Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pollard replaces Rashid Khan in MI Cape Town for the remainder of SA201
కష్టాల్లో ఉన్న జట్టును వదిలేసిన రషీద్‌ ఖాన్‌

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఈ సీజన్‌ బరిలోకి దిగిన ఆ జట్టు.. అనూహ్య పరాజయాలు (8 మ్యాచ్‌ల్లో 5) ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఎలిమినేషన్‌ అంచును ఆ జట్టును తాజాగా రషీద్‌ ఖాన్‌ వీడి వెళ్లాడు. జాతీయ విధులకు (వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోసం) హాజరయ్యేందుకు రషీద్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ నుంచి తప్పుకున్నాడు.కష్ట సమయాల్లో రషీద్‌ వెళ్లిపోవడం మినుకుమినుకుమంటున్న ఎం కేప్‌టౌన్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసింది. రషీద్‌ స్థానంలో యాజమాన్యం పొట్టి క్రికెట్‌ దిగ్గజం కీరన్‌ పోలార్డ్‌ను జట్టులో చేర్చుకుంది. పోలార్డ్‌ జట్టులో చేరినా ఎంఐ ఫేట్‌ మారే అవకాశం లేదు. ఎందుకంటే ఆ జట్టుకు మరో రెండు అవకాశాలు (మ్యాచ్‌లు) మాత్రమే ఉన్నాయి.ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తే.. ఎం కేప్‌టౌన్‌ ఫేట్‌ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతుంది. బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్, రస్సీ వాన్ డర్ డసెన్, జేసన్ స్మిత్ లాంటి కీలక ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేయలేకపోతున్నారు. బౌలింగ్‌లో స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఫామ్‌లో లేడు. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు వదిలేయడం, లేని పరుగులను సమర్పించుకోవడం లాంటి పొరపాట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఈ లోపాలను అధిగమించగలిగితే ఎంఐ కేప్‌టౌన్‌ విజయాల బాట పట్టవచ్చు. పోలార్డ్ తన పవర్ హిట్టింగ్, ఫీల్డింగ్, మీడియం పేస్ బౌలింగ్‌తో కేప్‌టౌన్‌లో ప్లే ఆఫ్స్‌ దిశగా నడిపించాలని ఆ ఫ్రాంచైజీ అభిమానులు కోరుకుంటున్నారు. పోలార్డ్‌ 2024 ఎడిషన్‌లో రషీద్‌ ఖాన్‌ గాయపడినప్పుడు కేప్‌టౌన్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ సీజన్‌లో అతను 188 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసి, 4 వికెట్లు తీశాడు. పోలార్డ్‌ మరో 101 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొడతాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో పార్ల్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. మిగతా బెర్త్‌ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌ పోటపడుతున్నాయి.

KKR X factor Finn Allen in red hot form, smashes explosive 51 ball century in BBL2
ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకం.. జోష్‌లో కేకేఆర్‌ ఫ్యాన్స్‌

బిగ్‌బాష్‌ లీగ్‌ 2025-26లో పెర్త్‌ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్‌ ఆటగాడు ఫిన్‌ అలెన్‌ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా స్కార్చర్స్‌ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అలెన్‌కు ఇది ఐదో శతకం. బీబీఎల్‌లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్‌ అభిమానులతో పాటు కేకేఆర్‌ ఫ్యాన్స్‌లోనూ జోష్‌ నింపింది. అలెన్‌కు కేకేఆర్‌ 2026 సీజన్‌ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన అలెన్‌.. హాఫ్‌ సెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. కేవలం​ 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్‌ సంధు వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో అలెన్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదడం​ మ్యాచ్‌ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అలెన్‌ ఊచకోత కోయడంతో స్కార్చర్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కార్చర్స్‌.. అలెన్‌ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్కార్చర్స్‌ ఇన్నింగ్స్‌లో అలెన్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్‌ మార్ష్‌ 20, కూపర్‌ కన్నోలీ 18, ఆరోన్‌ హార్డీ 22, ఆస్టన్‌ టర్నర్‌ 13, లారీ ఈవాన్స్‌ 21, నిక్‌ హాబ్సన్‌ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్‌ బౌలర్లలో సామ్‌ ఇలియట్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్‌ తడబడింది. టిమ్‌ సీఫర్ట్‌ (66), జేక్‌ ఫ్రేజర్‌ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్‌ బౌలర్లు కన్నోలీ, బియర్డ్‌మన్‌ తలో 2, లూక్‌ హాల్ట్‌, ఆరోన్‌ హార్డీ చెరో వికెట్‌ తీసి రెనెగేడ్స్‌ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది.

Retired out in cricket, all you need to know3
రెండు రోజుల్లో ఇద్దరు.. క్రికెట్‌లో ఈ 'రిటైర్డ్‌ ఔట్‌' అంటే ఏంటి..?

పొట్టి క్రికెట్‌లో ఇటీవలికాలంలో 'రిటైర్డ్‌ ఔట్‌' అనే పదం​ తరుచూ వినిపిస్తుంది. రిటైర్డ్‌ ఔట్‌ అంటే ఆటగాడు ఇన్నింగ్స్‌ మధ్యలో గాయం కాని, అనారోగ్యానికి కాని గురి కాకుండానే పెవిలియన్‌కు చేరడం. సాధారణంగా ఎవరైనా ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతే రిటైర్డ్‌ హర్ట్‌ లేదా రిటైర్డ్‌ నాటౌట్‌గా పెవిలియన్‌కు చేరతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి కెప్టెన్ అనుమతిస్తే, ఆ ఆటగాడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించవచ్చు.కానీ, రిటైర్డ్‌ ఔట్‌ విషయంలో అలా కాదు. ఒక్కసారి ఆటగాడు ఈ కారణంగా క్రీజ్‌ వదిలితే తిరిగి బ్యాటింగ్‌కు దిగటానికి వీలుండదు. పొట్టి ఫార్మాట్లో కీలక సమయాల్లో బ్యాటర్లు నిదానంగా ఆడుతున్నప్పుడు రిటైర్డ్‌ ఔట్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. వూహ్యాల్లో భాగంగా ఇలా జరుగుతుంటుంది.అంతర్జాతీయ క్రికెట్‌లో రిటైర్డ్‌ ఔట్‌లు చాలా తక్కువగా నమోదైనప్పటికీ.. పొట్టి క్రికెట్‌లో, ముఖ్యంగా ఇటీవలికాలంలో ఈ తరహా ఔట్‌లు ఎక్కువుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ఐపీఎల్‌ (WPL) 2026 ఎడిషన్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డె్‌ ఔట్‌గా వెనుదిరిగారు.గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున అరంగేట్రం ప్లేయర్‌ ఆయుశ్‌ సోని, యూపీ వారియర్జ్‌ తరఫున హర్లీన్‌ డియోల్‌ గంటల వ్యవధిలో రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఈ ఇద్దరు నిదానంగా ఆడుతున్నారన్న కారణంగా వారి జట్టు మేనేజ్‌మెంట్‌ ఇలా చేసింది. రిటైర్డ్‌ ఔట్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. పొట్టి క్రికెట్‌లో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఎవరైనా బ్యాటర్‌ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అస్త్రాన్ని ప్రయోగించి అతన్ని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వవచ్చు. మహిళల ఐపీఎల్‌లో రిటైర్డ్‌ ఔటైన తొలి ప్లేయర్‌ ఆయుశ్‌ సోని అయితే.. ఐపీఎల్‌లో ఈ తరహాలో ఔటైన తొలి ఆటగాడిగా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డుల్లోకెక్కాడు.యాష్‌ 2022 ఎడిషన్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నిదానంగా ఆడుతున్నందుకు మేనేజ్‌మెంట్‌ అతన్ని రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు పిలిపించింది. ఇలాంటి ఉదంతాలే ఐపీఎల్‌లో మరో మూడు సందర్భాల్లో చోటు చేసుకున్నాయి.2023 ఎడిషన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌, అదే ఎడిషన్‌లో పంజాబ్‌ ఆటగాడు అథర్వ తైడే, 2025 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు తిలక్‌ వర్మ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు. ఐపీఎల్‌లో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లు కేవలం నలుగురే అయినప్పటికీ.. ప్రపంచవాప్తంగా జరిగే వేర్వేరు లీగ్‌ల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.అంతర్జాతీయ క్రికెట్‌లోనూ పలువురు ఆటగాళ్లు ఈ తరహాలో ఔటయ్యారు. శ్రీలంకకు చెందిన మర్వన్‌ ఆటపట్టు, మహేళ జయవర్దనే (2001), భూటాన్‌కు చెందిన సోనం టోబ్‌గే (2019), నమీబియాకు చెందిన నికోలాస్‌ డావిన్‌ (2014) రిటైర్డ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు. వీరిలో ఆటపట్టు, జయవర్దనే టెస్ట్‌ ఫార్మాట్‌లో, అదీ ఒకే మ్యాచ్‌లో (బంగ్లాదేశ్‌పై) రిటైర్డ్‌ ఔట్‌ కావడం​ విశేషం. ఆటపట్టు డబుల్‌ సెంచరీ పూర్తి చేశాక, జయర్దనే 150 పరుగులు పూర్తి చేశాక రిటైర్డ్‌ ఔటయ్యారు.అంతర్జాతీయ టీ20ల్లో రిటైర్డ్‌ ఔటైన తొలి ఆటగాడు టోబ్‌గే అయితే.. టీ20 ప్రపంచకప్‌లో ఈ తరహా ఔటైన తొలి ఆటగాడిగా నికోలాస్‌ డావిన్‌ రికార్డుల్లోకెక్కాడు.

Manchester Originals is now Manchester Super Giants. Official announcement made4
మరో సూపర్‌ జెయింట్.. పేరు మార్చుకున్న మరో ఫ్రాంచైజీ

ఫ్రాంచైజీ క్రికెట్‌లోకి మరో సూపర్‌ జెయింట్‌ వచ్చింది. హండ్రెడ్‌ లీగ్‌లో మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటికే రెండు సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌. ఈ రెండు సహా మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధినేత సంజీవ్‌ గొయెంకా చేతుల్లో ఉన్నాయి.మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా రూపాంతరం​ చెందిన తర్వాత కొత్త లోగోను గురువారం​ ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ (పురుషుల హండ్రెడ్‌), అదే దేశానికి చెందిన స్పిన్‌ బౌలర్ సోఫీ ఎక్ల్‌స్టోన్ (మహిళల హండ్రెడ్‌)ను రిటైన్‌ చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది. బట్లర్‌ మరో సూపర్‌ జెయింట్‌లోనూ (డర్బన్ సూపర్ జెయింట్స్) భాగంగా ఉన్నాడు.లక్నో, డర్బన్ సూపర్‌ జెయింట్స్‌ లోగోల్లోని బ్రాండింగ్‌కి భిన్నంగా మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ లోగోలో ఏనుగు ప్రతీక ఉండటం గమనించదగ్గ విష​యం. మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా మాట్లాడుతూ.. మాంచెస్టర్ ఒక గొప్ప క్రీడా నగరం. సూపర్ జెయింట్స్ కుటుంబంలో భాగమవ్వడం గర్వకారణం. జోస్ బట్లర్ వంటి ఆటగాళ్లు మా జట్టులో ఉండటం ఆనందదాయకమిని పేర్కొన్నారు. మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌ బట్లర్‌, ఎక్లెస్టోన్‌తో పాటు మరికొంత మందిని కూడా రీటైన్‌ చేసుకుంది. పురుషుల విభాగంలో హెన్రిచ్‌ క్లాసెన్‌, నూర్‌ అహ్మద్‌ను తిరిగి దక్కించుకుంది. కొత్తగా పురుషుల విభాగంలో లియామ్‌ డాసన్‌.. మహిళల విభాగంలో మెగ్‌ లాన్నింగ్‌, స్మృతి మంధనను జట్టులోకి తీసుకుంది.కాగా, మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌గా రూపాంతరం చెందక ముందు మరో రెండు హండ్రెడ్‌ లీగ్‌ ఫ్రాంచైజీల పేర్లు మారాయి. ముంబై ఇండియన్స్‌ ఓనర్షిప్‌లో నడిచే ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఎంఐ లండన్‌గా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్షిప్‌లో నడిచే నార్తర్న్ సూపర్‌చార్జర్స్ సన్‌రైజర్స్ లీడ్స్‌గా రూపాంతరం చెందాయి.జులై 21 నుంచి ప్రారంభం ది హండ్రెడ్ లీగ్‌ 2026 పురుషులు, మహిళల విభాగాల్లో జులై 21 నుంచి ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంచైజీలకు జనవరి చివరి వరకు నాలుగు ప్రీ-ఆక్షన్ సైనింగ్‌లకు అవకాశం ఉంది. ప్రధాన ఆక్షన్ మార్చిలో జరగనుంది.

Ottneil Baartman produces second ever hat trick of SA205
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సంచలనం.. రాయల్స్‌ బౌలర్‌ హ్యాట్రిక్‌

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రెండో హ్యాట్రిక్‌ నమోదైంది. 2025-26 ఎడిషన్‌లో భాగంగా నిన్న (జనవరి 15) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్‌ రాయల్స్‌ బౌలర్‌ ఓట్నీల్‌ బార్ట్‌మన్‌ హ్యాట్రిక్‌ వికెట్లు తీశాడు. ఇదే ఎడిషన్‌లో కొద్ది రోజుల కిందట ప్రిటోరియా క్యాపిటల్స్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. తాజాగా ప్రిటోరియాతో జరిగిన మ్యాచ్‌లో బార్ట్‌మన్‌ హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లు తీసి రాయల్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌.. బార్ట్‌మన్‌ (4-1-16-5) ధాటికి 19.1 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. హర్డస్‌ విల్యోన్‌, సికందర్‌ రజా తలో 2, ఫోర్టుయిన్‌ ఓ వికెట్‌ తీశారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో షాయ్‌ హోప్‌ (25), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (21), షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (29), ఆండ్రీ రసెల్‌ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జోర్డన్‌ కాక్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌, లుంగి ఎంగిడి డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్‌ 15.1 ఓవర్లలో ఛేదించింది. రూబిన్‌ హెర్మన్‌ (46), డాన్‌ లారెన్స్‌ (41), డేవిడ్‌ మిల్లర్‌ (28 నాటౌట్‌) ఆ జట్టును గెలిపించారు. ప్రిటోరియా బౌలర్లలో లిజాడ్‌ విలియమ్స్‌ 2, ఎంగిడి, పీటర్స్‌ తలో వికెట్‌ తీశారు.కాగా, ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా పార్ల్‌ రాయల్స్‌ ఈ ఎడిషన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. రాయల్స్‌తో పాటు సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగతా బెర్త్‌ల కోసం ప్రిటోరియా క్యాపిటల్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పోటీపడుతున్నాయి.

Aman Mokhade ton sends Vidarbha to VHT 2025-26 final6
స్టార్లతో నిండిన కర్ణాటకకు షాక్‌.. విజయ్‌ హజారే ట్రోఫీ ఫైనల్లో విదర్భ

నిన్న (జనవరి 15) జరిగిన విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. అమన్‌ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు. తద్వారా గత ఎడిషన్‌ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.పడిక్కల్‌ విఫలం.. రాణించిన కరుణ్‌ నాయర్‌టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్‌ దర్శన్‌ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ (76), కృషణ్‌ శ్రీజిత్‌ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ఎడిషన్‌లో దేవదత్‌ పడిక్కల్‌ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (9) కూడా డు ఆర్‌ డై మ్యాచ్‌లో హ్యాండిచ్చాడు. ధృవ్‌ ప్రభాకర్‌ (28), శ్రేయస్‌ గోపాల్‌ (36), అభినవ్‌ మనోహర్‌ (26), విజయ్‌ కుమార్‌ వైశాక్‌ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్‌ ఠాకూర్‌ 2, నచికేత్‌, యశ్‌ కదమ్‌ తలో వికెట్‌ తీశారు.అమన్‌ అద్భుత శతకం281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్‌ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్‌ అమన్‌ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్‌కు జతగా రవికుమార్‌ సమర్థ్‌ (76 నాటౌట్‌) రాణించాడు. ధృవ్‌ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్‌ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Harleen Deol scripts UP Warriorz's first win of WPL 20267
24 గంటల్లో సీన్‌ రివర్స్‌.. యూపీ వారియర్జ్‌ ప్లేయర్‌ అద్భుతం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2026లో యూపీ వారియర్జ్‌ తొలి విజయం నమోదు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో నిన్న (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. గత మ్యాచ్‌లో నిదానంగా ఆడుతుందని రిటైర్డ్‌ ఔట్‌గా వెనక్కు పలిపించిన హర్లీన్‌ డియోల్‌ ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో వారియర్జ్‌ను గెలిపించింది. 24 గంటల్లోనే హర్లీన్‌ నుంచి ఈ కమ్‌ బ్యాక్‌ చూసి అభిమానులు ఔరా అంటున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అమన్‌జోత్‌ కౌర్‌ (38), నికోలా క్యారీ (32 నాటౌట్‌) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ ఎడిషన్‌లో అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే ఔటైంది. వారియర్జ్‌ బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్‌, ఆశా శోభన తలో వికెట్‌ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆది నుంచే నిలకడగా ఆడిన వారియర్జ్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. ఒత్తిడిలో హర్లీన్‌ డియోల్‌ (39 బంతుల్లో 64 నాటౌట్‌; 12 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి వారియర్జ్‌ను గెలిపించింది. ఆమెకు మెగ్‌ లాన్నింగ్‌ (25), లిచ్‌ఫీల్డ్‌ (25), క్లో ట్రాయాన్‌ (27 నాటౌట్‌) సహకరించారు. ముంబై బౌలర్లలో నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ 2, అమేలియా కెర్‌ ఓ వికెట్‌ తీశారు.

Manchester Super Giants sign Indias Smriti Mandhana for The Hundred 20268
స్మృతి మంధాన కీలక నిర్ణయం

భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగే 'ద హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో మంధాన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ విషయాన్ని సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అధికారికంగా గురువారం ప్రకటించింది. గత సీజన్‌కు వరకు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ ఒరిజినల్స్‌గా ఉండేది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా..మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో 70% వాటాను కొనుగొలు చేశారు. దీంతో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరును లక్నో సూపర్ జెయింట్స్‌గా మార్చారు. మాంచెస్టర్ జట్టులో మెగ్ లానింగ్, సోఫీ ఎకిల్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. స్మృతికి 'ది హండ్రెడ్' టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. గతంలో ఆమె సదరన్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది 2022 సీజన్‌లో సదరన్ బ్రేవ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇక మాంచెస్టర్‌ పురుషల జట్టులో జోస్ బట్లర్, హెన్రిచ్‌ క్లాసెన్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్‌ జూలై 21 నుంచి ఆరంభం కానుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

Under 19 World Cup 2026: Kundu guides IND to 6-wicket win with unbeaten 429
Under 19 World Cup 2026: భారత్‌ శుభారంభం

ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు.అతడితో పాటు దీపేష్‌, అబ్రిష్‌, ఖిలాన్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ తలా వికెట్‌ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్‌ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.ఈ టార్గెట్‌ను భార‌త్ 17.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభ‌వ్ సూర్య‌వంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికి.. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌల‌ర్ల‌లో రిత్విక్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భార‌త్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో జ‌న‌వ‌రి 17న బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

BCB sacks finance committee chairman after Bangladesh cricketers BPL ultimatum10
ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అత‌డి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.వివాదానికి కారణం ఏంటంటే?ఐపీఎల్‌-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు."ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్‌పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: IND vs USA: వైభ‌వ్ సూర్య‌వంశీ అట్ట‌ర్‌ ప్లాప్‌..నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement

వీడియోలు