బౌలింగ్ ఆప్షన్తో సిద్దంగా ఉండక తప్పదు.ఒకవేళ బుమ్రా నిజంగా యూఎస్ఏ మ్యాచ్కు దూరమైతే కొత్తగా జట్టులోకి వచ్చిన సిరాజ్కు తుది జట్టులో అవకాశం ఉండవచ్చు. హార్దిక్ పాండ్యా కొత్త బంతితో బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉండగా, సిరాజ్ ఫస్ట్-చేంజ్ బౌలర్గా ఉపయోగపడతాడు. యూఎస్ఏతో మ్యాచ్ తర్వాత భారత్ ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఆతర్వాత ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో మ్యాచ్ షెడ్యూలైంది. అయితే ఈ మ్యాచ్పై అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది. పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ఆడినా ఆడకపోయినా, భారత్ అయితే ఈ మ్యాచ్ కోసం కొలొలంబోకు వెళ్తుంది. ఒకవేళ పాక్ నిజంగా బరిలోకి దిగకపోతే భారత్కు మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు లభిస్తాయి. దీని తర్వాత టీమిండియా ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడనుంది.యూఎస్ఏతో మ్యాచ్కు భారత జట్టు (అంచనా)..ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మొహమ్మద్ సిరాజ్
శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు
శ్రీలంక టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్ మలింగ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్ మదుశన్ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్ గాయపడటంతో ప్రమోద్కు బంపరాఫర్ దక్కింది. ఈషాన్, ప్రమోద్ ఇద్దరూ రైట్ ఆర్మ్ మీడియం పేసర్లే. ఈషాన్ లంక టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాగా.. ప్రమోద్ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. అతను చివరిగా 2023 ఏప్రిల్లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్తో మాత్రం అనునిత్యం టచ్లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్లో ప్రమోద్.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు.స్వదేశంతో పాటు భారత్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్తో ఆడనుంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.అప్డేటెడ్ శ్రీలంక జట్టు..- దసున్ షనక (కెప్టెన్) - పథుమ్ నిస్సంక - కమిల్ మిశారా - కుసల్ మెండిస్ - కమిందు మెండిస్ - కుసల్ జానిత్ పెరేరా - చరిత్ అసలంక - జానిత్ లియానగే - పవన్ రత్నాయకే - వనిందు హసరంగ - దునిత్ వెల్లలాగే - మహీష్ తీక్షణ - దుష్మంత చమీరా - మతీషా పథిరానా - ప్రమోద్ మదుశన్
వైభవ్ సూర్యవంశీ కూడా వారిలాగే కనుమరుగైపోతాడా..?
అండర్ 19 వరల్డ్కప్ 2026 ఫైనల్లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి, భారత్ను ఆరోసారి జగజ్జేతగా నిలిపిన విషయం విధితమే. హరారే వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. ఈ మహా విధ్వంసం కారణంగా వైభవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టోర్నీ మొత్తంలో ఇదే తరహా ఫామ్ను (439 పరుగులు, ఓ వికెట్) కొనసాగించినందుకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు కూడా వైభవ్కే దక్కింది.ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం సోషల్మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన గత ఐదు సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచిన ఏ ఒక్క ఆటగాడు కెరీర్లో పెద్దగా ఎదగలేకపోయాడు. తూతూమంత్రంగా కొద్ది రోజులు లైమ్లైట్లో ఉన్నా, ఆతర్వాత శాశ్వతంగా కనుమరుగైపోయారు. దీంతో భారత ఆటగాళ్లకు ఫైనల్స్ కలిరాదనే భావన కలుగుతోంది.తాజాగా వైభవ్ సూర్యవంశీ అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడంతో, ఇతనికి కూడా గత ఐదు వరల్డ్కప్ ఫైనల్స్ హీరోలకు పట్టిన గతే పడుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వైభవ్ దూకుడు చూసి కొందరు అలాగే జరుగుతుందని అంటుంటే.. మరికొందరేమో వైభవ్ టీమిండియా తరఫున అద్భుతమైన కెరీర్ను కొనసాగిస్తాడని అభిప్రాయపడుతున్నారు.ఇంతకీ గతంలో భారత్ అండర్ 19 వరల్డకప్లు గెలిచిన సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్ ఎవరని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2000) రితిందర్ సింగ్ సోధి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్లో సోధి అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి భారత్ తొలిసారి వరల్డ్కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్లో సోధి తొలుత బౌలింగ్లో (10-0-26-0), ఆతర్వాత బ్యాటింగ్లో (39 నాటౌట్ (43)) రాణించాడు. ఈ ప్రపంచకప్ తర్వాత సోధి కొద్ది రోజులు లైమ్లైట్లో ఉన్నా, ఆతర్వాత కనుమరుగైపోయాడు.ఆతర్వాత భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచిన సందర్భంలో (2008) అజితేశ్ అర్గల్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్లో అర్గల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-7-2) మెరిసి, భారత్ రెండో ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన అర్గల్ ఆ ప్రపంచకప్ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఐపీఎల్లో ఓ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఆటగాడిగా కనుమరుగైపోయారు. అయితే ఆశ్చర్యకరంగా అతను అంపైరింగ్ను కెరీర్గా ఎంచుకొని, క్రికెట్తో బంధాన్ని కొనసాగిస్తున్నాడు.భారత్ మూడోసారి ప్రపంచకప్ సాధించడంలో (2012) నాటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్లో ఉన్ముక్త్ అద్భుతమైన సెంచరీ (111 నాటౌట్) చేసి భారత్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ సమయంలో ఉన్ముక్త్ను అందరూ భావి భారత తారగా అనుకున్నారు. అయితే ఆశర్చర్యకరంగా అతని కెరీర్ కూడా ముందుకు సాగలేదు. అవకాశాలు లభించినా అతను ఒడిసి పట్టుకోలేకపోయాడు. భారత్లో కాదని వేరే దేశానికి వెళ్లినా అతని ఫేట్ మారలేదు. దీంతో అతను క్రమంగా కనుమరుగైపోయాడు.భారత్ నాలుగోసారి (2018) ప్రపంచ ఛాంపియన్గా అవతరించడంలో మన్జోత్ కల్రా కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాటి ఫైనల్స్లో కల్రా మెరుపు సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. పై ముగ్గురితో పోలిస్తే, కల్రా పరిస్థితి మరీ దారుణం. వరల్డ్కప్ ఫైనల్ తర్వాత ఇతను ఎక్కడా కనపడలేదు. లిస్ట్-ఏ, టీ20 ఫార్మాట్లో కేవలం ఒకటి అరా మ్యాచ్లు మాత్రమే ఆడాడు. వరల్డ్కప్ ఫైనల్లో సెంచరీ చేసి రాత్రికిరాత్రే హీరో ఇమేజ్ దక్కినా, ఎందుకో ఆ ఇమేజ్ను కొనసాగించలేకపోయాడు. ఢిల్లీకి చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మెరుపులా ఒక్కసారి మెరిసి ఆతర్వాత అదృశ్యమయ్యాడు.భారత్ ఐదోసారి వరల్డ్కప్ గెలవడంలో రాజ్ బవా కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో జరిగిన నాటి ఫైనల్లో బవా ఆల్రౌండర్గా (34 (54), 5-31) సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్గా నిలిచాడు. ఆ ఫైనల్ తర్వాత బవాకు మంచి అవకాశాలే లభించినా, పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్లో అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు. ఇతను శాశ్వతంగా కనుమరుగుకాకపోయినప్పటికీ.. ఇంచుమించు అంచున ఉన్నాడు.పై ఐదుగురు వరల్డ్కప్ ఫైనల్స్ హీరోల పరిస్థితి చూశాక వైభవ్ ఎమవుతాడోనని టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికర విషయం ఉంది. ప్లేయర్ ఆఫ ద ఫైనల్స్గా నిలిచిన ఆటగాళ్ల కెరీర్లు బాగా లేకపోయినా, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వాళ్ల కెరీర్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. తాజా వరల్డ్కప్లో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్స్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా కూడా నిలిచాడు. దీంతో వైభవ్ కెరీర్కు వచ్చిన ఢోకా ఏమీ లేదని ఫ్యాన్స్ ఊరట పొందుతున్నారు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు (వైభవ్ సహా) ఐదుగురు (యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్)ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు. వీరంతా కెరీర్లో అత్యున్నతి సాధించారు. వైభవ్ కూడా వీరి బాటలోనే నడవాలని ఆశిద్దాం.
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో యంగ్ ఇండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ అండర్ 19 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైందిగా కీర్తించబడుతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేశాడు. అండర్ 19 లెవెల్లోనే కాదు, యావత్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఇదీ ఒకటిగా నిలిచిపోతుంది. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ విధ్వంసం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. 14 కుర్ర వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు. వైభవ్లోని ఫైర్ చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణికిపోయారు. ఏం చేయాలో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వైభవ్ను ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు. విచక్షణారాహిత్యంగా సాగిన వైభవ్ ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల పిల్లాడు ఇంతలా రెచ్చిపోవడమేంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. వైభవ్ విధ్వంసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మారణహోమంగా అభివర్ణిస్తున్నారు. ఐస్లాండ్ క్రికెట్ అయితే ఓ అడుగు ముందుకేసి వైభవ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరును ఐస్లాండ్ క్రికెట్ ఎక్స్ రేటెడ్ హింసగా పేర్కొంది. Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!— Iceland Cricket (@icelandcricket) February 6, 2026ఐస్లాండ్ క్రికెట్ ఈ ట్వీట్ను సరదాగా చేసినా, నెటిజన్లు దీన్ని నిజంగానే అన్వయించుకుంటున్నారు. ఎందుకంటే, ఇంగ్లండ్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడిన తీరు ఎక్స్ రేటెడ్ హింసలాగే ఉంది. ఆ బాదుడు నిజంగానే ఇంగ్లండ్ ఆటగాళ్లను భయబ్రాంతులకు గురి చేసింది. ఇది తలచుకొని వారు కొన్ని నెలలైనా సుఖంగా నిద్రపోలేరు. అంతలా సాగించి వైభవ్ బీభత్సం.ఈ సునామీ ఇన్నింగ్స్తో వైభవ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్లు, ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వంటి భారీ రికార్డులు కూడా ఉన్నాయి. వైభవ్ ఊచకోత కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.అనంతరం కష్టసాధ్యమైన ఛేదనలో ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడింది. అయితే లక్ష్యం అతి భారిది కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాలెబ్ (115) వీరోచిత శతకంతో ఆకట్టుకున్నాడు. చివరికి ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటై, 100 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
జాక్పాట్ కొట్టేసిన సిరాజ్
అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్కప్ జట్టులోకి హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సిరాజ్ చేరిక టీమిండియా బౌలింగ్ బలాన్ని మరింత పెంచనున్నప్పటికీ.. ఆల్రౌండర్ హర్షిత్ రాణా జట్టుకు దూరం కావడం ఒకింత మైనస్సే అవుతుంది. ఎందుకంటే.. హర్షిత్ లోయర్ ఆర్డర్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడగల సమర్దుడు. ఛేదనల్లో అతని ఇన్నింగ్స్లు చాలా కీలకమవుతాయి. బౌలింగ్ విషయంలోనూ హర్షిత్ ఇటీవలకాలంలో మంచి మార్కులే కొట్టేశాడు. టీ20 జట్టుకు హర్షిత్ లాంటి ఆల్రౌండర్ చాలా కీలకం. మరోవైపు సిరాజ్ చేరిక కూడా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రూవెన్ బౌలర్. పైగా మంచి ఫామ్లో ఉన్నాడు. గత వరల్డ్కప్ విన్నింగ్ జట్టులోనూ కీలకంగా వ్యవహరించాడు. హర్షిత్లా బ్యాటింగ్ చేయలేడన్నది తప్పిస్తే, సిరాజ్ లాంటి బౌలర్ జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే. సిరాజ్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2024 జులైలో శ్రీలంకతో ఆడాడు. సిరాజ్.. బుమ్రా, అర్షదీప్తో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. ఈ త్రయం మరోసారి భారత్కు ప్రపంచకప్ అందించాలని ఆశిద్దాం.సుందర్ విషయంలో ఇంకా క్లారిటీ లేదుగాయపడిన హర్షిత్ రాణా స్థానాన్ని సిరాజ్తో భర్తీ చేసిన బీసీసీఐ.. మరో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు ప్రత్యామ్నాయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న సుందర్ చాలా రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబ్లో ఉన్నాడు. సుందర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. బీసీసీఐ సుందర్ విషయంలో ఇంకా వేచి చూడాలని భావిస్తుంది. కాబట్టే ఇంకా అతనికి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ప్రపంచకప్ తదుపరి దశ సమయానికంతా సుందర్ కోలుకుంటాడని ఆశిద్దాం.ఇదిలా ఉంటే, భారత్ ఇవాళ (ఫిబ్రవరి 7) ప్రపంచకప్లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తుది జట్టులో సిరాజ్కు తప్పక అవకాశం దొరుకుతుంది.టీ20 ప్రపంచకప్కు అప్డేటెడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (విసి), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్
రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్కు రజతం
న్యూఢిల్లీ: ఆసియా సీనియర్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం... టీమ్ విభాగంలో బంగారు పతకం లభించాయి. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ 251.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్కే చెందిన అర్జున్ బబూతా 250.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలిచాడు. రుద్రాంక్ష్ , అర్జున్, విశాల్ సింగ్లతో కూడిన భారత బృందం 1884.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్లు క్లీన్స్వీప్ చేశారు. హిమాన్షు (250 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... అన్‡్ష దబాస్ (247.9 పాయింట్లు) రజతం... సురేశ్ ప్రణవ్ (226.8 పాయింట్లు) కాంస్యం గెలిచారు. హిమాన్షు, అన్‡్ష, సురేశ్ ప్రణవ్లతో కూడిన భారత జట్టు 1887.8 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
రాణించిన రికీ భుయ్
కళ్యాణి (బెంగాల్): బెంగాల్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆంధ్ర కెప్టెన్ రికీ భుయ్ (83; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం మొదలైన ఈ పోరులో టాస్ నెగ్గిన బెంగాల్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర జట్టు తొలిరోజు ఆట నిలిచే సమయానికి 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిõÙక్ రెడ్డి (18; 2 ఫోర్లు), శ్రీకర్ భరత్ (47; 9 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. తొలి వికెట్కు 58 పరుగులు జతయ్యాక అభిషేక్ అవుటయ్యాడు. కాసేపటికి అర్ధసెంచరీ దిశగా పరుగులు చక్కబెడుతున్న శ్రీకర్ భరత్ను ముకేశ్ అవుట్ చేయడంతో 89 పరుగుల వద్ద ఆంధ్ర రెండో వికెట్ను కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్ షేక్ రషీద్ (46; 9 ఫోర్లు), కెప్టెన్ రికీ భుయ్ కుదురుగా ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అయితే ఈ భాగస్వామ్యం బలపడకముందే 129 స్కోరు వద్ద రషీద్ నిష్క్రమించాడు. స్వల్పవ్యవధిలో జ్ఞానేశ్వర్ (7) కూడా వికెట్ పారేసుకోవడంతో 147 వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఈ దశలో రికీ భుయ్, నితీశ్ కుమార్ రెడ్డి (33; 3 ఫోర్లు) వికెట్ను కాపాడుకుంటూ జట్టు స్కోరు పెంచారు. దీంతో టీ విరామానికి మరో వికెట్ పడకుండా 190/4 స్కోరు చేసింది. ఆఖరి సెషన్లో ఆంధ్ర స్కోరు 200 దాటింది. కాసేపటికే 124 బంతుల్లో రికీ భుయ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో పరుగులు సులువుగానే వచ్చాయి. ఆట ముగిసే దశలో వరుస ఓవర్లలో వీళ్లిద్దరు అవుటవడం ఆంధ్ర జట్టుకు ఇబ్బందికరంగా మారింది. 255 స్కోరు వద్ద రికీని ఆకాశ్దీప్ పెవిలియన్ చేర్చడంతో ఐదో వికెట్కు 108 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో నితీశ్ను ముకేశ్ అవుట్ చేశాడు. ఆట నిలిచే సమయానికి త్రిపురాణ విజయ్ (1 బ్యాటింగ్), శశికాంత్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలుఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిషేక్ (సి) హబిబ్ (బి) ఆకాశ్దీప్ 18; శ్రీకర్ (సి) షమీ (బి) ముకేశ్ 47; రషీద్ (సి) ఛటర్జీ (బి) ముకేశ్ 46; రికీ భుయ్ (సి) షహబాజ్ (బి) ఆకాశ్దీప్ 83; జ్ఞానేశ్వర్ (సి) షహబాజ్ (బి) షమీ 7; నితీశ్ (సి) ఆకాశ్దీప్ (బి) ముకేశ్ 33; విజయ్ (బ్యాటింగ్) 1; శశికాంత్ (బ్యాటింగ్) 7; ఎక్స్ట్రాలు 22; మొత్తం (80 ఓవర్లలో 6 వికెట్లకు) 264. బౌలింగ్: మొహమ్మద్ షమీ 17–4–38–1, ముకేశ్ కుమార్ 18–5–50–3, సూరజ్ 14–3–53–0, ఆకాశ్దీప్ 17–3–64–2, షహబాజ్ అహ్మద్ 14–1–45–0. ముంబై 120 ఆలౌట్ ముంబై: కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు తమ సొంతగడ్డపైనే కుదేలైంది. తొలిరోజు ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 48.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (5), శార్దుల్ ఠాకూర్ (16)లాంటి టీమిండియా ప్లేయర్లు అందుబాటులో ఉన్న ముంబై మొదటి రోజే కర్ణాటక బౌలింగ్కు బెంబేలెత్తింది. ఓపెనర్ అఖిల్ హేర్వాడ్కర్ (60; 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో జట్టు స్కోరు వంద దాటింది. లేదంటే ఇంకా తక్కువ స్కోరుకే ముంబై ఇన్నింగ్స్ ముగిసేది. ఎందుకంటే అఖిల్ మినహా ఇంకెవరూ కూడా 20 పరుగులైనా చేయలేదు. సిద్దేశ్ లాడ్ (12), సూర్యాన్‡్ష (10) రెండంకెల స్కోరు చేశారంతే! విద్వత్ కావేరప్ప, ప్రసిధ్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన కర్ణాటక 2 వికెట్లకు 110 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (28) విఫలమవగా, మయాంక్ అగర్వాల్ (54 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో అజేయంగా నిలిచాడు. జార్ఖండ్ 235 ఆలౌట్ జంషెడ్పూర్: ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ క్వార్టర్స్లో మొదట బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌటైంది. ఆదిత్య సింగ్ (83; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ విరాట్ సింగ్ (47; 5 ఫోర్లు) రాణించారు. ఉత్తరాఖండ్ బౌలర్లలో జనమేజయ్ 4, ఆదిత్య రావత్, మయాంక్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత తొలిఇన్నింగ్లో ఉత్తరాఖండ్ వికెట్ కోల్పోకుండా 4 పరుగులు చేసింది. అవనీశ్ (4 బ్యాటింగ్), భూపెన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జమ్మూ కశ్మీర్ 194 ఆలౌట్ ఇండోర్: మధ్యప్రదేశ్తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో తొలిరోజే జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్లో 194 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ శుభమ్ (60; 6 ఫోర్లు), టెయిలెండర్ యు«ద్వీర్ (41; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో పేస్ బౌలర్ కుల్దీప్ సేన్ 5 వికెట్లు తీయగా, కార్తికేయకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం మధ్యప్రదేశ్ 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. హర్‡్ష (8 బ్యాటింగ్; 1 ఫోర్), యశ్ దూబే (14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
వైభవ్ సూర్యవంశీ అరెస్ట్కు డిమాండ్
హరారే వేదికగా నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన అండర్-19 ...
జాక్పాట్ కొట్టేసిన సిరాజ్
అనుకున్నదే జరిగింది. టీ20 వరల్డ్కప్ జట్టులోకి హై...
రాణించిన రికీ భుయ్
కళ్యాణి (బెంగాల్): బెంగాల్తో జరుగుతున్న క్వార్టర...
'పది'oతల విధ్వంసానికి ‘సై’
హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కొట్...
క్రీడలు
అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)
#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్మనీ (ఫొటోలు)
అనంతపురం : సినీతారల క్రికెట్ మ్యాచ్..శ్రీకాంత్, తరుణ్ సందడి (ఫొటోలు)
ఆస్ట్రేలియా ఓపెన్లో సందడి చేసిన సానియా మీర్జా (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్ శ్రీకాంత్ (ఫోటోలు)
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. ఫైనల్లో RCB ..(ఫొటోలు)
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
వరల్డ్కప్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ధనాధన్
ఆర్సీబీ క్వీన్స్.. అదిరిపోయే లుక్స్.. స్మృతి స్పెషల్ (ఫొటోలు)
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
వీడియోలు
వరల్డ్ కప్ దుమ్మురేపిన కుర్రాళ్లు వైఎస్ జగన్ ప్రశంసలు
చరిత్ర సృష్టించిన యంగిండియా
వైభవ్ సూర్యవంశీ ఊచకోత
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్
కుర్రాళ్లు కుమ్మేశారు
ఎలిమినేటర్ లో ఢిల్లీ సత్తా.. సెమీస్ లో గుజరాత్ ఔట్
దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..
పాక్ పై భారత్ ఘన విజయం
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
