Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

IPL 2026: DRS blunder costs MI as Head powers SRH win1
భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్‌ ఓటమికి కారణం ఇదే?

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియ‌న్స్ క‌ష్టాలు కొన‌సాగుతున్నాయి. ఈ ఏడాది సీజ‌న్‌లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఆరో ఓట‌మిని నమోదు చేసింది. బుధ‌వారం వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది.243 ప‌రుగుల భారీ టార్గెట్‌ను కూడా ముంబై కాపాడుకోలేక పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై జ‌ట్టు భారీ త‌ప్పిదం చేసింది. బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసే అవ‌కాశాన్ని ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోల్పోయింది. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌ మూడో ఓవ‌ర్‌లో రెండో బంతిని బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివ‌రీగా బౌల్ట్ సంధించాడు.ఆ బంతిని హెడ్‌ లెగ్‌సైడ్‌ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు సమీపంగా వెళుతూ కీపర్‌ చేతుల్లో పడింది. దీనిని కీపర్, బౌలర్‌ ఎవరూ సరిగా గుర్తించకపోవడంతో ముంబై అప్పీల్‌కు కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. తర్వాత రీప్లేలో చూడగా బంతి హెడ్‌ బ్యాట్‌కు తగిలినట్లుగా స్పష్టమైంది. ఈ సమయంలో హెడ్‌ స్కోరు 8 పరుగులు మాత్రమే. ఈ త‌ప్పిదానికి ముంబై భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. ఆ త‌ర్వాత ఈ ఆసీస్ ఓపెన‌ర్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. హెడ్ కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ముంబై ఓటమిని శాసించాడు. ఒకవేళ 8 పరుగుల వద్ద హెడ్‌ ఔటై వుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హెడ్‌ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు జారవిడిచారు.చదవండి: భయం వారి బ్లడ్‌లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్‌ కమ్మిన్స్‌

BCCI To Seek Explanation From Riyan Parag Over Vaping In Dressing Room2
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! వేటు త‌ప్ప‌దా?

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ ‘వేపింగ్‌’ (ఇ–సిగరెట్‌తో పొగ పీల్చడం) చేస్తూ టీవీ కెమెరాల‌కు చిక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ విషయం క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ద్రవరూపంలో ఉండే నికొటిన్‌ను ఉపయోగించే ఇ–సిగరెట్‌లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది.అయినప్పటికి నిషేధిత ఇ–సిగరెట్ వాడి పరాగ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష కూడా ఉండవచ్చు. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్ అయింది."వేపింగ్ చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ విషయంపై మేము రియాన్‌ను నుంచి వివరణ కోరతాము. అతడి సమాధానం ఆధారంగా ఐపీఎల్ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని" బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. కాగా ఇదే విషయంపై ఐపీఎల్ అధికారి కూడా ఒకరు స్పందించారు.‘చాలా మంది ఆటగాళ్లు ఇ–సిగరెట్‌లు వాడతారు. ఎన్నో కెమెరాలు తమ వైపు చూస్తుండగా డ్రెస్సింగ్‌రూమ్‌లో ఇలా ఎవరూ చేయరు. ఇంత బహిరంగంగా పట్టుబడటం పరాగ్‌ నిర్లక్ష్యాన్ని చూపించింది. బీసీసీఐ కచి్చతంగా దీనిపై చర్య తీసుకుంటుంది’ అని సదరు అధికారి వెల్లడించారు.మరోవైపు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చునే క్రికెటర్ల గోప్యతకు సంబంధించి కూడా దీని ద్వారా ప్రశ్నలు తలెత్తాయి. ‘తాజా వివాదం గురించి కాదు కానీ డ్రెస్సింగ్‌ రూమ్‌ క్రికెటర్ల ప్రైవేట్‌ ప్రదేశం. అక్కడ ఆటగాళ్లు తమకు నచి్చనట్లుగా ఉంటారు. అక్కడి దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు చేయడం సరైంది కాదు. ఇది క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తుంది. కెమెరామెన్లు మైదానంలో ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని బోర్డులోని మరో అధికారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ విచారణలో పరాగ్‌ తప్పు చేసినట్లే తేలితే బీసీసీఐ ఒకట్రెండు మ్యాచ్‌లు నిషేధం విధించే అవకాశముంది.చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్‌

Pat Cummins comments after SRH chase down 244-run target against MI3
భయం వారి బ్లడ్‌లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్‌ కమ్మిన్స్‌

ఐపీఎల్‌-2026లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. బుధ‌వారం వాంఖ‌డే మైదానం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 244 ప‌రుగుల ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది.ఈ విజ‌యంలో ట్రావిస్ హెడ్ (76 పరుగులు),అభిషేక్ శర్మ (45 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్),సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్)ల‌ది కీల‌క పాత్ర‌. ఓపెన‌ర్లు అభిషేక్‌, హెడ్‌కు 129 ప‌రుగులు అందించ‌గా.. క్లాసెన్‌, ఆరోరా దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. హైద‌రాబాద్‌కు ఐపీఎల్‌లో ఇది వందో విజ‌యం కావ‌డం గమానార్హం. మ్యాచ్ అనంత‌రం ఈ చారిత్ర‌త్మ‌క విజ‌యంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ స్పందించాడు. ఎంత‌టి భారీ టార్గెట్‌నైనా ఛేదించే స‌త్తా త‌మ బ్యాట‌ర్ల‌కు ఉంద‌ని క‌మ్మిన్స్ అన్నాడు."244 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌డం అంత సులువు కాదు. కానీ మా బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబ‌ట్టి ఖ‌చ్చితంగా చేధిస్తామ‌ని అనుకున్నాను. మా బాయ్స్ నా న‌మ్మ‌కాన్ని నిజం చేశారు. మా ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, హెడ్‌ గురుంచి ఎంత చెప్పిన త‌క్కువే. వారు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం అన్నదే లేనిట్లు అన్పిస్తోంది. ముఖ్యంగా పిచ్ బాగున్న‌ప్పుడు వారు ఆడే షాట్ల‌కు బౌలర్లు బెంబేలెత్తాల్సిందే.వారికి బౌలింగ్ వేయాల్సిన అవ‌స‌రం నాకు లేనందుకు సంతోషిస్తున్నాను. ఇక క్లాసెన్ మ‌రోసారి త‌న క్లాస్ ఎంటో చూపించాడు. ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌డు రాణిస్తున్నాడు. అటువంటి ఆట‌గాడు జ‌ట్టులో ఉన్నందుకు మా అదృష్టం. మ‌రోవైపు యువ ఆట‌గాడు సలీల్ అరోరా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్స్ దొరికిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటుతున్నాడు.కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లలో నింపిన 'ఫియర్ లెస్' వైఖరి జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కి, ఇప్పటి టోర్నీకి చాలా తేడా ఉంది. గతంలో 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్‌కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా, బ్యాటర్లు దానిని సులువుగా ఛేదిస్తున్నారు.ఇటువంటి హైస్కోరింగ్ మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మ్యాచ్‌లలో ఒక అద్భుతమైన 'యార్కర్' మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. మా జట్టులో ఈషన్ మలింగ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అతడు మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్‌

Hardik Pandya refuses to hide his true feelings for Mumbai crowd after MI fail to defend 243 against SRH4
చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్‌

ఐపీఎల్‌-2026లో ముంబై ఇండియన్స్ కథ ఏ మాత్రం మారలేదు. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. సీనియర్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రాలు దారుణంగా విఫలమయ్యారు. ఈ ఏడాది సీజన్‌లో ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ మెరుగు పడినప్పటికి, బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని హార్దిక్ అన్నాడు."భారీ స్కోర్‌ను నమోదు చేసినప్పటికి ఓడిపోవడం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది. ఈ రోజు మంచు ప్రభావం పెద్దగా లేదు. వారు అద్భుతమైన షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేశాం. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయకపోవడంతో వారు దూసుకుపోయారు. గత మ్యాచ్‌తో పోలిస్తే మేము పుంజుకున్నాము అన్పించింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చాలా మెరుగయ్యాం. కానీ బౌలింగ్ పరంగా మాత్రం విఫలమయ్యాము. 244 పరుగుల టార్గెట్‌ను మా బౌలర్లు డిఫెండ్ చేసుకోగలరని నమ్మాను. కానీ మేము అనుకున్నది ఈ రోజు జరగలేదు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము.ఇక నా విషయానికి వస్తే.. చివరి మూడు బంతులు మినహా, మిగిలన ఓవర్లు మొత్తం బాగానే బౌలింగ్ చేశాను. అయితే కొన్ని క్యాచ్‌లను విడిచిపెట్టడం మా గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టినప్పుడే మొమెంటం మారుతుంది. మా కుర్రాళ్లందరూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. బౌలింగ్ విభాగంలో ఈ సీజన్‌లో మాకు పెద్దగా ఆప్షన్లు లేవు. అందుబాటులో ఉన్న బౌలర్లనే రొటేట్ చేయాల్సి వస్తుంది. అయినప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మా బౌలర్లను బలిపశువులు చేయను. ఓటుములకు జట్టు మొత్తం బాధ్యత వహించాల్సిందే. ముంబై ఇండియన్స్ అం‍టే ఒక బ్రాండ్‌. కానీ మా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము. సొంత ప్రేక్షకుల ముందు మ్యాచ్‌లను ఓడిపోతుండడం చాలా బాధగా ఉంది. కొన్ని సందర్భాల్లో హోమ్ గ్రౌండ్‌లో ప్రత్యర్థి జట్టు పేరు మారుమోగుతుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతోంది. అభిమానుల ప్రేమను తిరిగి పొందాలంటే మేము తిరిగి మ్యాచ్‌లను గెలవాలి. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తాము. మా యజమానులు, కోచింగ్ స్టాఫ్ అందరూ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. మేము లోపాలను సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హార్దిక్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో ఉంది.చదవం‍డి: హెడ్‌, క్లాసెన్‌ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్‌

FIFA approves new World Cup discipline rules5
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!

వాషింగ్టన్‌: రాబోయే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్‌లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్‌లో ఆడకుండా సస్పెన్షన్‌ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్‌ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్‌ మ్యాచ్‌లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్‌కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్‌ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్‌ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కీలక మ్యాచ్‌లకు టాప్‌ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్‌ కార్డు’ జారీ చేయవచ్చు.

Athletes records in different sports6
రికార్డు ‘బ్రేక్‌’ 

ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ సెబాస్టియన్‌ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్‌ మారథాన్‌లో ఈ కెన్యా అథ్లెట్‌... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్‌ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్‌ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... సాహో... సెబాస్టియన్‌ మారథాన్‌లో కెన్యా రన్నర్‌లకు తిరుగులేదని సెబాస్టియన్‌ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్‌ మారరథాన్‌లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్‌ కిప్టుమ్‌ 2 గంటల 35 సెకన్లలో మారథాన్‌ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్‌ దీన్ని సవరించాడు. భారత్‌ విషయానికి వస్తే... సావన్‌ భర్వాల్‌ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్‌డామ్‌ మారథాన్‌ను సావన్‌ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్‌ శివనాథ్‌ సింగ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్‌ సింగ్‌ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్‌ నేషనల్‌ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 15సార్లు రికార్డు బద్దలు... పురుషుల పోల్‌వాల్ట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్‌ డుప్లాంటిస్‌ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్‌ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్‌ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్‌ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్‌ జోరు కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల తర్వాత... మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్‌కే బోల్‌ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్‌ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్‌విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్‌ అథ్లెట్‌ దీన్ని బద్దలు కొట్టింది.35 ఏళ్లుగా పదిలంగా... పురుషుల లాంగ్‌జంప్‌లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్‌ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్‌ పావెల్‌ 1991 ఆగస్టు 30న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్‌ బీమన్‌ పేరిట ఉంది. బాబ్‌ 1968లో 8.90 మీటర్ల దూరం లంఘించాడు.కెన్యా అథ్లెట్లదే హవా...మహిళల మారథాన్‌లో బ్రిటన్‌ రన్నర్‌ పౌలా రాడ్‌క్లిఫ్‌ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్‌క్లిఫ్‌ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్‌ బ్రిగిడ్‌ కొస్‌గెయ్‌ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్‌ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్‌ చెప్‌గెటిచ్‌ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది. గ్యారీ సోబర్స్‌ పేరిట 36 ఏళ్లు... టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సోబర్స్‌ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్‌కే చెందిన బ్రియాన్‌ లారా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్‌ మాథ్యూ హెడెన్‌ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్‌ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది. → నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు థామస్‌ కప్‌ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో భారత జట్టు థామస్‌ కప్‌ గెలవడం అదే మొదటిసారి. → ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా భారత యువ షట్లర్‌ ఆయుశ్‌ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్‌ నుంచి 1965లో దినేశ్‌ ఖన్నా ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌ ఆడారు. → భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్‌గా 1965లో దినేశ్‌ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్‌కు ఈ టోర్నమెంట్‌లో బంగారు పతకం లభించింది. → ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 2018 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్‌ పదుకోన్‌ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్‌ దానిని పునరావృతం చేశాడు. → 2019 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్‌ 36 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేశాడు. 1983లో భారత్‌ నుంచి చివరిసారిగా ప్రకాశ్‌ పదుకోన్‌ ఈ టోర్నమెంట్‌లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్‌ తర్వాత భారత్‌ నుంచి 2021లో కిడాంబి శ్రీకాంత్‌ రజతం... లక్ష్య సేన్‌ కాంస్యం... 2023లో ప్రణయ్‌ కాంస్యం సాధించారు. → బ్యాడ్మింటన్‌ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్‌లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గానూ సింధు చరిత్రకెక్కింది.మరికొన్ని... బ్యాడ్మింటన్‌లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్‌ తరఫున తొలిసారి ప్రకాశ్‌ పదుకోన్‌ 1980లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్‌ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలవలేకపోయాడు. –సాక్షి క్రీడావిభాగం

IPL 2026 Match 41: SRH beat MI7
హెడ్‌, క్లాసెన్‌ ఊచకోత.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 29) జరిగిన 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడ్డాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ముంబైని 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.రికెల్టన్‌ రికార్డు సెంచరీటాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.సన్‌రైజర్స్‌ బ్యాటర్ల ఊచకోత244 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అభిషేక్‌ శర్మ (45), ట్రవిస్‌ హెడ్‌ (76), హెన్రిచ్‌ క్లాసెన్‌ (65 నాటౌట్‌) ఊచకోత కోసి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. ఆఖర్లో సలీల్‌ అరోరా (30 నాటౌట్‌) సైతం​ విధ్వంసం సృష్టించాడు. మిగతా ఆటగాళ్లలో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 21 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో ఘజన్‌ఫర్‌ 2 వికెట్లు తీయగా.. బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా తలో వికెట్‌ తీశారు.

Rickelton becomes the fastest Mumbai Indians batter to score a Hundred in IPL history8
చరిత్ర సృష్టించిన రికెల్టన్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

ర్యాన్‌ రికెల్టన్‌.. ఈ పేరు ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ అభిమానుల నోట మారుమోగుతోంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.ఈ మ్యాచ్‌లో ముంబై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రికెల్టన్‌ కేవలం 44 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు 18 ఏళ్లుగా సనత్‌ జయసూర్య ఖాతాలో ఉండింది. జయసూర్య ఐపీఎల్‌ అరంభ ఎడిషన్‌లో (2008) ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ సీఎస్‌కేపై 45 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ రికార్డును రికెల్టన్‌ నేటి మ్యాచ్‌లో బద్దలు కొట్టాడు.ఐపీఎల్‌లో ముంబై తరఫున వేగవంతమైన సెంచరీలు44 బంతులు – ర్యాన్ రికెల్టన్45 బంతులు – సనత్ జయసూర్య45 బంతులు – తిలక్ వర్మ47 బంతులు – కెమరూన్‌ గ్రీన్‌ఈ సెంచరీతో రికెల్టన్ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున అన్ని టీ20 లీగ్‌లలో కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ దిగ్గజం రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. రికెల్టన్‌ ఎంఐ ఫ్రాంచైజీల (ముంబై ఇండియన్స్‌, ఎంఐ కేప్‌టౌన్‌) తరఫున మొత్తం 3 సెంచరీలు చేయగా.. రోహిత్‌ 2 సెంచరీలు (రెండూ ముంబై ఇండియన్స్‌ తరఫునే) చేశాడు. 2025 ఐపీఎల్‌ సందర్భంగా ఎంఐ ఫ్యామిలీలో చేరిన రికెల్టన్‌ కేవలం రెండేళ్ల వ్యవధిలో రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాన్ని అధిగమించడం విశేషం.ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యధిక సెంచరీలు3 – ర్యాన్ రికెల్టన్ (ఐపీఎల్‌, SA20)2 – రోహిత్‌ శర్మ (ఐపీఎల్‌)2 – సూర్యకుమార్‌ యాదవ్‌ (ఐపీఎల్‌)2 – టామ్‌ బాంటన్‌రికెల్టన్‌ను ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2025 వేలంలో కేవలం రూ.1 కోటికే సొంతం చేసుకుంది. ఇతగాడు ఇప్పటికే ఎంఐ ఫ్రాంచైజీల తరఫున అత్యంత కీలకమైన ఆటగాడిగా మారిపోయాడు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 55 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్‌ 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయమైన 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రికెల్టన్‌ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యధిక స్కోర్‌123 (నాటౌట్‌)- ర్యాన్‌ రికెల్టన్‌‌114 (నాటౌట్‌)- సనత్‌ జయసూర్య112 (నాటౌట్‌)- క్వింటన్‌ డికాక్‌109 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ105 (నాటౌట్‌)- రోహిత్‌ శర్మ103 (నాటౌట్‌)- సూర్యకుమార్‌ యాదవ్‌కాగా, ఈ మ్యాచ్‌లో గాయపడిన డికాక్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన రికెల్టన్‌ రికార్డు శతకం బాది ముంబై ఇండియన్స్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఎందుకంటే, రికెల్టన్‌ సెంచరీకి ముందు డికాక్ కూడా ఓ అద్భుత శతకం బాదాడు. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లో ఎవరిని ఆడించాలో మేనేజ్‌మెంట్‌కు అర్దం కావట్లేదు.భారీ స్కోర్‌టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు.

Revealed: Why Mumbai Indians Players Are Wearing Black Armbands vs SRH9
ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారో తెలుసా..?

ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది.జట్టు సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె ఇటీవల అకాల మరణం చెందింది. ఆమె స్మారకార్థం, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఆటగాళ్లు నల్ల ఆర్మ్‌బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు.ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమె జ్ఞాపకార్థం ఈరోజు మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు" అని వెల్లడించారు.ఈ విషాద సమయంలో ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ వెల్లడించలేదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 15 ఓవర్ల అనంతర​ం ఆ జట్టు స్కోర్‌ 181-3గా ఉంది. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ 44 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా హార్దిక్‌ పాండ్యా (2) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22 పరుగులు చేసి ఔటయ్యారు. హింగే, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలో వికెట్‌ తీశారు.

IPL 2026, MI vs SRH: No Rohit Sharma again, Hardik Pandya gives big comeback update10
రోహిత్‌ శర్మ అభిమానులకు చేదు వార్త

ముంబై ఇండియన్స్ అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ మరోసారి జట్టుకు దూరమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 29) జరుగుతున్న కీలక పోరులో కూడా రోహిత్ ఆడటం లేదు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతడు వరుసగా నాలుగో మ్యాచ్‌కు దూరమయ్యాడు.టాస్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా రోహిత్‌ గాయంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. "రోహిత్ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అతడు తిరిగి రావడానికి ఇంకొన్ని మ్యాచ్‌లు పట్టొచ్చు" అని స్పష్టం చేశాడు. దీంతో ముంబై అభిమానులు అతని రీ-ఎంట్రీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.రోహిత్ గైర్హాజరీ ముంబైకి భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. అతని అనుభవం, ఆరంభ ఓవర్లలో దూకుడు జట్టుకు ఎంతో అవసరం. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.ఆరంభ ఓవర్లలో ముంబై ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. జాక్స్‌, రికెల్టన్‌ పోటీపడి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నారు. 6 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 78-0గా ఉంది. జాక్స్‌ 38, రికెల్టన్‌ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు బౌలింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఎసాన్‌ మలింగ ఒక్కడే జాక్స్‌-రికెల్టన్‌ జోడీ ధాటి నుంచి తప్పించుకున్నాడు. కమిన్స్‌, హింగే, హర్ష్‌ దూబే, సాకిబ్‌ హుసేన్‌ను వీరి జోడీ చెడుగుడు ఆడుకుంది.ఈ మ్యాచ్‌లో ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. డికాక్‌ స్థానంలో రికెల్టన్‌, సాంట్నర్‌ స్థానంలో రాబిన్‌ మింజ్‌ బరిలోకి దిగారు. ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ఓ మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ స్థానంలో హర్ష్‌ దూబే తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(w), నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(సి), హర్ష్ దూబే, సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), విల్ జాక్స్, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, అశ్వనీ కుమార్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement