Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

U19 World Cup 2026: Malajczuk record ton sets up Australia win1
చరిత్ర సృష్టించిన ఆసీస్‌ యువ బ్యాటర్‌.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026లో ఆస్ట్రేలియా ఓపెనింగ్‌ బ్యాటర్‌ విల్ మలాజ్‌చుక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న (జనవరి 20) గ్రూప్‌-ఏలో భాగంగా జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా అండర్‌-19 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌ ఆటగాడు ఖాసిం అక్రమ్‌ పేరిట ఉండేది. ఖాసిమ్‌ 2022 ఎడిషన్‌లో శ్రీలంకపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఖాసిమ్‌ తర్వాత మూడో వేగవంతమైన సెంచరీ రికార్డు భారత ఆటగాడు రాజ్‌ బవా పేరిట ఉంది. బవా 2022 ఎడిషన్‌లోనే ఉగాండపై 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.మలాజ్‌చుక్ విషయానికొస్తే.. ఇతగాడు జపాన్‌పై మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఫలితంగా ఆసీస్‌ పసికూన జపాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఇది వరసగా రెండో విజయం. అంతకుముందు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను కూడా 8 వికెట్ల తేడాతోనే చిత్తు చేసింది.ఆసీస్‌తో మ్యాచ్‌లో జపాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హ్యూగో కెల్లీ (79 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించడంతో జపాన్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కెల్లీకి నిహార్‌ పర్మార్‌ (33), చార్లెస్‌ హి​ంజ్‌ (24), హర హింజ్‌ (29) ఓ మోస్తరు సహాకారాలను అందించారు. ఆసీస్‌ బౌలర్లలో కూరే 3, విల్‌ బైరోమ్‌ 2, ఆర్యన్‌ శర్మ, కేసీ బార్టన్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 202 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. మలాజ్‌చుక్ మెరుపు సెంచరీకి మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ (60 నాటౌట్‌) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ తోడవ్వడంతో ఆసీస్‌ 29.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.

Virat Kohli replaced by Daryl Mitchell, Rohit Sharma demoted in latest ICC rankings2
టాప్‌ ర్యాంక్‌ కోల్పోయిన విరాట్‌ కోహ్లి

ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్‌-2గా ఉన్న న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ సరికొత్త వన్డే నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు.తాజాగా భారత్‌పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్‌, 137) చేయడంతో డారిల్‌ రేటింగ్‌ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్‌ ప్లేస్‌లో ఉండిన విరాట్‌పై డారిల్‌ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ప్రస్తుతం డారిల్‌ ఖాతాలో 845 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో డారిల్‌ టాప్‌ ర్యాంక్‌ను కైవసం​ చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్‌తో సిరీస్‌లో డారిల్‌ ​చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్‌ విజయాన్ని (2-1) అందించాడు.మరోవైపు రెండు వారాల కిందట టాప్‌ ర్యాంక్‌లో ఉండిన మరో టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం​ నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన మరో​ టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ టాప్‌-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌, ఐర్లాండ్‌ బ్యాటర్‌ హ్యారీ టెక్టార్‌, విండీస్‌ ప్లేయర్‌ షాయ్‌ హోప్‌, శ్రీలంక ఆటగాడు చరిత్‌ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.తాజాగా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌తో మూడో వన్డేలో సూపర్‌ సెంచరీతో అలరించిన ఫిలిప్స్‌ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్‌ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్‌-5లో ఉన్నారు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్‌తో సిరీస్‌లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్‌ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్‌ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, జింబాబ్వే సికందర్‌ రజా, ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ మహ్మద్‌ నబీ టాప్‌-3లో కొనసాగుతున్నారు.

Want Daryl Mitchell to replicate heroics in T20Is: Mitchell Santner3
IND vs NZ: అతడే మమ్మల్ని గెలిపిస్తాడు: కివీస్‌ కెప్టెన్‌

భారత్‌ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది న్యూజిలాండ్‌. టీ20 సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు పటిష్ట, నంబర్‌ వన్‌ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.ఇదేమీ అంత కష్టం కాదంటున్నాడు కివీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (Mitchell Santner), డారిల్‌ మిచెల్‌ జోరు కొనసాగిస్తే తాము సులువుగానే టీ20 సిరీస్‌నూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్‌.డారిల్‌దే కీలక పాత్రఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ జరుగగా.. కివీస్‌ భారత్‌ను 2-1తో ఓడించి సిరీస్‌ గెలిచింది. ఈ గెలుపులో న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌ది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో అతడు సాధించిన పరుగులు వరుసగా.. 84, 131 నాటౌట్, 137.గతంలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డ డారిల్‌ మిచెల్‌ (Daryl Mitchell).. ఈసారి మాత్రం ఆ అవరోధాన్ని అధిగమించాడు. ముఖ్యంగా భారత చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) బౌలింగ్‌లో అతడు చితక్కొట్టడం ఇందుకు నిదర్శనం. వన్డే ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని.. టీ20 సిరీస్‌లోనూ మిచెల్‌ అద్భుతాలు చేస్తాడని కివీస్‌ గట్టిగా నమ్ముతోంది.ఆరంభంలో ఇబ్బంది పడ్డాడుఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20కి ముందు కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘కెరీర్‌ ఆరంభంలో డారిల్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే, ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు అతడు కఠినంగా శ్రమించాడు.అందుకు తగ్గ ఫలితాలు, ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతడు స్పిన్‌ను సమర్థవంతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న తీరు అద్భుతం. టీ20 సిరీస్‌లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాం’’ అని సాంట్నర్‌ పేర్కొన్నాడు.ఇక్కడా గెలుస్తాంఇక ఇటీవలి కాలంలో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్‌ చేసిన న్యూజిలాండ్‌.. తాజాగా వన్డే సిరీస్‌లో తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో సాంట్నర్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఆడటం మాకెంతో ఇష్టం. అలాంటిది ఇక్కడ చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగడం మరింత సంతోషం.ఇప్పటికే రెండు ఫార్మాట్లలో అనుకున్న ఫలితం రాబట్టాము. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాము. టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఇదొక మంచి సన్నాహకంగా ఉంటుంది’’ అని సాంట్నర్‌ తెలిపాడు. చదవండి: భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ స్పందన వైరల్‌

IND vs NZ 1st T20I: Predicted Playing XI Harshit Rana To Get Axed4
IND vs NZ: అతడిపై వేటు.. భారత తుదిజట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ఆఖరి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి సిరీస్‌ ఆరంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20 సందర్భంగా టీమిండియా స్టార్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఓపెనర్లుగా అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ తమ స్థానాలు పదిలం చేసుకోగా.. గాయపడిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) స్థానంలో ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో వస్తాడని కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశాడు.శ్రేయస్‌ అయ్యర్‌కు నిరాశేఫలితంగా టీ20లలో రీఎంట్రీ ఇవ్వాలన్న వన్డే స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer)కు మరోసారి నిరాశ తప్పదు. నాలుగో స్థానంలో కెప్టెన్‌ సూర్య బరిలోకి దిగుతాడని తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, శివం దూబే సిద్ధంగా ఉన్నారు. ఏడు ఎనిమిది స్థానాల్లో శివం దూబేతో కలిసి హిట్టింగ్‌ ఆడే క్రమంలో రింకూ సింగ్‌కు కూడా తుదిజట్టులో చోటు ఖాయమే.వరుణ్‌ చక్రవర్తికే ఓటుస్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌ యాదవ్‌ను కాదని వరుణ్‌ చక్రవర్తి వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక పేసర్ల విభాగంలో ప్రధాన బౌలర్‌ బుమ్రాతో పాటు టీ20 వికెట్ల వీరుడు అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానం దక్కించుకోవడం సహజమే.కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా ఆడారు. ఆఖరిదైన మూడో వన్డేల్లో నితీశ్‌ (53), హర్షిత్‌ (52) అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినా విరాట్‌ కోహ్లి (124)తో కలిసి కాస్తైనా పరువు నిలిచేలా చేశారు.అతడిపై వేటు తప్పదుఅయితే, టీ20 సిరీస్‌ సందర్భంగా హార్దిక్‌, బుమ్రా తిరిగి వచ్చారు. పాండ్యా ఉన్నాడు కాబట్టి నితీశ్‌ రెడ్డిని టీ20లకు ఎంపిక చేయలేదు. ఇక బుమ్రా కూడా వచ్చాడు కాబట్టి తొలి టీ20 సందర్భంగా హర్షిత్‌ రాణాపై వేటు పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ లోయర్‌ ఆర్డర్‌లో హర్షిత్‌ బ్యాటింగ్‌కు ఉపయోగపడతాడని భావించినా.. టాపార్డర్‌ పటిష్టంగానే ఉన్న కారణంగా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా అతడి అవసరం ఉండకపోవచ్చు. అందుకే బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్‌ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా)సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, శివం దూబే, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌.చదవండి: T20 WC: సూర్యకుమార్‌ యాదవ్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

Only Bumrah To Retain Top BCCI Reasons To Simplify The Contract Structure5
BCCI: బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్‌.. వాళ్లకి ప్రమోషన్లు!

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్‌ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్‌లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి. ఏటా రూ. 7 కోట్లుకాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్‌ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్‌లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్‌లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్‌.. వాళ్లకి ప్రమోషన్లు!అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్‌ ఒక్క ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి వారికి ప్రమోషన్‌ దక్కే అవకాశాలున్నాయి.త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు. మూడు ఫార్మాట్‌లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్‌లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

After India Open Debacle Sports Ministry Pushes SAI For Action6
పావురాల రెట్టలు.. పరువు పోయాక చర్యలు

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నిర్వహణ లోపాలపై కేంద్ర క్రీడాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోమారు ఇలాంటి పొరపాట్లు, నిర్వహణ వైఫల్యాలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని క్రీడాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇలాంటి నిర్వాకం చేటుఇండియా ఓపెన్‌ వేదిక ఇందిరాగాంధీ స్టేడియం అధికారులను పిలిచిన క్రీడాశాఖ... నిర్వహణ తీరు, తలెత్తిన గందరగోళానికి సంబంధించిన సమగ్ర నివేదిక కోరింది. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం బిడ్డింగ్‌ రేసులో నిలవాలనుకుంటున్న భారత్‌కు ఇలాంటి నిర్వాకం చేటు చేస్తుందని క్రీడాశాఖ భావించింది. కఠిన చర్యలు తీసుకోండిఅందుకే సత్వర చర్యలు తీసుకునేందుకు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు, ఆతిథ్య వైఫల్యం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మాండవీయ ‘సాయ్‌’ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.నిజానికి ఇండియా ఓపెన్‌ భారత బ్యాడ్మింటన్‌ సంఘం నిర్వహించినప్పటికీ దేశంలోని ప్రముఖ క్రీడా స్టేడియాలు, ఎక్సలెన్సీ సెంటర్లన్నీ ‘సాయ్‌’ పరిధిలోనివి. వీటి నిర్వహణ కోసం కేంద్రం ప్రతీ ఏటా క్రీడా బడ్జెట్లో నిధులు కూడా ఇస్తోంది.అసలేం జరిగింది? దేశ రాజధానిలో ఇండియా ఓపెన్‌ జరిగింది. త్వరలోనే ఇక్కడ ప్రపంచ చాంపియన్‌షిప్‌ కూడా జరగనుంది. అయితే ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో వసతులు అధమంగా ఉన్నాయని, ఆడే పరిస్థితులు లేవని, ప్రాక్టీస్‌ కోర్టులన్నీ దుమ్ముధూళీతోనే నిండిపోయాయని డెన్మార్క్‌ షట్లర్‌ మియా బ్లిచ్‌ఫీల్డ్‌ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఆమె విమర్శలకు మరింత బలం చేకూర్చేలా మ్యాచ్‌లు జరిగే సమయంలో పలుమార్లు కోర్టులో పావురాలు రెట్ట వేశాయి. దీంతో నిర్వహణ తీరు, ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

WPL 2026: Delhi Capitals Lizelle Lee fined for Code of Conduct breach7
ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌కు భారీ షాక్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ క్రికెటర్‌ లీజెల్లి లీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆమెకు జరిమానా పడింది. అంతేకాదు లీజెల్లి ఖాతాలో ఓ డిమెరిట్‌ పాయింట్‌ కూడా చేరింది.మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ (MIW vs DCW) మధ్య మంగళవారం మ్యాచ్‌ జరిగింది. వడోదర వేదికగా టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ చేసింది.నట్‌ సీవర్‌, హర్మన్‌ మెరుపులుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నట్‌ సీవర్‌- బ్రంట్‌ (45 బంతుల్లో 65 నాటౌట్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (Harmanpreet Kaur- 33 బంతుల్లో 41) రాణించడంతో ఈ మేర స్కోరు సాధ్యమైంది.లీజెల్లి లీ ధనాధన్‌ఢిల్లీ బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టగా.. మరిజానే కాప్‌, నందిని శర్మ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లలో షఫాలీ వర్మ (29) ఫర్వాలేదనిపించగా.. లీజెల్లి లీ ధనాధన్‌ దంచికొట్టింది. 28 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 46 పరుగులు చేసింది.అయితే, అర్ధ శతకానికి చేరువైన వేళ లీ పొరపాటుతో మూల్యం చెల్లించుకుంది. అమన్‌జోత్‌ కౌర్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి లీ విఫలం కాగా.. వికెట్‌ కీపర్‌ రాహిలా ఫిర్దోజ్‌ చక్కటి స్టంపౌట్‌తో ఆమెను పెవిలియన్‌కు పంపింది. రివ్యూలోనూ లీజెల్లి లీదే తప్పని తేలడంతో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆమె బ్యాట్‌ను కొట్టినట్లు కనిపించింది.జరిమానా, డీమెరిట్‌ పాయింట్‌ఈ నేపథ్యంలో లీజెల్లి లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్లు డబ్ల్యూపీఎల్‌ ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.2 నిబంధన ప్రకారం.. లీ లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడింది. క్రికెట్‌ పరికరాలను డ్యామేజ్‌ చేసే రీతిలో వ్యవహరించినందుకు గానూ ఈ నిబంధన ప్రకారం చర్యలు ఉంటాయి.లెవల్‌ 1 తప్పిదం కాబట్టి లీ మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నాం. అదే విధంగా ఆమె ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ జత చేస్తున్నాం’’ అని డబ్ల్యూపీఎల్‌ పేర్కొంది. గెలిపించిన జెమీమాఇక ఈ మ్యాచ్‌లో లీతో పాటు కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 51 నాటౌట్‌) దంచికొట్టడంతో ఢిల్లీ విజయతీరాలకు చేరింది. 19 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 155 పరుగులు చేసి.. ముంబైపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ ఇప్పటికి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇది రెండో విజయం కాగా.. ముంబై ఆరింట రెండు మాత్రమే గెలిచి నాలుగు ఓడిపోయింది. మరోవైపు.. ఇప్పటిదాకా ఓటమన్నదే ఎరుగక ఐదింటికి ఐదు గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్‌ ఓవరాక్షన్‌

That Not Safe: Bangladesh Captain Litton Das Breaks Silence On T20 WC Row8
భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ స్పందన వైరల్‌

బంగ్లాదేశ్‌ మొండిపట్టు వీడటం లేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లో ఆడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఒత్తిళ్లకు తలొగ్గమంటూ మరోసారి ఓవరాక్షన్‌ చేసింది.బంగ్లా బదులు ఆ జట్టుఫలితంగా వరల్డ్‌కప్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే షెడ్యూల్‌, వేదికలు ఖరారు కావడం.. అందుకు అనుగుణంగా ఆయా జట్ల విమానాల టికెట్లు బుక్‌ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను ఐసీసీ శ్రీలంకకు మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.ఒకవేళ బంగ్లాదేశ్‌ ఇలాగే పట్టుదలకు పోతే.. ఆ జట్టుకు బదులు ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ టీ20 జట్టు కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (Litton Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో తలదూరిస్తే తాను చిక్కుల్లో పడతానని ఆందోళన వ్యక్తం చేశాడు.దయచేసి అడగవద్దుబంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా ఉన్న లిటన్‌ దాస్‌ మీడియాతో మాట్లాడగా.. ‘‘మీరు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో ఆడతారా? లేదా?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నా వరకైతే ఈ విషయంపై స్పష్టత లేదు. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే.ప్రస్తుతం బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తదుపరి మీరు ఏ ప్రశ్న అడుగబోతున్నారో నాకు తెలుసు. అది నాకు అంత సురక్షితమైనది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేను’’ అని లిటన్‌ దాస్‌ పేర్కొన్నాడు. కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.బీసీబీ వైఖరితో కష్టాల్లోకి ఆటగాళ్లుఈ నేపథ్యంలోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రత అనే సాకు చూపి బంగ్లాదేశ్‌ నిరాకరిస్తోంది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB) వైఖరి కారణంగా ఆటగాళ్లకు ఇప్పటికే కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లా ప్లేయర్లలో చాలా మందికి బ్యాట్ స్పాన్సర్లుగా భారత కంపెనీలు ఉన్నాయి. బీసీబీ వైఖరితో ఆ కంపెనీలు తమ కాంట్రాక్టులు రద్దు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.మరోవైపు.. బంగ్లాదేశ్‌ టీ20 ప్రపంచకప్‌- 2026 టోర్నీలో ఆడకపోతే దేశానికి వచ్చే నష్టమేమీలేదని.. ఆటగాళ్లే నష్టపోతారంటూ బీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఐసీసీ నుంచే ప్రధాన ఆదాయం వస్తున్నందున ఈ విషయంలో బీసీబీ ఆచితూచి వ్యవహరించాలని కోరినందుకు మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌పై బీసీబీ అధికారి నజ్ముల్‌ ఇస్లాం ‘భారత ఏజెంట్‌’ అనే ముద్ర వేశాడు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్‌ క్రికెటర్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నజ్ముల్‌ను సస్పెండ్‌ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇలా బోర్డు తీరుతో ఆటగాళ్లు వ్యక్తిగతంగా మాటలు పడుతూ.. ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. అందుకే లిటన్‌ దాస్‌ సైతం ప్రపంచకప్‌ టోర్నీ ఆడే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..!

Rohit Sharma Minces No Words Warns Suryakumar Over Poor Form9
T20 WC: సూర్యకుమార్‌కు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

గతేడాది టీ20 ఫార్మాట్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్‌-2025 టైటిల్‌ కూడా గెలిచింది.అయితే, బ్యాటర్‌గా మాత్రం సూర్య (Suryakumar Yadav) వరుస వైఫల్యాలతో చతికిలపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన ఈ ముంబైకర్‌.. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌కు ముందు ఈ అంశం టీమిండియాను కలవరపెడుతోంది.సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే..ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్‌, టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌కు టైటిల్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) స్పందించాడు. సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..అతడే ప్రధాన బ్యాటింగ్‌ ‘పవర్‌’‘‘కెప్టెన్‌ ఫామ్‌లో ఉన్నాడా? లేదా? అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ఆటగాడు ఫామ్‌లో లేకుంటే.. మనకు ఏడు నుంచి ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే, మనకున్న ప్రధాన బ్యాటింగ్‌ ‘పవర్‌’ తడబాటుకు లోనైతే పరిస్థితి కఠినంగా మారుతుంది.ప్రణాళికలు, వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వీలుకాదు. అనుకున్నంత ప్రభావం చూపలేకపోవచ్చు. ఒకవేళ సూర్య గనుక సరిగ్గా ఆడకపోతే.. బ్యాటింగ్‌ లైనప్‌ కచ్చితంగా ఇబ్బంది పడుతుంది’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.కెప్టెన్సీపై ప్రశంసలుఅయితే, కెప్టెన్‌గా మాత్రం సూర్యకుమార్‌ యాదవ్‌కు వంక పెట్టేందుకు ఏమీ లేదని రోహిత్‌ శర్మ ప్రశంసించాడు. ‘‘ఆట పట్ల సూర్యకు మంచి అవగాహన ఉంది. తన జట్టులోని ఆటగాళ్లలో అత్యుత్తమం ఎవరన్నది అతడికి బాగా తెలుసు. వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో కూడా అతడికి తెలుసు’’ అని సూర్య కెప్టెన్సీని కొనియాడాడు. రోహిత్‌ స్థానంలోకాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.ఈ క్రమంలో రోహిత్‌ స్థానంలో టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌-2026 జరుగనుండగా.. చివరి సన్నాహకంగా భారత్‌ న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడేందుకు సిద్ధమైంది. చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు భారీ షాక్‌!“SKY knows the game. He knows the players.” 💙@ImRo45 highlights @surya_14kumar's form and impact, calling him a critical batter whose presence brings balance and confidence to India’s batting lineup. 🔑🔥Why is SKY central to India’s success on the biggest stage? 🤔Watch it… pic.twitter.com/JEXFzIPhWA— Star Sports (@StarSportsIndia) January 20, 2026

Will Not bow down to pressure from ICC: Bangladesh Sports advisor10
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్‌

భారత్‌లో టీ20 ప్రపంచకప్‌-2026 మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్‌ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్‌ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్‌ ఆధారంగా స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మా బదులు స్కాట్లాండ్‌ ఆడుతుందా?‘మా స్థానాన్ని స్కాట్లాండ్‌ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్‌ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్‌ నిరాకరిస్తే... వారి మ్యాచ్‌ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్‌ అన్నారు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ జట్టు గ్రూప్‌ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ కోరింది. స్పందించని ఐసీసీగ్రూప్‌ ‘బి’లో ఉన్న ఐర్లాండ్‌ జట్టు లీగ్‌ దశలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్‌ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి బంగ్లాదేశ్‌ గ్రూప్‌ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement