ప్రధాన వార్తలు
గిల్, సూర్య కలిసి వరల్డ్కప్ గెలిపిస్తారు: అభిషేక్ శర్మ
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్గా ఉన్న అతడు.. ఇప్పుడు కనీసం పట్టుమని పది పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తోంది.కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్సూర్య సంగతి ఇలా ఉంటే.. వైస్ కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత ఇరవైకి పైగా ఇన్నింగ్స్లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) నాటికి టీమిండియా పరిస్థితి ఏమిటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ (Suryakumar Yadav)పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా.. సంజూ శాంసన్ను బలి చేసి గిల్కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సూర్య, గిల్పై నమ్మకం ఉందిఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘‘మీడియా ముఖంగా మీ అందరికీ నేనొక మాట చెబుతా.. గుర్తుపెట్టుకోండి. సూర్య, గిల్పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచకప్ టోర్నీలో మ్యాచ్లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్లో జట్టును గెలిపిస్తారు.వీళ్లిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా.. శుబ్మన్తో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో.. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తన సమయం వచ్చినపుడు అతడు చెలరేగి ఆడతాడు.త్వరలోనే మీరు కూడా చూస్తారుసూర్య, గిల్ గురించి నాకు తెలుసు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్ను విమర్శిస్తున్న వారు.. త్వరలోనే అతడి నైపుణ్యాలను కళ్లారా చూస్తారు’’ అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తోంది.వరుస వైఫల్యాలుకాగా అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్గా వస్తున్న గిల్.. సౌతాఫ్రికాతో ఇప్పటి వరు జరిగిన మ్యాచ్లలో చేసిన స్కోర్లు వరుసగా.. 4(2), 0(1), 28 (28). మరోవైపు.. సూర్య చేసిన పరుగులు 12(11), 5(4), 12(11). ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో (17), రెండో టీ20లో (17) తడబడ్డా.. మూడో టీ20లో 35(18) మెరుగ్గా రాణించాడు.ఇదిలా ఉంటే.. కటక్లో తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. ముల్లన్పూర్లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో ధర్మశాలలో జయభేరి మోగించి.. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్-2026 మొదలుకానుంది. ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే ‘బెస్ట్’ ప్లేయర్గా..
Ashes: మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. అతడిపై వేటు
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన పేసర్ గస్ అట్కిన్సన్ను జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో మరో కుడిచేతి వాటం పేసర్నే ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.2-0తో ఆధిక్యంలో ఆసీస్కాగా ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆతిథ్య ఆసీస్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు స్టోక్స్ బృందం అక్కడికి వెళ్లింది. ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ప్రస్తుతానికి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇలా కంగారూలు సొంతగడ్డపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా.. ఇంగ్లండ్ మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా కీలక పేసర్ అయిన గస్ అట్కిన్సన్ (Gus Atkinson) ధారాళంగా పరుగులు (సగటున 78.6) ఇచ్చుకుంటూ.. అదే స్థాయిలో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. రెండు టెస్టుల్లో.. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి అతడు కేవలం మూడే వికెట్లు పడగొట్టాడు.అతడిపై వేటుఈ నేపథ్యంలో అట్కిన్సన్పై వేటు వేసిన ఇంగ్లండ్ జట్టు యాజమాన్యం.. అతడి స్థానంలో మరో రైటార్మ్ పేసర్ జోష్ టంగ్ (Josh Tongue)ను తుదిజట్టుకు ఎంపిక చేసింది. దీంతో మాథ్యూ పాట్స్కు మరోసారి నిరాశే మిగిలింది. ఈ ఒక్క మార్పు తప్ప రెండో టెస్టులో ఆడిన జట్టునే ఇంగ్లండ్ కొనసాగించింది.బషీర్కు మరోసారి మొండిచేయిమరోవైపు.. స్పెషలిస్టు స్పిన్నర్ షోయబ్ బషీర్కు మరోసారి మొండిచేయి చూపిన మేనేజ్మెంట్.. స్పిన్ ఆప్షన్ కోటాలో బ్యాటింగ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ను కొనసాగించింది.ఇదిలా ఉంటే.. ఓవైపు ఆసీస్ పేసర్లు విజృంభిస్తున్న పిచ్లపై ఇంగ్లండ్ సీమర్లు మాత్రం తేలిపోతున్నారు. నిజానికి జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య బుధవారం (డిసెంబరు 17) నుంచి మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్లోని అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక.ఆస్ట్రేలియాతో యాషెస్ మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.చదవండి: అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
కోహ్లి ‘ప్రపంచ రికార్డు’ బ్రేక్ చేసిన తిలక్ వర్మ
టీమిండియా టీ20 స్టార్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ ఛేదనలో అత్యుత్తమ సగటుతో పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు. తద్వారా ఇన్నాళ్లుగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును తిలక్ బద్దలు కొట్టాడు.తొలి రెండు టీ20లలో అలాస్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో బిజీగా ఉన్నాడు తిలక్ వర్మ (Tilak Varma). బ్యాటింగ్ ఆర్డర్లో తరచూ మార్పుల నేపథ్యంలో కటక్ వేదికగా తొలి టీ20లో నాలుగో స్థానంలో వచ్చిన ఈ హైదరాబాదీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.ఇక ముల్లన్పూర్లో జరిగిన రెండో టీ20లోనూ ఇదే స్థానంలో ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఈసారి మాత్రం దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు తిలక్. అయితే, ఈ మ్యాచ్లో అతడి పోరాటం వృథాగా పోయింది.అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్తాజాగా ఆదివారం నాటి మూడో టీ20లో మాత్రం తిలక్ తనదైన మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ధర్మశాలలో మూడో టీ20లో సౌతాఫ్రికా విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనను టీమిండియా 15.5 ఓవర్లలోనే పూర్తి చేసింది.ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 లక్ష్య ఛేదనలో.. కనీసం 500 పరుగులు సాధించిన ఆటగాళ్ల (టెస్టు హోదా కలిగిన దేశాలు) జాబితాలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్గా నిలిచాడు.అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో లక్ష్య ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు (కనీసం 500 పరుగులు)🏏తిలక్ వర్మ (ఇండియా)- 68.0 సగటుతో🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 67.1 సగటుతో🏏ఎంఎస్ ధోని (ఇండియా)- 47.71 సగటుతో🏏జేపీ డుమిని (సౌతాఫ్రికా)- 45.55 సగటుతో🏏సంగక్కర (శ్రీలంక)- 44.93 సగటుతో.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
అక్కడే లాక్ అయిపోయాం: బాండీ బీచ్ ఘటనపై మైకేల్ వాన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆస్ట్రేలియాలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నాడు. తాను కూడా బాండీ బీచ్కు వెళ్లాలనుకున్నానని.. అయితే, రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతే తనను కాపాడిందని పేర్కొన్నాడు. తాను, తన కుటుంబం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నామని తెలిపాడు.కాగా బాండీ బీచ్లో కాల్పుల మోతతో ఆస్ట్రేలియా ఆదివారం ఉలిక్కి పడింది. ఇద్దరు ముష్కరులు తుపాకీలు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సంప్రదాయ హనుక్కా వేడుకలో పాల్గొంటున్న యూదులుపై కాల్పులకు తెగబడి దాదాపుగా పదహారు మందిని పొట్టనబెట్టుకున్నారు.తండ్రీ-కొడుకులేఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 38 మంది గాయపడగా.. ఇది ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరులు తండ్రీ-కొడుకులే కావడం గమనార్హం. వీరు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.పండ్ల వ్యాపారి ధైర్యంమరోవైపు.. వీరిద్దరు ఉన్మాద చర్యకు పాల్పడుతుండగా అహ్మద్ అనే పండ్ల వ్యాపారి ధైర్యం ప్రదర్శించి ఓ ఉగ్రవాదిని చెట్టు వెనుక నుంచి పట్టుకుని.. అతడికే గన్ గురిపెట్టి తరిమేశాడు. ఇంతలో మరో ఉగ్రవాది అతడిపై కాల్పులు జరుపగా అహ్మద్ కుప్పకూలిపోయాడు. ఏదేమైనా అహ్మద్ లేకుంటే మరికొంత మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారే!ఆ శబ్దాలు వినిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ తాజాగా స్పందించాడు. బాండీ బీచ్లో కాల్పులు జరిపిన సమయంలో తాను అక్కడికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపాడు. ‘‘తొలుత ఆ శబ్దాలు విని షార్క్ దాడి చేసిందేమో అనుకున్నాము. అయితే, కాసేపటి తర్వాత చెవులు రిక్కించి వినగా.. అది ఇంకేదో శబ్దమని అర్థమైంది.అపుడు నేను నా కుటుంబంతో కలిసి దగ్గర్లోని ఓ రెస్టారెంట్లో ఉన్నాను. మేము ఆర్డర్ చేసిన పదార్థాల కోసం వేచి ఉన్నాము. ఇంతలో నాకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడుతున్నా.అప్పుడు ఓ బౌన్సర్ తన చేతిలో తుపాకీ పట్టుకుని నా వైపు వేగంగా దూసుకువచ్చాడు. వెంటనే లోపలికి వెళ్లాలని నన్ను హెచ్చరించాడు. బయట జరుగుతున్న దాడి గురించి మాకు అప్పుడే తెలిసింది. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బీచ్లో చాలా మందిని బంధించారని కొంతమంది అన్నారు.లోపలి నుంచి తాళం వేశారుసిడ్నీ, ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇలాంటి దాడులు ప్లాన్ చేశారనే చర్చ నడుస్తోంది. మేమున్న రెస్టారెంట్ తలుపులన్నింటికి లోపలి నుంచి తాళం వేశారు. బయట పరిస్థితి చక్కబడిందని తెలిసిన తర్వాతే మమ్మల్ని పంపించారు. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు మేము అక్కడే లాక్ అయిపోయాం.నా జీవితంలో ఇంతటి భయంకర అనుభవాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. నాతో పాటు నా భార్య, సోదరి, నా ఇద్దరు కుమార్తెలు, వారి స్నేహితురాలు ఇలా.. అందరం అక్కడే ఉన్నాము. పిల్లలు భయపడకుండా నాలో భయాన్ని అణిచిపెట్టుకుంటూ వారికి ధైర్యం చెప్పాను. వారి గురించే నా ఆందోళన, భయం. బయట ఉన్నవారి పరిస్థితి గురించి కూడా బాధేసింది.బీచ్కు వెళ్లాలని మేము అనుకున్నాము. అక్కడే నా కుమారుడు క్రికెట్ ఆడుతూ.. పరుగులు తీస్తుంటే చూశాము. పబ్, రెస్టారెంట్ కాకుండా మా తదుపరి గమ్యం అదే అయి ఉండేది’’ అని ది టెలిగ్రాఫ్నకు రాసిన కాలమ్లో మైకేల్ వాన్ పేర్కొన్నాడు.ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలిఇక ఎక్స్ వేదికగానూ ఇదే విషయంపై స్పందిస్తూ.. ‘‘బాండీ ఘటన సమయంలో మేము రెస్టారెంట్లో లాక్ అయిపోయి ఉన్నాము. ఇప్పుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ వారికి ధన్యవాదాలు.అదే విధంగా.. ఉగ్రవాదిని అడ్డుకుని ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆ హీరోకి మనమంతా రుణపడి ఉండాలి. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికి నా సానుభూతి’’ అని మైకేల్ వాన్ పోస్ట్ పెట్టాడు. కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ కామెంట్రీ కోసం వాన్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చదవండి: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నా.. కానీ: సూర్యకుమార్
సౌతాఫ్రికాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ధర్మశాల వేదికగా సఫారీలను ఏడు వికెట్ల తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో.. గత మ్యాచ్ వైఫల్యాలను అధిగమించి తాజా టీ20లో గెలవడం పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘క్రీడలు మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతాయి. ఈ సిరీస్లో తిరిగి పుంజుకుని ఆధిక్యంలోకి రావడం అత్యంత ముఖ్యమైన విషయం. మేము ప్రస్తుతానికి ఆ పనిని పూర్తి చేశాము.మా బౌలర్లు సూపర్కటక్లో జరిగిన తొలి టీ20లో మాదిరి ప్రాథమిక స్థాయి అంశాల మీద కూడా దృష్టి పెట్టాము. అందుకు తగ్గ ఫలితాన్ని పొందాము కూడా!.. చండీగఢ్ (ముల్లన్పూర్)లో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈసారి మా బౌలర్లంతా సమిష్టిగా రాణించడం కలిసి వచ్చింది.నెట్స్లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాఆ మ్యాచ్లో ఓటమి తర్వాతి సమావేశంలో మా తప్పొప్పుల గురించి లోతుగా చర్చించుకున్నాము. కఠినంగా సాధన చేశాము. ఈ మ్యాచ్లో మేము ప్రయోగాలకు పోలేదు. ఇక నా బ్యాటింగ్ విషయానికొస్తే.. నెట్స్లో నేను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను.కానీ మ్యాచ్లో విఫలమవుతున్నాను. నా ఆధీనంలో ఉన్న ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేందుకు నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను. సరైన సమయంలో సరైన విధంగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి. నేను ఫామ్లో లేనని అనుకోను.అయితే, వీలైనన్ని ఎక్కువ పరుగులు మాత్రం రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్నాం. తదుపరి లక్నో మ్యాచ్పై దృష్టి సారిస్తాం’’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా ధర్మశాల వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది.117 పరుగులే చేసి ఆలౌట్భారత బౌలర్ల విజృంభణకు సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 117 పరుగులే చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (46 బంతుల్లో 61) ఒక్కడే మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారిలో ఫెరీరా(20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు కూల్చగా.. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35) ధనాధన్ దంచికొట్టగా.. శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించాడు.మరోసారి సూర్య విఫలంవన్డౌన్లో వచ్చిన తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులతో అజేయంగా నిలవగా.. కెప్టెన్ సూర్య (12) మరోసారి విఫలమయ్యాడు. తిలక్తో కలిసి శివం దూబే (4 బంతుల్లో 10 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.కాగా సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత బ్యాటర్గా దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా పేసర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. ఈ ఏడాది 18 ఇన్నింగ్స్లో పేసర్ల బౌలింగ్లో 14సార్లు అతడు అవుట్ అయ్యాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని 8.71 సగటుతో కేవలం 122 పరుగులు చేశాడు. ఇక ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నాలుగో టీ20 జరుగుతుంది. ఇందుకు వేదిక లక్నో.చదవండి: Messi: ‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!#ShivamDube finishes things off in style and Team India go 2–1 up in the series.🔥#INDvSA, 4th T20I 👉 WED, DEC 17, 6 PM pic.twitter.com/OjhdlpHs7G— Star Sports (@StarSportsIndia) December 14, 2025
‘గోట్ టూర్’ చీఫ్ ఆర్గనైజర్ జైలుకు!
కోల్కతా: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ ప్రస్తుతం ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా భారత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్కతాలో ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్కతా పోలీసులు జైలుకు తరలించారు. కొన్నిరోజులుగా సాల్ట్లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్బాల్ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్బాలర్ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్స్టార్ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. ఈ ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు.
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మేనియాతో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. మెస్సీ నామస్మరణతో మహానగరం శనివారం మారుమోగ్రిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆద్యంతం చలాకీగా, సరదాగా గడిపిన మెస్సీ.. సరదా కిక్లతో ఫుట్బాల్ను స్టాండ్స్కు పంపించాడు. వాటిని అందుకుని అందుకున్న అభిమానులు ఇదేకదా అసలు ‘కిక్కు’ అంటూ మురిసిపోయారు.కాగా మెస్సీ.. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా సామాన్యులనూ ఆకర్షించిన అంశం.. వారిని ముక్కునవేలేసుకునేలా చేసిన విషయం ఏమిటంటే.. ఈ లెజెండరీ ఆటగాడితో ఫొటో దిగాలంటే ఏకంగా పది లక్షలు చెల్లించాల్సి ఉండటం. అయితే, మెస్సీ రేంజ్ గురించి తెలిసిన వాళ్లు మినమమ్ ఉంటది కదా! అని సరిపెట్టుకున్నారు. తన ఆటతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ సంపాదన.. 2025 నాటికి ఏడు వేల కోట్ల రూపాయలకు పైమాటే అని అంచనా!ఫుట్బాల్కే ఆదరణ ఎక్కువభారత్తో పాటు క్రికెట్ ఆడే దేశాల్లో ప్రఖ్యాతి పొందిన భారత క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (దాదాపు రూ. 1400 కోట్లు), విరాట్ కోహ్లి (సుమారుగా వెయ్యి కోట్లు)లతో పోలిస్తే మెస్సీ సంపాదన చాలా ఎక్కువ. భారత్లో క్రికెట్ మతమైతే.. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్కి ఆదరణ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఒక్కో మెట్టు ఎక్కుతూ..పుట్టుకతోనే మెస్సీ కోటీశ్వరుడేమీ కాదు. చిన్ననాటి నుంచే ఫుట్బాల్పై ఉన్న మక్కువ.. ఆటలో అంకిత భావం, నైపుణ్యాలు అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చాయి. క్లబ్లకు ఆడుతూ పెద్ద మొత్తంలో ఆర్జించిన మెస్సీ.. ఇంటర్ మియామిలో చేరిన తొలి నాళ్లలో నెలకు మిలియన్ డాలర్లకు పైగా పొందాడు. ప్రస్తుతం ఈ క్లబ్ ద్వారా అతడు పొందే ఆదాయం నెలకు 2.67 మిలియన్ డాలర్లుగా ఉందంటే అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక బార్సిలోనా క్లబ్ ద్వారా మెస్సీ లెక్కకు మిక్కిలి ఆర్జిస్తున్నాడు.అంతేకాదు.. టాప్ బ్రాండ్లకు అంబాసిడర్గా పనిచేస్తూ మెస్సీ దండిగా సంపాదన కూడబెట్టాడు. ఉదాహరణకు అడిడాస్, పెప్సీ వంటి బ్రాండ్లు మెస్సీ క్రేజ్ దృష్ట్యా అతడికి ఏడాదికి రూ. 70 మిలియన్లకు పైగా ముట్టజెప్పుతున్నట్లు వివిధ వార్తా సంస్థలు నివేదించాయి.రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారాలుఇవే కాకుండా డిజిటల్ కాయిన్ల రూపంలోనూ అతడు మనీ సేవ్ చేస్తున్నాడు. ఇక ఆట, ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అంతేకాదు.. హోటల్ వ్యాపారాలనూ పెద్ద ఎత్తున విస్తరించాడు. ఇలా అటు క్లబ్లు.. ఇటు ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న మెస్సీ... నికర ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంది. భారత కరెన్సీలో చెప్పాలంటే.. మెస్సీ నెల ఆదాయం సుమారుగా రూ. 41.67 కోట్లు. అంటే ఏడాదికి దాదాపుగా రూ. 500 కోట్లు అన్నమాట. చదవండి: IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
జాతీయ మహిళల చెస్ విజేత నందిత
దుర్గాపూర్: జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన పీవీ నందిత విజేతగా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నందిత 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొమ్మిది గేముల్లో గెలిచిన నందిత, ఒక గేమ్ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయింది. చాంపియన్గా నిలిచిన నందితకు విన్నర్స్ ట్రోఫీతో పాటు రూ. 7 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ)కు చెందిన మేరీ ఆన్ గోమ్స్ 9 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. త్రిపుర అమ్మాయి అర్షియా దాస్ 8.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. శుభి గుప్తా (ఉత్తరప్రదేశ్), కల్యాణి సిరిన్ (కేరళ), సృష్టి పాండే (మహారాష్ట్ర), వర్షిణి (తమిళనాడు), సాచి జైన్ (ఢిల్లీ), ఏజీ నిమ్మీ (కేరళ) 8 పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా వీరి ర్యాంకింగ్ను వర్గీకరించగా వరుసగా 4 నుంచి 9 స్థానాల్లో నిలిచారు. తెలంగాణ అమ్మాయి వేల్పుల సరయు 7.5 పాయింట్లతో 11వ ర్యాంక్ను దక్కించుకుంది. సరయు ఏడు గేముల్లో గెలిచి, మూడు గేముల్లో ఓడిపోయి, ఒక గేమ్ను ‘డ్రా’ చేసుకుంది. తెలంగాణకు చెందిన శివంశిక 7 పాయింట్లతో 21వ స్థానంలో, గాదె శరణ్య 6.5 పాయింట్లతో 33వ స్థానంలో, స్నేహ భరతకోటి 6.5 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పొట్లూరి సుప్రీత 7.5 పాయింట్లతో 14వ స్థానంలో, భీమరశెట్టి శ్రావ్యశ్రీ 7 పాయింట్లతో 18వ స్థానంలో, మోడిపల్లి దీక్షిత 7 పాయింట్లతో 24వ స్థానంలో నిలిచారు. పాయింట్లు సమంగా ఉన్నపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించారు.
సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ
ముంబై: అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ తన ‘గోట్ టూర్’లో భాగంగా రెండో రోజు ముంబైని మురిపించాడు. భారత మాస్టర్ సచిన్ టెండూల్కర్తో కలిసి వాంఖెడేలో సందడి చేశాడు. మామూలుగా అయితే ఈ మైదానంలో టెండూల్కర్ ఉంటే ‘సచిన్... సచిన్...’ అనే గోలే వినిపించేది. కానీ ఆదివారం స్వరం మారింది. యువ తరం, నవతరం అంతా కలిసి తమ ఆరాధ్య క్రికెటర్తో పాటు అభిమాన ఫుట్బాలర్ పేరునూ మార్మోగించారు. దీంతో వాంఖెడే స్టేడియం ‘సచిన్... సచిన్... మెస్సీ... మెస్సీ...’ నామస్మరణతో మార్మోగిపోయింది. సచిన్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్గణ్, టైగర్ ష్రాఫ్, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, పలువురు సెలబ్రిటీలతో స్టేడియమంతా తారతోరణం దిద్దుకుంది. వాంఖెడే పుటల్లో ఈ పూట క్రీడా ప్రపంచంలోనే అలుపెరగని దిగ్గజాలు ప్రత్యక్షంగా మైదానాన్ని, పరోక్షంగా యావత్ భారత్ను అలరించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన పురిటి గడ్డపై జగద్విఖ్యాత ఫుట్బాలర్ లయోనల్ మెస్సీతో కలిసి సందడి చేశాడు. వాంఖెడే స్టేడియంలో దిగ్గజాల భేటీతో సరికొత్త అధ్యాయం ప్రారంభించినట్లయ్యింది. పోటెత్తిన అభిమానులతో కిక్కిరిసిపోయిన స్టేడియంలో వీరిద్దరే కేంద్ర బిందువులయ్యారు. భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి, రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా పుర ప్రముఖులు ఎందరున్నా... వేల కళ్లు సచిన్–మెస్సీల నుంచి చూపును తిప్పుకోలేకపోయాయి. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య దిగ్గజం సచిన్ను విఖ్యాత ఫుట్బాలర్తో కన్నుల పండుగగా చూసుకున్నారు. ఈ సందర్భంగా మహా సీఎం ఫడ్నవీస్ రాష్ట్రంలో యువ ఫుట్బాలర్ల ప్రతిభను సానబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్ మహాదేవ’ పేరిట ఫుట్బాల్ ప్రతిభావంతుల్ని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అపురూపం... పరస్పర బహుమానం అర్జెంటీనా స్టార్కు టెండూల్కర్ తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసిన వన్డే జెర్సీని మెస్సీకి అందివ్వగా... ప్రతిగా మెస్సీ కూడా తన సంతకంతో కూడిన ఫుట్బాల్ను సచిన్కు ఇచ్చాడు. అన్నట్లు ఆటలు వేరైనా... దేశాలు వేరైనా... సచిన్ జెర్సీ నంబర్, మెస్సీ జెర్సీ నంబర్ ఒక్కటే 10! అదేనండీ ‘దస్కా దమ్’’! దిగ్గజాలు పరస్పర బహుమతులు ఇస్తూ స్వీకరిస్తుంటే అభిమానులంతా ఉప్పొంగిపోయారు. ఈ అపు‘రూపం’ను తమ ఫోన్ కెమెరాల్లో పదిలంగా బందీచేసుకున్నారంతా! నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ... ‘గోట్ టూర్’లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లయోనల్ మెస్సీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈరోజు మర్యాదపూర్వకంగా కలువనున్నాడు. మూడు రోజుల ‘గోట్ టూర్’ నేడు ఢిల్లీలో ముగియనుంది. ముంబై నుంచి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత మెస్సీ ఢిల్లీ చేరుకుంటాడు. నగరంలోని క్రీడాభిమానులతో ‘మీట్ అండ్ గ్రీట్’ ముగించుకొన్న తర్వాత మెస్సీ... ప్రధాని మోదీతో భేటీ అవుతాడు. ప్రధాని నివాసంలో దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య జరిగే మాటామంతీలో సాకర్ సూపర్ స్టార్ ఫుట్బాల్ ముచ్చట్లు పంచుకోకున్నాడు. ఆ తర్వాత భారత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ ప్రఫుల్ పటేల్తో కూడా మెస్సీ భేటీ అవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలా పలువురు వీవీఐపీలను కలిసిన తర్వాత మెస్సీ మధ్యాహ్నం 3.30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకుంటాడు. అక్కడ తన అభిమానుల్ని అలరించిన అనంతరం స్వదేశానికి పయనమవుతాడని నిర్వాహకులు వెల్లడించారు. నాకు ఇక్కడ (వాంఖెడే) మరుపేలేని మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. అందుకే మన ముంబై ఒక కలల నగరి. ఈ వేదికపై ఎంతో మంది స్వప్నాలు సాకారమయ్యాయి. 2011 నాకు బాగా గుర్తు. నా కల (వన్డే వరల్డ్కప్) కూడా ఇక్కడే నిజమైంది. ముఖ్యంగా మీ (అభిమానులు) మద్దతే లేకపోతే ఆ స్వర్ణానుభూతిని నేనైతే ఎప్పటికీ చూడలేను. ఇప్పుడు కూడా మెస్సీని ఇక్కడ చూస్తుంటే అలాంటి అనుభూతే కలుగుతోంది. మన యువ ఫుట్బాలర్లను ప్రోత్సహించిన మెస్సీకి మీ అందరి తరఫున, భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. –సచిన్ టెండూల్కర్
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. దీంతో ధర్మశాల వేదికగా సఫారీలతో జరుగుతున్న కీలకమైన మూడో టీ20కు బుమ్రా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల చేత ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడు మూడో టీ20కు అందుబాటులో లేడు. బుమ్రా తదుపరి మ్యాచ్లకు జట్టులో చేరే విషయంపై అప్డేట్ ఇస్తామని" బీసీసీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. ఇక జస్ప్రీత్ స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణా తుది జట్టులో వచ్చాడు. బుమ్రాతో పాటు స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ధర్మశాల టీ20కు దూరమయ్యాడు. దీంతో కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది. అయితే బుమ్రా తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్లో భాగంగా నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నో వేదికగా జరగనుంది. రెండు రోజుల సమయం లభించడంతో అతడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన సఫారీలు తడబడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హర్షిత్ రాణా రెండు , అర్ష్దీప్, హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు.తుది జట్లుదక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్కీపర్), హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిచదవండి: Asia Cup 2025: పాకిస్తాన్ను చిత్తు చేసిన టీమిండియా..
స్టాండ్స్లోకి కిక్ చేసి.. ఉప్పల్లో మెస్సీ చర్య వైరల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించిం...
గ్లోబల్ చెస్ లీగ్.. బరిలో అత్యుత్తమ గ్రాండ్మాస్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: టెక్ మహీంద్రా, ‘ఫిడే’ సంయుక్...
ఫైనల్లో ఉన్నతి
కటక్: టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన భారత బ...
మెస్సీ మాయలో...
‘మెస్సీ కిక్ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ...
హైదరాబాద్కు రెండో విజయం
పుణే: ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ ...
విజృంభించిన బౌలర్లు.. మూడో టీ20లో టీమిండియా గెలుపు
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జ...
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. తొలి భారత ప్లేయర్గా
ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20ల...
టీమిండియాకు ఊహించని షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్
సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా...
క్రీడలు
విశాఖ ఆర్కే బీచ్ లో కోలాహాలంగా నేవీ మేర దాన్ ర్యాలీ (ఫొటోలు)
ఉప్పల్.. ఉర్రూతల్.. మెస్సీ మంత్రం జపించిన హైదరాబాద్ (ఫొటోలు)
మెస్సీ మ్యాచ్.. ఫ్యాన్స్ జోష్! (ఫొటోలు)
18 ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్ 10 ఏళ్లుగా హస్బెండ్.. రోహిత్-రితిక పెళ్లిరోజు (ఫొటోలు)
మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయిన మెస్సీ.. స్టేడియంలో ఫ్యాన్స్ రచ్చ (ఫోటోలు)
కోల్కతాలో మెస్సీ మాయ.. (ఫోటోలు)
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
‘విరుష్క’ పెళ్లి రోజు.. అందమైన ఫొటోలు
బాలిలో చిల్ అవుతున్న షెఫాలీ వర్మ (ఫొటోలు)
హార్దిక్ పాండ్యా సూపర్ షో...తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
వీడియోలు
ధర్మశాలలో భారత్ పంజా..
మెస్సీ మెస్సీ మెస్సీ.. దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
హైదరాబాద్ కు మెస్సీ.. ఫోటో దిగాలంటే రూ.10 లక్షలు!
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ భారీ స్కోర్
సానియా మీర్జా లానే స్మృతి మంధాన కూడా..!
Cricket: ఫైనల్లో దుమ్ములేపిన సాక్షి టీమ్ TV9పై ఘన విజయం
ఊహించినట్టే జరిగింది.. పెళ్లిపై ఇద్దరూ క్లారిటీ
పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇచ్చేసిన స్మృతి
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
