Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Pakistan A Beat Sri Lanka A In Semis Thriller No IND vs PAK in Final1
Asia T20 Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్‌

ఏసీసీ పురుషుల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టీ20-2025 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆఖరి ఓవర్‌ వరకు శ్రీలంక (Pak A vs SL A)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. దోహా వేదికగా నవంబరు 14న మొదలైన ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీ తుది అంకానికి చేరుకుంది.శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో భారత్‌-‘ఎ’ జట్టుపై గెలిచి బంగ్లాదేశ్‌-‘ఎ’ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌- ‘ఎ’- శ్రీలంక- ‘ఎ’ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 153 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది.దానియాల్‌ మెరుపు ఇన్నింగ్స్‌పాక్‌ ఓపెనర్లు మొహమ్మద్‌ నసీమ్‌ (16), మాజ్‌ సదాకత్‌ (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ యాసిర్‌ ఖాన్‌ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన మొహమ్మద్‌ ఫరీక్‌ (7), కెప్టెన్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (6) పూర్తిగా విఫలమయ్యారు. షహీద్‌ అజాజ్‌ (7) కూడా ఫెయిలయ్యాడు.ఇలాంటి దశలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఘాజి ఘోరి (36 బంతుల్లో 39 నాటౌట్‌), సాద్‌ మసూద్‌ (22) మెరుగ్గా రాణించగా.. అహ్మద్‌ దానియాల్‌ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా పాక్‌ 153 పరుగులు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో ప్రమోద్‌ మధుషాన్‌ నాలుగు, త్రవీణ్‌ మాథ్యూ మూడు వికెట్లతో చెలరేగగా.. మిలాన్‌ రత్మనాయకె, కెప్టెన్‌ దునిత్‌ వెల్లలగే చెరో వికెట్‌ పడగొట్టారు.పేకమేడలా కుప్పకూలిందినామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు లసిత్‌ క్రూస్‌పులె (7 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. విషేన్‌ హలాంబగే (27 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించాడు. అయితే, పాక్‌ బౌలర్ల ధాటికి లంక మిడిలార్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. నిషాన్‌ మధుష్క (6), నువానిడు ఫెర్నాండో (5), సాహన్‌ అరాచిగే (5), కెప్టెన్‌ వెల్లలగే (2), రమేశ్‌ మెండిస్‌ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.క్లిష్ట పరిస్థితుల్లో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ మిలాన్‌ రత్ననాయకె పోరాట పటిమ కనబరిచాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 40 పరుగులు చేశాడు. కానీ మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రమోద్‌ (7), త్రవీణ్‌ మాథ్యూ (4 నాటౌట్‌), గరుక సంకేత్‌ (1) చేతులెత్తేశారు. విజయానికి ఐదు పరుగుల దూరంలోఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 148 పరుగులు చేసిన శ్రీలంక.. విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పాక్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. బంగ్లాదేశ్‌-‘ఎ’- పాకిస్తాన్‌- ‘ఎ’ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీస్‌లో బ్యాట్‌, బాల్‌తో రాణించిన సాద్‌ మసూద్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పాక్‌ బౌలర్లలో మసూద్‌, సూఫియాన్‌ ముకీమ్‌ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఉబైద్‌ షా, షాహిద్‌ అజీజ్‌, అహ్మద్‌ దానియాల్‌ తలా ఒక వికెట్‌ తీసి.. పాక్‌ ఫైనల్‌ చేరడంలో తమ వంతు పాత్ర పోషించారు.చదవండి: IND vs BAN అందుకే సూపర్‌ ఓవర్లో వైభవ్‌ సూర్యవంశీని పంపలేదు: జితేశ్‌ శర్మ

I Made The Call: Why Vaibhav Suryavanshi Super Over Snub vs BAN A Revealed2
అందుకే సూపర్‌ ఓవర్లో వైభవ్‌ సూర్యవంశీని పంపలేదు: జితేశ్‌ శర్మ

ఆసియా క్రికెట్‌ మండలి పురుషుల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్‌-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్‌ శర్మ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ టీ20 ఈవెంట్లో కనీసం ఫైనల్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వచ్చింది.బంగ్లా చేతిలో భారత్‌ ఓటమిదోహా వేదికగా ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ ‘ఎ’ జట్టు (IND A vs BAN A) ‘సూపర్‌ ఓవర్‌’ ద్వారా భారత్‌ను ఓడించింది. సూపర్‌ ఓవర్లో ఆడిన 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ ‘0’కే పరిమితం కాగా... బంగ్లాదేశ్‌ 1 పరుగు చేసి విజయాన్నందుకుంది.వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్‌ రహమాన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా.... మెహ్రాబ్‌ హుసేన్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; 1 ఫోర్, 6 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు.సరిగ్గా 194 పరుగులేభారత బౌలర్లలో గుర్‌జీప్‌నీత్‌ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 194 పరుగులే సాధించింది. ప్రియాన్ష్‌ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్‌ శర్మ (Jitesh Sharma- 23 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.Top-class innings from Vaibhav Sooryavanshi! 💥Watch India A take on Bangladesh A in the semi-final, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldAsiaCupRisingStars2025 pic.twitter.com/7rSQRproSI— Sony Sports Network (@SonySportsNetwk) November 21, 2025 నేహల్‌ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి 2 ఓవర్లలో భారత్‌ విజయానికి 21 పరుగులు అవసరం కాగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిపాన్‌ మోండోల్‌ (1/35) ఐదు పరుగులే ఇచ్చాడు.విజయం కోసం ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన భారత్‌ తొలి 5 బంతుల్లో 12 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి హర్ష్‌ దూబే, వధేరా కలిసి కష్టంగా 2 పరుగులు పూర్తి చేశారు. అయితే కీపర్‌ అక్బర్‌ ఘోర వైఫల్యంతో భారత్‌కు మూడో పరుగు కూడా వచ్చింది.సూపర్‌ ఓవర్లో అంతా తలకిందులు.. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్‌ ఓవర్లో భారత జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా వైభన్‌ సూర్యవంశీని కాదని జితేశ్ శర్మ, రమణ్‌దీప్‌ల సింగ్‌లతో ఓపెనింగ్‌ చేయించింది. మోండోల్‌ వేసిన తొలి బంతికి జితేశ్, రెండో బంతికి అశుతోష్‌ అవుట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ ‘సున్నా’ వద్ద ముగిసింది.వైభవ్‌ను ఎందుకు పంపలేదు?ఆ తర్వాత తొలి బంతికి వికెట్‌ తీసిన సుయాశ్‌ శర్మ, తర్వాతి బంతిని వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్‌ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సూపర్‌ ఓవర్లో అనుసరించిన వ్యూహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విధ్వంసకర వీరుడైన వైభవ్‌ను ఓపెనర్‌గా ఎందుకు పంపలేదంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు. భారత్‌ ఓటమికి ఒకరకంగా ఇదే ప్రధాన కారణమనే చర్చ లేవనెత్తారు.ఓటమికి బాధ్యత నాదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్‌ జితేశ్‌ శర్మ స్పందించాడు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓటమికి బాధ్యత నాదే. సీనియర్‌ ఆటగాడిగా మ్యాచ్‌ను సరైన రీతిలో ముగించి ఉండాల్సింది.నేర్చుకునే దశలో ఇదొక భాగమే కానీ.. ఓటమి కాదు. ఏదో ఒకరోజు ఈ జట్టులోని ఆటగాళ్లే భారత జట్టుకు ప్రపంచకప్‌ అందించవచ్చు. వాళ్ల ప్రతిభకు ఆకాశమే హద్దు. మాకు ఇదొక అనుభవం.ఇక్కడ వికెట్‌ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో మాకు తెలుసు. అయితే, పందొమ్మిదో ఓవర్లో బంగ్లా బౌలర్‌ అద్భుతంగా బౌల్‌ చేశాడు. అతడికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. 20 ఓవర్ల ఆట మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆఖర్లో చేదు ఫలితం వచ్చింది’’ అని జితేశ్‌ శర్మ పేర్కొన్నాడు.డెత్‌ ఓవర్లలో మేము బెస్ట్‌ఇక సూపర్‌ ఓవర్లో రెగ్యులర్‌ ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ, ప్రియాన్ష్‌ ఆర్యలను పంపకపోవడంపై స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరు పవర్‌ప్లేలో మాస్టర్లు అని నాకూ తెలుసు. అయితే, డెత్‌ ఓవర్లలో నేను, అశుతోశ్‌, రమణ్‌ హిట్టింగ్‌ ఆడగలము. అందుకే సూపర్‌ ఓవర్లో మేమే బ్యాటింగ్‌కు వెళ్లాలని భావించాం. ఇది జట్టు నిర్ణయం. పూర్తిగా నా నిర్ణయం’’ అని జితేశ్‌ శర్మ స్పష్టం చేశాడు.చదవండి: SMAT: హైదరాబాద్‌ జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

IND vs SA 2025 2nd Test: SA Won Toss Playing XIs Of Both Teams3
టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. అక్షర్‌పై వేటు.. నితీశ్‌ రెడ్డితో పాటు అతడి ఎంట్రీ

టీమిండియాతో రెండో టెస్టులో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బర్సపరా వికెట్‌ ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొటిస్‌ జట్టు కెప్టెన్‌ తెంబా బవుమా తెలిపాడు. పిచ్‌పై ప్రస్తుతానికి పగుళ్లు లేవన్న బవుమా.. ఈ వికెట్‌పై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో ఉన్నామని పేర్కొన్నాడు.గువాహటి వేదికగా జరిగే చారిత్రాత్మక తొలి టెస్టులో తాము భాగం కావడం సంతోషంగా ఉందని బవుమా హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నామని.. సెనురాన్‌ ముత్తుస్వామి జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.భారత తుదిజట్టులోకి ఆ ఇద్దరుటీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ మెడ నొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో రిషభ్‌ పంత్‌ పగ్గాలు చేపట్టాడు. బీసీసీఐ తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసినట్లు తెలిపాడు.గిల్‌ స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ఎంపిక చేశామన్న పంత్‌.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు. ఇక తొలిసారి భారత జట్టు టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్న పంత్‌.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. టాస్‌ ఓడటంపై స్పందిస్తూ.. బర్సపరా వికెట్‌ బ్యాటింగ్‌కు బాగుంటుందన్న పంత్‌.. బౌలింగ్‌ కూడా మరీ అంత చెత్త ఆప్షన్‌ ఏమీ కాదన్నాడు. శుబ్‌మన్‌ కోలుకుంటున్నాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరతాడని పంత్‌ తెలిపాడు.టీమిండియాకు చావోరేవోఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టు జరుగగా.. భారత జట్టు సఫారీల చేతిలో ముప్పై పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో బవుమా బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక గువాహటి వేదికగా శనివారం మొదలైన రెండో టెస్టులో పంత్‌ సేన చావో రేవో తేల్చుకోవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేయగలదు. లేదంటే సొంతగడ్డపై సఫారీల చేతిలో వైట్‌వాష్‌ కాకతప్పదు. మరోవైపు.. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌పై బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడటంతో పాటు.. తొలి టెస్టు మూడురోజుల్లోనే ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో గువాహటి పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేయించినట్లు తెలుస్తోంది. తొలుత బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్‌.. పాతబడే కొద్ది స్పిన్నర్లకు అనుకూలించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ టాస్‌ ఓడటం భారత జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదు. భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా రెండో టెస్టు తుదిజట్లు ఇవేభారత్‌కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌.సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్‌, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, తెంబా బావుమా(కెప్టెన్‌), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరెన్నె (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్, సెనురాన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.చదవండి: వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి🚨 Toss 🚨#TeamIndia have been asked to bowl first Updates ▶️ https://t.co/Wt62QebbHZ#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/isE64twdaB— BCCI (@BCCI) November 22, 2025

SMAT 2025: Hyderabad Squad Announced CV Anand Son CV Milind To Lead4
SMAT: తిలక్‌ వర్మ కాదు!.. హైదరాబాద్‌ కెప్టెన్‌గా అతడే

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ (SMAT)లో పాల్గొనే హైదరాబాద్‌ సీనియర్‌ జట్టును సెలక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. పదిహేను మంది సభ్యుల ఈ టీమ్‌కు సీవీ మిలింద్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కాగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ కుమారుడే ఈ మిలింద్‌ అన్న విషయం తెలిసిందే. ఇకఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఉన్న హైదరాబాద్‌ తమ మ్యాచ్‌లన్నీ కోల్‌కతాలోనే ఆడుతుంది. ఏడు లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడు ఈడెన్‌ గార్డెన్స్‌లో, నాలుగు జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరుగుతాయి. తొలి పోరులో ఈ నెల 26న మధ్యప్రదేశ్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈ గ్రూప్‌లో మరో ఆరు జట్లు మహారాష్ట్ర, గోవా, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌, బిహార్, చండీగఢ్‌ ఉన్నాయి.తిలక్‌ వర్మ బిజీబిజీఇదిలా ఉంటే.. ఈ దేశీ టీ20 టోర్నీలో టీమిండియా స్టార్‌ తిలక్‌ వర్మ గతేడాది హైదరాబాద్‌ జట్టును ముందుకు నడిపించాడు. అయితే, సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేపథ్యంలో తిలక్‌ జాతీయ జట్టు విధుల్లో బిజీగా గడుపనున్నాడు. ఈ నేపథ్యంలో తిలక్‌ స్థానంలో మిలింద్‌కు హైదరాబాద్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో నవంబరు 22 నుంచి డిసెంబరు 19 మధ్య టీమిండియా సౌతాఫ్రికాతో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీకి హైదరాబాద్‌ జట్టు సీవీ మిలింద్‌ (కెప్టెన్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (వైస్‌ కెప్టెన్‌), తన్మయ్‌ అగర్వాల్, అమన్‌ రావు, హెచ్‌కే సింహా, ఆశిష్‌ శ్రీవాత్సవ, నితేశ్‌ కనాల, అజయ్‌దేవ్‌ గౌడ్, ప్రజ్ఞయ్‌ రెడ్డి (వికెట్‌ కీపర్‌), భవేశ్‌ సేఠ్‌ (వికెట్‌ కీపర్‌), నితిన్‌ సాయి యాదవ్, రక్షణ్‌ రెడ్డి, ఎండీ అర్ఫాజ్, రిషికేత్‌ సిసోడియా, రాహుల్‌ బుద్ధి. చదవండి: వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

19 wickets fell on the first day of the first Ashes Test5
అటు స్టార్క్‌... ఇటు స్టోక్స్‌

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాషెస్‌ సిరీస్‌ అనూహ్య రీతిలో ఆరంభమైంది. కిక్కిరిసిన పెర్త్‌ స్టేడియంలో ఆసీస్‌ పేసర్లు అదరగొట్టడంతో... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశాం అనుకుంటే... ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. స్టార్క్‌ ధాటికి ఇంగ్లండ్‌ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా... బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయిన ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌ బంతితో విజృంభించాడు. ఐదు వికెట్లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. వెరసి... పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆధిక్యం దక్కే అవకాశాలున్నాయి. పెర్త్‌: పేసర్లకు అనుకూలించే పెర్త్‌ పిచ్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టు తొలి రోజే 19 వికెట్లు నేలకూలాయి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ధాటిగా ఆడుతూ 32.5 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌ (61 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా... ఒలీ పోప్‌ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), జేమీ స్మిత్‌ (22 బంతుల్లో 33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. అలెక్స్‌ కేరీ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆసీస్‌ పేసర్లు ఆకట్టుకున్న చోట... ఇంగ్లండ్‌ బౌలర్లు కూడా సత్తా చాటారు. సారథి బెన్‌ స్టోక్స్‌ 6 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోఫ్రా ఆర్చర్, బ్రైడన్‌ కార్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. చేతిలో ఒక వికెట్‌ ఉన్న ఆస్ట్రేలియా... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 49 పరుగులు వెనుకబడి ఉంది. నాథన్‌ లయన్‌ (3 బ్యాటింగ్‌), బ్రెండన్‌ డగెట్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్‌లోనే వికెట్‌...ఆస్ట్రేలియా గడ్డపై గత కొన్నాళ్లుగా ప్రభావం చూపలేకపోతున్న ఇంగ్లండ్‌ జట్టును స్టార్క్‌ (7/58) కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలతో గట్టిదెబ్బ కొట్టాడు. తొలి ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (0)ని అవుట్‌ చేసిన అతడు... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. తొలి ఓవర్‌లో వికెట్‌ పడగొట్టడం స్టార్క్‌కు ఇది 24వసారి. సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ (0) డకౌట్‌ కాగా... కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (6) ప్రభావం చూపలేకపోయాడు. బెన్‌ డకెట్‌ 21 పరుగులు చేశాడు. పేసర్లకు సహకరిస్తున్న పిచ్‌పై సంయమనంతో బ్యాటింగ్‌ చేయడానికి బదులు ఇంగ్లండ్‌ జట్టు... తమకు అలవాటైన ‘బాజ్‌బాల్‌’ ఆటతీరును అవలంభించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్‌ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. దీంతో ఒకవైపు వికెట్లు పడుతున్నా... ఇంగ్లండ్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. అరంగేట్ర పేసర్‌ బ్రెండన్‌ డగెట్‌ 2 వికెట్లు తీశాడు. కామెరూన్‌ గ్రీన్‌కు ఒక వికెట్‌ దక్కింది. 6 ఓవర్లు వేసి 5 వికెట్లు...తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఇంగ్లండ్‌... బౌలింగ్‌లో పట్టుదల కనబర్చింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఆసీస్‌ అరంగేట్ర ఓపెనర్‌ జేక్‌ వెదరాల్డ్‌ (0)ను ఆర్చర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. లబుషేన్‌ (41 బంతుల్లో 9; 1 ఫోర్‌) క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా... ఈ మ్యాచ్‌లో సారథ్యం వహిస్తున్న స్టీవ్‌ స్మిత్‌ (49 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఉస్మాన్‌ ఖ్వాజా (2) విఫలం కాగా... ట్రావిస్‌ హెడ్‌ (21), కామెరూన్‌ గ్రీన్‌ (24) తలా కొన్ని పరుగులు చేశారు. తొలి నాలుగు వికెట్లను ఆర్చర్, కార్స్‌ పంచుకోగా... ఆ తర్వాత కెప్టెన్‌ స్టోక్స్‌ మ్యాజిక్‌ ప్రారంభమైంది. కేవలం ఆరు ఓవర్లే బౌలింగ్‌ చేసిన అతడు... వరుసగా హెడ్, గ్రీన్, స్టార్క్‌ (12), కేరీ, బోలండ్‌ (3)లను పెవిలియన్‌ బాట పట్టించాడు. ఇంగ్లండ్‌ కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా... 5.23 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా... ఆస్ట్రేలియా మాత్రం ఆ పని చేయలేకపోయింది.19 యాషెస్‌ టెస్టులో తొలి రోజే 19 వికెట్లు నేలకూలడం 1909 తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 1909 మాంచెస్టర్‌ టెస్టు తొలి రోజు ఇరు జట్లు ఆలౌటయ్యాయి.5 ఆస్ట్రేలియా గడ్డపై 5 వికెట్లు పడగొట్టిన ఐదో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌ నిలిచాడు. చివరిసారిగా 1982లో ఇంగ్లండ్‌ సారథి బాబ్‌ విల్లీస్‌ బ్రిస్బేన్‌ టెస్టులో ఈ ఘనత సాధించాడు.36 బెన్‌ స్టోక్స్‌ ఐదు వికెట్లు పడగొట్టేందుకు వేసిన బంతులు. ఇంగ్లండ్‌ పేసర్లలో ఇది మూడో వేగవంతమైంది. గతంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ 19 బంతుల్లో (ఆస్ట్రేలియాపై), 34 బంతుల్లో (న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్‌ నమోదు చేశాడు.7/58 ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆసీస్‌ ఆడిన గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై స్టార్క్‌ 9 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టెస్టుల్లో స్టార్క్‌ ఐదు వికెట్లు పడగొట్టడం ఇది 17వ సారి.100 ‘యాషెస్‌’ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన 11వ ఆస్ట్రేలియా పేసర్‌గా స్టార్క్‌ నిలిచాడు. 21వ శతాబ్దంలో టెస్టు అరంగేంట్రం చేసిన వారిలో ఈ ఘనత సాధించిన మొదటి పేసర్‌ అతడే.0/1 యాషెస్‌ సిరీస్‌లో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా నమోదు కాకుండా ఇరు జట్లు ఓపెనింగ్‌ బ్యాటర్‌ వికెట్‌ కోల్పోవడం ఇదే తొలిసారి.10 బెన్‌స్టోక్స్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడం ఇది పదోసారి. భారత స్పిన్నర్‌ అశ్విన్‌ 13 సార్లు స్టోక్స్‌ను పెవిలియన్‌ చేర్చాడు.

WPL auction on the 27th of this month6
ఖాళీలు 73... బరిలో 277

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026వ సీజన్‌కు సంబంధించిన వేలం ఈ నెల 27న జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మతో పాటు... హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్, పూజ వస్త్రకర్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్‌ వంటి భారత ఆటగాళ్లతో పాటు పలువులు అంతర్జాతీయ ప్లేయర్లు వేలం బరిలో ఉన్నారు. అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లో సత్తాచాటే దీప్తి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలున్నాయి. మొత్తం 5 ఫ్రాంచైజీలు కలిసి ఈ వేలంలో రూ. 41.1 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం మొత్తం 277 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. వారిలో 52 మంది క్యాప్డ్‌ ప్లేయర్స్‌ కాగా... 142 మంది అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు. ఇక విదేశాల నుంచి 83 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్‌ ప్లేయర్లు కాగా... 17 మంది అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు. గరిష్ట ప్రారంభ ధర రూ. 50 లక్షలు కాగా... ఇందులో 19 మంది ప్లేయర్లు ఉన్నారు. దీప్తి, హర్లీన్, ప్రతీక, పూజ, ఉమ, క్రాంతితో పాటు సోఫీ డివైన్, అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), అలీసా హీలీ, మెగ్‌ లానింగ్‌ (ఆ్రస్టేలియా) కూడా తమ ప్రాథమిక ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించుకున్నారు. రూ. 40 లక్షల ప్రారంభ ధరతో 11 మంది, రూ. 30 లక్షల ప్రారంభ ధరతో 88 మంది ప్లేయర్లు వేలానికి రానున్నారు. ‘వేలంలో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. 50 స్థానాల కోసం వీరు పోటీ పడుతున్నారు. 23 విదేశీ స్థానాల కోసం 83 మంది పోటీలో ఉన్నారు’ అని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Indian women star cricketer Smriti Mandhana to get married tomorrow7
స్మృతి WEDS పలాశ్‌

న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలిసారి విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వైస్‌ కెప్టెన్, స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మనసిచ్చిన వాడితో రేపు మనువాడబోతోంది. ఇన్నేళ్లుగా ఒకలా రేపటి రోజు ఒకలా స్మృతి కనిపించబోతోంది. జట్టు జెర్సీతో మైదానంలో ప్యాడ్లు, గ్లౌజ్‌లు, క్యాప్‌తో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చే ఆమె... రేపు మాత్రం అరుదైన డిజైనర్‌ లెహెంగా, నుదుటన పాపిట బిళ్ల, బుగ్గన చుక్క, మోచేతుల దాకా గాజులు, అరచేతి నిండా పండిన గోరింటాకు, కాళ్లకు పారాణితో వధువులా ముస్తాబై కమనీయ కళ్యాణ వేదికకు రానుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సంగీత దర్శకుడు, డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో స్మృతి కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. వీరిద్దరు త్వరలోనే ఒక్కటవుతారనే వార్తలు నెట్టింట తెగ షికార్లు చేశాయి. ప్రపంచకప్‌ తర్వాత ముహూర్తం ఖాయమనే ముచ్చట్లూ వినిపించాయి. చివరకు అన్నట్లే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే స్మృతి ఇంట పెళ్లి బాజా మోగనుంది. తన హోటల్‌ ‘ఎస్‌ఎం 18’ (స్మృతి మంధాన 18 జెర్సీ నంబర్‌)లో భారత జట్టు సహచరుల సందడితో పెళ్లి కోలాహలం ఎప్పుడో మొదలైంది. హల్దీ, మెహందీ వేడుకల్లో సహచరుల చిందులు, చిలిపి అల్లర్లు నెట్టింట కనువిందు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలతో పాటు డీవై పాటిల్‌ స్టేడియం మధ్యలో స్మృతి కళ్లకు గంతలు కట్టి పలాశ్‌ పిచ్‌ వద్దకు తొడ్కొని రావడంతోపాటు మోకాళ్లపై కూర్చోని ఆమెకు చేసిన పెళ్లి ప్రతిపాదన వీడియో కూడా నెట్టింట క్రికెట్‌ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 19 లక్షలు లైక్‌లు, 12 వేలపైచిలుకు కామెంట్లు, లెక్కలేనన్ని శుభాకాంక్షలు ఇన్‌స్టాలో వెల్లువెత్తాయి. ‘ఎక్స్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే జంట స్మృతి మంధాన, పలాశ్‌లకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Bangladesh take huge lead in second Test against Ireland8
భారీ ఆధిక్యంలో బంగ్లాదేశ్‌

మిర్పూర్‌: సొంతగడ్డపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న బంగ్లాదేశ్‌ జట్టు... ఐర్లాండ్‌తో రెండో టెస్టులో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు మహ్ముదుల్‌ హసన్‌ జాయ్‌ (91 బంతుల్లో 60; 6 ఫోర్లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (110 బంతుల్లో 69 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో గావిన్‌ హోయ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. నేడు ఆటకు నాలుగో రోజు కాగా... చేతిలో 9 వికెట్లు ఉన్న బంగ్లాదేశ్‌... ప్రస్తుతం 367 పరుగుల ఆధిక్యంలో ఉంది. షాద్‌మన్‌తో పాటు మోమినుల్‌ హక్‌ (19 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 98/5తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఐర్లాండ్‌ జట్టు... 88.3 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ టకర్‌ (171 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... జోర్డన్‌ నీల్‌ (83 బంతుల్లో 49; 9 ఫోర్లు), స్టీఫెన్‌ (77 బంతుల్లో 46; 4 ఫోర్లు) చక్కటి పోరాటం కనబర్చారు. బంగ్లా బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 4 వికెట్లు పడగొట్టగా... ఖాలెద్‌ అహ్మద్, హసన్‌ మురాద్‌ చెరో 2 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోరు చేయడంతో... ఆ జట్టుకు 211 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ జరుగుతన్న సమయంలో ఉదయం సెషన్‌లో భూప్రకంపనలు రావడంతో కొన్ని నిమిషాలపాటు ఆటను నిలిపి వేశారు.

Second Test match between India and South Africa start today9
సిరీస్‌ కాపాడుకుంటారా!

పుష్కర కాలం పాటు సొంతగడ్డపై ఆడిన ప్రతీ టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌ ఇప్పుడు ఏడాది వ్యవధిలో రెండో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడిన జట్టు సిరీస్‌ గెలుచుకునే అవకాశం లేకపోగా, ఇప్పుడు దానిని కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతోంది. కోల్‌కతా పిచ్‌ మనకు పూర్తి ప్రతికూలంగా మారి చర్చకు దారి తీసిన నేపథ్యంలో... ఈసారి ఎలాంటి పిచ్‌ భారత్‌కు అనుకూలిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ గెలిచిన వరల్డ్‌ చాంపియన్‌ దక్షిణాఫ్రికా అదే ఉత్సాహంతో మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఇలాంటి స్థితిలో రెండో టెస్టు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే రెండో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రోజుల్లోపే ముగిసిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య విజయం సాధించగా, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత టెస్టులో మెడ నొప్పితో అర్ధాంతరంగా తప్పుకున్న శుబ్‌మన్‌ గిల్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రిషబ్‌ పంత్‌ తొలిసారి జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పక్కటెముకల గాయంతో తొలి టెస్టు ఆడని దక్షిణాఫ్రికా పేసర్‌ రబడ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌ నుంచి కూడా తప్పుకున్నాడు. చివరిసారి దక్షిణాఫ్రికా 2000లో భారత గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. సుదర్శన్‌కు అవకాశం! గత టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో మన బ్యాటర్లెవరూ కనీసం అర్ధసెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఆ వైఫల్యాన్ని దాటి ఓపెనర్లు జైస్వాల్, రాహుల్‌ శుభారంభం ఇవ్వాల్సి ఉంది. గిల్‌ గాయం కారణంగా ఒక తప్పనిసరి మార్పుతో జట్టు బరిలోకి దిగనుంది. గిల్‌ స్థానంలో వచ్చే సాయి సుదర్శన్‌ ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. ధ్రువ్‌ జురేల్‌ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండగా, ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీతో పంత్‌పై బాధ్యత మరింత పెరిగింది. అతని ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగితే భారత్‌ పటిష్ట స్థితికి చేరుతుంది. జడేజా, సుందర్‌ల బ్యాటింగ్‌ మరోసారి కీలకం కానుంది. పేసర్లుగా బుమ్రా, సిరాజ్‌ ఖాయం కాగా, పిచ్‌ను బట్టి మూడో పేసర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే మేనేజ్‌మెంట్‌ ఆలోచన అయితే నితీశ్‌ కుమార్‌ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. ఈడెన్‌లో నలుగురు స్పిన్నర్లతో ఆడి విమర్శలపాలైన జట్టు నితీశ్‌ను ఆడిస్తే అక్షర్‌ను పక్కన పెట్టవచ్చు. ఆఫ్‌ స్పిన్నర్‌ హార్మర్‌ చెలరేగుతున్న నేపథ్యంలో ఆరుగురు లెఫ్ట్‌ హ్యాండర్లతో ఆడటం మరింత ఇబ్బందికరం అనుకుంటే కూడా నితీశ్‌కు చాన్స్‌ లభిస్తుంది. బ్రెవిస్‌కు చోటు! కోల్‌కతా టెస్టు ఘన విజయం ఇచ్చిన జోష్‌తో దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు తడబడినా బౌలర్లు గెలుపును అందించారు. ఈసారి కూడా హార్మర్, మహరాజ్‌ కీలకం కానున్నారు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే వీరిద్దరు చెలరేగిపోగలరు. అవసరమైతే మూడో స్పిన్నర్‌గా ముత్తుసామిని కూడా ఆడించాలని టీమ్‌ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన ముల్డర్‌ స్థానంలో అతనికి స్థానం దక్కవచ్చు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా లేకపోతే ముల్డర్‌ స్థానంలో మరో బ్యాటర్‌ బ్రెవిస్‌కు చాన్స్‌ దక్కవచ్చు. దూకుడుగా ఆడే బ్రెవిస్‌ కొద్ది సేపట్లోనే ఆట గమనాన్ని మార్చగల సమర్థుడు. జట్టు బ్యాటింగ్‌కు మరోసారి కెప్టెన్‌ బవుమా మూల స్థంభంలా ఉన్నాడు. ఇతర బ్యాటర్ల నుంచి అతనికి తగినంత సహకారం కావాలి. రికెల్టన్, జోర్జిలకు తగినంత అనుభవం లేకపోగా... ఓపెనర్‌గా మార్క్‌రమ్‌ రాణించడం జట్టుకు అవసరం. పేసర్లు యాన్సెన్, బాష్‌ కూడా భారత్‌పై ప్రభావం చూపించగలరు. గువాహటిలో తొలి టెస్టు భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న 30వ వేదికగా గువాహటి నిలుస్తోంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో ఇప్పటి వరకు 2 వన్డేలు, 4 టి20లతో పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇటీవల మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. బర్సపరలో కొత్త మైదానం ప్రారంభానికి ముందు 1983 నుంచే గువాహటి నెహ్రూ స్టేడియంలో వన్డేలు జరిగాయి.ముందు టీ విరామం, ఆ తర్వాత లంచ్‌... ఈశాన్య రాష్ట్రం అసోంలోని వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టెస్టు మ్యాచ్‌ సమయాల్లో స్వల్ప మార్పు చేశారు. ఇక్కడ సాయంత్రం తొందరగా చీకటి పడిపోతుంది. దాంతో మ్యాచ్‌ను ఉదయం 9 గంటల నుంచి మొదలుపడుతున్నారు. తొలి సెషన్‌ తర్వాత 11 గంటలకు టీ విరామం ఇస్తారు. 1:20కి లంచ్‌ బ్రేక్‌ అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆట ముగుస్తుంది. ఒకటే మ్యాచ్‌కు కెప్టెన్‌గా అంటే చేసేదేముంటుంది. అయితే దేశానికి నాయకత్వం వహించడం అంటే గర్వపడాల్సిన క్షణం. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. వ్యూహాల్లో కెప్టెన్‌గా సాంప్రదాయ శైలిని అనుసరించడంతో పాటు కొత్త తరహాలో కూడా ఆలోచిస్తాను. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలననే నమ్మకం ఉంది. –రిషభ్‌ పంత్, భారత జట్టు 38వ టెస్టు కెప్టెన్‌ పిచ్, వాతావరణం కోల్‌కతాతో పోలిస్తే మెరుగైన పిచ్‌ అని అందరూ అంగీకరించారు. ఆరంభంలో బౌన్స్, బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్పిన్‌ ప్రభావం కనిపించవచ్చు. అయితే ఇక్కడ తొలి టెస్టు కాబట్టి ఎవరికీ స్పష్టత లేదు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్‌: పంత్‌ (కెప్టెన్‌), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్‌/నితీశ్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్‌. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్‌/ బ్రెవిస్, జోర్జి, స్టబ్స్, వెరీన్, బాష్, యాన్సెన్, హార్మర్, మహరాజ్‌.

ACC Men's Asia Cup Rising Stars 2025, Semi Final 1: Bangladesh A Beat India A In Super Over and Enter Final10
వైభవ్‌ మెరుపులు వృధా.. ఆసియా కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమి

ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్‌-ఏ-బంగ్లాదేశ్‌-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 21) జరిగిన తొలి సెమీఫైనల్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్‌ శర్మ వైడ్‌ వేసి బంగ్లాదేశ్‌ను గెలిపించాడు. పాకిస్తాన్‌-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో బంగ్లాదేశ్‌-ఏ నవంబర్‌ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఓపెనర్‌ హబిబుర​్‌ రెహ్మాన్‌ సోహన్‌ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్‌ (18 బంతుల్లో 48 నాటౌట్‌; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.భారత బౌలర్లలో గుర్‌జప్నీత్‌ సింగ్‌ (4-0-39-2), హర్ష​్‌ దూబే (4-0-22-1), సుయాశ్‌ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. రమన్‌దీప్‌ సింగ్‌ (2-0-29-1), నమన్‌ ధిర్‌ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్‌ మెరుపులు వృధాభారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్‌ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి. జితేశ్‌ శర్మ (33), నేహల్‌ వధేరా (32 నాటౌట్‌), ఆఖర్లో రమన్‌దీప్‌ (17), అశుతోష్‌ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.అయితే సూపర్‌ ఓవర్‌లో భారత్‌ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్‌, అశుతోష్‌ ఔట్‌ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్‌ సైతం తొలి బంతికే వికెట్‌ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్‌ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్‌ గెలుపొందింది. చదవండి: భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement