Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Ireland Paul Stirling Creates History Breaks Rohit Sharma World Record1
రోహిత్‌ శర్మ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌

ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం రోహిత్‌ శర్మ పేరిట ఉన్న అరుదైన టీ20 ప్రపంచ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)తో తొలి టీ20 సందర్భంగా స్టిర్లింగ్‌ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఐర్లాండ్‌ జట్టు.. యూఏఈ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. గురువారం తొలి టీ20 జరిగింది. దుబాయ్‌ వేదికగా టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.మెరుపు ఇన్నింగ్స్‌ఓపెనర్లలో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (8) విఫలం కాగా.. రాస్‌ అడేర్‌ (39) మెరుగ్గా రాణించాడు. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టకర్‌ (25 బంతుల్లో 38), కర్టిస్‌ కాంఫర్‌ (25) ఫర్వాలేదనిపించగా.. బెంజమిన్‌ కలిజ్‌ (12 బంతుల్లో 26 నాటౌట్‌), జార్జ్‌ డాక్రేల్‌ (10 బంతుల్లో 22 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునైద్‌ సిద్దిఖి, హైదర్‌ అలీ చెరో రెండు.. ముహమ్మద్‌ అర్ఫాన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 19.5 ఓవర్లలో 121 పరుగులకే యూఏఈ ఆలౌట్‌ అయింది.57 పరుగుల తేడాతో విజయం ఐర్లాండ్‌ బౌలర్లు మాథ్యూ హాంప్రేస్‌, గరేత్‌ డెలాని తలా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. బారీ మెకార్తి రెండు వికెట్లు పడగొట్టాడు. జార్జ్‌ డాక్రేల్‌, మార్క్‌ అడేర్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి టీ20లో ఐర్లాండ్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.ఇక పాల్‌ స్టిర్లింగ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఇది 160వ టీ20 మ్యాచ్‌ కావడం విశేషం. తద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్‌ పొట్టి ఫార్మాట్లో.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును స్టిర్లింగ్‌ బద్దలు కొట్టాడు. కాగా 2024లో టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్‌ అందించిన తర్వాత అంతర్జాతయ టీ20లకు రోహిత్‌ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లుపాల్‌ స్టిర్లింగ్‌ (ఐర్లాండ్‌): 2009- 2026*- 160 మ్యాచ్‌లురోహిత్‌ శర్మ (ఇండియా): 2007-2024- 159 మ్యాచ్‌లుజార్జ్‌ డాక్రేల్‌ (ఐర్లాండ్‌): 2010-2026*- 153 మ్యాచ్‌లుమహ్మద్‌ నబీ (అఫ్గనిస్తాన్‌): 2010-2026- 148 మ్యాచ్‌లుజోస్‌ బట్లర్‌ (ఇంగ్లండ్‌): 2011-2025- 144 మ్యాచ్‌లు.చదవండి: Kohli Instagram Deactivate: ఇన్‌స్టాకు గుడ్‌బై ?.. కంగారుపడ్డ విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌!

Friendly Nations: Sri Lanka Breaks Silence On ICC Bangladesh T20 WC Row2
T20 WC: బంగ్లా అవుట్‌.. తొలిసారి స్పందించిన శ్రీలంక

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు భారత్‌తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య దేశంగా ఉంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌ ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, బంగ్లాదేశ్‌ సైతం శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడతామంటూ మొండిపట్టు పట్టి మూల్యం చెల్లించింది.భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టుకు భారత్‌లో భద్రత లేదని.. వరల్డ్‌కప్‌లో తమ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా లంకలో ఆడతామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) పంతం పట్టింది.బంగ్లాదేశ్‌ను తప్పించి..అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని తేల్చి చెప్పగా.. బీసీబీ మాత్రం పట్టువీడలేదు. ఫలితంగా 24 గంటల తుది గడువు తర్వాత.. బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను మెగా టోర్నీలో చేర్చింది ఐసీసీ.మాకు స్నేహపూర్వక దేశాలుఈ పరిణామాలపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు తాజాగా స్పందించింది. లంక క్రికెట్‌ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే AFPతో మాట్లాడుతూ.. "ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు.మా దేశంలో మున్ముందు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాము’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్బాలు పలుకుతూ ఓవరాక్షన్‌ చేసిన పాకిస్తాన్‌.. ఇప్పటికే లంకకు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు సమాచారం.ఈ మ్యాచ్‌ మాకు అత్యంత ముఖ్యంఈ నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ సాఫీగా సాగేందుకు తాము ప్రత్యేకమైన, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీలంక క్రీడా శాఖా మంత్రి సునిల్‌ కుమార గమేజ్‌ తెలిపారు. ఈ మ్యాచ్‌ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. చదవండి: ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చిన పాకిస్తాన్‌

Virat Kohli Instagram Returns After Fans Floods With Anushka Profile3
గుడ్‌బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌!

భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్‌లోనే కాకుండా ఈ రన్‌మెషీన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్‌ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్‌... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్‌ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్‌గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్‌అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్‌స్టా అకౌంట్‌ కాసేపు డీయాక్టివేట్‌ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్‌ ఫ్యాన్స్‌.. అనుష్క శర్మ ఇన్‌స్టా అకౌంట్‌లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్‌ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్‌ రీయాక్టివేట్‌ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్‌స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివామాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్‌ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)

DC Questions Brij Bhushan Singh request for adjournment in plea to quash4
బ్రిజ్‌భూషణ్‌కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్‌ కోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కింది కోర్టు ప్రొసిడింగ్స్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదని పిటిషనర్‌ తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) మాజీ ఎంపీ కూడా అయిన బ్రిజ్‌భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. రోజుల తరబడి నిరసన దీక్ష చేపట్టారు. సర్వోన్నత న్యాయస్థానం ‘సుప్రీం’ కల్పించుకోవడంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు 2023, మే నెలలో అప్పటి అధికారపార్టీ ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏడాది తర్వాత 2024, మే 21న ట్రయల్‌ కోర్టు ఆయనపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, మహిళల అణచివేత అభియోగాలు మోపి విచారణ చేపట్టింది. దీనిపై అదే ఏడాది బ్రిజ్‌భూషణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాయిదా పడిన ఈ కేసులో తనకు అనుకూలంగా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా కింది కోర్టులో ఎప్పుడో విచారణ మొదలైందని, ఈ కేసు ప్రొసిడింగ్స్‌లో తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరంగానీ, స్టే ఇవ్వాల్సిన అవసరం గానీ లేవని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ స్పష్టం చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో ట్రయల్‌ కోర్టులో ఏప్రిల్‌ 21న తదుపరి విచారణ జరగనుంది.

Divya Deshmukh for the Norway Chess tournament5
నార్వే చెస్‌ టోర్నీకి దివ్య

స్టావెంజర్‌ (నార్వే): ప్రపంచకప్‌ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ నార్వే చెస్‌ టోర్నీలో అరంగేట్రం చేయనుంది. మహిళల ఈవెంట్‌లో 19 ఏళ్ల భారత ప్లేయర్‌ తలపడనుంది. రెండేళ్ల క్రితం 2024లో మొదలైన ఈ టోర్నీలో పోటీపడనున్న యువ క్రీడాకారిణిగా ఆమె నిలువనుంది. మే 25 నుంచి జూన్‌ 5 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ప్రపంచకప్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్, మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌కు అర్హతతో గతేడాదిని చిరస్మరణీయం చేసుకున్న ఆమె అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ఆశిస్తోంది. దివ్యతో పాటు ప్రపంచ మేటి చెస్‌ ప్లేయర్లంతా నార్వే చెస్‌ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌ బిబిసారా అసబయేవా (కజకిస్తాన్‌), డిఫెండింగ్‌ నార్వే చెస్‌ మహిళల చాంపియన్‌ అన ముజిచుక్‌ (ఉక్రెయిన్‌) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ‘నార్వే ఈవెంట్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అక్కడికి వెళ్లనుండటం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని దివ్య పేర్కొంది. గతేడాది జరిగిన ఈవెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి పాల్గొన్నారు. ఈ ఏడాది ఓపెన్‌ కేటగిరీలో ప్రజ్ఞానంద పోటీపడనున్నాడు.

33 probable players announced for the Pro League6
మన్‌ప్రీత్‌ సింగ్‌పై వేటు

భారత హాకీ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు... నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం... ఒకసారి కెప్టెన్‌గా జట్టుకు పతకం అందించిన రికార్డు సహా రెండు ఒలింపిక్‌ కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల్లో అత్యుత్తమ ఆటగాడిగా నిలవడంతో పాటు అర్జున, ఖేల్‌రత్న పురస్కారాల విజేత... ఈ ఘనతలన్నీ సాధించిన మన్‌ప్రీత్‌ సింగ్‌పై వేటు పడింది. వచ్చేనెలలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ సీజన్‌ కోసం 33 మంది ప్రాబబుల్స్‌తో ప్రకటించిన భారత హాకీ జట్టులో మన్‌ప్రీత్‌కు చోటు దక్కలేదు. ‘విశ్రాంతి’ అని కోచ్‌ చెబుతున్నా... సుమారు 34 ఏళ్ల వయసు ఉన్న మన్‌ప్రీత్‌ను పక్కన పెట్టడం అంటే అతని అంతర్జాతీయ కెరీర్‌ ముగింపునకు చేరువైనట్లే. న్యూఢిల్లీ: మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో భారత్‌ తరఫున 411 మ్యాచ్‌లు ఆడాడు. మరో మ్యాచ్‌ ఆడి ఉంటే మన దేశం తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన దిలీప్‌ తిర్కీ (412) రికార్డును అతను సమం చేసేవాడు. అయితే అనూహ్యంగా మన్‌ప్రీత్‌ జట్టులో స్థానం కోల్పోయాడు. ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు రూర్కెలాలో జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ హాకీ సీజన్‌ కోసం ఎంపిక చేసిన 33 ప్రాబబుల్స్‌లో అతనికి చోటు దక్కలేదు. గత ఐదేళ్లలో అతను టీమ్‌కు దూరం కావడం ఇదే మొదటిసారి. మన్‌ప్రీత్‌తో పాటు సీనియర్‌ గోల్‌ కీపర్‌ కృషన్‌ బహదూర్‌ పాఠక్‌పై కూడా వేటు పడింది. ఇటీవల జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో ప్రదర్శనను బట్టి అనేక మంది కొత్త, యువ ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేశారు. పూవన్న చందూరా బాబీ, యశ్‌దీప్‌ సివాచ్, అమన్‌దీప్‌ లక్డాలకు అవకాశం దక్కగా, జూనియర్‌ ఆసియా కప్‌లో ఆకట్టుకున్న ప్రిన్స్‌దీప్‌ సింగ్, రోషన్‌ కుజూర్‌ కూడా తొలిసారి సీనియర్‌ టీమ్‌లోకి వచ్చాడు. భారత్‌లో తొలి అంచె ప్రొ లీగ్‌ పోటీలతో జట్టు కొత్త సీజన్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన బృందం హోబర్ట్‌కు వెళ్లి స్పెయిన్, ఆ్రస్టేలియాలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ప్రొ లీగ్‌ రెండో అంచె టోర్నీ జూన్‌లో యూరప్‌లో జరుగుతుంది. సరైన సమయం: కోచ్‌ ఫుల్టన్‌ 2026లో హాకీ వరల్డ్‌ కప్‌తో పాటు ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో జట్టులో ‘రొటేషన్‌’ విధానాన్ని అనుసరించనున్నామని, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించినట్లు భారత జట్టు హెడ్‌ కోచ్‌ క్రెయిగ్‌ ఫుల్టన్‌ అన్నారు. ‘పని భారం తగ్గించేందుకు మేం కొంత మంది సీనియర్లకు విశ్రాంతినిచ్చాం. మరికొందరు యువ ఆటగాళ్ల చక్కటి ప్రదర్శనకు గుర్తింపు కూడా దక్కింది. ప్రొ లీగ్‌తో పాటు ఆ్రస్టేలియాలో ప్రదర్శనను బట్టి ప్రపంచ కప్, ఆసియా కప్‌లలో పాల్గొనే జట్లను ఎంపిక చేస్తాం’ అని ఆయన వెల్లడించారు. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టుకు ప్రొ లీగ్‌కు ముందు ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 11న జరిగే తొలి మ్యాచ్‌లో బెల్జియంతో భారత్‌ తలపడుతుంది. భారత హాకీ ప్రాబబుల్స్‌: పవన్, సూరజ్‌ కర్కెరా, మోహిత్, ప్రిన్స్‌దీప్‌ సింగ్‌ (గోల్‌కీపర్లు), అమిత్‌ రోహిదాస్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెపె్టన్‌), జుగ్‌రాజ్‌ సింగ్, సుమీత్, పూవన్న చందూరా బాబీ, యశ్‌దీప్‌ సివాచ్, నీలమ్‌ సంజీప్, అమన్‌దీప్‌ లక్డా (డిఫెండర్లు), రాజీందర్‌ సింగ్, మన్‌మీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, రవిచంద్ర సింగ్, వివేక్‌ సాగర్, విష్ణుకాంత్‌ సింగ్, రాజ్‌ కుమార్‌ పాల్, నీలకాంత శర్మ, రోషన్‌ కుజూర్‌ (మిడ్‌ ఫీల్డర్లు), అభిషేక్, సుఖ్‌జీత్‌ సింగ్, శిలానంద్‌ లక్డా, మన్‌దీప్‌ సింగ్, అరిజీత్‌ సింగ్‌ హుండల్, అంగద్‌ వీర్‌ సింగ్, ఉత్తమ్‌ సింగ్, సెల్వమ్‌ కార్తీ, ఆదిత్య అర్జున్, మణీందర్‌ సింగ్‌ (ఫార్వర్డ్స్‌).మన్‌ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ అంతర్జాతీయ అరంగేట్రం: 2011 మొత్తం మ్యాచ్‌లు: 411 చేసిన గోల్స్‌: 45 ఒలింపిక్స్‌లో రెండు కాంస్యాలు (2020 టోక్యో, 2024 పారిస్‌), కామన్వెల్త్‌ గేమ్స్‌లో 2 రజతాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 1 కాంస్యం, చాంపియన్స్‌ ట్రోఫీలో 2 రజతాలు, ఆసియా కప్‌లో 2 స్వర్ణాలు, 1 రజతం, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో 4 స్వర్ణాలు, 1 కాంస్యం, వరల్డ్‌ లీగ్‌లో 2 కాంస్యాలు గెలుచుకున్న జట్లలో సభ్యుడు. భారత్‌ తరఫున అతను నాలుగు ప్రపంచ కప్‌లు కూడా ఆడాడు.

Sabalenka and Rybakina advance to Australian Open womens singles final7
సబలెంకా X రిబాకినా

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌) వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023, 2024లలో టైటిల్‌ సాధించిన ఆమె గత ఏడాది మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో 12వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్‌ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌)తో సబలెంకా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (9/7)తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిబాకినా ఆరు ఏస్‌లు సంధించింది. 31 విన్నర్స్‌ కొట్టిన ఆమె తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకా, రిబాకినా తలపడనుండటం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో రిబాకినాపైనే గెలిచి సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించింది. 3 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో వరుసగా నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైనల్‌ చేరిన మూడో క్రీడాకారిణి సబలెంకా. గతంలో ఇవోన్‌ గూలాగాంగ్‌ (ఆ్రస్టేలియా; 1971 నుంచి 1976 వరకు), మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌; 1997 నుంచి 2002 వరకు) వరుసగా ఆరుసార్లు ఫైనల్‌ చేరారు.నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ అల్‌కరాజ్‌ x జ్వెరెవ్‌ (ఉదయం 9 నుంచి)జొకోవిచ్‌x సినెర్‌ (మధ్యాహ్నం 2 నుంచి)సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Telangana was defeated in the pre quarterfinals of the women's kabaddi championship8
ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తెలంగాణ ఓటమి

జాతీయ సీనియర్‌ మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఇండియన్‌ రైల్వేస్, హరియాణా జట్లు క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఆతిథ్య తెలంగాణ జట్టు పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. హైదరాబాద్‌లోని గచి్చ»ౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తెలంగాణ జట్టు 25–42తో పంజాబ్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో రైల్వేస్‌ 46–27 పాయింట్ల తేడాతో కర్ణాటక జట్టుపై, హరియాణా 50–19 విదర్భ జట్టుపై, మహారాష్ట్ర 42–36తో గోవా జట్టుపై, మధ్యప్రదేశ్‌ 41–36తో ఢిల్లీ జట్టుపై, చండీగఢ్‌ 45–39తో ఉత్తరప్రదేశ్‌ జట్టుపై, తమిళనాడు 34–30తో రాజస్తాన్‌ జట్టుపై, హిమాచల్‌ ప్రదేశ్‌ 67–22తో గుజరాత్‌ జట్టుపై విజయం సాధించాయి. క్వార్టర్‌ ఫైనల్స్‌లో మహారాష్ట్రతో ఇండియన్‌ రైల్వేస్, హరియాణాతో మధ్యప్రదేశ్, తమిళనాడుతో చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పంజాబ్‌ తలపడతాయి.

Wpl-2026: RCB grand victory9
WPL-2026: ఫైనల్లో బెంగళూరు

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నాలుగో సీజన్‌లో మాజీ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిల్‌ పోరుకు చేరింది. వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందుగా ‘ప్లే ఆఫ్స్‌’ చేరిన ఆర్‌సీబీ జట్టు ఆపై రెండు ఓటములు ఎదుర్కొంది. అయితే చివరి పోరులో మళ్లీ సత్తా చాటి యూపీ వారియర్స్‌ని చిత్తు చేసింది. 12 పాయింట్లతో ‘టాప్‌’గా నిలిచిన స్మృతి మంధాన బృందం తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌కు ‘జిరాక్స్‌’ తరహాలోనే దాదాపు ఈ మ్యాచ్‌ సాగింది... యూపీ గత మ్యాచ్‌లాగే సరిగ్గా 143 పరుగులే చేయగా, ఛేదనలో గ్రేస్‌ హారిస్‌ దాదాపు ఒకే తరహాలో 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో ఒంటి చేత్తో గెలిపించింది. నాడు 47 బంతులు మిగిలి ఉండగా నెగ్గిన ఆర్‌సీబీ ఈసారి 41 బంతుల ముందు లక్ష్యాన్ని ఛేదించింది. స్కోర్లు సమమైన చోట వికెట్‌ పడకుండా ఉంటే గెలుపు అంతరం కూడా ఒకేలా ఉండేది! ఈ పరాజయంతో యూపీ వారియర్స్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయింది. వడోదర: మాజీ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రెండోసారి డబ్ల్యూపీఎల్‌ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 2024 విజేత ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది. ముందుగా యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ (43 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ నమోదు చేయగా, కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (30 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. నదైన్‌ డిక్లెర్క్‌ (4/22) నాలుగు వికెట్లతో యూపీని దెబ్బ తీసింది. అనంతరం బెంగళూరు 13.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్రేస్‌ హారిస్‌ (37 బంతుల్లో 75; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. హారిస్, స్మృతి మంధాన (27 బంతుల్లో 54 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 108 పరుగులు జత చేశారు. రాణించిన ఓపెనర్లు అనూహ్యంగా తొలిసారి ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, కెప్టెన్‌ లానింగ్‌ కలిసి జట్టుకు శుభారంభం అందించారు. పవర్‌ప్లే ముగిసేసరికి యూపీ వికెట్‌ నష్టపోకుండా 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు సాధించింది. అయితే 9వ ఓవర్‌ నుంచి ఆట మారిపోయింది. తన తొలి బంతికే లానింగ్‌ను అవుట్‌ చేసిన డిక్లెర్క్, ఐదో బంతికి ఎమీ జోన్స్‌ (1)ను పెవిలియన్‌ పంపించింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో హర్లీన్‌ (14), ట్రయాన్‌ (6), శ్వేత సెహ్రావత్‌ (7) వెనుదిరగ్గా... మరో ఎండ్‌లో జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేసిన దీప్తి 18వ ఓవర్‌ చివరి బంతికి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. తొలి 10 ఓవర్లలో 82 పరుగులు చేసిన వారియర్స్‌ తర్వాతి 10 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే సాధించింది. హారిస్‌ దూకుడు యూపీతో ఆడిన గత మ్యాచ్‌లో 40 బంతుల్లోనే 85 పరుగులు చేసిన హారిస్‌... ఈసారి కూడా సరిగ్గా అంతే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అదే తరహాలో బ్యాటింగ్‌ చేసింది. గత మ్యాచ్‌లో బౌండరీల ద్వారా 70 పరుగులు రాబట్టిన ఆమె ఈసారి బౌండరీలతో 64 పరుగులు సాధించింది! పవర్‌ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, హారిస్‌ వాటానే 49 పరుగులు కావడం విశేషం. ఆ తర్వాత శోభన ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన ఆమె 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకుంది. ఎట్టకేలకు ఆర్‌సీబీ విజయానికి 36 పరుగులు చేయాల్సిన దశలో హారిస్‌ను అవుట్‌ చేయగలిగినా ...స్మృతి 26 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (సి) రాధ (బి) డిక్లెర్క్‌ 41; దీప్తి (సి) డిక్లెర్క్‌ (బి) శ్రేయాంక 55; జోన్స్‌ (ఎల్బీ) (బి) డిక్లెర్క్‌ 1; హర్లీన్‌ (బి) హారిస్‌ 14; ట్రయాన్‌ (స్టంప్డ్‌) రిచా (బి) హారిస్‌ 6; శ్వేత (సి) స్మృతి (బి) బెల్‌ 7; సిమ్రన్‌ (సి) అరుంధతి (బి) డిక్లెర్క్‌ 10; ఎకెల్‌స్టోన్‌ (ఎల్బీ) (బి) డిక్లెర్క్‌ 0; శోభన (నాటౌట్‌) 0; శిఖా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–74, 2–78, 3–95, 4–103, 5–122, 6–137, 7–138, 8–143. బౌలింగ్‌: బెల్‌ 4–0–21–1, సయాలీ 2–0–21–0, శ్రేయాంక 4–0–27–1, అరుంధతి 1–0–14–0, డిక్లెర్క్‌ 4–0–22–4, హారిస్‌ 3–0–22–2, రాధ 2–0–11–0. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: హారిస్‌ (బి) శిఖా 75; స్మృతి (నాటౌట్‌) 54; వోల్‌ (సి) సిమ్రన్‌ (బి) శోభన 16; రిచా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (13.1 ఓవర్లలో 2 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–108, 2–143. బౌలింగ్‌: క్రాంతి 2–0–29–0, శిఖా 4–0–36–1, దీప్తి 2.1–28–0, ఎకెల్‌స్టోన్‌ 2–0–14–0, శోభన 2–0–24–1, ట్రయాన్‌ 1–0–15–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుముంబై ఇండియన్స్‌ x గుజరాత్‌ జెయింట్స్‌ రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

WPL 2026: Deepti sharma shines with 50, Though RCB restricted UP Warriorz to 143 runs10
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన వారియర్జ్‌

డబ్ల్యూపీఎల్‌ 2026 ఎడిషన్‌లో ఆర్సీబీ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇవాళ (జనవరి 29) జరుగుతున్న తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో కలిసికట్టుగా రాణించి, ప్రత్యర్ధిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. వడోదర వేదికగా యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ.. యూపీని 143 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.ఓపెనర్లు మెగ్‌ లాన్నింగ్‌ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్‌కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆతర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్‌ను కుదురుకోన్విలేదు. పేసర్‌ లారెన్‌ బెల్‌ (4-0-21-1) మరోసారి తన అద్భుత ప్రదర్శనను కొనసాగించగా.. నదినే డి క్లెర్క్‌ (4-0-22-4) వారియర్జ్‌ వెన్ను విరిచింది. ఆఫ్‌ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (4-0-27-1), గ్రేస్‌ హ్యారిస్‌ (3-0-22-2) కూడా అద్భుతంగా రాణించారు. రాధా యాదవ్‌ (2-0-11-0) వికెట్‌ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేసింది. సయాలీ సత్ఘరే (2-0-21-0), అరుంధతి రెడ్డి (1-0-14-0) ఓ మోస్తరుగా పరుగులు సమర్పించుకున్నారు. వారియర్జ్‌ ఇన్నింగ్స్‌లో లాన్నింగ్, దీప్తి శర్మ మినహా ఎవ్వరూ రాణించలేదు. హర్లీన్‌ డియోల్‌ (14), సిమ్రన్‌ షేక్‌ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్‌ (1), క్లో ట్రయెన్‌ (6), శ్వేతా సెహ్రావత్‌ (7), సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్‌ డకౌటైంది. ఆఖరి ఓవర్‌లో క్లెర్క్‌ 2 వికెట్లు తీసి వారియర్జ్‌ను కనీసం 150 పరుగుల మార్కును కూడా చేరుకోనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ఏకైక జట్టుగా చలామణి అవుతంది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకునేందుకు చివరి మ్యాచ్‌ వరకు వేచి చూడాల్సి వచ్చింది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement