Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Cricket Australia Set For Huge Loss As Ashes Opener In Perth Ends In 2 Days1
కొంప‌ముంచిన హెడ్‌.. క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ.17 కోట్లు నష్టం!

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్‌ విధ్వంసకర సెంచరీ ఫలితంగా ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలో ఊదిపడేసింది.అయితే పెర్త్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) భారీ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల ఆటకు సంబంధించిన టిక్కెట్లు దాదాపుగా అమ్ముడైపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ. 17 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిందరికి రిఫండ్ చేయనున్నారు. ఈ యాషెస్ ఓపెనింగ్ టెస్టును వీక్షించేందుకు తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1,01,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. గ‌తేడాది ఆఖ‌రిలో ఇదే వేదికలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌కు కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కాలేదు. మొద‌టి నాలుగు రోజుల్లో మొత్తంగా 96,463 మంది స్టేడియంకు వ‌చ్చారు. పెర్త్‌లో జ‌రిగిన యాషెస్‌ తొలి టెస్టును టీవీల్లో కూడా 245,000 మంది వీక్షించిన‌ట్లు ఛాన‌ల్ 7 ప్ల‌స్ వెల్ల‌డించింది. ఇక ఆదివారం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు హెడ్ క్షమాపణలు చెప్పాడు. "మూడో రోజు కూడా స్టేడియం నిండిపోతుందని అనుకున్నాను. కానీ రెండో రోజుల్లోనే ఆట ముగిసిపోయింది. టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారిందరికి సారీ" ఓ ప్రకటనలో హెడ్‌ పేర్కొన్నాడు.కాగా క్రికెట్ ఆస్ట్రేలియా రిఫండ్ పాలసీ ప్రకారం.. రద్దు చేయబడిన రోజులకు సింగిల్-డే టిక్కెట్లు ఉన్న అభిమానులుపూర్తి రిఫండ్‌కు అర్హులు. కాబట్టి, డే 3, డే 4, డే 5 టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బోర్డు తప్పనిసరిగా డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

India squad announcement for South Africa ODIs 2
టీమిండియా కెప్టెన్‌గా రాహుల్‌..

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్‌ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ గిల్‌ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్‌ పంత్‌ వ్యవహరిస్తారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుకేఎల్‌ రాహల్‌(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, జైశ్వాల్‌, విరాట్‌ కోహ్లి, తిలక్‌ వర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, కల్దీప్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, రుతురాజ్‌ రాజ్‌ గైక్వాడ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అర్షదీప్‌ సింగ్‌, ధ్రువ్‌ జురెల్‌

Major injury blow for Australia as Josh Hazlewood out of the entire Ashes: Reports3
గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్‌..!

యాషెస్ 2025-26 తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ హ్యామ్‌స్ట్రింగ్(తొడ కండరాలు) గాయం కారణంగా మిగిలిన యాషెస్ సిరీస్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.రెండు వారాల క్రితం విక్టోరియాతో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత స్కానింగ్ తరలించగా చిన్న బ్రేక్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తొలి టెస్టు నుంచి అతడిని తప్పించింది.అయితే రెండో టెస్టు సమయానికి హాజిల్‌వుడ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆసీస్ మేనెజ్‌మెంట్ ఆశలు పెట్టుకుంది. కానీ అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు ప్రముఖ క్రికెట్ రిపోర్టర్ పీటర్ లాలర్ తెలిపాడు. '7 క్రికెట్'లో పీటర్ లాలర్ మాట్టాడుతూ.. హాజిల్‌వుడ్ గురుం‍చి కొన్ని వార్తలు నేను విన్నాను. అవే నిజమైనతే ఈ సిరీస్‌లో హాజిల్‌వుడ్‌ను మని చూడకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు. కాగా హాజిల్‌వుడ్‌ను గ‌త కొంత‌కాలంగా గాయాలు వెంటాడుతున్నాయి. గత వేస‌వి సీజ‌న్‌లో పిక్క సమస్య కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేక‌పోయాడు. అలాగే 2021-22 యాషెస్ సిరీస్‌లో కూడా అతను కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.క‌మ్మిన్స్ అనుమానమే?మరోవైపు పెర్త్‌ టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం అనుమానమే. కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. తొలి టెస్టులో కమ్మిన్స్‌, హాజిల్‌వుడ్ లేనిప్పటికి సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతం చేశాడు. మొత్తంగా ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టి ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు గ‌బ్బా వేదిక‌గా డిసెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానుంది. పెర్త్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు కేవ‌లం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్‌? పంత్ సీరియ‌స్‌

Is Smriti Mandhanas Father Suffered Heart Attack4
స్మృతి మంధాన తండ్రికి హార్ట్‌ ఎటాక్‌

ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన తర్వాత శ్రీనివాస్‌ అస్వస్థతగా కనిపించారు. అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్‌ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో త‌న‌కు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రీనివాస్‌ సంగ్లీ లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అత‌డి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

Team India beat Nepal to lift inaugural Blind Women’s T20 World Cup5
టీ20 వరల్డ్‌కప్‌ విజేత భారత్‌

అంధుల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. ఈ రోజు నేపాల్‌తో జరిగిన ఫైనల్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. నేపాల్‌ను 114 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ జట్టు, ఆపై కేవలం 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. కొలంబోలో జరిగిన తుదిపోరులో భారత మహిళల అంధుల జట్టు ఆద్యంతం ఆకట్టుకుంది. నేపాల్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి భారత జట్టు.. అటు తర్వాత ఇంకా ఎనిమిది ఓవర్లు ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. భారత వైస్‌ కెప్టెన్‌ పూలా సారెన్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇదిలా ఉంచితే, సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి పైనల్‌కు చేరిన భారత జట్టు.. ఫైనల్‌లో కూడా మెరిసింది. ఏమాత్రం తడబాటు లేకుండా ఫైనల్‌ అడ్డంకిని కూడా అధిగమించి ఔరా అనిపించింది. ఇది భారత మహిళల అంధుల క్రికెట్‌ జట్టుకు తొలి టీ20 వరల్డ్‌కప్‌. ఈ వరల్డ్‌కప్‌తో(వన్దేలు, టీ20లు) కలిపి భారత అంధుల జట్లు(పురుషులు, మహిళలు) మొత్తం ఆరు టైటిల్స్‌ సాధించాయి.వివరాలు 2002 (టీ20, పురుషులు): మొదటి అంధుల టీ20 వరల్డ్‌కప్ విజయం2012 (టీ20, పురుషులు)2014 (వన్డే, పురుషులు)2017 (టీ20, పురుషులు)2018 (వన్డే, పురుషులు)2025 (టీ20, మహిళలు)

Kuldeep Yadav Takes 4 Wickets South Africa 489 All Out6
సఫారీలు కుమ్మేశారు..!

గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోపు ఆట ప్రారంభించిన సఫారీలు.. నాలుగు వందల మార్కును సునాయాసంగా దాటారు. ఈరోజు(ఆదివారం, నవంబర్‌ 23వతేదీ) బ్యాటింగ్‌లో సెనురన్ ముత్తుసామి సెంచరీ నమోదు చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముత్తుసామి 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 109 పరుగులు సాధించాడు. ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్‌లు సైతం ఆకట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 పరుగులు సాధించగా, జాన్సెన్‌ 93 పరుగులు చేశాడు. జాన్సెన్‌ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం, ఎనిమిదో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం లభించడంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు సాధించగా,రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు దక్కాయి. చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరిన జాన్సెన్‌ తృటిలో సెంచరీ కోల్పోయాడు. భానత బౌలర్లలో కుల్దీప్‌ 115 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్‌ 106 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లు మించి వేసిన బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు. అనంతరం తొలి ఇన్నిం గ్స్‌ ఆరంభించిన భారత్‌.. ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. జైశ్వాల్‌(7 బ్యాటింగ్‌), రాహుల్‌(2 బ్యాటింగ్‌)క్రీజ్‌లో ఉన్నారు.

Muthusamy century lifts South Africa to 428-7 at lunch7
400 పరుగులు దాటిన దక్షిణాఫ్రికా స్కోర్‌

గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలో ప్రోటీస్‌ లోయర్-ఆర్డర్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు.ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెనురన్ ముత్తుసామి(203 బంతుల్లో 107 బ్యాటింగ్‌) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ముత్తుసామికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 247/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్‌లో పట్టు బిగించింది. ముత్తుసామి, కైల్ వెర్రెయెన్నె (45) నిలకడగా ఆడి స్కోర్‌ను 300 పరుగులు దాటించారు.టీ బ్రేక్ తర్వాత కైల్ వెర్రెయెన్నె పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మార్కో జాన్సెన్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 ) దూకుడుగా ఆడి మూడో టెస్టు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాన్సెన్ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతడిని ఆపేందుకు బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకొచ్చినప్పటి ఫలితం మాత్రం దక్కలేదు. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ సాధించాడు. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్‌? పంత్ సీరియ‌స్‌

Ravi Shastris special message to Travis Head after mayhem-filled 123 in Perth8
'రెండేళ్ల కింద‌ట మేము.. ఇప్పుడు ఇంగ్లండ్‌'

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. యాషెస్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో హెడ్ భారీ శతకంతో చెలరేగాడు. అనూహ్య స్వింగ్, ఊహించని బౌన్స్‌తో బ్యాటింగ్‌కు పరీక్షగా మారిన పిచ్‌పై ఇంగ్లండ్‌ జట్టు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంతో... ఆసీస్‌కు ఛేదన కష్టమే అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన కంగారూ జట్టుకు యాషెస్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పరాజయం తప్పకపోవచ్చనే అంచనాల మధ్య హెడ్‌ అదరగొట్టాడు. గాయంతో ఇబ్బంది పడుతున్న ఉస్మాన్‌ ఖ్వాజా స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హెడ్‌... పక్కా టీ20 ఆటతీరుతో అదరగొట్టాడు. గత కొన్నాళ్లుగా ‘బాజ్‌బాల్‌’ ఆటతీరుతో వేగంగా పరుగులు రాబడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్న ఇంగ్లండ్‌ జట్టును తన ట్రేడ్‌మార్క్‌ హిట్టింగ్‌తో ఓ ఆటాడుకున్నాడు.బంతి ఎక్కడపడ్డా దాని గమ్యం బౌండరీనే అన్న చందంగా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌... 69 బంతుల్లో శతకం తన పేరిట లిఖించుకున్నాడు.మిగతా ఆటగాళ్లంతా పరుగులు తీసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట... హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. ఫలితంగా లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 28.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన హెడ్‌పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. "ట్రావిస్ హెడ్... రెండు సంవత్సరాల క్రితం నువ్వు నా దేశం మొత్తాన్ని మౌనంలోకి నెట్టావు. ఇప్పుడు మళ్లీ అదే పనిచేశావు. కానీ ఈసారి జ‌ట్టు మారింది. క్రికెట్‌లోనే అత్యుత్తమ ఫార్మాట్‌(టెస్టు)లో నీవు ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి గుర్తుండుపోతుంది. నిజంగా అత‌డి బ్యాటింగ్‌కు పిధా అయిపోయాను. ఇంగ్లండ్‌కు ఇదొక పీడ‌క‌లలా మిగిలిపోతుంది" అని ఎక్స్‌లో శాస్త్రి రాసుకొచ్చాడు. కాగా వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్-2023 ఫైన‌ల్లో భార‌త్‌పై హెడ్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. తను తుపాన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా ఆఖరి మొట్టుపై టీమిండియా బోల్తా పడింది.

Rishabh Pant fumes at Kuldeep Yadav as timer nears zero9
కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్‌? పంత్ సీరియ‌స్‌

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు.అయితే పంత్ కోపానికి ఆర్ధం వుంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం.. ఓ ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపల తదుపరి ఓవర్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు రెండు హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు ఐదు పెనాల్టీ పరుగులు కలిపిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి.రెండోసారి వార్నింగ్‌..ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్‌కు ఇదే విషయంపై అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్‌ను సమయానికి ప్రారంభించనందును పంత్‌కు అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడో సారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత్ ఐదు పరుగులు పెనాల్టీగా సౌతాఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే కుల్దీప్‌పై పంత్ ఫైరయ్యాడు. "30 సెకన్ల టైమర్ ఉంది. ఇంట్లో ఆడుతున్నాను అనుకున్నావా ఏంటి? త్వరగా ఒక బంతి వేయి. కుల్దీప్ ఇది నీకు రెండోసారి హెచ్చరిక"అని పంత్‌ గట్టిగా చెప్పాడు. ఇదంతా స్టంప్‌ మైక్‌లో రికార్డు అయింది. కాగా సౌతాఫ్రికా వికెట్లను పడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 112 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. క్రీజులో ముత్తుసామి(64), వెర్రియిన్‌(43) ఉన్నారు.What's going to be a good score for #TeamIndia to chase in the 1st innings? 💬#CheteshwarPujara backs the batters to score big in Guwahati! 🏟#INDvSA 2nd Test, Day 2 LIVE NOW 👉 https://t.co/J8u4bmcZud pic.twitter.com/vGjwWPopSm— Star Sports (@StarSportsIndia) November 23, 2025

Lakshya Sen beats Yushi Tanaka to clinch title10
ఆ్రస్టేలియా ఓపెన్‌ టైటిల్‌ పోరుకు లక్ష్యసేన్‌

భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ప్రపంచ 6వ ర్యాంకర్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను లక్ష్యసేన్‌ కంగు తినిపించాడు.శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో అతను 17–21, 24–22, 21–16తో రెండో సీడ్‌ తైవాన్‌ ప్రత్యరి్థపై చెమటోడ్చి నెగ్గాడు. 86 నిమిషాల పాటు హోరాహోరీగా ఈ పోరు సాగడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌కు చెందిన యుషి తనకతో భారత ఆటగాడు తలపడతాడు. మరో సెమీస్‌లో తనక 21–18, 21–15తో లిన్‌ చున్‌ యి (చైనీస్‌ తైపీ)పై గెలుపొందాడు. 24 ఏళ్ల భారత ప్లేయర్‌ హాంకాంగ్‌ ఓపెన్‌లోనూ టైటిల్‌ బరిలో నిలిచినప్పటికీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు టైటిలే సాధించలేకపోయాడు. అన్నీ అనుకూలిస్తే... అదృష్టం కలిసొస్తే సీజన్‌ ముగిసే ఈ దశలో లక్ష్యసేన్‌ తొలి టైటిల్‌ను ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement