Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

ICC Reacts to Pakistan making a U-turn, What Official Statement Says1
IND vs PAK: పాక్‌ యూటర్న్‌.. స్పందించిన ఐసీసీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ నిర్వహణకు మార్గం సుగమమైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)- పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మధ్య చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాదులు తలపడటం ఖాయమైంది.ఐసీసీ అధికారిక ప్రకటనఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్‌ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్‌ విషయంలోనూ మా వైఖరి మారలేదు.ఎలాంటి ప్రభావం ఉండదు200 మిలియన్లకు పైగా క్రికెట్‌ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.తగిన ప్రమాణాలు పాటిస్తేనే బంగ్లాకు ఆ ఛాన్స్‌అదే విధంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్‌కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.పాక్‌ ఓవరాక్షన్‌కాగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ వరల్డ్‌కప్‌ టోర్నీ-2026కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడేలా ఒప్పందం కుదిరింది. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని పాక్‌ బెదిరింపులకు దిగింది. దీంతో ఐసీసీ- పీసీబీతో చర్చలు జరుపగా యూటర్న్‌ తీసుకుని.. టీమిండియాతో ఆడేందుకు అంగీకరించింది.ఇదిలా ఉంటే.. భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య కొన్నాళ్లుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను బీసీసీఐ విడుదల చేసింది. దీంతో భారత్‌లో తాము వరల్డ్‌కప్‌ ఆడము అని.. శ్రీలంకలో తమకు ఆడే అవకాశం ఇవ్వాలని బంగ్లా ఐసీసీని కోరింది. అయితే, బంగ్లాదేశ్‌ వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ.. మరోసారి ఆలోచించాలని సూచించింది.ఫైనల్‌గా యూటర్న్‌కానీ తమ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీ నుంచి తప్పుకొనేందుకైనా సిద్ధమని బంగ్లాదేశ్‌ చెప్పగా.. ఐసీసీ సరేనంది. బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చించింది. ఈ విషయంలో ఓవరాక్షన్‌ చేసిన పీసీబీ భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరణ అని కొత్తరాగం ఎత్తుకుంది. అయితే, శ్రీలంక, యూఏఈ, బంగ్లా బోర్డులు భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగకపోతే ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ లేఖలు రాశాయి. ఐసీసీ సైతం ఈ విషయంలో గట్టిగానే నిలబడింది. దీంతో పాక్‌ మాట మార్చి భారత్‌తో ఆడేందుకు అంగీకరించింది. చదవండి: పాక్‌ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్‌

U19 Team India Player Aaron George Grand interview2
వైభవ్‌ సూర్యవంశీతో ఆడటం మంచి కిక్‌

‘జీవితంలో ఏదీ ఈజీ కాదు. దేనినైనా కఠోర శ్రమతోనే సాధించగలం. నేను కూడా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగినట్లు కష్టపడ్డా. స్కూల్‌కు వెళ్తూనే రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ కొనసాగించా’ అని చెప్పాడు అండర్‌–19 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టు ఓపెనర్, నగర యువకుడు అరోన్‌ జార్జి. జింబాబ్వే–నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి–20 ప్రపంచ కప్‌ను గెలిచిన అనంతరం స్వదేశానికి చేరుకున్న జార్జిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌ వరకు తన ప్రయాణం, ఆ మెగా టోర్నీలో అనుభవాలను పంచుకున్నాడు. ప్రాక్టీస్‌కు తోడు నిత్యం తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగానని తెలిపాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉందని, జీవిత లక్ష్యం టీమ్‌ఇండియాకు ఆడటమేనని వివరించాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ దిగ్గజాలు అజారుద్దీన్, వీవీఎస్‌ లక్ష్మణ్, అంబటి రాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయన్నాడు. లక్ష్మణ్‌ మెంటార్‌షిప్‌ తనకు ప్రేరణ ఇచ్చిందని పేర్కొన్నాడు. అరోన్‌ జార్జి ఇంకా ఏమన్నాడో అతడి మాటల్లోనే...! సచిన్‌ టెండూల్కర్‌ ప్రేరణతోనే క్రికెటర్‌ను కావాలని నిర్ణయించుకున్నా. నాలుగో ఏట నుంచే బ్యాట్‌ పట్టా. ప్లాస్టిక్‌ బ్యాట్‌తో ప్రాక్టీస్‌ మొదలుపెట్టా.. నా బ్యాటింగ్‌ స్టైల్‌ చూసి మా నాన్న క్రికెట్‌ వైపు మళ్లించాడు. ప్రాక్టీస్, మ్యాచ్‌లకు వెళ్లే సపమయంలో తెల్లవారు జామున మూడున్నరకే అమ్మ నిద్ర లేచి అన్నీ సిద్ధం చేసేది. నాన్న ఈసో వర్గీస్‌ విశ్రాంతి పోలీస్‌ అధికారి. అమ్మ ప్రీతి గృహిణి. అక్క నల్సార్‌లో లా చదువుతోంది. ఈ ముగ్గురూ నాకోసం చాలా కష్టపడ్డారు. అతడితో ఓపెనింగ్‌ మంచి అనుభవం 14 ఏళ్ల బిహార్‌ కుర్ర సంచలనం వైభవ్‌ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయడం మంచి కిక్‌ ఇచ్చింది. అతడు మంచి హిట్టర్‌. ఇద్దరం సమన్వయంతో ఆడాం. సాలిడ్‌ షాట్స్‌ కొట్టాం. రన్‌ రేట్‌ పడిపోకుండా చూశాం. అండర్‌–19 ప్రపంచ కప్‌ జట్టులో అనేక రాష్ట్రాల వారున్నా.. క్రీడా స్ఫూర్తితో.. భారత జట్టుగా మందుకుసాగాం.నైపుణ్యం పెంచుకోవడమే అతిపెద్ద సవాలు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవడమే అతిపెద్ద సవాలు. నాకు నేనే కొత్త సవాళ్లను పెట్టుకునేవాడిని. అందుకు అనుగుణంగా ప్రాక్టీస్‌ చేసి వాటిని అధిగమించేవాడిని. భారత అండర్‌–19 జట్టుకు ఎంపిక కావడం నాలో మరింత ఉత్సాహం పెంచింది. టీమ్‌ ఇండియాకు ఆడాలన్న జీవిత లక్ష్యానికి దగ్గరయ్యాననే ఆనందం కలిగింది. చిన్న ప్రాంతమైన మల్లాపూర్‌ నుంచి ప్రపంచ కప్‌నకు చేరుకోవడం అంతా కలగా ఉంది. గత ఏడాది నా కెపె్టన్సీలోనే హైదరాబాద్‌ జట్టు వినూ మన్కడ్‌ ట్రోఫీని నెగ్గింది. ఇదే టోరీ్నలో అంతకుముందు రెండు సీజన్లు 300 పైగా పరుగులు చేయడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది.నాన్న స్నేహితుడే.. తొలి శిక్షకుడు నాకు నాలుగేళ్ల వయసు ఉండగా.. చాలా చిన్నగా ఉండేవాడిని. ఎక్కడకు వెళ్లినా చిన్న పిల్లవాడివంటూ ఎవరూ తీసుకోలేదు. నా ఆట తీరును చూసి.. ప్రతిభ ఉందని నాన్న స్నేహితుడు సుభాష్‌ చందర్‌ గుర్తించారు. నాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నా తొలి గురువు ఆయనే. వర్షం వచి్చనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టలేదు. లెక్కకు మించి గాయాలు అయ్యాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యం, పట్టుదలతో ముందుకుసాగాను. తార్నాక వీజే క్రికెట్‌ అకాడమీ కోచ్‌ విజు నాయర్‌ మెళకువలు నేర్పారు. నన్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం భారత అంతర్జాతీయ జట్టు మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాను.పిల్లలూ చదువును మరువొద్దు.. ఇప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు క్రికెట్‌ అకాడమీలలో చేరుతున్నారు. ఇది మంచిదే. కానీ, క్రికెట్‌తో పాటు చదువుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. పైస్థాయికి వెళ్లినప్పుడు, ఇంటర్వ్యూల సమయంలో విద్య మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది.

BCCI bars players from staying with families sticks to its policy: Report3
T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో అనుమతికాగా నలభై ఐదు రోజుల్లోపు విదేశీ పర్యటనలో భాగంగా క్రికెటర్లు, సహాయక సిబ్బంది తమ కుటుంబ సభ్యులను వారం రోజుల పాటు అక్కడే ఉండేలా బీసీసీఐ గతంలో అనుమతించేది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనలో దారుణ ప్రదర్శనతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌ చేతిలో 3-1తో టీమిండియా ఓడిపోవడంతో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.కొంతమంది ఆటగాళ్లు కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కొన్నిసార్లు సమావేశాలకు కూడా డుమ్మా కొట్టడంతో.. ఇకపై విదేశీ పర్యటనలకు కుటుంబాన్ని అనుమతించబోమని ప్రకటించింది. అయితే, ఈ విషయంలో బీసీసీఐ తాజా వైఖరి ఏమిటన్న అంశంపై ప్రస్తుత యాజమాన్యం బోర్డును సంప్రదించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది.తాజా వైఖరి ఇదే..‘‘టీమిండియా మేనేజ్‌మెంట్‌ బీసీసీఐని సంప్రదించింది. ఆటగాళ్ల భార్యలు, ఫియాన్సీలు వారితో ప్రయాణం చేయవచ్చా? వారితోనే ఉండవచ్చా? అని అడిగింది. ఇందుకు బోర్డు స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కుటుంబాలు ఆటగాళ్లతో స్టే చేయవద్దని చెప్పింది.వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని.. అది కూడా వారు కోరితే మాత్రమే ఈ వెసలుబాటు ఉంటుందని తెలిపింది’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. వరల్డ్‌కప్‌ టోర్నీతో బిజీకాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో బిజీగా ఉంది. భారత్‌- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ లీగ్‌ దశలో సూర్య సేన లీగ్‌ దశలో మూడు మ్యాచ్‌లో సొంతగడ్డపై.. పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 15 నాటి మ్యాచ్‌ కొలంబోలో ఆడుతుంది.ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ ఆసాంతం టీమిండియా ప్రైవేటు చార్టర్‌లోనే ప్రయాణిస్తుందని సమాచారం. అదే విధంగా.. ఆటగాళ్లు తమ వ్యక్తిగత చెఫ్‌లను తీసుకువచ్చేందుకు అనుమతించిన యాజమాన్యం.. ఆటగాళ్లు బస చేసే హోటల్‌కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే భోజనాన్ని ఆటగాళ్లకు పంపేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలుత అమెరికాతో తలపడ్డ టీమిండియా.. ఐసీసీ ఈవెంట్‌ను విజయంతో ఆరంభించింది. రెండోమ్యాచ్‌లో గురువారం నమీబియాతో భారత్‌ తలపడుతుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ మైదానం వేదిక.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనం

PCB Chief Mohsin Naqvi Confronted Over T20 WC U Turn Struggles To4
పాక్‌ కోసం బంగ్లాను ఒప్పించారా?: నీళ్లు నమిలిన పీసీబీ చీఫ్‌

ఊహాగానాలే నిజమయ్యాయి. టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరణ నిర్ణయాన్ని పాకిస్తాన్‌ మార్చుకుంది. క్రికెట్‌ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం తెలిపింది.యూటర్న్‌ వెనుక గల కారణాలు?ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) చైర్మన్‌ మొహ్సిన్‌ నక్వీ సోమవారం ధ్రువీకరించాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ మీడియా సమావేశం సందర్భంగా నక్వీ ‘బాయ్‌కాట్‌’ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్టర్‌.. యూటర్న్‌ వెనుక గల కారణాలు, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)తో చర్చల వల్ల పాక్‌కు ప్రయోజనం చేకూరిందా? అని అడిగాడు.శుభవార్తలే అందిస్తాంఇందుకు బదులుగా.. ‘‘కొన్ని నిమిషాల ముందే మా నిర్ణయం మార్చుకున్నాం’’ అని నక్వీ సమాధానమిచ్చాడు. మరి అయితే శుభవార్త ఉందా? అని ఇంటర్వ్యూయర్‌ ప్రశ్నించగా.. ‘‘మేము ఎల్లప్పుడూ శుభవార్తలే అందిస్తాం కదా!.. బంగ్లాదేశ్‌ ఈ విషయంలో ఏం చెప్పిందో అందరూ చూశారు కదాపాకిస్తాన్‌ ఇండియాతో మ్యాచ్‌ ఆడాలని బంగ్లాదేశ్‌ అభ్యర్థించింది. వాళ్ల సమస్యలు తొలగిపోయాయి. అందుకే వాళ్లు మమ్మల్ని భారత్‌తో మ్యాచ్‌ ఆడమని చెప్పారు’’ అని నక్వీ పేర్కొన్నాడు.మన కోసం ఏమీ అడగలేదా?అయితే, మన (పాకిస్తాన్‌) సొంత ప్రయోజనాల కోసం వారు ఈ విషయంలో అంగీకరించేలా చేశామా? అని రిపోర్టర్‌ అడుగగా.. ‘‘కేవలం బంగ్లాదేశ్‌కు మద్దతుగా మాత్రమే మనం నిలబడ్డాం. ఇది వాళ్ల సొంత విషయం. మనకోసం మనం ఏమీ అడగలేదు’’ అని నక్వీ నీళ్లు నమిలాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపించిన బంగ్లాదేశ్‌.. తమ వేదికను కూడా లంకకు మార్చాలని ఐసీసీని కోరింది.అయితే, బంగ్లాదేశ్‌ చెప్పినదాంట్లో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. నిర్ణయం మార్చుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది. కానీ బంగ్లా పట్టువీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది ఐసీసీ.పాకిస్తాన్‌ జోక్యం..ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటూ తొలుత తాము బంగ్లాకు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చి.. ఆ తర్వాత కేవలం భారత్‌తో మాత్రమే మ్యాచ్‌ ఆడమని మాట మార్చింది. ఒకవేళ భారత్‌- పాక్‌ మ్యాచ్‌ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.రంగంలోకి లంక బోర్డుఈ క్రమంలో శ్రీలంక బోర్డు సైతం పాక్‌ నిర్ణయం పట్ల ఘాటుగా స్పందించింది. గతంలో పాక్‌ పర్యటనలో తమపై ఉగ్రదాడి జరిగినా.. ఇంకా ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమ జట్టు అక్కడ పర్యటించేలా చేస్తున్నామని పేర్కొంది. కానీ ఇప్పుడు తమ దేశంలో భారత్‌తో ఆడే మ్యాచ్‌ను పాక్‌ బహిష్కరిస్తే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినందున భారీగా నష్టపోవాల్సి ఉంటుందని పాక్‌కు లేఖ రాసింది.బంగ్లాకు రిలీఫ్‌యూఏఈ సైతం ఇదే తరహాలో పీసీబీకి లేఖ రాయగా.. బంగ్లాదేశ్‌ సైతం భారత్‌తో మ్యాచ్‌ ఆడాలని కోరింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బృందం లాహోర్‌ వెళ్లి పీసీబీ చైర్మన్‌తో చర్చించగా.. బంగ్లాదేశ్‌కు ఊరట లభించింది. టోర్నీ నుంచి తప్పుకొన్నందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ఐసీసీ పేర్కొంది.ఇదిలా ఉంటే.. పాక్‌ బంగ్లాదేశ్‌ను అడ్డుపెట్టుకుని భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ, తమ ఆటగాళ్లతో భారత జట్టు కరచాలనం చేయడం.. తదితర షరతులు పెట్టినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఐసీసీ ఇందుకు నిరాకరించి కేవలం బంగ్లా విషయంలో మాత్రమే సానుకూలంగా స్పందించిందని తెలిసింది. ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారగా.. నక్వీ తమ కోసం ఐసీసీని ఏమీ అడగలేదని ప్రత్యేకంగా నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ తలపడటం ఖాయమైంది.చదవండి: Bangladesh Cricket: ఐసీసీ మీటింగ్.. బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డ్‌కి ఉపశమనంMohsin Naqvi Statement on India Vs Pakistan match #PAKvIND #Pakistan pic.twitter.com/Mm523Uldb3— Ravish Bisht (@ravishbofficial) February 9, 2026

Auqib Nabi 12 Wickets Jammu Kashmir Beat MP Enter Ranji Semis5
మధ్యప్రదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్‌

రంజీ ట్రోఫీ నాకౌట్‌ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్‌ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్‌ తొలి సారి టోర్నీ సెమీస్‌ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్‌లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్‌ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్‌ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్‌లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్‌ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కశ్మీర్‌ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్‌ మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్‌ నబీఇండోర్‌ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్‌ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్‌.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్‌ జైన్‌ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్‌ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్‌ బౌలర్‌ ఆఖిబ్‌ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్‌ ముస్తాక్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్‌ నబీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్‌... భారత బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్‌ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్‌ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్‌నైట్‌ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్‌ నాయర్‌ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్‌ స్మరణ్‌ (123 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లోనే 147 బంతుల్లో రాహుల్‌ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్‌ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్‌ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్‌ గోపాల్‌ (1), కృతిక్‌ కృష్ణ (2) అవుట్‌ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్‌ పాటిల్‌ (30 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్‌తో కర్నాటక తలపడుతుంది.

Will RCB play IPL matches at Chinnaswamy Stadium?6
IPL 2026: బెంగళూరు స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు!

ఎన్నో ప్రఖ్యాత క్రికెట్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఓ ఘోరం తరువాత అపఖ్యాతి పాలైంది. అక్కడ మ్యాచ్‌లను చూడాలనే క్రికెట్‌ అభిమానులు, నగర వాసుల ఆకాంక్ష ఎప్పుడు తీరేనా? అని ఎదురు చూస్తున్నారు. బుధవారం ఏదో ఒకటి నిర్ధారణ కానుంది.సాక్షి బెంగళూరు: చిన్నస్వామి మైదానంలో ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీల నిర్వహణపై అనుమతి గురించి బుధవారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో ఆర్‌సీబీ విజయోత్సవాలలో చిన్నస్వామి క్రికెట్‌ మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడడంతో అప్పటినుంచి ఐపీఎల్‌ సహా అన్నిరకాల మ్యాచ్‌లను నిర్వహించడం లేదు. ఆ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మైకేల్‌ కున్హా నేతృత్వంలో ఒక కమిటీతో విచారణ జరిపించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి క్రికెట్‌ పోటీలు నిర్వహించాలంటే ఏమేమి భద్రతా చర్యలు తీసుకోవాలో పలు సిఫారసులు చేసింది. ఇందుకు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) కూడా ఆమోదించింది. రేపు సీఎంతో భేటీలో తీర్మానం: హోంమంత్రి ఈ నేపథ్యంలో బుధవారం జరిగే ముఖ్య సమావేశంలో ఐపీఎల్‌ పోటీల నిర్వహణపై ఒక నిర్ణయానికి వస్తామని రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో మీడియాతో మాట్లాడుతూ సోమవారం ఉదయం అధ్యక్షుడు వెంకటేశ్‌ప్రసాద్, అధికార ప్రతినిధి వినయ్‌ మృత్యుంజయ, ఆర్‌సీబీ ప్రతినిధి రాజేశ్‌ మీనన్‌ తనను కలసి మ్యాచ్‌ల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. బెంగళూరులో ఐపీఎల్‌ నిర్వహణకు అనుమతివ్వాలని కోరినట్లు, ఇదే సమయంలో ఈ ఏడాది ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నామో వివరించారన్నారు. తాను సీఎం సిద్ధరామయ్యతో ఈ విషయంపై చర్చించాల్సి ఉందని, అందుకే బుధవారం ఐపీఎల్‌ నిర్వహణపై తుది దఫా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల భద్రత ప్రభుత్వం బాధ్యత అని, తొక్కిసలాటలు వంటివి పునరావృతం కాకూడదని, జీబీఏ కమిషనర్, నగర పోలీసు కమిషనర్, విద్యుత్‌ తదితర శాఖల ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. తీయని వార్త రావచ్చు: వెంకటేశ్‌ అభిమానులకు త్వరలోనే తీయని వార్త వస్తుందని ఆశిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ తెలిపారు. హోంమంత్రిని కలసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. వీలయినంత త్వరగా పోటీల నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం సూచించిన సిఫార్సులన్నింటినీ తమ అసోసియేషన్‌ పూర్తిగా పాటిస్తుందని చెప్పారు.

Sachin Tendulkar gifts his shirt to U19 World Cup hero Ayush Mhatre 7
‘ఎంతో ఎత్తుకు ఎదగాలి’

అండర్‌–19 ప్రపంచ కప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన కెపె్టన్‌ ఆయుశ్‌ మాత్రేకు అరుదైన ప్రత్యేక ప్రశంస లభించింది. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్వయంగా మాత్రేను అభినందించి అతని విజయంపై శుభాకాంక్షలు చెప్పాడు. 2013లో తాను ఆడిన ఆఖరి టెస్టు సిరీస్‌లో ధరించిన జెర్సీని కూడా సచిన్‌ బహుమతిగా అందజేశాడు. ముంబైకి చెందిన మాత్రే కెరీర్‌లో మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని సచిన్‌ ఆకాంక్షించాడు. మాత్రే ఇప్పటికే రెండు సీజన్లలో కలిపి ముంబై తరఫున 13 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు.

Play the match against India: Government orders the Pakistan team8
భారత్‌తో మ్యాచ్‌ ఆడండి: పాకిస్తాన్‌ జట్టుకు ప్రభుత్వ ఆదేశం

టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమంటూ మొండికేసిన పాకిస్తాన్‌ జట్టు వెనక్కి తగ్గింది. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లో టీమిండియాతో తలపడాలని ఆ దేశ ప్రభుత్వం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను ఆదేశించింది. క్రికెట్‌ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంక, బంగ్లాదేశ్‌లనుంచి వచ్చిన అభ్యర్థనలకు స్పందిస్తూ భారత్‌తో మ్యాచ్‌కు పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ ఓకే చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతక ముందు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ), పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సంజోగ్‌ గుప్తా వెల్లడించారు. వరల్డ్‌ కప్‌నుంచి దూరమైన బంగ్లాదేశ్‌కు మద్దతు పలకడంతో పాటు పలు డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. వీటిపై ఐసీసీ సానుకూలంగా స్పందించింది. బంగ్లా బోర్డుపై ఎలాంటి జరిమానాలు, ఆంక్షలు విధించమని హామీ ఇవ్వడంతో పాటు 2028 నుంచి 2031 మధ్య ఒక ఐసీసీ ఈవెంట్‌కు బంగ్లా ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కూడా ఐసీసీ చెప్పింది.

Icc Meeting Latest Update And No Action On Bangladesh Cricket Board9
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్

భారత్‍-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2026 జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది.దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారత్‌లో కాకుండాశ్రీలంకలో తమ మ్యాచ్‌లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్‌కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు.

South Africa Won Against Canada T20 World Cup 202610
దక్షిణాఫ్రికా శుభారంభం 

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచ కప్‌ గత టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్‌ ‘డి’లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగాడు. అన్‌‡్ష పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్‌ దలివాల్‌ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, హర్‌‡్ష ఠాకెర్‌ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. మార్క్‌రమ్‌ ఫిఫ్టీ... ఓపెనర్లు మార్క్‌రమ్, డికాక్‌ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్‌ మార్క్‌రమ్‌ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్‌ వెనుదిరిగిన తర్వాత ర్యాన్‌ రికెల్టన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కెపె్టన్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్‌ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్‌రమ్‌ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్‌రమ్, రికెల్టన్, బ్రెవిస్‌ (6) అవుటయ్యారు. డేవిడ్‌ మిల్లర్‌ (23 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది. మెరిపించిన నవ్‌నీత్‌ దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్‌గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్‌ప్రీత్‌ (0), యువరాజ్‌ (12) సహా నికోలస్‌ కిర్టన్‌ (4) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలోనే మొవ్వ శ్రేయస్‌ (9) కూడా అవుట్‌ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్‌నీత్‌ దలివాల్, హర్‌‡్ష ఠాకెర్‌ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించాక హర్‌‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్‌నీత్‌ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement