Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Mustafizur Rahman Breaks Silence On KKR Exit Ahead Of IPL 20261
వారు తొలిగిస్తే నేనేం చేయగలను?

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల సెగ ఐపీఎల్‌కు తగిలింది. 2026 సీజన్‌ కోసం వేలం ద్వారా ఎంపికైన ఏకైక బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టునుంచి విడుదల చేస్తున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం ప్రకటించింది.ఐపీఎల్‌-2026 వేలంలో ముస్తాఫిజుర్ ను రూ. 9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడనివ్వకూడదని భారత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.అంతేకాకుండా ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకున్నందుకు కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. కొందరు రాజకీయ నాయకులు అతడిని "దేశద్రోహి" అని కూడా మండిపడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాల్సిందిగా కేకేఆర్ యాజమాన్యానికి సూచించారు.దీంతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి తప్పించింది. ఇక ఈ విషయం‍పై ముస్తఫిజుర్ తొలిసారి స్పందించాడు. "వారు నన్ను విడుదల చేస్తే, నేను మాత్రం ఏం చేయగలను?" అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది సీజన్‌ కోసం ముస్తఫిజుర్ స్ధానాన్ని మరొక ఆటగాడితో కేకేఆర్‌ భర్తీ చేయనుంది.ఇక ఇది ఇలా ఉండగా.. ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని, ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని అక్కడి క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఆదేశించడం గమనార్హం. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్‌-2026లో తమ లీగ్‌ మ్యాచ్‌లను భారత్‌ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ను కోరనున్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! పాక్ బాట‌లోనే బంగ్లాదేశ్‌?

IND vs NZ: India drop Tilak varma for ODI series Against New zealand2
అయ్యో తిల‌క్.. సెంచరీ బాదినా చోటు దక్కలేదే?

విజయ్‌హజారే వన్డే ట్రోఫీ 2025-26లో హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టింది. శ‌నివారం రాజ్‌కోట్ వేదిక‌గా చండీగ‌ఢ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 136 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని హైద‌రాబాద్ అందుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. ఓపెనర్లు అమన్‌ రావు (13), తన్మయ్‌ అగర్వాల్‌ (16) విఫలం కాగా, అరంభంలోనే నిష్క్ర‌మించ‌గా.. అభిరత్‌ రెడ్డి (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు విఫలమైనా...పట్టుదలగా ఆడిన తిలక్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఓవ‌రాల్‌గా తిల‌క్ 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 109 ప‌రుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన చండీగఢ్‌ 37.4 ఓవర్లలో 150 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ సంయమ్‌ సైనీ (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రక్షణ్‌ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, నితీశ్‌ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.తిల‌క్‌కు నో ఛాన్స్‌..తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న‌ప్ప‌టికి న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ తిరిగి రావ‌డంతో తిల‌క్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌పై సెలెక్ట‌ర్లు వేటు వేశారు.వీరిద్ద‌రూ సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో భార‌త త‌రపున ఆడారు. వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో తిల‌క్ ఆడిన‌ప్ప‌టికి.. బ్యాటింగ్ చేసే అవ‌కాశం రాలేదు. తిల‌క్ టీ20ల‌తో పాటు లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు. కానీ జ‌ట్టు కూర్పు దృష్ట్యా అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.కివీస్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌

Bangladesh to ask ICC for change of T20 World Cup 2026 venues after Mustafizur Rahman-IPL saga3
భారత్‌లో ఆడబోము..! పాక్ బాట‌లోనే బంగ్లాదేశ్‌?

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026.. ప్రారంభానికి ముందే హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌తో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తఫిజుర్ రెహమన్‌ను తమ జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ముస్తఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించరాదంటూ కొంత కాలంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. బంగ్లా పేస్‌ బౌలర్‌ బరిలోకి దిగితే టీమ్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌పై కూడా దాడులు చేస్తామంటూ పలు చోట్ల హెచ్చరికలు జారీ అయ్యాయి.వీటిని దృష్టిలో ఉంచుకుంటూ అతడిని తప్పించాలంటూ స్వయంగా బీసీసీఐ కేకేఆర్‌ యాజమాన్యానికి సూచించింది. దీంతో బోర్డు ఆదేశాల మేరకు జట్టు నుంచి ముస్తఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బాటలోనే బంగ్లాదేశ్ కూడా పయనించనున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాదిరిగానే వరల్డ్‌కప్‌లో ఆడే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తుందంట."ముస్తాఫిజుర్‌ను విడుదలకు సంబంధించి నేను ఎటువంటి వ్యాఖ్య చేయలేను. ఎందుకంటే అది పూర్తిగా బీసీసీఐ, ఫ్రాంచైజీ అంతర్గత విషయం. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే విషయానికి వస్తే, అది ఐసీసీ నిర్వహించే ఈవెంట్. ఈ విషయంపై త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీతో చర్చిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్తాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించిన విషయం తెలిసిందే. మేము కూడా మా డిమాండ్లను ఐసీసీ ముందు పెడతాము. ఇందుకు సంబంధించి ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని" బీసీసీఐ సీనియర్ అధి​కారి ఒకరు పేర్కొన్నారు.ఇదే విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పందించాడు. "బీసీబీ సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఒక ఆటగాడు భారత్‌లో ఆడలేనప్పడు.. మొత్తం బంగ్లాదేశ్ జట్టు అక్కడ సురక్షితంగా ఉంటుందన్న నమ్మకం మాకు లేదు. అందుకే మా నాలుగు లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని జైషా నేతృత్వంలోని ఐసీసీని కోరమని బోర్డుకు సూచించాను" అని బీసీబీకి రాసిన లేఖలో ఆసిఫ్ పేర్కొన్నాడు.కాగా వ‌ర‌ల్డ్ క‌ప్ గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్‌ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌, 9న ఇటలీ, 14న ఇంగ్లండ్‌, 17న వాంఖడేలో నేపాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: VHT 2025-26: అర్షిన్‌, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్‌

Vijay Hazare Trophy Round 5: Maharashtra thrashes Mumbai by 128 runs4
అర్షిన్‌, పృథ్వీ షా మెరుపులు.. ముంబై జోరుకు బ్రేక్‌

జైపూర్‌: విజయ్‌ హజారే వన్డే టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబైని మహారాష్ట్ర నిలువరించింది. గ్రూప్‌ ‘సి’లో శనివారం జరిగిన పోరులో మహారాష్ట్ర 128 పరుగుల భారీ తేడాతో ముంబైపై ఘనవిజయం సాధించింది. మొదట మహారాష్ట్ర 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 366 పరుగుల భారీ స్కోరు చేసింది.‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్షిన్‌ కులకర్ణి (114 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, పృథ్వీ షా (75 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. తొలి వికెట్‌కు వీరిద్దరు 140 పరుగులు జోడించారు. కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (52 బంతుల్లో 66; 7 ఫోర్లు)కూడా ఫిఫ్టీ బాదాడు. ఆఖర్లో రామకృష్ణ ఘోష్‌ (27 బంతుల్లో 64; 3 ఫోర్లు; 5 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తుషార్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ముంబై 42 ఓవర్లలోనే 238 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ అంగ్‌క్రిష్‌ రఘువంశీ (88 బంతుల్లో 92; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), సిద్ధేశ్‌ లాడ్‌ (41 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర బౌలర్లలో ప్రదీప్‌ 3, సత్యజీత్‌ 2 వికెట్లు తీశారు. ఐదు మ్యాచ్‌లాడిన ముంబైకి ఇది తొలి పరాజయం కాగా, మహారాష్ట్రకిది మూడో విజయం.

 Pants unbeaten 67 propels Delhi to eight-wicket win over Services5
రిష‌బ్ పంత్ విధ్వంసం.. 4 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌ర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్‌ స్టార్‌ హర్షిత్‌ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ మూడు, ఇషాంత్‌, సైనీ తలా వికెట్‌ సాధించారు. సర్వీసెస్‌ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పుల్కత్‌ నరాంగ్‌ 22 పరుగులు చేశాడు.రాణా, పంత్‌ మెరుపులు..అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.ఈ ఏడాది సీజన్‌లో పంత్‌కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్‌లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.Rishabh Pant when people start doubting him. pic.twitter.com/mnXCLPxp5p— Vaibhav (@spideynation_) January 3, 2026

Injustice with Mohammed Shami – Bengal coach lashes out at BCCI over snub from India's ODI squad6
'షమీకి అన్యాయం.. ఇది నిజంగా సిగ్గు చేటు'

టీమిండియా స్టార్ మహ్మద్ షమీకి జాతీయ సెలెక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. న్యూజిలాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో ష‌మీకి చోటు ద‌క్క‌లేదు. కివీస్‌తో వ‌న్డే సిరీస్‌కు ష‌మీని ఎంపిక చేయ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.కానీ అజిత్ అగార్క‌ర్ అండ్ కో మాత్రం షమీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. జ‌స్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా పేస్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. భారత జట్టుకు తిరిగి ఆడాలంటే అతడు ఇంకా ఏమి చేయాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ జ‌ట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా సెలెక్ట‌ర్ల‌పై తీవ్ర స్ధాయిలో మండిప‌డ్డాడు.దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న‌ప్ప‌టికి, ష‌మీని జాతీయ జ‌ట్టులోకి ఎందుకు తీసుకోవ‌డం లేద‌ని అత‌డు ఫైర‌య్యాడు. ష‌మీ చివ‌ర‌గా భార‌త్ త‌ర‌పున గ‌తేడాది మార్చిలో ఆడాడు. అప్ప‌టి నుంచి జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ దేశ‌వాళీ క్రికెట్‌లో మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా ఆడుతున్నాడు.షమీకి అన్యాయం..సెలక్షన్ కమిటీ మ‌రోసారి మహమ్మద్ షమీకి అన్యాయం చేసింది. ఇటీవలి కాలంలో ఏ అంతర్జాతీయ ఆటగాడు కూడా షమీ అంత ప‌ట్టుద‌ల‌తో దేశ‌వాళీ క్రికెట్ ఆడ‌లేదు. డొమెస్టిక్ క్రికెట్‌లో అత‌డు అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌టికి సెలెక్ట‌ర్లు ఎంపిక చేయ‌క‌పోవ‌డం నిజంగా సిగ్గు చేటు అని రేవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శుక్లా పేర్కొన్నాడు. ష‌మీ ప్ర‌స్తుతం దేశ‌వాళీ క్రికెట్‌లో సీజ‌న్‌లో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26లో బెంగాల్ త‌ర‌పున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ, విజ‌య్ హ‌జారే ట్రోఫీలోన అత‌డు అద‌ర‌గొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 45 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. అయితే ష‌మీ ఫామ్ లేదా ఫిట్‌నెస్ విష‌యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యానికి హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ లాంటి బౌల‌ర్ల‌ను సిద్దం చేయాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ష‌మీకి అవ‌కాశ‌మివ్వ‌డం లేద‌ని క్రికెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డతున్నారు.న్యూజిలాండ్ వన్డేలకు భారత జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కె.ఎల్. రాహుల్ (కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

BCCI rejects Bangladesh tour as BCB unanimously announces 2026 schedule7
బీసీసీఐ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

భార‌త పురుష‌ల‌ క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో మూడు వ‌న్డేలు, టీ20ల‌ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే మ‌రోసారి ఈ ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా ప‌ర్య‌ట‌నను బీసీసీఐ తాత్కాలికంగా ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్‌ అధి​కారి ఒకరు ధ్రువీకరించారు."బంగ్లాదేశ్ టూర్‌ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్‌ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం​ నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బం‍గ్లాదేశ్ మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా భారత్‌-బంగ్లా జట్టు వైట్‌బాల్ సిరీస్ షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్‌ కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది. ముస్తాఫిజుర్ ఔట్‌..అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్‌ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్‌లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్‌ ఖాన్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్‌ను సూచించింది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

India U19 posted a total of 300 runs Against South Africa U198
వైభవ్ విఫలమైనా.. టీమిండియా భారీ స్కోర్‌

బెనోని వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా అండ‌ర్‌-19తో జ‌రుగుతున్న మొద‌టి యూత్ వ‌న్డేలో భార‌త్ అండ‌ర్‌-19 జట్టు బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(11), వైస్ కెప్టెన్ ఆరోన్ జార్జ్(11), త్రివేది(21) వంటి టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి.. మిడిలార్డర్‌, లోయార్డర్ బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.ముఖ్యంగా 19 ఏళ్ల హర్వంశ్ సింగ్ పంగాలియా అసాధరణ పోరాటం కనబరిచాడు. క్లిష్ట సమయంలో హర్వంశ్‌.. అంబరీష్‌తో కలిసిఐదో వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పంగాలియా 95 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు అంబరిష్‌(65), కన్షిక్ చౌహన్‌(32), ఖిలాన్ పటేల్‌(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బాసన్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. సోనీ,బాసన్‌, మబాతా తలా వికెట్ సాధించారు. కాగా ఈ సిరీస్ అండర్‌-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే వైభవ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. కానీ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ విఫలమయ్యాడు.తుది జట్లుభారత్ అండర్‌19: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ వర్గీస్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (కీపర్), హర్వంశ్ పంగాలియా, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, మహమ్మద్ ఎనాన్, ఖిలన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్.దక్షిణాఫ్రికా అండర్ -19:మొహమ్మద్ బుల్బులియా (కెప్టెన్), జోరిచ్ వాన్ షాల్క్‌వైక్, అద్నాన్ లగాడియన్, జేసన్ రౌల్స్, అర్మాన్ మనక్, పాల్ జేమ్స్, బండిల్ మబాతా, లెతాబో పహ్లామోహ్లాకా (కీపర్), జెజె బాసన్, బయండా మజోలా, నితాండో సోని.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

Indias squad for New Zealand ODIs announced9
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ వచ్చేశాడు

న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన‌ భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ శ‌నివారం ప్ర‌క‌టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులోకి తిరిగొచ్చారు. అయితే అయ్యర్ ఇంకా బీసీసీఐ వైద్యబృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాల్సింది. జనవరి 6 న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున శ్రేయస్ ఆడనున్నాడు. దీంతో అతడు ఫిట్‌నెస్ లెవల్స్ వైద్యులు అంచనా వేయనున్నారు. అతడు ఎటువంటి సమస్య లేకుండా ఆడితే కివీస్‌తో వన్డే సిరీస్‌లో కూడా భాగం కానున్నాడు. ఒకవేళ ఈ ముంబై బ్యాటర్‌కు ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు వెళ్లనున్నాడు.రుతురాజ్‌పై వేటు..ఇక అయ్యర్ రీ ఎంట్రీతో మహారాష్ట్ర కెప్టెన్, స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌పై వేటు పడింది. సౌతాఫ్రికాతో సిరీస్‌లో గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో స‌త్తాచాటిన‌ప్ప‌టికి.. జట్టు కూర్పు దృష్ట్యా అతడిని సెలక్టర్లు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచకప్‌-2026ను దృష్టిలో ఉంచుకుని జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి ఇచ్చారు. దీంతో మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్‌, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణాలతో కూడిన పేస్ దళాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు.షమీకి నో ఛాన్స్‌..ఇక​ దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు మరోసారి మొండి చేయి చూపించారు. అతడిని కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్నారని వార్తలు వచ్చినప్పటికి.. సెలక్టర్లు మాత్రం మొగ్గు చూపలేదు. షమీ గతేడాది మార్చి నుంచి భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు.పంత్‌కే ఓటు..అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను వన్డే జట్టు నుంచి తప్పించనున్నారని వార్తలకు సెలక్టర్లు చెక్ పెట్టారు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను ఎంపిక చేశారు. అతడిని తప్పించి ఇషాన్ కిషన్‌కు చోటు ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం పంత్‌కే ఓటేశారు. కేఎల్ రాహుల్ బ్యాకప్‌గా పంత్ ఉండనున్నాడు. హార్దిక్‌ పాండ్యా గైర్హాజరీలో ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డికి చోటు దక్కింది. ఇక కివీస్‌-భారత్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది.కివీస్‌తో వన్డేలకు భారత జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్‌, అర్ష్‌దీప్‌

Why Devdutt Padikkal is unlikely to find place in IND vs NZ ODIs despite 4 100s in 5 VHT games10
5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన ఆర్సీబీ స్టార్‌

విజ‌య్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో త‌మిళ‌నాడు, కేర‌ళ‌పై సెంచ‌రీల‌(147, 124)తో స‌త్తాచాటిన ప‌డిక్క‌ల్‌.. త‌ర్వాత‌ తమిళనాడు మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూప‌ర్ సెంచ‌రీతో మెరిశాడు. మ‌ళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన క‌ర్ణాట‌కు త్రిపుర బౌల‌ర్లు గ‌ట్టి షాకిచ్చారు. కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌(5), క‌రుణ్ నాయ‌ర్‌(0) ఆరంభంలోనే పెవిలియ‌న్‌కు చేరారు. ఈ క్ర‌మంలో ప‌డిక్క‌ల్ నిల‌క‌డ‌గా ఆడి త‌న 13వ లిస్ట్‌-ఎ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.సెల‌క్ట‌ర్లకు హెడ్ ఎక్‌..అయితే ప‌డిక్క‌ల్‌ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పడిక్కల్‌ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశ‌వాళీ క్రికెట్‌లో ప‌డిక్క‌ల్‌కు ఓపెన‌ర్‌గా మంచి రికార్డు ఉంది. అయితే భార‌త జ‌ట్టులో ప్ర‌స్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు. రోహిత్ శ‌ర్మ‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్ భార‌త జ‌ట్టు ఓపెన‌ర్ల‌గా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌లో గిల్ స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన య‌శ‌స్వి సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అయిన‌ప్ప‌టికి గిల్ తిరిగి రావ‌డంతో య‌శ‌స్వి బెంచ్‌కే ప‌రిమితం కానున్నాడు. అలా అని మిడిలార్డ‌ర్‌లో చూసుకున్నా ప్ర‌తీ ఒక్క‌రూ సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. ఒక‌వేళ వైస్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి వ‌స్తే రుతురాజ్‌, తిల‌క్ వ‌ర్మ‌లపై కూడా వేటు ప‌డే అవ‌కాశ‌ముంది. సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో రుతురాజ్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని త‌ప్పించి పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.లిస్ట్‌-ఎ క్రికెట్‌లో అదుర్స్‌..లిస్ట్-ఏ క్రికెట్‌లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్‌ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. ప‌డిల్క్ భార‌త త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు టెస్టులు, టీ20లు ఆడిన‌ప్ప‌టికి.. వ‌న్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయ‌లేదు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్‌ 514 పరుగులతో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇకఇక కివీస్‌తో వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో ప‌లు మార్పులు చోటు చేసుకునే అవ‌కాశ‌ముంది. స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ వేటు వేయాల‌ని సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యించుకున్నట్లు స‌మాచారం.చదవండి: IND vs SA: కెప్టెన్‌ వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement