Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Henry, Smith and Santner ruled out of remainder of West Indies Tests1
న్యూజిలాండ్‌కు 'ట్రిపుల్‌' షాక్‌

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్‌ షాక్‌ తగిలింది. డిసెంబర్‌ 10 నుంచి వెల్లింగ్టన్‌ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్‌ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్‌ హెన్రీ కాఫ్‌ ఇంజ్యూరితో, నాథన్‌ స్మిత్‌ సైడ్‌ స్ట్రెయిన్‌తో, మిచెల్‌ సాంట్నర్‌ గ్రోయిన్‌ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మైఖేల్‌ రే, గ్లెన్‌ ఫిలిప్‌ జట్టులోకి వచ్చారు. స్మిత్‌, హెన్రీ తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్‌ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన టామ్‌ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్‌ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. విండీస్‌ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.షాయ్‌ హోప్‌ సూపర్‌ సెంచరీ (140).. జస్టిన్‌ గ్రీవ్స్‌ అజేయ డబుల్‌ సెంచరీ (202).. కీమర్‌ రోచ్‌ (233 బంతుల్లో 58 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్‌ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్‌ గెలిచినట్లే. విండీస్‌ యెధుల పోరాటాన్ని యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ కీర్తించింది.

India sanctioned for slow overrate in Raipur ODI vs south africa2
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఝలక్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్‌ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్‌ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత​ సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం​ మ్యాచ్‌ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్‌, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్‌ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్‌, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక​్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌

IND VS SA T20 Series: Gill all set for comeback, once again Despair for sanju samson3
గిల్‌ వచ్చేశాడు.. సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే..!

డిసెంబర్‌ 9 నుంచి కటక్‌ (ఒడిషా) వేదికగా భారత్‌, సౌతాఫ్రికా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ కోసం భారత జట్టు మొత్తం ఇప్పటికే భువనేశ్వర్‌కు (ఒడిషా రాజధాని) చేరుకుంది. గాయం కారణంగా టెస్ట్‌, వన్డే సిరీస్‌కు (సౌతాఫ్రికాతో) దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ కూడా నిన్న రాత్రి భువనేశ్వర్‌ చేరుకున్నాడు.గిల్‌ మెడ్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. గిల్‌ రాకతో టీమిండియాకు ఓపెనింగ్‌ జోడీ సమస్య తిరగబెట్టింది. అభిషేక్‌కు జోడీగా గిల్‌ బరిలోకి దిగితే సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశ తప్పదు.మిడిలార్డర్‌లో ఆడించాల్సి వస్తే మేనేజ్‌మెంట్‌ జితేశ్‌ శర్మకు ఓటు వస్తుంది తప్ప సంజూకు అవకాశం ఇవ్వదు. సంజూ ఓపెనర్‌గా అయితేనే సక్సెస్‌ కాగలడని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. ఇది ఆసీస్‌ పర్యటనలో తొలి రెండు టీ20ల్లో నిరూపితమైంది. దీన్ని బట్టి చూస్తే సంజూ ఓపెనర్‌గా అవకాశం ఉంటేనే తుది జట్టులో ఉంటాడు. లేకపోతే జట్టులో చోటే ఉండదు.మేనేజ్‌మెంట్‌ దగ్గర మిడిలార్డర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోసం​ జితేశ్‌ శర్మ రూపం మంచి ఆప్షన్‌ ఉంది. జితేశ్‌ మంచి ఫినిషర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో అతడికే అవకాశాలు ఉంటాయి. ఓపెనర్లలో ఎవరో ఒకరికి గాయమైతే తప్ప సంజూ తుది జట్టులోకి వచ్చే పరిస్థితి లేదు.గిల్‌ ఆకలితో ఉన్నాడు: గంభీర్‌గిల్‌ గాయంపై టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ రెండు రోజుల ముందే అప్‌డేట్‌ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ ముగిశాక గంభీర్‌ మాట్లాడుతూ.. అవును, గిల్‌ సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతన్ని ఎంపిక చేశాం. అతను ఫిట్‌గా, ఫైన్‌గా, ఆడేందుకు ఆకలితో ఉన్నాడని అన్నాడు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయానికి గురైన గిల్‌.. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అక్కడ పూర్తిగా కోలుకొని, వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న గిల్‌.. టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌

Powell, Cox power Dubai Capitals to victory over Abu Dhabi Knight Riders4
ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో విండీస్‌ వీరుడి విధ్వంసం

దుబాయ్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌-2025లో విండీస్‌ వీరుడి రోవ్‌మన్‌ పావెల్‌ (Rovman Powell) విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌కు ఆడుతున్న పావెల్‌.. నిన్న (డిసెంబర్‌ 7) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 96 పరుగులు చేశాడు. మరో బంతి ఆడే అవకాశం వచ్చుంటే అతని సెంచరీ కూడా పూర్తైయ్యేది. పావెల్‌ మెరుపులకు జోర్డన్‌ కాక్స్‌ (36 బంతుల్లో 52; ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో పావెల్‌, కాక్స్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు.టాబీ ఆల్బర్ట్‌, సెదిఖుల్లా అటల్‌ తలో 8, షయాన్‌ జహంగీర్‌ 14 పరుగులకు ఔటయ్యారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2, అజయ్‌ కుమార్‌, పియూశ్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలోనూ నైట్‌రైడర్స్‌ తడబడింది. వకార్‌ సలామ్‌ఖీల్‌ (3.3-0-29-4), మహ్మద్‌ నబీ (4-0-12-2), డేవిడ్‌ విల్లే (3-0-13-2), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3-0-22-2) ధాటికి 15.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ సాల్ట్‌ (27) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. విధ్వంసకర వీరులు లివింగ్‌స్టోన్‌ (16), రూథర్‌ఫోర్డ్‌ (19), రసెల్‌ (12) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

Venkatesh Prasad elected as new KSCA president5
కీలక పదవికి ఎంపికైన టీమిండియా మాజీ క్రికెటర్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌కు (Venkatesh Prasad) కీలక పదవి దక్కింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఈ మాజీ పేసర్ ఘన విజయం సాధించారు. ఆదివారం (డిసెంబర్ 7) జరిగిన ఎన్నికల్లో ప్రసాద్‌ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెల్ దాదాపు అన్ని పదవులను గెలుచుకుంది. ప్రసాద్‌ బ్రిజేశ్‌ పటేల్‌ మద్దతు పొందిన కేఎన్‌ శాంత్‌ కుమార్‌పై 191 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్‌కు 749, శాంత్‌ కుమార్‌కు 558 ఓట్లు వచ్చాయి. మరో భారత మాజీ క్రికెటర్‌ సుజిత్‌ సోమసుందర్‌ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వినోద్‌ శివప్పపై ఆయన 719-588 ఓట్ల తేడాతో గెలుపొందారు.కార్యదర్శి హోదాను సంతోష్‌ మీనన్‌ తిరిగి దక్కించుకున్నాడు. ఈఎస్‌ జైరామ్‌పై 675-632 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ట్రెజరర్‌ పోస్ట్‌ను బీఎన్‌ మధుకర్‌ దక్కించుకున్నాడు. ఎంఎస్‌ వినయ్‌పై 736-571 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఇలా దాదాపుగా ప్రతి పదవిని వెంకటేశ్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని టీమ్ గేమ్ ఛేంజర్స్ ప్యానెలే దక్కించుకుంది.ప్రధాన ఫలితాలు - అధ్యక్షుడు: వెంకటేష్ ప్రసాద్ – 749 ఓట్లు - ఉపాధ్యక్షుడు: సుజిత్ సోమసుందర్ – 719 ఓట్లు - కార్యదర్శి: సంతోష్ మెనన్ – 675 ఓట్లు - జాయింట్ సెక్రటరీ: బీకే రవి – 669 ఓట్లు - ఖజాంచి: బీఎన్ మధుకర్ – 736 ఓట్లు మేనేజింగ్ కమిటీ సభ్యులు - లైఫ్ మెంబర్స్: వీఎం మంజునాథ్, సైలేష్ పోల, అవినాష్ వైద్య - ఇన్‌స్టిట్యూషన్ మెంబర్స్: కల్పనా వెంకటాచార్, ఆశిష్ అమర్లాల్ జోన్ ప్రతినిధులు - మైసూరు – శ్రీనివాస్ ప్రసాద్ - శివమొగ్గ – డీఎస్ అరుణ్ - తుమకూరు – సీఆర్ హరీష్ - ధార్వాడ – వీరాణ సవిడి - రాయచూర్ – కుశాల్ పటిల్ - మంగళూరు – శేఖర్ శెట్టి ముఖ్యాంశాలు - ప్రసాద్ ప్యానెల్ వారి మేనిఫెస్టోలో చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లు జరగాలని స్పష్టంగా పేర్కొంది. - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ వేడుకలో జరిగిన దుర్ఘటన తర్వాత అక్కడ పెద్ద మ్యాచ్‌లు జరగలేదు. - ఈ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియం నుంచి తరలిపోవడానికి అనుమతించం. ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. భవిష్యత్తులో కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని అన్నారు. డీకే వెంకటేశ్‌ ప్రసాద్‌ ప్యానెల్‌కు తన సంపూర్ణ మద్దతు తెలిపారు.

Predicted India playing XI for IND vs SA 1st T20I6
సౌతాఫ్రికాతో తొలి టీ20.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌పై వేటు?

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ మంగళవారం(డిసెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే కటక్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే ఆతిథ్య వేదికకు చేరుకుని ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి. టెస్టు సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను మాత్రం మెన్ ఇన్ బ్లూ తమ ఖాతాలో వేసుకుంది.ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని భారత్‌ పట్టుదలతో ఉంది. కటక్ టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయం‍తో ఆరంభించాలని సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ భావిస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. దీంతో తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేద్దాం.టైమ్స్ ఆఫ్ ఇండియా' నివేదిక ప్రకారం.. తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తాయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వికెట్‌ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది.సుందర్‌పై వేటు..గత కొన్ని మ్యాచ్‌లగా మూడో స్పిన్నర్‌గా ఉన్న వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు ఛాన్స్ ఉంది. ఎలాగో మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉంటాడు. గాయం నుంచి పాండ్యా కోలుకుని తిరిగొచ్చాడు.ఇక సీమర్లగా అర్ష్‌దీప్ సింగ్‌, జస్ప్రీత్ బుమ్రా ఉండే అవకాశముంది. ఒకవేళ అవసరమైతో దూబేతో బౌలింగ్ చేయిస్తారు లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉపయోగించుకుంటారు. అయితే స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు చోటు దక్కకపోవచ్చు. భారత ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్‌, అభిషేక్ శర్మ ప్రారంభించనుండగా.. మూడు నాలుగు స్ధానాలలో సూర్యకుమార్‌, తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను ఆడించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు మ్యాచ్‌లలో శాంసన్ విఫలమైతే.. జితీశ్ శర్మ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌, సూర్యకుమార్ యాదవ్‌, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌, హార్దిక్ పాండ్యా, దూబే, కుల్దీప్ యాదవ్‌, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌చదవండి: రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!

BCCIs Unexpected Declaration As Rohit Sharma, Virat Kohli Confirm VHT7
రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ ఊహించని ప్రకటన!

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లిలు విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ దేశ‌వాళీ వ‌న్డే టోర్నీలో రెండు లేదా మూడు మ్యాచ్‌ల‌లో కోహ్లి ఆడే అవ‌కాశ‌ముంది. రోహిత్ శ‌ర్మ మాత్రం పూర్తి స్దాయిలో అందుబాటులో ఉంటాన‌ని ముంబై క్రికెట్ అసోయేషిన్‌కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం.అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడితోనే రో-కో ద్వ‌యం విజ‌య్ హజారే ట్రోఫీలో ఆడేందుకు స‌ముఖ‌త చూపించార‌ని వార్తలు వ‌చ్చాయి. చాలా మంది మాజీలు కూడా వారిద్ద‌రూ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నార‌ని, డొమాస్టిక్ క్రికెట్ ఆడాల‌ని ఒత్తిడి తీసుకురావ‌డమేంటి అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ అధికారి ఒక‌రు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు."విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్న‌ది రోహిత్‌, కోహ్లిల వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం. అంతే త‌ప్ప క‌చ్చితంగా ఆడాల‌ని వారిని ఎవరూ ఆదేశించలేదు" అని స‌ద‌రు అధికారి స్ప‌ష్టం చేశారు. కాగా రో-కో ప్ర‌స్తుతం సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవ‌ల సౌతాఫ్రికాతో ముగిసిన వ‌న్డే సిరీస్‌లో దుమ్ములేపారు. దీంతో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027లో వారిద్దరూ ఆడ‌డం ఖాయ‌మని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ప్ర‌పంచ‌క‌ప్ ప్ర‌ణాళిక‌ల‌లో రోహిత్‌-కోహ్లి ఉన్నారా లేదా అన్న‌ది హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ క్లారిటీ ఇవ్వ‌లేదు. కానీ వారిద్ద‌రూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లని, వారి అనుభ‌వం డ్రెస్సింగ్ రూమ్‌లో అవ‌స‌ర‌మ‌ని గంభీర్ చెప్పుకొచ్చాడు.చదవండి: ENG vs AUS: 'చెత్త బౌలింగ్‌.. చెత్త బ్యాటింగ్‌.. చెత్త కెప్టెన్‌'

England Great Geoffrey Boycott Tears Into Ben Stokes, Brendon McCullum8
'చెత్త బౌలింగ్‌.. చెత్త బ్యాటింగ్‌.. చెత్త కెప్టెన్‌'

యాషెస్ సిరీస్ 2025-26లో ఇంగ్లండ్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చూవిచూసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో స్టోక్స్ సేన వెనకబడింది.తొలి టెస్టుతో పోలిస్తే బ్రిస్బేన్‌లో బ్యాటింగ్ పరంగా ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆసీస్ బ్యాటర్లను ఇంగ్లీష్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుపై ఆ దేశ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ విమర్శల వర్షం కురిపించారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరుస్తుందని, తిరిగి కమ్‌బ్యాక్ చేయాలంటే అద్భుతం జరిగాలని ఆయన అభిప్రాయపడ్డారు."బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరించింది. ఈ చెత్త బ్యాటింగ్‌, బౌలింగ్‌తో వారు యాషెస్ ట్రోఫీ కాదు క‌దా, పైన ఉన్న క‌ప్పును కూడా గెల‌వ‌లేరు. ఇంగ్లండ్ జ‌ట్టు బౌలింగ్ చెత్తగా ఉంది. ప‌దే ప‌దే షార్ట్ పిచ్ బంతులు వేయ‌డం, ఎక్కువ‌గా వైడ్ వేసి భారీగా ప‌ర‌గులు స‌మ‌ర్పించుకున్నారు.అంతేకాకుండా బ్రిస్బేన్‌లో క్యాచ్‌లు కూడా జార‌విడిచారు. నాలుగేళ్ల‌గా ఆస్ట్రేలియాను ఓడించిడానికి ఇంగ్లండ్ ఒక బ్లూప్రింట్ సిద్ధం చేసింది. అయిన‌ప్ప‌టికి కంగారుల‌పై పై చేయి సాధించ‌లేక‌పోతున్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌లు ఎవ‌రూ మాట విన‌రు. తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటున్నారు. టెస్ట్ క్రికెట్ గురించి తమకు మాత్రమే తెలుసు అని వాళ్లు అనుకుంటున్నారు. ప్ర‌తీసారి దూకుడుగా ఆడాల‌ని కెప్టెన్ చెబుతుంటాడు. టెస్టు క్రికెట్ అంటే దూకుడుగా ఆడ‌డం కాదు.. ఓపిక‌, స‌హ‌నం రెండూ ఉండాలి. కానీ మా జ‌ట్టులో అది క‌న్పించ‌డం లేదు. బాజ్ బాల్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. హ్యారీ బ్రూక్ తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు. అదేవిధంగా ఓలీ పోప్ సైతం తన వికెట్‌ను ఈజీగా స‌మ‌ర్పించుకుంటున్నాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇంగ్లండ్ తిరిగి కోలుకోవ‌డం క‌ష్ట‌మే" అని బాయ్‌కాట్‌ పేర్కొన్నారు.చదవండి: IPL 2026: యువ సంచ‌ల‌నంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?

 Shakib Al Hasan reverses retirement to play one last series9
రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న స్టార్‌ ప్లేయర్‌

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబ్ అల్ హసన్ టెస్ట్‌, టీ20 క్రికెట్ నుంచి తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ జట్టు తరపున తిరిగి మూడు ఫార్మాట్లలో ఆడాలని భావిస్తున్నట్లు షకీబ్ తెలిపాడు. సొంత ప్రజలు ముందు రిటైర్మెంట్ అవ్వాలనే తన కోరికను అతడు వ్యక్తం చేశాడు.కాగా గతేడాది భారత పర్యటన తర్వాత టెస్ట్‌, టీ20లకు షకీబ్ వీడ్కోలు పలికిన షకీబ్‌.. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. కానీ షకీబ్ వివాదాలలో చిక్కుకోవడంతో వన్డేలకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ స్టార్ ఆల్‌రౌండర్ ప్రస్తుతం యూకేలో ఉంటున్నాడు.గతేడాది మే నుంచి ఇప్పటివరకు అతడు ఇప్పటివరకు బంగ్లాదేశ్‌కు తిరిగి రాలేదు. ఓ హత్య కేసులో అతడి పేరిట ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వివాదంలో అతడు చిక్కుకున్నప్పటికి పాకిస్తాన్, భారత్‌లలో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో మాత్రం పాల్గోనున్నాడు.ఆ తర్వాత అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంతో షకీబ్ విదేశాల్లోనే ఉండిపోయాడు. షకీబ్ ఆ పార్టీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోయిన్ అలీతో 'బీర్డ్ బిఫోర్ వికెట్' పాడ్‌కాస్ట్‌లో షకీబ్ అల్ హసన్ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటను అతడు వెల్లడించాడు."నేను ఇంకా అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్ కాలేదు. ఈ విషయాన్ని మొదటిసారి వెల్లడిస్తున్నా. తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి పూర్తి స్ధాయిలో వన్డే, టెస్ట్‌, టీ20 సిరీస్ ఆడి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. సొంత ప్రజల ముందు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతా. ఫిట్‌గా ఉండేందుకే టీ20 లీగ్స్‌లో ఆడుతున్నా అని షకీబ్‌ పేర్కొన్నాడు. మరి అతడి కోరికను బంగ్లా క్రికెట్‌ బోర్డు నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.చదవండి: IPL 2026: యువ సంచ‌ల‌నంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?

Who Is Mukul Choudhary? Mumbai Indians Set To Target Uncapped Wicketkeeper-Batter10
యువ సంచ‌ల‌నంపై ముంబై కన్ను.. ఎవరీ ముకుల్ చౌదరి?

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు ఓ యువ సంచలనం అద్భుత ప్రదర్శలనతో అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీపై అతడు ఇన్నింగ్స్ అభిమానులను, టాలెంట్ స్కౌట్స్‌ను సైతం ఆశ్చర్యపరిచింది.ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చే స‌త్తా అత‌డిది. త‌న‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో దేశ‌వాళీ క్రికెట్‌లో న‌యా ఫినిషర్‌గా పేరు గాంచాడు. అత‌డే రాజ‌స్తాన్ ప‌వ‌ర్ హిట్ట‌ర్‌ 21 ఏళ్ల ముకుల్ చౌదరి.ఢిల్లీపై అద్బుతం.. ఎవరీ ముకుల్ చౌద‌రి?రాజ‌స్తాన్‌లోని ఝుంఝునుకు చెందిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ ముకుల్ చౌద‌రి దేశ‌వాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు. ఫ‌స్ట్ క్లాస్, సీనియ‌ర్ టీ20 క్రికెట్ మ్యాచ్‌లు ఇప్ప‌టివ‌ర‌కు పెద్ద‌గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికి.. అండ‌ర్‌-23 టోర్నీల్లో మాత్రం త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తున్నాడు.తాజాగా స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఢిల్లీపై విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయం అని భావించారు. కానీ క్రీజులోకి వచ్చిన ముకల్ అద్భుతం చేశాడు.ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగి తన జట్టును ఒంటి చేత్తే గెలిపించాడు. కేవలం 26 బంతుల్లోనే 1 ఫోర్లు, 7 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముకుల్ 2023లో రాజస్తాన్ సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేశాడు. కానీ అతడికి పెద్దగా అవకాశాలు లభించలేదు. అతడు ఇప్పటివరకు మూడేసి చొప్పున ఫస్ట్ క్లాస్‌, టీ20 మ్యాచ్‌లు ఆడాడు.లీడింగ్ రన్ స్కోరర్‌గా..ముకుల్ ఇటీవల ముగిసిన అండర్ 23 వన్డే టోర్నమెంట్‌లో రాజస్తాన్ తరపున సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ వన్డే టోర్నీలో అతడు 102.83 సగటుతో 617 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి.అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 147గా ఉంది. అదేవిధంగా టోర్నమెంట్‌లో అత్యధికంగా 34 సిక్సర్లు బాదాడు. ఈ ప్రదర్శనలతో సీనియర్ సెలక్షన్ కమిటీ దృష్టిని అతడు ఆకర్షించాడు. దీంతో దేశవాళీ ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో ఆడే అవకాశం చౌదరికి లభించింది.ఈసారి మాత్రం తన వచ్చిన అవకాశాన్ని అతడు అందిపుచ్చుకున్నాడు. పేస్‌, స్పిన్ రెండింటినీ అతడు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. అంతేకాకుండా అతడి షాట్ సెలక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది.ముంబై కన్ను..కాగా ఈ యువ సంచలనంపై ముంబై ఇండియన్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. నవంబర్ ఆఖరి వారంలో అతడు ముంబై నిర్వహించిన ట్రయల్స్‌కు హాజరైనట్లు సమాచారం. రియాన్ రికెల్టన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా ముకుల్‌ను తీసుకోవాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టాలెంట్ స్కౌట్స్ కూడా అతడి బ్యాటింగ్ వీడియోలను పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఐపీఎల్‌-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: చాలా చాలా బాధగా ఉంది.. మా సత్తా ఏంటో చూపిస్తాం: స్టోక్స్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement