Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

After cash reward and DSP post, Richa Ghosh to get a historic reward in West Bengal1
ప్రపంచకప్‌ విజేతకు చారిత్రక గౌరవం

2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ విజేత, ఛాంపియన్‌ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.ఇవాళ (నవంబర్‌ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్‌ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్‌ పేరుతో నామకరణం​ చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్‌ క్రికెట్‌ దిగ్గజాలు సౌరవ్‌ గంగూలీ, ఝులన్‌ గోస్వామి పాల్గొన్నారు. రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్‌ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (32 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్‌ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.కాగా, రిచా ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్‌ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్‌ 298 పరుగుల భారీ స్కోర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఛేదనలో ​కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.లీగ్‌ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్‌ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది. కాగా, నవంబర్‌ 2న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్‌ అయిన రిచా ప్రపంచకప్‌లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్‌ టాప్ హిట్టర్‌గా నిలిచింది.

You Can Only Pick: Gambhir 1st Reaction On Benching Arshdeep Amid Outcry2
అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్‌ తొలి స్పందన

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో గెలిచి బదులు తీర్చుకుంది. కంగారూ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో గెలిచి సత్తా చాటింది. ఇక వర్షం కారణంగా తొలి, ఐదో టీ20 రద్దైన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియా స్టార్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (Arshdeep Singh)ను పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. పొట్టి ఫార్మాట్లో భారత్‌ తరఫున వందకు పైగా వికెట్లు తీసి హయ్యస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్న అర్ష్‌ను కాదని.. హర్షిత్‌ రాణా (Harshit Rana)ను ఆడించడం విమర్శలకు దారితీసింది.అందుకే ఆడించారా?హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)కు ప్రియ శిష్యుడైన కారణంగానే హర్షిత్‌కు తుదిజట్టులో చోటిచ్చి.. అర్ష్‌ను బలి చేస్తున్నారనే ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, ఎట్టకేలకు మూడో టీ20 నుంచి హర్షిత్‌ను తప్పించి.. అర్ష్‌దీప్‌ను ఆడించగా.. అతడు సత్తా చాటాడు.మూడో టీ20లో హర్షిత్‌ను బెంచ్‌కు పరిమితం చేసి అర్ష్‌దీప్‌ను తీసుకురాగా.. అతడు మూడు వికెట్లు తీసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లోనూ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌ తాజాగా ఈ విషయాలపై స్పందించాడు.అన్నింటికంటే కష్టమైన పనిబీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. కీలక ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చినపుడు మీరెలా హ్యాండిల్‌ చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కోచ్‌గా నాకిదే అన్నింటికంటే కష్టమైన పని.నాణ్యమైన ఆటగాళ్లను బెంచ్‌ మీద కూర్చోబెట్టాల్సి వచ్చినపుడు వారితో ఆ విషయం చెప్పడం కఠినంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు తుదిజట్టులో ఆడేందుకు అర్హులే. కానీ కూర్పు దృష్ట్యా మేము మాకు కావాల్సిన పదకొండు మందినే ఎంచుకుంటాం.మ్యాచ్‌ పరిస్థితికి తగ్గట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. అయితే, ఓ ఆటగాడితో .. ‘నీకు ఈ మ్యాచ్‌లో అవకాశం లేదు’ అని చెప్పడం కష్టం. అయితే, కూడా అందుకు గల కారణాన్ని స్పష్టంగా వివరించడం వల్ల పెద్దగా సమస్యలు రావు.అతడిని అందుకే పక్కనపెట్టాంఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కోచ్‌, ప్లేయర్‌.. ఇద్దరి మధ్య ఇలాంటి సంభాషణ ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. కానీ ఒక్కోసారి కఠినంగా ఉండక తప్పదు. అయితే, కోచ్‌ చెప్పే విషయంలో నిజం, నిజాయితీ, ముక్కుసూటితనం ఉందని ఆటగాడు తెలుసుకుంటే.. ఇక అతడికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.చాలా మంది ప్లేయర్లు ఇలాంటి సమయంలో పరిణతితో వ్యవహరిస్తారు. ఏదేమైనా కమ్యూనికేషన్‌ అత్యంత ముఖ్యం. బయట చాలా మంది ఇష్టారీతిన మాట్లాడుతూ.. వివాదాలు సృష్టించేందుకు థియరీలు కనిపెడుతుంటారు.అయితే, జట్టులో సమన్వయం ఉన్నపుడు ఇలాంటి వాటి వల్ల పెద్దగా ప్రభావం పడదు. డ్రెసింగ్‌రూమ్‌లో పారదర్శకత, నిజాయితీ అవసరం. ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం’’ అని గంభీర్‌ విమర్శలను కొట్టిపారేశాడు.చదవండి: కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్‌

Zimbabwe Pacer Muzarabani ruled out of Pakistan T20I tri series3
పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌ నుంచి స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

నవంబర్‌ 17 నుంచి పాకిస్తాన్‌లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి జింబాబ్వే స్టార్‌ బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్‌ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్‌ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్‌, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. నవంబర్‌ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.అనంతరం నవంబర్‌ 22వ తేదీ పాకిస్తాన్‌-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్‌, 27న పాకిస్తాన్‌-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.పాకిస్తాన్‌ ట్రై సిరీస్‌ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్‌ మేయర్స్‌, రిచర్డ్‌ నగరవ, న్యూమన్‌ న్యామ్హురి, బ్రెండన్‌ టేలర్చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్‌

Kya yeh izzat hai meri: Pak Star Says Humiliated Like Never Before Mid Match4
నాకసలు ఇజ్జత్‌ ఉందా?.. ఏడుపు వచ్చింది: పాక్‌ క్రికెటర్‌

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ (Moin Khan) కుమారుడిగా ప్రేక్షకులకు పరిచయమైన క్రికెటర్‌ ఆజం ఖాన్‌ (Azam Khan). పాక్‌ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆజం.. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు.ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత.. తిరిగి జాతీయ జట్టులో ఆజం ఖాన్‌ స్థానం సంపాదించుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో అతడికి చోటు కరువైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి కనీసం వంద పరుగులు కూడా చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.మీమ్‌ మెటీరియల్‌ అయ్యేవాడుఇందుకు తోడు ఆజం ఖాన్‌ భారీ కాయంపై కూడా విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. కనీస ఫిట్‌నెస్‌ లేని ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఫీల్డర్‌గానూ ఓ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాడు. పదే పదే క్యాచ్‌లు డ్రాప్‌ చేస్తూ మీమ్‌ మెటీరియల్‌ అయ్యేవాడు.ఈ విషయాల గురించి ఆజం ఖాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 2024లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా తాను అవహేళనకు గురయ్యాయని.. తన జీవితంలో అతిగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.అభ్యంతరకర భాషలో దూషించారు‘‘ఆరోజు మార్క్‌ వుడ్‌.. తొలుత నాకు బౌన్సర్‌ సంధించాడు. నేను దానిని వదిలేశాను. పాకిస్తాన్‌లో కూడా గంటకు నూటా యాభై కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తారు కాబట్టి.. నాకు అదేమీ కొత్తగా అనిపించలేదు.కానీ ఆ తర్వాత కూడా మార్క్‌ వుడ్‌ మళ్లీ బౌన్సర్‌ వేశాడు. నేను దానినీ ఎదుర్కోలేకపోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.నా వేలికి గాయమైన తర్వాత.. నా పని అయిపోయిందని గ్రహించాను. అంతలోనే ఓవల్‌ స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను అభ్యంతరకర భాషలో దూషించడం మొదలుపెట్టారు.నాకసలు ఇజ్జత్‌ ఉందా? అక్కడ ఒక పాకిస్తానీ రిపోర్టర్‌.. తాగి ఉన్న ఓ ఇంగ్లిష్‌ ప్రేక్షకుడిని.. ‘మీ అభిమాన పాకిస్తాన్‌ ఆటగాడు ఎవరు?’ అని అడిగారు. ఇందుకు బదులుగా అతడు.. ‘ఆజం ఖాన్‌.. అతడు బ్యాటింగ్‌ చేయలేడు. ఫీల్డింగ్‌ చేయలేడు’ అంటూ నాపై సెటైర్లు వేశారు.అది వినగానే నా హృదయం ముక్కలైంది. నాకసలు ఇజ్జత్‌ (గౌరవం) ఉందా? నా గురించి జనాలు ఇలా అనుకుంటున్నారా? అని బాధలో కూరుకుపోయా. సులువైన క్యాచ్‌లను కూడా జారవిడిచా.ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు కారాయి. అసలు నాకే ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూ ఏడ్చేశా’’ అని ఆజం ఖాన్‌ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా నాటి మ్యాచ్‌లో ఆజం ఖాన్‌ డకౌట్‌ కాగా.. పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ అయింది.లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డకౌట్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌పై మరోసారి విమర్శల వర్షం కురిసింది.చదవండి: వన్డే ఆల్‌టైమ్‌ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు

New Zealand Vs West Indies 4th T20I Ended No Result Due To Rain5
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్‌న్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ​్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్‌ అథనాజ్‌ (21) ఔట్‌ కాగా.. ఆమిర్‌ జాంగూ (12), కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్‌ వికెట్‌ నీషమ్‌కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్‌ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్‌ గెలువగా.. న్యూజిలాండ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్‌ వేదికగా నవంబర్‌ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ తర్వాత వన్డే సిరీస్‌, ఆతర్వాత టెస్ట్‌ సిరీస్‌ జరుగుతాయి. నవంబర్‌ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్‌ 2, 10, 18 తేదీల్లో టెస్ట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్‌ షో

Ranji Trophy: Shams Mulani fifer secures innings victory for Mumbai6
ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్‌ షో

రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్‌ 10) ఏడు మ్యాచ్‌ల్లో ఫలితాలు వచ్చాయి. సౌరభ్‌ కుమార్‌ 4 వికెట్ల ఘనత.. అభిషేక్‌ రెడ్డి (70), కరణ్‌ షిండే (51) అర్ద శతకాలతో రాణించడంతో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మయాంక్‌ వర్మ సెంచరీ (121 నాటౌట్‌), ఆదిత్య సర్వటే 6, రవికిరణ్ 3 వికెట్లతో రాణించడంతో పుదుచ్చేరిపై ఛత్తీస్‌ఘడ్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొ​ందింది.ముషీర్‌ ఖాన్‌ (112), సిద్దేశ్‌ లాడ్‌ (127) శతకాలు.. షమ్స్‌ ములానీ 7 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్‌పై ముంబై ఇన్నింగ్స్‌ 120 పరుగుల తేడాతో గెలుపొందింది.శివమ్‌ మావి (101 నాటౌట్‌, 5 వికెట్లు) ఆల్‌రౌండ్‌ షోతో చెలరేగడంతో నాగాలాండ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ 265 పరుగుల తేడాతో చిత్తు చేసింది.జగదీశ్‌ సుచిత్‌ (11 వికెట్లు, హాఫ్‌ సెంచరీ) ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీయడంతో ఉత్తరాఖండ్‌పై హర్యానా ఇన్నింగ్స్‌ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.సిద్దార్థ్‌ దేశాయ్‌ 10 వికెట్లు, విశాల్‌ జైస్వాల్‌ 8 వికెట్లు తీయడంతో సర్వీసెస్‌పై గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఉదయ్ సహరన్ అజేయ సెంచరీతో (117) చెలరేగడంతో ఛండీఘడ్‌పై పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇవాల్టి బ్యాటింగ్ హైలైట్స్ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు ధ్రువ్‌ షోరే రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. మరో విదర్భ ఆటగాడు అమన్‌ మోఖడే కూడా సెంచరీతో సత్తా చాటాడు.కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు చిరాగ్‌ జానీ (152) భారీ సెంచరీతో కదంతొక్కాడు.జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా ఆటగాడు శాశ్వత్ రావత్ సెంచరీతో సత్తా చాటాడు.బౌలింగ్ హైలైట్స్కర్ణాటక బౌలర్లు శ్రేయాస్ గోపాల్ (4), మోహ్సిన్ ఖాన్ (3) రాణించి మహారాష్ట్రను 300 పరుగులకే కట్టడి.మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా బౌలర్‌ వాసుకి కౌశిక్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ బౌలర్‌ వంశ్‌రాజ్ శర్మ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్‌

We Can Never Celebrate: Gambhir Critical Review Of ODIs Rohit Kohli Comeback7
అలాంటి పని అస్సలు చేయను: కుండబద్దలు కొట్టిన గంభీర్‌

టీమిండియా హెడ్‌కోచ్‌, భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)కు ముక్కుసూటిగా మాట్లాడటం అలవాటు. దీనికి తోడు దూకుడు స్వభావం కారణంగా ఎన్నోసార్లు విమర్శలు మూటగట్టుకున్నాడు గౌతీ. అయినా.. కూడా తగ్గేదేలే అంటూ అలాగే ముందుకు సాగుతున్నాడు. అతడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.ఇటీవల గౌతీ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో వన్డే సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు వన్డే కెప్టెన్‌గా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న యాజమాన్యం.. టెస్టు సారథి శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కే వన్డే పగ్గాలూ అప్పగించింది.చేదు అనుభవం ఇక వన్డే కెప్టెన్‌గా ఆసీస్‌ రూపంలో తొలి ప్రయత్నంలోనే కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్‌.. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా చేదు అనుభవం చవిచూశాడు. తొలి రెండు వన్డేల్లో ఓడి భారత్‌ ముందుగానే సిరీస్‌ కోల్పోగా.. ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది.‘రో-కో’దే కీలక పాత్రఈ విజయంలో రీఎంట్రీ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిదే కీలక పాత్ర. రోహిత్‌ అజేయ శతకం (121)తో దుమ్ములేపగా.. కోహ్లి 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా ఆసీస్‌ విధించిన 236 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి ఛేదించింది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఓటమి పట్ల గౌతం గంభీర్‌ తాజాగా స్పందించాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. సిరీస్‌ ఓడిపోవడం ఎంతమాత్రం ఉపేక్షించదగింది కాదని.. తాను అందుకే మూడో వన్డే గెలుపు సెలబ్రేట్‌ చేసుకోలేదంటూ కుండబద్దలు కొట్టాడు.వాటిని పట్టించుకోను‘‘వ్యక్తిగత ప్రదర్శనలను నేనెప్పుడూ పట్టించుకోను. అయితే, వారి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంటాను. ఏదేమైనా అంతిమంగా మనం సిరీస్‌ ఓడిపోయాం.అన్నింటికంటే అదే అతి ముఖ్యమైన విషయం. కోచ్‌గా నేను ఇలాంటి వాటిని ఎప్పుడూ సెలబ్రేట్‌ చేసుకోను. ఓ ఆటగాడిగా.. వ్యక్తిగత ప్రదర్శనలను అభినందిస్తా. కానీ కోచ్‌గా ఇలాంటివి జీర్ణించుకోలేను.కోచ్‌గా అలాంటి పని ఎప్పటికీ చేయనుదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నపుడు ఆటగాళ్లైనా, కోచ్‌ అయినా ఇలాంటి ఘోర ఓటమి తర్వాత వచ్చిన విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం సరికాదు కూడా!.. ఏదేమైనా మేము ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ గెలిచాం. ఇదొక భిన్నమైన ఫార్మాట్‌. అయితే, ఈ సిరీస్‌లో సానుకూల అంశాలతో పాటు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు కూడా ఉన్నాయి’’ అని గంభీర్‌ తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాడు.కాగా ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి. ఆఖరి మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు అయ్యాయి. అయితే, రెండో టీ20లో ఓడిన సూర్యకుమార్‌ సేన వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.చదవండి: వన్డే ఆల్‌టైమ్‌ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు

Mitchell Starc issues warning to England, breathes fire with stellar four fer ahead of Ashes8
నిప్పులు చెరిగిన స్టార్క్‌

యాషెస్‌ సిరీస్‌కు ముందు ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) ప్రత్యర్ధి ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ మెసేజ్‌ పంపాడు. యాషెస్‌ సన్నాహకాల్లో భాగంగా షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ ఆడుతున్న అతడు (న్యూ సౌత్‌ వేట్స్‌).. విక్టోరియాపై 4 వికెట్ల ప్రదర్శనలతో చెలరేగాడు. తొలి రోజు ఆటలో ఇది జరిగింది.ఆట ప్రారంభం నుంచే నిప్పులు చెరిగిన స్టార్క్‌.. ఓపెనర్లు క్యాంప్‌బెల్‌ కెల్లావే (51), హ్యారీ డిక్సన్‌ (20) సహా కీలకమైన ఒలివర్‌ పీక్‌ (0), సామ్‌ హార్పర్‌ (54) వికెట్లు తీశాడు. స్టార్క్‌తో పాటు నాథన్‌ లియోన్‌ (22-1-65-2), సీన్‌ అబాట్‌ (18-1-70-1) కూడా రాణించడంతో న్యూ సౌత్‌ వేల్స్‌ తొలి రోజు ఆటలో 7 వికెట్లు తీసింది.ఆట ముగిసే సమయానికి విక్టోరియా 340 పరుగులు చేసింది. కెప్టెన్‌ విల్‌ సదర్‌ల్యాండ్‌ (36), సామ్‌ ఇలియట్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (104) సెంచరీ సాధించి, విక్టోరియా ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. న్యూ సౌత్‌ వేల్స్‌కే ఆడుతున్న మరో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ తొలి రోజు వికెట్‌ తీయలేకపోయాడు. హాజిల్‌వుడ్‌ ప్రత్యర్ది బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా వికెట్‌ లేకుండా మిగిలాడు.షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌ సహా ఆసీస్‌ జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు.ఇవాళే ప్రారంభమైన మరో మ్యాచ్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా, టస్మానియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టస్మానియా.. బ్రెండన్‌ డాగ్గెట్‌ (19.2-4-66-5), లియామ్‌ స్కాట్‌ (18-5-46-3), మెక్‌ ఆండ్రూ (16-2-54-1), థార్న్‌టన్‌ (10-2-31-1) ధాటికి 209 పరుగులకే ఆలౌటైంది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సిల్క్‌ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. యాషెస్‌ తొలి టెస్ట్‌ జట్టులో సభ్యుడైన బ్యూ వెబ్‌స్టర్‌ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్‌ ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. మెక్‌స్వీని (2), జేసన్‌ సంఘా (12), ట్రవిస్‌ హెడ్‌ (9) ఔట్‌ కాగా.. హెన్రీ హంట్‌ (34), అలెక్స్‌ క్యారీ (25) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!

Not Riyan Jurel or Jaiswal likely to become new RR captain after Sanju9
రాజస్తాన్‌ రాయల్స్‌ కొత్త కెప్టెన్‌గా అతడే!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌తో టీమిండియా స్టార్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్‌ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు.ఐపీఎల్‌లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్‌ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్‌ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్‌తో పాటు కెప్టెన్‌గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.యాజమాన్యంతో విభేదాలుకాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్‌ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 వేలానికి ముందే ట్రేడింగ్‌ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) సంజూను రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌ (స్వాప్‌ డీల్‌) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్‌కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్‌కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ ఎవరనే చర్చ మొదలైంది. రియాన్‌ పరాగ్‌ కాదు!కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్‌ పరాగ్‌ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్‌-2025లో సంజూ ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్‌ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈసారి రాజస్తాన్‌ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్‌ జురెల్‌ పేరు తెర మీదకు వచ్చింది.కెప్టెన్సీ రేసులో ఇద్దరురూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్‌ క్యాంపులోకి వచ్చిన జురెల్‌ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్‌ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా జురెల్‌కు ఉంది. అదే విధంగా.. అండర్‌-19 స్థాయిలో 2020 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గానూ జురెల్‌ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్‌ లయన్స్‌ జట్టుకు సారథి కూడా జురెలే!ఈ నేపథ్యంలో పరాగ్‌ను కాదని.. మేనేజ్‌మెంట్‌ జురెల్‌ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌కే రాజస్తాన్‌ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కాగా 2020లో రాజస్తాన్‌ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. ఇప్పటికి 66 మ్యాచ్‌లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్‌ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.రాయల్స్‌ కొత్త కెప్టెన్‌గా అతడే!రాజస్తాన్‌ రాయల్స్‌ కొత్త హెడ్‌కోచ్‌ కుమార్‌ సంగక్కర.. జురెల్‌తో పాటు జైస్వాల్‌ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్‌ రూల్‌ ప్రకారం ఓపెనర్‌గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్‌ కీపర్‌గా 24 ఏళ్ల జురెల్‌ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’

Indian Women likely to hire foreign strength and Conditioning coach after winning World Cup10
బీసీసీఐ చారిత్రక నిర్ణయం..!

మహిళల సీనియర్‌ క్రికెట్‌ జట్టు విషయంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా (Strength And Conditioning Coach) నియమించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీతో (Nathan Keilty) బీసీసీఐ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తై కైలీ భారత మహిళా క్రికెట్‌ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైతే చరిత్ర అవుతుంది. భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్రలో తొలిసారి ఓ విదేశీ వ్యక్తి స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఎంపికైనట్లవుతుంది. ఇప్పటివరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి చెందిన వారు మాత్రమే మహిళల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లుగా పనిచేశారు.ప్రస్తుతం భారత మహిళల జట్టుకు అల్ హర్షా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఆయన అద్భుతంగా పనిచేశారు. కానీ త్వరలో అతనికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. హర్షా స్థానాన్ని కైలీ భర్తీ చేస్తాడని బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి క్లూ ఇచ్చాడు.కాగా, ఇటీవలికాలంలో క్రికెట్‌ జట్ల సక్సెస్‌లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పాత్ర క్రియాశీలకంగా మారింది. ప్లేయర్లలో శారీరక సామర్థ్యం, ఫిట్‌నెస్, గాయాల నివారణ, మానసిక స్థైర్యం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. జట్టులో ప్రతి ప్లేయర్‌కు వీరు వేర్వురుగా ప్రణాళికలు రూపొందిస్తుంటారు. దేశీయ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ల పోలిస్తే విదేశీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌లకు పని అనుభవం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరి సేవల కోసం దాదాపుగా అన్ని జట్లు ఎగబడుతుంటాయి. భారత పురుషుల జట్టు ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్‌ లె రూక్స్‌ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌ నియమించుకుంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌కు బెదిరింపులు

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement