Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pankaj Advani Stellar Double Triumph at Pool Nationals1
సత్తా చాటిన పంకజ్‌ అద్వానీ

లూథియానా: దిగ్గజ క్యూయిస్ట్‌ పంకజ్‌ అద్వానీ పూల్‌ నేషనల్స్‌లో కూడా సత్తా చాటాడు. తొలిసారి ఈ టోర్నీలో పాల్గొన్న పంకజ్‌ 10 బాల్‌ పూల్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్‌ (పీఎస్‌పీబీ) 11–9 స్కోరుతో పుష్పేందర్‌ సింగ్‌ (ఆర్‌ఎస్‌పీబీ)ని ఓడించాడు. ఒక దశలో 0–3తో వెనుకబడి పంకజ్‌ కోలుకొని స్కోరును 3–3తో సమం చేయడంతో పాటు ఆ తర్వాత వేగంగా దూసుకుపోయాడు. మహిళల విభాగంలో చిత్ర మగిమైరాజ్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది.

Who Is Ashok Sharma Gujarat Titans Bowler Record Fastest Ball IPL 20262
మొద‌ట్లో చితక్కొట్టినా చివర్లో వ‌ణికించాడు!

భార‌త్‌లో ఫాస్ట్ బౌల‌ర్ల క‌న్నా మీడియం ఫాస్ట్ బౌల‌ర్లే ఎక్కువ‌గా ఉంటారు. న‌ట‌రాజ‌న్‌, ఉమ్రాన్ మాలిక్‌, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌల‌ర్లు అరుదుగా క‌నిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్ ద్వారా మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ వెలుగులోకి వ‌చ్చాడు. అత‌డే గుజ‌రాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శ‌ర్మ. శ‌నివారం రాజ‌స్తాన్ రాయల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా గంట‌కు 154 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవ‌ర్ చివ‌రి బంతిని అశోక్ శ‌ర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వ‌చ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడ‌డంలో విఫ‌ల‌మై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఈ సీజ‌న్‌లో అశోక్ శ‌ర్మ సంధించిన బంతి అత్యంత వేగ‌వంత‌మైనదిగా రికార్డుల‌కెక్కింది. అశోక్ శ‌ర్మ కంటే ముందు ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ బౌల‌ర్‌ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), ర‌బాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శ‌ర్మ‌ను రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు దంచికొట్టారు. 2 ఓవ‌ర్లు క‌లిపి 9 స‌గ‌టుతో 18 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శ‌ర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయ‌డంతో పాటు త‌న ఫాస్ట్ బౌలింగ్‌తో వ‌ణికించాడు. అంతేకాదు గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో అంద‌రూ దాదాపు భారీగా ప‌రుగులిచ్చుకోగా.. అశోక్ శ‌ర్మ మాత్రం మిగ‌తా వాళ్ల‌తో పోలిస్తే త‌క్కువ‌ ఎకాన‌మీ న‌మోదు చేయ‌డం విశేషం. గుజ‌రాత్ ఓడిన‌ప్ప‌టికీ అశోక్ శ‌ర్మ త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రీ అశోక్ శ‌ర్మ‌? ఎక్క‌డి నుంచి వ‌చ్చాడ‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవ‌రీ అశోక్ శ‌ర్మ‌?రాజస్థాన్‌లోని జైపూర్‌ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మ‌ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్‌ శర్మ తండ్రి హుకుమ్‌ చంద్‌ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్‌ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్‌ అరుదైన రికార్డు!

Ravi Bishnoi Becomes Youngest Indian To Take 200 Wickets In T20s3
రవి బిష్ణోయ్‌ అరుదైన రికార్డు!

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్ ఆఖ‌రి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగింది. అయితే మొద‌ట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్‌, జైస్వాల్ మెరిస్తే.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో ర‌వి బిష్ణోయ్‌, తుషార్ దేశ్‌పాండే సూప‌ర్ బౌలింగ్‌తో రాజ‌స్తాన్ థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజ‌రాత్ బ్యాట‌ర్లు సాయి సుద‌ర్శ‌న్‌, గ్లెన్ పిలిప్స్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, రాహుల్ తెవాటియాలు ర‌వి బిష్ణోయ్‌ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయ‌డం ద్వారా ర‌వి బిష్ణోయ్‌ టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే భార‌త్ త‌ర‌ఫున‌ ఈ ఘ‌న‌త సాధించిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్‌ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భార‌త్ త‌ర‌ఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌల‌ర్‌గా, 9వ స్పిన్ బౌల‌ర్‌గా ర‌వి బిష్ణోయ్‌ రికార్డులకెక్కాడు. ఓవ‌రాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా ర‌షీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్ప‌టికీ ప‌దిలంగా ఉంది. ఇక ఐపీఎల్‌లో ప్ర‌స్తుతం రాజ‌స్తాన్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన ర‌వి బిష్ణోయ్‌ గ‌త‌లో పంజాబ్ కింగ్స్‌, ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా త‌ర‌ఫున 44 టీ20లు ఆడిన ర‌వి బిష్ణోయ్‌ 64 వికెట్లు ప‌డ‌గొట్టాడు.మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంత‌రం క‌డ‌దాకా పోరాడిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మై 6 ప‌రుగుల తేడాతో పరాజ‌యం చ‌విచూసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’

Rashid Khan Comments After Match Lost Vs Rajasthan Royals4
‘ఆ తప్పిదం మా కొంపముంచింది’

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్ రాయల్స్‌నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. ము‍ఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్‌పై ఓవ‌ర్‌కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్‌గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో రాణిస్తాం. మా రెగ్యులర్‌ కెప్టెన్‌ గిల్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అంపైర్‌ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్‌!

Sunrisers match in Uppal today5
‘హోం’లో పోరుకు రెడీ!

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2026 సీజన్‌లో హైదరాబాద్‌ వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ మైదానంలో నేడు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడినా... ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి రైజర్స్‌ జోరు మీదుంది. మరో వైపు లక్నో తాము ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమిపాలైంది. 2025 సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. మార్పుల్లేకుండా... తిరుగులేని బ్యాటింగ్‌ బలగం ఉన్న సన్‌రైజర్స్‌ మరోసారి అదే విధ్వంసక ఆటను సొంత గడ్డపై చూపించాలని పట్టుదలగా ఉంది. హెడ్, అభిషేక్‌ మెరుపు బ్యాటింగ్‌లో చెలరేగితే జట్టుకు తిరుగుండదు. హైదరాబాద్‌ ఓపెనర్లను లక్నో ఏమాత్రం నిలువరించగలదనేదే ఆసక్తికరం. వీరి తర్వాత అదే ధాటిని కొనసాగించేందుకు ఇషాన్‌ కిషన్, క్లాసెన్‌ సిద్ధంగా ఉన్నారు. గత మ్యాచ్‌లో విఫలమైనా...అనికేత్‌ వర్మ ప్రతిభావంతుడైన బ్యాటర్‌. వీరికి తోడు లోకల్‌ బాయ్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫామ్‌లోకి రావడం మరో సానుకూలాంశం. కోల్‌కతాలో పోరులో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన నితీశ్‌ తన జోరును కొనసాగించాలని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఏడో స్థానంలో వచ్చే సలీల్‌ కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. అన్నింటికి మించి హైదరాబాద్‌ పిచ్‌ ఎప్పుడూ బ్యాటింగ్‌కు బాగా అనుకూలమే. పరుగుల విషయంలో ఎన్నో రికార్డులు ఈ మైదానంలో బద్దలయ్యాయి. ఈ నేపథ్యంలో రైజర్స్‌ బ్యాటింగ్‌ ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. అయితే బ్యాటింగ్‌తో పోలిస్తే సహజంగానే రైజర్స్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. డేవిడ్‌ పేన్‌ ప్రధాన పేసర్‌ కావడం కాస్త ఆశ్చర్యపరుస్తుండగా...ఉనాద్కట్, మలింగ, దూబే ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశం. పంత్‌పై తీవ్ర ఒత్తిడి... గత సీజన్‌లో అంతంతమాత్రంగానే ఆడిన లక్నోకు ఈసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో కేవలం 141 పరుగులకే పరిమితమైన ఆ జట్టు ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఆటగాళ్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కోలుకొని మళ్లీ దారిలో పడటం టీమ్‌కు ఎంతో కీలకం. ఓపెనర్‌గా వచ్చిన పంత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు కాబట్టి ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా మరో ప్రయత్నం చేయవచ్చు. మార్‌‡్ష, మార్క్‌రమ్‌ తమ స్థాయికి తగినట్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. రెండు అగ్రశ్రేణి జట్ల టి20 కెపె్టన్లు అయిన వీరిద్దరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థులు. పూరన్‌ ఐదో స్థాయిలో బరిలోకి దిగడం జట్టుకు ఏమాత్రం మేలు చేయదు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బదోని కంటే ముందు నాలుగో స్థానం అతను ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఆదుకున్న సమద్‌ తమ మాజీ జట్టుపై మరో మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. లక్నో పేస్‌ దళం చాలా పటిష్టంగా ఉంది. షమీ, మొహసిన్, నోర్జే, ప్రిన్స్‌ జట్టు భారం మోస్తున్నారు. నాణ్యమైన స్పిన్నర్‌ లేని లోటును టీమ్‌ ఎలా అధిగమిస్తుందో చూడాలి.స్వదేశానికి కమిన్స్‌ సన్‌రైజర్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ ఆ్రస్టేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతను దానికి స్కానింగ్‌ చేయించుకునేందుకు స్వదేశానికి వెళ్లాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు పర్యవేక్షణలో ఈ పరీక్ష జరుగుతుంది. దీని తర్వాత అతని ఫిట్‌నెస్‌పై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే ఐపీఎల్‌ రెండో దశ పోటీల్లో ఆడతాడా లేదా తేలుతుందని ఆసీస్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.చెన్నై X బెంగళూరు సా.7:30నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో తమ విజయపరంపరను కొనసాగించేందుకు సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో బెంగళూురు తలపడుతుంది. సీజన్‌ తొలి పోరులో సన్‌రైజర్స్‌ను ఓడించి అమితోత్సాహంతో మొదలు పెట్టిన ఆర్‌సీబీ సొంత గ్రౌండ్‌లో అభిమానులకు మళ్లీ గెలుపు సంబరం అందించాలని భావిస్తోంది. మరో వైపు వరుసగా రెండు పరాజయాల తర్వాత తీవ్ర ఒత్తిడిలో ఉన్న చెన్నై ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఆటగాళ్ల వైఫల్యంతో పాటు మైదానంలో ధోని మార్గనిర్దేశనం లేక సీఎస్‌కే తడబడుతోంది.

Gujarat lost to Rajasthan Royals by 6 runs6
రాయల్స్‌ రైట్‌ రైట్‌

చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌ను విజయం వరించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో గుజరాత్‌కు పరాజయం తప్పలేదు. గిల్‌ గైర్హాజరీలో టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్‌ ఖాన్‌... బ్యాట్‌తో తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు జురేల్, జైస్వాల్‌ మెరుపులతో భారీ స్కోరు చేసిన రాయల్స్‌... బౌలింగ్‌లోనూ వైవిధ్యంతో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఏడుగురు బౌలర్ల ప్రయోగంలో రవి బిష్ణోయ్‌ రఫ్ఫాడించడంతో... గుజరాత్‌ లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది!అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 19వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ‘డబుల్‌ హెడర్‌’ రెండో పోరులో రాయల్స్‌ 6 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ధ్రువ్‌ జురేల్‌ (42 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకోగా... యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తనకు అలవాటైన శైలిలో రెచ్చిపోయాడు. లక్ష్యఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకు పరిమితమైంది. సాయి సుదర్శన్‌ (44 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సత్తా చాటగా... ఆఖర్లో రషీద్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు), రబాడ (16 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా పలితం లేకపోయింది. చివరి ఓవర్‌లో గుజరాత్‌ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు ధాటిగా ఆడిన రషీద్, రబాడ భారీ షాట్‌లు ఆడటంలో విఫలమయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. జురేల్‌ జోరు... మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో వైభవ్‌ రెండు ఫోర్లు కొట్టగా... అతడి తదుపరి ఓవర్‌లో జైస్వాల్‌ 6, 4, 4 బాదాడు. అశోక్‌ ఓవర్‌లో వైభవ్‌ 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రసిద్‌కు జైస్వాల్‌ 6, 4తో స్వాగతం పలకడంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్‌ వికెట్‌ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ ఈ జోడీని విడదీశాడు. డీప్‌ మిడ్‌వికెట్‌లో ఫిలిప్స్‌ పట్టిన క్యాచ్‌కు వైభవ్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. జైస్వాల్‌కు జురేల్‌ తోడవడంతో ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. ఈ క్రమంలో జైస్వాల్‌ 32 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటి వరకు నిధానంగా ఆడిన జురేల్‌ కూడా జోరు పెంచాడు. అర్ధ శతకం అనంతరం జైస్వాల్‌ అవుట్‌ కాగా... కెపె్టన్‌ రియాన్‌ పరాగ్‌ (8) విఫలమయ్యాడు. హెట్‌మైర్‌ (8 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొన్ని షాట్‌లు ఆడగా... జురేల్‌ జట్టు స్కోరును రెండొందలు దాటించాడు. రషీద్‌ ఖాన్‌ సారథ్యంలో... గుజరాత్‌ టైటాన్స్‌ రెగ్యులర్‌ కెపె్టన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించాడు. కండరాలు పట్టేయడంతో గిల్‌ మ్యాచ్‌కు దూరమైనట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతడి స్థానంలో కుమార్‌ కుషాగ్రకు చోటు దక్కింది.అశోక్‌ అదుర్స్‌... 154.2గుజరాత్‌ టైటాన్స్‌ యువ పేసర్‌ అశోక్‌ శర్మ తన వేగంతో కట్టిపడేశాడు. నిలకడగా గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఆకట్టుకుంటున్న అశోక్‌... ఈ సీజన్‌లోనే వేగవంతమైన బంతిని తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతిని అతడు గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) రబాడ 55; వైభవ్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రషీద్‌ 31; ధ్రువ్‌ జురేల్‌ (సి) బట్లర్‌ (బి) సిరాజ్‌ 75; పరాగ్‌ (సి) కుషాగ్ర (బి) ప్రసిధ్‌ 8; హెట్‌మైర్‌ (సి) సిరాజ్‌ (బి) అశోక్‌ 18; డొనావన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రబాడ 1; జడేజా (నాటౌట్‌) 7; ఆర్చర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–70, 2–126, 3–135, 4–165, 5–166, 6–205. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–48–1; రబాడ 4–0–42–2; అశోక్‌ 4–0–37–1; ప్రసిధ్‌ కృష్ణ 4–0–43–1; రషీద్‌ ఖాన్‌ 4–0–39–1. గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: సాయి సుదర్శన్‌ (సి) దేశ్‌పాండే (బి) బిష్ణోయ్‌ 73; కుషాగ్ర (సి) హెట్‌మైర్‌ (బి) పరాగ్‌ 18; బట్లర్‌ (సి) సందీప్‌ (బి) బర్గర్‌ 26; ఫిలిప్స్‌ (సి) ఆర్చర్‌ (బి) బిష్ణోయ్‌ 3; సుందర్‌ (సి) జడేజా (బి) బిష్ణోయ్‌ 4; తెవాటియా (సి) జురేల్‌ (బి) బిష్ణోయ్‌ 12; షారుక్‌ ఖాన్‌ (రనౌట్‌) 11; రషీద్‌ (సి) ఆర్చర్‌ (బి) దేశ్‌పాండే 24; రబాడ (నాటౌట్‌) 23; అశోక్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–78, 2–107, 3–127, 4–131, 5–133, 6–155, 7–161, 8–204. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–38–0; బర్గర్‌ 3–0–29–1; సందీప్‌ 3–0–34–0; దేశ్‌పాండే 3–0–24–1; జడేజా 2–0–25–0; పరాగ్‌ 1–0–11–1; బిష్ణోయ్‌ 4–0–41–4.

Mumbai Indians lost to Delhi Capitals by 6 wickets7
'సూపర్‌' సమీర్‌

గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్‌ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్‌ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్‌ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు... ఐపీఎల్‌ 19వ సీజన్‌లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్‌ పటేల్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌... శనివారం ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించగా...రోహిత్‌ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సమీర్‌ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్‌ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించాడు. 2025 సీజన్‌ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకోవడం విశేషం. నాలుగే సిక్స్‌లు... గత మ్యాచ్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. ముకేశ్‌ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ (9), హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (0) పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌ వెనుదిరగగా... షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్‌ ధీర్‌ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సాంట్నర్‌ (18 నాటౌట్‌; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్‌ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి. హార్దిక్‌ స్థానంలో సూర్యకుమార్‌... గత మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.సమీర్‌ సెంచరీ మిస్‌... గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్‌ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్‌ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ సమీర్‌ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. సాంట్నర్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్‌ ఠాకూర్‌ ఓవర్‌లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్‌ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్‌... మయాంక్‌ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్‌ చాహర్‌ ఓవర్‌లో 4, 6... శార్దుల్‌ ఓవర్‌లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో బాష్‌ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్‌ (21 నాటౌట్‌; 4 ఫోర్లు), స్టబ్స్‌ (3 నాటౌట్‌) మిగిలిన పనిపూర్తి చేశారు. 17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (18) అగ్రస్థానంలో ఉంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) అక్షర్‌ (బి) ముకేశ్‌ 9; రోహిత్‌ (సి) నితీశ్‌ రాణా (బి) అక్షర్‌ 35; తిలక్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ 0; సూర్యకుమార్‌ (ఎల్బీ) ఎన్‌గిడి 51; రూథర్‌ఫోర్డ్‌ (సి) ముకేశ్‌ (బి) విప్రాజ్‌ 5; నమన్‌ (సి) స్టబ్స్‌ (బి) నటరాజన్‌ 28; సాంట్నర్‌ (నాటౌట్‌) 18; బాష్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్‌: ముకేశ్‌ 3–0–26–2; ఎన్‌గిడి 4–0–34–1; అక్షర్‌ 4–0–22–1; విప్రాజ్‌ 3–0–24–1; కుల్దీప్‌ 3–0–31–0; నటరాజన్‌ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) రికెల్టన్‌ (బి) దీపక్‌ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్‌ 44; నితీశ్‌ రాణా (రనౌట్‌) 0; సమీర్‌ రిజ్వీ (సి) తిలక్‌ (బి) బాష్‌ 90; మిల్లర్‌ (నాటౌట్‌) 21; స్టబ్స్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్‌ 3–0–22–1; శార్దుల్‌ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్‌ బాష్‌ 3.1–0–39–1.

Para archer Sheetal Devi suffers unexpected defeat8
శీతల్‌కు పాయల్‌ షాక్‌!

బ్యాంకాక్‌: వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత జట్టు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సాధించి అగ్రస్థానంతో ముగించింది. అయితే టోర్నీలో సంచలన ప్రదర్శన చివరి రోజు శనివారం వచ్చింది. కాంపౌండ్‌ మహిళల ఫైనల్‌ విభాగంలో వరల్డ్‌ నంబర్‌వన్, స్టార్‌ పారా ఆర్చర్‌ శీతల్‌దేవికి అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ పోరులో భారత్‌కే చెందిన పాయల్‌ నాగ్‌ 139–136 స్కోరుతో శీతల్‌పై విజయం సాధించింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్‌ పారా గేమ్స్‌లో పాల్గొన్న పాయల్‌కు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. ఓపెనింగ్‌ ఎండ్‌లో పాయల్‌ 27–25తో ముందంజ వేయగా, సెకండ్‌ ఎండ్‌ ముగిసే సరికి శీతల్‌ రాణించడంతో స్కోరు 54–54తో సమమైంది. అయితే చివరి ఎండ్‌లో మళ్లీ సత్తా చాటిన పాయల్‌ పైచేయి సాధించింది. ఒడిషాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్‌ కరెంట్‌ షాక్‌ కారణంగా రెండు చేతులు, రెండు కాళ్ల మోకాలి కింది భాగాలు కోల్పోయింది. ఏడాదిన్నర క్రితం జైపూర్‌లో జరిగిన జాతీయ పారా నేషనల్స్‌లో కూడా శీతల్‌పై పాయల్‌ గెలుపొందింది.

Divya Deshmukh shines in womens category at World Candidates Chess Tournament9
భారత మహిళల జోరు

పాఫోస్‌ (సైప్రస్‌): వరల్డ్‌ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి రమేశ్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్‌ సత్తా చాటారు. వీరిద్దరు శనివారం జరిగిన తమ ఆరో రౌండ్‌ గేమ్‌లలో విజయాలు అందుకున్నారు. వైశాలి 47 ఎత్తుల్లో కేటరినా లాగ్నో (రష్యా)ను ఓడించగా...దివ్య 46 ఎత్తుల్లో బిబిసర అసుబయెవా (కజకిస్తాన్‌)పై గెలుపొందింది. వీరిద్దరికి టోర్నీలో ఇదే తొలి విజయం కావడం విశేషం. మరో వైపు పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. శనివారం జరిగిన ప్రజ్ఞానంద, నకమురా మధ్య జరిగిన ఆరో రౌండ్‌ పోరు 23 ఎత్తులో సమంగా ముగిసింది.

IPL 2026: Rajasthan royals beat gujarat titans by 6 runs10
ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై రాయల్స్‌ గెలుపు

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) రాత్రి (7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించిన గుజరాత్‌.. మధ్యలో ఒక్కసారిగా లయ తప్పి స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రబాడ, రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌కు గెలుపుపై ఆశలు కలిగించి, ఆఖర్లో చేతులెత్తేశారు. చివరి ఓవర్‌లో వీరు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. తుషార్‌ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్‌ చేసి వీరిని కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి, లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాయల్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి స్వల్ప వ్యవధిలో 4 వికెట్లతో గుజరాత్‌ నడ్డి విరిచాడు. ఫలితంగా గుజరాత్‌కు సొంతగడ్డపై పరాభవం తప్పలేదు.చెలరేగిన జురెల్‌, జైస్వాల్‌తొలుత బ్యాటింగ్‌లో ధృవ్‌ జురెల్‌ (75), యశస్వి జైస్వాల్‌ (55) అర్ద సెంచరీలతో చెలరేగడంతో రాయల్స్‌ భారీ స్కోర్‌ చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (31) సైతం మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్‌ పరాగ్‌ 4, హెట్‌మైర్‌ 18, డొనొవన్‌ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్‌ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్‌ బౌలర్లలో రబాడ 2, సిరాజ్‌, అశోక్‌ శర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.రాయల్స్‌ను భయపెట్టిన సాయి సుదర్శన్‌భారీ ఛేదనను గుజరాత్‌ ఓపెనర్‌ ధాటిగా ప్రారంభించాడు. 44 బంతుల్లో 73 పరుగులు చేసి రాయల్స్‌ శిబిరంలో భయాన్ని రేకెత్తించాడు. అయితే ఇతను ఔటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. బిష్ణోయ్‌ దెబ్బకు గుజరాత్‌ మిడిలార్డర్‌ పేకమేడలా కూలింది. బట్లర్‌ (26), రషీద్‌ ఖాన్‌ (24), రబాడ (23 నాటౌట్‌) పోరాడి చేతులెత్తేశారు. రాయల్స్‌ బౌలర్లలో బిష్ణోయ్‌ 4, బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రియాన్‌ పరాగ్‌ తలో వికెట్‌ తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement