ప్రధాన వార్తలు
IPL 2026: గ్రీన్ నుంచి పైసా వసూల్కు సిద్దమైన కేకేఆర్
ఐపీఎల్ 2026లో భాగంగా రేపు (ఏప్రిల్ 2) సన్రైజర్స్తో జరుగబోయే మ్యాచ్కు ముందు కేకేఆర్కు గుడ్ న్యూస్ అందుతుంది. ఆ జట్టు అత్యంత ఖరీదైన ఆటగాడు కెమరూన్ గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. Cameron Green has resumed bowling in nets. pic.twitter.com/YaJJPHKyky— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2026గ్రీన్ను కేకేఆర్ యాజమాన్యం ఆల్రౌండర్ కోటా రూ. 25 కోట్ల భారీ మొత్తం వచ్చించి కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని తెలిసి కేకేఆర్ అభిమానులు చాలా ఫీలయ్యారు. అంత భారీ మొత్తం వెచ్చించి కేవలం బ్యాటింగ్ మాత్రమే ఏంటని బహిరంగ విమర్శలు చేశారు.గత మ్యాచ్లో (ముంబై ఇండియన్స్) గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ను మ్యాచ్ కోల్పోయేలా చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత గ్రీన్ జాతీయ జట్టు క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుకొచ్చి అతనికి మద్దతుగా నిలబడింది. గ్రీన్కు శస్త్రచికిత్స జరిగింది. అతను మరికొంతకాలం కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగుతాడని సర్ద చెప్పే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యానికి ముందే చెప్పామని వివరణ ఇచ్చింది. మరో 10-12 రోజుల్లో గ్రీన్ బౌలింగ్ ప్రారంభిస్తాడని ఓ ప్రకటన విడుదల చేసింది.అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, ఈ ప్రకటన వెలువడని రెండు రోజుల్లోనే గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇది ఒక రకంగా కేకేఆర్కు శుభవార్తే అయినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆస్ట్రేలియాకు ఇబ్బందికరమైన విషయం. గ్రీన్ హడావుడిగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి కేకేఆర్ యాజమాన్యం ఒత్తిడి కారణమని తెలుస్తుంది. వారు కూడా ఈ విషయంలో తమ అభిమానుల డిమాండ్ల ముందు తలొగ్గాల్సి వచ్చింది.గ్రీన్ బౌలింగ్ విషయమై కేకేఆర్ అభిమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతను కేవలం బ్యాటింగ్ మాత్రమే చేసేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఆటగాళ్ల విషయం ఫ్రాంచైజీ వ్యక్తిగతమే అయినా, ఇలాంటి విషయాల్లో అభిమానుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వారు కూడా జట్టు గెలుపు కోసమే తహతహలాడుతుంటారు కాబట్టి, ఆటగాళ్లపై ఒత్తిడి తప్పదు.ఏదిఏమైనా గ్రీన్ బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం కేకేఆర్కు శుభపరిణామం. తొలి మ్యాచ్లో ఆ జట్టు 220 పరుగుల భారీ స్కోర్ చేసి కూడా సరైన బౌలింగ్ వనరులు లేకపోవడం చేత దాన్ని కాపాడుకోలేకపోయింది. రేపటి సన్రైజర్స్ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేస్తే, ఆ జట్టు విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
నసీమ్ షాకు రూ.67 లక్షల ఫైన్.. పీసీబీపై యూనిస్ ఖాన్ ఫైర్
పాకిస్తాన్ స్టార్ పేసర్ నసీమ్ షాకు ఆ దేశ క్రికెట్ బోర్డు రూ.67 లక్షల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా పీసీబీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఈ చర్యపై పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను మానసికంగా దెబ్బతీస్తాయని యూనిస్ మండిపడ్డాడు.అసలు ఏం జరిగిందంటే?మార్చి 27న లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభ మ్యాచ్కు పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ హాజరయ్యారు. దీన్ని నసీమ్ తప్పుపడుతూ.. ‘‘ఆమెను లార్డ్స్లో రాణిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?’’ అని మరియంను ఉద్దేశించి వ్యంగ్యంగా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశాడు. వెంటనే అతడు ఆ పోస్టను తొలిగించినప్పటికి, పీసీబీ మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పీసీబీ క్రమశిక్షణ కమిటీ కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి నసీమ్ షాకు 20 మిలియన్ల పాక్ రూపాయల జరిమానా విధించింది. ఈ క్రమంలోనే పీసీబీ నిర్ణయాన్ని యూనిస్ తప్పుబట్టాడు.నసీమ్ షా ఆ ట్వీట్కు క్షమాపణ కూడా చెప్పాడు. తన సోషల్ మీడియా మేనేజర్ పొరపాటున చేశాడని నసీమ్ ఇప్పటికే వివరణ ఇచ్చాడు. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి కూడా తప్పించాడు. అలాంటప్పుడు హెచ్చరికతో వదిలేయాల్సింది. లేదంటే తక్కువ మొత్తంలో జరిమానా విధించాల్సింది. ఇటువంటి చర్యలు ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తాయి అని యూనిస్ పేర్కొన్నాడు.చదవండి: KKR vs SRH: సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
గొయెంకా-రాహుల్ వివాదంపై స్పందించిన షమీ
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య ఐపీఎల్ 2024 ఎడిషన్లో జరిగిన సంఘటనపై ఆ ఫ్రాంచైజీ తాజా రిక్రూటీ మహ్మద్ షమీ స్పందించాడు. తాజాగా ఓ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ, గోయెంకాను సమర్థించాడు.షమీ మాటల్లో.. గొయెంకా గారిని రెండు, మూడు సార్లు కలిశాను. ఎప్పుడూ చాలా లాజికల్గా, జట్టు గురించి మాత్రమే మాట్లాడారు. తన జట్టుపై పొజెసివ్గా ఉంటే తప్పేముంది. పెట్టుబడి పెట్టాక, ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు ఆశించడం సహజం. తమ డబ్బు వృథా అవుతుందేమో అని ఎవరైనా ఆందోళన చెందుతారు.వివాదం నేపథ్యంఐపీఎల్ 2024 ఎడిషన్లో సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం పాలైంది. 165 పరుగుల లక్ష్యాన్ని SRH కేవలం 9.4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. మ్యాచ్ అనంతరం గోయెంకా మైదానంలో అందరూ చూస్తుండగా కేఎల్ రాహుల్ను దండించాడు. దీనికి సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఎంత యజమాని అయితే మాత్రం, ఓ కెప్టెన్ను అలా పబ్లిక్గా విమర్శించడం సరైంది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు భిన్నంగా షమీ స్పందించడం చర్చనీయాంశమైంది.ఎల్ఎస్జీలోకి షమీఐపీఎల్ 2026కి ముందు షమీ SRH నుంచి LSGకి ట్రేడ్ అయ్యాడు. SRH ఆయనను IPL 2025లో రూ.10 కోట్లకు కొనుగోలు చేయగా.. అదే ధరకు LSG అతన్ని ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2013లో కేకేఆర్ తరఫున అరంగేట్రం చేసిన షమీ.. Delhi Capitals, Punjab Kings, Gujarat Titans, SRH తరఫున ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున అతను 2022, 2023 సీజన్లలో వరుసగా 20, 28 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జీ ఇవాళ (ఏప్రిల్ 1) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. లక్నోలోని ఎఖానా స్టేడియంలో Delhi Capitalsతో తలపడుతుంది. ఈ మ్యాచ్తో షమీ LSG తరఫున తొలి సారి ఆడబోతున్నాడు.
సన్రైజర్స్ తుది జట్టు ఇదే.. రూ.13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఏప్రిల్ 2) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి పాలైన సన్రైజర్స్.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ పరంగా ఎంత పటిష్టంగా ఉందో, బౌలింగ్ పరంగా అంతే బలహీనంగా కన్పిస్తోంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.అంతేకాకుండా కొత్తగా జట్టులోకి వచ్చిన సీనియర్ పేసర్ డేవిడ్ పేయిన్, గత సీజన్లో అదరగొట్టిన ఎషాన్ మలింగ సైతం విఫలమయ్యారు. దీంతో కేకేఆర్తో మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.డేవిడ్ పేయిన్ స్ధానంలో ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి తొలి మ్యాచ్లోనే కార్స్ ఆడాల్సి ఉండేది. కానీ ప్రాక్టీస్ సెషన్లో చిన్నపాటి గాయం కారణంగా అతడు మొదటి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. అదేవిధంగా హర్ష్ దూబే స్ధానంలో జీషాన్ అన్సారీని ఆడించాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్కు మరోసారి నిరాశే ఎదరయ్యే అవకాశముంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉండటంతో లివింగ్స్టోన్కు చోటు దక్కడం లేదు. ఒకవేళ లివింగ్స్టోన్ ఆడించాలంటే ఎషాన్ మలింగ లేదా పేయిన్లో ఎవరో ఒకరిని పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే జట్టులో క్వాలిటీ బౌలర్లు ఎవరూ ఉండరు. గతేడాది జరిగిన మినీ వేలంలో రూ.13 కోట్ల భారీ ధరకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అంత భారీ ధర చెల్లించినప్పటికి అతడిని ఎస్ఆర్హెచ్ ఉపయోగించుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్,ఇషాన్ కిషన్,హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి,సలీల్ అరోరా, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీఇంపాక్ట్ ప్లేయర్: పేయిన్/ ఎషాన్ మలింగచదవండి: ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
పీకల్లోతు కష్టాల్లో లక్నో
పీకల్లోతు కష్టాల్లో లక్నో9.3వ ఓవర్- టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ట్రస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన లక్నో.. పూరన్ (8) ఔట్8.5వ ఓవర్- 65 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్లో పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.మూడో వికెట్ కోల్పోయిన లక్నో.. బదోని డకౌట్6.3వ ఓవర్- 49 పరుగుల వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ బదోని డకౌటయ్యాడు.రెండో వికెట్ డౌన్.. మార్క్రమ్ (11) ఔట్5.5వ ఓవర్- 48 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన లక్నో.. పంత్ (7) ఔట్2.6వ ఓవర్- ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. స్ట్రయికర్ మిచెల్ మార్ష్ కొట్టిన బంతి బౌలర్ చేతికి తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్లో ఉన్న వికెట్లను తాకడంతో పంత్ ఔటయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరుగుతున్న ఐదో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. లక్నోలోని ఎఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు..లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్ఇంపాక్ట్ సబ్లు: దిగ్వేష్ రాఠీ, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, అక్షత్ రఘువంశీఢిల్లీ: KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్ఇంపాక్ట్ సబ్లు: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ, సమీర్ రిజ్వీ, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్
ఐపీఎల్ ప్రత్యర్ది లీగ్కు భారత్ ఆతిథ్యం..?
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతున్న వేళ, బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తమ ఆథ్వర్యంలో నడిచే ఐపీఎల్కు ప్రధాన ప్రత్యర్ది అయిన బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)ను భారత్లో నిర్వహించే (ఆరంభ మ్యాచ్) అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ విషయమై బీసీసీయే స్వయంగా పావులు కదుపుతున్నట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్ ప్రత్యర్ది లీగ్ను బీసీసీయే ఎందుకు ఎంకరేజ్ చేస్తుందన్న విషయం భారతీయ క్రికెట్ అభిమానికి అర్దం కావడం లేదు.ఆస్ట్రేలియా జర్నలిస్ట్ టామ్ మోరిస్ ప్రకారం, క్రికెట్ ఆస్ట్రేలియా 2026–27 సీజన్ తొలి బీబీఎల్ మ్యాచ్ను భారత్లో నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటివరకు BBL ఎప్పుడూ విదేశీ నేలపై జరగలేదు. ఇది జరిగితే చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతనిధుల ఇదివరకే బీసీసీఐతో చర్చలు జరిపారు. ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టర్లు, ఫ్రాంచైజీలు ఈ ఆలోచనకు మద్దతు ఇస్తున్నాయి.బీసీసీఐతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. మొదట్లో ఇది సాకారం అయ్యే కలలా అనిపించలేదు కానీ, ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా అడుగులుపడుతున్నాయి. చెన్నైలో తొలి మ్యాచ్..? అన్నీ అనుకున్నట్లు జరిగితే, BBL 2026–27 సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలో జరగవచ్చు. డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్ ఆరంభ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
సామ్ కర్రాన్, టామ్ కర్రాన్ లు ఇంగ్లండ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికి.. జింబాబ్వే క్రికెట్తో వారికి వీడదీయరాని బందం ఉంది. వారి తండ్రి కెవిన్ కర్రన్ జింబాబ్వే తరఫున 11 వన్డేలు ఆడగా.. తమ్ముడు బెన్ కర్రన్ ప్రస్తుతం జింబాబ్వే జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు.అంతేకాకుండా వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ కూడా గతంలో రోడేసియా (ప్రస్తుత జింబాబ్వే) తరఫున ఆడారు. అయితే ఇప్పుడు సామ్ కర్రాన్, టామ్ కర్రాన్లు కూడా ఇంగ్లండ్ జట్టును వదిలి జింబాబ్వే తరఫున ఆడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.జింబాబ్వే క్రికెట్ వర్గాల్లో చురుగ్గా ఉండే సీనియర్ జర్నలిస్ట్ ఆడమ్ థియో తాజాగా ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. "మాజీ ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్, టామ్ కర్రాన్లు ఇప్పుడు జింబాబ్వే క్రికెట్ తరపున ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం టామ్ కర్రాన్కు జింబాబ్వే జట్టు తరపున ఆడేందుకు లైన్ క్లియర్ అయినప్పటికి..సామ్ మాత్రం ఐసీసీ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత ఈ చర్చలు జరిగాయి" అని ఎక్స్లో థియో రాసుకొచ్చాడు. అందుకు సామ్, టామ్ జింబాబ్వే జెర్సీలు ధరించిన ఒక ఫోటోను కూడా జోడించాడు. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఈ రోజు ఏప్రిల్ 1 కావడంతో, తన ఫాలోవర్లను ఆటపట్టించడానికి థియో ఈ పోస్ట్ చేశారు. అంతే తప్ప ఇందులో ఏ మాత్రం నిజం లేదు. కాగా సామ్ కర్రాన్, టామ్ కర్రాన్లు కేప్టౌన్లో జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ యూకే పౌరసత్వం పొందారు. ఐసీసీ నిబంధనల ప్రకారం వారిద్దరూ.. జింబాబ్వేకు ఆడాలంటే కనీసం నాలుగు ఏళ్లు అక్కడ నివసించాలి. అంతేకాకుండా జింబాబ్వే తరపున డొమాస్టిక్ క్రికెట్ ఆడాలి. టామ్ కర్రాన్ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉండగా.. సామ్ కర్రాన్ మాత్రం కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడుచదవండి: ICC Rankings: దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్.. ఏకంగా 64 స్ధానాలు
ఢిల్లీ తుదిజట్టు ఇదే.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అక్షర్ పటేల్ సారథ్యంలో వరుస విజయాలతో ఆరంభంలో దుమ్ములేపిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ చేరుకుండానే నిష్క్రమించింది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఎలాగైనా సత్తా చాటాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. తాజా ఎడిషన్ తొలి మ్యాచ్లో అక్షర్ సేన.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG vs DC)ను ఎదుర్కోనుంది. ఇక ఈసారి ఢిల్లీ ఓపెనింగ్ జోడీ మారనుంది.కేఎల్ రాహుల్ జోడీ ఎవరు?టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే, అతడికి జోడీ ఎవరన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘లక్నోతో మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించేదెవరు?అభిషేక్ పోరెల్, పాతుమ్ నిస్సాంక లేదంటే పృథ్వీ షా?.. నేనైతే పృథ్వీ షాకే ఓటు వేస్తాను. నితీశ్ రాణా వన్డౌన్లో.. ఆ తర్వాతి స్థానాల్లో ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (Axar Patel), డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ రావాలి.ఎనిమిదో స్థానంలో సీమర్ రిజ్వీ లేదంటే విప్రాజ్ నిగమ్ను ఆడించవచ్చు. కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. ఒకవేళ మరో భారత బౌలర్ను ఆడించాలనుకుంటే టి.నటరాజన్ లేదంటే ఆకిబ్ నబీని తీసుకోవాలి. ఈసారి ఢిల్లీ జట్టు బాగుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఊహించని విధంగా..కాగా గతంలో ఢిల్లీకి ఆడిన పృథ్వీ షా చాన్నాళ్లుగా లీగ్కు దూరమయ్యాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటి మినీ వేలంలో పేరు నమోదు చేసుకోగా ముందుగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అయితే, ఆఖరి నిమిషంలో రూ. 75 లక్షల కనీస ధరకు ఢిల్లీ తమ పాత ఆటగాడిని సొంతం చేసుకుంది. తుదిజట్టులో అతడికి చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాల నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఊహించని విధంగా ఓపెనర్గా స్థానం ఇవ్వడం గమనార్హం.లక్నోతో మ్యాచ్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న ఢిల్లీ తుదిజట్టుకేఎల్ రాహుల్, పృథ్వీ షా, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోశ్ శర్మ, సమీర్ రిజ్వి/విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీర, టి.నటరాజన్/ఆకిబ్ నబీ.చదవండి: ‘అందుకే IPL వద్దనుకుని PSLలో ఆడుతున్నా’
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు.
ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్లో ఎస్టర్హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు.ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్..! ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీ?
మాజీ సీఎం కూతురికి వేధింపులు
భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) అధ్యక్షుడు కల్యాణ్ ...
టైగర్వుడ్స్కు ట్రంప్ మాజీ భార్య వార్నింగ్!
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ ప్రస్తుతం డొనాల్డ్ ...
సూపర్ సబలెంకా
ఫ్లోరిడా: ఈ సీజన్లో తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ ప...
ఆంటోనెల్లి మళ్లీ...
సుజుకా: ఇటలీ టీనేజర్ కిమీ ఆంటోనెల్లి తాజా ఫార్ముల...
ఇంగ్లండ్కు గుడ్బై..! జింబాబ్వేకు ఆడనున్న సామ్ కర్రాన్?
సామ్ కర్రాన్, టామ్ కర్రాన్ లు ఇంగ్లండ్కు ప్రాత...
ఢిల్లీ తుదిజట్టు ఇదే.. ఓపెనర్గా ఊహించని ప్లేయర్!
గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుగైన ప్రదర్శనతో...
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నట...
ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమ...
క్రీడలు
IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)
సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్ (ఫొటోలు)
ఘనంగా నమన్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)
ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)
రన్నరప్గా ముగింపు
కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్ పోస్ట్ (ఫొటోలు)
అర్జున్ టెండుల్కర్- సానియా సంగీత్.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
టాలీవుడ్ హీరోయిన్తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)
వీడియోలు
పోరుకు సిద్ధం.. చివరికి గెలిచేది ఎవరు?
చెన్నై చిత్తు.. రాయల్స్ రాజసం
ధోని లేడు, బ్రెవిస్ కూడా లేడు సంజు ఒక్కడు చాలు
IPL 2026: RR vs CSK ఎవరు గెలుస్తారు?
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
RCB Vs SRH: అదరగొట్టిన RCB.. SRHపై 6 వికెట్ల తేడాతో RCB గెలుపు
మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
మ్యాచ్ మొదలవ్వక ముందే RCBకి 3 బిగ్ షాక్ లు ..
CSK స్కెచ్ అదుర్స్.. ఇక చెన్నైకి ధోని అవసరం లేదు
ఐపీఎల్ తొలి మ్యాచ్ లో RCBతో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ
