breaking news
Social Media
-
మెట్రో సేవల్లో అంతరాయం.. చుక్కలు చూసిన ప్రయాణికులు!
సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచిన బెంగళూరులో మంగళవారం సాయంత్రం ఊహించని దృశ్యాలు కనిపించాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయల్దేరిన వేలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. కొందరు గంటల తరబడి స్టేషన్లలో చిక్కుకుపోగా.. మరికొందరు ఇంటికి చేరుకునేందుకు లారీలు, ట్రక్కులెక్కాల్సి వచ్చింది. దీనికి కారణం నగర మెట్రో వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే.బెంగళూరు నమ్మ మెట్రోలో అత్యంత రద్దీగా ఉండేది పర్పుల్ లైన్. అయితే మంగళవారం సాయంత్రం ఈ లైన్లోని కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వద్ద ఓ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ బిజీ లైన్లో రైళ్ల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైట్ఫీల్డ్తో పాటు నగరంలోని కీలక ప్రాంతాలను అనుసంధానించే ఈ మార్గంలో సర్వీసులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.Bengaluru Metro services disrupted on Purple Line after technical fault at Cubbon Park station @OfficialBMRCLhttps://t.co/Q5X1D3FHNn pic.twitter.com/j6PEjSFAo7— ChristinMathewPhilip (@ChristinMP_) June 23, 2026స్టేషన్లలో భారీ రద్దీమెట్రో అధికారులు కొన్ని రైళ్లలోని ప్రయాణికులను మధ్యలోనే దింపేయడంతో ఒక్కసారిగా స్టేషన్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ రవాణా కోసం రోడ్లపైకి రావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది. క్యాబ్లు, ఆటోలకు ఒక్కసారిగా భారీ డిమాండ్ పెరగడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విచిత్రమైన పరిస్థితులు కనిపించాయి.India's Silicon Valley or India's Biggest Infrastructure Failure? IT Employees Forced to Hitch Rides on Trucks After Yet Another Metro BreakdownBengaluru proudly calls itself India's Silicon Valley, a global technology hub that powers innovation, startups, and multinational… pic.twitter.com/qAGDEQfyNj— Karnataka Portfolio (@karnatakaportf) June 24, 2026లారీలు, ట్రక్కులెక్కిన టెక్కీలుఈ గందరగోళంలో ఇంటికి వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు లారీలు, ట్రక్కులు ఎక్కి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాధారణంగా ఐటీ హబ్గా గుర్తింపు పొందిన నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.థర్డ్ వరల్డ్ గవర్నెన్స్..ఈ ఘటనపై స్పందించిన బెంగళూరు దక్షిణ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య Tejasvi Surya.. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. “ఫస్ట్ వరల్డ్ టెక్ టాలెంట్.. థర్డ్ వరల్డ్ గవర్నెన్స్.. ఇదే బెంగళూరి కథ” అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మెట్రో సేవల్లో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, మెట్రో ఆగిపోయిన ప్రతిసారీ నగరం మొత్తం గందరగోళంలో పడిపోతోందని ఆయన విమర్శించారు.First-world tech talent. Third-world governance.That is the story of Bengaluru.Metro disruptions have become alarmingly frequent. And every time the Metro fails, the entire city descends into chaos. Cabs disappear. Autos refuse rides. Citizens are stranded.Yesterday,… pic.twitter.com/0URP0FbtFK— Tejasvi Surya (@Tejasvi_Surya) June 24, 2026రాత్రంతా మరమ్మతులులోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించారు. కొంతసేపటి తర్వాత ఎంజీ రోడ్ నుంచి వైట్ఫీల్డ్ మధ్య పరిమిత సేవలను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీ మాత్రం తగ్గలేదు. రాత్రంతా కొనసాగిన మరమ్మతుల తర్వాత.. బుధవారం ఉదయం 5 గంటల నాటికి సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుతం పర్పుల్ లైన్లో సాధారణ సేవలు కొనసాగుతున్నాయి. -
విజయ్ ఫ్యాన్స్.. ఎంతకు తెగించార్రా?
సినీ తారలపై అభిమానులకు ఉండే ప్రేమ ఒక్కోసారి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. సోషల్ మీడియా, ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ఊహలు వీడియోల రూపంలోనూ ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అగ్రనటుడి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన ఓ ఏఐ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో కనిపించిన సన్నివేశాలు నెటిజన్లను నవ్విస్తుండగా.. అభిమానుల క్రియేటివిటీపై చర్చకు దారి తీస్తున్నాయి.తమిళ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చలో నిలుస్తున్నాయి. సీక్రెట్ ట్రిప్పులు.. కానుకలు, పరోక్షంగా సోషల్ మీడియా పోస్టులతో తొలినాళ్లలో చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత కోర్టు మెట్లు ఎక్కడంతో ఈ అంశం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఇరువైపుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ మధ్యలోఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడం, విజయ్ నెగ్గాక స్వయంగా ఇంటికి వెళ్లి కంగ్రాట్స్ చెప్పడం.. ప్రమాణ స్వీకారంలో త్రిష హడావిడి.. ఇవన్నీ ఒకదాని వెంట మరొకటి ఈ హిట్ పెయిర్ గురించి మాట్లాడుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష శుభాకాంక్షలు ఏ రేంజ్లో చెబుతుందో? అనే ఆసక్తి అభిమానుల్లో కనిపించింది. అయితే.. ఇన్స్టాలో అన్ఫాలో కావడం, విషెస్ తెలియజేయకపోవడం.. విజయ్-సంగీత మధ్య రాజీ కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రావడం అప్పటిదాకా సాగిన చర్చను మరో దారి తీసుకెళ్లింది. HBDCMJosephVijay pic.twitter.com/2jAKGDrMNP— vattikoti vishnu (@vattikotivishnu) June 24, 2026 విజయ్ త్రిష బ్రేకప్ అయ్యిందంటూ గాలి కబుర్లు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఒక రోజు ఆలస్యంగా త్రిష విజయ్కి బర్త్డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. అయితే.. త్రిష షేర్ చేసిన విజయ్ కేక్ కటింగ్ ఫొటో పాతదా? కొత్తదా? అనేదానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఈ ఫొటో ఆధారంగా తీసుకున్న కొందరు అభిమానులు ఏఐ సాయంతో దాన్ని యానిమేటెడ్ వీడియోగా మార్చారు. అయితే అక్కడితో ఆగకుండా తమ ఊహాశక్తికి మరింత పని చెప్పారు. వీడియోలో కేక్ కటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి త్రిషను అక్కడి నుంచి ఎత్తుకెళ్లినట్లు చూపించారు. ఆ తర్వాత విజయ్ కుటుంబ సభ్యులు సడన్ ఎంట్రీ ఇచ్చినట్లు, అందరూ కలిసి బర్త్డే వేడుకలో పాల్గొన్నట్లు సన్నివేశాలు జోడించారు.వైరల్గా మారిన ఏఐ వీడియోవీడియోలో విజయ్ భార్య సంగీత, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా ఆయనతో కేక్ కట్ చేయించి సరదాగా ఉన్నట్లు ఉంది. ఈ వీడియో పూర్తిగా వినోదాత్మక కోణంలో రూపొందించిన ఏఐ క్రియేషన్ అయినప్పటికీ.. అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కొందరు అభిమానులు దీనిని సరదాగా తీసుకుంటూ షేర్ చేస్తుండగా, మరికొందరు “ఫ్యాన్స్ ఊహాశక్తికి హద్దులే లేవు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆ ఊహ నిజమైతే ఎంత బాగుండో అనుకుంటున్నారు.ఏఐ ఎరాలో అభిమానుల క్రియేటివిటీగతంలో అభిమానులు పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ మేడ్ వీడియోలతో తమ అభిమానాన్ని చాటుకునేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంతో నిమిషాల్లో కొత్త కథలు, కొత్త సన్నివేశాలు సృష్టిస్తున్నారు. డైరెక్టర్ల చెర నుంచి తప్పించి తమ ఫేవరెట్ హీరోలను ఫ్లాపులను అడ్డుకున్నట్లు, అలాగే సినిమాల్లో కీలక మలుపులను మార్చేసి.. కథ సుఖాంతాలు చేసినట్లు.. ఇలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అలా కథకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమకు నచ్చిన ముగింపును వీడియో రూపంలో చూపిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ తరహాలోనే విజయ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.அட பாவிண்களா 😭😭😭😭pic.twitter.com/xrz0klnzFd— Kanchipuram Vijay FaN (@VfcKanchipuram) June 24, 2026సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ ఫ్యామిలీ వీడియో పూర్తిగా ‘‘ఏఐ ద్వారా రూపొందించిన ఫ్యాన్ మేడ్ కంటెంట్’’ మాత్రమే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్లవి. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రల ప్రవర్తన, సన్నివేశాలకు వాస్తవ సంఘటనలతో సంబంధం లేదు. అభిమానుల ఊహాశక్తితో రూపొందించిన వినోదాత్మక వీడియోగా దీనిని చూడాలి. -
వహ్! స్మార్ట్ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్ నేరాలకు సమాధి కట్టారు!!
స్మార్ట్ఫోన్.. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ అదే.. కొన్నిసార్లు వ్యసనంగా మారి కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వ్యసనాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ పల్లెటూరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.సైబర్ నేరాలకు దూరంగా ఉంటాం.. వాటి బారిన పడబోం.. అంటూ ఖరీదైన స్మార్ట్ఫోన్లను పగలగొట్టారు ఇక్కడో ఊరి ప్రజలు. పైగా సామూహికంగా వాళ్లంతా ప్రతిజ్ఞ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఉన్న సుఖ్పురి గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో పలువురు యువకులు తమ ఖరీదైన స్మార్ట్ఫోన్లను నేలకేసి కొడుతూ ధ్వంసం చేస్తూ కనిపించారు. మొత్తం 55 ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామంలో స్మార్ట్ఫోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇకపై కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగించాలని నిర్ణయించారు. యువత సైబర్ నేరాల బారిన పడకుండా చూడటం, స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తగ్గించడం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రామ పెద్దలు చెబుతున్నారు.నుహ్ జిల్లా ఎస్పీ డాక్టర్ అర్పిత్ జైన్ ఇటీవల నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులు మార్పు దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రభావంతో గ్రామ యువకులు ఈ ప్రతీకాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా హాజరయ్యారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, మార్పు కోరుకునే వారికి అవకాశాలు కల్పించడం కూడా తమ బాధ్యతేనని వారు పేర్కొన్నారు. సాధారణ జీవితంలోకి తిరిగి రావాలనుకునే వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువతలో తప్పుదోవ పట్టే ధోరణి పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు అయితే మొబైల్ ఫోన్ల కారణంగా కుటుంబాల్లో విభేదాలు పెరిగాయని, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని కూడా పేర్కొన్నారు. అందుకే నేర ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని గ్రామం నిర్ణయించింది.నుహ్ జిల్లా గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ మోసాల్లో గణనీయమైన కేసులు ఈ ప్రాంతంతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కారణంగా కొందరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫిషింగ్ కాల్స్, ఆన్లైన్ మోసాల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.అయితే అదే జిల్లాకు చెందిన సుఖ్పురి గ్రామం మాత్రం వేరే దారి ఎంచుకుంది. స్మార్ట్ఫోన్ను పగలగొట్టడం ద్వారా సమస్య అంతమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే... యువతను నేరాల నుంచి దూరం పెట్టాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచింది. సాంకేతికతతో వస్తున్న సవాళ్లకు తమదైన పరిష్కారం వెతికిన ఓ ఊరు తీసుకున్న నిర్ణయంగా ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. -
వేడుకల పేరిట వికృతం.. మహిళలే టార్గెట్గా మారారా?
ఫ్రాన్స్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. సంగీతం, సంబరాలు, ఆనందానికి ప్రతీకగా నిలిచే భారీ ప్రజా వేడుకలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో ఫ్రాన్స్లో జరిగిన తాజా ఘటన మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. లక్షలాది మంది పాల్గొన్న వార్షిక సంగీత ఉత్సవంలో మహిళలతో అనుచిత ప్రవర్తన, లైంగిక దాడుల ఆరోపణలు, కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఫ్రాన్స్లో ప్రతి ఏడాది నిర్వహించే ప్రముఖ సంగీత ఉత్సవం ఫెటే డీలా ముసిక్యూ(Fête de la Musique) వేడుక ఈసారి విషాదకర ఘటనలతో వార్తల్లో నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో 145 మంది సూదులతో గుచ్చినట్లు ఫిర్యాదులు చేయగా, మహిళలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనల ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఫ్రెంచ్ పోలీసులు 240 మందిని అదుపులోకి తీసుకున్నారు.According to reports, several incidents of violence and vandalism occurred last night during the annual "Music Festival" in Paris. pic.twitter.com/08murQ3w8c— Yumiko (@sin3950) June 22, 2026జూన్ 21న నిర్వహించిన ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరయ్యారు. అయితే వేడుకల సమయంలో అనేక మంది మహిళలు, యువతులు తమకు గుర్తుతెలియని వ్యక్తులు సూదులతో గుచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 145 కేసులు నమోదవగా, వాటిలో 13 ఘటనలు పారిస్లోనే చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించి టాక్సికాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూదుల్లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేదా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.Every year, France's Fête de la Musique ends the same way. This year: violence, thefts, sexual assaults, vandalism, and over 240 arrests.THIS TELLS YOU MORE ABOUT THE FRENCH POLITICAL CLASS THAT ENDORSES THE FÊTE THAN IT DOES THE FÊTE DE LA MUSIQUE.pic.twitter.com/ITQIUS8p5u— Steve Hanke (@steve_hanke) June 22, 2026వేడుకలకు ముందు సోషల్ మీడియా వేదికలపై మహిళలను లక్ష్యంగా చేసుకోవాలంటూ కొన్ని పోస్టులు వైరల్ కావడం ఆందోళన కలిగించింది. ఆ హెచ్చరికల తర్వాతే ఈ ఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు కుట్ర కోణంలోనూ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా, ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఒక 17 ఏళ్ల యువకుడు కత్తిపోట్లతో ఆసుపత్రిలో చేరగా, మొత్తం 14 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 13 మంది భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలు ఫ్రాన్స్లో మహిళల భద్రత, భారీ ప్రజా వేడుకల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీశాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు.France’s annual Fête de la Musique was marred by widespread disorder overnight, with authorities making 243 arrests across the country. pic.twitter.com/9BW8oWf2K1— theshadeborough (@theshadeborough) June 23, 2026ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొనే ఈ ఉత్సవం ఫ్రాన్స్ సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. వీధులు, పార్కులు, ప్రజా ప్రదేశాలు సంగీతంతో మార్మోగే ఈ వేడుక ఈసారి మాత్రం భద్రతా లోపాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒకప్పుడు సంగీత సంబరాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవం.. ఈసారి మాత్రం భయం, ఆందోళన, భద్రతా వైఫల్యాల చర్చలకు కేంద్రబిందువుగా మారింది. మహిళల భద్రత, భారీ ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లు, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న హింసాత్మక పిలుపులపై ఫ్రాన్స్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
రెండేళ్ల నిరీక్షణ.. సీఎం హామీతో తల్లి కన్నీళ్లు
యువ డాక్టర్ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేసింది. రెండేళ్లు గడిచినా.. బాధితురాలి కుటుంబం న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో న్యాయం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని విన్న బాధితురాలి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. కళ్లలో నీళ్లు తిరిగాయి. “అధికారం కోసం కాదు.. నా కూతురికి న్యాయం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సభలో హృదయాలను కదిలించాయి.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి Suvendu Adhikari మాట్లాడుతూ.. సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ (RG Kar) మెడికల్ కాలేజ్ వైద్యురాలి కేసు గురించి మాట్లాడారు..“ఆర్జీ కర్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుంది. బెంగాల్ ప్రజలు అభయకు(బాధితురాలికి పెట్టిన పేరు) న్యాయం జరగాలని ఓటు వేశారు” అని సీఎం ప్రకటించారు.ఈ మాటలు విన్న వెంటనే బాధితురాలి తల్లి.. పానిహటి ఎమ్మెల్యే రత్నా దేవనాథ్ (Ratna Debnath) భావోద్వేగానికి గురయ్యారు. సభలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో తోటి ఎమ్మెల్యేలు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.A deeply emotional scene in the Assembly. As Ratna Debnath broke down, CM @SuvenduWB Da’s message was clear: Bengal will do justice to victims of RG KAR & punish my culprits. pic.twitter.com/7L62uLGYLQ— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 23, 2026నా కూతురి కోసమే.. ఆర్జీ కర్ కేసులో న్యాయం కోసం వీధుల నుంచి న్యాయస్థానాల వరకు పోరాడిన రత్నా దేవనాథ్.. చివరకు రాజకీయాలనే మరో వేదికగా ఎంచుకున్నారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహటి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మహిళల భద్రత, తన కుమార్తెకు న్యాయం అనే అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్పై 28,836 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రత్నా దేవనాథ్కు 87,977 ఓట్లు రాగా, ప్రత్యర్థి అభ్యర్థికి 59,141 ఓట్లు లభించాయి. రాజకీయాల్లోకి రావడంపై ఆమె అప్పట్లో స్పందిస్తూ.. “వ్యవస్థలో ఉండి పోరాడితేనే నా కూతురికి న్యాయం సాధించగలనని భావించాను” అని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి న్యాయం జరుగుతుందని ప్రకటించగానే, రెండేళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటపడింది.ఆనాడు ఘోరంగా..2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్& హాస్పిటల్లో.. విధుల్లో ఉన్న 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్ మృతదేహం ఆసుపత్రి ప్రాంగణంలో లభించింది. దర్యాప్తులో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య వర్గాల్లో, మహిళా సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. జస్టిస్ ఫర్ అభయ పేరిట వైద్య సిబ్బంది అంతా ఉద్యమంలో పాల్గొన్నారు. బాధితురాలి అసలు పేరును వెల్లడించకుండా నిరసనకారులు ఆమెను ‘అభయ’ (నిర్భయ, భయంలేని) అనే ప్రతీకాత్మక పేరుతో సంబోధించారు.కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?ఈ కేసులో కోల్కతా పోలీసులకు చెందిన సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా దోషిగా తేలాడు. అతడికి జీవిత ఖైదు విధించారు. అయితే ఈ ఘటన వెనుక మరింత పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఇందులో భాగమయ్యారని, అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో నిజాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బెంగాల్ పోలీసులు విఫలమయ్యారన్న విమర్శల నేపథ్యంలో.. కేసును సీబీఐకి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే వస్తోంది.ముగ్గురు ఐపీఎస్లపై వేటుతాజాగా ఆర్జీకర్ కేసు స్టేటస్ను సీఎం సువేందు అధికారి అసెంబ్లీలో తెలియజేశారు. కేసు దర్యాప్తులో లోపాల కారణంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అలాగే ఘటన సమయంలో ఆసుపత్రి ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్(Sandip Ghosh) ను కూడా తొలగించినట్లు చెప్పారు. “ఈ కేసులో ఏదీ దాచిపెట్టం. పూర్తి నిజం బయటకు తీసుకొస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.ఉపేక్షించేది లేదుఆర్జీ కర్ కేసుతో పాటు హన్స్ఖాలి, కామ్దుని, కస్బా లా కాలేజ్, రాంపూర్హాట్ వంటి పలు అత్యాచార, మహిళలపై దాడుల కేసులను ప్రస్తావించిన సీఎం.. తమ ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రకటించారు. -
అగ్నిపర్వతం బుసలు.. ప్రాణాల కోసం పరుగులు!
Volcan de Fuego.. అమెరికాలో అగ్నిపర్వతం బద్ధలైంది. గ్వాటెమాలాలో అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద, పొగ, వేడి లావా వెలువడింది. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిపడిన బూడిద మేఘాలు, పేలుళ్ల వంటి శబ్దాలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. దీంతో సమీపంలో ఉన్న పర్యాటకులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.వివరాల మేరకు.. సెంట్రల్ అమెరికా (Centrel America)లోని గ్వాటెమాలా (Guatemala)లో వోల్కన్ డీఫ్యూగో (Volcan Defugo) అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు వెలువడ్డాయి. ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు పొగలు విరజిమ్మాయి. అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా మంటలు, మండుతున్న రాళ్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. దాంతో ఆ పర్వత పరిసరాల్లో ఉన్న పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది.#Video 🧗🏽♀️🌋 Circula en redes sociales un video en donde durante el ascenso de un grupo de excursionistas al Volcán de Fuego, en #Guatemala, el coloso registró una erupción repentina que lanzó ceniza, rocas y material volcánico. pic.twitter.com/zhNlXA4lpp— Canal 13 Oaxaca (@canal13oaxaca) June 22, 2026 ఒక వీడియోలో ఒక పర్యాటకుడు ‘ఓరి దేవుడా, ఇది మరీ దారుణం. పరుగెత్తండి, పరుగెత్తండి..!’ అని అరుస్తూ పరుగులు తీశాడని స్థానికులు తెలిపారు. ఒక పర్యాటకుడు కుక్కను పట్టుకుని సురక్షిత ప్రదేశానికి తీసుకువెళుతుండగా.. మరికొందరు కింద పడుతున్న శిథిలాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. కాగా, గ్వాటెమాల నగరానికి నైరుతి దిశలో సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఈ వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఉన్నది. గ్వాటెమాలాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా ఇది పరిగణించబడుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Guatemala: Drone footage of the first seconds of the Fuego volcano eruption. pic.twitter.com/ClBvGCrmT7— ((Hurkle Durkling)) 🇺🇸 🤟 🇮🇱 (@durklinghurkle) June 22, 2026అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు సూచనలు జారీ చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. అయితే ప్రకృతి విపత్తులు ఎంత ఆకస్మికంగా సంభవిస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. పర్యాటకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.🌋 Lo que comenzó como una excursión terminó en una carrera por la supervivencia.Un grupo de senderistas fue sorprendido por una repentina erupción del Volcán de Fuego, en #Guatemala. Las imágenes muestran cómo los excursionistas corren para ponerse a salvo mientras columnas de… pic.twitter.com/mg6LJ0QfBc— GlobaLAT (@globaLATvideo) June 22, 2026 -
భార్యకు సర్ప్రైజ్.. భర్తకేమో బిగ్ షాక్!
ఆయనకు భార్య అంటే ఎంతో ఇష్టమట!. అందుకే ఈసారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా జరపాలని డిసైడ్ అయ్యాడు. అర్థరాత్రి వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. రాజసంగా కనిపించే వేదికను సిద్ధం చేశాడు. ఆపైనే.. ఏదైతే చేయకూడదో ఆ పనే చేసి చిక్కుల్లో పడ్డాడు!. ప్రేమతో ప్లాన్ చేసిన వేడుక చివరకు ఆ కుటుంబానికే పెద్ద తలనొప్పిగా మారింది.అస్సాంలోని గువాహటికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ బరువా తన భార్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 22 అర్థరాత్రి ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకను ఇంట్లో గానీ, ఫంక్షన్ హాల్లో గానీ కాకుండా నగరంలోని కుమార్ భాస్కర్ వర్మ ఫ్లైఓవర్పై నిర్వహించడం వివాదానికి దారి తీసింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఫ్లైఓవర్పై బెలూన్లతో అలంకరణలు చేశారు. రోడ్డుపై రెడ్కార్పెట్ పరిచారు. పలువురు స్నేహితులు, బంధువులు అక్కడికి చేరుకుని పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. కొన్ని కార్లను ఫ్లైఓవర్పైనే నిలిపివేసి వేడుక నిర్వహించారు. ఇక్కడే అసలు చేయకూడని పని చేశాడాయన.భార్యను ఇంప్రెస్ చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నా.. ఫ్లైఓవర్ను పార్టీ హాల్గా మార్చేయడం మాత్రం పోలీసులను ఇంప్రెస్ చేయలేదు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రజల కోసం నిర్మించిన ఫ్లైఓవర్ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం ఏంటని ప్రశ్నించారు. ట్రాఫిక్, ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. దీంతో గువాహటి పోలీసులు రంగంలోకి దిగారు.14 మంది అదుపులోకిదర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గౌతమ్ బరువాను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడితో పాటు వేడుకలో పాల్గొన్న భార్య సహా మొత్తం 14 మందిని ప్రశ్నల కోసం అదుపులోకి తీసుకున్నారు. వేడుకలో ఉపయోగించిన నాలుగు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Businessman Gautam Baruah was detained by Bharalumukh Police on Monday after a video showing a birthday celebration atop the Kumar Bhaskar Varma Flyover in Guwahati went viral on social media.According to police officials, Baruah was summoned for questioning in connection with… pic.twitter.com/TSRHU8nZ2t— Hate Detector 🔍 (@HateDetectors) June 23, 2026కేసులు నమోదుగౌతమ్ బరువాపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పబ్లిక్ న్యూసెన్స్కు సంబంధించిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఇదంతా చూసిన వాళ్లు.. ఇంత ప్రేమ చూపించాలా బాస్!" అని కొందరు, ఇలాంటి ఐడియాలు మాకెందుకు రావు? అని కొందరు భర్తలు లోలోపల కుళ్లుకుని ఉండొచ్చనే జోకులు పేలుతున్నాయి. -
రూ. 50 రైడ్కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్ ఘరానా దందా
ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.అసలేం జరిగింది?శాను అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు.రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్ చేశారని, అప్పుడు అబ్యాక్గ్రౌండ్లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు.ఇదీ చదవండి: లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్చివరికి ఆ యువకులు బ్రతిమిలాడి, బేరసారాల తరువాత డిరూ. 2,400 చెల్లించడానికి అంగీకరించడంతో ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. ఆ యువకుల వద్ద అంత నగదు లేకపోవడంతో యూపీఐ (UPI) ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఇంజనీర్ శాను ఆ యూపీఐ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ, ఈ డిజిటల్ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు. మరి బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంBangalore auto walas are brutal to innocent people!Hoping to earn their livelihood, two young boys from a village just reached SMVT railway station. They took an auto to Attibele as they wanted to go to Hosur.After the ride, the auto driver demanded ₹3000 just for 35 km???…— Sanu (@SanuThink) June 22, 2026నెటిజన్ల ఆగ్రహంఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుండి బెంగళూరుకు వచ్చే విద్యార్థులు, యువతకుఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తాయని, ఇది నగరం పేరును చెడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Dr Dhivya Dhyana (@drdhivyadhyana)జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇరాన్ అజేయం.. ట్రంప్నకు కునుకు కరువు!
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు.. మరోవైపు ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా గడ్డపై అడుగుపెట్టడమే సవాల్గా మారిన ఇరాన్ ఫుట్బాల్ జట్టు.. ఇప్పుడు వరల్డ్కప్లో అజేయంగా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మైదానంలో ఇరాన్ పోరాటం ఎంత చర్చనీయాంశమవుతుందో.. సోషల్ మీడియాలో ట్రంప్పై వస్తున్న మీమ్స్ కూడా అంతే వైరల్గా మారుతున్నాయి.2026 ఫిఫా వరల్డ్కప్లో ఇరాన్ జట్టు కేవలం ఆటతోనే కాదు.. తమ పట్టుదల, సహనంతో కూడా వార్తల్లో నిలుస్తోంది. గ్రూప్-జీలో తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో 2-2తో డ్రా చేసిన ఇరాన్.. తాజాగా బెల్జియంతో జరిగిన మ్యాచ్లో 0-0తో సమం చేసి రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి లేకుండా నిలిచింది.అయితే ఈ ఫలితాల కంటే ఎక్కువగా చర్చకు కారణమైనది ఇరాన్ జట్టు ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులే. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా పరిమితుల కారణంగా జట్టుకు అమెరికాలో పూర్తిస్థాయిలో బస చేసే అవకాశం లేకపోయింది. దీంతో ఇరాన్ జట్టు మెక్సికోలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకుని, ప్రతి మ్యాచ్ కోసం సరిహద్దు దాటి అమెరికాకు ప్రయాణించాల్సి వచ్చింది. అయితే..కఠిన భద్రతా తనిఖీలు, ప్రయాణ ఇబ్బందులు, యుద్ధ ఉద్రిక్తతల మధ్య కూడా ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే బెల్జియంతో మ్యాచ్ ముగిసిన తర్వాత లాస్ ఏంజెలెస్ స్టేడియం లాకర్రూమ్లో ఆటగాళ్లు వదిలి వెళ్లిన ఓ భావోద్వేగ లేఖ వైరల్గా మారింది. “మేం గౌరవంగా బయలుదేరుతున్నాం” అంటూ అందులో పేర్కొన్న సందేశం అభిమానులను కదిలించింది.ఇరాన్ ప్రధాన కోచ్ అమీర్ ఘాలెనోయీ కూడా జట్టు పరిస్థితిని వివరించారు. “గత ఆరు నెలలు యుద్ధ వాతావరణంలో గడిచాయి. దేశీయ లీగ్ సక్రమంగా జరగలేదు. అనేక జట్లు మాతో స్నేహపూర్వక మ్యాచ్లు ఆడటానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్కు వచ్చి రెండు మ్యాచ్ల్లో ఓడిపోకుండా నిలవడం గొప్ప విజయమే” అని వ్యాఖ్యానించారు.pic.twitter.com/kQUwdEcCR4— BeeCeeForty5 🐐 (@BeeCeeForty5) June 21, 2026ఇక సోషల్ మీడియాలో అయితే ఈ విజయానికి మరో కోణం జత అయ్యింది. అమెరికాతో రాజకీయ ఘర్షణలు కొనసాగుతున్న వేళ.. “అమెరికా గడ్డపై ఇరాన్ అజేయం”, “ట్రంప్కు నచ్చని రికార్డు ఇదే”, “ఇరాన్ అమెరికా నేలపై ఓటమి తెలియని జట్టు”, ‘‘ఆయనకు ఈ వార్త నచ్చదేమో’’ అంటూ నెటిజన్లు మీమ్స్తో హల్చల్ చేస్తున్నారు.ప్రస్తుతం రెండు మ్యాచ్ల్లో రెండు పాయింట్లతో ఉన్న ఇరాన్.. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్ల్లో ఏమవుతుందో పక్కనపెడితే.. అన్ని అవరోధాల మధ్య అమెరికా గడ్డపై అజేయంగా నిలవడం ద్వారా ఈ ప్రపంచకప్లో ఇరాన్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.donald trump writing a felony against iran pic.twitter.com/yyvpw9UjBy— 𝖔𝖗𝖊. (@oretrafford) June 21, 2026Iran just made the host country's soil their personal playground lmaoo this is too funny 😭 pic.twitter.com/jtSmaFGtJR— ColdRevs 🏎️ (@ColdRevs) June 21, 2026రాజకీయంగా ఒత్తిళ్లు, భద్రతా సవాళ్లు, ప్రయాణ కష్టాలు.. అన్నింటినీ అధిగమించి ఇరాన్ జట్టు వరల్డ్కప్లో నిలబడిన తీరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మైదానంలో సాధించిన ఈ ‘అజేయ’ ప్రయాణం.. ట్రంప్ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా సెటైర్లకు కూడా కారణమవుతోంది. ఇరాన్ తదుపరి మ్యాచ్లో ఏమి చేస్తుందన్నదానికంటే.. ఇక్కడివరకు ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద కథగా మారింది. -
బిత్తర పోయిన పాక్ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన ఈ చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని తొలుత ప్రకటించినప్పటికీ.. వేదికపై మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు, ప్రోటోకాల్ వివాదాలు, ఆకస్మిక వాకౌట్లు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య చోటుచేసుకున్న హావభావాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల తొలి దశ ప్రారంభం నుంచే ఉత్కంఠభరిత వాతావరణంలో సాగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఈ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, ప్రోటోకాల్ అంశాలు మొదట్లోనే వివాదానికి దారితీశాయి.This was humiliation. No one in modern history has made America wait and beg for negotiations. This was the moment JD Vance should have returned to Washington. The Islamic regime did this on purpose. Trump, if you don't understand politics, you should at least understand… pic.twitter.com/NVWAxr8NMH— Amjad Taha أمجد طه (@amjadt25) June 21, 2026ముందుగా నిర్ణయించిన హ్యాండ్షేక్, జాయింట్ ఫోటో సెషన్లో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనకపోవడం చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఫోటో-ఆప్ను తిరస్కరించి సమావేశ వేదిక నుంచి బయటకు వెళ్లినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.ఈ ఆకస్మిక పరిణామాల మధ్య, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కొద్దిసేపు ఏదో సమాచారం అందించినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ వెంటనే ఇరాన్ బృందం వేదిక నుంచి వాకౌట్ చేయడంతో షెహబాజ్ షరీఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారని, పక్కనే ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో వెంటనే చర్చించిన దృశ్యాలు వైరల్గా మారాయి. అదే.. సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పరిస్థితిని గమనిస్తూ.. షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ వద్దకు వెళ్లి కొద్దిసేపు మాట్లాడినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ కారణం గురించి ఆయన ఆరా తీసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు.. పలకరింపుల సమయంలోనూ అమెరికా ప్రతినిధి అయిన జేడీ వాన్స్కు ఘోర అవమానం జరిగింది!. ఖతార్ ప్రతినిధి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ను పలకరించి జేడీ వాన్స్ను పట్టించుకోనట్లు చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో జేడీ వాన్స్ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసినట్లు ఉంది. ఖతార్ ప్రతినిధి చేసిన పనితో పాక్ ప్రధాని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా సోషల్ మీడియాలో “ప్రోటోకాల్ స్నబ్”గా(అధికారిక కార్యక్రమాల్లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా లేదంటే నిర్లక్ష్యంగా సరైన గౌరవం ఇవ్వకుండా వదిలేయడం) చర్చకు దారితీసింది.Watch Qatar snub Vance. So embarrassing. pic.twitter.com/RWSpcsL5IU— 🇺🇸 Pamela Geller 🇮🇱 (@PamelaGeller) June 21, 2026ఇక.. మీటింగ్ హాల్లోకి ఇరాన్ విదేశాంగ మంత్రి తిరిగి ప్రవేశించినప్పుడు, అమెరికా బృందం సభ్యులు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్తో ఒకే గదిలో స్వల్ప క్షణాల పాటు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ ప్రతినిధులు కొంత దూరం పాటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిణామాలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు ఊపందుకున్నాయి. “అమెరికాకు దౌత్యపరమైన ఎదురుదెబ్బా?”, “ఇది ప్రోటోకాల్ ఉల్లంఘనా?”, “ఇరాన్ వ్యూహాత్మక వాకౌటా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య వైరల్గా మారాయి.అయితే మరోవైపు ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వ బృందాలు మాత్రం చర్చలు పూర్తిగా విఫలమయ్యాయన్న వార్తలను ఖండించాయి. తొలి దశ చర్చలు సుమారు 80 నిమిషాలు కొనసాగిన తర్వాత ఇరాన్ బృందం అంతర్గత సంప్రదింపుల కోసం తాత్కాలికంగా బయటకు వెళ్లినట్లు అధికారిక సమాచారం చెబుతోంది. ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక ఆంక్షల ఉపసంహరణ, నిలిచిపోయిన నిధుల విడుదల, చమురు ఆంక్షలపై సడలింపులు వంటి అంశాలపై సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి. ఖతార్ సహకారంతో కొన్ని కీలక ప్రక్రియలు ప్రారంభమైనట్లు సమాచారం బయటకు వచ్చింది.మొత్తం మీద, స్విట్జర్లాండ్ వేదికపై జరిగిన ఈ చర్చలు ఒకవైపు ఉద్రిక్తతలు, వాకౌట్లు, ప్రోటోకాల్ ఘర్షణలతో సాగినా.. మరోవైపు కొంత పురోగతి సంకేతాలు కూడా కనిపించాయని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ కనిపించిన హావభావాలు, ఆకస్మిక పరిణామాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. -
తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్లోనే అరుదైన ఘటన
చెన్నై: తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తుత్తూకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ (Funnel Cloud) కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని "టోర్నడో అలీ" ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తుత్తూకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.Fascinating view of rare tornado taken from #Thoothukudi Airport parking space. The Tornado emerged at Vagaikulam recks damage to a toll plaza on Thoothukudi - Tirunelveli National Highway, before disappearing at airport. @xpresstn @NewIndianXpress #Tornado pic.twitter.com/wWhOhIJy6u— Godson Wisely Dass (@tnie_godson) June 21, 2026ఆదివారం సాయంత్రం తూత్తుకుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత (Atmospheric Instability), తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండటంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తిస్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీని వల్ల టోల్ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. தூத்துக்குடி: வாகைகுளம் பகுதியில் சுழல் காற்று.. வைரலாகும் காட்சிகள். அரிதினும் அரிதான நிகழ்வு என சுயாதீன வானிலை ஆய்வாளர் பிரதீப் ஜான் பதிவு#Thoothukudi | #Tornado pic.twitter.com/8PBBwrp8ub— PttvOnlinenews (@PttvNewsX) June 21, 2026టోర్నడో అంటే ఏమిటి?టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం (Thunderstorm Cloud) నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాకినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.Thoothukudi Airport 😯😲 💥 pic.twitter.com/9O9mp6JOQI— Amutha (@Amutha74247715) June 22, 2026#WATCH | Thoothukudi, Tamil Nadu | Strong cyclonic winds cause heavy damage in the region.(Visuals from the Vaagaikulam toll plaza area) pic.twitter.com/39TfpIilzs— ANI (@ANI) June 22, 2026 -
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
50 ఏళ్ల వయసులో కాలేజ్కి వెళ్తున్న మహిళ..!
చదువుకి వయసు పరిమితి కాదని చాలామంది నిరూపిస్తున్నారు. అదే కోవలోకి మరో మహిళ వచ్చింది. అందుకు సంబంధించి వీడియోని నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో ‘గైస్ ఈ రోజు నాకు పరీక్ష ఉంది’ అంటూ మొదలవుతుంది. ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న విద్యార్థులతో పరీక్ష కేంద్ర వైపుకి వెళ్తున్నట్లు చెబుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దశాబ్దాల క్రితం చదువు వదిలేసిన ఆమె పరీక్షకు సిద్దమవుతున్నప్పుడు సహజంగా విద్యార్థులు పడినట్లుగానే చిన్నపాటి టెన్షన్ ఉందని చెబుతోంది వీడియోలో. తను బ్యాక్లాగ్ పేపర్ ఒకటి క్లియర్ చేయడానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె ఈ వీడియోకి ‘చదువుకోవడానికి వయసు పరిమితి కాదు’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. అంతేగాదు సుదీర్ఘ విరామం తర్వాత చదువుని కొనసాగించినందుకు చాలామంది ఆ మహిళను ప్రశంసించారు. మరికొందరు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని, నేర్చుకోవడానికి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ఆలస్యం కాదని ఆమె ఉదంతం నిరూపిస్తోందంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Manju narang (@student_at_50) (చదవండి: మేమున్నాం అనే భరోసా చాలు) -
‘మోగ్లీ గర్ల్’ పూజ ఇక లేదు
అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్ (18) ఇక లేదు.చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్ అలియాస్ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్ 15నే మరణించిందట. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. అయితే జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.ఎహ్సాస్ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.ఎహ్సాస్ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు."ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘మోగ్లీ గర్ల్’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది. -
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
సోషల్మీడియాలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్ లంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్పై విన్యాసాలు చేయడం చూశారా? తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్ చేశారు. రన్నింగ్ బైక్పై బైక్ హ్యాండిల్ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.రన్నింగ్ బైక్పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు. View this post on Instagram A post shared by Viral Controversy (@viralcontroversy) నెటిజన్ల ఫన్నీ కామెంట్స్"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్ చేశారు.నోట్ : అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి. సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు ఏదో థ్రిల్ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
అమెరికాలో రోజు రోజుకి అస్తవ్యస్థంగా మారిపోతున్న వైద్య వ్యవస్థ, సేవల్లో జాప్యం, ఖరీదైన వైద్యంలాంటి వాటిపై ఇప్పటికే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇండియాలో హెల్త్కేర్ సిస్టం, అందిస్తున్న సేవలపై ఒక అమెరికన్ మహిళ ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది. అమెరికా చూసి నేర్చుకోఅంటూ ఇన్స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అపాయింట్మెంట్ లేకుండా భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్లు కొనుక్కో గలిగాను అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఆమె తన వీడియోలో వివరించిన వివరాల ప్రకారం భారతదేశంలో కాంటాక్ట్ లెన్స్ల కొనుగోలు ప్రక్రియ ఎంతో అందుబాటులోనూ, తక్కువ ధరలోనూ ఉంది.ఒక ఆప్టికల్ స్టోర్కు వెళ్లి లెన్స్లను ఆర్డర్ చేయడం, చాలా తక్కువ ధరకే వాటిని త్వరగా పొందడం వంటి విషయాలను వివరిస్తూ, ‘ఐవీ' (Ivy) అనే మహిళ తన అనుభవాన్ని పంచుకున్నారు. అమెరికా దీనిని గమనించాలని (పాఠంనేర్చుకోవాలని) ఆమె సూచించారు. బీమా లేదా ముందస్తు అపాయింట్మెంట్ లేకుండానే రూ. 2,451లకే కొనుగోలు చేసి, ఇక్కడి వైద్య సేవల లభ్యతను ఆమె కొనియాడారు.షాపింగ్ అనుభవం ఐవీ కోసం కేవలం ఒక జత కాంటాక్ట్ లెన్స్లు మాత్రమే తెచ్చుకుంది. దీంతో మరో జత కొనాలని నిర్ణయించుకుంది. కేవలం 20 నిమిషాల నడక దూరంలో ఉన్న ఒక మాల్లోని ఆప్టికల్ స్టోర్కు వెళ్లి, తన ప్రిస్క్రిప్షన్ను వారికి చూపించింది. ఆమె వాడే బ్రాండ్ లెన్స్లను సోమవారం రాత్రి కల్లా తెప్పించి ఇస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. మరిన్ని బాక్సులు కొంటే అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఒక బాక్స్ మాత్రమే తీసుకుంది. చెప్పిన సమయానికి ఆమెకు లెన్స్లు అందడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీఇలా నేరుగా ఆప్టికల్ స్టోర్లోకి నడుచుకుంటూ వెళ్లి లెన్స్ కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అమెరికాలో ఇలా చేయడం అస్సలు సాధ్యం కాదు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేకుండా అస్సలు కుదరదని ఐవీ పేర్కొంది. చాలా తక్కువ ధరకే మూడు జతలు వచ్చాయంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.నెటిజన్లు ఏమన్నారంటేఈ పోస్ట్ వైరల్ కావడంతో, అమెరికన్లకు కాంటాక్ట్ లెన్స్లు కొనడానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనే విషయం తెలిసి మెజారిటీ నెటిజన్లు ఆశ్చర్యపోయారు "నిజమా! నేనైతే ఎప్పుడు పడితే ఒక మామూలు గ్లాసెస్ షాప్కి వెళ్తాను. నా కళ్లద్దాలు లూజ్ అయితే టైట్ చేయించుకుంటాను. దానికోసం ఆ షాప్ అతను ఒక్క రూపాయి కూడా తీసుకోడు, ఫ్రీగా చేస్తాడు." అని తెలిపారు. కాంటాక్ట్ లెన్స్ కోసం ఇన్సూరెన్స్ కావాలనే కాన్సెప్ట్ వినడానికే చాలా వింతగా ఉందంటూ మరొక యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకూ ఈ విషయం తెలియదంటూ మరికొందరు కూడా విస్తుపోయారు. కాగా ఇటీవల మరొక అమెరికన్ మహిళ (విక్టోరియా) అమెరికాలో సుమారు రూ. 94వేలు ఖరీదు చేసే ముఖ్యమైన మందులను ఇండియా నుంచి కేవలం రూ. 2,350 లకే కొనుగోలు చేసానని, , అమెరికా హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు -
వయసు 39, రూ. 46 కోట్లు ఆస్తి.. రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
సోషల్ మీడియా పుణ్యమా అని తమకెదురైన ప్రతి సమస్యను షేర్ చేసుకుంటూ సలహాలు సూచనలు పొందడం ఓ ట్రెండ్గా మారింది. ఒకరకంగా దీనివల్ల ఇతరుల ఎంత పెద్ద సమస్యలు ఫేస్ చేస్తున్నారో తెలియడమేగాక, వ్యక్తిగతంగా ఒక సమస్యకు ఎలా సంయమనంగా ఓపిగ్గా ఉండాల్లో తెలుసుకునే వీలు లభించడం విశేషం. అలానే ఈసారి నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఎన్నారై రెడిట్ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాదు ఆలోచింప చేస్తోంది. ఇంతకీ అందులో ఏముందంటే..ఆ ఎన్నారై రెడిట్ పోస్ట్లో ఇలా ఉంది. తన వయసు 39 ఏళ్లు అని, తాను దాదాపు 15 ఏళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్నట్లు పోస్టులో రాసుకొచ్చాడు. తాను ప్రేమించి పెళ్లి చూసుకున్నానని, తామిద్దరం ఉద్యోగాల్లో మంచి ఉన్నతిని సాధించామని, సుమారు 46 కోట్లు ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇటీవల తన భార్య కేన్సర్ బారిన పడిందని, ప్రస్తుతం ఆ వ్యాధి మరింతగా ముదిరిందని రాసుకొచ్చారు. తమకు పిల్లలు కూడా లేరని అన్నారు.దాదాపు ఐదేళ్లుగా తర భార్య కేన్సర్తో పోరాడుతున్నట్లు తెలిపారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకవేళ ఆమె ఆరోగ్యం క్షీణించి.. దాంతో మానసికంగా అలిసిపోయి ఇక పనిచేయకూడదు రిటైర్మెంట్ తీసుకోవాలి అనుకుంటే.. భారత్లో జీవించడానికి తన వద్ద ఉన్న ఆ రూ. 46 కోట్ల ఆస్తి సరిపోతుందా అని ప్రశ్నించాడు. అందుకు నెటిజన్ల నుంచి ఆచరణాత్మక ఆర్థిక సలహాలతో పాటు వ్యక్తిగత ధైర్యాన్ని నింపే సలహాలు సూచనలు కూడా అందించారు.వినడానికి బాధగా ఉన్నా.. తక్షణమే ఉద్యోగానికి రిజైన్ చేసి ఆమె చెంతే ఉండండి. మంచి వైద్యం అందించేలా ప్రముఖ వైద్యులను కలిసి సలహాలు సూచనలు తీసుకోండి. భారత్లో మెట్రో నగరాల్లో జీవించాలనుకున్నా అంత మొత్తం సరిపోతుందని అన్నారు. అంతేగాదు మీ భార్య కోసం చేయగలిగిందంతా ఇప్పుడే చేయండి. ఇది ఆర్థిక భద్రతకు సంబంధించింది కాదు.. అంతకుమించిన బంధానికి, భావోద్వేగానికి సంబంధించిందంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని.. -
జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..
సంపన్న దేశాల కూటమి అయిన ‘గ్రూప్ ఆఫ్ సెవెన్’(జీ7) 52వ శిఖరాగ్ర సదస్సు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫాన్స్లోని ఎవియాన్ లే బైన్స్లో ఈ నెల 17 వరకు సదస్సు జరగనుంది. ఈ సభ్య దేశాలతో పాటు ఆహ్వానిత హోదాలో భారత్, బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, దక్షిణ కొరియా, ఖతార్, సిరియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లు సదస్సులో పాల్గొననున్నాయి. అదీగాక ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత జరుగుతున్న సదస్సు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సదస్సుకి ఓ తొమ్మిదేళ్ల చిన్నారి రాక అందర్నీ ఆశ్చర్యపరిచింది. పాపం అమె కెమెరా కంట పడకుండా ఉండేందుకు పడుతున్న తపన అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే..ఆ ముద్దలొలికే పాప ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూమార్తె. ఫ్రాన్స్లో ఇటీవల జరుగుతున్న G7 సదస్సులో ప్రధాన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు సమావేశమైనప్పుడు ఒక రసవత్తరమైన క్షణం ఎదురైంది. అందుకు సబంధించిన వీడియో అందరి హృదయాలను తాకింది. అంతేగాదు కొన్ని గంటల్లోనే ఆ చిన్నారి రాకకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యి ఎవరా అమ్మాయ్ అని చర్చలు మొదలయ్యాయి. రాజకీయ చర్చలకు అతీతంగా ఆ చిన్నారే హాట్టాపిక్గా మారడం విశేషం. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని మెలోని రాగానే అధికారులకు, స్వాగత ప్రతినిధి బృంద సభ్యులకు అభివాదం చేశారు. ఆమె వెనుక నిశబ్దంగా ఉన్న గినెవ్రా జియాంబ్రూనె కెమెరాల ముందు సిగ్గుపడుతూ..తల్లి చెంత ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. అయితే నెటిజన్లు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుమార్తెను వెంటబెట్టుకుని అమ్మగా రెండూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందుకు మెలోనిపై ప్రశంసలపై వర్షం కురిపించారు. తల్లిదండ్రులుగా మారిన ప్రపంచనాయకులంతా ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొంటారు కదా అంటూ పోస్టులు పెట్టారు. కొందరు మాత్రం ఆ చిన్నారి చాలా ముద్దుగా ఉంది. ఆమెకు సురక్షితమైన ప్రదేశం ఏదో బాగా తెలుసు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.Giorgia Meloni's daughter steals the spotlight by avoiding itItaly's PM's shy sidekick goes viral for hiding behind her mom as they arrive at the G7 summit in Geneva pic.twitter.com/n8gmg93Cfi— RT (@RT_com) June 17, 2026 (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది. -
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు. -
‘కంపెనీని నిర్మించాను, మారథాన్ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..
ఓ అమ్మాయి కెరీర్, అభిరుచుల పరంగా సక్సెస్ అయినా ఆమె అమ్మమ్మ మాత్రం తన కారణంగా ఏదో కోల్పోయానంటూ బాధపడిపోయిందంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పాపం ఆ అమ్మమ్మ చెప్పిన కారణం విని ఆమెకు చాలా హాస్యస్పదంగా ఉండటమే కాదు ఆ రెండు అక్షరాల పదం మందు ఆ అమ్మాయ్ విజయాలన్ని వృధాగా మారిపోవడం విచిత్రం. ఒక రకంగా ఈ పోస్ట్ మహిళల వ్యక్తిగత గుర్తింపుకి ఏ మాత్రం విలువ ఉండదా అనే విషయం తెరపైకి తీసుకొచ్చింది. అంతేగాదు ఆడపిల్లకు వివాహ బంధమే ముఖ్యమా అనే దానిపై ఆలోచింపచేసేలా క్లారిటీ ఇచ్చింది ఆ వీడియో సంభాషణ. ఆ అమ్మాయే భారత సంతతి మహిళ హేమాక్షి మోట్కా. ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది.ఆ వీడియోలో హేమాక్షి భారత దేశంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ తన గురించి వివరించారామె. భారత్లో ఒక కార్యక్రమానికి తన అమ్మమ్మ హాజరైందని అక్కడ కేవలం "పెళ్లైన కుమార్తెలకు" మాత్రమే సాంప్రదాయ బహుమతులుగా దుప్పట్లు లభించడంతో ఆమె అమ్మమ్మ చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చింది. ఇదంతా ఎందుకంటే తనకింక పెళ్లికాకపోవడంతో అమ్మమ్మ ఆ దుప్పటి అందుకోలేకపోయానంటూ తన ఆవేదన వెలిబుచ్చిందని తెలిపింది. తనకు పెళ్లి కాలేదన్న కారణంగానే ఒక్క దుప్పటి కూడా అందుకోలేకపోయానని బాధపడుతోందామె. కానీ నాకు అది ఎంతో సిల్లీగా అనిపించింది. తాను అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్లో కోట్లాది రూపాయ కంపెనీ నిర్మించాను, సీఈవోని, పైగా 42 కిలోమీటర్ల మారథాన్ని విజయవంతంగా పూర్తి చేశా. ఇంత సక్సెస్ని అందుకున్నా.. కానీ జస్ట్ ఒక లాంఛనప్రాయమైన దుప్పటి కోసం కోల్పోయాను కాబోలు అంటూ నవ్వేసిందామె. అంతేగాదు ఇది తనపై అమ్మమ్మ చూపిస్తున్న ప్రేమ, శ్రద్ధే కావొచ్చు..కానీ మహిళలకు వ్యక్తిగత గుర్తింపును త్యాగం చేయొద్దని హెచ్చరిస్తూ ఇలా పేర్కొంది. నాకు మా అమ్మమ్మ మాటలు నవ్వు తెప్పించినా.. మహిళలుగా మనం ఎంచుకున్న రంగంలోని విజయాలను జరుపుకోవాలి. పెళ్లి అనేది ఒక ప్రతిపాద, ఆమోదం అంతే. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని..మంచి కెరీర్ని నిర్మించుకోవాలి, రిస్కులు తీసుకోవాలి, స్వంతంగా డబ్బు సముపార్జించాలి. గర్వపడే జీవితాన్ని సృష్టించుకోవాలి. అందుకు తగ్గట్టుగా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటూ న్యూయార్క్ కంపెనీ సీఈవో అంటూ తన సంభాషణను ముగించింది. అంతేగాదు ఆ వీడియోలో మన హోదాకి విలువలేకపోవచ్చు, ఇతరుల అభిప్రాయాలు మారవచ్చు.. కానీ మీపై మీకు సడలని ఆత్మవిశ్వాసం ఉండాలి, దుప్పటి బాగుంటుందేమో..కానీ మీ వెంట వచ్చేది, మిమ్మల్ని నిలబెట్టేది ఆత్మవిశ్వాసమే. అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా ఆమెకు మద్దదతిస్తూ.. ఆట మార్చేయండి. మీకు నచ్చిన పనులను మీ పద్ధతిలో చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hemakshi Motka (@hemakshi126) (చదవండి: 90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..) -
ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!
ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్ జాబ్స్ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్ను సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్ హౌస్ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు. View this post on Instagram A post shared by Nishant Tomar Realtor (@nishant.in.australia) నిశాంత్ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్ వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష -
రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!
ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ స్టోరీలను చదువుకున్నాం. ఎంతోమంది విజయగాథలను తెలుసుకుని స్ఫూర్తి పొందాం. కానీ కష్టం ఎక్కువ, సంపాదన తక్కువ అయినా కూడా తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతో గౌరవంగా, హుందాగా జీవనం సాగిస్తున్న 82 ఏళ్ల పెద్దాయన గురించి తెలుసుకుందాం.ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ద్వారా మన్సుఖ్ కాకా కథ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈయన నైజం, కష్ట పడేతత్వం నెటిజనులను ఆలోచింపచేస్తోంది.ముంబైకి చెందిన 82 ఏళ్ల మన్సుఖ్ కాకా కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఆయన ప్రతిరోజూ 12 గంటల పాటు ఫుట్పాత్పై చిరుతిళ్లు (ఫర్సాన్) అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మన్సుఖ్ కాకా తన జీవితంలో ఎక్కువ భాగం ఒక చీరల దుకాణంలో సేల్స్మ్యాన్గా పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన అనారోగ్యానికి గురవడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ సమయంలో ఆయనను చూసుకోవడం కోసం ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, ఆయనఇతరులపై ఆధారపడకుండా, ఏదో ఒక చిన్న పని అయినా చేసుకొని జీవించాలని నిర్ణయించు కున్నారు. తన ఇంటికి సమీపంలోని ముంబై ఫుట్పాత్పై సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.అదీ తన సోదరి సాయంతో. ఆమె ఇంట్లోనే తాజా ఫర్సాన్ లేదా మురుకులు (సాల్టీ, సేవరీ స్నాక్స్) తయారు చేసి ఇస్తారు. మన్సుఖ్ కాకా వాటిని ప్యాకెట్లుగా చేసి తన స్టాల్కు తీసుకొచ్చి అమ్ముతారు. ఇలాసంపాదించేది ఎంతో తెలుసా? ఇలా రోజుకి 12 గంటలు శ్రమిస్తున్నప్పటికీ, ఆయనకు రోజుకు లభించే ఆదాయం కేవలం రూ. 300 మాత్రమే. అయినా ఆయన ఏ విచారం లేదు.ఎంతో నిబద్ధతగా పనిచేసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రతి చిన్న ఖర్చును, అమ్మకాలను ఒక చిన్న డైరీలో లెక్క రాసుకుంటూ ఉంటారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.నెటిజనుల ప్రశంసలు"ఈ వయసులో కూడా మన్సుఖ్ కాకా ఎంతో నమ్మకంతో, కష్టపడి తన స్టాల్ను నడుపుతున్నారు. మనమందరం కలిసి ఆయనకు మద్దతు ఇద్దాం" అని ఆరాధన ఛటర్జీ టిజన్లను కోరారు.మరోవైపు ఆయనపై పలువురు ప్రశంసలు కురిపించారు. నీట్గా ఇన్ షర్ట్ చేసుకొని, ప్రొఫెషనల్గా, చిరునవ్వుతో కస్టమర్లను ఆదరించడం సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు. ఆయనను కలిసిన వారు "ఆయన ఎంతో వినమ్రుడు, దయాగుణం గలవాడు" అని కొనియాడుతున్నారు. ముంబై ప్రజలు ఆయన స్టాల్కు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసి ఆయనకు మద్దతుగా నిలవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇంట్లో మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన ఆయన కారణాలేమైనప్పటికీ రోజూ ఇలా కష్టపడటం చూస్తే మనసు ద్రవించక మానదు. మన జీవితంలో తారసపడే ఇలాంటి వారికి మన వంతుగా చేయూత నిద్దాం! ఏమంటారు? -
శివానుగ్రహం కోసం 12 ఏళ్లుగా నిలబడి దీక్ష?! నెటిజన్లు షాక్!
పరమ శివుడి అనుగ్రహం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేసిన మునులు, మహర్షుల గురించి విన్నాం. కానీ కలియుగ భారతంలో శివానుగ్రహం కోసం ఏకంగా పుష్కరం కాలం నిలబడి పోయిన వైనం నెట్టింట వైరల్గా మారింది. హర్యానాకు చెందిన సాధువు 'దులాల్ గిరి జీ మహారాజ్' కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.కొన్ని నివేదికల ప్రకారం ఆ సాధువు కనీసం కూర్చోకుండా 12 ఏళ్ల నుంచి నిలబడే దీక్ష సాగిస్తున్నారు. గడిచాయి.'తాజా టీవీ' (Taaza TV) ప్రకారం, దులాల్ గిరి జీ మహారాజ్ శివుని సేవలో తరించడానికి చిన్న వయసులోనే యూనివర్సిటీ చదువును వదిలిపెట్టారు. హిందూ సాధువులలో సాధారణంగా కనిపించే వేషధారణలో, పైభాగంలో ఎలాంటి అచ్ఛాదన లేకుండా తలపై జడలతో నడుము చుట్టూ కాషాయ వస్త్రంతో కనిపిస్తున్నారు. ఒక వీడియోలో గొలుసులతో పైకప్పు నుండి వేలాడుతున్న ఒక చెక్క పలకపై తన శరీరాన్ని ఆనించి ఉండగా, ఆలయ వాలంటీర్లు అతని కాళ్లకు లేపనం రాస్తున్నారు. మరో వీడియోలో కాషాయ వస్త్రాల్లో కేవలం గోడకు ఆనుకుని ఉండడం కనిపిస్తోంది. దీంతో అసలు ఈ సాధువు నిజంగానే శివుడికోసం దీక్ష చేస్తున్నారా? లేక అనారోగ్య కారణాలతో ఇలా మారిపోయారా అనేదానిపై పూర్తి స్పష్టత లేదు. ఈవీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం గమనార్హం.In India, a man has been standing in one place for five years as a vow to the god ShivaHe does not sit or stretch his legs and sleeps while supported by a special harness.His legs have become severely swollen and darkened due to poor blood circulation, and temple volunteers… pic.twitter.com/fc0rIttXJ1— NEXTA (@nexta_tv) June 14, 2026ఆందోళనకర విషయం ఏమిటంటే.. ఆయన కాళ్లు వేళ్ల నుండి పిక్కల వరకు నల్లగా మారిపోయాయి, తీవ్రంగా వాచిపోయి ఉన్నాయి. ఈయన్ని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశాడు. కొంతమంది నెటిజన్లు సాధువు అంకితభావాన్ని, క్రమశిక్షణను ప్రశంసిస్తూ, ఇది విశ్వాసానికి ఒక అద్భుతమైన నిదర్శనమని పేర్కొన్నారు. మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బహుశా అతని కాళ్లకు ప్రమాదకరమైన గాంగ్రీన్ సోకి ఉంటుందని, ఇలాగే కొనసాగితే, కాళ్లను తొలగించాల్సి వస్తుంద అంటే, ఆయన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. -
అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష
ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సందడి చేస్తోంది. దేశంల నిరుద్యోగులు, గిగ్ ఎకానమీపై పెద్ద చర్చకు దారితీసింది. 'జిప్ ఎలక్ట్రిక్' (Zypp Electric) ఫౌండర్, సీఈఓ ఆకాష్ గుప్తా, తాజాగా తాను ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్తో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.ఆకాష్ గుప్తా షేర్ చేసిన వివరాల ప్రకారం ఆ క్యాబ్ డ్రైవర్ గతంలో ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగం చేస్తూ నెలకు కేవలం పాతికవేల రూపాయలు సంపాదించేవాడు. అది ఏ మూలకు రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయి క్యాబ్ డ్రైవర్గా మారిపోయాడు. ఫలితంగా ఇప్పుడు నెలకు రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నాడు. అలాగే తాను చేసే పని మీద తనకు పూర్తి నియంత్రణ లభించిందని అతను ఆనందం వ్యక్తం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎంత పని చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ తన జీవితాన్ని మార్చేసింద న్నాడు. రోజుకు 10 గంటలు పనిచేస్తూ రూ.3 నుంచి రూ.4 వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పాడు ఈ పరిణామాన్ని ఆకాష్ గుప్తా దేశంలో ఎదుగుతున్న "గిగ్ ఎంట్రప్రెన్యూర్స్" (భారత్ కా నయా మిడిల్ క్లాస్) కు ఉదాహరణగా అభివర్ణించారు. అంతేకాదు సొంతంగా వాహనాన్ని, సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ సంపాదిస్తున్నందున, ఇకపై ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు తనను తాను ఒక బిజినెస్మ్యాన్గా చెప్పుకోవాలని ఆకాష్ గుప్తా ఆ డ్రైవర్కు సూచించారు. గిగ్ వర్కర్లు కేవలం డెలివరీ పార్టనర్లు మాత్రమే కాదు, ఇష్టపూర్వకంగా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకునే మైక్రో-ఎంట్రప్రెన్యూర్స్. వీరే తదుపరి మధ్యతరగతి వర్గం అని గుప్తా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash)ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?నెటిజన్ల స్పందన ఈ పోస్ట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. గిగ్ వర్కర్లందరినీ గౌరవించాలి ఒకరు, అతని స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకం అని మరొకరు కమెంట్ చేశారు. గతంలో ఉద్యోగం ద్వారా నెలకు రూ. 70 వేలు సంపాదించే తాను, ఇపుడా ఉద్యోగం వదిలేసి కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఉద్యోగం కంటే ఎక్కువే సంపాదిస్తున్నాను, అన్ని ఒత్తిళ్ల నుంచి దూరంగా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.కాగా జిప్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడైన ఆకాష్ గుప్తా, ఆన్లైన్లో కంటెంట్ క్రియేటర్గా కూడా గుర్తింపు పొందారు. ఆయన తరచూ సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఇదీ చదవండి: మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
మెటా, టిక్టాక్పై కేసు : 12 ఏళ్ల రోసెల్లా విషాద గాథ
రెండువైపులా పదునున్న కత్తి సోషల్ మీడియా. సోషల్ మీడియా యాప్స్ను స్క్రోలింగ్ అనేది పిల్లలు పెద్దలు తేడా అనే లేకుండా ఒక వ్యసనం లేకుండా మారిపోయింది. సోషల్ మీడియా అల్గారిథమ్తో యువతపై పడుతున్న ప్రతికూల ప్రభావాలు ఇన్నీ అన్నీ కావు. సోషల్ మీడియా సంస్థలపై ఉమ్మడి చట్టపరమైన చర్యలు ఇటలీలో తల్లిదండ్రులు చేస్తున్న న్యాయపోరాటం ఈ విషయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఐరోపా అంతటా డిజిటల్ ప్లాట్ఫారమ్లపై విమర్శలు తీవ్రమవుతున్నారు. మరోవైపు ఇటీవలే బ్రిటన్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో ఇది మరింత ప్రాధాఘ్యతను సంతరించుకుంది. 12 ఏళ్ల బాలిక రోసెల్లా ఆత్మహత్య వెనుకున్న అత్యంత విషాదకరమైన విషయాలగురించి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో విపరీతంగా ఆత్మహత్య , డిప్రెషన్కు సంబంధించిన కంటెంట్ను చూసిన తర్వాత తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని రోసెల్లా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఆమె మరణం తర్వాతే తల్లి ఇరీన్ రొగ్గెరో ఉగ్వెస్, ఆమె భర్త రోసెల్లా డివైజ్లను అన్లాక్ చేశారు. దీంతో విషయం తెలిసి షాక్ అయ్యారు. దీనిగురించి ప్రపంచాన్ని హెచ్చరించాలని నిర్ణయించుకున్నారు.విషయం ఏమిటంటే..తమ కుమార్తె రోసెల్లా సోషల్ మీడియాను చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. మరీ ముఖ్యంగా ఆమె ఒక రహస్య ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను వాడుతోందనీ, అందులో 'o'కు బదులుగా 'zero'తో 'Just a dead pers0n' అనే పేరుతో అకౌంట్ను నడుపుతోందని గమనించారు.2023 సెప్టెంబర్లో రోసెల్లా తన మానసిక స్థితికి తగ్గట్టుగా డిప్రెషన్ కంటెంట్ కోసం వెతకడం ప్రారంభించగానే, సోషల్ మీడియా అల్గారిథమ్లు ఆమెకు అలాంటి కంటెంట్నే పదే పదే చూపించాయనీ, కేవలం ఐదు నెలల్లోనే (2024) ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.ఈ వ్యవహారంపై రోసెల్లా తల్లిదండ్రులతో పాటు ఇటలీలోనిమరికొన్ని కుటుంబాలు కలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta) , టిక్టాక్ (TikTok)లపై కోర్టులో కేసు వేశారు. మైనర్లకు సోషల్ మీడియా యాక్సెస్పై కఠినమైన పరిమితులు విధించాలని, దీనివల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన పెంచాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఆ అల్గారిథం లేకపోతే, ఆమె వేదన - లేదా సైకోసిస్, లేదా మానసిక బాధను, లేదా అంతకుమించి మరేదైనా గానీ తానుతన కూతురికి జరిగిన ఘోరం మరే ఇతర బిడ్డకు జరగకూడదని, సోషల్ మీడియా వెనుక ఉన్న సాంకేతిక ప్రమాదాల గురించి మిగతా తల్లిదండ్రులను అప్రమత్తం చేయడానికే తాను ఈ న్యాయపోరాటంలో చేరానని రోసెల్లా తల్లి ఇరేన్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను మెటా, టిక్టాక్ సంస్థలు తిరస్కరించాయి. తాము టీనేజర్ల రక్షణ కోసం 'టీన్ అకౌంట్స్' హానికరమైన కంటెంట్ను తొలగించే ఫిల్టర్లను ఉపయోగిస్తున్నామని, యువత మానసిక ఆరోగ్యం వెనుక అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయని అవి పేర్కొన్నాయి. యూజర్ల మానసిక, ప్రవర్తనా ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయడం తమ ప్రయత్నాలలో భాగమని టిక్టాక్ (ఇండియాలో నిషేధం) తెలిపింది. ఆ నిబంధనలను ఉల్లంఘించే 99శాతం కంటే ఎక్కువ కంటెంట్ను తాము తొలగిస్తున్నట్లు కూడా పేర్కొంది. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు, ఏకాగ్రత పూర్తిగా నశిస్తున్నాయని ఉదాహరణలతో చెప్పారు.24 గంటలూ ఓ కన్నేసి ఉంచడం సాధ్యమా?పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని 24 గంటలూ గమనించడం ప్రాక్టికల్గా సాధ్యం కాదని పెద్ద కుటుంబాల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పిల్లలు ఇంటర్నెట్లోని ట్యుటోరియల్స్ చూసి తల్లిదండ్రులు పెట్టే ఫిల్టర్లను లేదా సమయ పరిమితులను సులభంగా దాటేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్కు రూ. 76 లక్షలు, లంచ్కి 20 లక్షలు : ఎలా?నిపుణులేమంటున్నారు? సోషల్ మీడియాలో వచ్చే ప్రతి 'లైక్' లేదా 'నోటిఫికేషన్' మెదడులో డోపమైన్ (Dopamine) అనే రసాయనాన్ని విడుదల చేస్తుందని, ఇది స్లాట్ మెషీన్ల (జూదం) లాగా పిల్లలను వ్యసనపరులుగా మారుస్తుందని నిపుణులు కోర్టుకు తెలిపారు. అతిగా సోషల్ మీడియా వాడటం వల్ల టీనేజర్ల మెదడు అభివృద్ధి దెబ్బతింటుందని, నిద్రలేమి,మానసిక సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్మరో కోణంఅయితే కొంతమంది సైకాలజిస్టులు కేవలం సోషల్ మీడియాని మాత్రమే బ్లేమ్ చేయలేమని, పిల్లలపై మితిమీరిన నియంత్రణ కంటే వారితో మాట్లాడటం, వారిని నమ్మడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా! -
అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!
స్విట్జర్లాండ్లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్ కలగకమానదు.స్విట్జర్లాండ్లోని బుర్గెన్స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట. గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. -
ఇన్స్టాగ్రామ్లో ‘మనదే’ అంతా!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలు, భద్రతా సవాళ్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు జీ7 సదస్సులో సమావేశమయ్యారు. అయితే అధికారిక సమావేశాల కంటే.. ఓ చిన్న సరదా సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి తమ ప్రత్యేక కెమిస్ట్రీతో వార్తల్లో నిలిచారు.ఫ్రాన్స్లోని ఎవియాన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రపంచ నేతలంతా గ్రూప్ ఫొటో కోసం ఒకచోట చేరారు. ఈ సమయంలో మోదీ, మెలోనీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. "మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది" అని మెలోనీ చెబుతూ.. ఆ వెంటనే సరదాగా "ఇన్స్టాగ్రామ్లో మనమే అత్యంత ప్రసిద్ధ జంట" అంటూ చమత్కరించారు. దీనికి మోదీ చిరునవ్వుతో స్పందించగా.. ఆ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది.Modiji and meloni 😍 pic.twitter.com/6iWmtkCIUN— Jash (@jeetcasm) June 16, 2026మీమ్ నుంచి గ్లోబల్ క్రేజ్ దాకా.. మోదీ, మెలోనీ పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన ‘‘మెలోడీ’’ హ్యాష్ట్యాగ్ గత మూడేళ్లుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2023లో దుబాయ్లో జరిగిన సీఓపీ-28 సదస్సులో మెలోనీ మోదీతో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ #Melodi అని క్యాప్షన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ హ్యాష్ట్యాగ్ మీమ్స్, ఫ్యాన్ ఎడిట్స్, సరదా పోస్టులతో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.ఇద్దరు నేతలు ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా.. మెలోడీ మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది. జీ7 సదస్సు కూడా అందుకు మినహాయింపు కాలేదు.మెలోనీకి టాఫీలు!ఈ మెలోడీ ఫినామినన్ను మోదీ కూడా సరదాగా గుర్తించిన సందర్భం ఇటీవలే చోటుచేసుకుంది. గత నెల రోమ్ పర్యటన సందర్భంగా మోదీ.. మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ను బహుమతిగా అందించారు. ఆ బహుమతిని చూసిన మెలోనీ నవ్వుతూ.. ప్రధాని మోదీ మాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చారు.. చాలా మంచి టాఫీ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అయింది. గంటల వ్యవధిలోనే కోట్లాది వ్యూస్ సాధించి, లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.వైరల్ కెమిస్ట్రీఅంతర్జాతీయ దౌత్య వేదికలపై సాధారణంగా గంభీర చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మోదీ-మెలోనీ మధ్య కనిపించే ఈ సరదా సంభాషణలు మాత్రం సోషల్ మీడియా యుగంలో రాజకీయ నాయకుల ఇమేజ్ను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. జీ7 వేదికగా మెలోనీ చేసిన "ఇన్స్టాగ్రామ్లో మనమే ఫేమస్ కపుల్" వ్యాఖ్యతో.. నెట్టింట వైరల్ అయ్యింది. -
కొట్టాడు.. కాల్చాడు.. ప్రేమంటే ఇదేనా?
తరాలు మారినా.. టీవీ సీరియళ్ల సాగదీతలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. పైపెచ్చు.. ఓటీటీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రేక్షకుల అభిరుచులను మార్చేసినా, కొన్ని సీరియళ్లలో మాత్రం అదే అతి, అదే అసహజ మలుపులు, అదే విషపూరిత సంబంధాల చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు కన్నీళ్లు, కుట్రలు, కుటుంబ కలహాలతో నిండిపోయిన కథలు.. ఇప్పుడు హింస, అవమానాలు, మానసిక వేధింపులను కూడా "ప్రేమ"గా చూపించే స్థాయికి చేరాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి విమర్శలకు తాజాగా మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్ కేంద్రబిందువైంది. కుటుంబ కథ పేరుతో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో భర్త చేతిలో భార్యకు జరిగే శారీరక, మానసిక హింసను రొమాంటిక్గా చూపించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. "ఇది ప్రేమ కాదు.. గృహహింస" అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.వివాదానికి కారణమైన సీన్కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న మహాదేవ్ అండ్ సన్స్ సీరియల్లో.. ఇటీవల ప్రసారమైన ఓ సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కథానాయకుడు ధీరజ్.. కథానాయిక రాజ్జీని తోసేయడం, చెంపదెబ్బ కొట్టడం, ఆమెను మంచంపై బలవంతంగా అదిమిపట్టడం వంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో రాజ్జీ చేయి వేడిగా ఉన్న ఇస్త్రీకి తగిలి కాలిపోతుంది. నొప్పితో ఆమె కేకలు వేస్తుండగా, ధీరజ్ ఆమె నోరు మూసేస్తూ తనకు ఆమెపై ప్రేమ కాదని, ద్వేషమే ఉందని చెబుతాడు.సాధారణంగా చూస్తే ఇది ఇద్దరి మధ్య ఘర్షణను చూపించే సన్నివేశంలా కనిపించవచ్చు. కానీ దాన్ని చిత్రీకరించిన తీరు, పాత్రల మధ్య ఉన్న రొమాంటిక్ ట్రాక్తో కలిపి చూపించిన విధానం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది.నెట్టింట రియాక్షన్లు.. సన్నివేశం ప్రసారమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది.ఇది ప్రేమ కాదు.. హింసఆమెను తోశాడు.. కొట్టాడు.. నీళ్ల బకెట్ పోశాడు.. ఇప్పుడు ఇస్త్రీతో కాల్చేశాడు. ఇదంతా చేసి దాన్ని ప్రేమగా చూపిస్తున్నారా? They’re romanticizing abuse 🙂- pushed her around- slapped her- dumped a bucket of water on her- now burned her with an iron and he’s covering her screams in the name of romance??? End this crap !!! #MahadevandSons pic.twitter.com/qzNy2z4sQT— anj (@cokerantx) June 16, 2026గృహహింసను రొమాన్స్గా చూపించడం అత్యంత బాధ్యతారాహిత్యం మరికొందరు మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ.. భర్త ఎంత హింసించినా భార్య భరించాలి.. చివరకు అతడిని క్షమించాలి అనే సందేశాన్ని ఇలాంటి సీరియళ్లు ఇస్తున్నాయి అంటూ విమర్శించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా ఈ కార్యక్రమాలను చూస్తారని, ఇలాంటి సన్నివేశాలు సంబంధాలపై తప్పుడు అవగాహన కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అసలు సమస్య ఇదే!ఈ వివాదం కేవలం ఒక సన్నివేశానికి మాత్రమే పరిమితం కాదు. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లలో "టాక్సిక్ రొమాన్స్" అనే ధోరణిపై విమర్శలు పెరుగుతున్నాయి. కోపం, అధికారం చెలాయించడం, మానసిక వేధింపులు, అవమానించడం, కొన్నిసార్లు శారీరక హింసను కూడా ప్రేమలో భాగంగా చూపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.సామాజిక వర్గాల అభిప్రాయం ప్రకారం, హింసను హింసగానే చూపించాలి. కానీ దాన్ని ప్రేమ, త్యాగం, కుటుంబ బంధం పేరుతో సమర్థించేలా చూపించడం ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి కథనాలు విషపూరిత సంబంధాలను కూడా సాధారణం అనే భావనను కలిగించే అవకాశం ఉంటుంది.మరోవైపు వాదనఅయితే ఈ విమర్శలతో అందరూ ఏకీభవించడం లేదు. కొందరు ప్రేక్షకులు మాత్రం సన్నివేశాన్ని సందర్భం నుంచి వేరు చేసి చూస్తున్నారని వాదిస్తున్నారు. ధీరజ్ ఉద్దేశపూర్వకంగా రాజ్జీని కాల్చలేదని, కథలోని సంక్లిష్టమైన భావోద్వేగ సంఘర్షణను చూపించడానికే ఆ సన్నివేశాన్ని ఉపయోగించారని చెబుతున్నారు.సీరియళ్లకు హద్దులుండాలా?టీఆర్పీల కోసం సంచలన సన్నివేశాలు చూపించడం కొత్త విషయం కాదు. కానీ గృహహింస, మానసిక వేధింపులు, విషపూరిత సంబంధాలను ప్రేమగా లేదా కుటుంబ బంధాల పేరుతో సమర్థించేలా చూపిస్తే అది కేవలం వినోదం పరిధిలోనే మిగిలిపోదని నిపుణులు చెబుతున్నారు. సమాజంలో ఇప్పటికే ఉన్న సమస్యలను మరింత సాధారణంగా చూపించే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం మహాదేవ్ అండ్ సన్స్పై జరుగుతున్న వివాదం ఒక సీరియల్ను దాటి పెద్ద చర్చకు దారి తీసింది. ప్రేక్షకులు నిజంగానే ఈ "టాక్సిక్ రొమాన్స్" కథలతో విసిగిపోయారా? లేక ఇది మరో సోషల్ మీడియా తుఫానుగా మాత్రమే మిగిలిపోతుందా? అనేది పక్కన పెడితే.. ఓటీటీ యుగంలోనూ టెలివిజన్ సీరియళ్ల కథన శైలి, వాటి సామాజిక బాధ్యతపై మరోసారి ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. -
చీరకట్టులో మైఖేల్ జాక్సన్ స్టెప్పులు అదుర్స్..!
పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ అంటే ఇష్టపడని వారుండరూ. ఆయనలా ఫాస్ట్గా మ్యూజిక్కి అనుగుణంగా స్టెప్లు వేసేందుకు తహతహలాడుతుంటారు. ఎందరో ఆయనకు శిష్యులుగా మారి ఎంతలా ప్రయత్నించేవారో కథలుకథలుగా విన్నాం. ఇప్పుడా మహానుభావుడు మన మధ్య లేకపోయినా..ఆయన ఆల్బమ్స్, పాటలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయ్. ఇదంతా ఎందుకంటే..ఓ మహిళ అచ్చం మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా స్టెప్పులు వేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఆ వీడియోలో కంటెంట్ క్రియేటర్ కోమల్ సాంప్రదాయ చీర కట్టులో మైఖేల్ జాక్సన్లా అద్భుతమైన డ్యాన్స్ చేసింది. మైఖేల్ జాక్సన్ ఐకానిక్ హిట్ అయిన 'బిల్లీ జీన్' పాటకు కాళ్లు కదిపింది. ఆమె చీర కట్టుకుని మరీ.. మేఖేల్ జాక్సన్కి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతంగా డ్యాన్స్ చేయడం విశేషం. పాట ప్రారంభకాగానే సునాయాసంగా స్టెప్పులు వేసిందామె. అందులో పదునైన బాడీ ఐసోలేషన్స్, రోబోటిక్ పాపింగ్ సీక్వెన్సులు, లెజెండరీ మూన్వాక్ కూడా ఉన్నాయి. ప్రతి స్టెప్పు చాలా కచ్చితత్వంతో ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం విశేషం. ఆ వీడియోలో ఒక అమ్మ మేఖేల్ జాక్సన్ ఆల్బమ్స్ చూసి అభిమానిగా మారితే ఎలా ఉంటుందో అంటూ.. కంటెంట్ క్రియేటర్ కోమల్ అలా సంప్రదాయ చీర కట్టులో డ్యాన్స్ చేసి చూపిందంటూ ఇచ్చిన వివరణ కూడా అద్భుతంగా ఉంది. నిజానికి ఆ స్టెప్లు చీరకకట్టులో వేయడం అంత ఈజీ కాదు. కానీ కోమల్ మాత్రం అదరగొట్టేసింది. నెటిజన్లు కూడా అమ్మా మీ స్టెప్స్ అదుర్స్ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Komal kumari (@komal__aadya) (చదవండి: ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..! ఆ 45 నిమిషాల రైడ్ ఆమెకు..) -
ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి
బిహార్లోని నలంద జిల్లా, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విచిత్రమైన పెళ్లి నెట్టింట సందడి చేస్తోంది. అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్న 36 ఏళ్ల వివాహిత మహిళ., తనకంటే 12 ఏళ్ల చిన్నోడు, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమాయణం. గత కొంతకాలంగా గోప్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో అనుకోని ట్విస్ట్. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. అసలేమైంది?కట్వా రసూల్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన ఘటన వివరాలు...శుక్రవారం రాత్రి ఒక భర్త తన భార్యను ఆమె ప్రియుడితో అభ్యంతరకర స్థితిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దీంతో గ్రామంలో కలకలం రేగింది,సంఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. దీంతో ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే, ఖుదాగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళను, ఆమె ప్రియుడిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు మహిళ భర్తను, ఆమె ప్రియుడి తండ్రిని కూడా విచారణకు పిలిచారు. విచారణ సమయంలో, ఆ వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలనే తన కోరికను వెల్లడించింది. దీని తరువాత, ఇరు పక్షాల మధ్య చర్చోప చర్చలు జరిగాయి. View this post on Instagram A post shared by tvn99urdu News 24/7 (@tvn99urdu)ఇదీ చదవండి: అఫ్గాన్లో సోలో ట్రిప్, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్ నటుడు కూడా!చివరికి మరుసటి రోజు, శనివారం, ఆ మహిళ భర్త వీరి పెళ్లిక అంగీకరించి, స్థానిక గుడిలో ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాడు. ఈ పెళ్లికి ఆ వారి ముగ్గురు పిల్లలు కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..పిల్లలు తమ తల్లితో వెళ్ళడానికి నిరాకరించి, తమ తండ్రితోనే ఉండాలని కోరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం, పెళ్లి తర్వాత ఆ మహిళ తన ముగ్గురు పిల్లలను అక్కడే వదిలేసి, తన కొత్త భర్తతో కలిసి పంజాబ్లోని లూథియానాకు వెళ్లిపోయింది. ఇది కులాంతర వివాహంగా నివేదించబడుతున్నందున, ఈ సంఘటన ఆ ప్రాంతంలో విస్తృత చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..! -
ఆ డ్రైవర్ ఊహించని 'రైడ్ మెనూ'..!
ఇంతవరకు పలు డ్రైవర్లు తమ ప్రయాణికుల సౌకర్యార్థం వైఫై నుంచి పుస్తకాలు, స్నాక్స్ వంటి ఏర్పాట్లతో ఫిదా చేశారు. కానీ ఈ డ్రైవర్ ఒక అడుగు ముందుకేసి ప్రయాణికులు నచ్చినట్లు జర్నీ చేసే అనుభవాన్ని అందించాడు. అది కూడా వాళ్లకు వాళ్లుగా ఎలాంటి రైడ్ చేయలనుకుంటున్నారో ఎంచుకునే మెనూతో ఇప్రెస్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్గా మారింది.ఒక మహిళ సోషల్ మీడియా ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ అదరి మనసులను తాకింది. ఆ పోస్ట్లో ఆ మహిళ తానొక అద్భుతమైన ప్రశాంతమైన రైడ్ చేశానంటూ ఆ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు విదేశీ వ్యాపార పర్యటన అనంతరం తిరిగి ఎయిర్పోర్ట్కి వచ్చినట్లు రాశారు. ఇంటికి వెళ్లేందుకు 45 నిమిషాల ఉబెర్ రైడ్ బుక్ చేసుకున్నారు. పైగా బాగా మూడు రోజులు పర్యటన కారణంగా బాగా అలిసిపోయి ఉండటంతో అస్సలు మాట్లాడే ఓపిక లేదని రాసుకొచ్చింది. ఆ డ్రైవర్ పేరు కబీర్ అని తన హెడ్రెస్ట్ వెనుకభాగంలో అంటించిన లామినేటెడ్ కార్డుని ఆమెకు అందించాడని చెప్పారు. దాన్ని ఆమె "రైడ్ మెనూ"గా వర్ణించారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తాము ఇష్టపడే సంభాషణను ఎంచుకునే వీలు కల్పించేలా రూపొందించాడు. ఆ కార్డులో నిశబ్దం కోసం "ది సైలెంట్ రైడ్", తమ రోజు విశేషాలు పంచుకోవాలనుకునేవారికి "ది థెరపిస్ట్ రైడ్", నగరం గురించిన వాస్తవాలు, కథలు చెప్పే "ది టూరిస్ట్ రైడ్", ప్రయాణికులు కేవలం విశ్రాంతి తీసుకుంటూ సంగీతం వినగలిగే "ది రేడియో రైడ్" వంటి ఆప్షన్లు ఉన్నాయని చెప్పారామె. అయితే తాను సైలెంట్ రైడ్ ఎంపికను ఎంచుకుని, డ్రైవర్కు నిశ్శబ్దంగా ధన్యవాదాలు తెలిపానని చెప్పింది. వెంటనే కబీర్ తల ఊపి ఎయిర్ కండిషనింగ్ సర్దుబాటు చేసి, మొత్తం ప్రయాణాన్ని నిశబ్దంగా చేశాడు. ఆ అనుభవాన్ని తలుచుకుంటూనే అద్భుతంగా అనిపిస్తుందన్నారామె. ఈ ఏడాది తాను ఆస్వాదించిన ప్రశాంతబైన రైడ్ ఇదేనని చెప్పారామె. పైగా తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోగలిగానని పేర్కొందామె. ఆ తర్వాత తాను ఉదారంగా టిప్ ఇచ్చి, కబీర్ వ్యాపార ఆలోచనను ప్రశసించానని చెప్పారామె. అయితే డ్రైవర్ ఆ మెనూ ఏర్పాటు వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ..ఇది మెరుగైన టిప్స్ లేదా రేటింగ్లు సంపాదించడం కోసం ఈ కార్డుని తయారు చేయలేదని చెప్పడం విశేషం. తన కుమార్తె ప్రేరణతో ఈ కార్డుని రూపొందించినట్లు తెలిపాడు. ఆమె కూడి అలిసిపోయినప్పుడు..అపరిచితులతో మాములు సంభాషణ ఎంత విసుగ్గా, నీరసం తెప్పించినట్లు ఉంటుందో పంచుకుందని, దాన్ని ఆమె "మారథాన్ పరుగు"తో పోల్చిందని, చెప్పుకొచ్చాడు. ఆ నేపథ్యంలోనే ప్రయాణికులు విమర్శల భయం లేకుండా తమ ఇష్టపూర్వంగా సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా వ్యక్తపరిచే మెనూని రూపొందించానని తెలిపాడు. ఆ వివరణ తనను ఎంతగానో కదిలించిందని చెప్పుకొచ్చింది. ఆధునిక జీవతం ప్రజలను నిరంతరం ఎలా ఒత్తిడికి గురిచేస్తోందో కదూ అనుకుంటూ..ఔను కొన్నిసార్లు ఒంటరిగా వదిలేయడంకు మించిన గొప దయ ఇంకొకటి లేదంటూ తన పోస్టుని ముగించారామె. ఈ పోస్ట్ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..ఇది మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. i took a 45-minute uber ride home from the airport last night after a brutal, three-day business trip. i was completely emotionally and physically drained, and my social battery was at absolute zero.when i got into the car, the driver.. an older guy named kabir.. didn't say…— noor୨୧ (@wottheberry) June 6, 2026 (చదవండి: థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..) -
సహారాలోనూ తప్పని డెడ్లైన్స్! ఒంటెపై ల్యాప్టాప్తో..
సహారా ఎడారికి పోయినా.. బాస్ వదలడం లేదా?. మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్లు తప్పలేదా? అన్నట్టుగా ఉన్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ వ్యక్తి ఒంటెపై ప్రయాణిస్తూ, ల్యాప్టాప్ తెరిచి జూమ్ కాల్లో బిజీగా కనిపించిన దృశ్యం నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది.ఎడారి మధ్యలో అనంతమైన ఇసుక దిబ్బలపై ఒంటె హంప్పై ల్యాప్టాప్ పెట్టుకుని, జూమ్ కాల్లో పూర్తి ఫోకస్తో పని చేస్తున్నట్లుగా కనిపించిన ఆ వ్యక్తి దృశ్యం ఒక్కసారిగా వైరల్గా మారింది. ఆ వీడియోలో.. వీడు వీడి బాస్కు వర్క్ఫ్రమ్ హోం చేస్తున్నానని చెప్పాడు అని క్యాప్షన్ జోడించడంతో నవ్వులు పూస్తున్నాయి. ఈ వీడియోను న్యూయార్క్కు చెందిన కంటెంట్ క్రియేటర్ షాద్ అక్తర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ అసాధారణ దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతూ.. రిమోట్ వర్క్ కల్చర్పై సరదా చర్చలకు దారితీసింది. కొందరు దీన్ని వర్క్ఫ్రమ్ ఎనీవేర్ ట్రెండ్కు పరాకాష్టగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు ఆధునిక ఉద్యోగ జీవనశైలి ఎక్కడికైనా వెళ్లగలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే, ఈ వీడియోలో అందరినీ ఎక్కువగా ఆకర్షించిన విషయం.. “ఎడారి మధ్యలో కూడా జూమ్ కాల్ ఎలా సాధ్యం?” అనే కుతూహలం. “వైఫై ఎంత స్ట్రాంగ్!” అంటూ కొందరు సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఇది టెక్నాలజీ సాధ్యాలను చూపించే ఉదాహరణగా పేర్కొన్నారు.“వర్క్ ఫ్రమ్ హోం కాదు, వేర్ ఫీల్స్ హోం అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ వైరల్గా మారింది. మరోవైపు “ఇలాంటి జీవితం మాకూ కావాలి” అంటూ సరదా కోరికలు కూడా వ్యక్తమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న “work from anywhere” ట్రెండ్లో ఇది మరో వైరల్ ఎపిసోడ్గా నిలిచింది. ఇటీవల దక్షిణ కొరియాలో రోలర్కోస్టర్పై మీటింగ్లో పాల్గొన్న వీడియో తర్వాత.. మొన్నీమధ్యే మన హైదరాబాద్లో బండి పెట్రోల్ ట్యాంకర్ మీద ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చేసిన ప్రయాణం.. ఇప్పుడు ఎడారిలో ఒంటెపై Zoom కాల్ వీడియో కూడా అదే జాబితాలో చేరింది. -
థాయిలాండ్లో ఒకరోజు..! పనిమనిషి సోలో ట్రిప్ ..
సోలోగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవ్వరికైనా కాస్త బెరుకుగా ఉంటుంది. అలాంటిది ఒక పనిమనిసి దేవం కానీ దేశంలో సోలోగా పర్యటించింది, రికార్డు చేసి తన ట్రావెల్వ్లాగ్లో షేర్ చేసింది. అది నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టడమే కాదు..అక్కా మొట్టమొదటి వ్లాగ్ సూపర్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఆమె ఏ దేశం వెళ్లింది..అక్కడ ఎలా తనను తాను పరిచయం చేసుకుందంటే..ఆ వీడియోలో ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అనీష్ భగత్ వద్ద పనిచేసే రేష్మా అతనితో కలిసి థాయ్లాండ్కు ప్రయాణించడం కనిపిస్తుంది. తన తొలి అనుభవాలను చిత్రీకరించి ట్రావెల్ వ్లాగ్లో షేర్ చేసిది. ఇదే తొలి ట్రావెల్ వ్లాగ్ వీడియో అని తెలిపింది. తాను ఒక పనిమనిషిగా మగతోడు లేకుండా భారతదేశం దాటి బయటకు రావడం ఇదే మొదటసారి అని వీడియోలో పేర్కొంది. తాను అనీష్ సోదరుడుతో కలిసి థాయ్లాండ్ చేరుకున్న తర్వాత ఒంటరిగా ఒకరోజంతా గడపమని చెప్పినట్లు తెలిపింది. అలాగే తన తొలి వాగ్లో, అనీష్ తనకు ఆసక్తి ఉన్న పనులు చేయమని అడిగాడని రేష్మా పంచుకుంది. అయితే తనకు దేనిపై ఆసక్తి ఉందో ఎప్పుడు ఆలోచించలేదు, పైగా అంత తీరిక కూడా దొరకలేదని చెప్పింది. అయితే తాను కేవలం పనమ్మాయినని, తనకు ఇక్కడ భాష రాదు, అలాగే చదవడం రాదని చెప్పింది. కానీ వంట చేయడం వచ్చు. అందుకే స్నేహితులను చేసుకునేందుకు బొబ్బట్లు చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. అక్కడ ఎలా స్పెండ్ చేసిందంటే..రేష్మా తనకు ఇష్టమైన చీర కట్టుకుని ఒంటరిగా థాయ్లాండ్ను అన్వేషించడానికి బయలుదేరడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశంలో కొత్త స్నేహితులను చేసుకోవడానికి ఆమె బొబ్బట్లతో నిండిన టిఫిన్ బాక్స్ను తీసుకువెళ్తుంది. అక్కడ ఒక అందమైన ఆలయానికి చేరుకుని ఒక జర్మన్ వ్యక్తిని కలిసి బొబ్బట్లు ఇచ్చి స్నేహితుడిని చేసుకుంటుంది. ఆ తర్వాత రేష్మా ఒక 7-ఎలెవెన్ను సందర్శించింది, అక్కడ ఆమెకు పోపో అనే మహిళా ఇన్ఫ్లుయెన్సర్ పరిచయమైంది. ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఇద్దరూ వెళ్లే దారిలో కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోజనం ఆస్వాదించారు. ఆ తదనంతరం ఆమె ఇలా పేర్కొంది. బాధ్యతల కారణంగా మన ఆడవాళ్ళం తరచుగా మన గురించి మనం ఎందుకు మరచిపోతామో నాకు తెలియదు.సినిమాల్లో లాగా ఒక పుస్తకం చదువుతూ, ఒక గిన్నెడు మామిడి స్టిక్కీ రైస్ తింటూ ఆమె ఆ రోజును ముగించింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమె తనలో తాను, “రేష్మా, నీ గురించి నాకు గర్వంగా ఉంది,” అని అనుకోవడం చూడొచ్చు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి విశేషమైన ఆదరణ, స్పందన రావడమే గాక, ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యంత హృద్యమైన ట్రావెల్ వ్లాగ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం. View this post on Instagram A post shared by Anish Bhagat (@anishbhagatt) (చదవండి: నాడు ఒక్కపూట భోజనం కోసం అల్లాడితే..నేడు అందరూ మెచ్చే చెఫ్గా..!) -
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
బేకరీలోకి వెళ్తే మీకు కేకులు, కూల్డ్రింకులు, బిస్కెట్లు చాకెట్లు కనిపిస్తాయి కదా. కానీ ఇక్కడ ఓ షాప్లో మాత్రం అంచనాలన్నీ తలకిందులయ్యాయి. అక్కడ కస్టమర్లకు “స్వీట్ షాక్” కాదు, నేరుగా “సర్ప్రైజ్ షాక్” ఎదురైంది. లోపల కనిపించిన దృశ్యం చూసి కొందరు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు!ఉత్తరప్రదేశ్లోని మీరట్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉన్న ఓ బేకరీలో భారీ కొండచిలువ కనిపించి అందరినీ హడలెత్తించింది. అది బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చిందా? లేదంటే డిస్కౌంట్ ఆఫర్ చూసి వచ్చిందా? అనే జోకులు పక్కన పెడితే… అక్కడి సిబ్బంది మాత్రం ‘బాబోయ్’ అంటూ బయటకు పరుగులు తీశారు. పామును చూసిన వెంటనే షాప్లో క్షణాల్లోనే “బిజినెస్ క్లోజ్, ఎమర్జెన్సీ ఓపెన్” పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకుంది. కానీ సమస్య ఏంటంటే… ఆ పాము దాగిన చోటు అంత ఈజీగా కనిపించలేదు. దాదాపు 3 గంటల పాటు సాగిన సినిమా స్టైల్ రేస్క్యూ ఆపరేషన్ తర్వాత ఆ భారీ పైథాన్ను సురక్షితంగా పట్టుకున్నారు. తీరా చూస్తే అది ఎనిమిది అడుగుల పొడవుతో భయానకంగా ఉంది. చుట్టూ గుమిగూడిన జనాలు మొత్తం “ఇదేందిరా ఇంత ఉంది!” అనే ఫీలింగ్లో షాక్లోనే నిల్చిపోయారు. ఆ సమయంలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు.. పైథాన్ను పట్టుకునే క్రమంలో ఒకరి మీద ఒకరు వేసుకున్న జోకులతో అక్కడంతా నవ్వులు పూశాయి.చివరికి పామును అడవిలోకి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ షాప్ మాత్రం ఒక్క రోజుకే “స్వీట్ షాప్” నుంచి “స్నేక్ షాక్ 🐍”గా ఫేమస్ అయిపోయింది!. స్వీట్స్ కోసం వెళ్లిన వాళ్లకి ‘స్వీట్ బిల్’ కాదు… జీవితాంతం గుర్తుండే షాక్ బిల్ పడింది! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.#मेरठ: दुकान में घुसा विशाल अजगरसिविल लाइन क्षेत्र में मची दहशतकर्मचारियों में मची अफरा-तफरीवन विभाग ने चलाया रेस्क्यूतीन घंटे बाद पकड़ा गया अजगरसुरक्षित रेस्क्यू के बाद राहत#Meerut #UPNews #BreakingNews #Python #Rescue #ForestDepartment #LocalNews #UPNow pic.twitter.com/RamOTx0ko5— UP NOW (@UPNOWTV) June 14, 2026 -
మోదీ ఫ్రాన్స్ పర్యటనలో నైస్ ట్విస్ట్!
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో భేటీ అయిన అనంతరం చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆ ట్వీట్లో మోదీ రెండుసార్లు వాడిన ‘నైస్’ అనే పదం వెనుక ఉన్న అర్థం ఏమిటన్న చర్చ నెటిజన్లలో మొదలైంది. అలాగే అంతకు ముందు.. మాక్రాన్ కూడా అదే పదం వాడడం ఆసక్తిని రేకెత్తించింది.ఫ్రాన్స్లో మాక్రాన్తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్న మోదీ.. Nice to have met you in Nice అంటూ పోస్టు చేశారు. తొలి దశ సమావేశాలు ఫలవంతంగా సాగాయని, భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ఎవియన్, పారిస్లలో మళ్లీ కలుసుకుందామని కూడా పేర్కొన్నారు.ఆసక్తికర విషయం ఏమిటంటే.. మోదీ పోస్టుకు ముందు మాక్రాన్ కూడా అదే సెల్ఫీని షేర్ చేస్తూ కేవలం “Nice” అనే ఒక్క పదంతోనే స్పందించారు. దీంతో ఇద్దరు నేతల పోస్టుల్లో పదేపదే కనిపించిన ‘నైస్’ అనే పదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ‘నైస్’ ట్విస్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన పదాల చమత్కారం దాగి ఉంది. ఇంగ్లిష్లో Nice అంటే బాగుంది, ఆనందంగా ఉంది అనే అర్థం వస్తుంది. అదే సమయంలో అది ఫ్రాన్స్లోని ప్రముఖ నగరం పేరు కూడా. అందుకే మోదీ అలా డబుల్ ట్విస్ట్ ఇచ్చారన్నమాట. ఒకటి.. “మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే భావం. రెండోది.. “నైస్ నగరంలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది” అనే సందర్భోచిత సందేశం.Nice to have met you in Nice. A productive first leg indeed. The India-France partnership will keep scaling new heights. See you in Evian and Paris…@EmmanuelMacron https://t.co/N84iSN7aDQ— Narendra Modi (@narendramodi) June 14, 2026మాక్రాన్ చేసిన నైస్ పోస్టు కూడా ఇదే తరహా ద్వంద్వార్థాన్ని ప్రతిబింబిస్తోంది. దీంతో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఈ సరదా పదాల చమత్కారం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అధికారిక దౌత్య సమావేశాల మధ్యలోనూ ఇలాంటి హాస్యభరిత సంభాషణ చోటుచేసుకోవడం విశేషమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నైస్ ప్రత్యేకత ఏంటంటే..నైస్(Nice City) ఫ్రాన్స్కు ఆగ్నేయ తీరంలో మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్న అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటి. ఫ్రెంచ్ రివేరా ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నగరం పర్యాటకులకు స్వర్గధామంగా భావిస్తారు. అందమైన బీచ్లు, సముద్రతీర విహార మార్గాలు, చారిత్రక నిర్మాణాలు, అంతర్జాతీయ సదస్సులకు ఇది ప్రసిద్ధి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ఫ్రాన్స్లో పారిస్ తర్వాత అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించే నగరాల్లో నైస్ కూడా ఒకటి.ధురంధర్ ట్విస్ట్ ఇచ్చిన మాక్రాన్మోదీ పర్యటనకు బాలీవుడ్ టచ్ ఇస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరో ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో మోదీ పర్యటనకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ధురంధర్ సినిమాలోని ‘ఆరి ఆరి’ పాటతో జతచేసి వీడియోను రూపొందించారు. మోదీ-మాక్రాన్ భేటీ, భారత్ ఇన్నోవేట్స్-2026 సదస్సు ప్రారంభోత్సవం, ఇరు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలపై జరిగిన చర్చలను ఇందులో చూపించారు. ఈ వీడియోకు స్పందించిన ప్రధాని మోదీ.. భారత్, ఫ్రాన్స్లు సాంకేతికత, ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల రంగాల్లో కలిసి ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.🇮🇳🇫🇷 pic.twitter.com/MD1gMC04dp— Emmanuel Macron (@EmmanuelMacron) June 14, 2026ఇదిలా ఉండగా, ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల్లో భాగంగా ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారిక చర్చల కంటే ముందే మోదీ-మాక్రాన్ల సెల్ఫీ, దానికిచ్చిన ‘నైస్’ ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్ అవాల్సిందే!
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న బాటసారులను డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.Poor beggar, he is begging for the cost of charging.😅😅Buy a robot to make money. pic.twitter.com/7jBKZJG12b— Sharing Travel (@TripInChina) June 13, 2026సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఆనందంగా దూకింది.. సాహస యాత్రే చివరి యాత్ర..
అడ్వెంచర్ స్పోర్ట్స్ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఓ యువతి(21) నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. 40 మీటర్ల ఎత్తున్న రోప్ జంప్ (Rope Jump) ఈవెంట్లో పాల్గొన్న యువతికి భద్రతా తాడును కట్టకుండానే వంతెన పైనుంచి కిందకు తోసేశారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.వివరాల మేరకు.. ఈ ఘటనలో మృతురాలిని మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రైటాస్ (21)గా గుర్తించారు. ఆమె బ్రెజిల్లోని సావో పాలో రాష్ట్రంలోని లిమీరా ప్రాంతంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన మరియా, రోప్ జంప్ అనుభవాన్ని ఆస్వాదించాలని అనుకుంది. ఈ క్రమంలో రోప్ జంప్కు ముందు యువతికి హార్నెస్, ఇతర భద్రతా పరికరాలు అమర్చారు. అయితే అత్యంత కీలకమైన ప్రధాన సేఫ్టీ తాడును హార్నెస్కు అనుసంధానం చేయడం నిర్వాహకులు మర్చిపోయినట్లు తెలుస్తోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs— Rapid Report (@RapidReport2025) June 13, 2026జంప్నకు సిద్ధమైన మరియాను ఇద్దరు సిబ్బంది వంతెన అంచుకు తీసుకెళ్లారు. కౌంట్డౌన్ ముగిసిన తర్వాత ఆమెను దూకించారు. అయితే ఆమె గాల్లోకి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే అక్కడ ఉన్న కొందరు సిబ్బంది, ప్రత్యక్ష సాక్షులు "తాడు లేదు... తాడు లేదు..." అంటూ అరవడం వీడియోలో స్పష్టంగా వినిపించింది. అప్పటికే యువతి నేరుగా కిందపడిపోయింది. సుమారు 40 మీటర్ల (130 అడుగులకు పైగా) ఎత్తు నుంచి కిందపడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఘటనాస్థలంలోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.వైరల్గా మారిన వీడియో..ఈ ప్రమాదం మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయింది. అనంతరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో యువతి ఉత్సాహంగా జంప్కు సిద్ధమవడం, దూకిన తర్వాత సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురవడం కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా తనిఖీ చేసి ఉంటే ఈ ప్రాణనష్టం జరిగేది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ నిర్వాహకులు, భద్రతా సిబ్బందిని విచారిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా? జంప్కు ముందు తప్పనిసరి చెక్లిస్ట్ అమలు చేశారా? అనే అంశాలపై దర్యాప్తు సాగుతోంది.JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/LPLfXyZ5qc— Pense (@creatorhouseinx) June 14, 2026 -
విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. కేవలం స్వల్పవిభేదాలకే కోర్టుకెక్కుతున్నారు. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఈ విడాకులు అనేది కేవలం తల్లిదండ్రులుగా వారికే కాదు.. ఇరు కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రేమాభిమానాలకు, భావోద్వేగ బంధాలకు భంగం కలిగిస్తాయి. ఈ క్రమంలో ఒక విడాకుల స్టోరీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మనస్పర్దలతో భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది శిఖా సింగ్. ఆమెకు 2020లో సౌరభ్తో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో గొడవపడి, ఆ తర్వాత అతనిపై కట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు దాదాపు ఐదేళ్లపాటు కొనసాగింది. ఈ సమయంలో కుమార్తెకు అండగా నిలిచి ఆమె తండ్రి న్యాయపరమైన ఖర్చుల కోసం ఉన్నదంతా ఖర్చు చేసేశాడు. అటు కుమార్తె భవిష్యత్తు, ఇటు ఆర్థిక ఇబ్బందులు ఆ తండ్రిని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. మామగారి అనారోగ్యం గురించి తెలుకున్న శిఖా భర్త మెరుగైన వైద్యం కోసం అతడిని ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, ఆ ఖర్చులన్నింటినీ స్వయంగా భరించాడు. ఎంతో సపోర్ట్గా నిలిచాడు. ఇక్కడే అల్లుడు.. కన్న కొడుకులా ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. దీంతో శిఖా మనసులో భర్త మీదున్న ద్వేషం పోయింది. మళ్లీ ప్రేమాభిమానాలు చిగురించాయి. ఇంతలో విడాకుల కేసు విచారణకు వచ్చింది. విడాకులు మంజూరయ్యాయి. తాను కష్టకాలంలో ఉన్నపుడు సౌరభ్ చూపిన ప్రేమ, మానవత్వాన్ని చూసి శిఖా చలించిపోయింది. అంతే విడాకుల పత్రాలను చింపేసి భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లతోనే భర్తను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటున్నాయి. Shikha Singh had a dispute with her husband and filed a false dowry case against him, demanding a divorce.The girl's father had exhausted all his money fighting the case for five years. When she suffered a heart attack, she had to be admitted to a government hospital due to… https://t.co/HAMEhtu6Mx— Sainidan. Ratnu. Ex. Adm.Judicial Officer (@Sainidan1) June 12, 2026 -
డేంజరస్ స్టంట్ : యెమెన్ స్పైడర్ మ్యాన్ దుర్మరణం
"యెమెన్ స్పైడర్ మ్యాన్" గా గుర్తింపు పొందిన యువ అక్రోబాట్ అల్-ఖకా బిన్ అన్తార్ (Al-Qa'qa' bin Antar) విషాదకర స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండానే అచ్చం స్పైడర్ మ్యాన్లా నిటారైన కొండలను చకచకా ఎక్కేస్తూ అంతర్జాతీయంగా సోషల్ మీడియాలో భారీ గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. యెమెన్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన కొండలు, పర్వతాలను ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా ఒక అగ్నిపర్వత క్రేటర్ (కుహరం) ఎక్కుతూ, సోషల్ మీడియా కోసం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను పణంగా పెట్టి, అద్భుతమైన సాహసాలతో ఆకట్టుకునే స్పైడర్ మ్యాన్ ఇక లేడన్న వార్త అటు యెమెన్లోనూ, ఇటు అభిమానుల్లోనూ తీవ్ర విచారాన్ని నింపింది. ధమార్ (Dhamar) ప్రాంతంలోని ప్రసిద్ధ 'హరదత్ దమ్త్' (Haradhat Damt) అగ్నిపర్వత క్రేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 120 మీటర్ల లోతున్న నిటారైన అగ్నిపర్వత లోయ గోడలను అన్తార్ ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేదా రోప్లు లేకుండా ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోవడంతో ఆయన నేరుగా వందల అడుగుల లోతున్న క్రేటర్ అడుగుభాగానికి పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు కష్టం కావడంతో ఫలితం దక్కలేదు. ఆ లోయ అడుగు భాగంలో గంధకపు వేడి నీటిలో పడిపోయాడు. అక్కడికి చేరుకునే మార్గం లేక రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత చివరకు యువ క్లైంబర్ నిర్జీవ దేహాన్ని బయటకు తీశారు.من المواقف الذي تحبس الانفاس لحظة محاول العثور على جثة القعقاع رحمة الله عليه هل الذين كانوا يشجعوه يتحملوا المسؤلية؟ pic.twitter.com/y1ow1fWIPo— نوادر ومواقف (@Nawader_X) June 12, 2026 అన్తార్ యెమెన్లోని నిటారైన కొండలు, పురాతన కట్టడాలు,అగ్నిపర్వత శిలలపై రక్షణ లేకుండా ఎక్కుతూ సాహసాలకు నెటిజన్లు ఫిదా అయ్యేవారు. దీనికి సంబంధించిన వీడియోలు చాలా పాపులర్ కావడంతో "యెమెన్ స్పైడర్ మ్యాన్" అనే పేరు వచ్చింది. అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఆయన చేసిన ప్రమాదకరమైన క్లైంబింగ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభించాయి.అన్తార్ అకాల మరణంపై యెమెన్లోని సోషల్ మీడియా వినియోగదారులు, ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ధైర్యాన్ని కొనియాడుతూనే, కేవలం సోషల్ మీడియా లైక్లు, వ్యూస్ కోసం ఎలాంటి భద్రత లేకుండా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!
తాను తట్టకోలేని జీర్ణించుకోలేని భాధను అనుభవిస్తూ కూడా మంచి పనికి పూనుకున్నాడు. భార్యభర్తలు ఎంజాయ్ చేద్దాం అనుకుని మరి పొదుపు చేసిన మొత్తం..చివరికి అనుకోని పరిస్థితుల్లో ఆ భర్త విరాళంగా ఇచ్చాడు. అదీకూడా మాతృభూమి కోసం ప్రాణాలర్పించే యుద్దవీరుల కోసం ఆ సొమ్ముని ఇచ్చి తన పెద్దమనసుని చాటుకున్నాడు.అతడే నాగ్పూర్కి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి శ్రీకాంత్ సహస్రబుద్ధే. తాను తన భార్య పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యామని. తామిద్దరం ప్రపంచయాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో పీఎఫ్, పొదుపు డబ్బుతో ప్లాన్ వేసుకున్నట్లు తెలిపారు. కానీ విధి మరోలా తలచి..తన భార్యను దూరం చేసిందన్నారు ఆవేదనగా శ్రీకాంత్. పదేళ్ల క్రితం తను చనిపోవడంతో ఆ యాత్ర చేయాలన్న ఆసక్తే పోయిందన్నారు. ఆమె మరణంతో తనకు ఎక్కడకు వెళ్లాలనిపించలేదన్నారు. అయితే ఒకరోజు అకోలాకు చెందిన ఒక వ్యక్తి భారత సైన్యానికి రూ. 1 కోటి విరాళం ఇచ్చినట్లు వాట్సాప్ మెసేజ్ చూశా. తాను అంత ఇవ్వలేను కానీ..దాచుకున్న పొదుపులోంచి రూ. 25 లక్షలు ఇవ్వగలని అనుకున్నా..అలా తన కలల యాత్ర కోసం ఆదా చేసిన పీఎఫ్ డబ్బులో సగం విరాళం ఇచ్చానని చెప్పుకొచ్చారు. బహుశా భార్యతో కలిసి ప్రయాణం చేస్తే కలిగే సంతోషం కంటే ఈ పని వల్ల లభిస్తుందేమోనన్న ఆశతో ఇలా చేశానని అన్నారు. పైగా ఆయన విరాళం ఇచ్చేటప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తను తన భార్యను ఎంతలా మిస్ అవ్వుతున్నారో కూడా చెప్పారు. అంతేగాదు తన భార్య ఎంత మంచి మనిషో కూడా వివరించారు. నెటిజన్లు అతడి చర్యను అభినందిస్తూ..గొప్ప మనిషి..ఆయన చేసిన పనికి సెల్యూట్, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్! భావోద్వేగంలో ఓ నాన్న..) -
జనాల ప్రాణాలతో చెలగాటమా?.. నిలదీసిన బైకర్
హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు జనాల్ని భయపెట్టింది. రాంగ్ రూట్లో ఆ డ్రైవర్ వేగంగా దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే.. ఓ బైకర్ ఆ బస్సును అడ్డుకోవడంతో అక్కడ హైడ్రామా నడిచింది. కాసేపు ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. చేసేది లేక బస్సు డ్రైవర్ వెనక్కి తగ్గినట్లే కనిపించాడు. అయితే ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా ఓ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టాడు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్అవుతోంది.నగరంలోని 195W రూట్కు సంబంధించిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. రాంగ్ రూట్లో అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ సమయంలో ఓ బైకర్ ధైర్యంగా బస్సును అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బైకర్, అక్కడే ఉన్న ట్రాఫిక్ వాలంటీర్ గట్టిగా నిలదీయగా, డ్రైవర్ తీవ్ర ఆగ్రహంతో వాళ్లపై అసభ్య పదజాలంతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బైకర్ను తప్పించి ముందుకెళ్లే ప్రయత్నం చేయగా.. ఆ బైకర్ మాత్రం అస్సలు తగ్గలేదు. రైట్ రూట్లోనే వెళ్లాలంటూ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆ బైకర్ను, ముందు ఉన్న ఓ కారును, ఆ రూట్లో వచ్చిపోయే వాహనాలను బస్సు డ్రైవర్ తన డ్రైవింగ్ స్కిల్స్తో భయపెట్టే ప్రయత్నం చేశాఉడ. ఆ తర్వాత బస్సు ముందుకు కదులుతూ ప్రయాణికులతో ఉన్న ఒక ఆటోను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళం నెలకొంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది. కొందరు డ్రైవర్లు నిబంధనలు పట్టించుకోకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ బస్సు నెంబర్ TG 10 T 1469 మీద చలాన్లు ఉన్నాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ కావడం, ట్యాగులు చేయడంతో ఈ ఘటనపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్ఆర్టీసీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. తక్షణ విచారణ చేపట్టామని చెబుతూ రీ ట్వీట్లు చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు. నగరంలో ఇలా ప్రవర్తించే ఆర్టీసీ డ్రైవర్లు చాలామంది ఉన్నారని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి వైఖరిని ప్రదర్శించరని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆ బైకర్ను వెల్డన్ బ్రో అని అభినందిస్తున్నారు. హైదరాబాద్లో RTC డ్రైవర్ బరితెగింపు: రాంగ్ రూట్లో వచ్చి హల్చల్**195W రూట్కు చెందిన **TG 10 T 1469** నంబర్ గల బస్సు డ్రైవర్, రాంగ్ రూట్లో అత్యంత వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైకర్, కారు డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేశాడు. తన తప్పును ప్రశ్నించినందుకు అక్కడ ఉన్న పోలీస్… pic.twitter.com/4KVWSidsop— AVM (@AvmNews7) June 13, 2026 -
మొన్న ప్రణీత్, ఇపుడు మధుర్ విర్లీ : వీడియో వైరల్
స్టాండప్ కామెడీ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో మరో స్టాండప్ కమెడియన్ మధుర్ విర్లీ విచక్షణ మరిచి రెచ్చిపోయిన వైనంపై వివాదం చెలరేగింది. అత్యాచారాలు, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత హత్యలకు ఎందుకు పాల్పడతారో తెలుపుతూ గతంలో ఒక షోలో చేసిన అసభ్యకర వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్గా మారింది. కమెడియన్ ప్రణీత్ మోరే వివాదం (Rs 370 Ki Biryani) ముగియక ముందే, మధుర్ విర్లీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట పడాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రణీత్ తర్వాత ఇప్పుడు మధుర్ విర్లీ బాధితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. డ్యాంక్ కామెడీ పేరుతో బాధితులను అత్యంత దారుణంగా అవమానిస్తూ అత్యాచారానికి సంబంధించిన అంశాలపై నోటికొచ్చినట్టు రెచ్చిపోయాడు. అత్యాచార నిందితులు ఆ తర్వాత ఎందుకు హత్యలకు పాల్పడతారనే విషయంపై ఆయన జోకులు పేల్చడం తీవ్ర దుమారం రేపుతోంది.2024 నాటి షో 'లవ్ & లేటెక్స్'కు చెందిన వీడియోలో పది అత్యాచార, హత్యాచార కేసులలో తొమ్మిది కేవలం అత్యాచారానికి సంబంధించినవే అంటూ మరింత అభ్యంతరకర రీతిలో జోకులు వేశాడు. Meet Madhur Virli:Since when did rape jokes become normal? If you can't make people laugh without joking about someone's worst trauma, maybe comedy isn't for you.Find an honest job instead of using pain and suffering for cheap laughs.What is even more disgusting is that the… pic.twitter.com/ZxZ9c3vJwm— Sachya (@sachya2002) June 12, 2026మండిపడుతున్న నెటిజన్లుఈ వ్యాఖ్యలు అత్యంత సున్నిత రహితంగా, అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మొన్న ప్రణీత్, ఇప్పుడు మధుర్ విర్లీ. బాధితులపై డార్క్ కామెడీ/డ్యాంక్ కామెడీ పేరుతో ఇంత దారుణ వ్యాఖ్యలా? వీళ్లంతా విద్యావంతులమని చెప్పుకునే ఉదారవాదులు. నవ్వుతున్న వారిలో స్త్రీపురుషులిద్దరూ ఉన్నారు. ఒకవేళ ఇలాంటివే వారి కుటుంబాల్లో జరిగితే? అప్పుడు కూడా ఇలాగే ఎగతాళి చేస్తారా? అని ఒకరు ప్రశ్నించారు. మధుర్ విర్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్యం పేరుతో ఏదైనా, ఎంతైనా మాట్లాడటం సరికాదు, విజ్ఞత, విచక్షణ ఉండాలని సూచిస్తున్నారు. బాధితుల కోలుకోలేని గాయాలను, మానసిక క్షోభను, బాధలను హాస్యాస్పదం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్ (@NCWIndia)ను ట్యాగ్ చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకుని అతడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. టికెట్లు కొనుక్కుని మరీ ఇలాంటి సున్నితమైన అంశాలపై వచ్చే జోకులకు నవ్వుతున్న ప్రేక్షకులను కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు.మరోవైపు తన వీడియోపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రమవ్వడంతో మధుర్ విర్లీ తన సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన లేదా క్షమాపణలు చెప్పలేదు. కాగా ఇప్పటికే ప్రణీత్ మోరే "370 బిర్యానీ" వివాదంలో చిక్కుకుని విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఈ రెండో ఘటన వెలుగుచూసింది. ప్రణీత్ మోరేపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం. అయితే తాజాగా ఈ వివాదంపై ప్రణీత్ క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. -
క్రికెట్ క్యాచ్తో చిన్నారి ప్రాణాలు కాపాడాడు!
కిటికీ అంచున వేలాడుతూ ఓ పసిప్రాణం.. తొమ్మిది నిమిషాల పాటు కొనసాగిన ఉత్కంఠ.. ఇక కిందపడిపోతుందనుకుని అంతా కళ్లు మూసుకున్న టైంలో.. అనూహ్యంగా ఓ భారతీయుడు ఆమె ప్రాణం కాపాడాడు. లండన్లో జరిగిన ఈ ఉత్కంఠభరిత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తూర్పు లండన్లోని ఇల్ఫోర్డ్ హైరోడ్ ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నా సమయంలో.. ఓ భవనం కిటికీ అంచుపై మూడేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది. ఆమె ఎప్పుడు కిందపడిపోతుందోనన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారి, స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మొహమ్మద్ జెసిల్ చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు.చిన్నారి పట్టును కోల్పోతున్న సమయంలో ఓ వ్యక్తి నిచ్చెన తీసుకొచ్చి సహాయం చేశాడు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో చిన్నారి కిందకు జారిపోయింది. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న జెసిల్ అనే భారతీయ వ్యక్తి.. ఆమెను అద్భుతంగా అందుకుని ప్రాణాలు కాపాడాడు. పక్కనే ఉన్న పోలీసు అధికారి కూడా అతడికి సహకరించడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనపై స్పందించిన జెసిల్.. తాను భారతదేశంలో క్రికెట్ ఆడిన అనుభవమే ఆ సమయంలో ఉపయోగపడిందని చెప్పారు. "ఆ క్షణంలో ఎక్కువగా ఆలోచించలేదు. ఓ తండ్రిగా అలా ముందుకు వెళ్లాను. క్రికెట్ ఆడిన అనుభవం వల్ల క్యాచ్పై దృష్టి పెట్టగలిగాను" అని తెలిపారు. ఇక చిన్నారి తండ్రి స్పందిస్తూ.. తన కుమార్తెను కాపాడిన జెసిల్, పోలీసు అధికారిని నిజమైన హీరోలుగా అభివర్ణించారు. ప్రమాదంలో చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని.. ఆమె తిరిగి పాఠశాలకు కూడా వెళ్లిందని తెలిపారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తక్కువ టైంలోనే రెస్క్యూ ఆపరేషన్ ముగిందని ప్రకటించారు. మనోడు పాల్గొన్న ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.. A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public. pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026 -
అత్తారింట్లో అల్లుడి సరదా పని.. వీడియో వైరల్
పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు ఓ భర్త చేసిన వినూత్న ప్రయత్నం నవ్వులు పూయించింది. అత్తారింటికి వెళ్లి తన ఇల్లాలిని తీసుకురావడానికి అల్లుడు చేసిన సరదా పని అందరి దృష్టిని ఆకర్షించింది. నా భార్యను నాతో తిరిగి పంపండి అంటూ రాసిన కేక్ తీసుకెళ్లి అత్తామామలను బతిమాలుకున్నాడు. ఇంతగా అడిగితే ఎవరైనా కాదంటారా? వెంటనే అత్తమామలు.. అల్లుడికి తన కూతురిని అప్పగించేశారు. ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వెగ వైరల్ అవుతోంది.‘కరణ్ & మోనా’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. “నువ్వు లేకుండా ఉండలేని వ్యక్తినే పెళ్లి చేసుకో” అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోకు 16 లక్షల లైకులు, 8 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. వైరల్గా మారిన ఈ వీడియోలో.. తన భార్య 10 రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లో ఉండటంతో ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన భర్త చేతిలో ఒక ప్రత్యేకమైన కేక్ కనిపించింది. ఆ కేక్పై ముజే మేరీ బీవీ వాపస్ దొ (నా భార్యను తిరిగి నా దగ్గరకు పంపించండి) అని రాసి ఉండటం చూసి అక్కడ ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. అత్తగారు స్వయంగా కూతురిని అల్లుడికి అప్పగించడం వీడియోలో కనిపించింది. వీరు ఎక్కడి వారు అనే వివరాలు వెల్లడి కాలేదు. భార్యభర్తల పేర్లు కరణ్, మోనా అని తెలుస్తోంది.నెటిజన్ల స్పందనపుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి తీసుకొచ్చేందుకు వినూత్న పంథా అనుసరించిన సదరు భర్తపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇల్లాలిపై ప్రేమాభిమానాలు చూపించిన ఇంటాయనను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. “వివాహ జీవితాన్ని సంతోషంగా లేదా బాధాకరంగా మార్చేది చాలా వరకు భర్త ప్రవర్తనే. అతని చిన్న చిన్న ప్రయత్నాలు భార్య హృదయంలో ఎంతో ఆనందాన్ని నింపుతాయి” అని ఒకరు వ్యాఖ్యానించారు.“ఇది చాలా మధురమైన క్షణం. ముఖ్యంగా అమ్మ గారి స్పందన ఎంతో క్యూట్గా ఉంది”, “మీ ఇద్దరికీ ఆశీర్వాదాలు. తన భావాలను ఇంత అందంగా వ్యక్తపరిచే భర్త చాలా అరుదు”, “కూతురిని ప్రేమగా, గౌరవంగా చూసుకునే ఇలాంటి అల్లుడిని ప్రతి తల్లిదండ్రులు స్వాగతించాలి”, “ఇలాంటి అల్లుడు దొరికినందుకు మీ తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది” అని నెటిజనులు కామెంట్లు పెట్టారు.చదవండి: బొంగరపు ఆట కదరా జీవితం!భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, చిన్న చిన్న మధురమైన ప్రయత్నాలు ఎంతటి ఆనందాన్ని తీసుకురాగలవో ఈ వీడియో మరోసారి గుర్తు చేసిందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Karan & Mona (@notperfectbutus) -
ఆ అమ్మకు ఆ జర్నీ అత్యంత స్పెషల్..!
కొన్ని చిత్రాలు చెప్పే కథ ఎంతో అపురూపంగా మనసుని తాకేలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చిత్ర చెప్పే కథే. అచ్చం అలాంటి స్టోరీనే నెట్టింట వైరల్గా మారింది. పైగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలు అంటూ అంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇంతకీ ఏంటా కథా చిత్రం అంటే..ఒక తల్లి ప్రయాణి ఇద్దరు కుమారుల కారణంగా అత్యంత ప్రత్యేకంగా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వుతూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. ఒక కుమారుడు ఆమెను విమానం ఎక్కించడానికి ఎయిర్పోర్ట్కి రాగ, మరోక కుమారుడు ఆమెను పైలట్గా గమ్యస్థానానికి చేర్చడానికి వేచి ఉన్నాడు. అందుకు సంబంధించిన భావోద్వేగ క్షణాన్ని పంచుకుంటూ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తన పులులతో గర్వపడే తల్లి అనే క్యాప్షన్ జోడిస్తూ ఇలా పేర్కొన్నారు. అమ్మను నా తమ్ముడికి అప్పగిస్తున్నందుకు గర్వంగా ఉంది. నా తమ్ముడి కెప్టన్ అమన్ సక్సేనా సారథ్యంలో అమ్మ తన గూటికి తిరిగి వెళ్తోంది. అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన రెండు ఫోటోలు ఎంతో అందంగా రెండు విషయాలను వివరించాయి. మొదటి పోటో.. ఆ తల్లి తన పెద్దకొడుకు అక్షత్తో కలిసి విమానాశ్రయంలో దిగిన చిత్రం . అక్కడ అతను ఆమెకు వీడ్కోలు పలుకుతున్నాడు. ఇక రెండో ఫోటోలో విమానం దిగిన తర్వాత దిగిన ఫోటో. అందులో ఆ విమానాన్ని నడిపిన చిన్న కొడుకు కెప్టెన్ అమన్ సక్సేనాతో దిగిన చిత్రం. ఓ అమ్మకు ఇంతకు మించిన ధైర్యం ఇంకే కావలంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తు పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Akshat (@captain_akshat) (చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..) -
అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల వయసులో ఆమె ..
చాలామంది యువకులు సైతం ప్రయత్నించడానికి సంకోచించే డేరింగ్ ఫీట్ ఇది. నేర్చుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాహసం చేయాలన్న వయసు ఎన్నటికీ అడ్డంకి కాదు అనే చెప్పే సంఘటన ఇది. ఓ కూతురు తల్లి కలను నెరవేర్చి ఆమె కళ్లలో ఉబికి వచ్చిన ఆనందం చూసి ఉప్పొంగింది. వాళ్లను బాగా కేర్గా చూసుకోవడం కాదు..వాళ్ల కలలను కూడా నెరవేర్చే ప్రయత్నం చేయండి అంతకన్న ఇంకేం ఆశించరు అన్న అంశాన్ని నొక్కి చెప్పింది ఈ ఘటన. అందుకు సంబంధించిన వీడియోని రూపాలి జన్బంధు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆమె 53 ఏళ్ల తల్లి తన కూతురుతో కలిసి ఒక స్కైడైవింగ్ క్లిప్ని చూస్తూ..కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె కూతురితో తాను కూడా ప్రయత్నించొచ్చా అని సరదాగా అడుగుతుంది. ఏదో సరదాగా అన్న ఆమాటను కూతురు నిజం చేస్తుందని ఆ క్షణం ఆమె అనుకోలేదు. కానీ ఆ తర్వాత కూతురు ఆ సాహసాన్నే తల్లికి ఊహించని సర్ప్రైజ్ గిప్ట్లా ఇచ్చింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ చాలా ఉత్సాహంతో ఎప్పడెప్పుడు ఆకాశంలోకి ఎగిరిపోతానో అన్నట్లుగా స్కైడైవింగ్ దుస్తులతో ఆత్రుగా ఉందామె. ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ఎగరడానికి సిద్ధం అన్నట్లుగా డేరింగ్ చేసింది ఆ స్టంట్. పైగా ఆ స్కైడైవింగ్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఆమెను చూస్తే..ఎవ్వరికైన జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా తప్ప వయసు, భయాలను అడ్డంకిగా చేసుకోకూడదనిపిస్తుంది. అంతేగాదు ఈ వీడియోకి కూతురు రూపాలి..“73 ఏళ్లకే ఎగరడానికి సిద్ధం. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది అమ్మా” అని క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ప్రేమిస్తున్నా అని చెప్పే బదులు..వారి కలలను నెరవేర్చేలా చూడండి..ఉన్నది ఒక్కటే జీవితం..హాయిగా జీవించనివ్వండి అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Rupali Janbandhu (@nofussfitness_rup) (చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్ ఖేర్) -
ప్లీజ్ రూపాన్ని చూసి అంచనా వేయొద్దు..!: అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఘటన నెట్టింట హాట్టాపిక్గా మారింది. తప్పు చేయడం సహజమే అయినా..దాన్ని బహిరంగంగా ఒప్పుకోవడం తోపాటు తనలా చేయొద్దని హితవు పలకడానికి చాలా ధైర్యం కావాలి. ఇక్కడ నటుడు అనుపమ్ సరిగ్గా అలాంటి పనే చేశారు అసలేం జరిగిందంటే..గోవా నుంచి ముంబై వెళ్లే విమానంలో ఓ అధిక బరువు ఉన్న వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ..అతడితో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఆ విమానంలో డేవిడ్ అనే వ్యక్తి పెద్ద మొత్తంలో చాక్లెట్లు, స్వీట్లు పట్టుకుని రావడం చూస్తారు. నిజానికి డేవిడ్ విమానంలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ప్రయాణికుల అందరి చూపులు అతని మీదే ఉంటాయి. నటుడు అనుపమ్ కూడా పక్క వ్యక్తివైపు చూస్తూ అతను అంతలా స్వీట్లు, చాక్లెట్లు తినకూడదని అంటాడు. అది కూడా కేవలం ఒక శ్రేయోభిలాషిలానే చెప్పినట్లు తెలిపారు ఖేర్. దానికి ఆ వ్యక్తి నవ్వి..బహుశా అందుకే అతడు అంతలా కనిపిస్తున్నాడేమో అని సమాధానమిచ్చారని రాసుకొచ్చారు సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో. అయితే కాసేపటి తర్వాత డేవిడ్ తిరిగి వచ్చి ఆ స్వీట్లన్నింటిని తీసుకుని క్యాబిన్ సిబ్బందికి ఇచ్చాడు. అది చూసి తాను ఆశ్చర్యపోయానంటూ రాసుకొచ్చారు ఖేర్. వెంటనే ఆ తర్వాత తాను ఆ చాక్లెట్లన్నీ చూసి మీరు తింటారనుకున్నా, అందుకే ఇంత అధిక బరువు ఉన్నారని అనుకున్నా అంటూ అసలు విషయం చెప్పాడు ఖేర్. అందుకు డేవివ్ నవ్వి, తనకు అనారోగ్య సమస్య ఉందని, అందువల్లే ఇలా లావుగా కనిపిస్తున్నట్లు తెలిపాడు. తాను గతంలో ఎయిర్లైన్లో పనిచేశానని, ప్రయాణికులకు సేవ చేయడానికి క్యాబిన్ సిబ్బంది ఎంతలా కష్టపడతారో తనకు బాగా తెలుసునని అన్నారు. అందుకే వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇలా ప్రయాణించిన ప్రతిసారీ వారికి ఏదైన తీపి పదార్థాన్ని ఇవ్వడం ఒక అలవాటుగా మార్చుకున్నానని అన్నాడు. ఒక్కసారిగా ఖేర్ ఇతడు ఎంత గొప్ప మనిషి, నాకెంత గొప్ప పాఠం నేర్పాడు అని ఆశ్చర్యపోయానంటూ ఆ సంఘటన గురించి వివరించారు ఖేర్. ఈ ఘటన ఇతరుల రూపాన్ని బట్టి ఒక అంచనాకు రావడం ఎంత ప్రమాదకరమైందో తెలియజేసిందన్నారు. ఒక్కసారిగా రూపంబట్టి చాలా సులభంగా అంచనా వేసి, కథలు అల్లేస్తుంటాం..వాళ్లు ఆ మార్గంలో పయనించడానికి దాని వెనుకున్న కారణం, వారి జీవితాల గురించి ఏమి తెలియకుండానే తేలిగ్గా అంచనాకు వచ్చేస్తాం అన్నారు. దయచేసి తనలా అలా చేయొద్దు అని చెబుతూ డేవిడ్తో ఒక సెల్ఫీ కూడా దిగినట్లు తెలిపారు. అలాగే అతడికి ఇంత మంచి జీవిత పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు చెప్పినట్లు రాసుకొచ్చారు పోస్ట్లో. అయితే నెటిజన్లు ఖేర్ మీరు చాలాగ్రేట్ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి, అలాగే బాహ్య రూపం బట్టి అంచనాకు రాకూడదనే లోతైన జీవిత పాఠం ఇది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఈ ఘటన "డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్" అనే సామెతకు అసలైన అర్థం కదూ..!.THANK YOU DAVID FOR THE LESSON! 🥹❤️Life is full of lessons. Last week, on a flight from Goa to Mumbai, I learned one.In the picture is David.When David boarded the flight, many people looked at him because he was overweight. He came and sat across the aisle from me. In the… pic.twitter.com/Yw7rjm4qcu— Anupam Kher (@AnupamPKher) June 11, 2026 (చదవండి: పిల్లలను మానసికంగా స్ట్రాంగ్గా మార్చే ‘10-10-10’ రూల్..!) -
కామెడీ షోలో లేడీ డాక్టర్ వల్గర్ కామెంట్లు
కామెడీ పేరుతో వేసే వెగటు జోకులు ఒక్కోసారి జనాలకు కోపం తెప్పిస్తుంటాయి. అలా ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో జరిగిన ఒక ఇంటరాక్షన్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రణీత్ మోర్ నిర్వహించిన షోలో ఒక యువ డాక్టర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న సీజల్ పవార్ అనే డాక్టర్, శవాలపై నిర్వహించే శిక్షణ (అటాప్సీ/కాడేవర్ స్టడీ) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ మృతదేహాల ప్రైవేట్ పార్ట్ల గురించి తాను, తన తోటి మహిళా డాక్టర్లు జోకులు వేసుకుంటామంటూ ఆమె మాట్లాడారు. ఆ సమయంలో ప్రణీత్ సహా అంతా సరదాగా నవ్వులు చిందించారు. అయితే ఆమె అనుచితంగా మాట్లాడారంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో వైద్య వర్గాలు, విద్యార్థులు తీవ్రంగా స్పందించారు. వైద్య విద్యలో కాడేవర్ స్టడీ అనేది ఒక గౌరవప్రదమైన శాస్త్రీయ ప్రక్రియ అని, దానిపై జోకులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఈ అంశంపై నైతిక బాధ్యత, మాటల పరిమితులు, పబ్లిక్ ఫిగర్ల బాధ్యతపై కూడా చర్చ మొదలైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒకరిపై ఎంత స్థాయిలో చర్యలు తీసుకోవాలి అన్న ప్రశ్న కూడా సోషల్ మీడియాలో లేవనెత్తబడింది.వివాదం పెరుగుతుండటంతో సీజల్ పవార్ తన వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్లో క్షమాపణలు తెలిపారు. తన మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, బాధ్యత తనదేనని ఆమె పేర్కొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఇక ఈ షోలో పాల్గొన్న కామెడియన్ ప్రణీత్ మోర్ కూడా విమర్శల మధ్య సోషల్ మీడియా ఖాతాను డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది.Sejal pawar doctor by profession talking about how she and her friends make fun of dead bodies about their dick size and made several nasty comments about male reproductive organ pic.twitter.com/q7rfQoi6DJ— Aarohi (@hamlakroo) June 10, 2026 -
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా -
సెల్ఫోన్ కోసం 262 అడుగుల ఎత్తులో..
పట్టు తప్పిందా ఇక అంతే!. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. అందుకే ఆ యువకుడి సాహసం.. అక్కడున్నవాళ్లను షాక్కు గురి చేసింది. ఉత్కంఠతో చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందా? అని ఊపిరి బిగబట్టేలా చేసింది. పోనీ అదంతా ఎందుకు చేశాడా? అని కారణం తెలిశాక.. కంగుతినడం అక్కడున్నవాళ్ల వంతు అయ్యింది. ఒక సాధారణ పర్యాటక విహారం క్షణాల్లోనే ఉత్కంఠభరిత ఘటనగా మారింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇగ్వాజు జలపాతం (Iguazu Falls) వద్ద ఓ టూరిస్ట్ ప్రాణాలను లెక్కచేయకుండా వేగంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకాడు. కాసేపు అలాగే గనుక ఉండి ఉంటే.. ప్రవాహం ధాటికి కచ్చితంగా వందల అడుగుల కిందకి పడిపోయేవాడే!. ఈ సంఘటన బ్రెజిల్ వైపు ఉన్న జలపాతం ప్రాంతంలో శనివారం (జూన్ 6) చోటుచేసుకుంది.ఇగ్వాజు జలపాతం అర్జెంటీనా–బ్రెజిల్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద జలపాత వ్యవస్థల్లో ఒకటి. సుమారు 262 అడుగుల లోతు ఉంటుందది. రెండు దేశాల మధ్య ప్రాంతం కావడంతో పర్యాటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అదే సమయంలో ఇక్కడి భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉండడం తరచూ వార్తల్లో వినిపిస్తుంటుంది. "Loco total"Porque un turista que estaba visitando las Cataratas de Iguazú se tiro al agua para recuperar su teléfono celular, lo recuperó, se subió a la pasarela y siguió recorriendo el lugar. pic.twitter.com/pWpmgsMLVV— Tendencias en Argentina (@porqueTTarg) June 8, 2026అలా.. ఓ పర్యాటకుడు ఈ వాటర్ఫాల్ అంచుల్లో దిగడం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉన్నట్లుడి.. ఓ టూరిస్ట్ రాళ్లపై నుంచి దూకి ప్రవాహంలోకి వెళ్లి ఏదో వెతకబోయాడు. జలపాతం ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బలమైన నీటి ప్రవాహం, జారిపోయే రాళ్లు, కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ప్రాణాంతకమైన ఎత్తు ఉండటంతో ఈ ప్రాంతాన్ని అధికారులు కఠినంగా నియంత్రిస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తి చేసిన చర్య అక్కడున్న పర్యాటకులను తీవ్రంగా షాక్కు గురిచేసింది. కాసేపు ఏదో వెతికి.. ఆలస్యం చేయకుండా వెంటనే బయటకు వచ్చేశాడు. అతగాడి చేష్టలను ఇతర పర్యాటకులు వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్గా మారింది. అయితే చావు నోట్లో తలపెట్టి రావడానికి సెల్ఫోన్ కారణమంట!. చేజారి అది పడిపోయిందని.. అందుకే అతను అలా సాహసం చేశాడని తెలుస్తోంది. మరి సెల్పోన్ దొరికిందా? లేదా? అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. Se tiró en la Garganta del Diablo para recuperar su celularUn hecho insólito generó indignación en las Cataratas del Iguazú, del lado brasileño.Un hombre se arrojó desde la pasarela del circuito Garganta del Diablo para buscar su celular tras caerse, sin poder regresar por… pic.twitter.com/7G4tGj7aRR— mavica (@mavica7) June 8, 2026అదృష్టవశాత్తూ అతనికేం కాలేదు. సురక్షితంగా బయటకు వచ్చాడు. అయితే ఈ సంఘటన భద్రతా నియమాలపై మరోసారి చర్చకు దారితీసింది.ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఓ పర్యాటకుడు తన టోపీ కోసం ఇలాగే చేశాడు. ఆ టైంలో అధికారులు సకాలంలో స్పందించడంతో బతికి బట్టకట్టాడు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళితే..
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో కొత్తగా చర్చనీయాంశంగా మారిన "ఫుడ్ క్రైమ్"పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తనదైన శైలిలో స్పందించి నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. బెంగళూరుకు చెందిన యశ్ అనే ప్రొడక్ట్ మేనేజర్ ఇడ్లీలను పిజా ముక్కల్లా త్రిభుజాకారంలో కట్ చేసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి శశిథరూర్ తనదైన శైలిలో 'ఇడ్లీని పిజా ముక్కల్లా కట్ చేయడం ఏంట్రా బాబూ' అన్నట్టుగా స్పందించారు."సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటగదిలోకి వెళ్లి డేటాను పార్టిషన్ చేయాలని ప్రయత్నిస్తే ఇదే జరుగుతుంది. దీనిని 'ఇడ్లీ' అంటారు, 'ఇడ్-స్లైస్' కాదు. ఇటాలియన్లు దాన్ని పిజాగా పొరబడితే తప్ప ఎవరూ ఇడ్లీని ఇలా తినరు. అయితే పిజాపై సాంబార్ పోయాలని మాత్రం ప్రయత్నించకండి" అంటూ తనదైన హాస్య శైలిలో ట్వీట్ చేశారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో ఇడ్లీ సంప్రదాయాల పరిరక్షకుడిగా శశి థరూర్ మరోసారి గుర్తింపు పొందారు.థరూర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజనులు కూడా సరదా కామెంట్లు పెట్టారు. కొందరు నెటిజన్లు ఇడ్లీలను "యాక్షనబుల్ యూనిట్స్"గా విభజించారని చమత్కరించగా, మరికొందరు యశ్ బ్రేక్ఫాస్ట్కే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సూత్రాలను వర్తింపజేశాడని, అందులో సెగ్మెంటేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్, చట్నీ యాక్సెసిబిలిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నాడని సరదాగా వ్యాఖ్యానించారు. సౌకర్యం కోసం అలా చేసి ఉండొచ్చని కొందరు భావించినప్పటికీ, చాలామంది నెటిజన్లు మాత్రం దీనిని ఇడ్లీపై జరిగిన "కార్పొరేట్ ప్రయోగం"గా అభివర్ణించారు.చదవండి: బొంగరపు ఆట నేర్పే జీవిత సత్యాలు!ఇటీవల కూడా "చాయ్తో ఇడ్లీ" అనే విచిత్రమైన ఆహార కలయిక సోషల్ మీడియాలో వైరల్ కావడంతో థరూర్ తీవ్ర అసమ్మతి వ్యక్తం చేశారు. దక్షిణ భారతీయులను ఆశ్చర్యానికి గురిచేసిన ఆ కలయికపై కూడా తనదైన స్టైయిల్లో స్పందించారు. చాయ్ కప్పులోనే ఉండాలి, ఇడ్లీ ప్లేట్లోనే ఉండాలి అంటూ సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. ఇడ్లీపై జరుగుతున్న ఈ వినూత్న ప్రయోగాలు సోషల్ మీడియాలో వినోదాన్ని పంచుతున్నప్పటికీ, సంప్రదాయ ఆహారాల విషయంలో ప్రజల భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో మరోసారి స్పష్టమైంది.This is what happens when a software engineer gets into the kitchen and tries to partition the data! Hey @ravaldosa, it’s called ‘idli’, not ‘id-slice’. No one eats idlis this way, unless they’re Italian and mistake it for pizza. (But don’t try putting sambar on pizza, ok?) https://t.co/11l27zGHQg— Shashi Tharoor (@ShashiTharoor) June 8, 2026 -
51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం
కొన్ని బంధాల్ని, అనుబంధాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. వ్యక్తిగత కోరికల్ని ఆశల్ని, ఆశయాల్ని కూడా తృణ ప్రాయంగా త్యజించే వారి త్యాగం, అంతకుమించిన అంతులేని ప్రేమ నిజంగా అందరి హృదయాల్ని కదిలించక మానదు. అలాంటి కథ ఒకటి ఎక్స్లో విశేషంగా నిలుస్తోంది. ఎక్స్లో సునీల్ కుమార్ షేర్ చేసిన వివరాల ప్రకారం 51 ఏళ్ల శీతల్, మానసిక వికలాంగుడైన 48 ఏళ్ల సోదరుడు అశ్విన్ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేశారు. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ, ఒక అక్కగా తన సోదరుడిపై తల్లి ప్రేమకు మించి చూపిస్తున్న ఆమె ప్రేమ నెట్టింట పలువురి ప్రశంసలు దక్కించుకుంటోంది.ఇదీ చదవండి: రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!తల్లిదండ్రులను కోల్పోయిన తరువాత, శీతల్ ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. తన సొంత కలల కంటే తమ్ముడి భవిష్యత్తు గురించి బెంగపడ్డారు. సోదరుడి సంతోషానికి ప్రాధాన్యతనిచ్చి, అనుక్షణం అతనికి చంటి పిల్లాడిలా సపర్యలు చేస్తూ, అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ఇందుకోసం తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. తాను పెళ్లి చేసుకోని వెళ్లిపోతే తమ్ముడు ఒంటిరి వాడైపోతానే ఆవేదనతో అసలు పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించు కున్నారు.She gave up her job, her marriage,and her dreams... just to become a mother to her brother ♥️🙏एक बहन का प्यार... जो माँ से रत्ती भर भी कम नहीं होता। ❤️51 साल की शीतल... और 48 साल का उनका भाई अश्विन...एक ऐसा अटूट रिश्ता, जिसे देखकर आँखें भर आएँगी। 🥹जब सिर से माँ-बाप का… pic.twitter.com/edMH8G3bZ2— Sunil Kumar (@sunilku20403616) June 8, 2026ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!శీతల్ ప్రేమ, అంకితభావానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రేమ తల్లి ప్రేమకు ఏమాత్రం తీసిపోనిది.వారిద్దరి విడదీయలేని అనుబంధం. వారి ప్రేమ నిజంగా హృదయాన్ని కదిలిస్తోందంటున్నారు. ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని అందంగా మార్చే నిస్వార్థమైన ప్రేమ. సోదరి త్యాగానికి, మాతృత్వపు ప్రేమకు జోహార్లు అని కొనియాడుతున్నారు. అందరికీ ఇలాంటి సోదరి ఉండాలని అకాంక్షిస్తున్నారు.ఇదీ చదవండి: 27 ఏళ్లకే భర్త దూరం : రూ. 500తో మొదలై రూ. 75 లక్షల టర్నోవర్ -
రూ. 2 లక్షల జీతం, అయినా తిప్పలే : ఎలా ఈ సంసారం!
నెలకు ఐదెంకల జీతం వస్తున్నా, నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వండి అంటూ ఒక జంట పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. నేటి తరం యువ దంపతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది అద్దం పడుతోంది. నెలకు రూ. 1.7 లక్షల సంపాదన ఉన్నప్పటికీ, నెలాఖరుకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగలడం లేదని వాపోయింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత జీతం వస్తున్నా ఈఎంఐలు,అప్పులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆ జంట చెప్పుకు రావడం అనేది నిజంగా ఆందోళనకరమైన విషయమే. నిజానికి మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు 2 లక్ష రూపాయలు జీతం అంటే సౌకర్యవంతంగానే గడిపేయొచ్చు. వీరి ఖర్చులు, కడుతున్న లోన్ల వివరాల ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే లోన్ల భారమే కారణంగా చెప్పవచ్చు. వ్యక్తిగత రుణం (Personal Loan), విద్యా రుణం (education loan), బైక్ రుణం , ఫోన్ రుణం వంటి వాటి కోసం వారి నెలవారీ EMIల మొత్తం రూ. 85,980 అవుతోంది. ఇవి కాకుండా ఆ దంపతులు ఇంటి అద్దె, నిర్వహణ ఖర్చులు, సరుకులు, ప్రయాణం, వైద్య ఖర్చులు , ఇతర వినియోగ బిల్లుల వంటి స్థిరమైన నెలవారీ ఖర్చుల కోసం రూ. 53,500 వెచ్చిస్తున్నారు. అలాగే, వ్యక్తిగత ఖర్చులు, వినోదం , కుటుంబపరమైన అత్యవసర అవసరాల కోసం వారు రూ. 28వేలు కేటాయించారు. అన్ని ఖర్చులు పోను, వారి చేతిలో నెలకు కేవలం రూ. 2,520 మాత్రమే మిగులుతున్నాయి.ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుసోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ ఆన్లైన్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసుకునే ముందు, ముందుగా తమ అప్పులను తీర్చుకోవడంపై దృష్టి పెట్టాలని చాలా మంది నెటిజన్లు సూచించారు.ఇదీ చదవండి: ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!ఖర్చులు కాదు బాబూ, మీ లోన్లే మీకు అసలు సమస్య: కనీసం పెర్సనల్ లోన్ అయినా తీర్చేంత వరకైనా మీకీ కష్టాలు తప్పవు. మీ బైక్ రుణం పూర్తయ్యే వరకు 4 నెలలు వెయిట్ చేసి, ఆ తర్వాత, ఆ 12 వేల రూపాయల పెర్సనల్ లోన్ చెల్లించేయండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. అంతేకాదు లోన్ తీసుకొని మరీ ఫోన్ తీసుకోవడం అవసరమా, 3-4 నెలల పాటు వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని ఉంటే, ఫోన్ కోసం 20వేలు మిగిలేవి కదా అంటే ఇంకొకరు లెక్కలు చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అంటే ఈ జంట తమ సంపాదనలో సగానికి పైగా (50.5%) కేవలం అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక సూత్రాల ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో 30-35 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే అనవరమైన వ్యక్తిగత అవసరాలను కొన్ని త్యాగం చేసి అత్యవసర ఖర్చులకోసం, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ దాచుకోవడం కుటుంబాలకు చాలా అవసరం.ఏమంటారు? -
ప్రియుడితో వధువు పరార్, చెల్లితో పెళ్లి ఫిక్స్, మళ్లీ ప్రియుడి లొల్లి!
ఉత్తర ప్రదేశ్లో మరో ఊహించని పరిణామం గురించి తెలిస్తే ఔరా అనాల్సిందే. పెళ్లికి ముందు రాత్రే వధువు తన ప్రియుడితో పారిపోయింది. ఎలాగో ఒప్పించి, వధువు చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేశారు. ఇక్కడ మరో ట్విస్ట్ పెళ్లి కొడుకును వెక్కిరించింది. ఇక ఈ తరువాతి పరిణామాలు ఒక్కోటి సినిమా రేంజ్లో చక చకా జరిగిపోయాయి. చివరికి ఈ వివాదం మరింత ఉద్రిక్తమై కాల్పుల దాకా చేరింది.ఉత్తరప్రదేశ్లోని బిత్థ్రి ప్రాంతంలోని షాజహాన్పూర్-బరేలీ రోడ్డుపై ఉన్న ఒక బ్యాంకెట్ హాల్లో శనివారం పెళ్లి వేడుక ఉత్సాహంగా జరుగుతోంది. వధూవరులిద్దరూ అందంగా ముస్తాబయ్యారు. అతిథులందరూ ఎవరి హడావిడిలో వారు తిరుగుతూ, విందు భోజనానికి సిద్దపడుతున్నారు. పెళ్లి కొడుకు తన బృందంతో (ఊరేగింపుగా), అటు వధువు కుటుంబ సభ్యులు కూడా సందడి ఉన్నారు. ఇంతలో కలకలం రేపింది. హాజరైన అతిథులకు భోజనాలకు బదులు దాడులు మొదలయ్యాయి. ఈ గందరగోళం మధ్య కాల్పులుకు దారి తీసింది. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించిపోయిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ట్విస్టుల మీద ట్విస్టులుసరిగ్గా పెళ్లి జరిగే సమయానికి వధువు రాలేదు. పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న నగలతో సహా వధువు రాత్రికి రాత్రే ప్రియుడితో ఉడాయించింది. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆమె చెల్లెల్ని వధువు స్థానంలోకూర్చోబెట్టడానికి ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిద్దాం అనుకున్నారు. అయితే పెళ్లి కూతురు మారిపోయిందన్న విషయాన్ని గమనించిన పెళ్లి కొడుకు ‘నాకీ పెళ్లి వద్దు పొమ్మన్నా’డు.ఇదీ చదవండి : పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్అయితే ఎలాగోలా పెద్దలంతా సంప్రదింపులు జరిపే వరుడిని పెళ్లికి ఒప్పించాడు. ఇక్కడ మళ్లీ ట్విస్ట్. ఈ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగి, అంతా చక్కబడింది అనుకునే లోపే, వధువు చెల్లెలి ప్రియుడుఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ లొల్లి షురూ. చినికి చినికి గాలివానలా మొదలైన ఈ వ్యవహారం భౌతిక ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో పలువురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకున్నట్టు గానీ, ఎవరిపైనా కేసులు నమోదు చేసినట్టు గానీ సమాచారం లేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు -
రాహుల్ గాంధీ సింప్లిసిటీ.. చిన్నారికి సర్ప్రైజ్
ఒక సాధారణ రెస్టారెంట్ లంచ్ అనుకోని విధంగా ఓ చిన్నారి పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చింది. కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుక కోసం బయటకు వెళ్లిన ఆ బాలుడు, అదే రెస్టారెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో పంచుకున్న ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.. డాక్టర్ ఎస్.జె.టి కజ్మీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి లంచ్కు వెళ్లారు. అయితే అదే హోటల్కు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వాళ్లకు దగ్గర్లోనే ఓ టేబుల్ మీద కూర్చున్నారు. ఆ సమయంలో ఉత్సాహంగా ఉన్న చిన్నారి రాహుల్ గాంధీకి చేతులు ఊపగా.. ఆయన స్పందించి బాలుడిని తన వద్దకు పిలిచారు.ఆప్యాయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఆ చిన్నారితో ఫోటో దిగుతూ అతని పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చారని కజ్మీ తన పోస్టులో పేర్కొన్నారు. “నా కుమారుడికి ఇది జీవితంలోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్” అంటూ ఆయన మరో పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనేక మంది వినియోగదారులు రాహుల్ గాంధీ చేసిన ఈ సింపుల్ గెస్టర్ను ప్రశంసిస్తూ స్పందించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని పంచుకున్నారు.Was out for lunch on my Son’s Birthday today . As luck would have it Rahul Gandhi ji @RahulGandhi and Priyanka ji @priyankagandhi were at nearby table with family . My son waived at him in excitement , Mr Gandhi called him and made his birthday memorable !! Thank you sir ! pic.twitter.com/J6l5AjtwSl— DR.S.J.T.KAZMI (@JAFARKAZMI) June 7, 2026మరో వినియోగదారు డాక్టర్ రాకేష్ బన్సాల్ కూడా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. రాహుల్ గాంధీ చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. కుటుంబ వేడుకలో భాగమైనట్టే ఆయన ఫోటోలకు పోజ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం హృదయాన్ని హత్తుకునే అనుభవమని అభిప్రాయపడ్డారు. सार्थक 18 साल का है - पर सोच, साहस और सिद्धांत में किसी से कम नहीं।उसने और उसके साथी निसर्ग ने वो कर दिखाया जो देश के बड़े मीडिया हाउस, खोजी पत्रकार नहीं कर पाए - CBSE और COEMPT की मिलीभगत को देश के सामने रख दिया।मोदी जी चाहते हैं हमारे युवा reels बनाते रहें, पकौड़े तलते… pic.twitter.com/vjNNVItc2q— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2026సార్ధక్ ది గ్రేట్!సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల సార్థక్ సిద్ధాంత్, అతని సహచరి నిసర్గపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. తాజాగా వాళ్లు పేరెంట్స్తో కలిసి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరి ప్రయత్నం వల్ల వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది. ఇటు సీబీఎస్ఈ అధికారులు రీవ్యాల్యుయేషన్ ప్రక్రియలో ఉన్న సమస్యలను అంగీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. మొత్తం వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
పిల్లనిచ్చిన అత్తతో అల్లుడి ప్రేమ, పెళ్లి వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వింత పెళ్లి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకున్న ఘటన పలువుర్ని విభ్రాంతికి గురి చేసింది. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టి, ఆమె తల్లిని కోర్టు వివాహం చేసుకున్నారట. అంతేకాదు తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని, తమ బంధాన్ని అంగీకరించాలని , తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ జంటకు వివాహానికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కుమార్తె వివాహం జరిగిన తర్వాత అత్తా-అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సమాచారం. అయితే ఆ వ్యక్తి భార్య స్పందన ఏంటి అనేదానిపై స్పష్టతలేదు. ఇదీ చదవండి: నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలుఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకుఎటువంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు. అలాగే అధికారులు ఎటువంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. दामाद ने बेटी से रिश्ता तोड़ मां से किया शादीयूपी के कानपुर में एक अनोखा मामला सामने आया है, जहां एक युवक ने अपनी पत्नी से अलग होने के बाद अपनी सास के साथ कोर्ट मैरिज कर ली।इस घटना के बाद इलाके में तरह-तरह की चर्चाएं हो रही हैं। pic.twitter.com/fcaNnYNle5— Priya singh (@priyarajputlive) June 8, 2026నెటిజన్ల మాత్రం ఈ వివాహం గురించి తెలిసి బంధాలు, నైతిక విలువలు మంటగలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేయగా, వావి వరుసలు మర్చిపోతున్నారంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమకథ మాత్రమే కాదు, ఒక కుటుంబాన్నే ఛిన్నాభిన్నం చేసిన పరిస్థితి. మధ్యలో నలిగిపోయే వారే అసలైన బాధితులు, కుటుంబ అనుబంధం హద్దులు దాటింది. కామమే గెలిచింది, కుటుంబం ఓడిపోయిందని మరొకరన్నారు. సొంత రక్తమే వినాశనానికి కారణమైతే, ఇక ఎవరిని నమ్మాలి?" పాపం..ఆమె కుమార్తె పరిస్థితి ఏంటి అని ఆరాతీస్తున్నారు. కాగా 2024లో బీహార్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ ఘటనలో భార్య మరణం తరువాత, అతను అత్తమామల ఇంట్లోనే నివసించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అతను తన 55 ఏళ్ల అత్తగారు గీతా దేవితో సన్నిహితమయ్యాడు. ఒక రోజు, అతను గీతతో ఏకాంతంగా ఉండగా అతని మామగారు వారిని రెడ్-హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత, ఆ వ్యక్తి గ్రామస్తులందరి సమక్షంలో గీతను ప్రేమిస్తున్నట్లు అంగీకరించి, ఆమెను వివాహం చేసుకున్నాడు. -
నర్సింగ్ దుస్తులపై బీజేపీ ఎంపీ కంగనా సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ భారతీయ నర్సింగ్ దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నర్సుల యూనిఫాం ఇప్పటికీ బలమైన వలసవాద ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడింది.తన రాబోయే చిత్రం 'భారత్ భాగ్య విధాత' (దర్శకుడు మనోజ్ తపాడియా) ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.బ్రిటిష్ నర్సుల డ్రెస్ కోడ్ ఇప్పటికీ వాడుకలో ఉందని, దీని భారతీయ శైలిలోకి మార్చాలని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. నర్సుల యూనిఫాం విషయంలో ఇప్పటికీ వలస పాలన నాటి ఛాయలు (colonial hangover) ఉండటమే వారిని లైంగిక కోణంలో చూడటానికి ఒక కారణమని కంగనా భావిస్తున్నారు. "నర్సుల డ్రెస్ కోడ్ బ్రిటిష్ కాలం నాటిది. డాక్టర్లు ఎలాంటి దుస్తులైనా ధరించవచ్చు, వాటి పైన ఒక కోట్ వేసుకుంటే సరిపోతుంది. కానీ మన నర్సులు మాత్రం ఎండైనా, చలి అయినా ఆ నిర్దిష్టమైన యూనిఫామ్నే ధరించాలి. అవి విదేశీ స్టయిల్లా అనిపిస్తుందని పేర్కొన్నారు.అందుకే ఈ యూనిఫాంలో మార్పులు రావాలని, అది "భారతీయ శైలిలో"(Indianized) ఉండాలని కంగనా అభిప్రాయపడ్డారు. అలాగే, రోజువారీ విధుల్లో ఎలాంటి యూనిఫాం ధరించడానికి ఇష్టపడతారనే విషయంపై నర్సుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆమె సూచించారు.యూనిఫాంపై పిన్ను, టోపీ లేదా బెల్టు పెట్టుకోవడం అమెరికా నేవీలో ఉంటుందని అన్నారు. మొదటి, రెండవ ప్రపంచ యద్దాల్లో వాళ్లు అలానే కనిపిస్తారని వ్యాఖ్యానించారు. తన సినిమా ఆ దిశగా కొంత మార్పును తీసుకువస్తుందని, భవిష్యత్తులో ప్రేక్షకులు నర్సులను చూసే దృక్పథాన్ని మారుస్తుందని ఆమె ఆశిస్తున్నారు. అలాగే ఇది అంత సులభమైనవృత్తి కాదని, వేతన విధానం నుండి యూనిఫాం వరకు అనేక సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.కాగా 2008 నాటి 26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో లక్ష్యంగా మారిన ప్రదేశాలలో ఒకటైన 'కామా హాస్పిటల్' నేపథ్యంలో సాగే పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ 'నర్సెస్ ఆఫ్ కామా' (Nurses of Cama) లో కంగనా నర్సు పాత్ర పోషిస్తోంది. ఉగ్రవాద దాడి జరిగినప్పటికీ, ఆసుపత్రిని నడుపుతూ రోగులను సురక్షితంగా ఉంచడంలో నర్సుల కృషి ఎంత కీలకమో ఈ చిత్రం చూపిస్తుంది. -
సింగిల్ మదర్గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!
ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్ టెక్ నిపుణుడు అభిజయ్ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో బిల్బోర్డు భారీ స్క్రీన్పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. అభిజయ్ తన తల్లికి వీడియో కాల్ చేసి మరి ఆ భారీ స్క్రీన్ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. "ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్బోర్డ్పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్ జర్నీని కూడా పంచుకున్నాడు.ఐఐటీ ఫెయిల్ నుంచి గూగూల్ ఉద్యోగిగా..హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు. అయితే 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్ అవుతూనే ఉండేవి. అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్ను తన నెట్వర్క్ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్లైన్లో కంటెంట్ను పంచుకోవడం ప్రారంభించాడు. ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్కాస్ట్ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్లైన్ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇచ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | AI, Tech & Careers (@abhijayarora_) (చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..) -
తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్..! కట్చేస్తే..
చాలామంది కెరీర్లో చాలా ఓటములు, నిరాశను ఎదుర్కొన్నవారే. ఆశించినట్లుగా ఉన్నత చదువును అందుకోలేక..నచ్చలేంది చదవలేక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఇతరులు సాధిస్తే..తానొక్కడే ఫెయిల్ అవ్వడం, ప్రతిదాంట్లో నిరాశ, నైరాశ్యం వెంటాడుతుంటే కుంగిపోతాం. కానీ ఇక్కడ ప్రయత్నం ఆగిపోకూడదు. ఈ రోజు ఫెయిల్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఏదో ఒకరోజు తప్పక ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటాం అనేందుకు ఈ వ్యక్తే కథే ఉదాహరణ. నెట్టింట అతడి స్టోరీ వైరల్గా మారడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది.వ్యవస్థాపకుడు, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్మీడియా వేదికగా 26 ఏళ్ల శౌర్య శిఖర్ విజయవంతమైన ప్రయాణాన్ని పంచుకున్నారు. ఇది మొక్కవోని స్థైర్యంతో చివరికి సక్సెస్ని ఒడిసిపట్టుకున్న అందమైన విజయగాథ. ఐదేళ్ల క్రితం వరకు శౌర్య కెరీర్లో సెటిల్ అవ్వలేక చాలా ఇబ్బందిపడ్డ వ్యక్తి. అతను అందరిలా ఐఐటీ-జేఈఈ సాధించాలని కలలుగన్న వ్యక్తి. అయితే అతడు అందులో సక్సెస్ అవ్వలేకపోయాడు. తన తండ్రి ఐఐటీ అయ్యి ఉండి, తాను సాధించలేక పోవడం అతడ్ని మరింత కుంగదీసింది. తీవ్ర నిరాశతో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీలో జాయిన్ అయ్యాడు. అదీ చదవలేక నానా పాట్లు పడ్డాడు. ఆ క్రమంలో ఏకంగా 110 కేజీల అధిక బరువుతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. కాలేజ్లో చదువుతున్నప్పుడే శౌర్య అంకుర్ వారికూ బృందంలో చేరాడు. కానీ శౌర్య నిరాశ, కెరీర్లో అనిశ్చితి, వ్యక్తిగత పోరాటాల మధ్య చిక్కుకుని తనకు భవిష్యత్తు అనేది ఉందా అని భయపడుతుండేవాడు. చెప్పాలంటే తను ఎందుకు పనిరానని భావంతో ఉండేవాడు. తనకెంతో ఇష్టమైన ఇంజనీరింగ్ కోర్సు చేయలేకపోయానని, బీబీఏ చేస్తున్న ఫూల్ని అని బాగా బాధపడేవాడు. ఇక ఎప్పటికీ తన లైఫ్ మంచిగా ఉండదేమో అని దిగులుతో ఉండేవాడు. కట్చేస్తే..సరిగ్గా ఐదేళ్ల తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు 26 ఏళ్ల వయసులో శౌర్య మంచి కెరీర్ను నిర్మిచుకుని నెలకు లక్షల్లో జీతం ఆర్చించే స్థాయికి చేరుకున్నాడు. అంతేగాదు తన తండ్రి పదవీ విరమణ సందర్భంగా ఆయనకు ఏకంగా రూ. 55 లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారుని కొనిచ్చాడు. విలాసవంతమైన కారు కోసం చెల్లించిన డౌన్ పేమెంట్ శౌర్య నికర ఆస్తిలో 5% కంటే తక్కువగా ఉందని, అలాగే ఈఎంఐ అతని నెలవారీ సంపాదనలో 7% కంటే తక్కువగా ఉంటుందని వారికూ వెల్లడించారు. అతనిలో వచ్చిన మార్పు కేవలం డబ్బుకే పరిమితం కాలేదు, ఏళ్లు గడిచే కొద్దీ..శౌర్య ఆరోగ్యం, ఫిట్నెస్పై దృష్టి సారించి ఫిట్గా మారాడు. ఇక్కడ శౌర్య కథ విలాసవంతమైన కారు, సంపద గురించి చెప్పడం లేదు. ఎదురు దెబ్బలు ఒక వ్యక్తి భవిష్యత్తుని నిర్దేశించవు, జీవితంలో ఒక దశ దారుణమైన వైఫల్యం ఎదుర్కొని ఉండొచ్చు. కానీ అదే క్రమంగా విభిన్నమైన మార్గానికి నాంది పలికి ఉన్నతమైన స్థానానికి చేరుకునేలా చేస్తుంది అనేందుకు శౌర్యనే ఉదాహరణ. కానీ ఇక్కడ జీవితంలో ఎదురయ్యే గడ్డుపరిస్థితులకు చేతులెత్తేయకుండా ముందుకు సాగడమే జీవితం అని నమ్మి..ప్రయత్నం ఆపకూడదనేది గ్రహించాలని అంటున్నారు అంకుర్ వారికూ. అలాంటి స్థితిలో ధైర్యంగా ముందుకు సాగినవాడు తప్పకుండా ఏదో ఒకనాటికి జీవితం మంచిగా సెటిల్ అవుతుందని అన్నారు. ఈ స్టోరీ నెటిజన్ల మనసుని తాకడమే కాదు..అత్యంత నిరాశ నిస్ప్రుహల మధ్య ఆశావాదం హాస్యస్పదంగా అనిపించినా.. ఇక్కడ శౌర్య కార్యాచరణలో నిమగ్నమే ముందుకు సాగాలనే దృక్పథాన్ని ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా..ముందుకు సాగే వారే విజేతలు అని కామెంట్ చేస్తూ పోస్టలు పెట్టారు.(చదవండి: చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..) -
పాపం.. రన్వేపైనే కబళించిన మృత్యువు
ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ఎందుకు ప్రయత్నించిందో తెలియదు. రన్వేపై ఘోరంగా తడబడింది. చూస్తుండగానే ప్రైవేట్ జెట్ అదుపుతప్పి కుప్పకూలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే విమానం అగ్నిగుండాన్ని తలిపించింది. పైలట్ చేసిన ప్రయత్నం చివరకు విషాదాంతంగా మారింది. ఆ మంటల్లో చిక్కుకుని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్వేపై సురక్షితంగా దిగకముందే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో ఘటనాస్థలం అగ్నిగుండంలా మారిపోయింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానంలో ఉన్న పైలట్, కో-పైలట్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.విమానం ఏ కారణంతో అత్యవసర ల్యాండింగ్కు ప్రయత్నించిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాంకేతిక లోపమా? ఇంజిన్ సమస్యా? లేదంటే వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేసినప్పటికీ, చివరి క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. దీంతో రన్వేకు చేరకముందే విమానం నేలపై కూలిపోయింది.Tragic development: A private jet has crashed during an emergency landing attempt at La Romana International Airport in the Dominican Republic.#aircraft pic.twitter.com/Q4nmtpn4ul— FL360aero (@fl360aero) June 7, 2026ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుంచి భారీ మంటలు ఎగసిపడ్డాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోల్లో విమానం శకలాలు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విమానం పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం.ఈ ఘటనపై విమానయాన అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక పరిస్థితి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో జరిగిన సంభాషణలు, ఫ్లైట్ డేటా తదితర అంశాలను పరిశీలించనున్నారు. అయితే ప్రమాదానికి దారితీసిన అసలు కారణం ఏంటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..
రోడ్ల మీద ప్రయాణికులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలిసిందే. కనీసం బస్తాప్ వద్ద కూడా రయ్ రయ్ అంటూ వెళ్లిపోవడమే. ప్రయాణికులు బస్సలు ఎక్కనివ్వరు, కనీసం ఫుట్పాత్పై నిలబడనివ్వరు. అలాంటి టూ వీలర్ ప్రయాణికులకు ఇక్కడొక పోలీసు అధికారి భలే గుణపాఠం చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ అధికారిపై ప్రశంసల జల్లు వెల్లువెత్తింది. ఆ వీడియోలో పోలీసు అధికారి రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తుండగా..ట్రాఫిక్ జామ్ను దాటాలనే ఉద్దేశ్యంతో ప్రయాణికులు ఎలా మాములు ఫుట్పాత్పై వాహానాలు నడుపుతున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన ఈ పోలీసు అధికారి వెంటనే కొద్ది దూరం ప్రయాణించి ఫుట్పాత్పై బైక్తో సహా అడ్డంగా నిలబడతాడు. దీంతో రాంగ్రూట్లో వస్తున్న ఆ టూవీలర్ ప్రయాణికులు కాస్తా వెనుదిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. దాంతో నెటిజన్లు ఏం ధైర్యం సార్ అంటూ ఆ పోలీసు అధికారిని అభినందించగా, మరికొందరు హ్యాట్సాప్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by COP NAVEEN (@cop_naveensingh) (చదవండి: భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!) -
భారత్ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
బుడ్డోడి మ్యాజిక్కి ఆనంద్ మహీంద్ర ఫిదా! వైరల్ వీడియో
పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించారు. నిత్యం అనేక ఇన్సిపిరేషనల్ కథనాలు, టాలెంట్ వీడియోలు, విజ్ఞానాత్మక కథనాలను పంచుకుంటూ ఉండటం ఆయనకు బాగా ఆలవాటు. అంతేకాదు అర్హులైన వారికి చేయూత నందించడం కూడా పరిపాటి. ఆయన తాజాగా ఆయన షేర్ చేసిన మట్టిలోమాణిక్యంలాంటి వీడియో ఆసక్తికరంగా మారింది.ఉత్తరాఖండ్లోని అందమైన నైనిటాల్ పట్టణ వీధుల్లో గారడీ చేసే ఓ చిన్నారి ఇంద్రజాలికుడి వీడియోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. చిన్నారి టాలెంట్కు ఫిదా అయిపోయారు. బోలెడు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైనమహీంద్రా ఆర్థికంగా అండగా నిలుస్తానని ప్రకటించి మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు.ఆ వైరల్ వీడియోలో విశేషం ఏమిటంటే నైనిటాల్లోని ఒక మార్గంలో సాహిల్ అనే బాలుడు వరుసగా వీధుల్లోఅద్భుతమైన మ్యాజిక్ విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తన చేతిలోని కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులతో అతడు చేసే ఇంద్రజాలం చూస్తే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే. కేవలం రెండు స్టీల్ గిన్నెలు, చిన్న బాల్స్ సాయంతో తన చిట్టి చేతులతో అద్భుతమైన వేగంతో కప్పులను అటూ ఇటూ కదుపుతూ అద్భుత నైపుణ్యంతో కనికట్టు చేస్తున్నాడు. అసలా బంతి ఏ గిన్నె కిందినుంచి అలా అలా మాయమై, ఎలా ప్రత్యక్షమవుతుందో అర్థంకాక ఆశ్చర్య చకితులవుతారు.Yeh ladka bahut talented hai. Kya woh abhi bhi Nainital ki sadkon par kaam kar raha hai? Main na sirf uski padhai mein madad karna chahta hoon, balki jaadu mein uski dilchaspi ko bhi badhava dena chahta hoon. Kyon na woh duniya ke behtareen jaadugaron mein se ek bane? Kya… pic.twitter.com/lju2LokTBj— anand mahindra (@anandmahindra) June 5, 2026 ఇదీ చదవండి: పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడుఆనంద్ మహీంద్రా కూడా అదే అనుభూతికి లోనయ్యారు. ‘‘ఈ కుర్రాడు ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతను ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లో ఇలాగే ప్రదర్శనలు ఇస్తున్నాడా? ఈ బాలుడికి ఉన్నత చదువులు చెప్పించడంతోపాటు, మ్యాజిక్పై అతని ఆసక్తిని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లభిస్తే ఈ బాలుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంద్రజాలికులలో ఒకడిగా ఎదుగుతాడు’’ అంటూ ఈ చిన్నారి గురించి లేదా అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే , వారితో మాట్లాడటానికి, వారికి సాయం చేసేందుకు తనకు సహాయం చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.నెటిజన్లు స్పందనమహీంద్రా చొరవను మంచి మనసును నెటిజన్లు ప్రశంసించారు. ఆ బాలుడిని గుర్తించి, అతని చదువుకు సాయం చేయడానికి మహీంద్రా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. సాహిల్ ,అతని కుటుంబం ఆచూకీ తెలుసుకోవడంలో సహాయపడటానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల లగ్జరీ రిసార్ట్ : ట్రంప్కి భారీ ఝలక్ -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
రూ. 549 కోట్ల బ్రిడ్జ్పై పగుళ్లు : వీడియో తీస్తోంటే.. ట్విస్ట్!
బిహార్లోని గోపాల్గంజ్లోని జడోపూర్-మంగల్పూర్ వంతెనపై జరిగిన ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. రూ. 549 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన పిల్లర్ల వద్ద నిర్మాణం లోపాలను వీడియో తీయాలని భావించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతను వీడియో తీస్తున్న ఆ పగులు గుండానే అతని మొబైల్ ఫోన్ కిందకి జారీ పోవడంతో వార్తల్లో నిలిచాడు.2016 మార్చిలోఈ వంతెనను అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో క్లిప్లో, వంతెన పిల్లర్ల వద్ద, స్పాన్లలో భారీగా గ్యాప్లు, పగుళ్లు ఏర్పడడంతో అధికారులు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. అయితే ఈ పగుళ్ల గురించే అతను రికార్డ్ చేయాలను కున్నాడు. ఆ పగులు ఎంత పెద్దదిగా ఉందో చూపించడానికి ఒక ఇటుకను అందులోకి దించుతూమొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాడు. ఇక్కడే అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. మొబైల్ ఫోన్ చేతిలోంచి జారి ఆ గ్యాప్ గుండా వంతెన కింద పడిపోయింది.Man on Jadopur–Mangalpur bridge tries to measure a massive pavement crack with a brick, bends over and accidentally drops his phone into the deep gap😭💀pic.twitter.com/XTd8nHdwdX— Ghar Ke Kalesh (@gharkekalesh) June 4, 2026ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్చివరికి వంతెన కింద పడిన ఫోన్ను సురక్షితంగానే వెలికితీశారు. కానీ, వంతెన లోపాన్ని చూపించబోయి సొంత ఫోన్నే పోగొట్టుకోబోయిన వైనంపై నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు. పనిలో పనిగా వంతెన నిర్మాణ నాణ్యత, నిర్వహణపై ప్రజలు సోషల్ మీడియాలో తీవ్ర ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే, గుంతలు, లోపాలు కనిపించడం విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆ యువకుడి ఫోన్ దొరికి నప్పటికీ, వైరల్ వీడియోకి కారణమైన వంతెన నిర్మాణ లోపాలపై మళ్లీ అందరి దృష్టి మళ్ళేలా చేసింది.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500 -
హాట్టాపిక్గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!
ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్కు చెందిన పదిహేడేళ్ల సార్థక్ సిద్ధాంత్ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్ స్క్రీన్ మార్కింగ్ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్లోడ్ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్లైన్లో వైరల్గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. సార్థక్ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్ఈ పార్లమెంటరీ ప్యానల్కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్ ఇచ్చిన ప్రజెంటేషన్లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.(చదవండి: ‘గ్రాండ్ఫేర్వెల్’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!) -
రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్
చైనాలోని ఓ రోబో కలకలం రేపింది. షింజియాగ్లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది.ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.A robot kicked a little boy in the stomachWe're officially one software update away from Terminatorpic.twitter.com/iO9jv2qUuf— Mario Nawfal (@MarioNawfal) June 4, 2026ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతుండగా.. పక్కనే ఉన్న మరో బాలుడు అతడిని రోబోకు దూరంగా వెనక్కి లాగాడు. అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే, ఆ బాలుడికి తీవ్రమైన గాయాలేమీ కాలేదని తర్వాత ఓ వార్తా సంస్థ తెలిపింది. యంత్రం తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబో ఆ బాలుడిని తన్నినా.. జనాలు ఇంకా ఆ రోబో వైపే చూస్తున్నారా? బాలుడి వైపు దృష్టి సారించి.. అతడు బాగున్నాడా? లేదా? అని చూసే మానవత్వం మనలో ఎటుపోయింది? ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు."ఇది 'టెర్మినేటర్' సినిమా కాదు.. ఇక్కడ యంత్రాలు కావాలని హింసను ఎంచుకోవడం లేదు. అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే.. హార్డ్వేర్ డెవలపర్లు భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి.. బహిరంగ కార్యక్రమాలలో యంత్రాలను అమాయకపు ఆటబొమ్మల్లా వదిలేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదంగానే భావిస్తున్నా.. ఆ రోబో కావాలని ఆ చిన్నారిని తన్నలేదు. అది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పిల్లాడు దాని దారికి అడ్డంగా వచ్చాడు.. అందుకే ఈ ఘటన జరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు. -
చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు.. 2011 నుంచి ఈ విమానాలను అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఉపయోగిస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో ఈ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఈ విమానాలు సేఫేనా అనే చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానానికి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. గేట్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో విమానం ముందరి ల్యాండింగ్ గేర్ (నోస్ గేర్) ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్లో పలువురు గాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లాల్సిన LH450 విమానం అనూహ్యంగా ముందు చక్రం ఊడిపోవడం గమనార్హం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. A nearly five-month-old Lufthansa Boeing 787-9 Dreamliner at Frankfurt, preparing for a flight to Los Angeles, experienced a nose landing gear collapse at the gate. pic.twitter.com/72b6J4HyIr— Aviation (@xAviation) June 4, 2026ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్ సంస్థ కూడా విచారణలో సహకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్ కావడం గమనార్హం. -
కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్..!కట్చేస్తే..
గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్ రాజీనామా లెటర్ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్గా రిజైన్ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్ని తిర్కస్కరించాడని చెప్పారు. అప్పుడు వెంటనే అంకిత్ పాండే డోంట్.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు. ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్ బాక్స్తో ఆ అకౌంటెంట్ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్ పంచిపెట్టాడు. పైగా జాబ్లో మళ్లా జాయిన్ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్ అభ్యర్థించాడని అన్నారు. అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్ పాండే పోస్ట్లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!) -
90 ఏళ్ల అత్తను నెత్తిన మోస్తూ సింగర్ కాజల్ 260 కి.మీ.ల యాత్ర
మధుర: హర్యానాకు చెందిన గాయని కాజల్ చౌదరి తన అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చడానికి చేసిన ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 260 కి.మీ.ల పరిధిలోని సరస్సులు, అటవీ ప్రాంతాలను దాటుకుంటూ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర నెట్టింట వైరల్గా మారింది. '84-కోసుల' బ్రజ్ పరిక్రమలో ప్రత్యేక బుట్టలో తన 90 ఏళ్ల అత్తగారిని తలపై మోసుకెళ్తున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకున్నారు.బ్రజ్ ప్రాంతపు మతపరమైన ప్రదక్షిణను పూర్తి చేయాలన్న కోరికే తీర్చేందుకు అత్తగారిని మోసుకెళ్లాలని స్వయంగానే తానే నిర్ణయించుకున్నానని, ఇందులో అత్తగారి ప్రమేయం ఏదీ లేదని స్పష్టం చేశారు. సుమారు 260 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండే ఈ 84-కోసుల బ్రజ్ పరిక్రమ, ఉత్తరప్రదేశ్, హర్యానా ,రాజస్థాన్ రాష్ట్రాల గుండా సాగుతూ, శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడి ఉన్న అనేక ముఖ్యమైన ప్రదేశాలు, కొలనులు , అరణ్యాల గుండా వెళుతుంది.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!సాధారణంగా భక్తులు ఈ తీర్థయాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం తీసుకుంటారు, కానీ చాలామంది భక్తులు ప్రస్తుతం నడుస్తున్న 'అధిక మాసం' (Adhik Mas) లోనే దీనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గోవర్ధన్లోని శ్రీ ధన్ఘాటి ఆలయ సేవాయత్ (పూజారి) పవన్ కౌశిక్ తెలిపారు .హిందూ క్యాలెండర్లో వచ్చే ఈ అధిక మాసాన్ని 'పురుషోత్తమ మాసం' అని కూడా పిలుస్తారని, ఈ మాసంలో బ్రిజ్ పరిక్రమ్ ఆధ్యాత్మిక యాత్ర, ఆలయాల్లో పూజలు చేయడం ,యజ్ఞాలు నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలుसासू मां की इच्छा पूरी करने के लिए बहू ने लिया अनूठा संकल्प।सिर पर बैठाकर बहू ने सासू मां को कराई 84 कोस की परिक्रमा।रिश्तों में सेवा, समर्पण और सम्मान की मिसाल । उत्तर प्रदेश के ब्रज क्षेत्र से एक भावुक कर देने वाला वीडियो।ऐसी संस्कारी बहू जिस घर में आ जाए वह घर स्वर्ग… pic.twitter.com/HWDRD4oLiQ— Satish Rajput (@StanwarSatish) June 4, 2026 -
ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!
జేఈఈ అడ్వాన్స్డ్.. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి. అలాంటి పరీక్షంలో సింగిల్, డబుల్ డిజిట్ ర్యాంకులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ర్యాంక్తో.. ఐఐటీ బాంబే లాంటి ప్రతిషాత్మక వర్సిటీలో సీటు దక్కించుకోవడం గొప్ప అవకాశం కాదంటారా?. కానీ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి.. అదెంత మాత్రం కాదనే అంటున్నాడు. ఎందరో ఆ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా చదువుతుంటే.. చేతిదాకా వచ్చిన ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ఒడిశాకు చెందిన మహరూఫ్.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో 32వ ర్యాంకర్. ఈ ర్యాంక్తో ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు సులభంగా దక్కుతుందని అతని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే.. మహరూఫ్ మాత్రం వద్దని వాళ్లతో చెప్పేశాడు. అందుకు కారణం.. అన్న మస్రూర్కు దూరం కావడమే!. మస్రూర్, మహరూఫ్ కవలలు. ఇద్దరూ ఈ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మస్రూర్ ఆల్ ఇండియాలో 169వ ర్యాంక్ పొందాడు. అయితే.. అన్నని వీడి ఉండలేని మస్రూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఐటీ బాంబే సీటు కాదని.. తన అన్నతోపాటు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను అన్నతో కలిసి చదవాలనుకుంటున్నాను” అని మహరూఫ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మస్రూర్ కూడా తన తమ్ముడి నిర్ణయాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నామని, ఇప్పుడు కూడా కలిసి చదవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారింది. అలాగే వారి విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. తండ్రి డాక్టర్గా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ జీనత్ బెగం తన ఉద్యోగాన్ని వదిలి పిల్లలతో కలిసి కోటా(రాజస్థాన్, దేశంలో కోచింగ్ హబ్)కు వెళ్లి వారి చదువుకు పూర్తిగా అంకితమయ్యారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే ఇద్దరి విజయానికి బలమైన పునాది అయింది.కోటాలో ఉన్న సమయంలో ఇద్దరూ అత్యంత క్రమశిక్షణతో చదివారు. రోజుకు సుమారు ఐదు గంటల కోచింగ్, గంటసేపు డౌట్స్ క్లియరింగ్, ఆపై గంటల తరబడి స్వీయ అధ్యయనం చేసేవారు. అదే సమయంలో పరస్పరం ఒకరికి ఒకరు క్లిష్టమైన అంశాలు వివరించడం, పరీక్షల తర్వాత కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వారి ప్రత్యేకతగా నిలిచింది.ఇప్పుడు ఈ ఇద్దరి కథ కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాదు, బంధాల విలువ గురించి కూడా చెబుతోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటును కూడా వదిలేసి కుటుంబం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి జీవితంలో సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తోంది. ర్యాంకులు, కాలేజీలు ఎంత గొప్పవైనా, బంధాలు వాటికన్నా గొప్పవని మహరూఫ్ తీసుకున్న నిర్ణయం నిరూపిస్తోంది. -
7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి
సాధారణంగా మనం ఆటోలో ప్రయాణిస్తున్నపుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు కంటే ఎక్కువ చార్జ్ వసూలు చేయకుండా, ర్యాష్గా డ్రైవ్ చేయకుండా, మనల్ని ప్రశాంతంగా గమ్యాన్ని చేర్చితే చాలు అనుకుంటాం, కదా. కానీ చెన్నైలో ఒక మహిళ షేర్-ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్ కథగా మారింది. తన ప్రయాణీకుల సేవ పట్ల చూపిన విలక్షణమైన విధానం మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. పదండి మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం.షోలింగనల్లూర్లో తనకు ఎదురైన ఒక ఊహించని ప్రయాణం గురించి వివరిస్తూ, @the_dharani_theory అనే ఇన్స్టాలో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. దీని ప్రకారం ప్రీమియం సౌకర్యాలున్న ఈ ఆటోలో అంతకుముందెన్నడూ లేని గొప్ప అనుభవం ఎదురైంది.షోలింగనల్లూరులో ఆటో ఎక్కిన వెంటనే ఎడమ వైపున ఫ్రంట్లైన్, ఫెమినా, అవుట్లుక్ నుండి UPSC ప్రిపరేషన్ మ్యాగజైన్ల వరకు అన్నీ అప్డేటెడ్ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతేనా.. చక్కగా పనిచేస్తున్న రెండు ఐప్యాడ్లు, ప్రయాణీకులందరికీ ఉచితంగా చాక్లెట్ బాక్సులు, గొడుగులు, ఒక మినీ కూలర్, కాఫీతో కూడిన ఫ్లాస్క్ ఉన్నాయి. ఆగండాగండి.. ఇంకా ఉన్నాయి. ఉచిత వైఫై , నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు , వైద్యులకు ఆటో రైడ్ ఉచితం అన్న వాక్యాలు కూడా కనిపించాయి. అతని ప్లేలిస్ట్లో షకీరా పాడిన "వెనెవర్, వెరెవర్" నుండి మురుగర్ భక్తి పాటల వరకు ఉండటం విశేషం.ఈ పోస్ట్ ఆటోలోని సౌకర్యాలను మాత్రమే కాదు ఈ ఆటో అన్న మనసారా పకలరిస్తాడు, నవ్వుతాడు , తన ప్రయాణికులను తీసుకువెళ్తున్నప్పుడు ముద్దుగా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తాడు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 7 భాషలు మాట్లాడతాడు. ఈఆటో డ్రైవర్ అన్న ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం ప్రయాణీకులపై చెరగని ముద్ర వేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయంఆ మహిళ వాహనం దిగడానికి కొద్ది క్షణాల ముందు కథ మరో ఊహించని మలుపు తీసుకుంది.మరో ప్రయాణికురాలు,కార్పొరేట్ ఉద్యోగి ఆ డ్రైవర్ను గుర్తుపట్టి, అతను వృత్తి, విద్యా రంగాలలో ఆరితేరినవాడనే విషయాన్ని ఈమెకు వివరించింది. రెండేళ్ల క్రితం తన కళాశాలకు అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఏడుసార్లు TEDX స్పీకర్. గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలలో ఉపన్యాసాలు ఇస్తాడు. View this post on Instagram A post shared by Dharani's Photoblog (@the_dharani_theory)మరోవైపు ఈమె టీచర్ కావడంతో ముందుగానే తాను ప్రకటించినట్టు, ఎంత బలిమాలినా కూడా ఆమె దగ్గర్నుండి ఒక్కపైసా కూడా చార్జ్ తీసుకోలేదు. ఆటోలో సౌకర్యాలు, అతను సాధించిన విజయాలు ప్రత్యేకంగా అనిపించినప్పటికీ, పని, జీవితం పట్ల డ్రైవర్కు ఉన్న దృక్పథమే ఆ ప్రయాణం నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. "ఆ రోజు ఆయన నాకు ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. మనమందరం మన ఉద్యోగాల గురించి ఫిర్యాదు చేస్తుంటాం, కానీ 'అన్న' నాకు ఒక విషయం నేర్పించారు. అదేంటంటే, మనం చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, మన చెడ్డ రోజుల్లో కూడా నూటికి నూరు శాతం కృషి చేస్తే, నిజాయితీగా పనిచేస్తే అందులో ఎలా విజయం సాధించవచ్చో. గుర్తుండిపోయే ఈ ప్రయాణానికి ధన్యవాదాలు @auto_anna."'ఆటో అన్న'కు నెట్టింట ప్రశంసలుఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. "ఆటో అన్న"గా పాపులర్ అయిన అన్నాదురైపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాము కూడా ఈ ఆటోలో ప్రయాణించామంటూ మరికొంతమంది తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అందరూ చేసే వృత్తిని, గౌరవించడం, మనస్ఫూర్తిగా సేవలందించడం ముఖ్యమని పేర్కొన్నారు. -
సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!
రెండు ఆనందాలు ఒకేసారి వస్తే ఆ ఫీలే వేరేలెవెల్. అందులోనూ తన కిష్టమైన వ్యక్తిని సర్ప్రైజ్ చేసేలా ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఇలా వృత్తిపరమైన వైలురాయిని వ్యక్తిగత విజయాన్ని జరుపుకుంటే అక్కడే చూసేవాళ్లకు సైతం ఆశ్చర్యం ఆనందం ఒకేసారి వస్తాయి కదూ. అలాంటి అందమైన సందర్భమే నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ ప్రపోజ్ బ్రో అంటూ ప్రశంసిస్తున్నారు.భారత సైన్యపు ఏవియేషన్ గ్రాడ్యుయేషన్ వేడుకలో జరిగిన అందమైన ప్రపోజల్ వీడియో అందర్నీ అమితంగా ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS)లో తన ఫ్లైట్ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత భారత సైన్యపు ఏవియేషన్ కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన ప్రియురాలు ఆరుషికి ఆశ్చర్యపోయేలా ప్రపోజ్ చేశాడు. ఆ అనూహ్యమైన పనికి ఆరుషి ఒక్కసారిగా విస్తుపోతూ అతడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. తన కుటుబం సభ్యులు, అధికారులు, శిక్షకులు, అతిథుల చప్పట్లు, కేరింతలు హోరెత్తిస్తుండగా చేసిన ప్రపోజల్ ఆమెకు ఎప్పటి మర్చిపోరాని జ్ఞాపకంలా అందించాడు ఆర్మీ పైలట్ భరత్. ఈ మేరకు ఈ వీడియోని షేర్ చేస్తూ..భరత్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చాడు. మేమంతా ఈ రోజు పైలట్లుగా, శిక్షకులుగా మారం. ఇది మా అందరికీ అతి ముఖ్యమైన రోజు. మా కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. గత ఐదేళ్లుగా ఒకరికొకరం తెలుసు. ఆమెకు ఇలా పెళ్లి ప్రతిపాదన చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదని అనుకుంటున్నా. నా కుటుంబానికి, కాబోయే భార్యకు ఈ రోజు చిరస్మరణీయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశా అని పేర్కొన్నాడు కెప్టెన్ భరద్వాజ్.#WATCH | Maharashtra: The passing out parade at the Combat Army Aviation Training School in Nashik, concluded on an emotional note for a couple as Captain Bharat Bhardwaj proposed marriage to his partner. pic.twitter.com/8Un1ZNBP1F— ANI (@ANI) June 2, 2026 (చదవండి: విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..) -
వైరల్ వీడియో.. సుప్రీం కోర్టులో బిగ్ హైడ్రామా
ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.బిహార్లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
ఇద్దరు అమ్మాయిల పెళ్లి : అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
బిహార్లోని జముయి జిల్లాలో జరిగిన ఒక వింత వివాహం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. బీపీఎస్సీ (BPSC) ఉపాధ్యాయురాలు తోబుట్టువు వరుసైన (బాబాయ్ కూతురు/మేనత్త కొడుకు)ను వివాహమాడింది. ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కావాలంటే పూర్తి కథనం చదవాల్సిందే. 2025లో బీపీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, లక్ష్మీపూర్ బ్లాక్లోని మేద్నీపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది వధువు నయన్శ్రీ. తన చిరకాల ప్రియురాల్ని తన కజిన్ (సొంత మేనత్త కూతురు) రాఖీ అలియాస్ రాహుల్ని వివాహం చేసుకుంది. విషయం ఏమిటంటే రాఖీ సుమారు ఆరు నెలల క్రితం ఎయిమ్స్-ఢిల్లీలో జరిగిన లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత రాహుల్గా మారాడు. రాఖీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ సర్జరీ కోసం నయన్శ్రీ రూ. 8 లక్షల బ్యాంకు రుణం తీసుకుంది. అన్నీ సవ్యంగా ముగిసిన తర్వాత మే 31న ఒక ఆలయంలో జరిగిన వేడుకలో ఇద్దరూ అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. లక్ష్మీపూర్లోని పటేశ్వర్ నాథ్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వీరు నడిచారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.कल तक बहन, आज जीवनसाथी ! बिहार के जमुई में एक BPSC शिक्षिका ने अपनी फुफेरी बहन से शादी कर ली। शादी से पहले बहन ने जेंडर ट्रांजिशन कराया और दोनों ने हिंदू रीति-रिवाज से विवाह किया। मामला चर्चा का विषय बना हुआ है। pic.twitter.com/xSv0NNMsFD— Yash Ahmad (@YashAhmad8) June 2, 2026 ఐదేళ్ల లవ్నయన్శ్రీ తండ్రి బిహార్ సచివాలయంలో ఉద్యోగి, తల్లి గృహిణి. రాహుల్/రాఖీ తండ్రి కోల్కతాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నయన్శ్రీ తల్లి, రాఖీ తండ్రి తోబుట్టువులు. వారు లక్ష్మీపూర్ బ్లాక్లో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు చెందినవారు. నయన్ శ్రీ, రాఖీ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. 2019లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, డిగ్రీ సమయంలో ఒకే హాస్టల్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో BPSC పరీక్షల ప్రిపరేషన్ కోసం పాట్నా వెళ్లారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుండే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచారు.లక్ష్మీపూర్ వార్డు సభ్యుడు రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నయన్ శ్రీ తన ప్రభుత్వ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భావించి, తాను లింగమార్పిడి చేయించుకోకుండా, రాఖీని (రాహుల్) చేయించుకోమని కోరింది. అందుకోసం ఆమె తన పేరు మీద రూ. 8 లక్షల బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది.కుటుంబంలో గొడవలురాహుల్ మే నెలలో ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ సర్జరీ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మే 31న రాహుల్ మొబైల్ ఫోన్ కొంటానని చెప్పి బయటకు వెళ్లి నయన్ శ్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన విషయం తెలిసి నయన్ శ్రీ తల్లిదండ్రులు రాహుల్ ఇంటికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో ఇంటి గేటును కూడా ధ్వంసం చేశారు. దీంతో భయపడిన కొత్త జంట ఇంటి వెనుక తలుపు నుండి తప్పించుకుని, ప్రస్తుతం ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే, ఈ వివాహం ఇద్దరి పరస్పర అంగీకారంతోనే జరిగిందని బంధువులు చెబుతున్నారు. -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!
ఉత్తరప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒక కోతి చేసిన పనికి తీవ్ర గందరగోళం నెలకింది. ఏకంగా రూ. 2 లక్షల నగదు ఉన్న బ్యాగును లాక్కొని, చెట్టుపైకి ఎక్కి నోట్ల వర్షం కురిపించిన ఘటన, వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..బులంద్షహర్ జిల్లా కోర్టు వెలుపల మే 31నఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆస్తి రిజిస్ట్రేషన్ చ స్టాంప్ పేపర్ల కొనుగోలుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి రూ. 2 లక్షల నగదుతో కోర్టుకు వచ్చాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చిందో ఒకకోతి హఠాత్తుగా అతని చేతిలోని డబ్బుల బ్యాగును లాక్కొని, ఎవరూ ఊహించని విధంగా పక్కనే ఉన్న వేప చెట్టుపైకి ఎక్కేసింది.అంతటితో ఆగలేదు.. ఆగితే.. ఎలా? అందుకే కోతి చేష్టలన్నారు.. చెట్టు కొమ్మపై కూర్చున్న ఆ కోతి, బ్యాగును చింపివేసి అందులోని రూ. 500 నోట్లను గాల్లోకి విసరడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గాల్లోంచి నోట్లు కిందకు రాలుతుండటంతో చెట్టు కింద ఉన్న జనం ఎగబడ్డారు. నోట్లను దక్కించుకునేందుకు కోర్టుకు వచ్చిన లాయర్లు, క్లయింట్లు, బాటసారులు అంతా ఒకేచోట చేరడంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.చివరికి స్థానికులు, అధికారుల సహాయంతో చాలా శ్రమించి చాలావరకు డబ్బును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నోట్లు చిరిగిపోగా, మరికొంత నగదు దొరకకుండా పోయినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే!నెటిజన్ల ఫన్నీ కామెంట్స్ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో విపరీతంగా వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ పెట్టారు. డబ్బులు చెట్లకు కాస్తాయా? అని అడిగేవారికి ఇదే సమాధానం!" అని ఒకరు కామెంట్ చేయగా, సమాజంలో ఆర్థిక సమానత్వం కోసం ఆ కోతి 'న్యాయవాది'లా పోరాడుతోంది" అని మరొకరు చమత్కరించారు. భారతీయ మార్కెట్లలో ప్రస్తుత రీటైల్ లిక్విడిటీకి ఇదొక చక్కని ఉదాహరణ. డబ్బు ప్రతిచోటా ఎగురుతోంది, కానీ ఫండమెంటల్స్ మాత్రం ఇంకా చెట్లపైనే ఊగుతున్నాయి" అని కొందరు మార్కెట్ విశ్లేషణలతో ముడిపెట్టారు.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!Bulandshahr, UP : Monkey 🙈 snatched a bag with ₹2 Lakh , climbed on a tree and started showering cash from the top of the tree 😳 pic.twitter.com/Sy2tbz21ce— Amitabh Chaudhary (@MithilaWaaala) June 1, 2026 కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎప్పుడూ ఉండేదేనని, ఫోన్లు, ఆహార పదార్థాలను లాక్కెళ్లడం సాధారణమే అయినా, ఇంత పెద్ద మొత్తంలో డబ్బును లాక్కొని నోట్ల వర్షం కురిపించడం మాత్రం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు -
బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు
పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్గఢ్లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్గా మారింది.ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా! తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్లో తన అభిమానులతో పంచుకున్నారు. ‘నా లైఫ్ పార్ట్నర్తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది.. వీడియో చూస్తే వణుకే!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు భయంకరమైన విషసర్పం రెండు గంటలు ఒళ్లంతా చుట్టేసినా సురక్షితంగా బయటపడ్డాడో వ్యక్తి. ఒడిశాలోని బౌధ్ జిల్లా అదెనిగఢ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తి రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిన ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎట్టకేలకు ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతమని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.ఏం జరిగిందీ అంటే..హరభంగ బ్లాక్ పరిధిలోని అదెనిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు. ఈయన పక్షవాతం (Paralysis) బాధపడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన తన ఇంట్లో పడుకుని ఉండగా, తెరిచి ఉన్న కిటికీ లోంచి ఒక విషసర్పం గదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి గాధనిద్రలో ఉన్న సాహు ఒంటి మీదికి చేరింది. శరీరంపైఏదో పాకుతున్నట్టు గమనించిన సాహు అసలు విషయం తెలిసి తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడు. కానీ పక్షవాతం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఆయన అక్కడి నుండి త్వరగా తప్పించుకోలేకపోయాడు. ఆ గందరగోళంలో పాము ఆయన చేతికి, అలాగే పక్కనే ఉన్న కుర్చీకి కలిపి గట్టిగా చుట్టుకు పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము చేసే ఏ చిన్న పొరపాటు జరిగిన అతని ప్రాణాలకే ప్రమామని గ్రహించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.इन चाचा को इस जहरीले और खतरनाक सांप ने इस तरह जकड़ लिया है कि खुद को छुड़ाना भी मुश्किल हो रहा है। 😱क्या लगता है, ये इस मुसीबत से बच पाएंगे या नहीं? अपनी राय जरूर बताइए। pic.twitter.com/0JS6WzNOFw— ʀᴜᴅʜʀᴀ ʏᴀᴅᴀᴠ🇮🇳 (@Rudhrayadav001) June 1, 2026 ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్రెండు గంటల ఉత్కంఠదాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు సాహును పాము పట్టు నుండి కృష్ణ చంద్ర సాహును సురక్షితంగా విడిపించారు. అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటి వెలుపల సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ క్రమంలోసాహుకు హాని ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ కాలంలో మండించే ఎండలు, వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులు జాగ్రత్తగా మూసి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్ చేస్తే -
ప్రియురాలి కోసం ప్రియుడి సాహసం.. కట్ చేస్తే
ప్రియురాలి కోసం సరిహద్దులు దాటే సాహసం చేసిన ఒక యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఆన్లైన్లో పరిచయమైన జమ్మూ కాశ్మీర్ యువతిని కలవడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ముజఫ్ఫరాబాద్కు చెందిన యువకుడు జీషాన్ మిర్ (22)ని నియంత్రణ రేఖ (LoC) భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణలో అసలు విషయం చెప్పాడు. దీంతో ఈ స్టోరీ నెట్టింట్ వైరల్గా మారింది.జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్కు చెందిన ప్రియురాల్ని కలవాలన్న అతని కోరికకు సరిహద్దు గీత వద్దే ఎదురు దెబ్బ తగిలింది. ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ పరిధిలోని 'సిలికోట్' ప్రాంతంలో ఒక వ్యక్తి నియంత్రణ రేఖ దాటి రావడాన్ని సైనికులు గమనించారు. అతను భారత భూభాగంలోకి అడుగుపెట్టిన వెంటనే సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను పీఓకేలోని ముజఫరాబాద్కు చెందిన పెయింకాడి నివాసి జీషాన్ అహ్మద్ మీర్ (తండ్రి లాల్ దిన్ మీర్) గా గుర్తించారు. అతని వద్ద ఉన్న పాకిస్తానీ గుర్తింపు కార్డు (ID Card)ద్వారా అతని వివరాలను ధృవీకరించారు. సోషల్ మీడియా ద్వారా ఉరి ప్రాంతానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆమెను కలుసుకోవడానికే తాను ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటానని జీషాన్ భద్రతా సిబ్బందికి తెలిపాడు. ప్రస్తుతం జీషాన్తో పాటు అతను చెప్పిన యువతిని కూడా భద్రతా సంస్థలు విచారిస్తున్నాయి. వారి మధ్య జరిగిన డిజిటల్ సంభాషణలను (చాట్స్) అధికారులు పరిశీలిస్తున్నారు.సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన ముగ్గురు సోపోర్ యువకుల అరెస్ట్మరొక ఘటనలో, శనివారం మరియు ఆదివారం మధ్య రాత్రి హత్లంగా-నంబ్లా మార్గం ద్వారా పీఓకేలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు సోపోర్ నివాసితులను సైన్యం అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ దార్ ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ (TA-161) సిబ్బంది కావడం గమనార్హం.వారు నియంత్రణ రేఖను చేరుకోవడానికి ముందే నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ వారిని పట్టుకుంది. వీరు సరిహద్దు దాటడానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్ఫ్లూయెన్సర్ -
విదేశీ పర్యాటకుడి గొప్ప మనసు..! ఉత్తరాఖండ్లో..
కొందరు కేవలం పర్యాటనలకు వెళ్లి వచ్చేయరు. పర్యావరణ స్ఫూర్తిని రగిలించే ఆలోచింప చేస్తారు. అందుకు దేశం, సరిహద్దుతో పనిలేదు. మంచి మనసు, తనవంతుగా పర్యావరణానికి మేలు చేయాలన్న దృక్పథం చాలు అని నిరూపిస్తున్నాడు ఈ విదేశీయుడు. అంతేగాదు అతడి చర్యకు అక్కడి ప్రభుత్వం స్పందించి కదలివచ్చింది కూడా.పర్యావరణ బాధ్యతకు ఉదాహరణగా నిలుస్తూ..అందర్నీ ఆలోచింపచేస్తున్నాడు బ్రిటన్కు చెందిన మార్క్. ఆయన ఉత్తరాఖండ్లోని కాసర్ దేవి ప్రాంతంలో అటవీ మార్గాలు, పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను నిశబ్దంగా ఏరుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సంచులు చేత బట్టుకుని సుందరమైన కొండ ప్రాంతంలో పడి ఉన్న ప్లాస్టిక్ను, చెత్తను ఏరుతూ కనిపించాడు. అక్కడి స్థానికుల ప్రకారం..మార్క్ చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నాడట. పైగా పరిశుభ్రతను తన వ్యక్తిగత దినచర్యగా మార్చుకున్నాడని చెబుతున్నారు. అతను ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు సమీపంలోని అటవీ ప్రాంతాలను కాలిబాటను శుభ్రం చేస్తూ..ఆ ప్రాంత సహజ సౌందర్యాన్ని పరిరక్షించడంలో సహాయపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతని కృషి ఆన్లైన్లో విశేష ప్రచారం పొందింది. అతడు చేస్తున్న పని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా కలిగి ఉండాలనే విషయాన్ని నేర్పిందని అక్కడకి వస్తున్న పలువురు పర్యాటకులు చెబుతుండటం విశేషం.అంతేగాదు అతడొ చొరవకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఫిదా అవ్వతూ అతడిని అభినిందించింది. అలాగే అతడికి అన్ని విధాల మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. అంతేగాదు అక్కడి అధికారులు పర్యావరణం, పరిశుభ్రత విషయాల్లో అవగాహన కల్పించడంలో సానుకూల ఉదహారణగా నిలిచాడని ప్రశంసించారు. అంతేగాదు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత పట్ల విద్యార్థులను, యువతను ప్రేరేపించే విధంగా మార్క్ను ఒక "మార్పు కారకుడిగా" ప్రోత్సహించాలని పరిపాలన యంత్రాంగం భావిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. View this post on Instagram A post shared by India 🇮🇳 (@postingfornation) (చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..) -
‘చదివించా.. ఉద్యోగం తెప్పించా.. ప్రియుడితో టీచర్ జల్సాలు’
కట్టుకున్న భార్యను చదివించేందుకు ఓ భర్త చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. కూలి పనులకు వెళ్లి.. ఉన్న పొలం అమ్మి భార్యను చదివిస్తే.. తీరా ఉద్యోగం వచ్చాక కుటుంబాన్ని ఎగతాళి చేసి కన్న కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లిన భర్తకు షాక్ తగిలింది. ఆమె తన ప్రియుడితో కలిసి చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె ఆగిపోయినంత పనైంది. ఈ ఘటన కుటుంబ బంధాలు, ఉద్యోగం తర్వాత మారే సంబంధాలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.బీహార్లోని వైశాలి జిల్లా హాజీపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై భర్త అమన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అతను 2013లో గుంజన్ కుమారిని వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆమె ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తిచేసి ఉంది. అయితే, ఆమెకు టీచర్ కావాలన్న లక్ష్యం ఉందని భర్తకు చెప్పింది. దీంతో, ఆమెను చదివించాలని అమన్ అనుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా, తాను కూలి పనులు చేస్తూ ఆమె చదువులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా 2022లో తన భూమిని అమ్మి.. ఆమె డిగ్రీ, బీఈడ్ చదువులు, బీపీఎస్సీ టీచర్ నియామక పరీక్ష సన్నద్ధత కోసం డబ్బులు సమకూర్చినట్లు తెలిపాడు.తర్వాత గుంజన్ కుమారి BPSC TRE-02 నియామక ప్రక్రియలో ఎంపికై టీచర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. సుపౌల్ జిల్లాలో శిక్షణ పూర్తిచేసిన అనంతరం బిదుపూర్ బ్లాక్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ పొందింది. అయితే, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. 2025 జనవరిలో గుంజన్ తమ 10 ఏళ్ల కుమారుడు ఆరుష్ ఆర్యను తన వద్దకు పంపించి, తాను సహచర టీచర్లతో కలిసి డార్జిలింగ్ వెళ్తున్నానని చెప్పింది. కానీ తర్వాత ఆ ప్రయాణానికి ఇతర టీచర్లు ఎవరూ వెళ్లలేదని అమన్కు తెలిసింది. దీంతో తన అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ క్రమంలో ఆరా తీయగా.. శిక్షణ సమయంలో ప్రేమ్ ప్రకాశ్ జైస్వాల్ అనే మరో టీచర్తో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడిందని, ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉండడం ప్రారంభించిందని గుర్తించాడు.🚨Betrayal of Sacrifices: Wife Leaves Husband After BPSC SuccessThe shocking case of Aman Kumar from Hajipur, Bihar, exposes a bitter reality of changing attitudes after financial independence.Aman worked day and night, selling ancestral land to fund the education of his… pic.twitter.com/jryTz01uer— Ramesh Tiwari (@rameshofficial0) May 29, 2026ఈ క్రమంలో మే 23న హాజీపూర్లోని లిచ్ఛవి నగర్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంటికి వెళ్లగా, అక్కడ ప్రేమ్ ప్రకాశ్తో కలిసి ఉండడాన్ని అమన్ చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే డయల్-112 పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక, ఈ వివాదంలో వారి కుమారుడు కూడా కేంద్ర బిందువుగా మారాడు. తన తల్లి మరో వ్యక్తిని “అంకుల్” అని పిలవాలని ఒత్తిడి చేసిందని, తాను ఆమెతో ఉండాలని అనుకోవడం లేదని బాలుడు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో చిన్నారి భవిష్యత్తు, మానసిక పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
30 రోజులు, 13 నగరాలు: రూ.10 లక్షల ఖర్చు
ఒక అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజుల పాటు 13 నగరాలను సందర్శించా మంటూ ఇన్స్టాలో చేసిన పోస్ట్ చేసి వైరల్గా మారారు. ఈ టూర్ కోసం ఈ జంట ఏకంగా 10,605 డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ట్రావెలర్స్ అలెక్స్, అమేలియా తమ ఇన్స్టాగ్రామ్లో ఈ ఖర్చుల వివరాలను పంచు కున్నారు. అయితే ఖర్చు తాము అనుకున్నదానికంటే ఎక్కువే అయిందని అంగీకరించారు. తాము లగ్జరీ హోటళ్లు, ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ భారీ ఖర్చుకు కారణమని వారు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Alex & Amelia | Full-Time World Travel (@checkedouttocheckin)మొత్తంగా ఇండియాలో నెల రోజుల కోసం రూ. 10 లక్షలు అంటే, రోజు రూ. 33,627 అన్నమాట అని ఆ జంట రాసుకొచ్చింది. 30 రోజుల్లోనే 13 నగరాలను సందర్శించడం వల్ల తమ ట్రిప్లోట్రాన్స్పోర్ట్ కోసమే అత్యధికంగా ఖర్చయిందని వారు తెలిపారు. తమ భారత పర్యటనలో భాగంగా ఆరు విమానాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రీమియం హోటళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖర్చు పెరిగిందని, రోజుకు సగటున హోటల్ రూమ్ కోసం రూ. 12,064 ఖర్చు చేసినట్లు చెప్పారు.మొత్తం లెక్కలు వేసి, ఒక నెలలో ఇంత ఖర్చు చేశామా అనే తామే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. కేవలం బడ్జెట్ ఎంపికల కోసం మాత్రమే చూడకపోతే, ఇతర ప్రయాణికులు చెప్పినంత చౌకగా వసతి లేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం బయట తినడంతో జేబులు ఖాళీ అయ్యాయని చెప్పుకొచ్చారు. వామ్మో..ఇది నిజంగానే ఎక్కువ : సోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆ ఖర్చు చూసి ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆ జంట మహారాజుల్లా బతికారు కాబట్టి అంత ఖర్చవ్వడంలో వింతేమీ లేదన్నారు. ఖచ్చితంగా మహారాజుల్లా రాజభోగాలు అనుభవించి ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో..ఇది నిజంగానే చాలా ఎక్కువ అని కొందరన్నారు. ప్రత్యేక అనుభూతులు మిగుల్చుకోవాలంటే.. తప్పదు మరి. అయితే కరోనా తరువాత ఖర్చులు బాగా పెరిగాయన్నారు మరొకరు. -
రెండు నెలలకొకసారి ‘టీం లంచ్’ : ఫోటో వైరల్
హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన డ్రైవర్, పనిమనిషితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ, భారతదేశంలో వర్గ భేదాలు నెమ్మదిగా తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తద్వారా తన దినచర్యలోని ఒక సాధారణమైన,కానీ హృద్యమైన సంగతులను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.హైదరాబాద్కు చెందిన నరేష్ షేర్ చేసిన ఎక్స్లో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కీమా పరాఠా తింటూ కెమెరా వైపు చూసి నవ్వుతున్న నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఉల్లాసభరితమైన సెల్ఫీ తో షేర్ చేస్తూ దేశంలోని వర్గ భేదాలు మెల్లగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.తమ ఇంట్లో పనిచేసే సిబ్బందితో( డ్రైవర్, మేడ్) కలిసి ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇలా 'టీమ్ లంచ్' చేస్తానని నరేష్ క్యాప్షన్లో రాశారు. అంతేకాదు మొదట్లో వారు తనతో కలిసి డైనింగ్ టేబుల్పై కూర్చోవడానికి ఎంతలా సంకోచించారో కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమాజంలో ఉన్న అలవాట్లు, కండిషనింగ్ వల్ల వారు అలా కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు."భారతదేశంలో ఉన్న ఈ వర్గ వ్యవస్థ పోవాలి. దేవుడి కోసమైనా గుర్తుంచుకోండి, ఇది 2026!" అని ఆయన రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెనుక ఒక మంచి సందేశం ఉన్నప్పటికీ, తాము తిన్నది మాత్రం చాలా సాధారణమైన 'కీమా పరాటా' మాత్రమేనని నరేష్ సరదాగా పేర్కొన్నారు.నెటిజన్ల ప్రశంసలుఈ పోస్ట్పై ఇంటర్నెట్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, సమాజంలోని వర్గ భేదాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు లేదా ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ పాత అలవాట్ల వల్ల విడిగా తినడానికే మొగ్గు చూపుతుంటారని, కానీ తాము కూడా వారిని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకే రకమైన పాత్రల్లో భోజనం పెట్టడం ద్వారా ఆ అదృశ్య గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు కామెంట్ చేశారు. నేటితరం శ్రమను గౌరవిస్తున్నారని పాతకాలపు వర్గ వ్యవస్థలను అంగీకరించడం లేదని, ఇలాంటి మార్పులు కొత్త తరం ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. -
సీబీఎస్ఈ టెండర్లో సంచలన ట్విస్టులు?
న్యూఢిల్లీ: దాదాపు 17 లక్షల మంది సీబీఎస్ఈ విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్.. డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు చేపట్టిన సంస్థ ఎంపిక వెనుక అసలు ఏమి జరిగింది? టెండర్ నిబంధనలు ఎందుకు పదేపదే మారాయి? ఒకసారి అనర్హత పొందిన సంస్థ చేతికే మళ్లీ ఎలా వెళ్లాయి? ఒక విద్యార్థి చేసిన పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు విద్యా వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.2025-26 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ తొలిసారిగా భారీ స్థాయిలో ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందుకోసం లక్షలాది జవాబు పత్రాలను స్కాన్ చేసి డిజిటల్గా మూల్యాంకనం చేసే బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. అయితే ఈ టెండర్ ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.12వ తరగతి విద్యార్థి సార్థక్ చేసిన పరిశోధన ప్రకారం.. ఈ టెండర్ను చివరకు దక్కించుకున్న కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ గతంలో గ్లోబరెనా టెక్నాలజీస్ పేరుతో పనిచేసింది. 2019 తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంలో ఈ సంస్థ పేరు తీవ్రంగా వినిపించింది. అనంతరం సంస్థ పేరు మారి కోయెంప్ట్గా మారినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టెండర్ ఒకసారి కాదు, మూడుసార్లు జారీ కావడం. తొలి టెండర్ రికార్డులే అందుబాటులో లేకపోవడం, రెండో టెండర్లో పాల్గొన్న అన్ని కంపెనీలు సాంకేతిక అర్హతల్లో విఫలమవడం, ఆ తర్వాత మూడో టెండర్లో నిబంధనలు మారిన వెంటనే కోయెంప్ట్ విజేతగా నిలవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.సీబీఎస్ఈ టెండర్ వివాదం: కీలక అంశాలు🔹 17 లక్షల విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన టెండర్పై వివాదం🔹 2019 తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతో వార్తల్లో నిలిచిన గ్లోబరెనా టెక్నాలజీస్ (ప్రస్తుత కోయెంప్ట్ ఎడుటెక్)కు కాంట్రాక్ట్🔹 టెండర్ను మూడుసార్లు జారీ చేసిన సీబీఎస్ఈ🔹 చివరి దశలో నిబంధనల మార్పుల తర్వాత కోయెంప్ట్కు టెండర్ దక్కినట్లు ఆరోపణలుసార్థక్ జరిపిన విశ్లేషణ ప్రకారం.. రెండో టెండర్ నుంచి మూడో టెండర్కు వెళ్లే మధ్యకాలంలో అనేక కీలక నిబంధనలు సవరించబడ్డాయి. గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలకు అడ్డుకట్ట వేసే షరతులు సడలించడం, సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణాలను తగ్గించడం, డేటా సెంటర్ యాజమాన్యానికి సంబంధించిన నిబంధనలను తొలగించడం, అనుభవ ప్రమాణాలను మార్చడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయని ఆ కుర్రాడు పేర్కొన్నాడు. అంతేకాదు, సిస్టమ్ విఫలమైతే సంస్థను భవిష్యత్లో బ్లాక్లిస్ట్ చేసే అధికారాన్ని కూడా చివరి దశలో తొలగించినట్లు ఆరోపించాడు. జవాబు పత్రాల స్కానింగ్లో ఖచ్చితత్వానికి సంబంధించిన తప్పనిసరి ప్రమాణాలను సైతం సడలించారని సార్థక్ చెప్పడంతో.. ఈ మార్పులన్నీ ఒకే సంస్థకు అనుకూలంగా జరిగాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.టెండర్ రూల్స్లో మార్పులు➡️ గతంలో బ్లాక్లిస్ట్ అయిన సంస్థలను అనర్హులుగా ప్రకటించే నిబంధన తొలగింపు➡️ సాఫ్ట్వేర్ నాణ్యత ప్రమాణం CMMI Level-5 నుంచి Level-3కు తగ్గింపు➡️ సొంత డేటా సెంటర్ తప్పనిసరి నిబంధన రద్దు➡️ థర్డ్పార్టీ క్లౌడ్ హోస్టింగ్కు అనుమతి➡️ స్కానింగ్ ఖచ్చితత్వానికి సంబంధించిన కఠిన ప్రమాణాల సడలింపు➡️ CERT-In భద్రతా ఆడిట్ నిబంధన తొలగింపు➡️ పొరపాట్లపై జరిమానాల బదులు ఆలస్యాలపై జరిమానాల విధానంఇటీవల సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ పోర్టల్లో వెలుగుచూసిన సైబర్ భద్రతా లోపాలు, అనధికార యాక్సెస్ ఘటనలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. భద్రతా పరీక్షలు పూర్తయ్యాయా? లేదంటే నిబంధనలను పక్కనబెట్టి వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, సీఏజీ ఆడిట్ నిర్వహించాలని, పార్లమెంట్లో చర్చ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.లేవనెత్తుతున్న ప్రశ్నలు❓ నిబంధనలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?❓ మార్పుల వల్ల ఎవరు లబ్ధి పొందారు?❓ భద్రతా ప్రమాణాలు ఎందుకు తగ్గించారు?❓ తొలి టెండర్ వివరాలు ఎందుకు కనిపించడం లేదు?❓ విద్యార్థుల డేటా భద్రతకు ఎలాంటి హామీ ఉంది? This is an unbelievable piece of work by Sarthak and something that requires amplification. Let me explain what he found, in simple terms.Sarthak is a Class 12 student from the 2025-26 batch, one of the 17 lakh students whose answer sheets went through CBSE's new On-Screen… https://t.co/1wB5ZRx5qO— Malay Krishna (@Malay4Product) May 29, 2026అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలపై సీబీఎస్ఈ లేదా కోయెంప్ట్ ఎడ్యూటెక్ సంస్థ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు. కానీ ఒక విద్యార్థి చేసిన ఈ పరిశోధన ఇప్పుడు దేశంలోని అతిపెద్ద విద్యా బోర్డుల్లో ఒకటైన సీబీఎస్ఈ టెండర్ ప్రక్రియపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమాధానాలు ఎప్పుడు వస్తాయన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రెకెత్తిస్తోంది. -
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..
వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక ఫిట్నెస్ ట్రైనర్–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్ మావో". అతనొక చైనా జిమ్ ట్రైనర్. తన క్లయింట్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్ పోస్టుల సారాంశం. A forbidden love affair between a fitness trainer and a woman ended in tragedy. When the woman's husband returned home early from work, Huang Mao, who was hanging from a balcony outside the building, fell to his death. pic.twitter.com/Q4xjNfRD9J— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) May 28, 2026Fitness coach Huang Mao has an affair, the male homeowner returns,crouching on the window ledge he accidentally falls off the building, dying on the spot. pic.twitter.com/FiB0O3GUXv— Josh Blaq (@Josh_korn1) May 28, 2026 ప్రస్తుతం ఎక్స్, టిక్టాక్ తదితర వేదికల్లో వైరల్ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. అయితే.. సాక్షి.కామ్ ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్ ట్రైనర్ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్ ట్రైనర్, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. -
లగ్జరీ బైక్పై బెంగాల్ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ బైక్ రైడ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్కత్తా వీధుల్లో ఖరీదైన హోండా గోల్డ్ వింగ్ను రాయల్గా చక్కర్లు కొట్టారు. ఈ రైడ్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia ట్యాగ్ చేయడం విశేషం ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.దీనికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి దిలీప్ ఎక్స్లో షేర్ చేశారు, Honda BigWing సూపర్ బైక్ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్ గురించి రాసుకొచ్చారు.#WATCH | West Bengal Minister Dilip Ghosh seen riding a bike, in Kolkata this morning. pic.twitter.com/OKBr643M33— ANI (@ANI) May 29, 2026 1.1 Today, I rode a Honda BigWing superbike. It is a high-speed 1800cc, 6-cylinder motorcycle.The bike is extremely comfortable & offers incredible speed.There is ample space at the back with a sofa-like passenger seat,ensuring that the pillion rider can also sit very comfortably pic.twitter.com/al8jWEKVkF— Dilip Ghosh (Modi Ka Parivar) (@DilipGhoshBJP) May 29, 2026 -
ఇలాంటి గిఫ్ట్ పొందాలంటే అదృష్టం ఉండాలేమో! వైరల్ వీడియో
ఆధునిక పెళ్లిళ్లలో భారీ ఆర్భాటాలు, ధగధగలాడే నగలు, బరువైన పట్టుచీరలు, భారీ విందులే కాదు గిఫ్ట్, రిటన్ గిఫ్ట్లు చాలా ముఖ్యం. ఆత్మీయతలు, అనురాగాలు, పలకరింపులుకంటే.. వచ్చామా.. తిన్నామా.. ఫోటో తీయించుకున్నామా. అన్నట్టే ఉంటాయి సాధారణంగా. కానీ అస్సాంలో ఒక పెళ్లిలో చోటు చేసుకున్న ఘటన నెట్టింట అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది.అస్సాంలో ఒక మానసిక వికలాంగుడు ఆహ్వానం లేకుండా ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అతను నిశ్శబ్దంగా అతిథులతో కలిసి భోజనం చేశాడు,ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు కూడా. అబ్బా.. పెళ్లి వారు ఎంత దయ గలవారు అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి. ఇక్కడే మిమ్మల్ని ఆశ్చర్యపర్చే విషయం ఒకటి ఉంది.పెళ్లివారి కంటే తానే గొప్పవాడిని అని నిరూపించుకున్నాడు. ఎలా అంటారా? ఇదీ చదవండి: ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణంతన కడుపునిండింది కదా, ఆకలి తీరింది కదా అని కామ్ గా అక్కడినుంచి వెళ్లిపోలేదు అతగాడు. వెళ్లే ముందు తన చిరిగిన జేబులోంచి రూ.10 లు తీసి వదువుకి కానుకగా అక్కడున్న వారికి అందించాడు. ఈ దృశ్యం చాలా హృద్యంగా నిలిచింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో ఆన్లైన్లో వేలాది మందిని కదిలించింది. దయ,మానవత్వంతో కూడిన మనిషి అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంత ఇచ్చామన్నది కాదు.. ఎంత ప్రేమగా మనస్ఫూర్తిగా ఇచ్చారనేదే ముఖ్యం అంటున్నారు. బహుశా తన జేబులో 10 రూపాయలే ఉండి ఉంటాయ్ అని మరికొందరు కామెంట్చేశారు.எதுவும் இல்லாமல்… இதயமெல்லாம் கொடுத்தார் Assam திருமணத்தில், தன்னிடம் அதிகம் இல்லாவிட்டாலும் ₹10 கொடுத்து வாழ்த்திய விருந்தினரின் gesture இணையத்தில் அனைவரின் மனதையும் கவர்ந்துள்ளது பணத்தின் அளவு இல்லை… மனத்தின் அன்புதான் முக்கியம் pic.twitter.com/3W19ynUTrp— Rajini (@rajini198080) May 28, 2026 ఇదీ చదవండి: ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు -
ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్గా 94 ఏళ్ల వ్యాపారి కథ!
నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ, నిరాడంబరత అన్నవి అరుదైనవిగా మారిపోతున్నాయి. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి తదితరాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబధాలు ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారో లేక మర్చిపోతున్నారో తెలియని పరిస్థితి. అయినప్పటికీ ఇంకా కొద్దరు ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ఆచరిస్తూ అర్థవంతంగా, స్ఫూర్తిగా బతుకుతున్నవారు కూడా ఉన్నారు. ఈ 94 ఏళ్ల తాతగారు ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే ఎన్నో తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చట. ఆ తాతగారితో కాసేపు సరదాగా సంభాషించిన వీడియోని కోల్కతాకు చెందిన డిజిటల్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న తాతగారి పేరు సాదిక్పాల్. ఆయన ముంబైలోని ఖార్ రైల్వే స్టేషన్ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారట. అది ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణమట. ఆ తర్వాత ఆయన దాన్ని మరింతగా అభివృద్ధి చేశారట. ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణ్నా నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ వ్యాపంలో తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. ఎన్నో జీవిత సంఘటనల తోపాటు గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారట. ఆయన దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం వంటి ప్రాముఖ్యతలు గురించి నొక్కి చెప్పారు. అలాగే నిజాయితీగా, సద్గుణవంతుడిగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..మోసం చేసినా సరే..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం కాదని అంటున్నాడు. మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించాడు వృద్ధుడు సాదికపాల్. ఈ వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. (చదవండి: ఒకే ఒక్కడు' సాధించిన ఘనత! జస్ట్ ఒక్కరోజులో..) -
భారీ పేలుడు.. అగ్నిగోళంగా మారి బూడిదైన రాకెట్
అమెరికాలో మరో భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ రాకెట్ టెస్టింగ్ సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా అగ్నిగోళంలా భయానక వాతావరణం ఏర్పడింది. అందుకు సంబంధించిన దృశ్యాలు కింద చూడొచ్చు.. బ్లూ ఆరిజిన్ కంపెనీ ప్రముఖ బిలియనీర్ జెఫ్ బెజోస్ స్థాపించిన ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అనే సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం వేకువజామున ఫ్లోరిడాలోని లాంచ్ ఫెసిలిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీలకమైన “హాట్ ఫైర్ టెస్ట్” సందర్భంగా ఇంజిన్లు ఆన్ చేసిన క్షణాల్లోనే అనూహ్యంగా భారీ పేలుడు సంభవించి రాకెట్ ముక్కలు చెక్కలైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#BREAKINGA Blue Origin rocket exploded into a massive fireball during a hotfire test at Cape Canaveral, FloridaThe company confirmed an “anomaly” during testing and said all personnel have been accounted for safelyAuthorities say no threat to public.Blue Origin founder… pic.twitter.com/8ndAsxCukC— Nabila Jamal (@nabilajamal_) May 29, 2026ఈ ఘటనను కంపెనీ సాంకేతిక లోపంగా పేర్కొంటూ వెంటనే విచారణ ప్రారంభించింది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనతో కంపెనీ అధినేత జెఫ్ బెజోస్కు పెద్ద షాక్ తగిలినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ ప్రయోగ విఫలంతో బ్లూ ఆరిజిన్కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రాకెట్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు లాంచ్ ప్యాడ్ కూడా దెబ్బతిన్న అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖర్చు వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది అత్యంత ఖరీదైన పరీక్షల్లో ఒకటి కావడంతో భారీ నష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. హాట్ ఫైర్ టెస్ట్ అనేది రాకెట్ ప్రయోగానికి ముందు అత్యంత కీలక దశ. ఇందులో రాకెట్ను నేలపై స్థిరంగా ఉంచి ఇంజిన్ల పనితీరును పూర్తి స్థాయిలో పరీక్షిస్తారు. ఈ దశలోనే జరిగిన వైఫల్యం మొత్తం ప్రాజెక్ట్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.న్యూ గ్లెన్ రాకెట్ ద్వారా భారీ వాణిజ్య మిషన్లు, నాసా సంబంధిత ఉపగ్రహాలు కక్ష్యలోకి పంపాలని బ్లూ ఆరిజిన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తాజా పేలుడు కారణంగా ప్రాజెక్ట్ టైమ్లైన్ ఆలస్యం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.మరోవైపు..ఈ ఫెయిల్యూర్తో బ్లూ ఆరిజిన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న సంస్థకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బగా మారింది. టెక్నికల్ సమస్యలు, షెడ్యూల్ ఆలస్యాలు కంపెనీ పోటీ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, ప్రైవేట్ స్పేస్ రేస్ ఎంత ఖరీదైనదో, ఎంత కఠినమో ఈ ఘటన మరోసారి చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇంధనం, ఆహారం, రవాణా, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఆకాశంవైపు చూస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇటీవలే నోయిడా నుండి బెంగళూరుకు మారిన వెంచర్ క్యాపిటలిస్ట్ (Venture Capitalist) సజిత్ పాయ్, తన నివాస ప్రాంతమైన ఇందిరానగర్లో బట్టల ఇస్త్రీ ధరలను చూసి ఆశ్చర్యపోయారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట పెచర్చకు దారితీసింది.సజిత్ పాయ్ ఏమన్నారంటే?తాను గతంలో ఉన్న నోయిడాలో ఒక బట్ట ముక్క ఇస్త్రీ చేయడానికి కేవలం రూ. 5 మాత్రమే తీసుకునే వారని, బెంగళూరులో అంతకంటే కొంచెం ఎక్కువ ఉంటుందని తాను ఊహించానని పాయ్ కానీ ఈ రేంజ్లో ఊహించ లేదంటూ తన అనుభవాన్ని ఎక్స్లో షేర్ చేశారు.తానే ఈ నెల ప్రారంభంలో బెంగళూరుకు మారాననీ, బెంగళూరులోని ఇందిరానగర్లో ఒక బట్టకు రూ. 12 నుండి రూ. 20 వరకు వసూలు చేయడం నన్ను షాక్కు గురిచేసిందని వెల్లడించారు. ముంబై వంటి ఖరీదైన నగరం నుండి బెంగళూరుకు వచ్చిన వారు సైతం ఇక్కడి ఇస్త్రీ ధరలను చూసి ఆశ్చర్యపోతున్నారని ఆయన తెలిపారు. అంతేకాదు ఈ పెరుగుదలకు కారణాలను కూడా ఆయన విశ్లేషించారు.I moved early this month to BLR, and one of the most surprising findings was the higher cost of ironing. Noida where I prev stayed was ₹5 per piece which I know is a bit on the lower side, so I was expecting slighly higher prices but prices of ₹12-20 per piece (admittedly this… pic.twitter.com/3uoLwwSfNu— Sajith Pai (@sajithpai) May 27, 2026LPG ఐరన్ బాక్సుల వాడకం: నోయిడా లేదా ఢిల్లీ (NCR) పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ సాంప్రదాయ బొగ్గు (Charcoal) ఐరన్ బాక్సులను ఎక్కువగా వాడుతుంటారు. కానీ బెంగళూరులోని ఇస్త్రీ వ్యాపారులు ఎక్కువగా ఎల్పీజీ (LPG) గ్యాస్తో నడిచే ఐరన్ బాక్సులను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇస్త్రీ ఖర్చులు పెరిగాయి.బొగ్గు లభ్యత: ఉత్తర భారతదేశంలో తందూరీ రెస్టారెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ బొగ్గు లభ్యత సులువుగా, తక్కువ ధరకే దొరుకుతుందని, అందుకే అక్కడ ఇస్త్రీ ధరలు తక్కువగా ఉండవచ్చని పాయ్ ఒక అంచనా వేశారు.ఇదీ చదవండి: అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపునెటిజన్ల స్పందనఈ పోస్ట్పై స్పందిస్తూ దేశంలోని వివిధ నగరాల ప్రజలు తమ ప్రాంతాల్లోని ధరలను పంచుకున్నారు సూరత్ చెందిన యూజర్ మాట్లాడుతూ.. సూరత్లో సాధారణ ఇస్త్రీకి రూ. 10, స్టీమ్ ప్రెస్కు రూ. 25 తీసుకుంటారని, వారానికి 3 రోజులు ఉచితంగా ఇంటికే వచ్చి బట్టలు తీసుకెళ్లి ఇచ్చే సౌకర్యం కూడా ఉందని చెప్పారు.సాధారణ ఇస్త్రీకి రూ. 7, స్టీమ్ ఇస్త్రీకి రూ. 20 వసూలు చేస్తున్నారని, ముంబై కంటే బెంగళూరు ఖరీదైనదిగా మారడం ఆశ్చర్యంగా ఉందని థానే యూజర్ పేర్కొన్నారు. ఇస్త్రీ అనేది శారీరక శ్రమతో కూడిన పని అని, వారు ఎలాంటి అదనపు వసూళ్లు చేయడం లేదని, వారి కష్టానికి తగ్గ ధరలే తీసుకుంటున్నారని కొందరు సమర్థించారు.శారీరక శ్రమతో కూడి అన్ని పనులలోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. ఇస్త్రీ, కారు శుభ్ర పరచడం, పనిమనిషి, వంటవాడు. ఇతర మెట్రో నగరాలతో, ముఖ్యంగా దక్షిణాదితో పోలిస్తే ఎన్సిఆర్లో ఇవన్నీ చౌకగా దొరుకుతాయని కామెంట్ చేశారు.. ఇదీ చదవండి: భార్యను రూ. 50 వేలకు అమ్మేశాడు.. 10 రోజులు నరకం -
పవన్పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!
ప్రతి వ్యక్తి కెరీర్లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం సహజం. ఏదీ అంత ఈజీగా దొరికేయదు కూడా. అలానే ఈ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా చదువు అవ్వంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మంచి జాబ్ కొట్టేశాడు. కానీ అది వద్దనుకుని ప్రజలకు సేవ చేస్తా అంటూ సివిల్స్ వైపుకి వచ్చాడు. అందులో వరుసపెట్టి వైఫల్యాలే, మధ్యలో వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ ఇలా.. వరుసపెట్టి ఎదురుదెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉన్నాయి అతడిని. కానీ చివరికి వాటన్నింటిని ఓర్చుకుంటూనే సక్సెస్ అందుకున్నాడు. చేతులెత్తేయకుండా చివరి వరకు పోరాడటం అంటే ఇదే కదా అనిపిస్తుంది ఈ వ్యక్తి స్ఫూర్తిదాయక కథ వింటుంటే. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వికాస్ అల్విస్ ఐఐటి మద్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తన ఫాట్మేట్ గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆ పోస్ట్లో వికాస్..తన ఫ్లాట్మేట్ 2012లో ఐఐటి మద్రాస్ నుండి కెమికల్ ఇంజనీరింగ్లో బీ.టెక్ పూర్తి చేసి, రూ. 10 లక్షల వార్షిక ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ను అందుకున్నాడు. తొందరగానే సెటిల్ అయిపోయాడు. కానీ అతడు దాన్ని వద్దనుకుని మరీ యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయాడు. రెండో సారి మెయిన్స్లో తప్పింది. ఇక ఈ రెండు వైఫల్యాలు కారణంగా కాస్త విరామం తీసుకుని తనకిష్టమైన బ్యాడ్మింటన్పై దృష్టిసారించాడు. జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఆడటం ప్రారంభించాడు. అయితే మైదానంలో చాలా రాజకీయాలు ఉండేవి వాటిని చూసి విసుగొచ్చి బ్యాడ్మింటన్ వదిలేసి మరో ఏడాది వృధా చేసుకున్నాడు. మళ్లీ యూపీఎస్సీకి ప్రిపేరవ్వడం ప్రారంభించాడు. ఆ టైంలోనే ప్రేమలో పడ్డాడు. దాంతో మూడోసారి ప్రయత్నంపై ఎఫెక్ట్ పడి సక్సెస్ అందుకోలేకపోయాడు. ఇక నాల్గో ప్రయత్నంలో లవ్ బ్రేకప్ అతడిని మరింత కుంగదీసింది. ఇక ఐదు, ఆరో ప్రయత్నాల్లో అంత సీరియస్నెస్తో ప్రిపేర్ కాలేక ఓటమిని చవిచూశాడు. అలా మొత్తం 12 ఏళ్లు చేజేతులారా వృధా చేసుకున్నాడు. అప్పటికీ అతనికి 35 ఏళ్లు, ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం కూడా లేదు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అతడు జీవితంలో పదే పదే ఎడతెగని వైఫల్యాలను చవిచూసినప్పటికీ..చివరికి అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. అతడు ఆన్లైన్ సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని..ఏకంగా సెబీ సలహాదారుడుగా మారాడు. పైగా ట్రేడింగ్ ద్వారా నెలకు ఏకంగా రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇటీవలే అతను పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు టెకీ వికాస్. నిజం చెప్పాలంటే అతడు ఈ స్థాయికి చేరకుంటాడని ఊహించలేదు కానీ చాలా సంతోషంగా ఉందంటూ తన పోస్ట్ని ముగించాడు టెకీ. ఈ కథ ఓటములు పలకరిస్తూనే ఉన్నా..గివ్ అప్ ఇవ్వకూడదని చెబుతోంది కదూ..!.There is a guy in my flat who completed his https://t.co/Ws1j7hoGgc in Chemical Engineering from IIT Madras in 2012. After graduation, he got a campus placement offer of 10 LPA, but he rejected it and started preparing for UPSC. He belongs to the general category.In the first…— Vikas Alwys (@VikasAlwys) May 27, 2026 (చదవండి: ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..) -
ట్రంప్ పోలికలే రక్షించాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్మీడియాలో వైరల్గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కు బక్రీద్ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ.. చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.బంగ్లాదేశ్లోని ఢాకా సమీప నారాయణ్గంజ్లో ఓ ఫారంలో పెంచుతున్న ఈ అరుదైన ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ గేదె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పిల్లలు, యువత, కుటుంబాలు పెద్దఎత్తున ఫారంకు చేరుకుని సెల్ఫీలు దిగేవారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట.అయితే ఈద్ అల్ అదా సందర్భంగా బలి కోసం ఇప్పటికే ఈ గేదెను విక్రయించినట్లు యజమాని జియౌద్దీన్ మృధా వెల్లడించారు. “ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను.. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని ఆయన చెప్పడంతో.. వైరల్ స్టార్గా మారిన ఈ గేదె కథ విషాదంగా ముగియబోతోందన్న చర్చ మొదలైంది.కానీ సోషల్మీడియాలో పెరిగిన చర్చలు, భారీ ప్రజాదరణ చివరకు ప్రభుత్వాన్ని కదిలించాయి. పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ చివరి క్షణంలో జోక్యం చేసుకుని గేదెను రక్షించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ‘ట్రంప్ బఫెలో’ను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. ప్రత్యేక షెడ్, కేర్టేకర్ను ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆల్బినో జంతువులు బంగ్లాదేశ్లో చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం కారణంగానే వీటికి తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టు వస్తాయని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు పలుమార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని తెలిపారు.ఇప్పుడు సోషల్మీడియాలో ఒక్క ప్రశ్నే వైరల్గా మారింది.. “ట్రంప్లా కనిపించడం వల్లేనా ఈ గేదె ప్రాణాలు దక్కాయి?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. బలి పీఠం దాకా వెళ్లిన ‘ట్రంప్ బఫెలో’ కథ చివరకు జూ వరకూ చేరి హ్యాపీ ఎండింగ్ దిశగా మలుపు తిరిగింది. -
ఇంత పక్కా రిటైర్మెంట్ ప్లానా!? 30 ఏళ్లకే రూ. 19 కోట్లు..
ఓ వ్యక్తి అధిక మొత్తంలో సంపాదిస్తే..అతడి ఖర్చులు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పక్కా ప్లాన్ ఆ డబ్బుని పెట్టుబడులుగా మార్చి ఆదాయాన్ని ఆర్జించడమే కాదు..రిటెర్మెంట్ ప్లాన్ పక్కాగా వేస్తున్నాడు. పైగా 30 ఏళ్లకే పదవీవిరణమ తీసుకుంటాడట. అంతేగాదు మనోడు ఆ తర్వాత కూర్చొని తిన్నా..డబ్బు వస్తూనే ఉండేలా ప్లాన్ చేశాడు. మరి అదెలాగో చూసేద్దామా..!.రేమండ్ జెంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెటాలో పనిచేస్తూ ఏడాదికి ఏకంగా రూ. 3 కోట్లుదాక ఆర్జిస్తున్నాడు. ఈ 24 ఏళ్ల జెంగ్ రెండేళ్లపాటు డల్లాస్లో నివశించి సుమారు ఎనిమిది నెలల క్రితమే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాకు మారాడు. ఆయన తన సంపాదనలో అధిక భాగాన్ని పొదుపు చేస్తూ..పెట్టుబడుల్లో పెట్టాడు. ఆయన నెల సంపాదన సుమారు రూ. 7.6 లక్షలు కాగా, బోనస్లు, స్టాక్లలో మొత్తం 60% వాటా పెట్టుబడులు కలిగి ఉన్నాడు. అంటే పన్నులు, పదవీ విరమణ చెల్లింపులు పోగా మొత్తం అతడి చేతికి రూ. 4 లక్షలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. అతడి పొదపు వచ్చేసి..స్టాక్ వెస్టింగ్, బోనస్లను అనుసరించి నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందట. ఇక అతడి జీవన విధానం ఎంత సింపుల్గా ఉంటుందంటే ఊహకే అందని విధంగా ఉంటుంది. అతడి ఇంట్లో సోఫా వంటి ఫర్నీచర్ గానీ, టీవీ, కారు, సొంతంగా ఇల్లు వంటివి ఏమీ లేవు. అయితే జెంగ్ మాత్రం జీవనశైలి అనది మన ఇష్టానికి సంబంధించిందే తప్ప అవేమి తప్పనరి కాదని కొట్టిపారేస్తున్నాడు. ప్రతినెల ఆయనే బడ్జెట్ స్పెడ్షీట్ని మెయింటైన్ చేసి మరి తన పొదుపు , ఖర్చుల వివరాలను స్వయంగా ట్రాక్ చేసుకుంటాడట. అంటే జాంగ్ అనుకున్న ప్రకారం.. ప్లాన్ సాగితే మాత్రం అతడికి 30 ఏళ్ల వచ్చేటప్పటికీ రూ. రూ. 19 కోట్లకు పైగా పెట్టుబడి ఉంటుంది. అలాగే జాంగ్ అనుకున్నట్లు 30 ఏళ్లకు ధీమాగా పదవీ విరమణ చెసేయొచ్చు కూడా. బాగుంది కదూ ఈ రిటైర్మెంట్ స్ట్రాటజీ.(చదవండి: టెన్త్ డ్రాపౌట్..ఆయుధాలు, డ్రోన్ సాంకేతికత అందించే కంపెనీ..!) -
‘కాక్రోచ్’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!
క్విక్ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్ పవర్పాయింట్ ప్రజంటేషన్గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్ఆర్ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది.గుర్గావ్కు చెందిన అమెజాన్ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన.ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్ కాల్?” అనే మాటను అధికారికంగా వర్క్ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్లు ఉన్నాయి.ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్ఆర్ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో లింక్టిన్, ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు ఈ అంశాలు తమ రోజువారీ అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని కామెంట్లు చేశారు. కొందరు అయితే ఇది జోక్ అయినప్పటికీ “చాలా నిజంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.అయితే ఆశ్చర్యకరంగా.. “Corporate Majdoor Janta Party” అనే పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రత్యక్షమవ్వడం ఈ ట్రెండ్ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆ సైట్లో జాయిన్ ద మూమెంట్ అనే ఆహ్వానం ఉండటంతో ఇది సాధారణ పోస్ట్ నుంచి ఒక పెద్ద ఇంటర్నెట్ క్యాంపెయిన్గా మారినట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ LinkedIn వ్యంగ్య పోస్ట్గా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని హాస్యరూపంలో బయటపెడుతున్న ఒక వైరల్ సోషల్ మీడియా ఉద్యమంగా మార్చేయడం గమనార్హం.అది ఇది కాదు.. ఇదిలా ఉంటే.. ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. కార్పొరేట్ జనతా పార్టీ (Corporate Janata Party - CJP) పేరుతో కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్లు, వేధింపులు, తక్కువ హైక్లు, టాక్సిక్ వర్క్ కల్చర్లపై నిరసనగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించారాయన. అయితే దీనికంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. లేఆఫ్ ఇన్సూరెన్స్: ఉద్యోగం నుండి తొలగిస్తే ప్రభుత్వాలు లేదంటే కంపెనీలు భద్రత కల్పించడం. మూన్లైటింగ్ (Moonlighting): ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతి. పని వేళలు: కార్యాలయ వేళల తర్వాత ఫోన్ కాల్స్, మెయిల్స్ బంద్ చేయడం. జీతాల పెంపు: ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతంలో హైక్ ఇవ్వడం.. ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక వర్క్ఫోర్స్ ఉద్యమంగా వైరల్ అయింది. అయితే, కొన్ని ప్లాట్ఫారమ్లలో దీని ఖాతాలు బ్యాన్ కావడంతో ఉద్యోగుల సంఘీభావంతో ఇది మరింత చర్చనీయాంశమైంది కూడా. -
బెంగాల్లో బీజేపీ ఎఫెక్ట్.. ఈ దృశ్యాలు చూశారా?
ఓ చేతిలో తట్టా బుట్టలు, భుజాన మూటలు… మరో చేతిలో పిల్లల చెయ్యి పట్టుకుని సరిహద్దుల వైపు నడక. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ముఖంలో.. హకీంపూర్ చెక్పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్ అంతటా ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఒకప్పుడు రాజకీయ చర్చలకే పరిమితమైన అక్రమ వలసదారుల అంశం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించే పరిణామాలుగా మారడంతో సరిహద్దులో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. West Bengal CM Suvendu Adhikari is on Fire Mode 🔥Worst days for Illegal Jehadi immigrants are coming."Bhaag Jao, Warna Sarkaar pel degi" pic.twitter.com/HpftDWLjQs— Chota Don (@choga_don) May 26, 2026బెంగాల్లో అక్రమ వలసదారుల ఎరివేతకు “డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్”.. విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. తాజాగా సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులతో జరిగిన మీటింగ్లోనూ ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలో లేని వారిని అక్రమంగా దేశంలోకి వచ్చినవారిగానే పరిగణిస్తామని.. అలాంటి వాళ్లను స్థానిక పోలీసులు సాయంతో అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్కు అప్పగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అటు నుంచి అటే వాళ్లను దేశం నుంచి పంపించేస్తారన్నమాట. ఈ వ్యాఖ్యలు బెంగాల్లో అలజడిని రేపాయి. అందుకు తగ్గట్లే.. ప్రవాహం కనిపిస్తోంది. North 24 Parganas, West Bengal: Following BJP govt’s fresh order to identify and act against illegal Bangladeshi immigrants, movement near border areas reportedly increased. 🚨 pic.twitter.com/PLQw3Tfurp— JanHit Voice (@HJP2029_2036) May 26, 2026 హకీంపూర్ చెక్పోస్ట్ సహా ఉత్తర 24 పరగణాలు, మాల్దా ప్రాంతాల్లో అనుమానితుల కదలికలు పెరిగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక్క హకీంపూర్ వద్దే ఒకే రోజులో వంద మందికి పైగా గుమిగూడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు బంగ్లాదేశ్ వైపు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాల్దాలో కూడా ఇదే తరహా కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హోం & హిల్ అఫైర్స్ శాఖలోని ఫారినర్స్ బ్రాంచ్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మాల్దా జిల్లాలో మొదటిసారిగా “హోల్డింగ్ సెంటర్” ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. భారత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై చేపట్టే చర్యల భాగంగా ఈ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాల్దా కేంద్రంలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది.#WATCH | North 24 Parganas, West Bengal | A large group of allegedly illegal Bangladeshi immigrants gather at the Hakimpur checkpost near the Bangladesh border, after the newly formed, BJP-led, West Bengal government, launched its 'detect, delete and deport' policy. (26.05) pic.twitter.com/RBN79D0cfP— ANI (@ANI) May 27, 2026ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ చట్టం బెంగాల్ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్కు మరింత బలం ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ద్వారా వలసదారులపై నిఘా, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను డిజిటల్ వ్యవస్థ ద్వారా వేగవంతం చేయడంతో పాటు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అధికారం ఉంది.బెంగాల్ అధికారుల చెబుతోంది ఏంటంటే.. ఈ హోల్డింగ్ సెంటర్లు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలుగా పనిచేస్తాయి. అనుమానితుల జాతీయత నిర్ధారణ పూర్తయ్యే వరకు వారిని గరిష్టంగా 30 రోజుల వరకు అక్కడ ఉంచే అవకాశం ఉంది. జిల్లా మేజిస్ట్రేట్లు మరియు సంబంధిత అధికారులు పత్రాల ధృవీకరణ, డేటా సేకరణ, కేంద్ర డేటాబేస్లకు సమాచారాన్ని అప్లోడ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.అయితే ఈ పరిణామాలు కేవలం పశ్చిమ బెంగాల్కే పరిమితం కాలేదంటూ సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున నడుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ(తెలుగు రాష్ట్రాల్లోనూ) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అక్రమ వలసల కదలికల సంకేతాలు కనిపిస్తున్నాయట. కొందరు ఈ పరిణామాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అదే సమయంలో కుటుంబాలతో కలిసి తాత్కాలికంగా ప్రయాణిస్తున్న వర్గాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. -
వరుడు కుటుంబం రిటర్న్ గిఫ్ట్ అదుర్స్..! మొత్తం గ్రామానికి రూ. 34.6 కోట్ల..
వివాహం అనగానే ఓ పండుగ వాతావరణంలో ఉంటుంది. మా ఊర్లో ఫలాన వాళ్లది పెళ్లి అని అంతా సంతోషంగా చెప్పుకుంటారు కూడా. ఆ ఆనందం పెళ్లిని నిర్వహిస్తున్న కుటుంబాలకే చెందినదైనా..ఆ ఊరు లేదా ఆ గ్రామంలోని అందరి కళ్లలో సంతోషం వెల్లివెరిస్తుంది. అయితే ఇక్కడ ఈ వివాహ వేడుక ఈ సంతోషం తమకు మాత్రమే గాక ప్రజలందరూ సంబరపడే ఉండాలని ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి యావత్తు గ్రామం ఫిదా అవ్వడమే కాదు.. కళ్లు చెమర్చాయ్. ఆహా..! మీ వివాహ వేడుక మా ఆర్థిక భద్రతగా మారిందా అని అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని బహదర్పురా గ్రామంలో చోటు చేసుకుంది. అక్కడ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మంచి సంగీతం, విందు భోజనంతో పాటు ఈ వేడుక సంతోషం అందరికి చేరువవ్వాలిని అపురూపమైన రిటర్న్ గిఫ్ట్లు అందించింది వరుడి కుటుంబం. వివాహ తంతులో సాంప్రదాయ జ్ఞాపికలు లేదా బహుమతులకు బదులుగా వరుడు సిద్ధేశ్వర్ పేఠ్కర్ అతని కుటుంబం గ్రామంలోని 3,465 మంది నివాసితులందరికీ రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా కవరేజీని బహుమతిగా ఇచ్చింది.అర్హులైన ప్రతి గ్రామస్తునికి భీమా సౌకర్యం..పేఠ్కర్ కుటుంబం స్థానిక గ్రామ పంచాయతీ పేరు మీద గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఎవ్వరూ మినహాయించబడకుండా ఉండేలా గ్రామ ఓటర్ల జాబితానే నేరుగా బీమా కంపెనీకి సమర్పించింది. దాంతో అర్హులైన ప్రతి నివాసికి స్వయంచాలకంగా రూ. 1 లక్ష ప్రమాద బీమా లభించేందుకు మార్గం సులభమైంది. ఈ బీమా పాలసీ ఒక ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అలాగే భవిష్యత్తు పునరుద్ధరణపై చర్చలు కూడా జరగనున్నాయి. అయితే, పాలసీ కోసం చెల్లించిన మొత్తం ప్రీమియంను వెల్లడించకూడదని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ మేరకు వరుడు కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. "మన సంస్కృతిలో దానధర్మాల గురించి అందరికీ చాటింపు వేయం. అందుకే ఎవ్వరికీ ఆ మొత్తం సొమ్ము గురించి చెప్పాలనుకోవడం లేదు. మాకు కేవలం ఆశీర్వాదం చాలు. చప్పట్లు పొగడ్లతో పనిలేదు. ఆకస్మిక ప్రమాదాలు గ్రామీణ కుటుంబాలను ఆర్థికంగా ఎలా నాశనం చేస్తాయో ప్రత్యక్షంగా చూడటం వల్ల తమకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలలో పాముకాట్లు, పిడుగుపాటు, వ్యవసాయ సంబంధిత ప్రమాదాలు సర్వసాధారణం, పైగా బీమా సౌకర్యం చాలా అరుదుగా ఉంటుంది. మా ఆనందం మా ఇంటికే పరిమితం కాకూడదనే ఇలా చేశాం. ఈ పెళ్లి కేవలం జ్ఞాపకంగా మాత్రమే కాకుండా రక్షణగా మారాలని ఆశించే ఇలా చేశామని అన్నారు" వరుడు సిద్ధేశ్వర్ కుటుంబీకులు. అక్కడి గ్రామస్తులు సైతం ఇప్పటివరకు ఇలాంటి పెళ్లి కానుకను చూడలేదని.. మొత్తం గ్రామానికే సాముహిక సంరక్షణను అందించే ఆర్థిక భద్రతను అందించిందంటూ సదరు వరుడి కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య.. -
భారీ మూల్యం : అష్టకష్టాల్లో జిమ్ ఓనర్ దీపక్
ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్లో జిమ్ ట్రైనర్ మహ్మద్ దీపక్ గుర్తున్నారా? ఓ వృద్ధ ముస్లిం వ్యాపారిని వేధింపుల నుండి కాపాడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపక్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు, అనేక ఇతర ప్రముఖులు, నేతలు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు.. ఆ సంఘటన జరిగిన కేవలం నాలుగు నెలలకే సర్వస్వం కోల్పోయే స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగింది? మానవత్వం చాటుకున్నందుకే ..ఇలా ఆ ప్రశంసలు మాట ఎలా ఉన్నా,ప్రస్తుతం ఆయన భారీ అప్పుల్లో మునిగిపోవడమే కాకుండా, తన జిమ్ వ్యాపారాన్ని కూడా కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మానవత్వాన్ని చాటుకున్నందుకు ఒకవైపు న్యాయపరమైన పోరాటం, మరోవైపు ఆర్థిక దివాలా అంచున ఉన్న కుమార్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటన తర్వాత కుమార్ తీవ్రమైన ఎదురుదెబ్బలను ఎదుర్కొన్నారు. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. జిమ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. గతంలో 150 మంది సభ్యులతో కళకళలాడే జిమ్కు, ఇప్పుడు రోజుకు కేవలం 15 మంది మాత్రమేపరిమితమైపోయింది. ఆర్థికంగా చితికిపోయాడు. మతపరమైన విభజన కారణంగా కుమార్ ఒంటరివాడయ్యారు. గత నాలుగు నెలలుగా జిమ్ అద్దె చెల్లించలేక, అటు ఇంటి లోన్ ఈఎంఐలు (EMIs) కూడా నానా కష్టాలు పడుతున్నారు.ఖాళీ చేయాలని నోటీసుప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి తారస్థాయికి చేరిన వేళ, కుమార్ ఉంటున్న ఇంటి యజమాని ఆయనకు ఎగ్జిట్ (ఖాళీ చేయాలంటూ) నోటీసు ఇచ్చారు. అయితే ఇది కేవలం అద్దె బకాయిల కోసం ఇచ్చిన నోటీసు కాదని, ఆ వృద్ధ ముస్లిం వ్యాపారికి మద్దతుగా నిలిచినందుకు ప్రతికారంగానే తనను ఇల్లు ఖాళీ చేయిస్తున్నారని కుమార్ ఆరోపిస్తున్నారు. స్థానికంగా తనపై ఉన్న సామాజిక ముద్ర కారణంగానే వ్యాపారం చేసుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మతపరమైన అసహనానికి వ్యతిరేకంగా తాను తీసుకున్న నిర్ణయమే తన ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన వాపోతున్నారు.ఇదీ చదవండి: రీవాల్యుయేషన్ వివాదం : ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్న సీబీఎస్ఈకాగా ఈ ఏడాది జనవరి 26న కోట్ద్వార్లో 'కుమార్' అనే జిమ్ యజమాని, స్థానిక దుకాణదారుడైన వకీల్ అహ్మద్ను బజరంగ్ దళ్ సభ్యులు వేధించడాన్ని చూశారు. వకీల్ అహ్మద్ తన షాప్ పేరులో ఉన్న "బాబా" అనే పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పదం కేవలం స్థానిక దేవుడికి మాత్రమే పరిమితమని వారు వాదించారు. అయితే ఈవివాదంలో కుమార్ జోక్యం చేసుకుని వృద్ధుడికి మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కుమార్ ధైర్యాన్ని, మత సామరస్య నిబద్ధతను అభినందించారు.ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
రూ. 300 కోట్ల కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగానికి రిజైన్..! ఆ క్షణమే అమ్మ, బార్య..
కొన్ని కథలు డేరింగ్ నిర్ణయాలు ఎలా తెసుకోవాలో తెలియజేస్తాయి. ఎందుకంటే ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి చాలా కంగారుపడిపోతాం. కానీ మనలాంటి వారెందరో అదే బాటలో పయనించి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్ల కథలు వింటే ధైర్యంగా అడుగు వేసే ప్రయత్నం చేయడమే కాదు..ఏనాటికైనా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబంతో తనతో ఎలా ప్రవర్తించిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అశ్వనీ కుమార్ అనే పారిశ్రామిక వేత్త 40 ఏళ్ల వయసులో ఏకంగా రూ. 300 కోట్ల కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ లగ్జరీ లైఫ్ని లీడ్ చేసున్నాడు. అధికజీతం, విదేశీ పర్యటను, ఏసీ క్యాబిన్లతో బిందాస్గా సాగిపోతోంది లైఫ్. ఏ చీకు చింత లేదు అయినా సరే మనోడు మానసిక ప్రశాంతతే ప్రధానం అంటూ ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తత్ క్షణమే తన తల్లి తనతో మాట్లాడటే మానేసిందని, భార్య తనకు పిచ్చి పట్టిందేమో అన్నట్లుగా చూసిన చూపుని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు. ఆయన సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో కార్పొరేట్ జీవితానికి స్వస్తి పలికాడు. అనుకున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడిగా మారి విజయవంతంగా సొంతంగా బ్రాండ్ని నిర్మించే రేంజ్కు చేరుకున్నాడు. సొంతంగా వ్యాపారం లేదా ఇంకేదైనా ప్రారంభించాలనుకునేవారికి తన కథ స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నా అంటూ తన వ్యక్తిగత సాహసోపేతమైన జర్నీ గురించి వివరించాడు. నెటిజన్లు ఇది నిజంగా ప్రేరణకు పరాకాష్ట అని కొందరు, మరికొంతమంది మీ కథ అసలైన స్ఫూర్తి అంటూ అశ్విని కుమార్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ashwani kumar (@thedhandhaguru) (చదవండి: వంట చేయడం రాకపోతే విడాకులు ఇవ్వొచ్చా? ధర్మాసనం ఏం చెప్పిందంటే..) -
విజయవంతమైన వివాహబంధం అంటే అదేనా..!?
భారతదేశంలో విడాకులను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. పైగా చాలా జంటలు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా..సమాజం కోసం లేదా మరే ఇతర కారణాల వల్లనో కొనసాగతుంటారు. ఆ బంధం ఊపిరాడనంతగా చేస్తున్నా బలవంతంగా కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే అలాంటి వివాహ బంధాన్నే భారత కుటుంబ వ్యవస్థ విజయవంతమైన వివాహ బంధంగా పేర్కొనడం విచిత్రం. ఇది నిజంగా ఎంత వరకు కరెక్ట్ అంటూ నిలదీశారు నాట్ డేటింగ్ యాప్ సీఈవో. అసలు విజయవంతమైన వివాహ బంధం అంటే అసలే ఏంటి అంటూ సోషల్మీడియా వేదికగా చర్చ లేవదీస్తూ..తన అభిప్రాయన్ని పంచుకున్నారు.ఆయన ఏమన్నారంటే..ఇటీవల కాలంలో అసంతృప్తికరమైన వివాహాలు, భావోద్వేగ అనుకూలత గురించిన సంభాషణలు ఆన్లైన్లో సర్వసాధారణంగా మారాయి. ఆ నేపథ్యంలో నాట్ డేటింగ్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జస్వీర్ సింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న వివాహంలో కొనసాగడాన్ని విజయవంతమైన వైవాహికి బంధంగా పరగణించాలా అనే ప్రశ్నను లెవనెత్తారు. చాలామంది తమ ఆనందం కోసం కాకుండా సామాజిక అంచనాల కారణంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని వాదించారు. ఈ మేరకు జస్వీర్సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో ఇలా రాశారు. భారత దేశానికి తక్కువ విడాకులు రేట్లు అవసరం లేదు. ఊపిరాడకుండే చేసే వివాహాలు తక్కువగా కావాలన్నారు. భారత్లో విడాకులు రేట్లు తక్కువగా ఉన్నాయనేది గొప్పగా విజయం సాధించనట్లుగా గర్వంగా చెబుతుంటారు. కానీ లక్షలాదిమంది తమ వివాహ బంధంలో మానసికంగా చచ్చిపోయి, బయటకు రావడానికి చాలా భయపడుతున్నారు. వాళ్లంతా ప్రతిరోజూ తమ లోపల చనిపోతున్నారు. అందుకు ఉదాహరణ ట్విషా శర్మ ఉదంతమే. 30 ఏళ్ల వివాహం దాని విజయానికి తప్పనిసరిగా హామీ ఇవ్వదని, ఎందుకంటే కొంతమంది భాగస్వాములు నిజంగా కలిసి జీవించకుండా కేవలం ఒకరినొకరు భరిస్తారని పేర్కొన్నారు. సంతోషంగా లేని ఇద్దరు వ్యక్తులను దశాబ్దాల పాటు కలిసి ఉండమని బలవంతం చేయడం, విడాకుల కన్నా చాలా బాధాకరమైనది. మీరు ప్రతిరోజూ చిక్కుకుపోయినట్లుగా, మానసికంగా అలసిపోయినట్లుగా, ఒంటరిగా, ఊపిరాడనట్లుగా భావిస్తూ నిద్రలేస్తే, వాళ్లు ఒక వివాహాన్ని కాపాడటం లేదు. సమాజ పరువును కాపాడుతున్నారు, అని ఆ సీఈఓ పోస్ట్లో పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే భారతీయ కుటుంబాలు వివాహం అంటే సర్దుబాటు అని చెప్పి..కొనసాగించాడమే పరవు అని నొక్కి చెబుతుంది. ఆమె లేదా అతడు మానసికంగా లోలోపల కుంగిపోయినా అలా కాపురం చేస్తే..దాన్ని విజయవంతమైన వివాహం అనే చెబుతుంటారు. నిజం చెప్పాలంటే ఇది నిజంగా భావోద్వేగ బంధనం. ఇక్కడ విడాకులు నిషిద్ధంగా చూడకూడదు. జీవితాంతం దుఃఖంలో మునిగిపోవడమే నిషిద్ధం కావాలి అంటూ పోస్టుని ముగించారు. నెటిజన్లు ఆయన మాటలకు ఏకీభవిస్తూ భారతదేశంలో విడాకులను సాధారణీకరించాలి. మనకు విఫలమైన వ్యాపారాలు ఉన్నట్లే, విఫలమైన సంబంధాలు కూడా ఉంటాయని అంగీకరించాలి, సాధారణ విషయంగా పరిగణించాలి. అయితే భారతదేశం సంతోషంగా కలిసి జీవించడాని కంటే కలిసి ఉండటానికే ప్రాధాన్యత ఇస్తుందని అదే అసలైన సమస్య అని పోస్టులు పెట్టారు. కాగా, ఈ చర్య మానసిక ఆరోగ్యం, విడాకులపై మారుతున్న అభిప్రాయాలను హైలెట్ చేసింది.(చదవండి: నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!) -
రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి
అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం.. “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. -
నిస్వార్థమెంత గొప్పదో.. ఈ ఘటనే రుజువు ..!
జీవితం చాలా పరీక్షలు పెడుతుంది. ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటుంది. నిరాశతో నిండిపోయి ఉంటాం. అయినాసరే లేచి నిలబడి.. ఓటమికి తలవంచక పోరాడితే..ఎవరో ఒకరి రూపంలో సాయం అందుతుంది అనేందుకు ఈ ఘటన ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వన్-డే స్పోర్ట్స్ ఈవెంట్ అయిన ఐరన్మ్యాన్ ఎండ్యూరెన్స్ పోటీకి సన్నద్ధమువుతున్నాడు మాజీ నావికా ఇంజనీర్ విన్సెంజో గరోఫాలో. ఆ నేపథ్యంలోనే సైకిల్ రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా అతడి కృత్రిమ కాలు బ్యాలెన్స్ తప్పి రోడ్డుపై పడిపోతుంది. అతడు వెంటనే సైకిల్పై నుంచి దిగి బ్యాలెన్స్ చేసుకుని సైకిల్ ఒక పక్క వద్ద పెడుతుండగా..ఇంతలో ఒక వ్యక్తి పరుగుపరుగున వచ్చి అతడి కృత్రిమ కాలుని ఇవ్వడమే గాక అతడి సైకిల్ని ఒక పక్కకు పెట్టి అతడి కాలుకి ఆ కృత్రికాలుని అమర్చడంలో సాయం అందించాడు. ఆ అపరిచిత వ్యక్తి దయకు విన్సెంజో గరోఫాలో కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పరిగెత్తుకుంటూ వచ్చి తక్షణమే సాయం చేసిన ఆ పెద్దమనిషికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్స్టాగ్రామ్లో షేర్ చశాడు. చివరగా విన్సెంజో గరోఫాలో జీవితం నా పట్ల చాలా కఠినంగా ఉంది. తనను లెక్కలేనన్ని సార్లు కిందపడేలా చేసింది. కానీ అది నన్ను ఆపలేకపోయింది. ఈ ప్రపంచాన్ని భిన్నంగా చూడటం నేర్పించింది. చిన్న చిన్న విషయాలను, ప్రయత్నాలను ఎవరు చూడని అదృశ్య పోరాటాలను అభినందించడం నేర్పింది అని భావోద్వేగంగా చెప్పాడు. అయితే ఏం జరిగినా ఎప్పటికీ గివ్అప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నానన అన్నాడు. View this post on Instagram A post shared by Malta Daily (@maltadaily.mt) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?) -
22 ఏళ్లకే ఆరో సారి : ఇంకో కొడుకు కావాలి! నెటిజన్లు ఫైర్!
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక గైనకాలజిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనను చర్చను రేకెత్తిస్తోంది. 22 ఏళ్ల ఒక యువతి ప్రస్తుతం తన 6వ బిడ్డకు జన్మనివ్వబోతుండటమే ఇందుకు కారణం. ఆ డాక్టర్ తెలిపిన వివరాలు తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.రాజస్థాన్కు చెందిన ఈ దంపతులకు 15 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి అప్పటికే ఐదుగురు పిల్లలు (నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు) ఉన్నారు. అయినప్పటికీ, మరొక మగపిల్లాడు కావాలనే ఆశతో వారు మళ్లీ గర్భం దాల్చారు. స్పందన్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రగ్యా తోమర్ పేషెంట్ , ఆమె భర్త అనుమతితోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీని ప్రకారం ఆ మహిళ డాక్టర్తో ఇలా అంది. "నాకు వరుసగా ఆడపిల్లలే పుడుతున్నారు.. మాకు ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు, మాకు ఇంకొక అబ్బాయి కావాలి" అని చెప్పింది. ఆమె భర్త స్పందిస్తూ.. కుటుంబాన్ని పోషించడానికి, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒకే ఒక కొడుకు సరిపోడంటూ వ్యాఖ్యానించాడు. View this post on Instagram A post shared by Dr Pragya Tomar (@dr.pragyawellness)ఇప్పటికే ఆ మహిళ అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు తిరగడం, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఇంత చిన్న వయసులోనే వరుసగా గర్భం దాల్చడం వల్ల వచ్చే తీవ్రమైన ప్రాణాపాయాల గురించి డాక్టర్ ఆ దంపతులను హెచ్చరించారు. కాన్పుకు, కాన్పుకు మధ్య కనీస సమయం లేకపోవడం వల్ల శరీరానికి విశ్రాంతి దొరకదు. దీనివల్ల తీవ్రమైన రక్తహీనత (Anemia), పోషకాహార లోపం, శారీరక క్షీణత ఏర్పడతాయని వైద్యురాలు వివరించారు. ఇన్నిసార్లు గర్భం దాల్చం, ప్రసవాలతోనే ప్రాణం మీదికి తెచ్చుకున్నారని, ఇది తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు.ఇదీ చదవండి: దారుణం : కాఫీలో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం నెటిజన్ల ఆగ్రహంఈ వీడియో వైరల్ కావడంతో, సమాజంలో మహిళలపై ఉన్న ఒత్తిడిని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన "మగపిల్లాడిపై వ్యామోహం" లింగ వివక్షకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు."ఆమె ఒక వయస్కురాలిగా మారకముందే.. తల్లిగా మారిపోయింది" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు, "ఆ భర్త పరిస్థితి చూడండి. కనీసం కుటుంబానికి సరైన తిండి, బట్టలు, వసతి కూడా కల్పించలేని స్థితిలో ఉండి కూడా.. వంశాన్ని ఉద్ధరించడానికి ఇంకో కొడుకు కావాలంటున్నాడు, ఎందుకు?" అని ప్రశ్నించారు. గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేకపోవడం, బాల్యవివాహాలు, ఫ్యామిలీ ప్లానింగ్ లోపించడం, కొడుకులు-కూతుళ్ల మధ్య చూపిస్తున్న వివక్షపై ప్రజలు గళమెత్తారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్పై చమక్కులు : నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ -
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026 -
ట్రంప్లా కనిపించిన గేదె.. పాపం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్గంజ్లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. బక్రీద్ సందర్భంగా ట్రంప్ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్ మృధా మాట్లాడుతూ.. ఈద్ అల్ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు.తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్ స్టార్గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్ అల్ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్మీడియాలో వైరల్ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
నీ తొక్కుడు.. సాటెవ్వడూ!
మీరు ఎప్పుడైనా రెండు చక్రాల సైకిల్ తొక్కారా? ఏమిటీ పిచ్చి ప్రశ్న.. సైకిల్కు రెండు చక్రాలు కాకపోతే నాలుగు ఉంటాయా? సింగిల్ వీల్ సైకిల్ ట్రై చేశారా? తొక్కడం మాట అటుంచి కనీసం ఎప్పుడు చూడలేదు అంటారా? ఒంటి చక్రం సైకిల్ కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు యువ రైడర్ సనీద్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవరితడు, ఏమిటి అతడి ప్రత్యేకత?కేరళం రాష్ట్రానికి చెందిన సనీద్ సైకిల్పై నేపాల్కు యాత్ర చేపట్టాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అతడు ఒక చక్రం ఉన్న సైకిల్పై (one wheel cycle) ఈ సాహసయాత్ర చేస్తున్నాడు. ప్రత్యేకంగా మార్పులు చేసిన సింగిల్ వీల్ సైకిల్ తొక్కుతూ జాతీయ రహదారులు, పబ్లిక్ రోడ్లపై అతడు దూసుకుపోతుంటే జనాలంతా వింతగా వీక్షిస్తున్నారు. తాజాగా అతడి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంకల్పానికి సెల్యూట్సైకిల్ ముందు భాగాన్ని పైకి లేపి, సీటుపై కూర్చుని బ్యాలెన్స్ చేసుకుని ఎంతో సహనంతో సనీద్ సాహసయాత్ర కొనసాగిస్తున్నాడు. సైకిల్ వెనుక భాగంలో సామాను పెట్టుకున్నాడు. ముందు-వెనుక కేరళ టు నేపాల్ బోర్డు తగిలించుకుని, జాతీయ జెండాలు పెట్టుకుని ముందుకు సాగుతున్నాడు. ఇది చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. పిచ్చితనం అని కొందరు, సాహసం అని మరికొందరు వ్యాఖ్యానించారు. మామూలు మనుషులు ఇలాంటి సాహసాలు చేయలేరని చాలా మంది పేర్కొన్నారు. అతడి అంకితభావం, సంకల్పాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.సాహసాలతో సావాసంఇలాంటి సాహస యాత్రలు సనీద్కు కొత్త కాదు. స్టంట్ పెర్ఫార్మర్ అయిన ఈ యువ రైడర్ గతంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒంటి చక్రం సైకిల్పై 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన గురించి లోకానికి చాటాడు. ఇదే విధంగా అతను కేరళ అంతటా దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించినట్టు తన సోషల్ మీడియా బయోలో పేర్కొన్నాడు. సింగిల్ వీల్ సైకిల్ దేశమంతా చుట్టిరావాలన్నది తన కల అని వెల్లడించాడు. సనీద్ తన కలను సాకారం చేసుకోవాలని మనమంతా కోరుకుందాం. View this post on Instagram A post shared by Nafsil Ap (@nafsilpt) -
వాట్ యాన్ ఐడియా..! తల్లిదండ్రుల కష్టం తెలియాలని ..
శిశువులను సరిగ్గా ఎత్తుకోవడం నుంచి వారి ఆలనాపాలన వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ‘అది చెబితే అర్థమయ్యే కష్టం కాదు. స్వయంగా తెలుసుకోవాలి’ అంటూ తూర్పు చైనాలోని యువాన్జోంగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ వినూత్నమైన ప్రయోగం చేసింది. శిశువులను చూసుకోవడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించే ప్రయత్నంలో భాగంగా రోజంతా బొమ్మ శిశువును చూసుకోవాలని అసైన్మెంట్ ఇచ్చింది. అల్లరి పనులు చేసే, గేమింగ్ వ్యసనానికి బానిసైన, చదువుపై ఆసక్తి లేని విద్యార్థులను సరిౖయెన దారిలోకి తీసుకురావడం ఈ పాఠశాల ప్రత్యేకత.స్కూల్లో విద్యార్థులు బొమ్మ శిశువులను తమ వీపుపై మోస్తారు. మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పట్టుకొని ఉంటారు. నిజమైన శిశువులలాగే వాటిని చూసుకోవాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. శిశువులకు సంబంధించి తల్లిదండ్రులు ఎదుర్కొనే శారీరక శ్రమను విద్యార్థులకు అర్థం చేయించడానికి ఒక్కొక్కరికి 2.5 కిలోల బరువు ఉన్న బొమ్మ ఇచ్చారు. ‘ప్రత్యక్ష అనుభవం ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు యువాన్ జోంగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ ప్రిన్సిపల్.(చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్గా విదేశీ మహిళ పోస్ట్) -
ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..!:
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ చేరిపోయారు. ఏకంగా తమ దేశీయలు భారత్నుంచి ఈ విలవలు నేర్చుకోవాలంటూ ఓ లిస్ట్ చెప్పారామె. ఏంటా విలువలంటే..ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న లిథువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అందులో మోనికా కుంజేశ్వరి దాసి భారత్లో నివశించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాలు గురించి మాట్లాడారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టిపారేస్తారు. కానీ భారత్లోని చిన్న చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల్లో ఉన్న విలువలు యూరప్ చాలా వేగంగా కోల్పోతోందని అన్నారామె. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ ఇదే ముమ్మాటికీ నిజం అని అంటున్నారామె. "ఏళ్ల తరబడి భారత్లో నివసించాక తెలుసొచ్చిందేంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి నుంచి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి" అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్లో ఆ విలువల జాబితాను పంచుకున్నారామెయూరోపియన్లు తప్పక నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు..ఆతిథ్యం: 'అతిథి దేవో భవ' అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు దాసి. దీని అర్థం 'అతిథి దేవుడితో సమానం'. భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారామె.కమ్యూనిటీ: యూరప్లో కమ్యూనిటీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువ ఇస్తారని దాసి అన్నారు. "ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగుపొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే, సహాయం చేయడానికి సాధారణంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారామె.ఆహారం, వంట: ఆహారం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడమే సర్వసాధారణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఇష్టపడతారు.పరిశుభ్రత: భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారని ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, పైగా చుట్టపక్కల వారిపట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామె.ఆనందం: భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక కారణం ఏదీ అవసరం లేదని ఆ లిథువేనియన్ మహిళ నొక్కి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్ వేని, యూరప్ అది పూర్తిగా మర్చిపోయి.. గంభీరంగా అయిపోయిందని అన్నారు. కాగా, నెటిజన్లు ఆమె పోస్టుని చూసి భారతదేశంలోని సానుకూల అంశాలను అందంగా చెప్పినందుకు ధన్యవాదాలు. మా విలువల పట్ల మీ సూక్ష్మమైన పరీశీలనకు గౌరవాభినందనలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Monika Kunjeswari Dasi (@monika_kunjeswari)(చదవండి: -
ఉద్యోగం పోయినా సంబరమే..!
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్ అనే యువతి ఇటీవల లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్ వర్క్తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే.. View this post on Instagram A post shared by Asha | Maximalist Fashion (@ashamode_)ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది. -
9 మంది అతిథులతో ఇటలీలో గ్రాండ్ వెడ్డింగ్, ఫోటోలు వైరల్
ప్రస్తుతం కాలంలో పెళ్లి అంటే పెద్ద హంగూ ఆర్బాటం. ప్రీవెడ్డింగ్ షూట్, మెహిందీ, సంగీత్, బారాత్, వందలకొద్దీ అతిథులు, విందు భోజనాలు అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దదే. కానీ అలాంటివేమీ లేకుండానే కేవలం 9 మంది అతిథుల సమక్షంలో, ఎలాంటి వెడ్డింగ్ ప్లానర్ సహాయం లేకుండా ఒక భారతీయ వధువు తన డ్రీమ్ వెడ్డింగ్ను ఇటలీలోని ప్రసిద్ధ 'లేక్ కోమో' (Lake Como) తీరాన అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. గత ఏడాది జరిగిన ఈ వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్గా మారాయి.కింజల్ పటేల్, హెరిత్ వచ్హానీ జంట చేసుకున్న ఈ వివాహం... 'బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్'కి భిన్నంగా, . విలాసవంతమైన పెళ్లి అంటే ఖర్చు, హడావుడి మాత్రమే కాదు, అది మనసుకు నచ్చిన వారితో గడిపే ఒక ప్రశాంతమైన అనుభూతి అని నిరూపించింది.అంతేకాదు ఈ పెళ్లిలోని అసలైన విశేషం ఏంటంటే.. ఇంతటి లగ్జరీ వెడ్డింగ్ను వధువు కింజల్ సొంతంగా డిజైన్ చేసింది. ఏ వెడ్డింగ్ ప్లానర్ను పెట్టుకోకుండా, ప్రదీ వెండర్తో ఆమె స్వయంగా మాట్లాడి ప్లాన్ చేసుకుంది. View this post on Instagram A post shared by House On The Clouds (@thehouseontheclouds)ఇటాలియన్ వైభవం.. పూల పరిమళాలుప్రముఖ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ 'హౌస్ ఆన్ ది క్లౌడ్స్' తీసిన పెళ్లి ఫోటోలు ఒక అందమైన పెయింటింగ్లా ఉన్నాయి. ఇటలీలోని చారిత్రాత్మక 'విల్లా బాల్బియానో' (Villa Balbiano) లాన్పై, ఆల్ప్స్ పర్వతాల నీడలో, లేక్ కోమో సరస్సు పక్కన వీరి పెళ్లి వేడుక జరిగింది.ప్రశాంతత, ఆత్మీయత, ఒక పెద్ద SUV కార్లో సరిపోయేంత మంది అతిథులతో వారు తమ పెళ్లిని జరుపుకున్నారు.సాంప్రదాయక భారీ వూడెన్ మండపానికి బదులుగా.. లావెండర్, పెరివింకిల్ రంగుల హైడ్రాంజియా పూలు, ఆరెంజ్ జెర్బెరాస్, బర్డ్ ఆఫ్ పారడైజ్ వంటి విదేశీ పూలతో కిందనే అద్భుతమైన పూల బాటను డిజైన్ చేశారు. ఆకాశం నుండి చూస్తే, ఈ జంట కోసం ఆ తోటలోనే పూలు పూశాయా అన్నట్లుగా ఆ డెకరేషన్ మెరిసిపోయింది.పింక్ శారీలో మెరిసిన వధువువధువు కింజల్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన సెలెరియల్ పింక్ కలర్ లెహంగా స్టైల్ శారీని ఎంచుకుంది. ఇటలీ ఆకాశం కింద ఆమె దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్, వెనుకకు సాగిపోతున్న నెట్ వేల్ (veil) ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి. వరుడు హెరిత్ క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా కనిపించాడు. వారు పరస్పరం పూలమాలలు మార్చుకునే (వర్మాల) క్షణాలు ఎంతో ప్రశాంతంగా, మనోహరంగా సాగాయి.లేక్ కోమో నేపథ్యంలో క్రీమ్ కలర్ షేర్వాణీలో హుందాగా వరుడు హెరిత్ చిరునవ్వుతో వెనక్కి వంగడం, కింజల్ అతనికి దండ వేయడం...ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా ప్రశాంతమైన, ఆనంద క్షణాలను ఆస్వాదించారు. ఇదీ చదవండి : ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?9 మంది అతిథులు మాత్రమే!గత ఏడాది అక్టోబర్లో 'వోగ్ ఇండియా' (Vogue India) మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట తమ నిర్ణయాన్ని పంచుకున్నారు. "పెళ్లి హడావుడిలో మాకు మే ఎక్కడో తప్పిపోవాలని అనుకోలేదు. మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే అత్యంత ఆత్మీయుల మధ్య, మేం ఎలా ఉంటామో అలాగే ప్రశాంతంగా ఈ క్షణాలను ఆస్వాదించాలనుకున్నాం" అని వారు చెప్పారు.కేవలం 9 మంది కుటుంబ సభ్యులతో ఈ పెళ్లి జరగడం వల్ల వందల మంది అతిథుల మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, మూడు రోజుల అలసట వంటి ఒత్తిళ్లేవీ వారికి లేకుండా పోయాయి. పెళ్లి తర్వాత వారంతా 'పాసాలాక్వా' (Passalacqua) అనే చారిత్రాత్మక హోటల్లో ఒకరినొకరు చూసుకుంటూ, హాయిగా మాట్లాడుకుంటూ ప్రైవేట్ డిన్నర్ను ఆస్వాదించారు. కృత్రిమమైన భారీ బ్యాక్డ్రాప్ల కంటే కోట్లాది సంవత్సరాల నాటి ఆల్ప్స్ పర్వతాలు, లేక్ కోమో సరస్సే తమ పెళ్లికి గొప్ప వేదిక అని ఈ జంట నిరూపించింది.అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రశాంతంగా భోజనం చేస్తూ పెళ్లిని ఆస్వాదించడం అంటే ఇవాల్టి రోజుల్లో అరుదైన విలాసమని చెప్పవచ్చు. ఒక వెడ్డింగ్ ప్లానర్ ఇవ్వలేని గొప్ప తృప్తిని, విజయాన్ని తన కలల పెళ్లిని తానే స్వయంగా ప్లాన్ చేసుకోవడం ద్వారా సాధించానని కింజల్ గర్వంగా చెప్పింది.ఇదీ చదవండి: బిడ్డల్ని వదిలేసి, డబ్బు, స్కూటర్ తీసుకొని ప్రియుడితో పరార్ -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్లైన్తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్గా, లాజికల్గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఆమ్ ఆద్మీ నేపథ్యం సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మేనిఫెస్టోకేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇంతలోనే భారీ షాక్మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు. -
రోమ్లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్ల సునామీ
ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరి దశగా ఇటలీలోని రోమ్లో అడుగుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను మోదీ ఇన్స్టాగ్రామ్లో బుధవారం షేర్ చేయగా లైక్ల సునామీ ఏర్పడింది. కేవలం రెండు,మూడు గంటల వ్యవధిలోనే 60 లక్షల పైచిలుకు లైక్లు వచ్చాయి.ఈ 'మెలోడీ' ముచ్చట్లు మొదట ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటోలతో ప్రారంభమయ్యాయి. అంతేకాదు ప్రధాని మోదీ తనకు 'మెలోడీ' టాఫీల (చాక్లెట్ల) ప్యాకెట్ను బహుమతిగా ఇస్తున్న వీడియోను మెలోని స్వయంగా షేర్ చేశారు. ఆ వీడియోకు "బహుమతికి ధన్యవాదాలు" అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఆసక్తికరమైన వీడియోతో ఈ #Melodi మూమెంట్ మరోసారి పీక్స్కు చేరింది. Upon landing in Rome, had the opportunity to meet Prime Minister Meloni over dinner followed by a visit to the iconic Colosseum. We exchanged perspectives on a wide range of subjects. Looking forward to our talks today, where we will continue the conversation on how to boost the… pic.twitter.com/df0bDYKCdU— Narendra Modi (@narendramodi) May 20, 2026 ; जब मोदी... मिले... मेलोनी से 🔥एक तो महिला ऊपर से इटालियन उससे भी आगे इटली की PM और ये पलकें बिछाकार मेरे PM का इंतज़ार सारी दुनिया की गांव में मिर्च बोने को ये एक मिनट का वीडियो ही काफी हैँ रे बाबा ✍️ pic.twitter.com/vO8KFRmo6m— Deepak Sharma (@SonOfBharat7) May 20, 2026 "రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత, డిన్నర్ సమయంలో ప్రధాని మెలోనిని కలిసే అవకాశం వచ్చింది. అనంతరం ప్రసిద్ధ కొలోసియం (Colosseum) ను సందర్శించాము. వైవిధ్యమైన అంశాలపై మా ఆలోచనలను పంచుకున్నాము" అని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. రోమ్ నడిబొడ్డున ఉన్న 'కొలోస్సియం' ఒక ప్రసిద్ధ దీర్ఘవృత్తాకార యాంఫిథియేటర్ (పురాతన బహిరంగ ప్రదర్శనశాల). ప్రపంచంలోనే నిర్మించబడిన అతిపెద్ద పురాతన యాంఫిథియేటర్ ఇదే కావడం విశేషం.Five Italians passionate about Indian dance, Svamini Atmananda Giri, Ms. Martina Meenakshi Argada, Ms. Lucrezia Maniscotti, Ms. Valeria Vespaziani, Ms. Rosella Fanelli performed ‘Trigalbandi’, which included Kuchipudi, Bharatanatyam and Kathak. It is wonderful to see Indian dance… pic.twitter.com/gWYKgNejBe— Narendra Modi (@narendramodi) May 20, 2026 కాగా మంగళవారం ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీకి మెలోని నుండి ఘనస్వాగతం లభించింది. "నా స్నేహితుడికి రోమ్లోకి స్వాగతం!" అని మెలోని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. వీరిద్దరూ బుధవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీనికి ముందు, నవంబర్ 2025లో జరిగిన జి20 (G20) సదస్సు సందర్భంగా వీరిద్దరూ చివరిసారిగా సమావేశమయ్యారు. ఇటలీ వీధుల రమణీయమైన దృశ్యాలతో "మెలోడీ" (Melodi) మీమ్స్కు తెరలేపిన మోదీ, మెలోనిల సాన్నిహిత్యం మరోసారి సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. గతంలో కూడా వీరిద్దరూ ఈ 'మెలోడీ' మీమ్స్ను గుర్తించి, వాటిపై మోదీగా సరదాగా స్పందించారు.ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన విశేషాలుభారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో పంచుకున్న వివరాల ప్రకారం, రోమ్ చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి భారతీయులు ఉత్సాహంగా, ఘనంగా స్వాగతం పలికారు. ఇటాలియన్ కళాకారులు ప్రదర్శించిన కథక్, కూచిపూడి, భరతనాట్యం వంటి రంగుల ప్రదర్శనలను ప్రధానమంత్రి వీక్షించారు.ఇటాలియన్ సంగీతకారులు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా ఆలపించారు. సంతూర్, తబలా, బన్సూరి (ఫ్లూట్), సితార్ వాయిద్యాల కలయికతో భారతదేశ సంగీత వారసత్వాన్ని వారు ప్రతిబింబించారు. అలాగే ఇటలీలో భారతీయ సంగీతానికి ఆదరణ పెరుగుతోందని మోదీ పేర్కొంటూ... స్వాగత వేడుకల్లో 'హంసధ్వని' రాగాన్ని అద్భుతంగా పలికించిన ఇటాలియన్ కళాకారులు వాలెరియో బ్రూని (సంతూర్), లియో వెర్టున్ని (సితార్), సిమోన్ మట్టియెల్లో (బన్సూరి), ఫ్రాన్సెస్కో గెరార్డి (తబలా), నికోలో మెల్లోచి (బన్సూరి)లను అభినందించారు.వారణాసి పెయింటింగ్ బహుమతిఈ పర్యటనలో ఇటాలియన్ చిత్రకారుడు జియాంపాలో తోమస్సెట్టిని మోదీ కలిశారు. తోమస్సెట్టి తాను గీసిన వారణాసి పెయింటింగ్ను మోదీకి బహుమతిగా ఇచ్చారు. తోమస్సెట్టికి భారతీయ సంస్కృతిపై నాలుగు దశాబ్దాలుగా ఉన్న మక్కువను మోదీ కొనియాడారు. 1980లలో వేద సంస్కృతికి సంబంధించిన పుస్తకాలకు ఇలస్ట్రేటర్గా కెరీర్ ప్రారంభించిన తోమస్సెట్టి, 2008 నుండి 2013 మధ్య కాలంలో మహాభారతానికి సంబంధించి 23 పెద్ద పెయింటింగులను రూపొందించారని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. -
ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్
మనకు రాసిపెట్టి ఉండాలే గానీ అదృష్టం ఎలాగైనా మన తలుపు తడుతుంది. ఒక అమెరికన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒక అమెరికా వ్యక్తి తన పాత ప్యాంట్ జేబులో మర్చిపోయిన లాటరీ టికెట్ను జస్ట్ దాని గడువు తీరడానికి కొన్నిరోజుల ముందు గుర్తించాడు కట్ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా? పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారం, న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గత ఏడాది మే నెలలో, తాను తరచుగా వెళ్లే ఒక గ్యాస్ స్టేషన్ (పెట్రోల్ బంక్)లో పిక్-6 లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అయితే, టిక్కెట్ కొన్న తర్వాత, దానిని ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. దాదాపు ఒక ఏడాది పాటు దాని సంగతే పూర్తిగా మర్చిపోయాడు. గడువు ముగియ డానికి కొన్ని రోజుల ముందు, 5.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57.11 కోట్లు) విలువైన లాటరీ టిక్కెట్ను కనుగొన్నాడు. అంతే జాక్పాట్ కొట్టాడు.కథ ఎలా మలుపు తిరిగిందంటే?గత నెలలో లాటరీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జాక్పాట్ గెలుచుకున్న టికెట్ ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుంతని వెల్లడించారు. అలాగే ఆ టికెట్ అమ్మిన పెట్రోల్ బంక్ పేరును కూడా పేర్కొన్నారు. దీంతో తాను రెగ్యులర్గా వెళ్లే బంక్ పేరు వినడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించాడు. ఆ బంక్లో 'పిక్-6' గేమ్ ఆడేది కేవలం కొద్దిమంది రెగ్యులర్ కస్టమర్లు మాత్రమేనని సిబ్బంది చెప్పారు. ఒకసారి బాగా వెతకండి సామీ కోట్ల రూపాయల లాటరీ అంటే మాటలా? అని సలహా ఇచ్చారు.పాత ప్యాంటులో దొరికిన అదృష్టంఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తన ఇల్లంతా జల్లెడ పట్టేశాడు. డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ రూమ్లు అన్నీ వెతికేశాడు. ఇక చివరగా తన క్లోసెట్ (కబోర్డ్)లో ఉన్న పాత బట్టల్లో వెతకడం మొదలు పెట్టాడు. సరిగ్గా అపుడే అదృష్ట దేవత పలకరించింది. ఒక పాత ప్యాంట్ జేబులో నలిగిపోయి ఉన్న లాటరీ టికెట్ అతనికి దొరికింది.రూ. 57 కోట్లు సొంతంఆ టికెట్ నంబర్లను చెక్ చేయగానే రూ. 57 కోట్ల భారీ జాక్పాట్ తనదేనని ఎగిరి గంతేశాడు. టికెట్ గడువు ముగియడానికి కేవలం 8 రోజులు మాత్రమే సమయం. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే లాటరీ హెడ్క్వార్టర్స్కు పరుగులు తీసి తన బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత లాటరీ అధికారులు ప్రజలకు ఒక ముఖ్య సూచన చేశారు. చాలామంది టికెట్లు కొని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారని, దీంతో ఒక్కోసారి లాటరీ సొమ్మును ఎవరూ తీసుకోకుండానే ఉండిపోతాయని అందువల్ల పాత టికెట్లను జాగ్రత్తగా దాచుకుంటూ, అప్పుడప్పుడు సరిచూసుకుంటూ ఉండాలని కోరడం విశేషం. -
ఏం అదృష్టం ఇది..! త్రుటిలో దక్కింది లేదంటే..
ఒక్కోసారి లక్కు ఎలా ఉంటుందో చెప్పలేం. మనం అంతగా పట్టించుకోకపోయినా..ఎవరో అపరిచిత వ్యక్తలు ద్వారా అయినా అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. మనం మర్చిపోయినా..రేయి ఈ సొమ్ము నీదే రా అంటూ వెతుక్కుంటూ వచ్చేస్తుంది. అలాంటి సంఘటనే యూఎస్లో చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన వ్యక్తి గతేడాది మే నెలలో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ విషయాన్ని ఒక ఏడాది పాటు పూర్తిగా మర్చిపోయాడు. అయితే ఒక రోజు తరుచుగా వెళ్లే గ్యాస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడ ఒక లాటరీ టికెట్ జాక్పాట్ గెలుచుకున్నా..ఎవరు క్లైయిమ్ చేసుకోలేదని, గడవు ముగియనుందంటూ ఓ ప్రకటన కనిపించింది అది ఈ వ్యక్తి కంట పడింది. దాని గురించి అక్కడి లాటరీ అధికారులను ఆరా తీయగా. అది పిక్ -6 లాటరీ టికెట్ అని రెగ్యులర్ కస్టమర్లు మాత్రమే దీన్ని ఎంచుకుంటారని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఆ విషయం ఈ వ్యక్తికి గుర్తొచ్చి వెంటనే ఇంట్లోని ప్రతి అణువు గాలించాడు. అప్పుడే పాత ఫ్యాంటు జేబులో నలిగిపోయిన లాటరీ టికెట్ అతడి కంటపడింది. జాక్పాట్ గెలుచుకున్న లాటరీ టికెట్ నెంబర్తో సరిపోల్చుకుంటే ఆ టికెట్ అదే అని తేలడంతో ఏకంగా రూ. 57 కోట్లు డబ్బు దక్కించుకున్నాడు. ఒక వేళ్ల తేలిగ్గా తీసుకుంటే అంత భారీ సోమ్ము త్రటిలో చేజారిపోయేది. ఇది మాములు లక్కు కాదు కదా..!. అదృష్టం ఉంటే అది ఎలాగైన మన తలుపు తడుతుందంటే ఇదే కదూ.!. చాలామంది విజేతలు ఇలానే తమ లాటరీ టికెట్ల గురించి మర్చిపోవడం వల్ల చాలామటుకు అలానే క్లైయిమ్ చేసుకోకుండా ఉండిపోతాయని చెబుతున్నారు అధికారులు.(చదవండి: బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!) -
#Melodi: రోమ్లో మెలోడీ మూమెంట్
విదేశీ పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. రోమ్లో మోదీకి ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ ఘన స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని చివరగా ఇక్కడ పర్యటించబోతున్నారు. నా స్నేహితుడికి రోమ్ నగరం స్వాగతం పలుకుతోంది అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. అంతకు ముందు.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇటలీ చారిత్రక కోలోసియం సందర్శించారు. అక్కడ సెల్ఫీ కూడా దిగారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రోమ్లో మెలోడీ#Melodi మూమెంట్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మోదీ, మెలనీ పేర్లను కలిపి అలా సరదాగా పిలుస్తారన్నది చాలామందికే తెలిసే ఉంటుంది. వీళ్ల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ నడుస్తుంటుంది కూడా. Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026మోదీ 2024లో జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే అధికారిక ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మిత్రబంధాన్ని కాస్త వ్యూహాత్మక సంబంధంగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. తొలుత ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో మోదీ భేటీ అవుతారు. అటుపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎఫ్ఏవో (Food and Agriculture Organisation) ప్రధాన కార్యాలయం సందర్శించి అక్కడ ఆహార భద్రత అంశంలో భారత్ వైఖరిని మోదీ చాటిచెప్పే అవకాశం ఉంది. అలాగే.. ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా వాణిజ్య, రవాణా, కనెక్టివిటీ విస్తరణ అంశాలను చర్చించనున్నారు. రక్షణ, సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, టెక్నాలజీ, వాణిజ్యం రంగాల్లో సహకారం కోసం రూపొందించిన Joint Strategic Action Plan 2025–2029 పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, డిఫెన్స్ తయారీలో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రవాస భారతీయులతో.. రోమ్లోని హోటల్ వద్ద భారతీయ ప్రవాసులు మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే చిత్రకళా బహుమతి అందించారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ పర్యటన భారత్–ఇటలీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఆహార భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా యూరప్లో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. -
నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ భారతీయ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగమో అయితే జీవితం సెట్ అన్నంత సంబరం. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవం వల్ల ఈ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో యువ ఉద్యోగుల్లో ట్రెండ్ మారింది. జాబ్లో పని ఒత్తిడి (Workplace Stress) కంటే, జీవితంలో మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో సంతృప్తి అనేది ప్రధానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) పూర్వ విద్యార్థి, 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో ఏడాదికి రూ. 19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని, ఆయన వదులుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.కలల ఉద్యోగం... కానీ ఏం లాభంసౌరభ్ మిట్టల్ తన 22వ ఏటనే BPCLలో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేని జీవితం. తనకు పని చేయడానికి కేటాయించిన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని సౌరభ్ వివరించారు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, టాయిలెట్ గానీ లేవు. ఏసీ కూడా పాడైందని, దాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్ఆర్, ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువచ్చినా, ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అక్కడి పని చాలా ఒత్తిడితో కూడుకున్నదని, పాతకాలపు పద్ధతుల్లో సాగేదని విమర్శించారు.అంతేకాకుండా సీనియర్ అధికారుల కోసం ఎయిర్పోర్ట్ పికప్లు, హోటల్ బుకింగ్లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారు. వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమైపోయింది.ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ (శని, ఆదివారాలు) లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు. దీంతో లీవ్లు దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచారు.. వీటన్నింటికీ మించి, తన చుట్టూ ఉన్న ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి గానీ, కెరీర్ ఎదుగుదలకు గానీ పెద్దగా అవకాశం లేదనిపించిందని, "నా జీవితాంతం ఇలాగే గడపడాన్ని నేను ఊహించుకోలేక పోయాను" అని సౌరభ్ తన నిర్ణయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశసౌరభ్ నిర్ణయంపై కుటుంబంలో వ్యతిరేకత అయితే ఈ ఉద్యోగాన్ని వదలేయాన్ని సౌరభ్ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా ఆయన తండ్రి ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?నెటిజన్ల స్పందన సౌరభ్ మిట్టల్ కథనం ఆన్లైన్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చాలా మంచి, ఆలోచనాత్మకమైన నిర్ణయం. ఆల్ ది బెస్ట్ చాలామంది సౌరభ్ నిర్ణయాన్ని సమర్ధించారు. "నేను కూడా 16 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, మీ నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని మరొకరు, మంచి పని చేశావు, సోదరా”, “మీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్కు మద్దతుగా నిలిచారు. -
ఆ మూవీ ప్రభావంతో ఉద్యోగానికి రిజైన్ చేసింది..! కట్చేస్తే..
సినిమాలోలా రియల్ లైఫ్ ఎప్పటికీ ఉండదు. మూడు గంటల సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కానీ వాస్తవిక ప్రపంచంలో అందులోలా వర్కౌట్ అవడం అంత సులభం కాదు. అదే చాలామంది తెలుసుకోలేక..ఆ సినీ మాయలో పడి ఊహాలోకంలో తేలుతుంటారు. చివరికి హాయిగా ఉన్న లైఫ్ని రిస్క్లో పడేసుకుంటుంటారు. అలాంటి సంఘటనే ఈ మహిళ లైఫ్లో చోటుచేసుకుంది. హర్ష్ అనే యూజర్ సోష్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. తాను ఉద్యోగ ఇంటర్వ్యూలో ఓ మహిళను కలిసినట్లు చెబుతూ..ఆమె చేసిన పని గురించి వివరిస్తూ పోస్టు పెట్టడంతో ఒక్కసారిగా సినిమా ఎంత పనిచేసింది అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ మహిళ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదించి స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగంతో బిందాస్గా లైఫ్ సాగిపోయిందామెకు. సుమారు ఆరేళ్లు ఆ లైఫ్ని ఎంజాయ్ చేసింది. సరిగ్గా 2015లో తమాషా మూవీ చూడటంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ అనూహ్యమైన మలుపు తీసుకుంది. ఆ తమాషా మూవీని..ఆర్ట్కి ఉన్న పవర్, చిన్ననాటి అభిరుచులను ఎలా వదులుకుని కెరీర్పై ఫోకస్ పెడతాం వంటివి ఇతి వృత్తంగా తీసుకుని తీశారు. ఈ మహిళ ఆ మూవీని చూసి స్ఫూర్తి పొంది.. కార్పొరేట్ లైఫ్ అంటే టార్గెట్లు, పనిఒత్తిడి ఇదేనా జీవితం? అదే నచ్చిన అభిరుచిలో కొనసాగడంలో ఉన్న ఆనందమే వేరు అంటూ చేస్తున ఉద్యోగానికి రిజైన్ చేసింది. చక్కగా ఆర్ట్స్ డిప్లొమా కోర్సులో చేరి, ప్రదర్శనలు నిర్వహించడం, తన పేయింటింగ్స్ని అమ్మడం వంటి కెరీర్ని నిర్మించుకోవాలని కలలు కనింది. ఆ మహిళ తాను అనుకున్నట్లుగానే క్రియేటివిటీ రంగంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించినప్పటికీ.. ఆ క్రమంలో చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు సవాలుగా మారాయి. అప్పటిదాక పొదుపు చేసిన డబ్బు అయిపోవడంతో ఆ అభిరుచి నుంచి తప్పుకోక తప్పలేదు. చివరికి రెండేళ్ల కెరీర్ విరామం తర్వాత మళ్లీ అనూహ్యంగా కార్పొరేట్ స్థిరత్వమే బెటర్ అంటూ జాబ్ సర్చింగ్ మొదలు పెట్టారామె. అలా ఓ జాబ్ ఇంటర్వ్యూకి వచ్చి.. తనతో ఆ మహిళ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లు రాసుకొచ్చారు హర్ష్. అంతేగాదు హర్ష్ ఆమె నిర్ణయం వెనుకున్న భావోద్వేగ పరిస్థితిని ప్రస్తావిస్తూ అభిరుచి వెంట పరుగులు తీసి..కెరీర్ని రిస్క్లో పెట్టుకోకూడదని అన్నారు. మంచి విషయం ఏంటంటే తన కళా అభిరుచిని వదులుకున్నా అనే పశ్చాత్తాపం ఎప్పటికీ ఎదురవ్వద్దు కానీ ఇంకోరకంగా అది కాస్త చెడ్డ నిర్ణయం ఎలా అంటే..మళ్లీ 30 ఏళ్ల అనంతరం కార్పొరేట్ ఉద్యోగం సంపాదించటం ఈ రోజుల్లో అదెంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ పోస్ట్ని ముగించారు. నిజానికి ఈ కథలో నీతి అభిరుచి కోసం ఉద్యోగ జీవితాన్నే రిస్క్లో పెట్టడం కంటే..అందులో సాధకబాధలు బేరీజు వేసుకుంటూ..చేస్తున్న ఉద్యోగాన్ని సాగిస్తూనే ఆ కళాత్మక రంగంలో సాగాలి. మొదట పార్ట్టైంగా సాగించి..బాగుంది ధైర్యంగా పూర్తి స్థాయిలో దీనిలో దిగొచ్చు అన్న నమ్మకం వచ్చాక..దిగితే ఎలాంటి ఆర్థిక సమస్య ఉండదు. అన్నింట్లకంటే ఆర్థిక భద్రత ముఖ్యం అనేది గ్రహించాలి.(చదవండి: కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..) -
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్లోని పంజాబ్లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్షీట్లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..
అందరు చేసే వంటకమే కానీ దాన్ని సర్వ్ చేసే విధానం లేదా వండే విధానంలో ప్రత్యేకత ఉంటేనే కథ ఏ ఫుడ్ స్టాల్ అయినా క్లిక్ అయ్యేది. ప్రజాదరణ పెరిగేది. బహుశా దాన్నే క్యాచ్ చేశాడు ఈ టీనేజ్ యువకుడు. అలా ఇలా ఆలోచించలేదు ఈ యువకుడు. వంట చేసే విధానంలో సరికొత్తగా ఫ్యాషన్ జోడించడంతో అతడ ఫుడ్ స్టాల్ మూడు పువ్వులు ఆరు కాయల్లా దినదినాభివృద్ధితో దూసుకుపోతోంది. ఇంతకీ స్టైలిష్గా వంట చేయడం ఎలాగంటే..చైనాకు చెందిన ఒక యువకుడు ఒక సాధారణ ఫ్రైడ్ రైస్ దుకాణాన్ని తన క్రియేటివిటీతో కొత్త లుక్ని అందించడమే కాదు లాభాల బాట పట్టేలా చేశాడు. అందరిలా వండటం కంటే.. ప్రత్యేకంగా విభిన్నంగా వంట చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా అతడి వద్దకు వచ్చేవాళ్లు తినడాని కంటే..అతడు చేసే విధానం అతడి ఆహార్యం చూసి నివ్వెరపోతూ ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిగా వస్తూ..ఇక అక్కడే తింటుండటం విశేషం. 19 ఏళ్ల లూ షాన్డాంగ్ ఈనే యువకుడు కుటుంబ దుకాణాన్ని చాలా విభన్నంగా నడిపిస్తున్నాడు. ఎవరైన వంట చేయాడానికి వచ్చే వాళ్లు కుక్ డ్రెస్ లాంటది వేసుకుంటారు. కానీ ఇక్కడ లూ ఫ్యాషన్గా ఉంటాడు. ఆయన ఆఫీస్కి వెళ్లే వ్యక్తిలా సూటు బూటు వేసుకుని కనిపించడం విశేషం. చైనాలోని ఓ సాదారణ ఫ్రైడ్ రైస్ స్టాల్ రెస్టారెంట్కు మించి క్రేజ్ సంపాదించుకుంది. అందుకు ప్రధాన కారణం అతడు వండే విధానమే. లీ చాలా స్టైలిష్గా వండుతున్న విధానం అందర్నీ ఆకర్షించి ఆ స్టాల్కి జనాలు క్యూకట్టేలా ప్రజాదరణ పొందింది. అంతేకాదండోయ్ ఎంతో రుచిగా క్షణాల్లో వేడివేడిగా వడ్డిస్తాడు. అతడు ఎంత బిజీలో అయినా ఫ్రైడ్ రైస్ని జస్ట్ మూడు నిమిషాల్లో తయారు చేస్తాడు. ఇక ఫైడ్రైస్ ఒక ప్లేటు రూ. 1401లు అట. అతడి ఖర్చులు పోగా నెలకు సుమారుగా రూ. 7లక్షలుపైనే ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. క్రియేటివిటీకి నైపుణ్యం తోడైతే అద్భుతాలు జరగుతాయి అంటే ఇదేగదా..!. లూ నవ్వు మామలు గ్రేట్ కాదు..సూపరో సూపర్..!. కాగా, ఈ స్టాల్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈమేరకు లూ మాట్లాడుతూ..ఏదో సరదాగా కస్టమర్ల ముఖంలో నువ్వులు విరబూయించేందుకు ఇలా సూటు వేసుకుని వంట చేశాను. కానీ వాళ్ల నుంచి ఈ స్ధాయిలో స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదని సంతోషంగా చెబుతున్నాడు లూ. View this post on Instagram A post shared by Mothership (@mothershipsg) (చదవండి: కోడిగుడ్డంత పుచ్చకాయలు) -
ఆ ఒక్క మాటతో.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు
జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు.. 2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్ఆర్ నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ.. అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్చుప్గా వెళ్లిపోయారట. ఈ సంఘటన రెడ్డిట్లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్బ్యాక్లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!. -
బ్రిటీష్కాలం నాటి సంప్రదాయానికి వీడ్కోలు!
ఎటు చూసినా అల్మారాలు.. గుట్టలుగా ఫైళ్లు.. టేబుళ్లు వాటి మధ్యలో ఇరుక్కు గ్యాప్లో కుర్చీలు.. కాస్త దూరంలో ప్రత్యేకంగా వేసిన ఓ కుర్చీ.. దాని మీద తెల్లటి తువాలు.. గవర్నర్మెంట్ ఆఫీసుల్లో షరామాములుగా కనిపించే దృశ్యం ఇది. ఇందులో ఆ స్పెషల్ టవల్ చెయిర్ అనేది హోదాకు, అధికారానికి, వీఐపీ గుర్తుగా ముద్రపడిపోయింది. అయితే ఓ చిన్నారి రిక్వెస్ట్తో బ్రిటీష్ కాలంనాటి ఆ సంప్రదాయానికి తమిళనాడు నూతన సీఎం విజయ్ స్వస్తి పలికారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేసే సంప్రదాయానికి చరమగీతం పాడారు. ఆయన ఈ పని చేయడానికి కారణం.. లిసిప్రియ కాంగుజమ్ అనే 14 ఏళ్ల బాలిక. చిన్నవయసులోనే పర్యావరణ ఉద్యమకారిణిగా మారిన ఆమె.. వీఐపీ టవల్ కల్చర్ను ముగించాలంటూ విజయ్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయన పాల్గొన్న సమావేశంలో కుర్చీలో తువాలు లేకుండా కనిపించింది. ఆ ఫొటోలను సీఎంవో రిలీజ్ చేయగా.. లిసిప్రియ ధన్యవాదాలు తెలిపింది. Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026అలా మొదలైంది.. ఎయిర్కండిషనింగ్ లేని కాలంలో.. చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీని రక్షించుకోవడానికి బ్రిటీష్ అధికారులు తువాలు వాడేవారు. తెల్లదైతే సులభంగా ఉతికేయవచ్చు.. మార్చేయవచ్చని ఆలోచన చేశారు. కాలక్రమంలో అది అధికార సింబల్గా మారింది. పెద్ద అధికారుల కుర్చీపై తువాలు ఉంటే.. జూనియర్ సిబ్బంది సాధారణ కుర్చీల్లో కూర్చోబెట్టబడేవారు. ఎవరైనా ముఖ్య అతిథి వస్తే, వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకువచ్చేవారు. ఇలా తెల్ల తువాలు అనే ఒక సాధారణ వస్తువు అధికార ప్రతీకగా మారింది. ఒకానొక టైంలో అదొక వృథా ఖర్చు అనే చర్చా నడిచింది కూడా. మార్పు మొదలైంది..అయితే.. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. వాళ్ల వెంట గుర్రాలు పోయాయి. కానీ తువాలు మాత్రం మిగిలిపోయింది’’. పవర్ సింబల్గా ఏళ్ల తరబడి కుర్చీలో టవల్ అనేదొ కొనసాగింది. ఇటు సోషల్ మీడియాలో ‘‘బ్రిటీష్ చట్టాలను మార్చేవాళ్లకు ఈ పాతకాలపు వీఐపీ సంస్కృతి కనిపించడం లేదా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ తరుణంలో ఓ చిన్నారి ఉద్యమకారిణి మెసేజ్కు తమిళనాడు సీఎం విజయ్ స్పందించడం ఇప్పుడు అందరి దృష్టికి ఆకర్షిస్తోంది. ఇలాంటి సలహాలు కదా పాటించాల్సింది అని కొందరు అంటుంటే.. ఇది చిన్నవిషయమే కదా అని మరికొందరు అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఇలాంటి చిన్న మార్పులు ప్రజాస్వామ్యానికి దగ్గరగా ఉండే పాలనకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் தலைமையில், குறுவை நெல் சாகுபடி மற்றும் முக்கிய அணைகளின் நீர் இருப்பு நிலைகள் குறித்து வேளாண்மை மற்றும் உழவர் நலத்துறை, நீர்வளத்துறை உயர் அலுவலர்களுடன் ஆய்வுக் கூட்டம் நடைபெற்றது.#CMJosephVijay pic.twitter.com/OFGyvMnWkL— CMOTamilNadu (@CMOTamilnadu) May 15, 2026 లిసిప్రియ ఎవరంటే.. లిసిప్రియా కాంగుజమ్.. భారత్కు చెందిన 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త. మణిపూర్లో 2011 అక్టోబర్ 2న జన్మించింది. తండ్రి ఇచ్చిన ప్రేరణతో.. చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై పోరాటం ప్రారంభించింది. 2019లో మాడ్రిడ్లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది, అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన తెలిపింది. క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలన్న ఆమె ప్రచారంతో గుజరాత్ ప్రభుత్వం దిగొచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి చైల్డ్ మూమెంట్ అనే ఎన్జీవోను నడిపిస్తోంది. అయితే.. 2023-25 మధ్యకాలంలో మణిపూర్ హింస సమయంలో ఆమె అరంబై తేంగోల్ అనే గ్రూప్నకు మద్దతు ప్రకటించింది. దీంతో ఆమెపై నెట్టింట భయంకరమైన నెగెటివిటి నడిచింది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్కు చేసిన రిక్వెస్ట్తో ఆమె వార్తల్లో నిలిచింది. -
ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి..
కొంచెంసేపు ఉంటే.. ఆ ఐదుగురి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయేవి. కానీ, సమయస్పూర్తితో ఆమె వ్యవహరించిన తీరు.. అదనంగా ఆ తల్లి చూపిన తెగువ.. వాళ్లను సురక్షితంగా బయటపడేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.శుక్రవారం ఉదయం బిహార్ షాహ్పూర్ పటోరీ రైల్వే స్టేషన్లో ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు. అయితే అందులో మమత అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు బంధువులనూ రక్షించుకోగలిగింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. వీళ్లంతా వైశాలి జిల్లా జందాహాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రోసరా వెళ్లేందుకు టికెట్ తీసుకుని ఫ్లాట్ఫారమ్కు వెళ్తున్నారు. అయితే ఫుట్ఓవర్ బ్రిడ్జి ద్వారా కాకుండా పట్టాల ద్వారా దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లాట్ఫారమ్ మీద ఓ గూడ్స్ రైలు ఉంది. దాని కింద నుంచి దాటుతున్న టైంలో.. రైలు హఠాత్తుగా కదిలింది. అంతే.. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు గుభేల్మన్నాయి. వాళ్లు రైలు కింద నలిగిపోవడం ఖాయమని అంతా భావించారు. హాహాకారాలతో ఆ ప్రాంతం మారోమోగిపోయింది. కానీ, మమత సమయస్ఫూర్తి ప్రదర్శించింది. తన ఇద్దరు పిల్లలను కౌగిలించుకుని.. మిగతా వాళ్లనూ రైలు-ప్లాట్ఫారమ్ మధ్యలో సన్నని ఖాళీలో పట్టుకుని ఉండిపోయింది. అది గమనించిన కొందరు ఆమెకు చెయ్యి అందించారు. ఈలోపు గూడ్స్ వేగం పుంజుకోవడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ క్రమంలో రైలు ఆమెను ఢీ కొట్టుకుంటూ పోవడంతో గాయాలు అయ్యాయి. ఆపై గూడ్స్ వెళ్లిపోవడంతో.. వాల్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న ప్రయాణికుల సాయంతో గాయపడిన మమతకు తక్షణ చికిత్స అందించగా.. ఆమె కోలుకుని వెళ్లిపోయింది. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ధైర్యాన్ని ప్రజలు ప్రశంసించారు. “రెప్పపాటులో తీసుకున్న నిర్ణయం ఐదు ప్రాణాలను కాపాడింది” అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో.. ఈ సంఘటన రైల్వే భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులు ఎప్పుడూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడాలని అధికారులు మళ్లీ హెచ్చరించారు. షార్ట్కట్ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఈ వీడియో చూశాక.. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’ అనకుండా ఉండగలరా?.. SHOCKING VISUALS 🚨A mother in Bihar risked her own life to save her two children after a train suddenly arrived while they were crossing the tracks near Shahpur Patori railway station.According to reports, the three women quickly sat down with the children pressed beneath… pic.twitter.com/JCEdu5R9Y3— Megh Updates 🚨™ (@MeghUpdates) May 15, 2026 A major accident was averted at Shahpur Patori railway station. The abductor was none other than a mother who risked her own life to save his children's #samastipur #Bihar https://t.co/vwgSvpyA1s pic.twitter.com/bQeGowUl2N— Siraj Noorani (@sirajnoorani) May 15, 2026 -
లక్షల కొద్దీ నోట్ల వర్షం కురిపిస్తున్నా.. అసలేం జరిగిందంటే?
గుజరాత్లో జానపద గాయకుడిపై నిర్వాహకులు నోట్ల వర్షం కురిపించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాంప్రదాయ గుజరాతీ హాస్య జానపద ప్రదర్శన జునాగఢ్లోని ఖంభాలియా గ్రామంలో జరిగింది. ఈ ప్రదర్శనలో నిర్వాహకులు గాయకుడు గోపాల్ సాధుపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించారు. ఆయన పాడుతుండగానే నోట్లతో ముంచెత్తారు.నోట్లు కుమ్మరిస్తున్నా..వైరలవుతున్న ఈ వీడియోలో భక్తులు తనపై నోట్ల సంచులను కుమ్మరిస్తున్నా.. గోపాల్ సాధు ఏమాత్రం చలించకుండా తన హార్మోనియం వాయిస్తూ పాడుతుండటం కనిపిస్తుంది. ఆ నోట్ల కుప్ప ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే.. ఆయన దాదాపుగా కనిపించకుండా పోయారు. స్టేజీపై ఆయన చుట్టుపక్కల ప్రాంతమంతా నోట్లతో నిండిపోయినప్పటికీ.. ఆయన తన ప్రదర్శనను ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఇది చూసి కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు ఈ ఘటనపై చర్చకు దారి తీసింది.నెటిజన్ల కామెంట్స్..ఇది నిజమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటారు. కేవలం అలా కూర్చుని నోట్ల వర్షంలో తడిసి ముద్దవ్వడం అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరొకరు.. ఆయన సరిగ్గా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని ఆశిస్తున్నాను. వాళ్ళు నోట్లు కుమ్మరిస్తున్నా ఆయన పాడుతూనే ఉన్నారంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ డబ్బులో కొంత భాగం పేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండంటూ వ్యాఖ్యానించారు.గతంలోనూ ఇలా..గుజరాత్లో భజన కార్యక్రమాల్లో భక్తులు ఇలా లక్షల రూపాయల నగదును వర్షంలా కురిపించిన వీడియోలు వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో వల్సాద్ అగ్నివీర్ గౌ సేవా దళ్ నిర్వహించిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తీదాన్ గధ్వీపై రూ.10, 20, 50, 100 నోట్లను వర్షంలా కురిపించారు. అదే విధంగా.. డిసెంబర్ 2022లో గుజరాత్లోని నవ్సారి గ్రామంలో జరిగిన భజన కార్యక్రమంలో కీర్తీదాన్ గధ్వీపై దాదాపు రూ. 50 లక్షల విలువైన నోట్లను కురిపించారు. 2017, 2018లలో కూడా ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. View this post on Instagram A post shared by Gopal Sadhu (@thegopalsadhu) -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్ఫారమ్కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
అంతా క్షణాల్లో..ఐసీయూ బెడ్మీదే పెళ్లి
‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.’’ అని ఓ సినీకవి అన్నట్టుగా పెళ్లి వేడుకలు, బంధు మిత్రుల ఆనందోత్సాహాలు, వధూవరుల కోటి కలల మధ్య ఎంతో ఉత్సాహంగా సాగాల్సిన పెళ్లి ముచ్చట ఉన్నట్టుండి విచారంగా పోయింది. వేద మంత్రాల మధ్య వైభవంగా వధువుకు తాళి కట్టాల్సిన ముచ్చట ఆసపత్రి ఐసీయూకి చేరింది. ఇంతకీ ఏమైంది తెలుసుకుందాం ఈ కథనంలో.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలో ఈ భావోద్వేగపూరితమైన వివాహం జరిగింది. పెళ్లి రోజునే వధువు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో బరాత్ను ఆసుపత్రికే తీసుకువచ్చి, వధువు నుదిట సింధూరం అద్ది పెళ్లి చేసుకున్నాడు.అసలేం జరిగింది అంటే గోరఖ్పూర్ జిల్లా బాన్స్గావ్ ప్రాంతానికి చెందిన పూజా యాదవ్ అనే యువతికి, సన్ని యాదవ్ అనే యువకుడితో మే 13న పెళ్లి జరగాల్సి ఉంది. పూజ ఎల్.ఎల్.బి (LLB) చివరి సెమిస్టర్ చదువుతోంది. పెళ్లి రోజు ఉదయం ఆమె తన సోదరుడితో కలిసి పరీక్ష రాయడానికి కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరీక్ష రాసి బైక్పై తిరిగి వస్తుండగా, పూజకు అకస్మాత్తుగా కళ్ళు తిరగడంతో బైక్ మీద నుండి కింద పడి పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూ (ICU)కి తరలించి చికిత్స అందించారు.పెళ్లి జరగాల్సిన సమయంలో వధువు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి. చివరికి వధూవరుల కుటుంబాల భారమైన హృదయాలతోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిని వాయిదా వేయకుండా, నిర్ణయించిన ముహూర్తానికే ఆసుపత్రిలో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.వరుడు సన్ని యాదవ్ పెళ్లి బట్టల్లో, బంధుమిత్రులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఐసీయూ బెడ్ మీద ఆసుపత్రి దుస్తుల్లో చికిత్స పొందుతున్న పూజ నుదుట సింధూరం దిద్దాడు. అక్కడున్న పండితుడు వేద మంత్రాలు పఠిస్తూ, ఏడు అడుగుల (సప్తపది) ప్రమాణాలను చేయించారు. సింధూర ధారణ ముగిసిన తర్వాత వరుడు తిరిగి గ్రామానికి చేరుకుని మిగిలిన పెళ్లి కార్యక్రమాలను పూర్తి చేశాడు. వరుడు సన్ని యాదవ్ ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆపద సమయంలో వధువును వదిలేయకుండా, ఆమెకు మనోధైర్యాన్ని ఇస్తూ ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న వరుడి గొప్ప మనసును చూసి అక్కడున్న వారందరూ కన్నీరు పెట్టు కున్నారు. ప్రస్తుతం పూజ కోలుకుంటోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.నెటిజన్ల ప్రశంసలుపెళ్లి ఇంట్లో జరగాల్సిన వేడుక ఆసుపత్రికి మారినప్పటికీ, ఆపదలో ఉన్న వధువుకు తోడుగా నిలిచిన వరుడిని, అతని కుటుంబాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. "నిజమైన ప్రేమ అంటే ఇదే" అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 'హాస్పిటల్ వెడ్డింగ్' ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. UP: अस्पताल बना मंडप, आईसीयू में भरी मांग, फेरों से पहले निभा दिया वचन; इसलिए दुल्हन को कराना पड़ा था भर्तीhttps://t.co/xBpkJDPLOt— Amar Ujala (@AmarUjalaNews) May 14, 2026ఇదీ చదవండి: మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్! -
పిల్లాడు కదా అని ఆఫీసుకి తీసుకెళ్తే, కొంప ముంచేశాడు!
చైనాలోని నింగ్బో నగరంలో 12 ఏళ్ల బాలుడు చేసిన చిన్న పొరపాటు భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. తన తల్లిదండ్రుల ఆఫీసులో లైటర్తో ఆడుకుంటూ అతను పొరపాటున నిప్పు పెట్టడంతో కార్యాలయం చాలా వరకు దగ్ధమైంది.ఈ సంఘటన గత నెల 30వ తేదీన, తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని నింగ్బో నగరంలో జరిగినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది.పిల్లాడిని ఇంట్లో ఒంటరిగా ఎందుకు, తమ మధ్య అనుబంధం పెరుగుతుందని భావించిన తల్లిదండ్రులు తమ 12 ఏళ్ల కొడుకును ఆఫీసుకి తీసుకెళ్లారు. ఆఫీసులో అందరూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ బాలుడిని పెద్దగా పట్టించుకోలేదు. దీంటో ఒంటరిగా ఉన్నవాడికి పిల్లవాడికి కాసేపటికి బోర్ కొట్టడంతో, అక్కడే ఉన్న ఒక లైటర్ను తీసుకుని టిష్యూ పేపర్లను కాల్చడం అనే ఆటను సరదాగా మొదలు పెట్టాడు. కానీ చూస్తుండగానే మంటలు ఆఫీసు అంతటా వేగంగా వ్యాపిస్తాయనీ గానీ, పెను ప్రమాదం ముంచు కొస్తుందని గానీ ఆ పిల్లగాడు ఊహించలేదు.టిష్యూ పేపర్ల నుండి వచ్చిన నిప్పురవ్వలు డెస్క్ పక్కన ఉన్న చెత్తకు అంటుకున్నాయి. బాలుడు భయంతో తన తండ్రికి చెప్పాడు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వచ్చేలోపే అక్కడున్న ఉద్యోగులతో కలిసి బాలుడి తల్లిదండ్రులు ఫైర్ ఎక్స్టింగ్యూషర్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, ఆఫీసు సామాగ్రి భారీగా దెబ్బతింది.ఆస్తి నష్టం సుమారు వేల యువాన్లలో (సుమారు రూ.1,41,118) ఉంటుందని అంచనా వేస్తున్నారు. మంటలను ఆర్పిన తర్వాత, అక్కడి ఫైర్ ఫైటర్ ఒకరు ఉద్యోగులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ప్రతి దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది, కానీ వారికి భద్రత పట్ల అవగాహన ఉండదు. తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ పెద్ద విపత్తుకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధిస్తారు. వారి పనిచేస్తున్న కంపెనీ ఏంటి అనే విషయాన్ని వెల్లడించలేదు.నెటిజన్ల స్పందనలుఈ ఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లాడు క్షేమంగా ఉన్నందుకు సంతోషం అని కొందరంటే.. వాడు మూడు నాలుగేళ్ల పిల్లాడు కాదు, 12 ఏళ్ల వయసులో కూడా ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడంటే ఇంట్లో బాగా గారాబం ఎక్కువై ఉంటుంది అని ఒకరు విమర్శించారు. ఇకపై ఏ బాస్ కూడా తన ఉద్యోగులను పిల్లల్ని ఆఫీసుకి తీసుకురావడానికి అనుమతించరు" అని మరొకరు ఎద్దేవా చేశారు. చైనాలో ఇలా పిల్లల వల్ల అగ్నిప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా ఘటన తల్లిదండ్రుల పర్యవేక్షణ మరియు అగ్నిప్రమాదాల పట్ల అవగాహన ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. -
మ్యాగీ అమ్మి రోజుకు రూ. 24 వేలు : నెటిజన్లు షాక్!
కంటెంట్, క్రియేటివిటీ ఉండాలేగానీ కొండల్లో కూడా మ్యాగీ అమ్మవచ్చు. భారీ ఆదాయాన్ని సంపాదించ వచ్చు. ఢిల్లీకి చెందిన కంటెంట్ క్రియేటర్ దేవాన్ష్ త్యాగి సక్సెస్ స్టోరీ తెలిస్తే మీరు కూడా ఔరా అంటారు. అసలేం జరిగిందంటే..కొండ ప్రాంతం.. చల్ల చల్లని గాలులు. అలాంటి టప్పుడు వేడి వేడిగా ఏదైనా తినడానికి దొరికతే, అదీ మ్యాగీ అయితే. ఇంకేముంది అద్భుతమైన కాంబినేషన్తో పర్యాటకులకు పండగే. ఈ ఆలోచననే క్యాష్ చేసుకున్నాడు. అలా అతని ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఛాలెంజింగ్ వీడియోలు చేసే దేవాన్ష్ త్యాగి అనే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్, కొండ ప్రాంతాలలో మ్యాగీ అమ్మితే ఒక రోజులో ఎంత సంపాదించవచ్చో తెలుసుకోవాల నుకున్నాడు. అంతే క్షణ కోసం ఆలస్యం చేయ లేదు. చక్కటి లొకేషన్ను ఎంచుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా ఒక బుల్లి కిచెన్ ఏర్పాటు చేశాడు. ‘‘కొండల్లో మ్యాగీ అమ్మి నేను ఎంత సంపాదించగలనో చూద్దాం" అంటూ ఒక వీడియో చేశాడు. కస్టమర్ల కోసం టేబుళ్లు, ప్లాస్టిక్ కుర్చీలతో స్టాల్ను ఏర్పాటు చేసుకున్నాడు.అలా దేవాన్ష్ తన స్టాల్లో రెండు రకాల మ్యాగీలను విక్రయించాడు. సాధారణ మ్యాగీ ప్లేటు రూ. 100, బటర్ మ్యాగీ ప్లేటు రూ. 120 ఇలా రెండు రకాలు అందించాడు. అంతే పర్యాటకులు, హైకర్లు మ్యాగీ లవర్స్ ఎగబడ్డారు. ఆ కొండాకోనల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వేడి వేడి మ్యాగీని ఆరగించడం ఈ వీడియోలో చూడవచ్చు. చూస్తుండగానే స్టాక్ అంతా అయిపోయింది. మొత్తానికి ఒక రోజులో దేవాన్ష్ సంపాదన అక్షరాలా రూ. 24 వేలు. కేవలం ఒక్క రోజులో ఇంత మొత్తం సంపాదించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. View this post on Instagram A post shared by Devansh Tyagi (@devanshtyagi_)నెటిజన్ల రియాక్షన్ఈ వీడియోకు 4.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేద్దామా?: "మేము కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి కొండల్లో మ్యాగీ కొట్టు పెట్టుకుంటాం" అని కొందరు సరదాగా కామెంట్ చేశారు. ఆ స్టాల్లో పనిచేయడానికి ఇంటర్న్స్ కావాలా? అని మరికొందరు తమాషాగా అడిగారు.అయితే, కొందరు నెటిజన్లు ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తారు. ఈ రూ. 24,000 అనేది కేవలం వచ్చిన ఆదాయం (Gross Revenue) మాత్రమేనని, అందులో ముడి పదార్థాలు, గ్యాస్, రవాణా ఖర్చులు తీసేస్తే నికర లాభం ఎంతో చెప్పాలని కోరారు. ఒక నెటిజన్ మాత్రం, "వంట చేయడానికి వాగు నీటిని వాడటం బాలేదు" అని విమర్శించారు. ఈ వైరల్ క్లిప్ ఆన్లైన్లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్లో చర్చను ఆసక్తికరంగా మారింది. -
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ను ఫన్గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్జీ యువతి
తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్జీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. ఓ జెన్జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by VYLA | Dhrupadi (@vyla.world) -
అచ్చం భారతీయ స్త్రీలా రష్యన్ మహిళ..!
ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది. ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.నేర్చుకున్న ఐదు అలవాట్లు..1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్లో రాసింది.2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝑫𝒆𝒔𝒊𝒍𝒊𝒇𝒆 |𝑩𝒆𝒂𝒖𝒕𝒚 |𝑰𝒏𝒅𝒊𝒂 (@sofia_desilife) (చదవండి: కేన్సర్పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్పాండే హెల్త్ టిప్స్) -
ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్
తమిళనాడులోని ఒక ఆలయ ఉత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు ఇది కామన్. అలాగే వివిధ ఆలయాల్లో అందించే ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. ఇది ఇంకా సాధారణం. కానీ ఒక పూజారి భక్తులకు నాణేలను 'ప్రసాదం'గా పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. దేవుడికి సమర్పించిన కానుకలనే ఇలా భక్తులకు తిరిగి పంచుతారట. దీనికి సంబంధించిన వీడియో హల్చల్ చేస్తోంది.@ramdevkar07 అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి, "విరాళాలు స్వీకరించడానికి బదులుగా ప్రసాదంగా డబ్బు ఇస్తున్న తమిళనాడు ఆలయం వైరల్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఒక పూజారి భక్తులకు ప్రసాదంలా నాణేలను పంచుతుండటం విశేషం. డొనేషన్లు తీసుకోవడానికి బదులు డబ్బును ప్రసాదంగా ఇస్తున్న ఆలయం అంటూ ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే,ఆ పూజారి నోట్లో సిగరెట్ (చుట్ట) ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కల్పవృక్ష స్వామి ఆలయం; ఇక్కడ భక్తులకు ఆలయ కానుకల సొమ్మునే ప్రసాదంగా అందజేస్తారు. సనాతన హిందూ ధర్మానికి జై! అంటూ మరో వీడియో కూడా ఎక్స్లో చక్కర్లు కొడుతోంది. Tamil Nadu temple goes viral for giving money as prasad instead of taking donations. pic.twitter.com/8Uud7gNVXv— ʀᴀᴍ (@ramdevkar07) May 12, 2026ఇలాంటి ఆలయం నిజంగా ఉందాతమిళనాడులోని శ్రీ వరం తారుమ్ మాలిగైపరై కరుప్పసామి ఆలయంలో ఒక ఉత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అక్కడ భక్తులకు ఇచ్చే ఈ నాణేలను స్థానికంగా "పిడి కాసు" (Pidi Kasu) అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని జానపద సంప్రదాయాలలో భాగంగా ఇలా నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరుప్పసామిని గ్రామ దేవతగా, శక్తివంతమైన రక్షకుడిగా (కావల్ దైవం) కొలుస్తారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం దేశవాళీ చుట్టలు, మద్యం వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలాకాలంగా వస్తున్న ఆచారం. గ్రామ సరిహద్దుల్లో ఉండే ఈ ఆలయాల్లో జరిగే ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి.ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?నెటిజన్ల స్పందనఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుళ్లో నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏంటి? ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి వాటిని ఆపేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో రకమైన బిజినెస్ అని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వసూలు చేసే ఎత్తుగడ అని మరికొందరు విమర్శించారు.ये तमिलनाडु की कलूपा स्वामी मंदिर है,यहां भक्त को मंदिर के चढ़ावा पैसे भी प्रसाद रूपी दिया जाता है..जय सत्य सनातन हिंदू धर्म 🙏 ॐ#सनातन_धर्म #तमिलनाडु pic.twitter.com/disGZjbrbd— Govind Jha (@Govind_Jha24) May 13, 2026 అయితే ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలిసిన వారు మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇది కరుప్పసామి ఆలయం, అక్కడ చుట్టలు సమర్పించడం ఆచారం. ఆయన గ్రామ రక్షకుడు, ఆయన ఆచారాలు ఇలాగే ఉంటాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి, ఈ వీడియో దక్షిణ భారత జానపద సంప్రదాయాలు ఆధునిక సామాజిక విలువల మధ్య చర్చను రేకెత్తించింది.ఇదీ చదవండి : పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం -
హాఫ్ రేట్కే వందే భారత్ టికెట్లు!
రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..మరో వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వందేభారత్ టికెట్ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్ ఆన్లైన్లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. ఫ్లాట్ఫారమ్ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్ ఉందని.. తన దగ్గర టికెట్ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే.. రూ.700 విలువైన వందే భారత్ టికెట్ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్ దానాపూర్ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్ఎం ఈ వైరల్ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్సీటీసీ IRCTC వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్ బుకింగ్) లభించవచ్చు. ఆన్లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు. -
రైల్లోనే డెలివరీ.. 'ఆపరేషన్ మాతృశక్తి' వీడియో వైరల్
కదులుతున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు తోటి ప్రయాణికులు, రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సమయానికి స్పందించడం మాత్రమే కాదు, సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షేమంగా ప్రసవంజరిగేలా చూసిన ఘటన మానవీయ కోణాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన పుణే-సుపాల్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఉత్తరప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల రుఖ్సానా ఖాతూన్, ఆమె భర్త జమీల్ బేలవర్ కలిసి పుణే నుండి బీహార్ వెళ్లేందుకు జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారు. రైలు అహల్యనగర్ స్టేషన్కు సమీపిస్తుండగా, రుఖ్సానాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో లేని ఆసుపత్రి, కిక్కిరిసిన జనరల్ కోచ్, వేగంగా కదులుతున్న రైలు కావడంతో వైద్య సాయం అందడం కష్టంగా మారింది.'ఆపరేషన్ మాతృశక్తి'ఈ అత్యవసర పరిస్థితిపై సమాచారం అందుకున్న సెంట్రల్ రైల్వే వెంటనే 'ఆపరేషన్ మాతృశక్తి'ని యాక్టివేట్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోమనాథ్ పాఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ మహిళ ఉన్న కోచ్కి చేరుకున్నారు. ఆమె నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆ సమయంలో ఆసుపత్రికి తరలించడం అసాధ్యమని గుర్తించారు. అందుకే రైలులోనే సురక్షిత ప్రసవం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆర్పీఎఫ్ సిబ్బంది, కోచ్లోని తోటి మహిళా ప్రయాణికులు కలిసి రుఖ్సానా చుట్టూ దుస్తులు, దుప్పట్లతో ఒక సురక్షితమైన తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేసిన ఈ పనితో రుఖ్సానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు వినగానే తోటి ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు.In a heartwarming incident aboard the Pune-Supaul Express, a pregnant woman safely gave birth inside a crowded general coach after experiencing severe labour pain near Ahilyanagar station. With no time to move her to a hospital, RPF personnel swiftly launched “Operation… pic.twitter.com/qnwb8L0e8d— NDTV (@ndtv) May 12, 2026 అనంతరం రైలు అహల్యనగర్ స్టేషన్కు చేరుకోకముందే రైల్వే అధికారులు అక్కడ 108 అంబులెన్స్ను, డాక్టర్లను సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బందిని మరియు సహకరించిన ప్రయాణికులను అందరూ అభినందిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ యూనిసైకిల్ రైడ్కి ట్రాఫిక్ పోలీసులే ఫిదా! చివరికి..
ఒక బెంగళూరు వ్యక్తి తన ఎలక్ట్రిక్ యూని సైకిల్పై రోజూ చేసే ప్రయాణg ఓ ట్రాఫిక్ పోటీసులో కుతుహాలం రేపి, ఆ వ్యక్తిని ఆపి మరి దాని గురించి తెలసుకునేలా చేసింది. చివరికి ఆ పోలీసు ఒక సారి ఆ సైకిల్ని ట్రై చేసి చూశాడు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జెరోమ్ ఆనంద్ అనే ఆ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆయన రోజు తన ఆఫీస్ నుంచి ఇంటికి ఆ ఎలక్ట్రిక్ యూని సైకిల్పై వెళ్తుంటారు. ఎప్పటిలానే ఆ రోజు కూడా సాధారణ ప్రయాణంగా ప్రారంభమైన తన రైడ్ చివర్లో అసాధారణంగా మారింది. ఆయన ఆఫీస్ నుంచి ఇల్లు జస్ట్ 25 కి.మీటర్లే కావడంతో ఆ ఒంటి చక్ర వాహనంపై రోజు వెళ్తుంటాడాయన. అందులోనూ బెంగళూరు ట్రాఫిక్లో ప్రయాణించడం ఎంత సాహసమో తెలియంది కాదు. ఆ రోజు కూడా ఆనంద్ ఎప్పటిలానే తన ఒంటి చక్ర వాహనంపై ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నడు. ఇంతలో తన జర్నీకి ట్రాఫిక్ పోలీసుల రూపంలో సడెన్ బ్రేక్ పడింది. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని ఆపుతారు. ఆయన ఇలా ప్రయాణించడం కూడా ఏదైన ట్రాఫిక్ ఉల్లంఘన ఏంటీ అనుకుని ఆగిపోతాడు. వాళ్లు ఈ వాహనంపై ఎలా ప్రయాణిస్తారు వంటి కుశల ప్రశ్నలు అడుగతారు. దాంతో అతను ఆ వాహనం ఫీచర్స్ గురించి సవివరంగా వివరించడమే కాదు రైడ్ చేసి చూస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ ట్రాఫిక్ పోలీస్ ఆనంద్ వాహనంపై ఎక్కి సరదాగా రైడ్ చేస్తాడు కూడా. ఆ సైకిల్పై రైడ్ చేయడంలో ఆనంద్ పోలీస్కి హెల్ప్ చేస్తాడు కూడా. అయితే ఈ వాహనంతో పెట్రోల్ టెన్షన్, పార్కింగ్ హైరానా ఉండదని కూడా వివరిస్తాడు. పైగా ట్రాఫిక్ని సులభంగా నిర్వహించొచ్చు, చాలా దూరం సునాయాసంగా ప్రయాణించొచ్చు అని ఆనంద్ ఆ ట్రాఫిక్ పోలీసులకు వివరిస్తాడు. ఆయన ఆ వీడియోకి "ట్రాఫిక్ పోలీసులకు దొరికాడు... చివరికి అతను నా ఈయూసీని నడపడంతో ముగిసింది" అనే క్యాప్షన్తో షేర్ చేశాడు ఆనంద్. అంతేగాదు ఏమో ఎవరు చెప్పగలరు ఏదో ఒక రోజు ట్రాఫిక్ పోలీసులు కూడా బెంగళూరు రోడ్లపై EUC తో గస్తీ కాయొచ్చేమో..అని చమత్కిరిస్తూ పోస్ట్ని ముగించాడు. View this post on Instagram A post shared by Jerome anand (@jro_thestreetrider) (చదవండి: అమ్మగా గర్వించే క్షణం..!) -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అన్యోన్య దాంపత్యం అంటే ఇదే కదా..! బాధను సైతం..
ఓ మహిళ అనారోగ్యంలో సైతం తన భర్త ఎలా అండగా నిలబడ్డాడో వివరిస్తూ షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసులను అమితంగా గెలుచుకుంది. నిజానికి మనకిష్టమైన వాళ్ల కోసం చాలా వాటిని షేర్ చేసుకోగలమేమో గానీ కొన్నింటిని మాత్రం షేర్ చేసుకోవడానికి చాలా పెద్ద మనసు కావాలి. అదే ఈ మహిళ వివరిస్తూ తన కథను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నమర్తా నితిన్ గోయెల్ తన వైద్య ప్రయాణంతో తనకు మద్దతుగా నిలిచి గుండు చేయించుకుంటున్న భర్త వీడియోని షేర్ చేశారు. ఆమె తాను కేన్సర్ బాధితురాలిననని, కీమో ధెరపీ కారణంగా తన జుట్టుని కోల్పోవడంతో తనకు సంఘీభావం తెలిపేలా తన భర్త గుండు చేయించుకున్న వీడియోని షేర్ చేషింది. కష్టకాలంలో సైతం తమ మధ్య బలమైన బంధం ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ భావోద్వేగం చెందింది. ఆ వీడియోలో కీమోథెరపీ తర్వాత జుట్టు రాలిపోవడంతో తాను అనుభవించిన బాధ గురించి ఆమె మాట్లాడింది. తన రెండవ కీమోథెరపీ సెషన్ తర్వాత, జుట్టు విపరీతంగా రాలిపోవడం ప్రారంభమైందని, తన తల చర్మం చాలా సున్నితంగా, బాధాకరంగా మారిందని ఆమె చెప్పింది. జుట్టు రాలినప్పుడల్లా నొప్పి మరింత తీవ్రమయ్యేదని కూడా చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని ఆయనకు చెప్పడంతో ఆ బాధను తాను కూడా పంచుకుంటానంటూ ఆమె భర్త ట్రిమ్మర్తో గుండు చేయించుకున్నారని తెలిపింది. ఆ క్రమంలో ట్రిమ్మర్ తలపైన సున్నిత చర్మానికి తగిలినప్పుడల్లా ఆయనకు గాయమవ్వడం తాను చూశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నిజానికి కేన్సర్ చికిత్సలో భాగం జుట్టు ఊడిపోతుందని తెలుసు కానీ అందుకు తాను సిద్ధంగా లేనని వివరించింది. తన బాధను చూసే ఆమె భర్త ఇలా చేసినట్లు పేర్కొంది. నెటిజన్లే ఈ వీడియోని చూసి..భాగస్వాముల మధ్యలో ఉండాల్సిన శ్రద్ధను ఈ ఘట్టం తెలుపుతోందని, మరికొందరు..'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటే మీ దంపుతులే అంటూ ప్రశంసలు, ఆశీస్తులు అందిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Namarta Nitin Goel (@goelnamarta) (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్కు చెందిన మఖన్లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్గా మఖన్లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
యువ జంట ఘనత.. జస్ట్ 10 గంటల్లో..
బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే. బెంగుళూరుకు చెందిన డానిష్ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన వీడయోని షేర్ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు. మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Vrushali & Danish | Fit Couple • Sea Swimmers • Triathletes (@our.life.in.miles) (చదవండి: ఆ రేంజ్లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!)


