Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026 India Great Slams Rahane Captaincy KKR Fail To Defend 220 vs MI1
చెత్త కెప్టెన్సీ.. అతడికి ఎందుకు బంతి ఇవ్వలేదు?

ఐపీఎల్‌-2024లో చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గత సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. అజింక్య రహానే సారథ్యంలో పద్నాలుగింట ఐదు మ్యాచ్‌లే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తాజా ఎడిషన్‌ను కూడా కేకేఆర్‌ ఓటమితోనే ఆరంభించింది.ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు చేసిన కోల్‌కతా (KKR vs MI).. లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్లు ర్యాన్‌ రికెల్టన్‌ (43 బంతుల్లో 81), రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 78) ధనాధన్‌ దంచికొట్టడంతో ముంబై ఇండియన్స్‌ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.Sealed in style 🔒@mipaltan begin their #TATAIPL 2026 campaign with an impressive 6⃣-wicket victory at home 💙Scorecard ▶️ https://t.co/JmJcgsoHQ7#KhelBindaas | #MIvKKR pic.twitter.com/zOnWb5Sc8U— IndianPremierLeague (@IPL) March 29, 2026ఆరు వికెట్ల తేడాతోవాంఖడే స్టేడియంలో 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 224 పరుగులు సాధించి.. ఆరు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ముంబై గెలిచింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌.. కేకేఆర్‌ సారథి అజింక్య రహానే వ్యూహాలను విమర్శించాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో సునిల్‌ నరైన్‌కు బంతి ఇవ్వకపోవడాన్ని భజ్జీ తప్పుబట్టాడు.పవర్‌ ప్లేలో అదే అత్యుత్తమంజియోస్టార్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘పవర్‌ ప్లేలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌తో బౌలింగ్‌ చేయించడం అత్యుత్తమ నిర్ణయం. అతడితో కనీసం రెండు ఓవర్లు అయినా వేయించాల్సింది. తద్వారా రోహిత్‌ శర్మను టార్గెట్‌ చేసే వీలు ఉండేది.నరైన్‌కు రోహిత్‌పై మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఈరోజు కూడా రోహిత్‌ను త్వరగా అవుట్‌ చేసి ఉంటే.. ముంబై ఒత్తిడిలో కూరుకుపోయేది. ఇక పవర్‌ ప్లే సంగతి పక్కన పెడితే నరైన్‌కు పూర్తి కోటా బౌలింగ్‌ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కెప్టెన్సీ ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి ఇదొక నిదర్శనం’’ అని హర్భజన్‌ సింగ్‌ రహానే కెప్టెన్సీని విమర్శించాడు.వారిద్దరు అద్బుతంఏదేమైనా రోహిత్‌ శర్మ, రికెల్టన్‌లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందేనని భజ్జీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వారిద్దరు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారని.. కేకేఆర్‌ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదని ప్రశంసించాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన సునిల్‌ నరైన్‌.. 30 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. తిలక్‌ వర్మ (18) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. షాకిచ్చిన జియోస్టార్‌!

IPL 2026: Sanju Samson Fails To Replicate T20 WC Form CSK Fans Reacts2
వరల్డ్‌కప్‌ హీరో సంజూ అట్టర్‌ ఫ్లాఫ్‌.. తొలి మ్యాచ్‌లో ఫెయిల్‌

టీ20 ప్రపంచకప్‌-2026 హీరో సంజూ శాంసన్‌ ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్‌. ఐపీఎల్‌-2026లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆరంభించాడు సంజూ.క్లీన్‌బౌల్డ్‌ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer) రాయల్స్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్‌ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్‌ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్‌ ఆఖరి బంతికే పెవిలియన్‌ చేరాడు.రాయల్స్‌ పేసర్‌ నండ్రీ బర్గర్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (Sanju Samson) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్‌కే తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉 Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX— IndianPremierLeague (@IPL) March 30, 2026వరల్డ్‌కప్‌ హీరో సంజూకాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఫామ్‌ కోల్పోయిన సంజూ శాంసన్‌కు.. అదృష్టవశాత్తూ సూపర్‌-8 మ్యాచ్‌ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్‌-8 నాకౌట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్‌ కొనసాగించాడు.ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్‌తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్‌ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్‌లోనే సంజూ తడబడ్డాడు.కకావికలంకాగా తాజా సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్‌ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.కాగా రాయల్స్‌ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్‌ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్‌ మాత్రే డకౌట్‌ అయ్యాడు. మాథ్యూ షార్ట్‌ రెండు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. షాకిచ్చిన జియోస్టార్‌!

IPL 2026 CSK VS RR: This is CSK's first ever game without MS Dhoni and Suresh Raina3
IPL 2026: చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ విచిత్రం​ జరిగింది. 277 మ్యాచ్‌ల ఈ ఫ్రాంచైజీ ప్రస్తానంలో తొలిసారి ఓ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, సురేశ్‌ రైనా ఇ‍ద్దరూ లేరు. సీఎస్‌కే చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఐపీఎల్‌ 2026లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘట్టం చోటు చేసుకుంది. తలా, చిన్న తలా అని పిలుచుకునే ధోని-రైనా లేకపోవడాన్ని సీఎస్‌కే అభిమానులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.రైనా కొంతకాలం కిందటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. ధోని లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ గాయం కారణంగా ఈ సీజన్‌ తొలి రెండు వారాలకు దూరంగా ఉండనున్నాడు. ధోని-రైనా జోడీ సీఎస్‌కే విజయ ప్రస్తానంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు. ధోని సీఎస్‌కే సాధించిన ప్రతి విజయంలో కీలకంగా వ్యవహరించగా.. రైనా మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరుగడించాడు.ఇదిలా ఉంటే, రాజస్థాన్‌తో నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తుంది. రాయల్స్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కూలింది. నండ్రే బర్గర్‌, జోఫ్రా ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో సీఎస్‌కే బ్యాటర్లను పెవిలియన్‌కు పం​పారు. రెండో ఓవర్‌ చివరి బంతికి తొలిసారి సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్‌.. మూడో ఓవర్‌ చివరి బంతికి సీఎస్‌కే సారధి రుతురాజ్‌ గైక్వాడ్‌ను (6) ఆర్చర్‌ అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. ఆ మరుసటి బంతికే (3.1 ఓవర్‌) యువ ఆటగాడు ఆయుశ్‌ మాత్రేను బర్గర్‌ మరో అద్భుతమైన బంతితో డకౌట్‌ చేశాడు. ఆతర్వాత వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాది జోరును ప్రదర్శిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 36-3గా ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (14), మాథ్యూ షార్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి సింగ్‌

Even If Government Lifts Ban No IPL 2026 Broadcast In Bangladesh4
బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. ఊహించని షాక్‌!

టీ20 ప్రపంచకప్‌-2026 సందర్భంగా బంగ్లాదేశ్‌ మామూలుగా రచ్చ చేయలేదు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో తమ ఆటగాళ్లు, సిబ్బందికి భద్రత లేదని ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చెప్పినా సరే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు.అక్కడ మొదలైన వివాదంభారత్‌ నుంచి వేదికను శ్రీలంకకు మార్చాలని మొండిపట్టు పట్టగా.. ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రకటించింది. ఈ వివాదానికి మూలకారణం ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తొలగించడమే అని చెప్పవచ్చు.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, ఈశాన్య భారతం గురించి బంగ్లా నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధంఈ పరిణామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాబోమని భీష్మించుకున్న బంగ్లాదేశ్‌.. ఆఖరికి టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.యూటర్న్‌అయితే, ఇటీవల ఎన్నికైన ప్రభుత్వం ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుంది. రాజకీయాలు, క్రీడలను తాము కలపమని.. ఎవరైనా తమ దేశంలో ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే అందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. నిజానికి భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు తెంచుకుంటే బంగ్లా క్రికెట్‌ పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఊహించని షాక్‌ అయితే, బంగ్లా ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ను ప్రసారం చేసే టీ- స్పోర్ట్స్‌తో ఒప్పందాన్ని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ రద్దు చేసుకుంది. ఆర్థిక చెల్లింపుల విషయంలో టీ- స్పోర్ట్స్‌ ఆలస్యం చేయడం, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఒప్పందం రద్దు కారణంగాదీంతో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు ప్రభుత్వం అనుమతినిచ్చినా.. టీ- స్పోర్ట్స్‌ నిర్వాకం వల్ల మ్యాచ్‌లు అక్కడ ప్రసారం కావు. కాగా 2023-2027 వరకు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ కూడా బంగ్లాదేశ్‌లో ప్రసారం చేసుకునేందుకు జియోస్టార్‌ ద్వారా సబ్‌ లైసెన్స్‌ పొందింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అనుమతులు కోల్పోయింది. దీంతో అధికారికంగా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు బ్రేక్‌ పడింది.చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

IPL 2026, Match 3: Rajasthan Royals vs Chennai Super Kings Live Updates5
127 పరుగులకు సీఎస్‌కే ఆలౌట్‌

ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అప్‌డేట్స్‌ఎనిమిదో వికెట్‌ డౌన్‌12.5వ ఓవర్‌- 82 పరుగుల వద్ద సీఎస్‌కే ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి నూర్‌ అహ్మద్‌ (1) ఔటయ్యాడు.ఏడో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కేబ్రిజేశ్‌ శర్మ బౌలింగ్‌లో కార్తిక్‌ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్‌ ఖాతాలో తొలి ఐపీఎల్‌ వికెట్‌. స్కోరు: 74-7(11). ఓవర్టన్‌ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్‌ అహ్మద్‌ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్‌ డౌన్‌జడేజా బౌలింగ్‌లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్‌ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్‌ క్రీజులోకి వచ్చాడు.సగం వికెట్లు కోల్పోయిన సీఎస్‌కేరవీంద్ర జడేజా బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్‌ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).కుప్పకూలిన సీఎస్‌కే టాపార్డర్‌రాజస్థాన్‌ పేసర్ల ధాటికి సీఎస్‌కే టాపార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్‌.. సంజూ శాంసన్‌ (6), మాత్రే (0)ను ఔట్‌ చేయగా.. ఆర్చర్‌ రుతురాజ్‌ను (6), సందీప్‌ శర్మ షార్ట్‌ను (2) పెవిలియన్‌కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 41-4గా ఉంది. కార్తీక్‌ శర్మ (3), సర్ఫరాజ్‌ ఖాన్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో సీఎస్‌కేటాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్‌, బర్గర్‌ వరుస బంతుల్లో రుతురాజ్‌ (6), ఆయుశ్‌ మాత్రేను (0) ఔట్‌ చేశారు. సంజూ క్లీన్‌ బౌల్డ్‌1.6వ ఓవర్‌- నండ్రే బర్గర్‌ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌ (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌కు ముందు వర్షం​ పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్‌ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం​ క్లియర్‌గా ఉంది.తుది జట్లు..సీఎస్‌కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌, ప్రశాంత్‌ వీర్‌, రాహుల్‌ చాహర్‌, గుర్జప్నీత్‌ సింగ్‌, రామకృష్ణ ఘోష్‌రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్‌ ప్లేయర్స్‌ ఆప్షన్స్‌: డొనొవన్‌ ఫెరియెరా, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సుషాంత్‌ మిశ్రా, రవి సింగ్‌

Rohit Sharma Banter With Umpire His Bat Gets Almost Fails Bat Test6
నేను ముందే చెప్పాను కదా!: అంపైర్‌తో రోహిత్‌ శర్మ

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ స్టార్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌-2026 టోర్నీని ఘనంగా ఆరంభించాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ వింటేజ్‌ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేశాడు. కేవలం 38 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు.Rohit Sharma in his element 🙌🎥 Enjoy his scintillating early smacks for six 👊#MI are 64/0 after 5 overs.Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR | @mipaltan | @ImRo45 pic.twitter.com/ys8k0JNHlW— IndianPremierLeague (@IPL) March 29, 2026ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కోల్‌కతా (KKR vs MI)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2012 తర్వాత తొలిసారి ఐపీఎల్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలుపు జెండా ఎగురవేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో రోహిత్‌ శర్మ (Rohit Sharma) వ్యవహరించిన తీరు వైరల్‌గా మారింది.గేజ్‌ టెస్టు నిర్వహిస్తుండగా.. కేకేఆర్‌ విధించిన 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్‌ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో.. అంపైర్‌ అతడి బ్యాట్‌ను పరీక్షించాడు. బ్యాట్‌ పరిమాణం సరిగ్గా ఉందా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు గేజ్‌ టెస్టు నిర్వహిస్తుండగా.. రోహిత్‌ తన బ్యాట్‌ సరిగ్గానే ఉందంటూ రియాక్షన్‌ ఇచ్చాడు.నేను ముందే చెప్పాను కదా!అయితే, నిబంధన ప్రకారం బ్యాట్‌ను టెస్టు చేసిన అంపైర్‌ సంతృప్తి వ్యక్తం చేయగా.. ‘నేను ముందే చెప్పాను కదా!’ అన్నట్లుగా రోహిత్‌ శర్మ నవ్వులు చిందిస్తూ మైదానంలోకి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హిట్‌మ్యాన్‌ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.కాగా గతేడాది ఎక్కువగా ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రోహిత్‌.. ఈసారి మాత్రం తుదిజట్టులో భాగంగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టైటిల్‌ అందించిన ఘనత రోహిత్‌ శర్మది. కెప్టెన్‌ హోదాలో ముంబైని సైతం ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే, 2024లో ముంబై రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?pic.twitter.com/0A7i9X5ybq— • (@ClassyCricket) March 30, 2026

IPL 2026 Match Rajasthan Royals vs Chennai Super Kings: Rain Threat Looms Large7
IPL 2026: రాజస్థాన్‌-సీఎస్‌కే మ్యాచ్‌ జరిగేనా..? గౌహతిలో వర్షం​

ఐపీఎల్‌ 2026లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్‌ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 🚨 ITS RAINING AT GUWAHATI 🚨 pic.twitter.com/kMxhiDENqx— Johns. (@CricCrazyJohns) March 30, 2026ఎందుకంటే, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్‌ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్‌ కూడా ఆలస్యమవ్వవచ్చు. కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ మూడు హోం మ్యాచ్‌లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్‌ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్‌ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

RR vs CSK Playing 11, IPL 2026 Today Match8
సీఎస్‌కే తుది జట్టు ఇదే.. రూ. 14 కోట్ల ఆటగాడికి ఛాన్స్‌?

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోని, విధ్వ‌సంక‌ర బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం కార‌ణంగా సీఎస్‌కే ఆడే కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యారు. దీంతో జ‌ట్టు బాధ్యత మొత్తం సంజూ శాంస‌న్‌, కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌పైనే ప‌డింది. ఈ క్ర‌మంలో రాజ‌స్తాన్‌తో జ‌రిగే తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఎలా ఉండ‌బోతుందో ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్‌లో యువ ఆట‌గాడు ప్ర‌శాంత్ వీర్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది.గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప్ర‌శాంత్ వీర్‌ను రూ. 14.2 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి మ‌రి సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ను ర‌వీంద్ర జ‌డేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు. ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు జ‌డేజా సీఎస్‌కే నుంచి రాజ‌స్తాన్‌కు ట్రేడ్ అయిన సంగ‌తి తెలిసిందే. అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మ‌థ్యూ షార్ట్‌, ఇంగ్లండ్ పేస‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ సీఎస్‌కే త‌ర‌పున ఐపీఎల్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అన్షుల్ కాంబోజ్‌, ఖలీల్ అహ్మ‌ద్ పేస్ బౌలింగ్ బాధ్య‌త‌ల‌ను పంచుకోనున్నారు. స్పిన్న‌ర్ల‌గా నూర్ అహ్మ‌ద్‌, రాహుల్ చాహ‌ర్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకునే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. సీఎస్‌కే బ్యాటింగ్‌ను సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించ‌నున్నారు.సీఎస్‌కే తుది జ‌ట్టు(అంచ‌నా) సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్రాజ‌స్తాన్ తుది జ‌ట్టు(అంచ‌నా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే

Five IPL records May impossible to break but not for Vaibhav Sooryavanshi9
IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

గత ఏడాది కాలంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఈ బిహారీ పిల్లాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 175 పరుగులు సాధించడం విశేషం. తద్వారా భారత్‌ మరోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఓ ఐదు ప్రధాన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వైభవ్‌ సూర్యవంశీ వాటిని ఈసారి బ్రేక్‌ చేయగలడా?అత్యధిక వ్యక్తిగత స్కోరుఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ కొనసాగుతున్నాడు. ఈ వెస్టిండీస్‌ దిగ్గజం ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు.ఐపీఎల్‌ 2013 ఎడిషన్‌లో కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఇటీవలే వైభవ్‌ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే అని తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్‌లోనే ఈ కుర్రాడు గేల్‌ను అధిగమిస్తాడో? లేదో? చూడాలి.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుయూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసకర ఆట తీరుకు పెట్టింది పేరు. ఆర్సీబీ తరఫున పుణెపై 2013 నాటి మ్యాచ్‌లో అతడు ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.ఇక వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో, యూత్‌ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. గేల్‌ రికార్డును వైభవ్‌ ఈసారి బ్రేక్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లుఐపీఎల్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ క్రిస్‌ గేల్‌ నిలిచాడు. 2012 సీజన్‌లో ఈ విండీస్‌ లెజెండ్‌ 59 సిక్సర్లు బాదాడు. ఇక 2019లో ఆండ్రీ రసెల్‌ 52 సిక్స్‌లు బాదాడు. ఈ రికార్డులను వైభవ్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 24 సిక్సర్లు బాదాడు.సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటుఐపీఎల్‌ 2024 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 141 బంతులు ఎదుర్కొని 234.34 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతేడాది వైభవ్‌ 122 బంతులు ఎదుర్కొని 206కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు.ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లుఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఎ, టీ20 మ్యాచ్‌లలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ఇంత వరకు ఏ ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. క్రిస్‌గేల్‌, రాహుల్‌ శర్మ, రాహుల్‌ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌ ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదగలిగారు.చదవండి: జడ్డూ, సందీప్‌ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర

Indian football chief Kalyan Chaubey accused of harassment by women's panel head Valanka Alemao10
మాజీ సీఎం కూతురికి వేధింపులు

భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్‌ చౌబేపై మహిళల కమిటీ హెడ్‌ వలంకా అలేమావో వేధింపుల ఆరోపణలు చేశారు. మార్చి 29న ఢిల్లీలోని ఫుట్‌బాల్‌ హౌస్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆమె ఓ లేఖలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో చౌబే, ఉపాధ్యక్షుడు హారిస్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎం. సత్యనారాయణ తనను హేళన చేసి మాట్లాడారని వలంకా ఆరోపించారు. అధ్యక్షుడు చౌబే తన స్వరాన్ని అణచివేసి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా గట్టిగా మాట్లాడి భయపెట్టే ప్రయత్నం చేశారని లేఖలో ప్రస్తావించారు. వలంకా అలేమావో ఎవరు..? AIFF మహిళల విభాగపు అధిపతి అయిన వలంకా అలేమావో గోవా మాజీ ముఖ్యమంత్రి చర్చిల్‌ అలేమావో కుమార్తె. ఆమె చర్చిల్‌ బ్రదర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు కూడా CEOగా వ్యవహరిస్తారు. 2025–2029 కాలానికి FIFA మహిళల ఫుట్‌బాల్‌ అభివృద్ధి కమిటీలో నియమితులైన తొలి భారతీయ మహిళ వలంకా. వివాదం నేపథ్యం మహిళల ఆసియా కప్‌ ప్రచారంలో జట్టు నిర్వహణ, లాజిస్టిక్స్‌లో జరిగిన పరిపాలనా తప్పిదాలపై వలంకా చౌబేకు లేఖ రాసి, బాధ్యత వహించాలని కోరారు. అలాగే ప్రధాన నిర్ణయాల్లో మహిళల కమిటీని సంప్రదించడం లేదని నిలదీశారు. ఈ విషయమై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతుండగా, చౌబే సహనం కోల్పోయారని తెలుస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement