Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Team India opener Abhishek Sharma impressed with an all round performance1
అభిషేక్‌ ఆల్‌రౌండ్‌ షో

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9 బంతుల్లో 34; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు; 3/23) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 54 పరుగుల తేడాతో పుదుచ్చేరిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అభిషేక్‌ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... సలీల్‌ అరోరా (44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాన్‌వీర్‌ సింగ్‌ (38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్‌ ధీర్‌ (37; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో విజయ్‌ రాజా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సిదాక్‌ సింగ్‌ (61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్‌ 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆయుశ్‌ గోయల్‌ 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ 3 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్‌ ‘సి’లో రెండో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 7 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై గెలిచింది. ముంబైకి కేరళ షాక్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టుకు షాక్‌ తగిలింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 15 పరుగుల తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. మొదట కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్‌), విష్ణు వినోద్‌ (43 నాటౌట్‌; 3 ఫోర్లు), మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ (32; 3 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ షర్ఫుద్దీన్‌ (15 బంతుల్లో 35 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ముంబై బౌలర్లలో శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు అనూహ్యంగా ఓడింది. లక్ష్యం పెద్దది కాకపోయినా... ముంబై జట్టు 19.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌ సెంచరీ హీరో సర్ఫరాజ్‌ ఖాన్‌ (40 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో రాణించగా... టీమిండియా టి20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (32; 4 ఫోర్లు), అజింక్యా రహానే (32; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అయితే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కేరళ బౌలర్‌ కేఎమ్‌ ఆసిఫ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తొలి బంతికి సాయిరాజ్‌ పాటిల్‌ (13)ను అవుట్‌ చేసిన అతడు... మూడో బంతికి సూర్యకుమార్‌ యాదవ్‌ను, నాలుగో బంతికి శార్దుల్‌ ఠాకూర్‌ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడిలో పడ్డ ముంబై విజయానికి దూరమైంది. ఆసిఫ్‌ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై, అస్సాం 58 పరుగుల తేడాతో విదర్భపై, ఉత్తరప్రదేశ్‌ 40 పరుగుల తేడాతో చండీగఢ్‌పై, జార్ఖండ్‌ 7 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై, గోవా 5 వికెట్ల తేడాతో బిహార్‌పై, ఢిల్లీ 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, ఒడిశా ఒక పరుగు తేడాతో రైల్వేస్‌పై, మధ్యప్రదేశ్‌ 21 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, తమిళనాడు 61 పరుగుల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి.

McLaren driver Norris comments on Piastri2
నేను గెలిచేందుకు మా వాణ్ని ఓడిపొమ్మంటానా?

అబుదాబి: ఈ సీజన్‌ ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ కోసం జట్టు సహచరుడు పియా్రస్టితో ఎలాంటి మంతనాలు ఉండవని లాండో నోరిస్‌ వ్యాఖ్యానించాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్లలో నోరిస్‌ 408 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్కార్‌ పియాస్ట్రి 392 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. గత ఆదివారం ఖతర్‌ గ్రాండ్‌ప్రి గెలుపొందడంతో రెడ్‌బుల్‌ రేసర్‌ వెర్‌స్టాపెన్‌ (396) రెండో స్థానంలోకి దూసుకురావడంతోనే ఈ సీజన్‌ ‘ఫార్ములా’ ఆఖరి మజిలీకి చేరింది. ఈ ఆదివారం జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రిపై రేసింగ్‌ ప్రియుల ఆసక్తిని పెంచింది. ఈ రేసుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పియాస్ట్రి, వెర్‌స్టాపెన్‌లతో కలిసి నోరిస్‌ పాల్గొన్నాడు. ‘నిజాయితీగా చెబుతున్నా... గెలవాలని నాకున్నా గెలిపించేందుకు సహకరించమని అడగను. దీనికి ఆస్కార్‌ ఒప్పుకుంటాడో లేదో తెలీదు. తప్పనిసరి అని నేను భావించను’ అని నోరిస్‌ స్పష్టం చేశాడు. ఇద్దరు మెక్‌లారెన్‌ డ్రైవర్ల (పియాస్ట్రి, నోరిస్‌)లో నోరిస్‌కే టైటిల్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంతలా అంటే అబుదాబిలో వెర్‌స్టాపెన్‌ గెలిచినా కూడా నోరిస్‌ టాప్‌–3లో ఉంటే చాలు మెక్‌లారెన్‌ జట్టు 17 ఏళ్ల తర్వాత ఫార్ములావన్‌ విజేతగా నిలుస్తుంది. 2008లో హామిల్టన్‌ తర్వాత మరే మెక్‌లారెన్‌ డ్రైవర్‌ విజేతగా నిలువలేకపోయాడు. మరోవైపు వెర్‌స్టాపెన్‌ మాట్లాడుతూ ఆఖరి రేసులో ఏమైనా జరగొచ్చని, రేసు ఆషామాïÙగా ఉండబోదని చెప్పాడు.

Four medals for Telangana swimmers3
తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్‌–19 బాలుర విభాగంలో సుహాస్‌ ప్రీతమ్‌ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సుహాస్‌ 2 నిమిషాల 06.28 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్‌ మొంగం తీర్థు సామ (2ని:11.24 సెకన్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్‌–19 బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్‌ (4ని:40.41 సెకన్లు) రజత పతకం సంపాదించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొంగం తీర్థు సామ (4ని:39.85 సెకన్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అండర్‌–17 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తెలంగాణకు చెందిన ఇషాన్‌ దాస్‌ (25.93 సెకన్లు) రజతం, గౌతమ్‌ శశివర్ధన్‌ (26.25 సెకన్లు) కాంస్యం సాధించారు.

Hyderabad pacer to miss ODIs and T20s4
టెస్టు ఫార్మాట్‌కే పరిమితమా!

దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ కోసం అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ప్రకటించింది. హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ సిరాజ్‌కు ఇందులో చోటు కల్పించలేదు. సిరీస్‌ నుంచి విశ్రాంతి నిచ్చారా అనుకుంటే దానికి ముందు వన్డే సిరీస్‌లో కూడా అతను ఆడలేదు. తగినంత విరామం లభించిన అతను ఇప్పుడుదేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. అంతకుముందు ఆ్రస్టేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో కూడా సిరాజ్‌ను ఎంపిక చేయలేదు. టి20 వరల్డ్‌ కప్‌ చేరువైన నేపథ్యంలో సెలక్టర్ల ఆలోచనను బట్టి చూస్తే సిరాజ్‌కు అవకాశం సందేహంగానే కనిపిస్తోంది. వన్డేల విషయంలో కూడా అతని ఎంపికపై ఎలాంటి స్పష్టతా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాక్షి క్రీడా విభాగం : సరిగ్గా నాలుగు నెలల క్రితం... ఇంగ్లండ్‌ గడ్డపై ఓవల్‌ టెస్టులో అసాధారణ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించిన హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా చివరి రోజు పోరాటయోధుడిలా బౌలింగ్‌ చేసి ప్రత్యర్థిని కుప్పకూల్చిన అతను... భారత్‌ను సిరీస్‌ కోల్పోయే ప్రమాదం నుంచి కాపాడటంతో పాటు ఒక రకంగా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పరువు నిలబెట్టాడు. లేదంటే భారత్‌ 1–3తో ఓడి తిరుగుముఖం పట్టేది. అలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత సిరాజ్‌ ఒక్కసారిగా తెర వెనక్కి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. అసలు భారత జట్టులో ఉన్నాడా లేదా అనే సందేహాల మధ్య అతని ఆట కొనసాగుతోంది. నిజానికి ఇంగ్లండ్‌తో టెస్టుల్లో చెలరేగినా... అప్పటికే అతను వన్డే ఫార్మాట్‌లో తానేమిటో నిరూపించుకున్నాడు. టి20ల్లో కూడా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధించడంతో పాటు ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా రాణిస్తున్న బౌలర్లలో అతనూ ఒకడు. కానీ తాజా పరిణామాలు చూస్తే 31 ఏళ్ల సిరాజ్‌ను ఒక ఫార్మాట్‌కే పరిమితం చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిలకడైన ప్రదర్శన... ఓవరాల్‌గా సిరాజ్‌ వన్డే కెరీర్‌ రికార్డు చాలా బాగుంది. 47 వన్డేల్లో కేవలం 24.67 సగటుతో అతను 73 వికెట్లు పడగొట్టాడు. గత కొంత కాలంగా ఫార్మాట్‌కు తగినట్లు తన ఆటను మార్చుకుంటూ నిలకడైన ప్రదర్శనతో సిరాజ్‌ తనను తాను ‘ఆల్‌ ఫార్మాట్‌ బౌలర్‌’గా మలచుకున్నాడు. ప్రస్తుతం భారత బౌలింగ్‌ దళంలో బుమ్రా తర్వాత నిస్సందేహంగా రెండో స్థానం తనదే. నిజానికి చాంపియన్స్‌ ట్రోఫీలో సిరాజ్‌కు చోటు దక్కకపోవడమే ఆశ్చర్యం కలిగించింది. అంతకుముందు రెండేళ్లలో భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు. బంతి పాతబడితే ప్రభావం చూపలేకపోతున్నాడంటూ కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఇచ్చిన వివరణ కూడా సరైంది కాదని అందరికీ అర్థమైంది. ఓవల్‌ టెస్టు ప్రదర్శనతో పాటు వన్డేల్లో నిలకడైన ప్రదర్శన చూసుకుంటే సిరాజ్‌కు వన్డేల్లోనూ వరుస సిరీస్‌లలో స్థానం లభించాలి. ఆ్రస్టేలియా గడ్డపై ఆడిన 3 వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా కేవలం 4.94 ఎకానమీతో పరుగులివ్వడం చక్కటి ప్రదర్శనే. కానీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వచ్చేసరికి టీమ్‌లో స్థానం లేదు. గత రెండు వన్డేల్లో ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణాల బౌలింగ్‌ ప్రదర్శన చూస్తుంటే సిరాజ్‌ కచ్చితంగా ఇంతకంటే బాగా బౌలింగ్‌ చేసేవాడనే అభిప్రాయం అన్ని వైపుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు టి20లకు కూడా ఎంపిక చేయకపోవడం, త్వరలోనే వరల్డ్‌ కప్‌కు కూడా దాదాపు ఇదే జట్టు ఎంపికయ్యే అవకాశం ఉండటంతో ఈ ఫార్మాట్‌లో సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్థమవుతోంది. విశ్రాంతి ఇచ్చారా...వేటు వేశారా... సిరాజ్‌కు వన్డే, టి20 ఫార్మాట్‌లలో స్థానం లభించకపోవడంపై కావాల్సినంత చర్చ జరగడం లేదని అర్థమవుతోంది. సెలక్టర్లు సాధారణంగా తమ ఎంపికపై ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. ఇటీవల ఒకటి రెండు సందర్భాల్లో చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడినా అసలు సిరాజ్‌ పేరును కూడా ప్రస్తావించనే లేదు. జట్టుకు దూరమైన షమీ గురించి కూడా మాట్లాడిన అగార్కర్‌... రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న ఆటగాడి గురించి సమాచారం ఇవ్వడం లేదు. బుమ్రా ఫిట్‌నెస్, విశ్రాంతి విషయంలో ప్రతీ సిరీస్, ప్రతీ మ్యాచ్‌ సందర్భంగా సెలక్టర్లు స్పష్టతనిస్తున్నారు. అదే సిరాజ్‌కు విశ్రాంతినిచ్చారా లేక వేటు వేశారా కూడా తెలియడం లేదు. సిరాజ్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఎలాంటి గాయాల సమస్యలు లేవు. తాను ఎలాంటి విశ్రాంతి కోరుకోవడం లేదు. ఏ స్థితిలోనైనా మైదానంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టులూ ఆడాడు కాబట్టి విశ్రాంతి అవసరమని భావించి ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదని అనిపించింది. నిజానికి సిరాజ్‌కు విరామం ఇవ్వాలని అనుకుంటే స్వదేశంలో పేసర్లకు ప్రాధాన్యత లేని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఇవ్వాల్సింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను మొత్తం 49 ఓవర్లే బౌలింగ్‌ చేశాడు. వెంటనే దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల్లోనూ ఆడించడం అంటే ఈ ఫార్మాట్‌లోనే అతని అవసరాన్ని చూపించింది. కానీ ఎలాంటి కారణం లేకుండా ఇప్పుడు వన్డే, టి20ల నుంచి అతడిని పక్కన పెట్టారు. లోయర్‌ ఆర్డర్‌లో కొన్ని పరుగులు సాధించే హర్షిత్‌ రాణా వల్ల సిరాజ్‌ స్థానం సందేహంలో పడినట్లు కనిపిస్తోంది. కానీ సిరాజ్‌ లాంటి టాప్‌ బౌలర్‌ను బ్యాటింగ్‌ కారణంగా పక్కన పెట్టడంతో అర్థం లేదు. మున్ముందు సిరాజ్‌ విషయంలో సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

Hardik Pandyas match has changed venue5
జనం తాకిడిని ఊహించి...

సాక్షి, హైదరాబాద్‌: భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫున ఆడుతున్నాడు. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతని మెరుపు ప్రదర్శనను అభిమానులు ప్రత్యక్షంగా చూశారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో జరిగే మ్యాచ్‌లో గుజరాత్‌తో బరోడా తలపడాల్సి ఉంది. అయితే నగరం మధ్యన కీలక ప్రాంతంలో మైదానం ఉండటం... ఫెన్సింగ్‌ మినహా తగిన భద్రతా ఏర్పాట్లు లేని జింఖానా మైదానంలో మ్యాచ్‌పై పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. పాండ్యా ఆట కోసం జనం ఎగబడితే వారిని నిలువరించడం కష్టం కావడంతో పాటు పరిస్థితి పూర్తిగా చేయి దాటే ప్రమాదం ఉండటంతో ఇదే విషయాన్ని బుధవారం రాత్రి హెచ్‌సీఏ అధికారులకు తెలియజేశారు. ఏదైనా అనుకోనిది జరిగితే హెచ్‌సీఏను పూర్తిగా బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. దాంతో ఈ మ్యాచ్‌ను మెరుగైన సౌకర్యాలు ఉన్న ఉప్పల్‌ స్టేడియానికి మార్చాల్సి వచ్చింది. ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన బెంగాల్, సర్వీసెస్‌ మ్యాచ్‌ను జింఖానా మైదానంలో నిర్వహించారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా గుజరాత్‌ 14.1 ఓవర్లలో 73 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్‌ పాండ్యా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. అనంతరం బరోడా 6.4 ఓవర్లలో 2 వికెట్లకు 74 పరుగులు చేసి నెగ్గింది. హార్దిక్‌ పాండ్యా 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుటయ్యాడు. షమీకి 4 వికెట్లు: సర్వీసెస్‌పై బెంగాల్‌ గెలుపుజింఖానా మైదానంలో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. సర్వీసెస్‌ 18.2 ఓవర్లలో 165 పరుగులకుఆలౌటైంది. బెంగాల్‌ జట్టుకు ఆడుతున్న భారత పేసర్లు షమీ 3.2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... ఆకాశ్‌దీప్‌ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బెంగాల్‌ 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి నెగ్గింది. అభిషేక్‌ పొరెల్‌ (56; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిమన్యు ఈశ్వరన్‌ (58; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేసి బెంగాల్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Abhishek sharma all Round show Syed Mushtaq Ali Trophy match against Pondicherry6
అభిషేక్‌ శర్మ విధ్వంసం.. కేవలం 9 బంతుల్లోనే!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్‌.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్‌ మైదానంలో అభిషేక్‌ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్‌దీప్‌ సింగ్‌(34), శన్వీర్‌ సింగ్‌(38) కీలక నాక్స్‌ ఆడారు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్‌ తండా, జయంత్‌ యాదవ్‌ ఒక్క వికెట్‌ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సైదక్‌ సింగ్‌(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్‌ శర్మ బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్‌ గోయల్‌ మూడు, హర్‌ప్రీత్‌ బ్రార్‌ రెండు వికెట్లు సాధించారు.కాగా ఈ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు నుంచి అభిషేక్‌ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్‌ డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: దుమ్ములేపిన మ‌హ్మ‌ద్ ష‌మీ.. ఇప్పటికైనా క‌ళ్లు తెర‌వండి!

Mohammed Shami shines in SMAT to knock on selection doors7
దుమ్ములేపిన మ‌హ్మ‌ద్ ష‌మీ.. ఇప్పటికైనా క‌ళ్లు తెర‌వండి!

దేశ‌వాళీ క్రికెట్‌లో టీమిండియా సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మ‌రోసారి త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ సెల‌క్ట‌ర్లు స‌వాల్ విసిరాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. గురువారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపాడు.తన సీమ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో షమీ కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి సంచలన ప్రదర్శన ఫలితంగా సర్వీస్‌పై 7 వికెట్ల తేడాతో బెంగాల్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సర్వీసస్‌ 18.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మోహిత్‌ అహ్లావాట్‌(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నకుల్‌ శర్మ(32), వినీత్‌(32) రాణించారు. బెంగాల్‌ బౌలర్లలో షమీతో పాటు ఆకాష్‌ దీప్‌ మూడు, ఆఫ్-స్పిన్నర్ వ్రిత్తిక్ ఛటర్జీ రెండు వికెట్లు సాధించాడు.అభిషేక్, అభిమన్యు మెరుపులుఅనంతరం 166 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో చేధించింది. అభిషేక్ పోరెల్‌(56), అభిమన్యు ఈశ్వరన్(58) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ టోర్నీలో బెంగాల్‌కు ఇది నాలుగో విజయం. ఈ గెలుపుతో బెంగాల్( 16) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.సెలక్టర్లపై విమర్శలు..ఇక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీకి జాతీయ జట్టులోకి చోటు ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ల సైతం షమీని ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేల్లోనూ భారత బౌలింగ్‌లో అనుభవం లేమి కన్పించింది. దీంతో అనుభవజ్ఞుడైన షమీని ఎందుకు జట్టులోకి తీసుకు రావడం లేదని మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. షమీ చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్‌నెస్ లోపం పేరిట అతడిని జట్టులోకి తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులోనూ షమీకి చోటు దక్కలేదు.చదవండి: ENG vs AUS: 'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్‌ పరువు కాపాడిన జో రూట్

Joe Root saves Matthew Hayden from MCG nude run after maiden Ashes ton8
'నగ్నంగా నడుస్తానని సవాల్'... హేడెన్‌ పరువు కాపాడిన జో రూట్

యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో రూట్ ఆసీస్ గడ్డపై తన 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించాడు. రూట్‌కు ఆస్ట్రేలియాలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి సెంచరీ. అతడు ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. అయితే రూట్ తన సెంచరీతో ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ ‌ను న్యూడ్ రన్ నుంచి కాపాడాడు.హేడెన్‌ సవాల్‌..ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ముందు రూట్‌పై ఒత్తిడి పెంచేలా హేడెన్‌ ఓ సవాల్ విసిరాడు. ఈ టూర్‌లో రూట్ సెంచరీ చేయకపోతే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తానని ఛాలెంజ్ చేశాడు. అందుకు స్పందిచిన హేడెన్‌ కుమార్తె గ్రేస్ హేడెన్‌ ‌.. ప్లీజ్ రూట్ సెంచరీ చేసి మా నాన్నను కాపాడు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు రూట్ నిజంగానే సెంచరీ చేసి హేడెన్‌ ‌ను సేవ్ చేశాడు.గత 12 ఏళ్లగా ఆస్ట్రేలియా గడ్డపై రూట్ సెంచరీ కోసం పోరాడతున్నాడు. ఇంతకుముందు వరకు ఆసీస్‌లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 89గా ఉంది. ఎట్టకేలకు మూడెంకల స్కోర్‌ను అందుకుని తన సుదీర్ఘ స్వప్నాన్ని అతడు నేరవేర్చుకున్నాడు. రూట్ సెంచ‌రీ చేయ‌గానే హేడెన్ కామెంట‌రీ బాక్స్ నుంచి బ‌య‌ట‌కు సెల‌బ్రేష‌న్ చేసుకుంది. అనంత‌రం ఇంగ్లండ్ లెజెండ్‌ను అత‌డు అభినందించాడు."ఆస్ట్రేలియాలో ఎట్ట‌కేల‌కు సెంచ‌రీ చేసిన జో రూట్‌కు నా అభినంద‌న‌లు. మిత్రమా కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ సెంచ‌రీ కోసం నేను ఎంత‌గానో ఎదురు చూశాను. ప‌ది ఏభైలు త‌ర్వాత నీవు అనుకున్న ల‌క్ష్యానికి చేరుకున్నావు. చాలా సంతోషంగా ఉంది" అని హేడెన్ ఇంగ్లండ్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు.

Alex Carey plucks a blinder running behind to dismiss Gus Atkinso9
వావ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! వీడియో వైరల్‌

బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక అద్భుతం చేశాడు. మిచెల్ స్టార్క్‌, స్కాట్ బోలాండ్ లాంటి ఫాస్ట్ బౌలర్లకు సైతం కారీ స్టంప్స్‌కు దగ్గరలో ఉండి అందరిని ఆశ్చర్యపరిచాడు.స్టంప్స్‌కు దగ్గరలో నిలబడే బౌన్సర్లను సైతం అతడు అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో క్యారీ అందుకున్న ఓ క్యాచ్ తొలి రోజు ఆట మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. కారీ సంచలన క్యాచ్‌..ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్‌.. నాలుగో బంతిని గాస్ అట్కిన్సన్స్‌కు లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. అట్కిన్స‌న్ ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. బంతి కీపర్ వెనుకకు వెళ్లగా క్యాచ్ అందుకోవడానికి కారీ, మార్నస్ లబుషేన్ ఇద్దరూ ప‌రిగెత్తారు. అందుకోసం ఇద్ద‌రు కూడా డైవ్ చేశారు. అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగ‌లిగాడు. లబుషేన్ అత‌డిని ఢీకొన్నప్పటికీ కారీ మాత్రం బంతిని విడిచిపెట్ట‌లేదు. అత‌డి క్యాచ్‌ను చూసి ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌క్క‌న ఉన్న ల‌బుషేన్ సైతం కారీ హ‌త్తుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటి నెటిజన్లు కొనియాడుతున్నారు.రూట్‌ సెంచరీ..ఈ యాషెస్‌ రెండో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌ విరోచిత సెంచరీతో చెలరేగాడు. ఆసీస్‌ గడ్డపై రూట్‌కు ఇదే తొలి టెస్టు సెంచరీ. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌(135), ఆర్చర్‌(32 నాటౌట్‌) ఉన్నాడు. మరోవైపు ఆసీస్‌ స్పీడ్‌ స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.చదవండి: వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్‌ View this post on Instagram A post shared by Aussie Men’s Cricket Team (@ausmencricket)

SMAT 2025: Vaibhav Suryavanshi Hits 46 Runs Aginst Goa10
వైభవ్ మెరుపులు.. సచిన్ కొడుకు అట్టర్ ప్లాప్‌

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో సచిన్ టెండూల్కర్ తనయుడు, గోవా ఆల్‌రౌండర్‌ అర్జున్ టెండూల్కర్ బ్యాట్‌తో రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో పర్వాలేదన్పిస్తున్న అర్జున్‌.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన అర్జున్ తన లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. గురువారం కోల్‌కతా వేదికగా బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ జూనియర్ టెండూల్కర్ బిహార్ పేసర్ సురాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.వైభవ్, గనీ మెరుపులు వృథా..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ గనీ(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. గోవా బౌలర్లలో దీప్‌రాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అర్జున్‌ 2 వికెట్లు సాధించాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని గోవా కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కెప్టెన్‌ సుయాష్‌ ప్రభుదేశాయ్‌(79) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కశ్యప్ బఖలే(64) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.చదవండి: ENG vs AUS: శతక్కొట్టిన జో రూట్‌.. 12 ఏళ్ల నిరీక్షణకు తెర

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement