Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Virat Kohli Slams Ton But India Lose ODI Series To NZ1
కోహ్లి విరోచిత పోరాటం వృథా.. ఇండోర్‌లో భారత్‌ ఓటమి

ఇండోర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 ప‌రుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్‌, కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్‌(23), శ్రేయస్‌ అయ్యర్‌(3), రాహుల్‌(1) వికెట్లు భారత్‌ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి(53), విరాట్‌ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్‌(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్‌ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్‌ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్‌, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫౌల్క్స్‌, క్లార్క్‌ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్‌ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు.

IND vs NZ 3rd ODI: Virat Kohli Hits 54th ODI ton2
విరాట్‌ కోహ్లి వీరోచిత సెంచరీ

ఇండోర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచ‌రీతో చెల‌రేగాడు. 338 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో విరాట్ కోహ్లి ఒంట‌రి పోరాటం చేశాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌ట‌కి.. కోహ్లి మాత్రం త‌న అద్బుత బ్యాటింగ్‌తో అభిమానుల్లో గెలుపు ఆశ‌ల‌ను రేకెత్తించాడు.ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్‌ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కోల్పోయింది.న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫౌల్క్స్‌, క్లార్క్‌ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్‌ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు.

I Used To Cry In Front Of My Father Every Day: Harshit Rana3
ఇదేమి నాకు కొత్త కాదు.. క్రికెట్‌ కూడా వదిలేయాలనుకున్నా: హర్షిత్‌ రాణా

టీమిండియా యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొం‍టున్న సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం​ దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్‌కు గురువుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు."వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్‌కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు.

Rohit Sharma throws away his wicket for 11 after getting dropped in same over4
ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వ‌చ్చినా కూడా! వీడియో

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్‌మ్యాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు.మిడాన్‌లో క్లార్క్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్‌ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవ‌లం 61 ప‌రుగులు చేశాడు. అంత‌కుముందు జ‌రిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్‌ను కివీస్‌పై మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 ప్ర‌ణాళిక‌ల‌లో ఉన్న హిట్‌మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్‌మెంట్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌ల‌ను ఆశిస్తోంది.త‌డ‌బ‌డుతున్న భార‌త్‌..కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భార‌త్ త‌డ‌బ‌డుతోంది. కేవ‌లం 71 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. శుభ్‌మ‌న్ గిల్ 23 ప‌రుగులు చేయ‌గా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌(3), కేఎల్ రాహుల్‌(1) సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఫౌల్క్స్, క్లార్క్‌, లినిక్స్‌, జేమిస‌న్ త‌లా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్‌ మిచెల్‌..

Daryl Mitchell overtakes Virat Kohli as batter with highest average in ODIs5
చరిత్ర సృష్టించిన డారిల్‌ మిచెల్‌..

వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ తర్వాత రాజ్‌కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్‌కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. భారత్‌పై అతడికి ఇదే అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై గత ఐదు మ్యాచ్‌లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వ‌న్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా క‌లిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక స‌గ‌టు క‌లిగిన బ్యాట‌ర్‌గా మిచెల్ చ‌రిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు వ‌న్డేల్లో 58.45 స‌గ‌టుతో 14673 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లిని మిచెల్ అధిగ‌మించాడు. వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో భార‌త కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచ‌రీతో మెరిశాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

IND vs NZ 3rd ODI: Mitchell-Phillips tons help New Zealand post 337-86
మిచెల్‌, ఫిలిప్స్‌ సెం‍చరీలు.. భారత్‌ ముందు భారీ టార్గెట్‌

ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్‌(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్‌.. విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యంగ్‌(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్‌వెల్‌(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణా, అర్ష్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సిరాజ్, కుల్దీప్ త‌లా వికెట్ సాధించారు. ర‌వీంద్ర జ‌డేజా మ‌రోసారి క‌నీసం ఒక్క వికెట్ కూడా సాధించ‌లేక‌పోయాడు. కాగా డారిల్‌ మిచెల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

Daryl Mitchell hits second straight ODI ton, fourth consecutive 50-plus score vs India7
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్‌

సనత్ జయసూర్య, రికీ పాంటింగ్‌, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్‌.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్‌ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచ‌రీల మోత‌..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్‌పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్‌లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్‌-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైన‌ల్ అయితే త‌న విరోచిత సెంచ‌రీతో భార‌త్‌ను ఓడించే అంత‌ప‌నిచేశాడు. అంత‌కుముందు లీగ్ మ్యాచ్‌లో కూడా భార‌త్‌పై సెంచరీ సాధించాడు. దీంతో వ‌న్డే ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను తాజా ప‌ర్య‌ట‌న‌లో అత‌డు కొన‌సాగిస్తున్నాడు.ప్ర‌స్తుతం భార‌త్‌తో జ‌రుగుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో అత‌డు ప‌రుగులు వర‌ద పారిస్తున్నాడు. తొలి వ‌న్డేలో 84 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ త‌ర్వాత రాజ్‌కోట్‌లో విరోచిత సెంచ‌రీతో చెల‌రేగాడు. మ‌ళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలోనూ శ‌త‌క్కొట్టాడు. మిచెల్ భార‌త్‌లో త‌ను ఆడిన చివ‌రి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భార‌త్‌పై వ‌న్డేల్లో అత‌డి స‌గ‌టు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్‌గా..భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మిచెల్‌ నిలిచాడు. మిచెల్‌ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్‌లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్‌ను మిచెల్‌ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..

Internet Slams Gautam Gambhir As Arshdeep Singh Strikes In 1st Over On Return8
గంభీర్ చూశావా? తొలి ఓవర్‌లోనే వికెట్‌! వీడియో వైరల్‌

రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలి ఓవర్‌లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్‌ను పెవిలియన్ పంపి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్‌ బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్‌దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్‌దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో నికోల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో తొలి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశ‌మివ్వ‌ని హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌల‌ర్‌ను ఎలా ప‌క్క‌న పెట్టావు? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.మొద‌టి రెండు వ‌న్డేల్లో అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమిత‌మ‌య్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఎట్ట‌కేల‌కు సిరీస్ డిసైడ‌ర్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్ర‌సిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్(వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026

Bangladesh get rejected by Ireland over T20 World Cup group swap proposal9
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో షాక్‌..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో పాల్గోనేందుకు త‌మ జ‌ట్టును భార‌త్‌కు పంప‌బోమ‌ని మొండి ప‌ట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మ‌రో భారీ షాక్ త‌గిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్‌ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు

India won the toss against New Zealand in 3rd ODI10
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్‌ గెలిచిన టీమిండియా

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్‌ కృష్ణ స్థానంలో స్టార్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement