Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

You Hit: Dravid Message On Rohit Sharma Stand At Wankhede1
రోహిత్‌ శర్మకు రాహుల్‌ ద్రవిడ్‌ మెసేజ్‌.. వీడియో వైరల్‌

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)పై మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) ప్రశంసలు కురిపించాడు. సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన హిట్‌మ్యాన్‌ను ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) సత్కరించిన తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల చేతుల మీదుగాముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అతడి పేరిట స్టాండ్‌ను నెలకొల్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌.. రోహిత్‌ తల్లిదండ్రులు పూర్ణిమా- గురునాథ్‌ శర్మతో కలిసి ‘రోహిత్‌ శర్మ స్టాండ్‌’ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రోహిత్‌ భార్య రితికా సజ్దేతో పాటు తమ్ముడు విశాల్‌ శర్మ, అతడి భార్య దీపాళీ షిండే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదన్నాడు.నూటికి నూరు శాతం అర్హుడివికుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తాను ఉన్నత స్థితికి చేరుకున్నానని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరి​కి హిట్‌మ్యాన్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ‍ద్రవిడ్‌ ప్రత్యేక సందేశం పంపించాడు. ఇంతటి గౌరవానికి నువ్వు నూటికి నూరు శాతం అర్హుడివని కొనియాడాడు.‘‘శుభాకాంక్షలు.. ఈ గౌరవానికి నువ్వు అన్ని విధాలా అర్హుడవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందు స్టాండ్‌ ఆవిష్కరణ.. ఇలాంటి రోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రోహిత్‌ శర్మ స్టాండ్‌లోకి నువ్వు మరిన్ని సిక్స్‌లు కొట్టాలని ఆశిస్తున్నా.నాకెప్పుడైనా ముంబై స్టేడియంలో టికెట్లు దొరక్కపోతే ఎవరిని సంప్రదించాలో ఇప్పుడు బాగా తెలిసింది. నీ పేరిట స్టాండ్‌ ఉంది కదా.. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోను’’ అంటూ ద్రవిడ్‌ వీడియో సందేశం ద్వారా రోహిత్‌ను అభినందిస్తూనే ఇలా చమత్కరించాడు.వరల్డ్‌కప్‌ గెలిచారుకాగా రోహిత్‌ శర్మ- ద్రవిడ్‌ల జోడీ టీమిండియాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలిపింది. అయితే, టీ20 ప్రపంచకప్‌2-202లో భారత్‌ సెమీస్‌లోనే నిష్క్రమించడంతో వీరిద్దపై విమర్శలు వచ్చాయి. ఇద్దరూ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగాయి.ఈ క్రమంలో అనూహ్య రీతిలో రోహిత్‌ కెప్టెన్సీలో జట్టును తిరిగి పుంజుకునేలా చేశాడు ద్రవిడ్‌. అందుకు ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వన్డే వరల్డ్‌కప్‌-2023లో రన్నరప్‌గానూ నిలిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ పదవి నుంచి తప్పుకోగా.. గౌతం గంభీర్‌ ఆ బాధ్యతలు స్వీకరించాడు.రోహిత్‌- గంభీర్‌ కాంబోలో ఇటీవలే భారత్‌ ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచింది. కాగా గతేడాది ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్‌ శర్మ.. ఇటీవలే టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు.. ద్రవిడ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు.చదవండి: Suresh Raina: కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుRahul Dravid's message to RO got us like... 🥹💙P.S. The humour at the start & end 😂👌#MumbaiIndians #PlayLikeMumbai #RohitSharmaStand | @ImRo45 | @rajasthanroyals pic.twitter.com/sdnasfUIKi— Mumbai Indians (@mipaltan) May 17, 2025

Babar Azam Picks 2 Indians In His World XI No Bumrah And Kohli2
బాబర్‌ ఆజం వరల్డ్‌ ఎలెవన్‌: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు

పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్‌ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్‌ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్‌ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్‌ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో​ దుమ్మురేపిన రోహిత్‌ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్‌మ్యాన్‌ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్‌ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్‌ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్‌ జమాన్‌ను సెలక్ట్‌ చేసుకున్న బాబర్‌.. మిడిలార్డర్‌లో ధనాధన్‌ దంచికొట్టే సూర్యకుమార్‌ యాదవ్‌ను నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ విధ్వంసకర వీరుడు జోస్‌ బట్లర్‌, సౌతాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్‌ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్‌ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్‌ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌లకు బాబర్‌ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్‌ పేసర్‌ మార్క్‌వుడ్‌ను పేస్‌ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్‌ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్‌ సమతూకంగా ఉంటుందని బాబర్‌ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో కనీసం గ్రూప్‌ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్‌ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్‌ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో రిజ్వాన్‌ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్‌ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్‌, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్‌ ఆజం వరల్డ్‌ ఎలెవన్‌:రోహిత్‌ శర్మ, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో యాన్సెన్‌, రషీద్‌ ఖాన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్క్‌వుడ్‌.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్‌: టీమిండియా మాజీ కోచ్‌

He Has Got Everything In Life But: Suresh Raina on Virat Kohli3
కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటు: సురేశ్‌ రైనా

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ‘రన్‌మెషీన్‌’ తన వృత్తిగత జీవితంలో అన్నీ సాధించేశాడని.. అయితే, పదిహేడేళ్లుగా ఓ లోటు మాత్రం అలాగే మిగిలిపోయిందన్నాడు. ఇంతకీ అదేమిటంటే..!?కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి కోహ్లి.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు క్రికెట్‌ రిటైర్మెంట్‌ విషయంలోనూ రోహిత్‌నే అనుసరించాడు.రోహిత్‌ సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వారంలోపే తానూ టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లి వెల్లడించాడు. ఇక ఇప్పటికే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌లో కొనసాగుతున్న వీరిద్దరు.. భారత్‌ తరఫున వన్డేల్లోనూ కొనసాగనున్నారు.ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌కాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాడు. అంతకు ముందు దక్కన్‌ చార్జర్స్‌ ఆటగాడిగానూ ట్రోఫీ గెలిచిన జట్టులో భాగమయ్యాడు. అయితే, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభం నుంచీ అంటే 2008 నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తోనే ఉన్న కోహ్లికి ఇంత వరకు ఐపీఎల్‌ టైటిల్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.చిరకాల కల నెరవేరేనా?ఈసారి మాత్రం కోహ్లి చిరకాల కల నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపీఎల్‌-2025లో వరుస విజయాలతో జోరు మీదున్న పాటిదార్‌ సేన చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్లుగానే ఆర్సీబీ ఈసారి ఇప్పటికే పదకొండు మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.ఇక ఐపీఎల్‌-2025 పునఃప్రారంభం నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనా స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే కోహ్లి మైదానంలో దిగబోతున్నాడు.కోహ్లి జీవితంలో అన్నీ ఉన్నాయి.. అదొక్కటే లోటుఒకవేళ ఆర్సీబీ గనుక ఈసారి ట్రోఫీ గెలిస్తే అతడి సంతోషానికి అవధులు ఉండవు. ఆర్సీబీకి వెన్నెముక, ప్రధాన బలం అతడే. తన జీవితంలో అన్నీ ఉన్నాయి.. అయితే, ఆర్సీబీ ట్రోఫీ గెలవకపోవడం మాత్రమే లోటు.ఆర్సీబీకి టైటిల్‌ అందించేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈసారి ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడుతుందనే అనుకుంటున్నా. విరాట్‌ కోహ్లి బ్యాట్‌ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌ జాలువారితే అదేమీ పెద్ద కష్టం కాబోదు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. కోహ్లితో పాటు మిగిలిన పది మంది కూడా రాణిస్తేనే ఇది సాధ్యమవుతుందని రైనా చెప్పుకొచ్చాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. 505 పరుగులు సాధించి.. ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.ఆరెంజ్‌ క్యాప్‌ పోటీలో సూర్యకుమార్‌ యాదవ్‌ (510), సాయి సుదర్శన్‌ (509), శుబ్‌మన్‌ గిల్‌ (508)లతో కోహ్లి పోటీపడుతున్నాడు. కాగా ఆర్సీబీ- కేకేఆర్‌ మధ్య మే 17 నాటి మ్యాచ్‌కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక అన్న సంగతి తెలిసిందే. చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్‌: టీమిండియా మాజీ కోచ్‌

They Advised: Details Of India A Team Selection For England Tour Revealed4
ఇంగ్లండ్‌ టూర్‌: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?

ఐపీఎల్‌-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTV) 2025-27 సీజన్‌ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్‌-‘ఎ’- ఇంగ్లండ్‌ లయన్స్‌ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్‌ 6 నుంచి రెండో మ్యాచ్‌ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్‌ జట్టు, భారత ‘ఎ’ టీమ్‌ మధ్య కూడా జూన్‌ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్‌ జరుగుతుంది.జైసూ, నితీశ్‌, గిల్‌, జురెల్‌ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత్‌-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌ గత సీజన్‌లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్‌ నాయర్‌కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురేల్, నితీశ్ కుమార్‌‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్‌-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్‌-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్‌-‘ఎ’ జట్టులో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్‌ రాయల్స్‌ (యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ రెడ్డి), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రుతురాజ్‌ గైక్వాడ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేసిన భారత్‌- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ జురేల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కరుణ్‌ నాయర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, మానవ్‌ సుతార్, తనుశ్‌ కొటియాన్, ముకేశ్ కుమార్‌, ఆకాశ్‌దీప్, హర్షిత్‌ రాణా, అన్షుల్‌ కాంబోజ్, ఖలీల్‌ అహ్మద్, రుతురాజ్‌ గైక్వాడ్, సర్ఫరాజ్‌ ఖాన్, తుషార్‌ దేశ్‌పాండే, హర్ష్‌ దూబే, శుబ్‌మన్‌ గిల్, సాయిసుదర్శన్‌.చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Not Bumrah: Ravi Shastri Two Picks For Next India Captain Are5
‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్‌’

భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్‌ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌ భారత్‌- ఇంగ్లండ్‌ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్‌ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా రోహిత్‌ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్‌, నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్‌, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్‌ చాయిస్‌.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్‌ తర్వాత కచ్చితంగా జస్‌ప్రీత్‌ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్‌ప్రీత్‌ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్‌ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్‌ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్‌ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్‌ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్‌లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్‌, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్‌ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్‌ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో పెర్త్‌, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Hardik Hasnt Done That: Gavaskar On Reason Behind MI Comeback6
‘ఈసారి హార్దిక్‌ అలా చేయడం లేదు.. అందుకే ముంబై దూసుకెళ్తోంది’

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్‌ ముంబై సారథిని ప్రశంసించాడు.గతేడాది చేదు అనుభవాలుకాగా గతేడాది ముంబై ఇండియన్స్‌, హార్దిక్‌ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.ఖేల్‌ ఖతమే అనుకున్నవేళఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్‌ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.అంతా హార్దిక్‌ వెంట ఉన్నారువరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ ముంబై జట్టు, హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్‌ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.హార్దిక్‌ ఈసారి అలా చేయడం లేదుహార్దిక్‌ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్‌ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.ఒకవేళ కెప్టెన్‌ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్‌ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్‌ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్‌ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు.ధనాధన్‌కాగా ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్‌ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఇక హార్దిక్‌ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్‌ హిట్టర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 510 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Virat Business as Usual: Mo Bobat Says Kohli Focussed on RCB Win in IPL7
IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ టెండుల్కర్‌ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్‌ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్‌లో బెంగళూరుకు టైటిల్‌ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్‌ సెషన్‌ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్‌ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్‌ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్‌ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్‌’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్‌ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్‌ జెర్సీ ‘రెడ్‌ అండ్‌ గోల్డ్‌’లో కాకుండా ‘విరాట్‌ 18’ వైట్‌ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్‌ మో బొబాట్‌ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

IPL 2025 to resume on May 178
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్‌ కౌన్సిల్‌ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతుంది. లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్‌ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు (క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2, ఫైనల్‌) కలిపి మొత్తం ఈ సీజన్‌లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్‌ 3న ఫైనల్‌ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్‌ రెడీ... ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్‌ మిగిలిన లీగ్‌ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్‌ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్‌ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్‌ డేవిడ్‌లతో ఆర్‌సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్‌ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్‌ విషయంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్‌ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్‌ కమిన్స్‌ మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ... సీజన్‌లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్‌ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్‌ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌ చాన్స్‌ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్‌ నిలుస్తుంది.

Los Angeles Olympics 2028 Plans For Air Taxi For Spectators Also9
ఎయిర్‌ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి

లాస్‌ ఏంజెలిస్‌: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్‌ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్‌ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ‘ఎయిర్‌ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్‌ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్‌ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్‌ ఏంజెలిస్‌ మెమోరియల్‌ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్‌ కౌంటీ, హాలీవుడ్‌ వేదికలకు ఎయిర్‌ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్‌ కమిటీ సీఈఓ ఆడమ్‌ గోల్డ్‌స్టెయిన్‌ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్‌ ఏంజెలిస్‌ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్‌కరాజ్‌రోమ్‌: స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ తన కెరీర్‌లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్‌కరాజ్‌ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఒక ఏస్‌ సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్‌కరాజ్‌ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌; రోటర్‌డామ్‌ ఓపెన్‌) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్‌ సినెర్‌ (ఇటలీ), టామీ పాల్‌ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో ఫైనల్లో అల్‌కరాజ్‌ తలపడతాడు.

PKL 12th Season Auction Dates Announced Check Venue All Details10
PKL: పీకేఎల్‌ ఆటగాళ్ల వేలం.. తేదీలు ఇవే

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (Pro Kabaddi League) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియను ఈ నెల 31, జూన్‌ 1 తేదీల్లో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబైలో నిర్వహించే ఈ వేలానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకే 12 ఫ్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేశామని నిర్వాహకులు వెల్లడించారు. కాగా 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన 11 సీజన్లలో 8 వేర్వేరు జట్లు టైటిళ్లు గెలుపొందడం విశేషం. ఈ నేపథ్యంలో కబడ్డీ లీగ్‌లో పలానా జట్టు ఫేవరెట్‌ అనే మాటే లేకుండా ప్రతీ జట్టు టైటిల్‌ కోసం పోరాడుతూనే ఉంది. దీంతో యేటికేడు కబడ్డీ కూతకు ఆదరణ అంతకంతకు పెరుగుతూనే ఉండటం విశేషం. బెంగాల్‌ వారియర్స్‌ కోచ్‌గా నవీన్‌ ఈ ఏడాది జరిగే 12వ సీజన్‌ పీకేఎల్‌ కోసం బెంగాల్‌ వారియర్స్‌ తమ జట్టు హెడ్‌ కోచ్‌గా నవీన్‌ కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం కోచ్‌గానే కాదు... అంతకుముందు ఆటగాడిగాను అతనికి మంచి రికార్డు ఉంది. దక్షిణాసియా క్రీడలు (2006), ఆసియా క్రీడలు (2006), కబడ్డీ ప్రపంచకప్‌ (2007), ఆసియా ఇండోర్‌ క్రీడల్లో (2007) భారత్‌ స్వర్ణాలు గెలిచిన బృందంలో అతను సభ్యుడిగా ఉన్నాడు. కోచ్‌గానూ నిరూపించుకున్నాడు.గతంలో అతను భారత జాతీయ, దేశవాళీ జట్లకు కోచింగ్‌ సేవలందించాడు. భారత నేవి, స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) జట్లకు కోచ్‌గా వ్యవహించాడు. ఆటలో కడదాకా కనబరిచే పోరాటస్ఫూర్తి, ఏ దశలోనూ కుంగిపోని సానుకూల దృక్పథం అతన్ని మేటి కోచ్‌గా నిలబెడుతోంది. 12 ఫ్రాంచైజీలు తలపపడిన గత సీజన్‌లో బెంగాల్‌ పదో స్థానంతో నిరాశపరిచింది.ఈ నేపథ్యంలో వేలానికి ముందే అతన్ని నియమించుకోవడం ద్వారా సరైన ఆటగాళ్ల కొనుగోలు, జట్టు కూర్పు, పటిష్టమైన దళాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభిస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించింది. బెంగాల్‌కు కోచింగ్‌ పట్ల నవీన్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారియర్స్‌ను దీటైన జట్టుగా, బరిలో ఎదురులేని ప్రత్యర్థిగా తయారు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నాడు. చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement