breaking news
Social Media
-
'హిమాలయన్ ఆంటీ'..ఆమె శిఖరాగ్ర శక్తికి సాటిలేదు!
కసరత్తులు, వర్కౌట్లు చేస్తేనే స్ట్రాంగ్గా ఉంటారనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే..ఎలాంటి వర్కౌట్లు, శిక్షణ ట్రైనింగ్ లేకుండా ఈ మహిళ అవలీలగా బరువులు ఎత్తి ఔరా అనిపించుకుంది. అంతేగాదు..ట్రెక్కింగ్ వంటి సాహస కృత్యాలు చేసే విదేశీ మహిళ సైతం అంతలా ఆ బరువులను ఎత్తలేకపోయింది. అంతేగాదు ఆమెను చూసి పోటీ అనే పదానికి తావివ్వని శక్తిమంతులు ఈ మహిళలు అని కితాబిచ్చేసింది. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె ఉత్తరాఖండ్లోని చమోలీ అనే స్థానిక పహాడి(పర్వత) మహిళ. హిమాలయాల్లో నివశిసించే ఈ మహిళల శక్తి సామర్థ్యాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. ఆ వీడియోకి గెమ్మకోల్లెల అనే విదేశీ మహిళ 'నువ్వు బలవంతుడివని విశ్వసిస్తావు..అది తప్పని నిరూపించేంత వరకు' అనే క్యాష్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ఆ విదేశీ మహిళ గెమ్మ ఉత్తరాఖండ్లోని చమోలిలో నది సమీపంలోని ఒక చిన్నగ్రామంలోని ఇద్దరు మహళలు తమ గెదెల కోసం గడ్డికోస్తున్నట్లుగా కనిపించారు. వాళ్లలో ఒక మహిళ సదరు విదేశీ మహిళను చూడటమే గాదు, ఓ సవాలు కూడా విసిరారు. కొంటెగా నవ్వుతూ ఈ గడ్డిమోపు ఎత్తగలవా అని సవాలు విసిరింది స్థానిక హిమాలయన్ ఆంటి. అక్కడంతా ముద్దుగా ఆ మహిళలను అలా పిలుచుకుంటుంటారు. అయితే ట్రెక్కింగ్కి వెళ్లే అనుభవం ఉన్న విదేశీ మహాళ గెమ్మకి అదేమంతా పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు..సుమారు 20 నుంచి 25 కిలోలు దాక బరువులు మోసే అలవాటు ఉంది ఆమెకు. దాంతో అదేమంతా పని అన్నట్లుగా సై అంది విదేశీ మహిళ. ఆ తర్వాత మొదలయ్యాయి..ఆమె కష్టాలు, పాట్లు చూస్తే నవ్వు ఆగదు. కొంచెం కూడా గడ్డిమోపుని ఎత్తలేక నానా అవస్థలు పడింది. కానీ ఈ పర్వతాల్లో నివశించే హిమాలయన్ మహిళ మాత్రం చాలా అలవోకగా ఆ భారీ గడ్డిమోపుని సులభంగా ఎత్తేయడమే కాదు ట్రక్కు వద్దకు నేరుగా తీసుకెళ్లింది కూడా. ఆమె శక్తి సామర్థ్యాలకు ఫిదా అవ్వతూ ఆ మహిళ ఎంతలా అప్రయత్నంగా ఆ గడ్డిమోపుని ఎత్తేసిందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.అస్సలు పోటీ అనేదే ఆమెకు లేదు అంటూ గడ్లల జల్లు కురిపించింది సదరు విదేశీ మహిళ. అయితే నెటిజన్లు..హిమాలయల ఇళ్లకు వెన్నముక ఈ స్త్రీలు. సగటు పర్వతపు మహిళ దినచర్య ఇదేనని అభినందన జల్లు కురిపిస్తున్నారు. పైగా ఆమె చాలా క్యాజువల్గా పహాడి కండరాలను వంచు తోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) View this post on Instagram A post shared by Gemma Colell (@indra.creativa) (చదవండి: Success Story: ఐఏఎస్గా సెక్యూరిటీ గార్డు కుమార్తె..! హిందీ మాధ్యమంలో టాపర్గా..) -
పోలీసు కావాలనుకున్నాడు, భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.రాజ్వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్పై విహార యాత్రకు వెళ్లిన రాజ్వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్వీర్ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది. (జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్)రాజ్వీర్ జవాండా భార్య హెచ్చరికరాజ్వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్వీర్ పట్టించు కోలేదని రాజ్వీర్ సన్నిహితులు అంటున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు -
జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్పీ అరెస్ట్
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్గార్గ్కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు. గత నెలలో సింగపూర్లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025గత నెలలో సింగపూర్లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!
దేశంలోనే అత్యుత్తుమ గౌరవప్రదమైన సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్ . ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ తమ సేవలను అందిస్తుంటారు. అలా తమ సేవలతో ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకుని, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న అధికారులు ఎందరో ఉన్నారు. అలానే ఒక కలెక్టర్ తన కింద సిబ్బంది, ప్రజల మన్ననలను అందుకుని అద్భుతమైన గౌరవాన్ని అందుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశలోని సియోని జిల్లా కలెక్టర్ సంస్కృతి జైన్ బదిలీపై వెళ్తూ..తన సహచర సిబ్బంది, ప్రజల నుంచి రాజవంశీకులు రేంజ్లో గొప్ప సత్కారం పొందారామె. మాజీ కలెక్టర్ సంస్కృతి జైన్, ఆమె ఇద్దరు కుమార్తెలను బంగారు పల్లకీలో కూర్చోబెట్టి మరీ వీడ్కోలు పలికారు. సిబ్బంది స్వయంగా తమ భుజాలపై మోస్తూ ఆమె వాహనం వద్దకు తీసుకువెళ్లి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇక ఇటీవలే, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సియోని కలెక్టర్ సంస్కృతి జైన్ని భోపాల్కి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టర్ శీతల పాట్లేకు స్వాగతం పలికి, సంస్కృతి జైన్కు వీడ్కోలు పలికే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా, కలెక్టర్ జైన్ అవసరమైనప్పుడల్లా ముందుకు వచ్చి డిపార్ట్మెంటల్ సిబ్బందికి నాయకత్వం వహించి వారి తప్పులను ఎత్తి చూపేవారట. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడానికి కలెక్టర్ జైన్ ప్రారంభించిన “గిఫ్ట్ ఎ డెస్క్” ప్రచారం కూడా అత్యంత ప్రజాదరణ పొందింది. అంతేగాక సమాజంలోని అన్ని వర్గాలచే ప్రశంసలు అందుకున్నారామె. సుమారు 15 నెలల కాలంలో ప్రజలకు చేరువవ్వడమే కాకుండా తన సేవలకుగానూ విశిష్ట గుర్తింపు కుడా దక్కించుకున్నారామె.An MP IAS officer Sanskriti Jain, Collector Seoni,was given a unique farewell by her staff. Unheard of before.Many officers hv been popular during their postings owing to people-oriented works & honesty, yet this was something new.Let more officers be like her.@IASassociation pic.twitter.com/wsebdt9ELw— Abhilash Khandekar (@Abhikhandekar1) October 5, 2025 (చదవండి: డిజిటల్ డిటాక్స్లో ఉండగా ..వరించిన నోబెల్ బహుమతి! ట్విస్ట్ ఏంటంటే..) -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
డియర్ క్యాబ్ డ్రైవర్ ఫ్రెండ్స్ , జిమ్మేదారీ అంటే ఇదీ..!
‘పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత తీసుకోవడం అంటే ఇది’ అంటూ ఒక క్యాబ్ డ్రైవర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అతడి వృత్తినైపుణ్యాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ‘పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా జాగ్రత్త పడడం ప్రతి స్కూల్ క్యాబ్ డ్రైవర్ బాధ్యత’ అనే కాప్షన్తో వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీడియోలో ఏముంది? అనే విషయానికి వస్తే... స్కూల్ క్యాబ్ నుంచి బయటికి దిగిన బాలిక తన ఇంటివైపు పరుగులు తీస్తూ కనిపిస్తుంది. ‘క్యాబ్ డ్రైవర్ మిత్రులారా, నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మాయి క్యాబ్ దిగగానే మన బాధ్యత తీరినట్లు కాదు. ఆ ΄ాప ఇంట్లోకి అడుగుపెట్టేవరకు కాబ్ కదలకూడదు’ అనే మాటలు బ్యాక్గ్రౌండ్ నుంచి వినిపిస్తూ ఉంటాయి. ‘ప్రతి క్యాబ్ డ్రైవర్ నీలా ఆలోచిస్తే పిల్లల భద్రతకు ఎలాంటి సమస్య ఉండదు’ అని ఒక నెటిజన్ స్పందించారు. ‘మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పిల్లల భద్రత విషయంలో కీలకం అవుతాయి’ అని మరోసారి గుర్తు చేసే వీడియో ఇది. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. చైనా సిచువాన్లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది. Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025 ఇదిలా ఉంటే.. హంగ్తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా? -
మ్యాగీ పిచ్చి: ఎంగేజ్మెంట్ రింగ్ అమ్మి.. విషయం తెలిసి తల్లి భావోద్వేగం
టీనేజ్ పిల్లల చేష్టలు అమాయకంగా అనిపించినా, ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అనుకున్నది దక్కించుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడతారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని, కాన్పూర్లోని శాస్త్రి నగర్లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే షాక్ అవ్వకతప్పదు 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని ఎత్తుకుపోయాడు. ఇది దురాశతోనో , డబ్బులతో కాదు.. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ వస్తువుల పట్ల ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈనేపథ్యంలో కేవలం మ్యాగీ నూడుల్స్ కోసం తనసోదరి ఎంగేజ్మెంట్ను రింగ్ను అమ్మేయాలని చూశాడు. కానీ దుకాణ యజమాని , ఆ కుర్రోడి తల్లికి ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.విషయం తెలుసుకున్న తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.ఉంగరాన్ని కొట్టేసిన బాలుడు ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. ఉంగరాన్ని తీసుకొని డబ్బులు ఇమ్మని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ బాలుడి అమాయకత్వాన్ని చూసి అనుమానం వచ్చింది. కారణాలను ఆరాతీశాడు. మ్యాగీ కొనడానికి డబ్బుల్లేవని, అందుకే ఉంగరాన్ని తెచ్చానని ఆ బాలుడు అమాయకరంగా సమాధానం ఇచ్చాడు. చదవండి: ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’వెంటనే ఆ ఆభరణాల వ్యాపారి వెంటనే ఆ బాలుడి తల్లికి సమాచారమిచ్చాడు. తన కుమార్తె నిశ్చితార్థం ఉంగరం చూసి తల్లి షాక్ అయ్యింది. వివాహం కొన్ని రోజుల్లోనే జరగాల్సి ఉందని, ఈ ఖరీదైన ఉంగరం పోయి ఉంటే చాలా సమస్యలెదుర్కోవాల్సి వచ్చేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయతీగా ప్రవర్తించిన నగల వ్యాపారికి తల్లి కళ్ల నిండానీళ్లతో ధన్యవాదాలు తెలిపింది.చదవండి : కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!అయితే సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన ఆభరణాలను తాము కొనుగోలుచేయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆభరణాల వ్యాపారి నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంది. -
రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో
అధిక బరువుతో బాధపడే వాళ్లు తీవ్రమైన క సరత్తు చేయాల్సిందే. గుట్టలకొద్దీ పేరుకు పోయిన కొవ్వు కరగాలంటే చెమట చిందించాల్సిందే. దీనికి కొందరికి రోజులు, నెలలు సరిపోవు. సంవత్సరాల తరబడి కృషి చేయాలి. ఏదో నాలుగు రోజులో, నెలలో చేసి నావల్ల కాదు చేతులెత్తేయకూడదు. ఓపిగ్గా ప్రయత్నించాలి. అప్పుడు అనుకున్న శరీరాకృతి సాధ్యమవుతుంది. ఇదే నిరూపించిందో యువతి. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్గా మారింది. ఈ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఎక్స్లో సుమారు 60లక్షల వ్యూస్ను సాధించింది. అద్భుతం, అమోఘం అంటూ చాలా మంది ఆమెను అభినందించగా, అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వీడియో చివర్లో ఆమె స్మార్ట్లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత భారీగా బరువు తగ్గినపుడు, చర్మం వేలాడుతూ ఉంటుంది.అలా లేదేమిటి? అని కొందరు, బహుశా శస్త్రచికిత్స చేయించుకొని ఉండవచ్చు అని కొందరు అభిప్రాయపడ్డారు. దాదాపు నేను కూడా సుమారు 200 పౌండ్లు బరుదు తగ్గాను. చర్మంఅలాగే ఉండిపోయింది. చాలా శస్త్రచికిత్సలు జరగకుండా ఆమె అలా అయ్యే అవకాశం లేదు. అది సాధ్యం కాదని నేను చెప్పడం లేదు, అది ఆమెదేనా అని అనుమానం అని మరో యూజర్ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. Two years of hard work in 1 minute.Impressive!!! pic.twitter.com/QP5QubvmwJ— MALEEK 1.0 (@Maleekoyibo) October 4, 2025 -
కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే!
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చెయిన్ కేఎప్సీ (KFC)మరోసారి చిక్కుల్లో పడింది. బెంగళూరు ఔట్లెట్లో కుళ్లిపోయినచికెన్ వడ్డించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఎక్స్లో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి..బెంగళూరుకు చెందిన ఒక కస్టమర్ కేఎఫ్సీపై విమర్శలు గుప్పిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం బెంగళూరు(Bangalore) కోరమంగళ అవుట్లెట్లో ఉన్న KFCలో ఒక మహిళా కస్టమర్ హాట్ & స్పైసీ చికెన్ జింజిర్ బర్గర్ ఆర్డర్ చేశారు. దాంట్లోని మాంసం కుళ్లి భరించలేని వాసన వచ్చింది. దీంతో దాన్ని రీప్లేస్ చేయమని అడిగారు. కానీ రెండోసారి కూడా దుర్వాసనతో చెడిపోయిన బర్గర్ ఇవ్వడంతో షాక్ అవ్వడం ఆమె వంతైంది.దీంతో ఆమె సిబ్బందిని గట్టి నిలదీయంతో "ఇది కేవలం సాస్ వాసన" తోసిపుచ్చారని తన పోస్ట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా, సిబ్బంది తన చికెన్ బర్గర్ను వెజిటేరియన్తో భర్తీ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కోరమంగళ కేఎఫ్సీ అవుట్లెట్లో తాను క్రమం తప్పకుండా అదే బర్గర్ను ఆర్డర్ చేస్తానని , ఇంతకు ముందెపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆమె వెల్లడించించింది. అంతేకాదు ఈ వివాదంతో కస్టమర్లు వంటగదిని చూడాలని డిమాండ్ చేశాడు. దీనికి మొదట అంగీకరించని సిబ్బంది, రాత్రి 10 గంటల తర్వాత ప్రవేశం లేదని, మేనేజర్ అందుబాటులో లేరని సిబ్బంది అనేక సాకులు చెప్పారు.చివరికి అనుమతించారు. దీంతో అక్కడి దృశ్యాల్నిచూసి జనం షాకయ్యారని తన పోస్ట్లో ఆరోపించింది.అంతా కలుషితం, మురికి వాసన, కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లే మాంసం, బూజు పట్టిన, తుప్పు పట్టిన షీట్లు, మరకలు ఉమ్మి గుర్తులు ఉన్నాయంటూ పేర్కొంది. (పబ్లిక్ టాయిలెట్స్లో హ్యాండ్ డ్రైయర్ వాడుతున్నారా?)🚨 WARNING: HSR KFC, Bangalore Extremely Unsafe Food 🚨One of our followers has shared a shocking and disturbing experience at the KFC outlet in HSR Layout, Bangalore. She had ordered a Hot & Spicy Chicken Zinger Burger, but the moment she opened it, the stench was unbearable.… pic.twitter.com/yFpIcblaAA— Karnataka Portfolio (@karnatakaportf) October 4, 2025దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చిన తర్వాత సిబ్బంది దాదాపు అరగంట పాటు వంటగదిని తాళం వేసి ఉంచారని, ఆ సమయంలో స్విగ్గీ , జొమాటో ఆర్డర్లు పంపడం కొనసాగిందని పోస్ట్ పేర్కొంది. "30-40 డెలివరీలు ఒకే చెడిపోయిన మాంసాన్ని ఉపయోగించి పంపించారని కూడా ఆరోపించారు. మేనేజ్మెంట్ షాకింగ్ రియాక్షన్ఇదిలా ఉంటే మేనేజ్మెంట్ స్పందన అత్యంత షాకింగ్గా ఉంది. తన సొంత కుటుంబానికి అలాంటి ఆహారాన్ని అందిందని అని ఒప్పుకుంటూనే, ఈఫుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అవుట్లెట్ మేనేజర్ వాదించడం విడ్డూరంగా నిలిచింది.ఈ సంఘటన నెట్టింట విమర్శలకు తావిచ్చింది. పిల్లలతో సహా వెళ్లే కుటుంబాలకు ఇలాంటి ఆహారం వడ్డించడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడ ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొన్నా.. అందుకే ఆ అవుట్లెట్కు వెళ్లడం పూర్తిగా మానేశాను. వీలైతే, మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే అక్కడి నుండి తినకండి" అని మరొకరు కామెంట్ చేశారు. "ప్రతి రెస్టారెంట్ ఏ సమయంలోనైనా కస్టమర్లు వంటగదిని సందర్శించడానికి అనుమతించాలి. సరైన పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లను ఆహార లైసెన్స్ రద్దు చేయడంతో వెంటనే మూసివేయాలి. అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపులర్ ఆహార డెలివరీ యాప్ల ద్వారా అందించే క్లౌడ్ కిచెన్ల పరిస్థితి ఏంటి ఒకయూజర్ ఆందోళనవ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!ఈ సంఘటన నిజమని నిరూపితమైతే, అవుట్లెట్లో పరిశుభ్రత ,ఆహార భద్రత ఆందోళన కలిగించే అంశమే. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి ఈ వివాదం, వీడియోలోని ఆరోపణలపై కేఎఫ్సీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
Cow Cess: ఇదేందయ్యా ఇది.. ఇది మేం చూడలే!
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లే అందుకు నిదర్శనం. అయితే బార్లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు. రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే.. ఆ తాగుబోతు రాజస్థాన్కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు. సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్ఛార్జ్గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
వీడియో వైరల్: కుర్కురే కొనివ్వలేదా..? పోలీసులకు ఫోన్ చేయండి!
సింగ్రౌలి: కుర్కురే (Kurkure) కొని ఇవ్వలేదని ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని ఖుతార్ అవుట్ పోస్ట్ పరిధి ‘చితర్వాయి కలా’ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుర్కురే కొనివ్వమని 20 రూపాయలు అడిగినందుకు తన తల్లి, సోదరి తాడుతో కట్టి మరి కొట్టారంటూ పోలీసుల ఎమర్జెన్సీ నంబర్ 112కి ఫోన్ చేసి మరి ఆ కుర్రాడు ఫిర్యాదు చేశాడు.బాలుడు, పోలీసులు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ కుర్రాడు ఏడవడం మొదలుపెట్టాడు. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది త్వరలోనే తాము వస్తామంటూ ఆ బాలుడిని ప్రేమతో ఓదార్చడమే కాకుండా.. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లారు. కుర్రాడిని, అతని తల్లిని పిలిచి ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లాడిని కొట్టొదని తల్లికి చెబుతూ ఆ పిల్లాడికి కుర్కురే ప్యాకెట్లు కూడా కొని తెచ్చివడం విశేషం. ఈ వీడియో సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చివరికి ఆ కుర్రవాడి డిమాండ్ నెరవేరిందంటూ పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.बच्चे ने कुरकुरे की माँग की तो माँ ने कूट दिया। शिकायत पुलिस के पास पहुँची और माँग पूरी हो गई। वायरल वीडियो मध्य प्रदेश के सिंगरौली का है। pic.twitter.com/MqIcRKBB0w— SANJAY TRIPATHI (@sanjayjourno) October 4, 2025 -
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
జాతర కోసం వచ్చి..రైల్వే ట్రాక్పై రీల్స్? స్పాట్లోనే నలుగురూ!
ప్రమాదమని రైళ్లలో ప్రయాణిస్తూ, కొందరు, రైలు పట్టాలపై కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు. అతి ప్రమాదకరమైన ఈ స్టంట్స్తో ప్రాణాలు పోతున్నా, అస్సలు పట్టించుకోవడం లేదు. తాజాగా వందే భారత్ రైలు వచ్చే ట్రాక్ పై రీల్స్ చేస్తూ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లోని పూర్నియాలోని రైల్వే బూత్ సమీపంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గా పూజ ఉత్సవానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ విషాద సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.బీహార్లోని పూర్ణియాలో రైల్వే ట్రాక్పై ఇన్స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తున్న నలుగురు యువకులు ప్రమాదానికి గురైన ఘటన ఇలాంటిదే. రైలు పట్టాలపై రీల్స్ షూట్ చేస్తుండగా జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. మృతులందరూ 14 నుండి 15 సంవత్సరాల వయస్సు గలవారు. మృతుడు మాధేపురలోని మురళీగంజ్కు చెందినవారు.శుక్రవారం తెల్లవారుజామున 4.54 గంటలకు పూర్నియా , కస్బా రైల్వే స్టేషన్ల మధ్య జోగ్బాని-దానపూర్బ్26301 (వందే భారత్ ఎక్స్ప్రెస్) రన్ఓవర్ గురించి మాకు సమాచారం అందింది, కొంతమంది యువకులు, ఇతరులు రైల్వే ట్రాక్పై రీల్స్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అనుమానిస్తున్నామని రైల్వే అధికారి తెలిపారు. దురదృష్టవశాత్తు, పనికోసం వచ్చి, జాతర చూడటానికి వచ్చిన వారు ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదం అంటూ బీజేపీ ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రిషి విచారం వ్యక్తం చేశారు. బాధుతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.మరోవైపు ఈ సంఘటనపై పూర్నియా ఎంపి పప్పు యాదవ్ స్పందించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం. బీహార్లోని అనేక చోట్ల రైల్వే అండర్పాస్, ఓవర్బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది, కానీ అది జరగడం లేదని విమర్శించారు. తమ ప్రాంతానికి చెందిన బాధితులు, దళిత కుటుంబానికి చెందిన యువకులని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాండ్ చేశారు.నోట్: ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించనప్పటికీ, ఈ సంఘటన అటువంటి విషాదాల వెనకున్న కారణాల గురించి అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి, ప్రజలు తమ పరిసరాల గురించి అప్రమత్తంగా ఉండాలి .రీల్స్ లేదా వీడియోలను షూట్ చేసేటప్పుడు తమను తాము ప్రమాదంలో పడేయకుండా ఉండాలి. రైల్వే ట్రాక్లు, కొండచరియలు ,పర్వత అంచులు వంటి సున్నితమైన ప్రదేశాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. -
పాము కడుపులో ప్లాస్టిక్ బాటిల్.. ఎలా బయటకు వచ్చిందో చూశారా?
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. 2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే.. చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్ను తొలగించింది. అది ఒక సన్స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ! -
పండుగ పూట పెట్టెతో సహా గోల్డ్ కొట్టేసింది..! వీడియో వైరల్
బంగారం ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి.కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది పసిడి. గ్రాము బంగారం కొనాలంటే జనం బెంబేలెత్తుతున్న పరిస్ఙతి. ఈ క్రమంలో ట్విటర్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లోని ఒక జ్యుయల్లరీ దుకాణంలో ఒక మహిళ తన చేతివాటి చూపించింది. బంగారం షాపింగ్ చేస్తున్నట్టుగానే నటిస్తూ లక్షలు విలువ చేసే నగను పెట్టెతో సహా దాచేసింది. కానీ విషయం షాపులోనే ఉన్న కెమెరానుంచి మాత్రం తప్పించు కోలేక పోయింది. ఒక ట్విటర్ యూజర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బంగారం ధరలు గ్రాముకు రూ 12 వేలు దాటేసింది. ఇలాంటి దొంగతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది... ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎప్పుడూ లేనంతగా అప్రమత్తంగా ఉండాలి! అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 🚨 With gold prices soaring past ₹12k/gram, theft cases are bound to spike...Jewellers must stay more alert than ever!#UttarPradesh | Bulandshahr: Woman caught on camera stealing..stuffs an entire jewellery box inside her saree 👇 pic.twitter.com/5FRxWAQrA0— Nabila Jamal (@nabilajamal_) October 1, 2025 -
భారత్లోని జిమ్లే బాగుంటాయ్..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఎనిమిదేళ్లకుపైగా భారత్లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది. ఆ నాలుగు పాఠాలు.సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందికమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్లోలా ఎవరికివారుగా ఉండరు. జిమ్లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా. అలాగే భారత్లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్లో ఫిట్నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్లా ఉండాలని అంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty)(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..) -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..?
కొన్ని విషయాలు పిల్లలకు అనుభవపూర్వకంగా చెప్పాల్సిందే. సరైనదే అయినా..ప్రాణాలను పణంగా పెట్టేంత డేరింగ్ నిర్ణయాలు గురించి చెప్పకపోవడమే మేలు. సురక్షితమైన చర్యలు తీసుకుంటే పర్లేదు. జరగరానీ నష్టం జరిగితే ఇక అంతే పరిస్థితులు. ఇక్కడ అలాంటి భయానక పేరెంటింగ్ టీచింగ్కి సంబంధించిన ఘటనే చోటుచేసుకుంది. ఆ వీడియో చూస్తే..మరీ ఈ రేంజ్లో ధైర్యం విలువ గురించి నేర్పించాలా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు..ఆ వీడియోలో ఓ ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గారెట్ గీ తన కొడుకుని పెద్ద పర్వతం మీద నుంచి నదిలోకి దూకేయమని ప్రోత్సహిస్తాడు. మొదట ఆ పిల్లవాడు భయంతో వెనకడుగు వేస్తాడు. ఆ తర్వాత తండ్రి మాటలకు కాస్త ప్రేరేపించబడినా..దూకే సాహసం చేయలేకపోయాడు. దాంతో చివరికి తండ్రే అతడిని ఎత్తుకుని విసిరేస్తాడు. పాపం ఆ పిల్లవాడు భయంతో నాన్న అని అరవడం స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటం చూడొచ్చు. ఆ తర్వాత తండ్రి వెంటనే దూకేసి అతడిని పట్టుకుని ఒడ్డుకి వచ్చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో నేర్పడం మరీ ఈ రేంజ్లోనా అంటూ ఫైర్ అయ్యారు. పిల్లలందరూ ఒకేలా ఉండరని, కొందరూ చాలా పిరికిగా ఉంటారంటూ హితవు పలికారు. నెమ్మదిగా ధైర్యాన్ని నూరిపోస్తూ..స్వతహాగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలే తప్ప ప్రాణాలకే ముప్పు వాట్లిలే ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు తగదు అని సదరు ఇన్ఫ్లుయెన్సర్ గీకి హితవు పలికారు. అందుకు సంబంధించిన భయానక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేగా పిల్లలకు భయం పోగొట్టాలంటే మరి ఇంతలా నేర్పించాలా అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అయితే గీ మాత్రం తల్లిదండ్రులుగా తమ ఉద్దేశ్యాలు వేరని, తాము ప్రేమగా జాగ్రత్తగా పిల్లలను చూసుకోగలమని తనదైన శైలిలో కౌంటరిచ్చాడు ఇన్ఫ్లుయెన్సర్ గీ. View this post on Instagram A post shared by Garrett Gee (@garrettgee) (చదవండి: రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!) -
జోరు వర్షంలోనూ ఆగని గర్భా నృత్యం..!
దసరా వేడుక కొన్ని చోట్ల విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఆ సంప్రదాయలకు అనుగుణంగా జరిగే పూజ ఆచారాల కారణంగానే అవి వార్తల్లో నిలుస్తాయి. కొన్ని చోట్ల గర్భా, దాండియా వంటి నృత్యాలతో జరుపుకుంటే..మరికొన్ని చోట్ల నైవేద్యాల పరంగా విశిష్టతను కలిగి ఉంటాయి. జనసందోహంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ సమయంలో అనుకోని అతిథిలా వర్షం వస్తే..అబ్బా ఎంత పనిచేసిందంటూ..తల తడవకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని సమీపంలోని చెట్ల వద్దకు, లేదా ఇళ్లు/షెడ్డు వద్దకు వస్తాం. కానీ ఈ వ్యక్తి పండుగ సంబరం ఆగకూడదు..ఆ సరదా పోకూడదనుకున్నాడేమో అంతటి జోరు వర్షంలోనూ అలా గర్భా నృత్యం చేస్తూనే ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే దటీజ్ గర్భా పవర్ అన్నట్లుగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడమే కాదు, నెటిజన్లను తెగా ఆకర్షించింది. ఆ వీడియోలో చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి సంప్రదాయ బ్లాక్ కలర్ డ్రస్ ధరించి, కుండపోత వర్షంలో కూడా ఆగకుండా గర్భా నృత్యం చేస్తున్న కమనీయ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, గుజరాత్ నవరాత్రి వేడుకలకు పెట్టింది పేరు. పైగా ఇక్కడ జరిగే గర్భా రాత్రులు అత్యంత ప్రజాదరణ కలిగినవి. రంగురంగుల సంప్రదాయ దుస్తులతో చేసే గర్భా నృత్యాలు ప్రజలందర్నీ అమితంగా ఆకర్షిస్తాయి. అందులోనూ ఈ ఏడాది పదిరోజులు కాకుండా పదకొండు రోజుల కావడంతో మరింత వైభవోపేతంగా చాలాపెద్ద పెద్ద గర్భారాత్రులు నిర్వహిస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Parth Suri (@parth_suri) (చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్గా బస్సు కండక్టర్ స్టోరీ..) -
హాయ్ స్విగ్గీ.. వాట్ ఏ సడన్ సప్రైజ్!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్ఫాస్ట్ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. శశి థరూర్ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/DdF1yiheT3— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2025 यह हमारे लिए अत्यंत हर्ष का विषय है कि हमें श्री थरूर जी को क्षेत्र की सर्वश्रेष्ठ इडली परोसने का अवसर प्राप्त हुआ। हमारी आशा है कि हमारी टोली उनके स्वादेंद्रियों को तृप्त करने में सफल रही होगी तथा इन पाक-कला के अनुपम चमत्कारों से उन्हें परमानंद की स्थिति मिली होगी। https://t.co/oTaJ2Ykrsn pic.twitter.com/PifmOlitQF— Swiggy Food (@Swiggy) September 28, 2025ఇంతకీ శశిథరూర్ ఇడ్లీ గురించి ఏమన్నారంటే.. ఈ మధ్య ఓ నెటిజన్ ఇడ్లీ గురించి అభివర్నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్ తనదైన ఇంగ్లీష్తో కవితాత్మకంగా ఓ కౌంటర్ పోస్ట్ చేశారు. ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్ చేశారు.మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్, ఎంఎఫ్ హుస్సేన్, సచిన్ టెండూల్కర్ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్ సెక్షన్లో పోస్టులు పెడుతున్నారు.దక్షిణాది ప్రసిద్ధ ఫలహార వంటకం ఇడ్లీని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరు..థాంక్యూ సర్. https://t.co/eg46kbwIV7— తెలుగు తీపి (@kkmohan73) September 28, 2025 -
ఇవి స్మార్ట్ రోడ్లు కావు సామి షార్ట్ రోడ్లు!
‘‘యస్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు అధ్వాన్నమైన రోడ్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. కానీ, దేశంలో ఎక్కడ కూడా బెంగళూరులో చేసినట్లు మాత్రం రిపేర్లు చేసి ఉండరు..’’ సోషల్ మీడియాలో బెంగళూరు రోడ్ల దుస్థితి గురించి ఓ నెటిజన్ చేసిన జోక్ ట్వీట్ ఇది.మొన్నటిదాకా బెంగళూరు ట్రాఫిక్ రద్దీ గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఈ మధ్య అధ్వాన్నమైన రోడ్ల గురించి కూడా(Bengaluru Roads) చర్చించుకుంటున్నారు. ఓ ప్రముఖ కంపెనీ రోడ్లు బాగోలేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నగర శివారు నుంచి తరలిపోయింది. దీంతో రాజకీయంగానూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తామేమీ ఖాళీగా లేమని.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెబుతున్నారు. అంతేకాదు.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను కూడా సంబంధిత మంత్రిగా(పట్టణాభివృద్ధి) ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో.. ఇప్పుడు నెట్టింట విమర్శలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్ల రిపేర్ పనులు కొనసాగుతున్న వేళ.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ ప్యాచ్ వర్క్లు రెండు, మూడు రోజులకు మించి ఉండడం లేదు. వీటికి తోడు కొత్తగా కొట్టిన రోడ్లు కూడా 48 గంటలు తిరగకముందే పాడైపోతున్నాయి. ఫలితంగా.. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఆ రోడ్లనే ఎక్కుతున్నారు. మొన్నీమధ్యే కాక్స్ టౌన్లోని వెబ్స్టర్ రోడ్డులో రిపేర్లు చెదిరిపోయి మళ్లీ గుంతలు దర్శనమిచ్చాయి. దీంతో భారతినగర్ ప్రజలు ఆ గుంతలకు పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి మరికొందరు కూడా అలాగే గుంతలను పూలతో అలంకరించి.. పసుపు, కుంకుమ చల్లి తమను చల్లగా చూడాలంటూ వీడియోలు చేసి వైరల్ అయిపోయారు. తాజాగా.. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చన్నసంద్ర సర్కిల్ వద్ద రిపేర్ అయిన రోడ్ల పరిస్థితి తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. చన్నసంద్ర సర్కిల్ వద్ద సెప్టెంబర్ 27న రోడ్డుకు మరమ్మతులు చేశారట. గట్టిగా ఒక్క వాన పడితే ఈ రోడ్డు ఉండదు అంటూ ఆ వ్యక్తి ఆ వీడియోను క్యాప్షన్ ఉంచాడు. దీనికి Greater Bengaluru Authority (@GBA_office) ను ట్యాగ్ చేశాడు. They repaired this section - Channasandra Circle on 27th September. It's 29th September today and the road is gone. What kind of patchwork doesn't last 48hrs? Are your engineers and contractors so much unqualified @GBA_office?You see the water in the video? - it's leaking… https://t.co/2NfPTEA1sN pic.twitter.com/kOH0ExjG8J— Auro (@weekendbiker) September 29, 2025బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. నగరంలో దీర్ఘకాలిక రోడ్డు అభివృధ్ది ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. ఇందులో కేవలం రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.750 కోట్లు కేటాయించారు. గుంతల పూడిక, వైట్ టాపింగ్, బ్లాక్టాపింగ్, కొత్త స్మార్ట్ రోడ్ల నిర్మాణం అన్నీ ఇందులోనే జరగనున్నాయి. అక్టోబర్ 31లోగా నగరంలో 10వేల గుంతలను పూడ్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డెడ్లైన్ విధించారు. అయితే.. వర్షాలు, నిర్మాణ నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. -
నవరాత్రుల సమయంలో అరుదైన దృశ్యం..! దుర్గమ్మ ఆలయానికి కాపాలాగా..
ఇప్పుడు బనానా ఏఐ నయా ట్రెండ్తో ఏది రియల్, ఏది ఫేక్ పోటో/వీడియోనో గుర్తించడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లు నమ్మశక్యం కానీ గందరగోళానికి గురిచేసింది. అందులోనూ శరన్నవరాత్రుల సమయంలో ఇలాంటి కమనీయ దృశ్యం కంటపడితే..దుర్గమ మహిమ లేక ఇది నమ్మదగినది కాదో అన్న సందేహాలను లేవనెత్తింది భక్తుల్లో. చివరికి అది ఫేక్ కాదని తేలాక..ఒక్కసారిగా 'మా దుర్గ' అన్న నామస్మరణతో భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇంతకీ ఏంటా అపురూపమైన దృశ్యం అంటే..ఒక దుర్గమ్మ ఆలయం వెలుపల కాపలా కాస్తున్న సింహం వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. మొదట చూడగానే అందరూ ఏఐ మాయ అనుకున్నారు. కానీ దాని గురించి సాక్షాత్తు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేయడంతో అది రియల్ అని నమ్మారు. ఆ దైవిక దృశ్యం చూడటం అదృష్టం అన్నంతగా బావించారు నెటిజన్లు. ఒక్కసారిగా నెట్టింట ఆ ఆలయానికి ఆ సింహం రక్షణగా ఉందేమో అనే చర్చలు లేవనెత్తాయి. అయితే ఇది గిర్ అడవిలోనిదని, అక్కడ చాలా దుర్గమ్మ ఆలయాలు ఉన్నాయని, వాటికి కాపలాగా ఈ సింహలు ఉంటాయని ఓ నెటిజన్ పోస్ట్లో పేర్కొన్నాడు. అంతేగాదు గిర్ అటవీ ప్రాంతంలో తిరిగే ఈ సింహాలు మానవులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు. అవి గుజరాత్లోని సౌరాష్ట్రా ప్రాంతంలో కనిపించే అరుదైన సింహ జాతిగా అని పేర్కొనన్నారు నెటిజన్లు. ఇక ఆ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలకు ఆ వన్య ప్రాణులకు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ఆ వీడియో హైలెట్ చేస్తోందని అన్నారు. కాగా, భారతదేశంలో సింహాల జనాభా 2020లో 674 కాగా, 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 70 శాతంపైగా సింహాల సంఖ్య పెరిగిందని ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.What a divine sight. Look like that lioness is guarding the temple !! pic.twitter.com/bBlxlmKD4m— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 28, 2025 (చదవండి: అక్కడ అమ్మవారి నైవేద్యాన్ని పీర్లకు ప్రసాదంగా..! మతసామరస్యాన్ని ప్రతీకగా..) -
షాకింగ్ ఘటన.. స్నేహితుడి చితిని కర్రతో కొట్టి.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదనే కోపంతో ఓ వ్యక్తి చనిపోయిన తన స్నేహితుడి అంత్యక్రియల చితిపై కర్రతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మృతుడు అతని వద్ద నుండి తీసుకున్న రూ.50 వేలు రుణాన్ని తిరిగి చెల్లించకుండా మరణించడంతో.. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆ వ్యక్తి కర్రతో వచ్చి మరణించిన వ్యక్తిని కొట్టడంతో మృతుని భార్య, పిల్లలతో పాటు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక గందరగోళం నెలకొంది.గతం కొంతకాలంగా స్నేహితుల మధ్య రుణ వివాదం జరుగుతోంది. మృతుడు రెండు సంవత్సరాల క్రితం వ్యవసాయ పనుల కోసం రుణం తీసుకున్నాడు. పంట అమ్మిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడు. కానీ అనారోగ్యం కారణంగా అకస్మాత్తుగా మరణించాడు. తన స్నేహితుడు ఉద్దేశపూర్వకంగానే డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు.ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది కలియుగం.. స్నేహం కూడా వ్యాపారంగా మారింది” అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు “కోపం అర్థం చేసుకోగలిగినదే.. కానీ చితిపై కూడా దాడి చేయడం? అతి క్రూరం” అంటూ కామెంట్లు పెడుతున్నారు."Debt Beyond Death"I watched a video — it shocked me… and made me laugh too.A man was standing by a burning funeral pyre, furiously beating it with a stick and yelling:👉 “You won’t even find peace in hell — I’ll see you there too!”The reason for his rage?Unpaid debt.… pic.twitter.com/g5h41hnVPV— Manish Kumar ad 🇮🇳 (@ma427906099) September 28, 2025 -
దసరా వేడుకల్లో హద్దుమీరిన జంట.. వీడియో వైరల్
దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ నృత్యాలు, అమ్మవారి అవతారాలకు ప్రత్యేక పూజలు, రావణ దహనం.. ఇలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలను చూడటానికి విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఎన్నారై జంట చేసిన పాడు పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భా అనేది గుజరాతీ సంప్రదాయ నృత్యం. ప్రధానంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో హైలైట్ అవుతుంటుంది. ఇది దేవీ దుర్గాను ఆరాధిస్తూ.. వృత్తాకారంగా(సర్కిల్) నృత్యం చేస్తుంటారు. గర్భా నృత్యం భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందాన్ని ప్రతిబింబించే కళారూపం. అలాంటి నృత్యంలో పాల్గొన్న ఓ జంట ముద్దులతో నలుగురిలో హద్దులు దాటేసింది.గుజరాత్ వడోదరలో జరిగిన గర్బా వేడుకలో ఓ ఎన్నారై జంట చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యునైటెడ్ వే గర్భా పేరిట నిర్వహించిన వేడుకల్లో.. ప్రతీక్ పటేల్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గర్భా చేస్తూ అత్యుత్సాహంలో ముద్దులు పెట్టుకున్న వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. అది కాస్త వైరల్ కావడంతో సనాతన్ సంత్ సమితి తీవ్రంగా స్పందించింది. ధార్మిక భావాలను దెబ్బతీశారంటూ ఆ జంటపై అటలదారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు అయ్యింది. అయితే విమర్శల నేపథ్యంలో ఆ జంట స్పందించింది. చేసిన పనికి లిఖితపూర్వక క్షమాపణ ఇచ్చింది. ఇది మా తప్పే. ఇంతలా విమర్శలు వస్తాయని అనుకోలేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గత 16 సంవత్సరాలు ప్రతీక్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తాజా వీడియోపై విమర్శల నేపథ్యంలో ఆ జంట దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.The NRI couple has issued a formal apology after their kissing video at a Garba event in Vadodara went viral.The couple were called to the police station, they are Australian nationals of Indian origin. They issued a written apology.#GarbaControversypic.twitter.com/GiaLSsLY6V— ShingChana😯 (@BaanwraDil) September 28, 2025 -
"మైక్ లేదు, వాయిద్యాలు లేవు": అద్భుతమైన గర్భా నృత్యం..!
ప్రస్తుతం విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఆధునికతకు అద్ధం పట్టేలా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎక్కడ చూసిన డీజే మ్యూజిక్లు, అదిరిపోయ్ డ్రమ్స్ ధ్వనిలతో దద్ధిరిల్లిపోయేలా ధూం ధాంగా జరుపుతున్నారు. అలాంటిది అవేమి లేకుండా నాటి సంబరాన్ని గుర్తుకు చేసేలా అద్భుతంగా చేశారు. ఎంత లయబద్ధంగా ఉందంటే..ఇది గర్భా మ్యాజిక్ ఏమో అనొచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళలంతా సాంప్రదాయ గర్భా నృత్యం చేస్తూ అలరించారు. ఎలాంటి మైక్, మ్యూజిక్ సౌండ్స్ లేకపోయినా అద్భుతంగా ఉంది. కేవలంగా వారి చేతి చప్పట్లు, లయబద్ధంగా పాడుతున్న పాట..సహజత్వాన్ని ఉట్టిపడేలా సాగింది. చెప్పాలంటే సౌండ్ పొల్యూషన్కి తావివ్వని విధంగా ఆహ్లాదకంరగా నాటి మన సంప్రదాయ సంస్కృతిని గుర్తుచేసింది..ఈ గర్భా నృత్యం. ఆ వీడియోలో మహిళలంతా "అంబే మా కీ జై" అంటూ వృత్తాకారంలో చేస్తున్న నృత్యం ఎక్కడ బీట్ మిస్కాకుండా అలల ప్రవాహంలా సాగిపోతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు వాణిజ్యంతో ముడిపడిలేని గర్భా నృత్యమని కొనియాడారు. అంతేగాదు గర్బాను 'తరం' సమస్యగా మార్చాల్సిన అవసరం లేదని ఆ మహిళలు తమదైన శైలిలో చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Artistic Life with Preeti (@artisticlifewithpreeti) (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్!
అమెరికాతో అప్పటిదాకా ఉన్న భారత్ స్నేహబంధం.. ట్రంప్ 2.0 రాకతో ఒక్కసారిగా చేదెక్కింది. మిత్రదేశం అంటూనే సుంకాల మోత మోగించారాయన. అటుపై ఉక్రెయిన్ యుద్ధాన్ని వంక పెట్టుకుని రష్యాతో ఇండియా మైత్రిని తీవ్రంగా తిట్టిపోస్తూ వచ్చారు. దీనికి తోడు వాణిజ్య ఒప్పందంపై ఎటూ తేల్చకుండా నానుస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో.. ఈ చర్చల్లో పురోగతి, మోదీపై ప్రశంసలతో ఆయన వెనక్కి తగ్గారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన పాక్కు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దరిమిలా.. అమెరికా అధ్యక్షుడిని భారత్కు మిత్రుడిగా చూడడం ఇక కష్టమేనంటున్నారు పశ్చిమబెంగాల్లోని బహారంపూర్ ప్రజలు. మోదీ ఎంత స్నేహంగా ఉంటున్నా.. ట్రంప్ మాత్రం మోసం చేశారని రగిలిపోతున్నారు. ఆ కోపంతో అక్కడి దుర్గా పూజ మండపంలో ఏకంగా ట్రంప్ను మహిషాసురుడి అవతారంలో(Trump Demon Statue) ఏర్పాటు చేశారు. పూజా కమిటీ సభ్యుడు ప్రతీక్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఎంతో స్నేహంగా ఉంటున్నప్పటికీ ట్రంప్ సుంకాలు విధించి మోసం చేశాడు. మన దేశంపై అధర్మంగా వాణిజ్య యుద్ధానికి దిగాడు. అందుకే రాక్షసుడిగా చిత్రీకరించాం’’ అని అన్నారు. బహారంపూర్లోని ఖాగ్రా శ్మశాన ఘాట్ దుర్గాపూజా(Durga Puja Trump) కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విగ్రహాన్ని అసిం పాల్ అనే కళాకారుడు రూపొందించాడు. అయితే అది ట్రంప్ను దృష్టిలో ఉంచుకుని తానేం రూపొందించలేదని ఆయన అంటుండడం గమనార్హం. బహారంపూర్ మునిసిపాలిటీ మేయర్ నారు గోపాల్ ముఖర్జీ (టీఎంసీ) ఈ మండపాన్ని ప్రారంభించారు. దుర్గమ్మ సన్నిధిలో మహిషాసురుడిగా ట్రంప్ అనే విషయం తెలిసి భక్త జనం ఈ మండపానికి ఎగబడిపోతున్నారు. అయితే..కిందటి ఏడాది కూడా ఇదే మండపం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్జీకర్ హత్యాచార ఘటన నేపథ్యంలో ఆ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ రూపంతో మహిషాసురుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ట్రంప్ను భారత్లో రాక్షసుడిగానే కాదు.. దేవుడిగానూ కొలిచిన సందర్భం ఉందని మీకు తెలుసా?.. తెలంగాణలోని జనగాం కోన్నె గ్రామంలో బుస్సా కృష్ణ అనే రైతు ట్రంప్ ఫొటోను ఇంట్లో ఉంచుకుని పూజిస్తూ వచ్చాడు(Trump Temple India). ఆ మరుసటి ఏడాది 2019లో తన ఇంటి ప్రాంగణంలో రూ. 2 లక్షల వ్యయంతో 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. విగ్రహానికి నిత్యం పూలు, కుంకుమ, పాలాభిషేకం చేస్తూ వార్తల్లోకి ఎక్కాడు. అయితే 2020లో ట్రంప్ కరోనా బారినపడినప్పుడు ఆ బెంగతో మంచం పట్టి.. ఆపై గుండెపోటుతో కృష్ణ మరణించాడు. అటుపై ఆయన కుటుంబం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ వచ్చింది. అయితే.. తాజా టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ విగ్రహం గురించి పలువురు సోషల్ మీడియాలో ఆరా తీయడం గమనార్హం. -
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కావాలి.. ఓ రెండు రూపాయలు ప్లీజ్-‘బ్యూటీ క్వీన్’
విలాసవంతమైన ఐ ఫోన్ అంటే అందరికీ మోజే. అందులోనూ ఇటీవల అధునాతన ఫీచర్ల ఐఫోన్ 17 సిరీస్ను లాంచ్ చేసింది యాపిల్. దీంతో యాపిల్ లవర్స్లో మరింత క్రేజ్ పెరిగింది. దీనికోసం ఎగబడి, ఘర్షణకు దిగిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందు. ఎలాగైనా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను (iphone 17pro max) దక్కించుకునేందుకు కొన్ని అసాధారణ మార్గాలను ఎంచు కుంటున్నారు. తాజాగా దానం చేయండి ప్లీజ్.. అంటూ ఆన్లైన్లో అడుక్కుంటున్న ఒక ఇన్ఫ్లూయెన్సర్ (బ్యూటీ క్వీన్) వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అదేంటో చూద్దా రండి!ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్కు చెందిన కంటెంట్ సృష్టికర్త, 'బ్యూటీ క్వీన్' మహి సింగ్ తన అనుచరులను QR కోడ్ ద్వారా చిన్న మొత్తంలో విరాళంగా ఇవ్వమని అభ్యర్థించింది. ఒక్కొక్కరూ ఒక్కో రూపాయి, లేదా రెండు రూపాయల చొప్పున దానం చేస్తే, ఆ డబ్బులతో ఐఫోన్ 17 ప్రో మాక్స్ను కొనుక్కుంటానంటూ వేడుకుంటోంది. చదవండి: చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనేఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మూడు నెలల క్రితమే తన తండ్రి తనకు ఐఫోన్ 16 కొని ఇచ్చాడనీ, కానీ తాను తాజా మోడల్ కోసం అడిగినప్పుడు,నిరాకరించాడని చెబుతోంది. అక్టోబర్ 21న తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో, కొత్త ఐఫోన్ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కలర్ , డిజైన్ భలే నచ్చాయనీ, అది తన “కలల ఫోన్”గా అభివర్ణించింది. ఈ విషయంలో తనకు సపోర్ట్గా చేసిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపింది.भीख मांगने का नया तरीका है माही सिंह को 17 मैक्स प्रो मोबाइल चाहिए जिसके लिए पब्लिक से पैसा मांग रही हैं 😂#ModiBhajanlal4Rajasthan pic.twitter.com/sRNFGLYio5— Surendra Yadav (@Surendr0032083) September 25, 2025 దీంతో ఆన్లైన్లో చాలామంది ఆమెను తిట్టిపోస్తున్నారు. అడుక్కోవడానికి ఇదోమార్గం... పనికిమాలిన పని విమర్శించారు ఇలాంటి వారికి దానం చేస్తే పుణ్యం కంటే పాపమే వస్తుందని కొందరు, ఫాలోవర్స్ను పెంచుకునేందుకు ఇదో చీప్ ట్రిక్ అంటూ మరికొందరు. మండిపడ్డారు. మహి సింగ్ బ్యూటీ క్వీన్ అనే ఐడీతో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. -
వాలు జడ తోలు బెల్టు!
ఆయనో స్కూల్కు హెడ్మాస్టర్. ఓ మహిళా టీచర్ను వేధించారని ఆయనకు ఉన్నతాధికారి నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు ఆ అధికారి ఆఫీస్కు హెచ్ఎం వెళ్లారు. చేతిలో ఫైల్ను బల్లకేసి కొట్టి.. నడుముకు ఉన్న బెల్డ్ తీసి అధికారిని చితకబాదడం మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పెద్దసారుకు మద్దతుగా పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు రోడ్డెక్కడంతో ప్రభుత్వమే దిగి వచ్చింది!!..సీతాపూర్ హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ వ్యవహారం ఉత్తర ప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. సీతాపూర్ విద్యా శాఖ అధికారి(BSA) అఖిలేష్ ప్రతాప్ సింగ్ను వర్మ బెల్ట్తో బాదిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా వర్మ భార్య సీమ, స్టూడెంట్స్-పేరెంట్స్తో కలిసి స్కూల్ బయట నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అఖిలేష్పై సంచలన ఆరోపణలకు దిగారామె.అవంతిక గుప్తా మహ్ముదాబాద్లోని నద్వా ప్రైమరీ స్కూల్కి పోస్టింగ్ మీద వచ్చి చేరింది. అయితే ఆమె బడికి రెగ్యులర్గా రావడం లేదు.దీంతో.. హెడ్మాస్టర్ బృజేంద్ర కుమార్ వర్మ ఆమె నుంచి వివరణ కోరాడు. అయితే.. ఆమె నేరుగా బదులివ్వకుండా సీతాపూర్ BSA కార్యాలయం నుంచి ఫోన్ చేయించింది. ఆమె బడికి రాదని.. అయినా అటెండెన్స్ వేయమని బీఎస్ఏ అధికారి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఆదేశించాడు. ఆమె నిత్యం తన ఇంటి ముందు నుంచే వెళ్తోందని.. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్పాలని వర్మ అభ్యంతరం చెప్పాడు. ఎవరైనా అడిగితే మెడికల్ లీవ్లో ఉందని చెప్పమంటూ అఖిలేష్ ఫోన్ పెట్టేశాడు. అయితే..హెచ్ఎం వర్మ మాత్రం ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు. ఇది అవంతిక, అఖిలేష్లకు కోపం తెప్పించింది. అప్పటి నుంచి వర్మను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె వర్మపై అఖిలేష్కు వేధింపుల ఫిర్యాదు చేయడంతో పరిస్థితి మరోలా మారింది. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంతో.. వర్మకు పట్టరాని కోపం వచ్చింది. అంతే దాడి చేశారు.. అని వర్మ సతీమణి సీమ మీడియాకు వివరించారు. ఈ క్రమంలో.. వర్మ-అఖిలేష్ మధ్య ఫోన్ సంభాషణను ఆమె మీడియాకు విడుదల చేశారు.UP govt headmaster slams file, flogs BSA using beltIn UP's Sitapur, a primary school headmaster Brijendra Kumar Verma was summoned by the Basic Siksha Adhikari (BSA) Akhilesh Pratap Singh over a complaint registered against Verma. Verbal argument ensued. Headmaster Verma… pic.twitter.com/8YGiFBTmfw— Piyush Rai (@Benarasiyaa) September 23, 2025 ఇదిలా ఉంటే..పిల్లలు-తల్లిదండ్రుల నిరసనలతో ప్రభుత్వం కదిలొచ్చింది. బీఎస్ఏ అఖిలేష్ను విధుల నుంచి తొలగిస్తూ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి వర్మకు వేధింపులు ఎదురైన మాట వాస్తవమేనని ప్రకటించారు. ఇంకోవైపు.. సోషల్ మీడియాలో హెచ్ఎం వర్మకు సపోర్టుగా పలువురు పోస్టులు చేయసాగారు. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన అవంతికను విద్యాశాఖ సస్పెండ్ చేయగా.. ఆమె పరారీలో ఉన్నట్లు సమాచారం. అవంతిక-అఖిలేష్కు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు. అయితే ఆమె స్టూడెంట్స్తో కలిసి రీల్స్ చేసిన వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఇదిగో ఇ–రిక్షా సోషల్ మీడియా సెంటర్!‘
అప్పు చేసి ఇ–రిక్షా కొన్నాడు సుమిత్ తండ్రి. ఆ అప్పు తీరకుండానే ఆయన మంచం పట్టాడు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్ ప్రజాపతి( Sumit Prajapati) కు ఇ–రిక్షాయే దిక్కు అయింది. దిక్సూచి అయింది. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 22 సంవత్సరాల సుమిత్ ప్రజాపతి ఇ–రిక్షాను సోషల్ మీడియా సెంటర్గా చేసుకొని కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాడు...గ్యాస్స్టవ్ వెలిగించే క్రమంలో సుమిత్ తండ్రి అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదం వల్ల అతడు రిక్షా నడపలేని పరిస్థితి. మరోవైపు రిక్షా కోసం చేసిన అప్పులు. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తూనే ‘ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.పేదరికం వల్ల చిన్నప్పుడు పొలం పనులు, కూలీ పనులు చేశాడు సుమిత్. కార్లు కడిగాడు. కూరగాయలు అమ్మాడు. తన పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదని ఎన్నో పనులు చేశాడు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అయితే విధి నిర్ణయం మరోలా ఉంది’ అంటాడు సుమిత్.తండ్రికి ఆసరాగా ఉండడానికి ఒకరి దగ్గర ఉద్యోగంలో చేరాడు. చెప్పిన జీతంలో సగం జీతం కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగం మానేయ్యడమే కాదు ఇక ఎప్పుడూ ఉద్యోగం చేయకూడదనుకున్నాడు. చాలామంది యువకులలాగే సుమిత్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేసేవాడు. తండ్రి ప్రమాదానికి గురి కావడంతో ఇ–రిక్షా నడపాలనుకున్నాడు సుమిత్. ‘ఇ–రిక్షా, సోషల్ మీడియాను ఒకేచోట చేరిస్తే’ అనే దిశలో ఆలోచించాడు. కార్లు, బైక్లపై కంటెంట్ను క్రియేట్ చేసేవారు ఉన్నారు. ఇ–రిక్షాపై ఎవరు చేయలేదు కాబట్టి కొత్తగా ఉంటుంది అనుకున్నాడు. View this post on Instagram A post shared by Sumit Prajapati (@sumit_prajapati87) ‘నా రిక్షాను స్టార్ ఎందుకు చేయకూడదు అనుకున్నాను’ నవ్వుతూ గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు సుమిత్. కంటెంట్ క్రియేటర్గా అతడి వైరల్ మూమెంట్ గురించి చెప్పుకోవాలంటే...తన కుటుంబసభ్యులు ఒక పెళ్లి వేడుకలో పాల్గొనడానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మిలియన్ వ్యూస్ వచ్చాయి.‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఈ వీడియోలు ఏమిటి! నిన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వెక్కిరిస్తారు’ అని తండ్రి అన్నాడు. కొన్ని అనుభవాల తరువాత ఆయన మాటలు వాస్తవం అనే విషయం అర్థమైంది. ‘ప్రజలు చిన్న చూపు చూడకుండా, అభిమానించేలా కంటెంట్ క్రియేషన్ చేయాలి’ అనుకున్నాడు. నవ్వించడానికి ఒకప్పుడు ఏవేవో వీడియోలు చేసిన సుమిత్ ఆ తరువాత రూట్ మార్చాడు. వ్యక్తిత్వవికాస వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బ్రాండ్లకు సంబంధించి రిక్షాలో ప్రమోషన్ వర్క్ కూడా చేస్తుంటాడు.‘ఏ పనీ చిన్నది కాదు. మనం చేసే ప్రతి పని పెద్దదే. గౌరవనీయమైనదే’... ఇలాంటి మాటలెన్నో తన వ్యక్తిత్వ వికాస వీడియోల్లో వినిపిస్తుంటాడు సుమిత్. తాజా విషయానికి వస్తే...తనకు వచ్చే ఆదాయంతో సుమిత్ కుటుంబ అప్పులన్నీ తీర్చాడు. చెల్లిని చదివిస్తున్నాడు. సుమిత్కు ఇన్స్టాగ్రామ్లో 87వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.చదవండి : ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీమొదట చిన్న లక్ష్యాలు... ఆ తరువాత పెద్ద లక్ష్యాలు ఇక నా పనిఅయిపోయినట్లే’ అని నేను ఎప్పుడూ నిరాశపడలేదు. నిలదొక్కుకోవడం కోసం ఎంత చిన్న పనైనా చేయాలనుకున్నాను. కూలి పనులు కూడా చేశాను. ఒకేసారి పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాను. ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్లాను. అప్పుల భారంతో మా సొంత ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. తిరిగి ఆ ఇంటిని కొనాలనేది నా కల. – సుమిత్ ప్రజాపతి -
'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!
టెక్నాలజీ ఎన్నో ఆలోచనలకు తెరతీస్తుంది. సాంకేతిక సాయంతో దూరంగా ఉన్న తమ వాళ్లను తమవద్దకు చేర్చుకునేలా కొందరు భలే ఉపయోగిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఈ టెక్నాలజీని మన సంతోషాలకు, సంబరాలకు అనుగుణంగా మార్చుకుంటూ..ఇలా కూడా వాడుకోవచ్చా అని విస్తుపోయేలా చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఏం ఉందంటే..అసలేంటి కథ అంటే..విదేశాల్లో నివశించే చాలామంది భారత్లో జరిగినట్లు సంస్కృతి సంపద్రాయలకు అనుగుణంగా సంబరంగా జరిగే పండుగలను మిస్ అవుతుంటారు. ఒకవేళ అక్కడ భారత కమ్యూనిటీలంతా ఒకచోట చేరి చేసుకున్న మన దేశంలో ఉన్న మాదిరి ఆనందమైతే మిస్ అయిన వెలితి తప్పక ఉంటుంది. ఇక్కడ ఉండే పండుగ కోలాహలం, సందడి..అక్కడ ఉండదు. అత్యంత నిశబ్దంగా జరిగిపోతుందంతే. అలా ఉసురుమనుకుండా హాయిగా ఎంజాయ్ చేసేలా..సరికొత్త మార్గాన్ని పంచుకున్నాడు కంటెంట్ క్రియేటర్, నటుడు విరాజ్ ఘేలాని. ఈ నవరాత్రిని తన ఇద్దరు ఎన్ఆర్ఐ స్నేహితుల మిస్ అవ్వకుండా..వారి ఫోటోలను చెరో చేతిలో పెట్టుకుని సంబరంగా గర్భా డ్యాన్స్ చేశాడు. తన స్నేహితులు మిస్ అవ్వకుండా వాళ్లు కూడా ఎంజాయ చేస్తున్నారనిపించేలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నవరాత్రిని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నా, అలాగే తన స్నేహితులు ఈ పండుగ మిస్ అయ్యానని బాధపడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశానంటూ చెప్పుకొచ్చాడు నటుడు విరాజ్ వీడియోలో. మీరు ఇలాంటి డిజిటల్ గర్భాలో పాల్గొనేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే వివిధ కారణాల రీత్యా విదేశాల్లో ఉన్నవాళ్లు నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు అని క్యాప్షన్ జోడించి మరి అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశాడు. అయితే నెటిజన్లలో చాలామంది తమ దేశానికి దూరంగా ఉన్నమనే ఫీల్తో ఉన్నవాళ్లందరి మనసులను తాకింది ఈ వీడియో. కానీ మరికొందరూ బాస్ భారత్లో తొమ్మిది రోజులే గర్భా డ్యాన్స్ చేస్తారు, అదే కాలిఫోర్నియాలో నెలల తరబడి ఆ డ్యాన్స్ చేస్తామంటూ వ్యంగంగా పోస్టులు పెట్టారు. ఏదీఏమైనా ఈ ఆలోచన మాత్రం అదుర్స్. చిన్న చిన్న పొరపచ్చలు సైతం ఇలా మనవాళ్లని భాగస్వామ్యం చేస్తే బాంధవ్యం బలపడటమే కాదు వాళ్లు ఖుషి అవుతారు. View this post on Instagram A post shared by Viraj Ghelani (@viraj_ghelani) (చదవండి: పేపర్ పువ్వులతో భారత సంతతి మహిళ గిన్నిస్ రికార్డు..!) -
ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్
ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ కో ఫౌండర్, సీఈవో శామ్ ఆల్ట్మన్ (Sam Altman) ఖరీదైన తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. హవాయిలోని బిగ్ ఐలాండ్లోని తన సముద్ర తీర భవనాన్ని విక్రయిస్తున్నట్లు ఫోర్బ్స్ నివేదించింది. అసాధారణమైన అధునాతమైన భద్రతా ఫీచర్లు కలిగి ఉన్న ఈ భవనాన్ని రెండు వారాల క్రితం అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.10 బెడ్రూమ్ల ఈ ఎస్టేట్ రూ. 434.63 కోట్ల విలువ చేస్తుంది. అమ్మకాన్ని నిర్వహిస్తున్న సోథెబీ ఏజెంట్ బ్రియాన్ ఆక్సెల్రోడ్ దీనిని "నా కెరీర్లో నేను చూసిన అత్యంత అద్భుతమైన ఆస్తి" అని అభివర్ణించారు. ఆ ఆస్తి బిగ్ సర్ఫ్ LLC కింద నమోదు చేయబడిందని పబ్లిక్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థ గతంలో ఆల్ట్మాన్ శాన్ ఫ్రాన్సిస్కో నివాసానికి అనుసంధానించబడి ఉంది. ప్రస్తుతం అతని నాపా వ్యాలీ రాంచ్, వెంచర్ క్యాపిటల్ కార్యకలాపాలకు అనుసంధానించబడి ఉంది.చదవండి: సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు2011లో నిర్మించిన ఈ ఎస్టేట్లో ఐదు బెడ్రూమ్ల గెస్ట్హౌస్, 10 బాత్రూమ్లు, ఒక ప్రైవేట్ బీచ్, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి. తాజావార్తలపై లిస్టెడ్ మేనేజర్ఆల్ట్మన్ కజిన్ జెన్నిఫర్ సెరాల్టా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అటు OpenAI కూడా ఇంకా నిర్ధారించ లేదు.ఆల్ట్మన్ 2021లో హవాయి ఎస్టేట్ను సుమారు రూ. 381.41కోట్ల కొనుగోలు చేశాడు. అదే సమయంలో తన శాన్ ఫ్రాన్సిస్కో ఇంటిని 27 మిలియన్ డాలర్లకు, 950 ఎకరాల నాపా రాంచ్ను 16 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఫోర్బ్స్ ప్రకారం ఆల్ట్మన్ నికర ఆస్తుల విలువ రూ. 17,739.90 కోట్లుగా అంచనా. ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ -
ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు. పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్బా తన భార్య జయా బచ్చన్ హైట్పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. -
కర్ణుని మాదిరి జననం..! కట్చేస్తే ఇవాళ స్టార్ రేంజ్ క్రేజ్..
మనం ఎలా పుట్టామన్నది కాదు..మన జీవితాన్ని ఎలా మలుచుకున్నామనేది ముఖ్యం. అది మన రేంజ్ని, ఉనికిని తెలియజేస్తుంది. అదే ప్రూవ్ చేసింది పాక్ అమ్మాయి. పుట్టింది పాక్లో..ఫేమస్ అయ్యింది చైనాలో. ఎంతలా ఆమెకు సోషల్ మీడియా క్రేజ్ ఉందంటే..ఓవర్నైట్ స్టార్ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారామెకు. ఇంతకీ ఎవరా అమ్మాయంటే..ఆ అమ్మాయే 20 ఏళ్ల ఫ్యాన్ జిహే. పాకిస్తాన్ మూలాలకు చెందిన ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జననం అచ్చం కర్ణుని మాదిరిగా జరిగింది. ఎలా మహాభారతంతో కుంతీదేవి కర్ణుని ఒక పెట్టేలా వదిలేసిందో అలా ఫ్యాన్ పాక్ తల్లిదండ్రులు పుట్టగానే ఒకకార్డుబోర్డు పెట్టేలో వదిలేశారు. అయితే పాక్లో పనిచేస్తున్న చైనా దంపతులుకు ఆశిశువు దొరికింది. పిల్లలు లేకపోవడంతో ఆ చిన్నారిని చైనా దంపతులు దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలా ఫ్యాన్ చైనాలోని హెనాన్ అనే గ్రామంలో పెరిగింది. ఆ దంపతులు తిరిగి చైనాకి వచ్చి స్థిరపడటంతో ఆమె బాల్యమంతా చైనా దేశంలోనే సాగింది. 2023 ఆమె లైఫ్ ఊహించిన మలుపు తిరిగింది. సరదాగా తన గ్రామీణ నేపథ్యం యాసలో మాట్లాడుతూ న్యూడిల్స్ ఆస్వాదిస్తున్న వీడియోని సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోవడమే కాదు ఆమె సోషల్ మీడియా అకౌంట్కి మిలియన్ల కొద్ది చైనా ఫాలోవర్లు సంపాదించుకుంది. వ్యవసాయ కుటుంబ జీనవ విధానం, అలాగే ఆ గ్రామంలో లభించే స్థానిక ఉత్పత్తులు వాటికి సంబంధించిన వీడియోలతో చైనా ప్రజలకు మరింత చేరువైంది. దాంతో ఆమె విశాల హృదయానికి వేలాదిమంది అభిమానులుగా మారడమే గాక ఆమె వీడియోలకు మంచి క్రేజ్ పెరిగింది. అలా తన వీడియోలకు వీరాభిమాని అయినా లియు జియావోషుయ్ అనే అతడిని కామన్ స్నేహితుల ద్వారా కలుసుకుంది. అలా పరిచయమైన అతడు కాస్త ఆమె జీవిత భాగస్వామి అయ్యాడు. ఈ నెల సెప్టెంబర్ 17న వివాహ బంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. అంతేగాదు,ఫ్యాన్ ఆన్లైన్లోక్రేజ్ తగ్గకుండా ఉడేలా ఆమె వీడియోలను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల తోపాటు ఆమె తల్లిదండ్రుల బాగోగులను చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు. అందుకోసమే తన జాబ్ని కూడా వదిలేసుకున్నాడు లియు. మరో విశేషం ఏంటంటే ఆ దంపతులు అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాదు అలంకరణ కోసం సముద్ర నేపథ్య అంశాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే తన భార్య ఫ్యాన్ ఇంతవరకు సముద్రాన్నే చూడలేదన్న ఉద్దేశ్యంతో అట. ఈ సందర్భంగా పాక్ మూలాలున్న చైనా అమ్మాయి ఫ్యాన్కి అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్తడమే కాకుండా వారి పూర్తి మద్దతును అందించారు. పైగా ఫ్యాన్ అబిమానులు తామెంతో ముద్దుగా పిలచుకునే "ఫెయిరీ టేల్ ప్రిన్సెస్" (రాకుమారి)ని యువరాణిలా చూసుకోవాలని లియుకి నొక్కి చెప్పడం విశేషం. ఈ స్టోరీ.. మన బ్యాగ్రౌండ్ ఎలాంటిదైనా..మన టాలెంట్, కష్టపడేతత్వంతో మన ఉనికిని చాటుకునేలా బతకొచ్చని ప్రూవ్ చేసింది ఈ అందమైన టీనేజర్. (చదవండి: Sandeep Jangala: క్రికెట్ టు క్లౌడ్ కిచెన్ కమ్ కేఫ్..! చివరికి దేశంలోనే తొలి మిల్లెట్ కేఫ్గా..) -
తాతకు నివాళిగా పోస్ట్...హత్యకు దారి తీసిన ‘లాఫింగ్’ ఇమేజ్
గుజరాత్లోని రాజ్కోట్లో ఫేస్బుక్ పోస్ట్ ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. బాధితుడిని బిహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్మీడియాలో పాటించాల్సిన కనీస మర్యాద, సభ్యత, సంస్కారాలకు నిదర్శనం ఈ ఘటన.20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ బీహార్కు చెందినవాడు. మరో ముగ్గురు బంధువులతో కలిసి గుజరాత్లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం కాలం చేసిన తన తాత రూప్నారాయణ్ భింద్ను గుర్తుచేసుకుంటూ ఫేస్బుక్లో ఒక కథనాన్ని అప్లోడ్ చేశాడు ప్రిన్స్. అయితే బీహార్కు చెందిన ప్రిన్స్ పరిచయస్తుడు బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ అనుచితంగా రియాక్టయ్యాడు. ప్రిన్స్ పోస్ట్కు నవ్వుతున్న ఎమోజీతో పోస్ట్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది.మొల్లగా ఫోన్లోమొదలైనఘర్షణ ముదిరి భౌతిక దాడికి దారి తీసింది.ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి, 12:30 గంటల ప్రాంతంలో, ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ వెలుపల ఆటో రిక్షాలో కూర్చుని బిపిన్ దాడిచేశాడు. దీంతో ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి తిరిగి వెళ్లిపోయాడు. కానీ మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో, బిపిన్ ప్రిన్స్ను కత్తితో పొడిచాడు. ప్రిన్స్ అరుపులు విన్న అతని సహచరులు వెంటనే అతనికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై రాజ్కోట్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాలుగు రోజులకు పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సెప్టెంబర్ 22నకన్నుమూశాడు. చనిపోవడానికి ముందు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.చదవండి: మిలన్ ఫ్యాషన్వీక్ : రొటీన్గా కాకుండా బోల్డ్ లుక్లో మెరిసిన ఆలియాప్రిన్స్ వీపుపై అంగుళంన్నర, రెండు అంగుళాల లోతు గాయం ఉందని పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన గుజరాత్ పోలీసులు కీలక నిందితుడిని అరెస్టు చేశారు, మరొకరు పరారీలో ఉన్నారు. -
'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!
దేశం మొత్తం నవరాత్రుల సందడితో ఉంది. ఎటుచూసిన దాండియా, గర్భా నృత్యాలతో పండుగా వాతావరణంతో కళకళలాడుతోంది. ఈ పండుగను ఒకే దేశంలో పలు విధాలుగా జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంలా ఉండే మన సంస్కృతిక సంపద్రాయాన్ని గౌరవిస్తూ..నృత్యం చేసి నెటిజన్ల మనసును దోచుకున్నాడు ఈ అమెరికన్ ఇన్ఫ్లుయెన్సర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆవీడియోలో ప్రుమఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికీ పాండ్ గంగూబాయి కతియావాడిలోని ప్రసిద్ధ పాట 'ధోలిడా'కి నృత్యంకి నటి ఆలియా భట్ని తలపించేలా డ్యాన్స్ చేశారు. తన లివింగ్ రూమ్లో సాధారణ డ్రెస్ వేర్లో ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు. అంతేగాదు ఆయన ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ..నవరాత్రి శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఆన్లైన్లో అతని అభిమానుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చిపెట్టింది. అతని ఎనర్జీకి నెటిజన్లు ఫిదా అవ్వుతూ..వేరే దేశం నుంచి వచ్చి భారతీయ సంస్కృతిని స్వీకరించడం నిజంగా చాలాగ్రేట్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరూ గుజరాత్కు రండి ఇక్కడ నవరాత్రి పండుగను ఆస్వాదించండి, మీ రాకకై ఎదురుచూస్తున్నాం అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) (చదవండి: అగరుబత్తీలు వెలిగిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం!) -
వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలిన పాపులర్ నటుడు
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రాంలీలా ప్రదర్శన జోరుగా సాగుతోంది. ఆధ్యాత్మిక పరవశంలో మునిగి వున్న చంబా చౌగన్ మైదానంలో చారిత్రాత్మక శ్రీరామలీలలో ఒక్కసారిగా కలకలం రేగింది. దశరథుడిగా నటిస్తున్న 73 ఏళ్ల వృద్ధ నటుడు ప్రదర్శన సమయంలో గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలొదిలేసిన వైనం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.స్థానిక పాపులర్ నటుడు అమ్రేష్ మహాజన్(శిబు) వేదికపైనే కుప్పకూలిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లోని చంబాలోని శ్రీరాంలీలాలో దశరథుడిగా నటిస్తున్న అమ్రేష్ మహాజన్ సింహాసనంపై ఉండి డైలాగులూ చెబుతూనే ఋషి పాత్ర నటిస్తున్న సహనటుడి భుజంపై వాలిపోయాడు. అంత సీనియర్ నటుడు తనపై వాలిపోవడంతో సహనటుడికి తొలుత ఏమీ అర్థం కాలేదు. పదంటే పది సెకన్లలో ఏమి జరిగిందోగ్రహించి సహాయం కోసం అర్థించడం, అతడిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే ఆయన జీవిత నాటకానికి తెరపడిపోయింది. దీంతో సహ నటులు , ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. A man playing the role of King Dashrath collapsed and died on stage during the Ramleela in Chamba district of Himachal Pradesh. pic.twitter.com/6bThTX2LIk— Piyush Rai (@Benarasiyaa) September 24, 2025 మొఘలా మొహల్లా నివాసి గత 40 సంవత్సరాలుగా చారిత్రాత్మక వేడుకల్లో పాల్గొంటున్నాడు. శ్రీరామలీలాలో సాధారణంగా ఆయన రాముడి తండ్రి దశరథుడిగా లేదా రామాయణంలో మరో కీలక కేరెక్టర్ రావణుడి పాత్రలను పోషించేవాడు. వయసు మీద పడినప్పటికీ, ప్రతీ ఏడాదిరిహార్సల్స్ చేసి మరి గొప్ప ప్రదర్శనలో ప్రదర్శన ఇచ్చేవాడు. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంలో ఉన్నారు. అయితే యాదృచ్చికంగా న చివరి రాంలీలా అవుతుందని, దీని తర్వాత తాను తప్పుకుంటానని నిర్వాహకులకు చెప్పినట్లు తెలుస్తోంది. దురదృష్టవశాత్తూ అదే చివరి ప్రదర్శన అయింది.మహాజన్ వేదికపైనే ఆకస్మికంగా మరణించడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని చంబాలోని శ్రీ రామ్ లీలా క్లబ్ అధ్యక్షుడు స్వపన్ మహాజన్ విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది ఢిల్లీలోని షాదరాలో రామ్లీలా ప్రదర్శన సందర్భంగా రాముడి పాత్ర పోషించిన నటుడు సుశీల్ కౌశిక్ గుండెపోటుతో ఛాతీని గట్టిగా పట్టుకుని, వేదికపైనుంచి బయటకు వెళ్లి కుప్పకూలి మరణించిన సంగతి తెలిసిందే. -
మీకోసం ఆపేశారు
న్యూయార్క్: దేశాధ్యక్షుడి వాహన శ్రేణి వెళ్తోందంటే ఆ రహదారి మార్గంలో వెళ్లే వాహనాలను పక్కకు ఆపేసి అధ్యక్షుడి కాన్వాయ్కు మాత్రమే దారి వదులుతారు. అలా కాన్వాయ్ మొత్తం వెళ్లేంతవరకు ఆగిపోయిన ట్రాఫిక్లో సామాన్య ప్రజానీకం ఉసూరుమంటూ వేచి ఉండాల్సిందే. అదే సామాన్య ప్రజానీకం మధ్యలో మరో దేశ అధ్యక్షుడు చిక్కుకుపోవడం నిజంగా అరుదైన ఘటనే. ఈ అరుదైన ఘటనలో మరో అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ వెళ్లేదాకా ఎంతటి దేశాధ్యక్షుడైనా రహదారిపై కారులో వేచి ఉండక తప్పదని అమె రికన్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మేక్రాన్ నడిరోడ్డుపై కారులో వెయిట్ చేశారు. ఎంతకీ ట్రంప్ వాహనశ్రేణి క్రాసింగ్ పూర్తికాకపోవడంతో విసిగెత్తిన మేక్రాన్ కారు నుంచి బయటికొచ్చి అక్కడి పోలీసులతో అసలు విషయంపై ఆరాతీశారు. ఈ ఘటనకు సోమవారం రాత్రి న్యూయార్క్ వేదికైంది.అసలేమైంది?ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు మేక్రాన్ అమెరికాకు వచ్చారు. న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రాత్రి బసచేసేందుకు ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బయల్దేరారు. ఇలా తన సొంత కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు న్యూయార్క్ నగర పోలీసులు ఈ కాన్వాయ్ను అడ్డుకుంది. ఇదే మార్గంలో ట్రంప్ కాన్వాయ్ వెళ్లబోతోందని, అది వెళ్లేదాకా పక్కకు ఆగి వేచి ఉండాలని వాహన శ్రేణి డ్రైవర్లను న్యూయార్క్ సిటీ పోలీసులు ఆదేశించారు. ఎదుట ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోనని కాసేపు వేచిచూసిన మేక్రాన్ ఎంతకీ ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసిగెత్తి కారు నుంచి కిందకు దిగి ఎదురుగా ఉన్న పోలీసుల వద్ద విషయం ఆరాతీశారు. వాళ్లు తాపీగా అసలు విషయం చెప్పారు. ‘‘ మీరు మమ్మల్ని క్షమించాలి. రహదారులపై సాధారణ ప్రజల వాహనాలన్నింటినీ ఆపేశాం. ఇదే మార్గంలో మా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ రాబోతోంది’’ అని మేక్రాన్కు ఒక పోలీస్ అధికారి వివరించారు. దీంతో చేసేదిలేక మేక్రాన్ రోడ్డు బారీకేడ్ దగ్గర నిల్చుని సరదాగా అయినా మాట్లాడదామని నేరుగా ట్రంప్కు తన మొబైల్ నుంచి ఫోన్చేశారు. వెంటనే అటు వైపు నుంచి ట్రంప్ ఫోన్ ఎత్తారు. ‘‘ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరిగిందో ఊహించగలరా? మీ కాన్వాయ్ వెళ్తోందని రోడ్లపై కార్లను ఆపేశారు. దీంతో నేను నడిరోడ్డుపై ఆగిపోయా. మీ కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంబసీకి వెళ్దామని వేచిచూస్తున్నా’’ అని మేక్రాన్ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న ట్రంప్ ఫక్కున నవ్వారేమో మేక్రాన్ కూడా ఫోన్లో విపరీతంగా నవ్వుతూ కనిపించారు. ఈ తతంగాన్ని∙మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో బంధించాయి. కారు వదలి కాళ్లకు పనిచెప్పి..ఇంత జరిగిన తర్వాత కొద్దిసేపటికి ట్రంప్ కాన్వాయ్ అదే మార్గంలో వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత వాహనాలకు పోలీసులు దారి విడవలేదు. పాదచారులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది చూసిన మేక్రాన్ ఇక కారు ఎక్కొద్దని నిర్ణయించుకుని తను కూడా నడుచుకుంటూ ముందుకెళ్లారు. నడుస్తున్నంతసేపూ ట్రంప్తో మేక్రాన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూసిన న్యూయా ర్క్ ప్రజలు ఒకింత ఆశ్చర్యం మరికొంత ఆనందానికి గురయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని వృథాచేసుకోవద్దని వెంటనే కొందరు పాదచారులు మేక్రాన్తో సెల్ఫీలు దిగారు. మేక్రాన్ సైతం ఏమాత్రం అసహనం వ్యక్తంచేయలేదు. సరదాగా వాళ్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగి వారి యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. ఒకావిడ ఏకంగా మేక్రాన్ నుదుటిపై ముద్దు పెట్టుకుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఒక జంటతో మేక్రాన్ ఫొటో దిగాల్సి ఉండగా అక్కడే ఉన్న ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి, రాయబారి జెర్మీ బోనాఫాంట్ ఆ ఫొటో తీయడం విశేషం. మేక్రాన్ పాదయాత్ర వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. Macro vs Trump Funny Fight 😂🚨Macron was stopped by the New York Police, because of Donald Trump.Macron called Trump and said -"I'm waiting outside right now because everything is blocked for you (motorcade)"He had to walk to the French Embassy, for 80th UNGA.Video 📷 pic.twitter.com/UHFR7ivsCg— Mayank (@mayankcdp) September 23, 2025 -
'ఆ వయసులోనూ ఇంత అందంగానా'..? విస్తుపోయిన బరాక్ ఒబామా
సుదీర్ఘకాలం బతికి రికార్డులు సృష్టించి వృద్ధుల గురించి వార్తల్లో తెలసుకోవడమే గానీ నేరుగా చూసిన దాఖలాలు ఉండవు. కానీ అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు అలాంటి వృద్ధురాలిని కలవడమే కాదు, ఆమెతో మాటలు కలిపారు. అయితే ఒబామా- బామ్మతో సంభాషించిన మాటలు నెట్టింట హాట్టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయనేం మాట్లాడారంటే..102 ఏళ్ల సుసాన్ అనే బామ్మని కలిసి ఆమెతో మాటలు కలిపారు. ఆమెను చూడగానే ఒబామా మీరు ఈ వయసులో ఇంత అందంగా కనిపించడంలోని సీక్రేట్ ఏంటని నేరుగా ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వే సమాధానంగా నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత ఒబామా నేను మిమ్మల్ని కలిసి ఏ అడగాలనుకుంటున్నానో మీకు తెలుసు అని నవ్వేశారు. అయినప్పటికీ అడుగుతున్నా..ఇంతటి వృద్ధాప్యంలోనూ అందంగా ఉన్న మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది . అయితే ఇంతలా ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఏం తింటారు. బహుశా మీ డీఎన్ఏ మంచిదేమో అంటూ చమత్కిరించారు. దానికి ఆ వృద్ధురాలు సుసాన్ నవ్వుతూ.. ఆకుకూరలు, కార్న్ బ్రెడ్ అని మెల్లిగా చెప్పింది. ఆ వృద్ధురాలని పర్యవేక్షించే ఆమె కూడా ఆ సంభాషణలో జోక్యం చేసుకుంటూ..ప్రతి ఉదయం బేకన్ అని చెప్పింది. అందుకు ఒబామా ఒక్కసారిగా నవ్వేశారు. బహుశా ఇది డాక్టర్లు సూచన కదూ అని చమత్కరించారు. చివరగా ఆ వృద్ధురాలు మీరు నన్ను చూడటానికి వచ్చినందుకు కృతజ్ఞుతురాలిని అని హృదరపూర్వకంగా అందామె. ఇక ఒబామా ఆమెకు వీడ్కోలు చెబుతూ..ఆమె చేతిని ముద్దుపెట్టుకున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులను కలవడం అస్సలు మిస్ అవ్వను అని ఆమెకు చెబుతూ నిష్క్రమించారు. అందుకు సంబంధించిన వీడియోకి ఒబామా "102 ఏళ్ల వయసులో నేను కూడా మీ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నా" అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేశారు. Susan, I hope I look as good as you at 102! pic.twitter.com/01CSm85krS— Barack Obama (@BarackObama) September 22, 2025 (చదవండి: స్వచ్ఛమైన భక్తి' కోసం అలాంటి పాట..! ప్రదాని మోదీ ఆసక్తికర ట్వీట్) -
భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోతుందా..?
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్స్టైల్నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. అది నెట్టింట వైరల్గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. అవేంటంటే..చీర నెమ్మదిగా తన వార్డ్రోబ్లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. అలాగే విక్టోరియాలో భారత్లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty) (చదవండి: భారత్లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
వయసులకు అతీతం.. ఆధ్యాత్మిక పర్యాటకం..
నగరవాసుల్లో తీర్థయాత్రల ఆసక్తి ఏ ప్రతి యేటా పెరుగుతోంది. విశేషం ఏమిటంటే ఈ ఆసక్తి వయసులకు అతీతంగా వ్యక్తమవుతోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగా తీర్థయాత్ర ధోరణులపై ప్రముఖ టూర్ ఆపరేటర్ మేక్మైట్రిప్ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యధిక శాతం మంది చేసిన యాత్రల్లో.. ప్రయాగ్రాజ్ (ఉత్తరప్రదేశ్), వారణాసి (ఉత్తరప్రదేశ్), అయోధ్య (ఉత్తరప్రదేశ్), పూరి (ఒడిశా), అమృత్సర్ (పంజాబ్), తిరుపతి (ఆంధ్రప్రదేశ్) వంటివి ఉన్నాయి. ఇదే సమయంలో ఖాటాశ్యామ్ జీ (రాజస్థాన్), ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్), తిరుచెందూర్ (తమిళనాడు) వంటి మరికొన్ని కూడా తీర్థయాత్రల గమ్యస్థానాలుగా వృద్ధిని నమోదు చేస్తున్నాయి. వయసులకు అతీతంగా.. అన్ని వయసుల, ఆదాయ వర్గాలకు చెందిన భారతీయులు ఈ తరహా తీర్థయాత్రల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. విహార యాత్రకు వెళ్లేవారిలో కుటుంబాలు, స్నేహితుల సమూహాలుగా వెళ్లేవారు 38.9% మంది కాగా తీర్థయాత్రకు అలా బృందాలుగా వెళ్లేవారు 47% మంది ఉన్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. (చదవండి: జర్మన్ ఫెస్ట్.. జాయ్ మస్ట్..) -
ఉద్యోగం కంటే ఆరోగ్యమే ముద్దు..!
ఆరోగ్యమే మహాభాగ్యం అని కొందరూ ఫిట్నెస్కి ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు..ఆరోగ్యం పోతే అంత ఈజీ కాదు ఇదివరకటిలా ఉండటం. అలానే భావించి ఇక్కడొక అమ్మాయి ఏకంగా రూ. 60 వేల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకుంది. ఆమె డేరింగ్కి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు..మేడమ్ మీరు చాలా గ్రేట్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగాల షిఫ్ట్లు ఏవిధంగా ఉంటాయో తెలిసిందే. కంఫర్ట్ జోన్లో ఉద్యోగం చేయడం అందరికీ సాధ్యం కాదు. అలా కుదిరే ఛాన్స్ లేదు. అందువల్ల యువత చిన్న వయసులోనే రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది అందరికీ తెలిసింది. ఇలానే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఉపాసన అనే భారత యువతి ఎంత పెద్ద నిర్ణయం తీసుకుందో వింటే విస్తుపోతారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఫ్రెంచ్ అసోసీయేట్గా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60 వేలు దాక సంపాదిస్తున్నట్లు పేర్కొంది. తన ఉద్యోగం చేయడం అత్యంత సులభమని, కాకపోతే నైట్ షిఫ్ట్ల్లో పనిచేయాల్సిన పరిస్థితి అని చెప్పుకొచ్చింది. అందువల్ల ప్రతి మూడో రోజు తలనొప్పి, ఎసిడిటీ, తక్కువ రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వాపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరంగా సేఫ్గానే ఉన్నా..అందువల్ల ధైర్యంగా అంత వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ధీమాగా వదిలేశానని తెలిపింది. డబ్బు తాత్కాలికం, అదే ఆరోగ్యం పాడైతే మళ్లీ యథాస్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే తాను డబ్బు కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాన్ని వదులుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంపై దృష్టిపెట్టా, మళ్లీ యథావిధిగా తన జీవితంలో సక్సెస్ని అందుకుంటానా లేదా అనేది తెలియదు. చూద్దాం ఏ జరుగుతోందో అంటూ ముగించింది తన పోస్ట్ని. అందుకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లంత ఆమె సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే కాదు.. మీ అర్హతకు తగిన ప్రతిదీ మీరు అందుకోవాలని ఆశిస్తున్నాం అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upasana (@upasanaa._)(చదవండి: -
క్షణం.. క్షణం.. ఉత్కంఠ రేపే జానపద నృత్యం..!
ఎన్నో రకాల నృత్యాలు చూశాం. కానీ ఈ నృత్యం చూస్తుంటే ఎలా చేయగలదా అన్న అనుమానం..ఏం జరుగుతోందో అన్న టెన్షన్తో అలర్ట్గా ఉండేలా చేసే అద్భుతమైన నృత్యం. సాహసోపేతమైన డ్యాన్స్కి మరో రూపం ఇదేనేమో అన్నట్లు ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియొలో ఒక మహిళ సంప్రదాయ లెహెంగా చోలి, చక్కటి ఆభరణాలు ధరించి అద్భుతమైన జానపద నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠభరితమైన ఆ నృత్యం భారతీయ సంస్కృతికి అసలైన అందంగా అలరారింది. చూస్తున్నంతసేపు చేయగలదా అన్న టెన్షన్, నిజమైన ప్రతిభకు అర్థం పట్టే డ్యాన్స్ ఇది. ఆ వీడియోలో ఒక మహిళ తన తలపై మూడు మట్టికుండలను బ్యాలెన్స్ చేస్తూ..కింద ఒక ప్లేట్పై డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఆ నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాలంటే, ప్రతిభ, దృష్టి, ఏకాగ్రత, బ్యాలెన్స్పై మంచి పట్టు ఉండాలి. అప్పుడే ఆ నృత్యంలో దాగున్న అద్భతమైన అందం ప్రేక్షకుల్ని అటెన్షన్తో తిలకించేలా చేస్తుంది. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి మీరు చేసిన విధానం అత్యంత అద్భుతంగా ఉంది, నిజమైన ప్రతిభ భారతదేశ సంస్కృతికి అసలైన అందం అని కీర్తిస్తూ పోస్టలు పెట్టారు. View this post on Instagram A post shared by राजस्थानी छोरी🫣 (@lok_nritya) (చదవండి: మంచు పొరలపై బతుకమ్మ, దాండియా సంబరాలు) -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
శోకసంద్రంలో సింగర్ భార్య: ఆ తప్పిదమే ప్రాణాలు తీసింది!
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మికమరణం యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.సింగపూర్లో శుక్రవారం జరిగిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ప్రాణాలు కోల్పోవడంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశాలున్నాయి. అయితే జుబీన్మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన విడుదల చేశారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లనే అతని చనిపోయినట్టు తెలిపారు. జుబీన్ గార్గ్ను లైఫ్గార్డులు లైఫ్ జాకెట్ ధరించమని కోరినా వినలేదని, ఈ విషయాన్ని జుబీన్ సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తనకు చెప్పారని ముఖ్యమంత్రి ప్రకటించారు. యాచ్ సిబ్బంది , గార్డులు గార్గ్ దానిని ధరించాలని పట్టుబట్టారు. గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించాడు, కానీ కొన్ని సెకన్ల తర్వాత, దాని సైజ్ సరిపోకపోవడంతో అతనికి ఈత కొట్టడం కష్టంగా ఉందని పేర్కొంటూ దానిని తీసివేసాడట. దీంతో గార్గ్తో సహా 18 మంది స్కూబా డైవింగ్ వెళ్లారు. అందరూ సురక్షితంగానే ఉన్నారు. లైఫ్ జాకెట్ ధరించని జుబీన్మాత్రం సముద్రంలో తేలుతూ కనిపించాడు. లైఫ్గార్డ్లు వెంటనే CPR ఇచ్చి, గార్గ్ను సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించారని,అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారని అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు. గాయకుడితో పాటు వచ్చిన వారిని సింగపూర్ అధికారులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కహిలిపారా ప్రాంతంలోని గార్గ్ నివాసాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గార్గ్ భార్యకు, కుటుంబానికి సంతాపం తెలిపారు. জুবিন গাৰ্গৰ অন্তিমটো ভিডিঅ’৷ #ZubeenGargNoMore pic.twitter.com/WMcUsLGWr1— Jyoti Prasad Nath জ্যোতি প্ৰসাদ নাথ (@xitoo27) September 19, 2025కన్నీరుమున్నీరుగా భార్యసంగీత పరిశ్రమకు జుబీన్ అందించిన సేవలు, కృషి సాటిలేనిది. హిందీ, బెంగాలీ , అస్సామీ భాషలలో తన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాడు. జుబీన్ అభిమాని అయిన గరిమా 2002లో అతణ్ణి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ ప్రమాదంలో జరగకపోయి ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అకాల మరణం అభిమానుల హృదయాల్లో విషాదాన్ని మిగిల్చింది. జుబీన్ భార్య గరిమా సైకియా శోకం వర్ణనాతీతం. ఆయన పెంపుడుకుక్క కూడా విషణ్ణ వదనంతో కనిపించింది. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్మీడియాలో అభిమానులను మరింత విషాదంలోకి నెట్టేశాయి. -
మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా? ఈ ప్రశ్న అవసరమా?
సాధారణంగా ఏదైనా ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం చేసే ఇంటర్వ్యూలు అభ్యర్థి నైపుణ్యాలు, అర్హతలు, ఆ సంస్థలో వారిని తీసుకోవాలనుకుంటున్న హోదాకు తగిన అర్హతను అంచనా వేయడం పైనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిగత రంగంలోకి వెళతాయి. ఇటీవల ఓ అభర్థి ఎదుర్కొన్న అలాంటి ఒక ప్రశ్న – ‘మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా?’ అది విన్న ఆ అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికిది ఎటువంటి ఇబ్బందీ కలిగించని ప్రశ్నే అయినప్పటికీ కొంతమంది రిక్రూటర్లు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది. నిజమే కదా... ఎందుకు అడుగుతారు? ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒకరిద్దరు అభ్యర్థులు వేర్వేరు ఇంటర్వ్యూయర్లు తమని తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా అని అడిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి ఇది జరిగినప్పుడు, కంపెనీ తరువాత ఉద్యోగ ఆఫర్ను పొడిగించింది, కానీ అభ్యర్థి దానిని తిరస్కరించాడు. తరువాతి ఇంటర్వ్యూలో, మరొక రిక్రూటర్ ఆ ప్రశ్నను పునరావృతం చేసి, ఆపై ఇతర ఉద్యోగ ఆఫర్ల వివరాల కోసం, వాటిని తిరస్కరించడానికి గల కారణాల కోసం ఒత్తిడి చేశాడు.ప్రశ్న సముచితమైన దేనా అని ఖచ్చితంగా తెలియదని, అభ్యర్థి ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడతాడా? లేక అతనిపై తల్లిదండ్రుల సంరక్షణ భారం ఎంతమేరకు పడుతుందా అని అంచనా వేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వచ్చిందని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారంటే తక్కువ ఖర్చులు అని రిక్రూటర్లు భావించవచ్చని, తగ్గిన జీతాన్ని మేనేజ్ చేయడం సులభం అవుతుందని వారి అంచనా. నియామక ప్రక్రియలో అసమతుల్యతపై వారు నిరాశ వ్యక్తం చేశారు, ఇంటర్వ్యూయర్లు ఉద్యోగ పనితీరుకు సంబంధం లేని విషయాలను కూడా పరిశీలించవచ్చు. అర్థరహిత వ్యాఖ్యతో, కృత్రిమ మేధస్సు అటువంటి పద్ధతులను పూర్తిగా భర్తీ చేయగలదా అని అభ్యర్థి ఆశ్చర్యపోయాడు.చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియోకమ్యూనిటీ స్పందనఇలాంటి ప్రశ్నలు ఆఫర్ ఎంత తక్కువగా ఉంటుందో నిర్ణయించే ప్రయత్నాన్ని సూచిస్తాయన్నారు. కుటుంబంతో కలసి ఉండటం వల్ల అభ్యర్థిపైన తక్కువ ఆర్థిక ఒత్తిడి పడుతుందని వాళ్ల ఉద్దేశంగా భావించ వచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి?ఈ పరిస్థితులను నిర్వహించడానికి అనేక మంది వినియోగదారులు తమ ఆలోచనలను ఇలా పంచుకున్నారు, వాటిలో ‘‘మీరు ఎందుకు అడుగుతారు?’’ అనే ఆసక్తితో స్పందించడం లేదా ప్రశ్నలోని అసంబద్ధతను ఎత్తి చూపడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగ భృతి లేదా వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి యజమానులు అడిగిన ఇలాంటి అనుభవాలను కొందరు వివరించారు. ఈ చర్చ ఒక సాధారణ భావనను నొక్కి చెప్పింది: కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం గురించి తక్కువగా ఉండవచ్చు లేదా తమ సంస్థలో వీలైనంత తక్కువ ప్యాకేజీకే ఒప్పించేందుకు తగిన అవకాశాలను గుర్తించడం గురించి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారంటే వారు బాధ్యతతో పని చేస్తారని ఇంటర్వ్యూయర్లు భావించవచ్చు. ఇదీ చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్ -
తూమక్ తూమక్
సోషల్ మీడియాలో ‘తూమక్ తూమక్’ అనేది వైరల్ ట్రెండ్గా మారింది. కర్మ అనే టీచర్ చిన్న పిల్లలతో కలిసి వేసిన ‘తూమక్ డ్యాన్స్’ ఆహా అనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టీచర్ వేసిన పాపులర్ ట్రెండ్ స్టెప్స్ను చిన్ని స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా అనుసరించి ‘వారేవా’ అనిపించారు.‘మీరు నమ్ముతారో లేదోగానీ నేను ఈ వీడియోను వందసార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒక యూజర్. ‘నా వయసు 26 సంవత్సరాలు. మీ స్కూల్లో విద్యార్థిగా మారవచ్చా?’ అని సరదాగా అడిగింది ఒక యూజర్. ప్లేబ్యాక్ సింగర్ నేహా బాషిన్ ‘జుట్టి మేరీ’ ఆల్బమ్ పాపులర్ అయింది. ఈ పాటలోని తూమక్ స్టెప్స్కు ఆన్లైన్ లోకం ఫిదా అయింది. గతవారం క్లాస్రూమ్లో చిన్న అమ్మాయి ఒకరు చక్కని హావభావాలతో వేసిన తూమక్ తూమక్ స్టెప్స్ వీడియో కూడా వైరల్ అయింది. -
నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట. అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్గా ‘ఆయిల్ కుమార్’గా పాపులర్ అయ్యాడట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో రైస్ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా ఇంజిన్ ఆయిల్ బాటిల్ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్ కుమార్ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.నిపుణులేమంటున్నారంటేఅయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు. ఇలాంటి పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by AvalakkiPavalakki (@avalakki_pavalakki) -
'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్ ఆర్ట్..
కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్గా ఉండే ఆర్ట్ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్గా మారింది. అందులో ఏముందంటే..నెదర్లాండ్ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం షిపోల్లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్ వాచ్ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. అదంతా ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్లా ఉంటుంది. ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్ వాచ్ కళ. రియల్ టైమ్గా పిలిచే హ్యుమన్ వాచ్ని డచ్ కళాకారుడు మార్టెన్బాస్ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by S K Ali (@skali85) (చదవండి: పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!) -
పీహెచ్డీ గ్రాడ్యుయేట్ ఫుడ్ స్టాల్తో రోజుకు రూ.లక్ష పైనే..!
ఒక్కోసారి పెద్దపెద్ద చదవులు చదివినా..ఉద్యోగం సంపాదించడంలో విఫలమవుతుంటారు. టన్నుల కొద్దీ డిగ్రీలు చేసినా అక్కరకు రాకుండా పోతుంటాయి. అలా అని నైరాశ్యంతో కూర్చోకుండా ఏదో ఒక మార్గం ఎంచుకుని ముందుకుపోయి గ్రేట్ అనిపించుకునే వారు ఒకరో, ఇద్దరో ఉంటారు. ఆ కోవకు చెందినవాడే ఈ చైనీస్ వ్యక్తి. ఈ వ్యక్తి చదివినదానికి చేస్తున్న పనికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఓ గొప్ప సందేశం అందించాడు. జియాంగ్సు ప్రావిన్స్ నుంచి పీహెచ్డీ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన 37 ఏళ్ల డింగ్ స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆయన బెల్జియంలో భూ సంరక్షణ, పంట ఉత్పత్తిలపై పరిశోధన కూడా చేశారు. దాదాపు 30 పరిశోధనా పత్రాలు సమర్పించి మరి డాక్టోరల్ పట్టాని కూడాపొందారు. ఇంతటి ఉన్నత విద్యావంతుడైనా అవేమి ఆయనకు జీవనాధారం కాలేకపోయాయి. కనీసం అతడి పొట్టని పోషించేకునే సామర్థ్యాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కించెత్తు నిరాశకు చోటివ్వకుండా తన భార్య వాంగ్తో కలిసి స్పైసీ చాంగ్కింగ్ తరహా బఠానీ నూడుల్స్ అమ్మూతూ..ఫుడ్ వ్యాపారంలో మంచి లాభాలను అందుకున్నాడు. అంతేగాదు అనతికాలంలోనే అతడి ఫుడ్స్టాల్ ఫేమస్ అయ్యి ఏకంగా రోజుకి రూ. లక్ష రూపాయల పైనే ఆర్జించే రేంజ్కు చేరకున్నాడు. గత మేనెలలో తన భార్య వాంగ్ స్వస్థలంలోని స్థానిక మార్కెట్లో ఈ ఫుడ్ స్టాల్ని ప్రారంభించారు. ఒక ప్లేట్ స్పైసీ బఠానీ నూడుల్స్ ధర రూ. 600 నుంచి రూ. 700 పై చిలుకు అమ్ముతున్నట్లు వెల్లడించాడు డింగ్. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా కాస్త స్పైసీ తగ్గించి విక్రయించి.. కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపాడు. నెటిజన్లు సైతం ఆ జంట చాలా తెలివైన వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. విదేశంలో చైనీస్ నూడుల్స్తనో ఆదాయం సృష్టించుకున్న తెలివైన వ్యవస్థాపక దంపతులు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి మరణం, కన్నెత్తి చూడని బంధువులు..! సాఫ్ట్వేర్ ఇంజనీర్ సక్సెస్ స్టోరీ) -
ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు? -
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!. టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్కు జై అనాల్సిందే! -
నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ప్రకంపనం..! ప్లీజ్ సోమరిగా మారకు..
జెమిని నానో బనానా ఏఐ చీర ట్రెండ్ ఎంతలా ప్రజాదరణ పొందుతుందో తెలిసిందే. నెట్టింట ఈ టెక్నాలజీ ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ టెక్నాలజీతో రోజుకో కొంగొత్త పోటోలు దర్శనమిస్తున్నాయి. అలానే ఈసారి ఓ ఫోటో వైరల్ అవ్వడమే కాదు..గగుర్పాటుకు గురిచేసేలా ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఇది ఉపయోగించొచ్చా? వద్దా? అన్న మీమాంసలో పడేసింది. పైగా ఈ ట్రెండ్ని చూసి రతన్ టాటా సహాయకుడిగా ప్రసిద్ధి చెందిన శంతనునాయుడు ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అందుకు నెటిజన్లు మద్దతిస్తూ..ఔను కరెక్ట్ చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.ఈ నయా ట్రెండ్లో ఓ మహిళ అందరిలా ఈమె కూడా తన ఫోటోని చిత్రించాలనుకుంది. తాను డ్రెస్లో ఉన్న చిత్నాన్ని ఈ టెక్నాలజీ సాయంతో చీరలో మార్చి..తన లుక్ చూడాలనుకుంది. అంతే అది ఏకంగా అత్యంత ఆకర్షణీయమైన చీర లుక్లో ఆమె ఆహార్యాన్ని అందంగా చూపించడమే కాదు. ఆమెకు తన శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉందో దాంతో సహా చూపించడంతో సదరు మహిళ విస్తుపోయింది. View this post on Instagram A post shared by झलक भावनानी ✨ (@jhalakbhawnani) ఒక్కసారిగా ఆమెకు నోట మాట రాలేదు. ఇది సురక్షితమేనా అని భయాందళోనలకు లోనయ్యింది. అందుకు సంబంధించిన పోటోని నెట్టింట షేర్ చేస్తూ..ఇది చాలా భయంకరంగా ఉంది. అస్సలు ఇదెలా సాధ్యమో అర్థం కావడం లేదు అని పోస్ట్లో రాసుకొచ్చిందామె. ఈ చీర ట్రెండ్ దివంగత రతన్ టాటా సహాయకుడిగా పేరొందిన శంతను నాయుడు టీజ్ చేస్తూ..ఆలోచింప చేసేలా ఒక కామెంట్ చేశారు. నిజానికి జెమిని యాప్లోని గూగుల్ డీప్మైండ్ ఇమేజ్-ఎడిటింగ్ మోడల్ క్యాజువల్ సెల్ఫీని సినిమాటిక్ పోర్ట్రెయిట్గా మార్చగల సాధనం. బాలీవుడ్ని తలపించేలా మన లుక్ని అందంగా మార్చే ఏఐ సాధనం. ప్రస్తుతం ఎటు చూసినా ఈ క్రేజీ ట్రెండ్ నడుస్తోంది. అయితే శంతను నాయుడు ఈ క్రేజీ ట్రెండ్కి ఎవ్వరూ అమ్ముడుపోరని నమ్మకంగా చెప్పేశారు. నాకస్సలు అర్థం కావడం లేదు చీరలో భారతీయ ప్రజలు తమను తాము చూసుకోవడం ఏంటీ..ఇది చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఎందుకంటే భారతీయత చిహ్నమే చీర. అలాంటి చీరలో తమ లుక్ని చూసుకునేంత పిచ్చి ఉండటం ఏంటి. ఇప్పటికే వారి వార్డురోబ్లో దాదాపు 15 చీరలపైనే ఉంటాయి. చక్కగా వాటిని తీసి ధరించి చూసుకోండి చాలు. అంతేగానే ఏదో కొత్త ట్రెండ్ అని విచిత్రమైన చీరల్లో మీ లుక్ని చూసుకునేందుకు ఇంతలా ప్రయాస పడుతూ టెక్నాలజీని వాడాల్సిన పని లేదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అంతే ఆయన పోస్ట్ని చూసిన నెటిజన్లు..ఇది చాలా నిజం, చక్కగా చెప్పారు. బహుశా ఈ స్వభావాన్ని చూసే టాటా దిగ్గజం రత్న టాటా మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sock Talks (@socktalks.tv) (చదవండి: టేస్ట్ని మిస్ అవ్వకుండా హెల్దీగా తిందాం ఇలా..!) -
హ్యాట్సాఫ్ జ్వాలా గుత్తా..! అమ్మతనానికి ఆదర్శంగా..
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ దంపతులు ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా తల్లిపాలకు దూరమైన శిశువులు అకాల అనారోగాల బారిన పడకుండా తన వంతుగా తల్లిపాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ తల్లిపాల డ్రైవ్లో అందరూ పాలుపంచుకునేలా ప్రేరేపించేలా ఆమె తల్లిపాలను దానం చేశారు. జ్వాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. "అంతేగాదు తల్లిపాలు బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది, పైగా అనారోగ్యం బారిన పడకుండా రక్షిస్తుంది. మన దానం చేసే పాలు ఓ బిడ్డ జీవితాన్ని ఆరోగ్యంగా మార్చేస్తాయి. అలాంటి పాలను దానం చేసేందుకు ప్రతి అమ్మ ముందుకు రావాలి. పైగా ఈ పాలు అవసరం ఉన్న కుటుంబం పాలిట దేవతా లేక హీరోగా ఉంటారు. అందువల్ల దయచేసి పాల బ్యాంకుకి మద్దతివ్వండి. "అంటూ పోస్లులో రాసుకొచ్చారామె. ఇకజ్వాల ఇప్పటివరకు 30 లీటర్ల తల్లిపాలను దానం చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆమె విశాల హృదయానికి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు. అంతేగాదు. దీనిపై అందరు అవగాహన పెంచుకోవాలంటూ పోస్టులు పెట్టారు. కాగా జ్వాల గుత్త.. నటుడు విష్ణు విశాల్ను 22 ఏప్రిల్ 2021న వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత తల్లి అయ్యింది. జ్వాల తన ఆడపిల్లకు పాలు ఇచ్చిన తర్వాత తన పాలన్నింటినీ దానం చేస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, ఒక అథ్లెట్ ఈ విధంగా తన పాలను దానం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమంటూ అందరు ఆమెను ప్రశంసిస్తున్నారు. చదవండి: కలం'.. కలకాలం..! పాఠకులతో నేరుగా రచయితల సంభాషణ -
ఆరోగ్య సంరక్షణలో భారత్ బెస్ట్..!
భారతదేశంలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ ఆరోగ్య సంరక్షణపై నెట్టంట షేర్ చేసిన పోస్ట్ నెటిజన్ల మనసును దోచుకోవడమే కాదు చర్చనీయాంశంగా మారింది. అంతేగాదు అక్కా మీరు చాలా బాగా చెప్పారంటూ ఆము ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. అంతేగాదు అత్యంత నిజాయితీగా మాట్లాడిన తీరు కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ ఆమె పోస్ట్లో ఏం రాసిందంటే..భారతదేశంలో గత కొన్నేళ్లుగా నివశిస్తున్న క్రిస్టెన్ ఫిషర్ భారతదేశం, అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల తీరు ఎలా ఉంటుందో సోష్ల మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇరు దేశాల్లోని ఆస్పత్రులు, వైద్యులు, మందులు పరంగా ఆరోగ్య సంరక్షణ ఏ దేశంలో బాగుంటుందో వెల్లడించింది. ఖర్చు, ఔషధాల పరంగా భారతదేశం బెటర్ అని, అదే యూఎస్లో ఈ పరంగా రోగిపై అత్యధిక భారం పడుతుందని తెలిపింది. అలాగే అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టం అని అన్నారు. భారత్లో అపాయింట్మెంట్తో పనిలేకుండానే క్లినిక్కి వెళ్లగలం, పైగా సమయం కూడా ఎక్కువ పట్టదని అంటోంది. అలాగే డాక్టర్లు వైద్యుడిని పర్యవేక్షించే విషయంలో కూడా భారత్ బెటర్ అని, ఎందుకంటే క్షుణ్ణంగా అతడిని విచారించి..చికిత్స అందిస్తుందని, యూఎస్లో రోగితో డాక్టర్ స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, పైగా అంత సమయం కేటాయించేందుకు ఇష్టపడరనికూడా పేర్కొంది. ఇక ఆస్ప్రతిలో అందించే భోజనం పరంగా అమెరికా బెటర్ అని, కానీ రోగికి ఇచ్చే మెనూ ఆధారంగా వారి పర్యవేక్షకులకు అదే ఆహారం ఉంటుందని, అంత మెరుగ్గా లేదని అన్నారామె. మొత్తంగా చూస్తే ఆరోగ్య సంరక్షణ భారత్లోనే బాగుంటుంది, ఇక్కడ వైద్య ఖర్చు తక్కువే, పైగా మందులు కూడా సులభంగా దొరుకుతాయంటూ పోస్ట్లో తన అభిప్రాయాన్ని రాసుకొచ్చిందామె. ఈ పోస్ట్ నెట్టింట చర్చకు దారితీయడమే గాక, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అదీగాక మా దేశాన్ని అభినందిస్తుందన్నందుకు అక్కా మీపై రోజురోజుకి గౌరవం పెరిగిపోతుందోందటూ పోస్ట్లు పెట్టారు నెటిజన్లు. కాగా, ఆమె గతంలో కూడా పలు విషయంలో భారత్లోనే పిల్లలు మంచిగా పెరుగుతారని, ఈ నేల నివశించడానికి అనువైనదని, ఎవ్వరినైనా తనలో కలిపేసుకునే ఆకర్షణ ఈ ప్రదేశంలో ఉందంటూ భారత్పై పొగడ్తల వర్షం కురిపించింది కూడా. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆర్మీ ఆఫీసర్గా అందాలరాణి..!) -
పుట్టకతో రికార్డు..ఒక్కసారిగా సెలబ్రిటీగా ఆ తల్లి..!
సాధారణ శిశువు ఆరోగ్యకరమైన బరువు 2.5 నుంచి 4.5 కిలోల మధ్య ఉంటుంది. అంతకు మించి ఉంటే అసాధారణ శిశువుగా పరిగణిస్తారు. కానీ ఈ బుడతడు పుట్టుకతో వైద్యులనూ, అమ్మనూ విస్తుపోయేలా చేశాడు. ప్రసూతి వార్డులోనే ఇంత పెద్ద శిశువు ఎప్పుడూ చూడలేదని వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువుని చూసి ఆ తల్లి ఈ బిడ్డ నా బిడ్డేనా అనే సందేహం వ్యక్తం చేసేలా అతడి ఆకృతి సంభ్రమాశ్చర్యాలకు గరయ్యేలా చేసింది. ఇదంతా ఎక్కడంటే..అమెరికాలోని టంపాకు దక్షిణంగా ఉండే ఫ్లోరిడాలో చేసుకుంది. 42 ఏళ్ల డానియెల్లా హైన్స్ అనే మహిళ సెప్టెంబర్ 03న భారీ మగ శిశవుకి జన్మనిచ్చింది. ఆ శిశువు బరువు దగ్గర దగ్గర ఏడు కేజీలు. అసాధారణ బరువుతో జన్మించి..పుట్టుకతో రికార్డు సృష్టించిన ఘనత దక్కించుకోవడమే కాదు పూర్తి ఆరోగ్యంతో ఉండటం విశేషం. ఇలా పుట్టడం అనేది అత్యంత అసాధారణమైతే, ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా అత్యంత అరుదు. డానియల్కు సీజేరియన్ ఆపరేషన్ చేసి ఆ శిశువుని బయటకు తీశారు. స్పృహ వచ్చాక తన బిడ్డను చూసి..ఇది తన బిడ్డేనా అని ఆశ్చర్యపోయింది. ఇంత పెద్దగానా..! అని నోరెళ్లబెట్టింది. అంతేగాదు ఆమె ప్రసూతి వార్డుకి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి ఆ బిడ్డను తిలకిస్తున్నారు. ఆహా పుట్టుకతో సెలబ్రిటీగా మారడమే కాదు, నన్ను కూడా ప్రత్యేకమైన తల్లిగా నిలబెట్టావురా కన్నా..! అంటూ సంబరపడిపోయింది ఆ తల్లి. నిజంగా భగవంతుడు మాకు ఇంత పెద్ద ఆశీస్సులు అందించాడని ఊహించలేకపోయా అంటూ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ సంగతులను వివరించింది డానియోల్లా. అలాగే ఆ శిశువు కూడా అత్యంత పొడవే. డానియెల్లా దంపతులు కూడా పొడుగ్గానే ఉంటారు. అయితే డానియెల్లా గర్భంతో ఉన్నప్పుడూ..మధుమేహంతో బాధపడింది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల అసాధారణత వల్ల గర్భణీలకు ఇంత పెద్దగా శిశువులు పుట్టే అవకాశం ఉందని వైద్యులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కూడా. అయినప్పటికీ ఇలా భారీ సైజులో శిశువు జన్మించడమే అందర్నీ విస్తుపోయేలా చేసింది. కాగా, ఇంతకుమునుపు ఈ రికార్డు బ్రెజిల్లో ఓ తల్లి ప్రసవించిన మగబిడ్డ పేరు మీద ఉండేదట. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్కి నిర్వచనం ఈ దంపతులు..!) -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
వాటే పబ్లిక్ టాయిలెట్.. టూరిస్ట్ స్పాటా..?!
టూరిస్ట్ స్పాట్ అనగానే ఏ అద్భుతమైన ప్రకృతి దృశ్యమో లేక మిస్టరీ ప్రదేశాలో అనుకుంటాం. కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్ ఒకటి ఉందని అస్సలు ఊహించరు. ఆ ప్రదేశం పేరు వినగానే ఇదేం పర్యాటక ప్రదేశం రా బాబు అని తలపట్టుకుంటారు. కానీ చూస్తే మాత్రం..దీన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న వారి అద్భుత ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేరు. ఇంతకీ అదేంటో చక చక చదివేయండి మరి..చైనాలోని గన్సు ప్రావిన్స్లోని డన్హువాంగ్ నైట్ మార్కెట్లో కొత్తగా పునరుద్ధరించిన పబ్లిక్ టాయిలెట్ ఊహించని విధంగా సాంస్కృతిక ఆకర్షణగా మారింది. ఓ సాధారణ రెస్ట్రూమ్కి ఇంత క్రేజ్ ఏంటా అనే కదా..!. అయితే ఇది అలాంటి ఇలాంటి రెస్ట్రూమ్ కాదు. "డన్హువాంగ్ ప్యూర్ రియల్మ్ పబ్లిక్ కల్చరల్ స్పేస్"గా పిలిచే ఈ టాయిలెట్ యునెస్కోలో చోటు దక్కించుకున్న ప్రసిద్ధ మొగావో గుహలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. చారిత్రాత్మక కళా నైపుణ్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రెస్ట్రూమ్. చెప్పాలంటే వారసత్వ కళకు ప్రతిబింబంలా ఉంటుంది ఈ పబ్లిక్ టాయిలెట్ రూపురేఖలు. రెండు అంతస్తుల్లో విస్తరించి ఉన్న ఈ డన్హువాంగ్ పబ్లిక్ టాయిలెట్ సంస్కృతికి అర్థం పట్టేలా కుడ్య చిత్రాలు, ఏదో రాజదర్బారులో ఉన్న అనుభూతిని ఇస్తాయి. బయటి భాగంలో అల్ట్రా క్లియర్ గాజు కర్టెన్ గోడలు ఉన్నాయి. అంతేకాదండోయ్ ఈ రెస్ట్రూమ్లో యాంటీ బ్యాక్టీరియల్ నర్సింగ్ టేబుల్స్, చైల్డ్ సేఫ్టీ సీట్లు, స్వీయ క్లీనింగ్ సిస్టమ్తో కూడిన పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ గది కూడా ఉంది. అలాగే ఇక్కడ సౌకర్యవంతమైన సీటింగ్ ప్రదేశం తోపాటు డ్రింక్ డిస్పెన్సర్లు, వృద్ధులు, వికలాంగులకు అనువైన సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆగస్టు 16న ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్ అతి కొద్ది సమయంలోనే పర్యాటకులకు ఇష్టపమైన స్పాట్గా మారిపోయింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు సాంప్రదాయ హన్పు దుస్తులను కూడా ధరిస్తారట. అందుకు సంబంధించిన వీడీయో నెట్టింట సంచలనం సృష్టించడమే గాదు, రకరకాల చర్చలకు దారితీసింది కూడా. View this post on Instagram A post shared by China Exploring (@china__exploring) (చదవండి: ఫిఫ్టీ ప్లస్.. టాలెంట్ జోష్..! యాభై దాటాకా లైఫ్ స్టార్ట్ అంటున్న 'ఖ్యాల్') -
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి కొద్ది ప్లాట్ఫారమ్లలో వాళ్ల లైఫ్స్టైల్ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్ట్యాగ్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్జెడ్కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
మైఖేల్ జాక్సన్ని తలపించేలా ఆ పక్షి డ్యాన్స్కి ఫిదా అవ్వాల్సిందే..!
ఈ ప్రకృతి ఆశ్చర్యంగొలిపే వింతలకు నెలవు. అందులోనూ పక్షులు గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి పక్షి ఒక్కో ప్రత్యేకతతో అద్భుతం చేస్తుంటాయి. అలాంటి అందమైన పక్షుల్లో ఒకటి ఈ మనాకిన్ అనే ఎర్రటి టోపి పక్షి. వీటిని టోపీ పక్షులు అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం మనుషుల మాదిరిగా డ్యాన్స్ చేస్తుందని విన్నారా..?. అది కూడా బ్రేక్ డ్యాన్స్లకు పేరుగాంచిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ని తలపించేలా అద్భుతంగా చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో కోస్టారికాలో ఎర్రటి టోపీతో ఉండే మానకిన్ పక్షి అచ్చం మేఖేల్ జాక్సన్ చేసిన మూన్వాక్ డ్యాన్స్ మాదిరిగా నృత్యాన్ని ప్రదర్శించింది. దాని మ్యాజిక్ స్టెప్లు చూస్తే కళ్లుఆర్పడం మరిచిపోతాం. అంతలా కాళ్లు అద్భుతంగా కదుపుతోంది. ఇంతవరకు ఈ పక్షుల ఎర్రటి టోపీనే ప్రధాన ఆకర్షణగా ఉండేది. ఇప్పుడూ యూట్యూబర్ పీటర్ బాంబౌసెక్ షేర్ చేసిన వీడియో పుణ్యమా అని డ్యాన్స్కి పేరుగాంచిన పక్షులుగా పేరుగాంచుతాయేమో. కాగా, ఈ పక్షులు దక్షిణ అమెరికాలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా బెలిజ్, కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్, గ్వాటెమాల, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా వంటి దేశాల్లో కనిపిస్తాయి. అవి ఇలా నృత్యం చేసి ఆడపక్షులను ఆకర్షించి సంతానాన్ని పొందుతాయట. ఇంకెందుకు ఆలస్యం ఆ పక్షి అందమైన డ్యాన్స్పై మీరు ఓ లుక్కేయండి మరి..!.. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
ఆ దేశంలో తల్లులకు ఆర్థిక భరోసా వేరే లెవెల్..!
వర్కింగ్ విమెన్ ప్రెగ్నెంట్ అయితే..కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్థాక్షిణ్యంగా తొలిగించిన ఉదంతాలను చూశాం. కానీ ఈ దేశంలో ఓ విదేశీ మహిళ ప్రెగ్నెంట్ అయితే అక్కడి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ ప్రసూతి సాయం డెలివరీ అయినా తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగడం విశేషం. ఇంతకీ అదంతా ఎక్కడంటే..దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఆర్థిక మద్దతు గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయన్ని గురించి సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. ఆ ఆర్థిక సాయం ఎలా ఉంటుందంటే..నెహా తాను ప్రెగ్నెంట్ అని నిర్థారణ అయ్యిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు తదితరాలన్నింటికి అక్కడి కొరియా ప్రభుత్వం రూ. 63,100 ఇచ్చిందని, దాంతోపాటు బస్సు/టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనం రూ. 44,030లు అందించినట్లు వెల్లడించింది. ఇలాంటి సహాయం డెలివరీ సమయంలో సైతం అందించిందని, ప్రసవ సమయంలో ఒకేసారి సుమారు రూ. 1.26 లక్షలు దాక ఆర్థిక సహాయం అందించిందని చెప్పుకొచ్చింది. దీనిని అధికారికంగా “కంగ్రాగ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ(అభినందన ప్రసూతి సహాయం)” అని పిలుస్తారని కూడా తెలిపింది. ఈ ఆర్థిక మద్దతు తన బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయ అందించినట్లు వెల్లడించింది. అంటే..నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల రూ. 63,100, రెండో ఏడాది నెలకు రూ. 31,000 చోప్పున..అలా తన బిడ్డకు ఎనిమిదేళ్లు వచ్చే వరకు రూ. 12,600లు చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వెల్లడించడమే గాక అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమే గాక భారతదేశంలో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణను పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Neha Arora (@mylovefromkorea17) (చదవండి: 'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..) -
రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ఇథనాల్ కలిపిన ఇ20 పెట్రోల్కు వ్యతిరేకంగా సోషల్మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్పై దాఖలైన PILను తిరస్కరించింది.. సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే ప్రచారం జరిగింది. అది చెల్లించిన ప్రచారం(పెయిడ్ క్యాంపెయిన్). అందుకే నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. పెట్రోల్ లాబీ చాలా ధనికం. అది ఎంతో శక్తివంతంగా ఉంది. వాళ్లే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తు ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారాయన.E20 ఫ్యూయల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇంధనం. ఇథనాల్ అనేది.. జొన్న, బియ్యం, పంచదార వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇది పర్యావరణ హితమైంది. దేశీయంగా తయారయ్యే, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనం. అందుకే గడ్కరీ దీనిని ప్రమోట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ లక్ష్యం ఏంటంటే.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్ దిగుమతులను తగ్గించడం అలాగే.. రైతులకు ఆదాయం పెంచడం (ఇథనాల్ తయారీ ద్వారా ₹45,000 కోట్ల లాభం వచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు). అయితే.. గడ్కరీ ఓ క్లియర్ విజన్తో ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల ఆలోచనతో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ పొందడం.. తద్వారా ఈ తరహా ఆలోచనలతో భారత ఆటో పరిశ్రమను ప్రపంచంలో #1 స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు. -
బాబోయ్.. ఎయిరిండియా విమానాల్లో ఉక్కపోత!
దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు. ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. రెండుగంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే ప్రయాణికులకు కలిగిన అంతరాయంపై ఎయిరిండియా ప్రకటన చేసినా.. చేయకపోయినా.. అది ఏసీ వల్లే అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పీటీఐ కథనం ప్రకారం.. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ రాత్రి 11గం. సమయంలో సింగపూర్కు బయల్దేరాల్సి ఉంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తిందని అనౌన్స్మెంట్ చేశారు. అయితే.. రెండు గంటలు గడిచినా మరమ్మత్తులు కాలేదు. ఆపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణికులను సిబ్బంది కిందకు దించేశారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఏసీ పని చేయకపోవడంతో ప్యాసింజర్లు మ్యాగజైన్లు, న్యూస్పేపర్లతో విసురుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఎయిరిండియా విమానాల్లో ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకున్నాయి. Now after suffering without AC for around 2 hrs, passengers of Delhi-Singapore @airindia flight being deplaned suspecting a technical glitch. Pathetic service @airindia @DGCAIndia @moneycontrolcom https://t.co/omaceiKZ41 pic.twitter.com/MOccbgH4JT— Ashish Mishra (@AshishM1885) September 10, 2025ఢిల్లీ–సింగపూర్ విమానం (AI2380) – సెప్టెంబర్ 10, 2025(తాజా ఘటన)బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానంలో విద్యుత్ సరఫరాలో లోపంతో పని చేయని ఏసీలు!200 మందికి పైగా ప్రయాణికులు రెండు గంటల పాటు ఎదురు చూశాక.. చివరికి విమానం నుంచి దిగమన్నారుఢిల్లీ–పాట్నా విమానం – మే 19, 2025తీవ్ర వేడిలో AC పనిచేయకపోవడంతో ప్రయాణికులు పేపర్లు, మ్యాగజైన్లు ఉపయోగించి గాలి తీసుకునే ప్రయత్నంరిషి మిశ్రా అనే నేత ఓ వీడియో షేర్ చేసి విమానయాన మంత్రిత్వ శాఖను ప్రశ్నించారుఅహ్మదాబాద్–లండన్ విమానం (AI171) – జూన్ 12, 2025ఈ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే.. విమానం క్రాష్కి ముందు ప్రయాణికులు AC పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారుTV స్క్రీన్లు, లైట్లు, సిబ్బందిని పిలిచే crew call buttons కూడా పనిచేయలేదని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ఎయిర్ ఇండియా CEO ఏమన్నారంటే..వరుసగా ఈ తరహా ఘటనలు జరగడంపై కాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) స్పందిస్తూ.. ఎయిరిండియాకు ఉన్న విమానాల సంఖ్య, సిబ్బంది, సంస్థ పరిమాణాన్ని బట్టి చూస్తే.. ఇలాంటి సమస్యలు తలెత్తడం సాధారణమే. అయినప్పటికీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. -
నేపాల్లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్
ఖాట్మాండు: నేపాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.Parliment in Nepal. Better than voting. pic.twitter.com/NtFehqsycr— ADAM (@AdameMedia) September 10, 2025మరోవైపు..మాజీ ప్రధాని దేవ్బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్పై ఎగురుతున్న హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.Politicians escaping the wrath of the people in Nepal pic.twitter.com/tia5JjkqmL— jim Njue (@jimNjue_) September 10, 2025ఇదిలా ఉండగా.. నేపాల్లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025 -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
కదులుతున్న ఆటోలో.. ఆమె సాహసాన్ని చూస్తే షాకే!
పంజాబ్లో ఓ మహిళ.. దొంగలతో ధైర్యంగా పోరాడి తప్పించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పట్టపగలే ఆటోలో మహిళను దోచుకోవడానికి ప్రయత్నించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జలంధర్-లుథియానా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ఫిల్లౌర్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి దోచుకునేందుకు ప్రయత్నించారు.అయితే, ఆమె ధైర్యంగా దుండగులను ప్రతిఘటించింది.. ఆటో నుంచి బయటకు వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆమె దాదాపు అర కిలోమీటర్ వరకు వేలాడుతూ సాయం కోసం ఆమె పిలుస్తూనే ఉంది. ఇంతలో, వెనుక కారులో ప్రయాణిస్తున్న కొంతమంది యువకులు ఆటోను వెంబడించారు. ఆమె సాహసాన్ని వీడియో తీశారు. దొంగలను పట్టుకోవడానికి వారు సాయం చేశారు.ఆటో వేగంగా వెళ్లి ఒక కారును ఢీకొట్టింది. చివరికి ఆటో బోల్తా పడింది. దాంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ వీడియోలో ఆ మహిళ ఆటోకు బయట వేలాడుతూ దొంగల్ని ఎదుర్కొంటున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తాయి. ధైర్యంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా దొంగలను కూడా పట్టించగలిగిందని.. ఈ ఘటన మహిళల ధైర్యానికి నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.In an extremely courageous act, a Ludhiana woman saved herself from a robbery in a moving auto by clinging on the vehicle while signalling for help from other commuters. Three robbers who tried to snatch her phone and money inside auto arrested by @Ludhiana_Police @IndianExpress pic.twitter.com/N7KXS62Olp— Divya Goyal (@divya5521) September 10, 2025 -
వేదికపై చంద్రబాబు.. ఎదురుగా ఖాళీ కుర్చీలు
సాక్షి, అనంతపురం: సూపర్సిక్స్-సూపర్హిట్’ పేరుతో తె.దే.పా-జనసేన-బీజేపీ కలిసి అనంతపురంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి. అయితే ఈ సభలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టీడీపీ శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న టైంలోనే జనాలు అక్కడి నుంచి వెళ్లిపోతూ కనిపించారు. వాళ్లను ఆపేందుకు తె.దే.పా కేడర్, పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ఎదురుగా చంద్రబాబు మాట్లాడుతున్న టైంలోనూ ఇవతల ఖాళీ కుర్చీలే అక్కడ దర్శనమిచ్చాయి. -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
'నో ఛాన్స్..జస్ట్ ఫోర్స్'..! భారత్ని వీడక తప్పని స్థితి..!
ఒక భారతీయ మహిళ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది. ఆ విషయాన్ని నెట్టింట షేర్ చేయడంతో..ఒక్కసారిగా భారతదేశ రిజర్వేషన్ విధానం హాట్టాపిక్గా మారింది. ఇదేలా రాజకీయ జిమ్మిక్కుగా మారి ఉన్నత విద్యావంతుల పాలిట శాపంగా ఎలా మారిందో ఓ యువతి ఇన్స్టా వేదికగా వాపోయింది.అసలేం జరిగిందంటే..భారతదేశాన్ని విడిచి వెళ్లడం అనేది అంత ఈజీ కాదని, తప్పని పరిస్థితి అంటూ సోషల్మీడియా వేదికగా తన గోడును వెళబోసుకుంది. తాను ఉన్నత విద్యను భారత్లోనే అభ్యసించాలనుకున్నాని, తన మేథస్సు తన దేశ అభ్యున్నతి ఉపయోగపడాన్నేదే తన ఆకాంక్ష, లక్ష్యం కానీ విధిలేక దేశాన్ని విడిచి వెళ్తున్నానంటూ పోస్ట్లో కన్నీటి పర్యంతమైంది. తనకు భారతదేశం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడే మంచిగా స్థిరపడాలని కలలు కనేదాన్ని కానీ పరిస్థితులు మరో గత్యంతర లేకుండా చేసేశాయ్ అని ఆవేదనగా చెప్పుకొచ్చిందది. భారత్లో బలమైన విద్యా వ్యవస్థ ఉన్నప్పటికీ..ఇక్కడ ఉన్నత విద్యను అందుకోవడంలో అడగడుగునా ఎలా అండ్డంకులు ఎదురయ్యాయో వివరించింది. తాను లక్నో విశ్వవిద్యాలయంలో చదివానని, అధిక మార్కులతో పట్టభద్రురాలినయ్యానని తెలిపింది. అలాగే కష్టపడి చదివి క్యాట్ ఎగ్జామ్ పాసయ్యానని చెప్పుకొచ్చింది. కానీ తనకు మంచి సంస్థలో చదివే అవకాశం లభించలేదని. సీట్లు చాలా తక్కువ స్కోరు చేసిన వారినే ఎలా వరించాయో కూడా తెలిపింది. వారందరికి మెరిట్ కారణంగా కాకుండా రిజర్వేషన్ ప్రాతిపదికన మంచి కాలేజ్ సీట్లు వచ్చాయని దాంతో తాను 2013లో రాజీపడి ఐఐఎంలో కాకుండా ఎఫ్ఎంఎస్లో చేరానని రాసుకొచ్చింది. అలాగే 2025లో జీమ్యాట్లో ఉత్తీర్ణత సాధించినప్పుడూ కూడా జనరల్ కేటగిరీలో పరిమిత సంఖ్యలోస్లాట్లు ఉండటంతో మంచి సంస్థలో సీటు సంపాదించలేకపోయాను. అందువల్లే తాను విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చింది. ఇది తనొక్క వ్యథే కాదని, తనలాంటి ఎందరో టాపర్స్ ఆవేదన అని చెప్పుకొచ్చింది. జనరల్ కేటగిరీ అనేది ఆర్థికంగా అణగదొక్కబడిన సముహాలను వెనక్కి నెట్టేసి, రాజకీయ అంకగణిత సాధనంగా మారిందో వివరించింది. న్యాయం కోసం వచ్చిన రిజర్వేషన్ ఎలా అన్యాయంగా రూపాంతరం చెందిందో చెప్పుకొచ్చింది. అందువల్లే తనలా దేశానికి సేవ చేయాలని కలలు కనే ప్రతిభావంతులంతా ఈ దారుణమైన వ్యవస్థ కారణంగా దేశానికి దూరంగా నెట్టబడుతున్నారంటూ ఆవేదనగా చెప్పింది. చివరిగా తాను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదని కేవలం సమాన అవకాశం కోసం విజ్ఞప్తి, అన్నిటికంటే యోగ్యత, ప్రతిభను గుర్తించే వ్యవస్థ కోసం పడుతున్నా తపనే తన ఆవేదన అంటోంది. అలాగే తనలా ఎవ్వరూ భారంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు పోస్ట్లో రాసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట భారతదేశ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. విద్య, దాని అభివృద్ధికి సంబంధించిన సమగ్ర విధానంపై దృష్టిపెట్టాల్సిన తరుణం ఇది, లేదంటే మేధో ప్రవాహం తరలి వెళ్లిపోతుంది అంటూ పలువురు నెటిజన్లు అవేదనగా పోస్టుల పెట్టడం గమనార్హం.(చదవండి: నింద, ఒత్తిడి, మౌనం..ఇంత ప్రమాదకరమైనవా? అంత దారుణానికి ఒడిగట్టేలా చేస్తాయా..?) -
'మా నాన్న గ్రాడ్యుయేట్'..!
అందరికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించదు. కుటుంబ బాధ్యతల రీత్యా కొందరికి అది అందని ద్రాక్షలా ఉంటుంది. అలాంటి వాళ్లు తమకు అవకాశం చిక్కినప్పుడు వయోభారాన్ని సైతం పక్కన పెట్టి చదవాలనుకున్న కోర్సులని చదివేయడమే కాదు ఉత్తీర్ణులై ఆశ్చర్యపరుస్తారు. అలాంటి అద్భుత ఘట్టమే ఇక్కడ చోటు చేసుకుంది. దాన్ని అతని కొడుకు ఎలా సెలబ్రేట్ చేశాడో చూస్తే మాత్రం విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియ నెట్టింట తెగ వైరల్గా మారింది 52 ఏళ్ల ముంబై వ్యక్తి ఎంబిఏ పట్టాని సంపాదించి అద్భుతమైన మైలు రాయిని సాధించాడు. చదవాలనే జిజ్ఞాశ ఉంటే వయసు ఆశయానికి అడ్డంకి కాదని ప్రూవ్ చేశాడు. ఆ అపురూప క్షణాన్ని అతడి కుమారుడు మైత్రేయ సాథే ఎంత అందంగా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశాడంటే..ఆ తండ్రి ఆ సర్ప్రైజ్కి ఉబ్బితబ్బిబైపోయాడు. తన తండ్రి ముఖాకృతితో కూడిన గ్రాడ్యుయేట్ క్యాప్ని ముఖానికి పెట్టుకుని దర్శనమిస్తూ..కంగ్రాట్స్ చెబుతారు. ఆ అనుహ్యపరిణామానికి నోట మాటరాక ఒక్క క్షణంపాటు బిగిసుకుపోయి..ఆ తర్వాత తేరుకుని చిరునవ్వులు చిందిస్తాడు ఆ తండ్రి. అంతేగాదు అతడి కోసం కుటుంబం మొత్తం రాసిన కలర్ఫుల్ సందేశాల నోట్స్ని చదువుతూ..ఉప్పొంగిపోతాడు. పైగా ఆ ఘన సత్కారానికి ఆ తండ్రి ముఖం చిచ్చుబుడ్డిలా కాంతిగా వెలిగిపోతుంది. అందుకు సంబంధించిన వీడియోకి ..'మా నాన్న గ్రాడ్యుయేట్' అనే క్యాప్షన్ జత చేసి మరి పోస్ట్ చేశాడు. ఆన్లైన్లో ఇలాంటి విస్తుపోయే కథలెన్ని చూసినా..ఓ తండ్రి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నప్పుడూ అతడి మొత్తం కుటుంబమే సంబంరంలో మునిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడూ సాధించిన విజయం కంటే వయసు మళ్లినప్పుడూ అంతే ఉత్సాహంతో విజయం సాధిస్తే ఆ కిక్కే వేరు, పైగా ఫ్యామిలీ ముందు హీరో రేంజ్లో ఫోజులిచ్చే ఛాన్స్ని కొట్టేయొచ్చు కదూ..! View this post on Instagram A post shared by Maitreya Sathe 「マイトレヤ サテェ」 (@maitreyasathe) (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!
బృందంగా శాస్త్రీయ నృత్యం చేస్తుంటే రెండు కళ్లు చాలవేమో అన్నంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలో అనుకోని అవాంతరంలా వర్షం వస్తే.. కాలు కదపడం కష్టం. అడుగు వేస్తే జరర్రుమని జారిపోవడం ఖాయం. ఆ చిరుజల్లుల్లో అడుగులు తడబడకుండా..లయబద్ధంగా నృత్యం చేయడం అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ ఈ బృందం వర్షానికే సవాలు విసిరేలా అత్యంత అద్భుతంగా నృత్యం చేశారు. ఇదంతా ఎక్కడ అంటే..కర్ణాటకలోని ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మహిళా విద్యార్థులు బృందంగా భరతనాట్యం చేశారు. అది కూడా హనుమాన్ చాలిసాను నృత్య రూపకంగా ప్రదర్శన ఇస్తున్నారు. అయితే కుండపోత వర్షం కురుస్తున్న ఆ విద్యార్థులంతా ఎక్కడ ఆగకుండా ఎంత లయబద్ధంగా డ్యాన్స్ చేశారో చూస్తే..వావ్ ఏం భరతనాట్య ప్రదర్శన అని ప్రశంసించకుండా ఉండలేరు. అందులో అత్యంత హైలెంట్.. అంతమంది అమ్మాయిల మధ్య ఒకేఒక పురుషుడు భరతనాట్య చేస్తూ కనిపించడం. మన కళ్లుచూస్తోంది నిజమేనా అన్నట్లుగా ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయిగా కలిసిపోయిన ఆ కళాకారుడి నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన వీడియోని ప్రత్యక్షంగా వీక్షించిన ఒక ప్రేక్షకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్గా మారింది. ఆయన ఆ వీడియోకి జత చేసిన పోస్ట్లో వర్షం మీ ప్రదర్శనను అడ్డుకోలేకపోగా..మీ అసామాన్యమైన ప్రదర్శనకు అందంగా మారింది ఆ వర్షపు జల్లు. జోరు వానలో నాట్యం చేయడం మాటలు కాదనేది సత్యమే అయినా..మీ బృందమంతా ప్రతి స్టెప్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శించి అలరించారు అంటూ ఆ వీడియోకి వర్షం మీ బృందం ప్రదర్శన ఇవ్వకుండా ఆపలేకపోయింది అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Prarthana Rao (@prarthana_nanana) (చదవండి: లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..) -
లండన్లో 'బెస్ట్ సమోసా'..! టేస్ట్ అదుర్స్..
విదేశాల్లో మన చిరుతిండ్లు ఫేమస్ అవ్వడం కాదు..వాటి రుచికి విదేశీయులు ఫిదా అవుతూ లొట్టలేసుకుంటూ లాగిస్తున్నారు. కేవలం మన ప్రవాస భారతీయులే కాదు..అక్కడ స్థానిక విదేశీయులు కూడా ఇష్టపడటం విశేషం. మళ్లీ మళ్లీ తినేందుకు ఆయా భారతీయ రెస్టారెంట్లు లేదా హోటళ్లకు వస్తున్న వీడియోలను చూశాం. అయితే ఇప్పుడు మనమంతా ఇష్టంగా స్నాక్స్ టైంలో తినే సమోసా లండన్లో నివశిస్తున్న భారతీయులకే కాదు అక్కడున్న విదేశీయలకు కూడా అత్యంత ఇష్టమైన వంటకంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.ఆ వీడియోలో బీహార్కి చెందిన వ్యక్తి లండన్లోని రద్దీగా ఉండే వీధుల్లో సమోసాలు అమ్ముతున్నట్లు కనపిస్తుంది. ఆ స్టాల్పై ఘంటావాలాస్ సమోసాస్. అతడు సమోసాలను పరిశుభ్రంగా తయారు చేసిన తీరుతోపాటు వాటిని అక్కడివాళ్లు ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తారో కూడా వివరించడమే కాదు, కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అంతేగాదు ఒక బిహారీ లండన్లో ఉన్నంత వరకు సమోసాల రుచి ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని సగర్వంగా చెబుతున్నాడు. అంతేగాదు ఈ వీడయోకి "లండన్లో అత్యుత్తమ సమోసా" అనే క్యాప్షన్ జోడించి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి ఏకంగా 37 మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి మరి..!. View this post on Instagram A post shared by Bihari Samosa UK (@biharisamosa.uk) (చదవండి: భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..) -
భారత్లోనే 11 ఏళ్లుగా రష్యన్ మహిళ..! ఆ మూడింటికి ఫిదా..
విదేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతి వారిని ఇక్కడే ఉండేలా చేసేలా మన్ననలను అందుకుంటోంది. ఎందరో మనసులను దోచిన ఇచ్చటి విభిన్న సంస్కృతులు, ఆతిథ్యం తమను మళ్లీ మళ్లీ ఈ గడ్డ వద్దకు వచ్చేలా చేస్తుందని, వదిలి వెళ్లలేమని అంటున్నారు. అలా ప్రశంసలు కురిపిస్తున్న విదేశీయుల కోవలోకి తాజాగా ఈ రష్యన్ మహిళ కూడా చేరిపోయింది. పైగా ఆమూడింటికే పడిపోయానని, అంతలా అవి తనని ప్రభావితం చేశాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. రష్యాన్ మహిళ కంటెంట్ క్రియేటర్ యులియా ఇన్స్టా పోస్ట్లో భారత్లోనే 11 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక్కడి భారతదేశం తనను ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంది. ఐదు నెలల్లో పూర్తిచేసే ఇంటర్న్షిప్కు వచ్చి..అతుక్కుపోయానంటోంది. ఇంటర్న్షిప్ పూర్తి అయ్యి తిరిగి రష్యాకు పయనమయ్యానని, ఆ తర్వాత కొన్నేళ్లకు సర్కస్ కోసం ఏనుగుని కొనడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయానని చెప్పుకొచ్చింది. ఇక్కడే విజయవంతంగా వ్యాపారం చేయడమే గాక, ఇక్కడ ఒక కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టి ఇక్కడే ఉండిపోయానంటోంది. కట్టిపడేసిన ఆ మూడు విషయాలు..భారతదేశంలో ఆతిథ్యం వేరేస్థాయిలో ఉంటుంది. ప్రజలు చాలా ఘటనంగా స్వాగతిస్తారు. వారి విశాల హృదయం కట్టిపడేస్తుంది. ప్రతి విషయంలోనూ మంచి సహాయకారిగా ఉంటారు. ఇక్కడ చాలామటుకు అందరూ సహాయం చేయడానికే ప్రయత్నిస్తారు. అంతేగాదు భారతదేశం ఒక అయస్కాంతంలాంటిదని, ఇక్కడ ఏమి చూడాలనుకుంటున్నారో, విశ్వానికి ఏమి అందించాలనుకుంటున్నారో, అన్నింటిని ఈనేలే మీకు దిశానిర్దేశం చేస్తుంది. నాలా ఈ భారతదేశంలోకి అడుగుపెట్టి, కొన్ని సవాళ్లను అధిగమించి మరి ఇక్కడి అందాలకు మంత్రముగ్ధులైన వారిక కథలెన్నో నా చెంత ఉన్నాయని ఇన్స్టా పోస్ట్లో రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Iuliia Aslamova (@yulia_bangalore) (చదవండి: Dance For Fitness: మొన్నటి వరకు ఆనంద తాండవమే..ఇవాళ ఆరోగ్య మార్గం..!) -
కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో చోరీ.. ముసుగులతో వచ్చి.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇండోర్లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.Indore में Congress प्रदेश अध्यक्ष Jitu Patwari के घर डकैती की कोशिश...#congress #mpnews #indorenews #latestnews #trendingnow #samaynow pic.twitter.com/dBYqzOHqty— Swatantra Samay (@SamaySwatantra) September 6, 2025ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Breaking Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025 -
టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ..
మానవతావాదులు తాము ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. భారీ వర్షాల వల్ల పంజాబ్లో జన జీవితం అస్తవ్యస్తం అయింది. ఒక వృద్ధుడు టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ, తడుస్తూ ఎక్కడ వరద బాధితులు కనిపించినా వారికి టీ అందజేస్తూ వెళుతున్నాడు. బాధితులకు ధైర్యవచనాలు చెబుతున్నాడు.నిజానికి అతడు కూడా వరద బాధితుడే! వర్షాల దెబ్బకు వంట అనేది లేకుండా ఆకలిదప్పులతో నీరసించిపోయిన బాధితులకు ఆ కాస్త టీ ఎంతో కొంత ఉమశమనం ఇచ్చింది. క్రికెటర్ హర్బజన్సింగ్ (Harbhajan Singh) ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా?‘పంజాబీలను అనుకరిస్తూ కొద్దిమంది జోక్లు చేస్తుంటారు. ఈ వీడియో చూసి అయినా వారిలో మార్పు రావాలి. పంజాబీ ప్రజల మానవత్వాన్నికి చిన్న ఉదాహరణ ఈ వీడియో’‘ కష్టాలు... అని బాధపడుతుంటాంగానీ ఆ కష్టాలే మనుషులను దగ్గర చేస్తాయి. మానవత్వాన్ని పరీక్షిస్తాయి’... ఇలా రకరకాలుగా స్పందించారు యూజర్లు.When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025 -
అయ్యో.. గూడు లేని వనజీవి!
ప్రకృతి ప్రేమికుడిగా.. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మన వనజీవి రామయ్య. అలాంటి వనజీవే పశ్చిమ బెంగాల్ పూరులియాలో ఒకరున్నారు. తన 12వ ఏట నుంచి వన సంరక్షణకు కృషి చేస్తున్నారాయన. ఆ సేవను గుర్తించే కిందటి ఏడాది భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. అయితే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో కూలిన స్థితిలో ఉన్న పూరిగుడిసెలోనే ఆయన జీవనం వెల్లదీస్తున్నారు. బీడుభూమిగా ఉన్న అజోధ్యా హిల్స్ ప్రాంతాన్ని.. పచ్చటి వనంగా తీర్చి దిద్దిన వ్యక్తి దుఖు మాఝీ. అలాంటి వ్యక్తి చందాల మీద అతికష్టంగా గడుపుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ గుడిసె బయట పద్మశ్రీ పురస్కార గ్రహీత అనే బోర్డు ఉంటుంది. ఆ పక్కనే పాత సైకిల్ ఉంటుంది. స్థానికంగా గచ్చ్ దాదూ(Tree Grandfather)గా పేరున్న దుఖు మాజీ.. భార్య, దివ్యాంగుడైన కొడుకుతో కలిసి ఓ పూరీ గుడిసెలో ఉంటున్నాడు. అది వర్షాలకు తడిసి ముద్దవుతూ ఏ క్షణమైనా కూలిపోయే స్థితికి చేరింది. దీంతో గ్రామస్తులు చందాలు వేసుకుని వెదురు బొంగులు, పైన కప్పే టార్పాలిన్ షీట్ అందించారు. సోషల్ మీడియా స్పందనతో ప్రతిపక్ష నేత సువేందు అధికారి రూ.2 లక్షల సహాయం ప్రకటించి, శాశ్వత గృహ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆయనకు ఇప్పటిదాకా సొంతిల్లు లేకపోవడంతో..ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. పలుమార్లు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా ఇల్లు దక్కలేదన్నది ఆ విమర్శల సారాంశం. విమర్శల వేళ అధికారులు స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గతంలోనే ఆయనకు శాశ్వత నివాసం మంజూరైనట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు. అయితే తన పెద్ద కొడుకు వివాహం చేసుకుని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడని చెప్పాడాయన. దాతలు దయ తలిస్తే తన స్థలంలోనే సొంతిల్లు కట్టుకుంటానని వేడుకుంటున్నాడు. మొక్కలను రక్షిస్తేనే మనం స్వచ్ఛమైన గాలి పీల్చగలం అని ఓ పోలీసు అధికారి పంద్రాగష్టున ఇచ్చిన ప్రసంగం ఆయన్ని ఎంతగానో ఆకర్షించిందట. అలా చిన్నతనం నుంచే ఆయన మొక్కల్ని నాటుతూ.. చెట్ల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఐదు వేలకు పైగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగేదాకా సంరక్షణ చూసుకున్నారాయన. ఈయన జీవితాన్ని రుఖూ మాటి దుఖు మాఝీ పేరిట డాక్యుమెంటరీగా తీస్తే.. అది జాతీయ అవార్డు దక్కించుకుంది కూడా. -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
భారత్లోనే బాగుంది.. అందుకే ఇక్కడ ఉండిపోయా..!
ఒక నైజీరియన్ వ్యక్తి భారతదేశంలోనే ఎందుకు ఉన్నాడో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. మరో దేశానికి ఎందుకు వెళ్లాలనపించలేదో కూడా వివరించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యిన వెంటనే భారత్లో అడగుపెట్టి ఇక్కడే ఉండిపోయానని..అంతగా ఈ దేశం తనలోకి కలుపుకుందంటూ భారత్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. అంతేగాదు ఇక్కడే ఉండిపోవాలనిపించేంతగా ఇష్టం పెరగడానికి గల కారణాలేంటో కూడా షేర్ చేసుకున్నాడు. మరి అవేంటో చూద్దామా..!పాస్కల్ ఒలాలే అనే నైజీరియన్ వ్యక్తి భారతదేశం తనకెంత సౌకర్యవంతంగా అనిపించిందో ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. తాను 2021 లాగోస్ విశ్వవిద్యాలయం నుంచి బయటకు రాగానే నేరుగా భారతదేశంలో అడుగుపెట్టానని, ఆ క్షణం నుంచే ఈ దేశం నుంచి కాలు బయట పెట్టలేదని, తిరిగి ఏ విదేశాలకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ఆహారం, భద్రత, బస, వివక్ష వరకు అన్నింటిల్లోనూ స్వచ్ఛమైన స్వేచ్ఛను పొందానని ఆనందంగా చెబుతున్నాడు ఒలాలే. అంతేగాక తాను ఇక్కడే ఉండిపోవడానికి గల ప్రధాన కారణాలను కూడా వివరించాడు.ఇక్కడ ప్రతి ఉదయం ఆందోళనతో మేల్కొను, ఎలాంటి టెన్షన్లేని ప్రశాంత జీవనం గడుపుతానుఅలాగే నా చర్మం రంగు కారణంగా బెదరింపులు ఎదుర్కొనడం అనేవి ఇక్కడ ఉండవు.ఇక్కడ హాయిగా జీవించొచ్చు, ఎలాంటి హడావిడి కల్చర్ ఉండదుప్రజలు ముక్కుసూటిగా ఉంటారు, మంచి నిజాయితీ ఉంటుందితనది నల్లజాతి అని తన జాతిని నిరంతరం గుర్తు చేసేలా వివక్షకు తావుండదు.అలాగే యూఎస్లో కంటే ఇక్కడ రాత్రిపూట వీధుల్లో సురక్షితంగా వెళ్లగలనుఇంటి అద్దె చౌక, ఆహారం సహజమైనది, ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛ అనేది చాలా దేశాల్లో అది కాగితాలకే పరిమితమై ఉంది, కాని ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుస్తుంది. నా ఆహార్యాన్ని బట్టి కాకుండా కేవలం ఒక వ్యక్తిగా గౌరవం లభిస్తుంది. అందువల్లే ఏ విదేశాలకు వెళ్లకుండా భారత్లోనే ఉండిపోయానని, ఇదొక స్వర్గసీమ అంటూ కితాబులిచ్చేశాడు. అందుకు సంబంధిచిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతేగాదు నెటిజన్లు మిస్టర్ ఓలాలే మా దేశానికి స్వాగతం, మీ మాటలు వింటుంటే ఒక భారతీయుడిగా చాలా గర్వపడుతున్నా..అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Pascal Olaleye🇳🇬🇮🇳🇩🇪🌏 (@pascalolaleye) (చదవండి: జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..) -
‘బాహుబలి తిరిగొచ్చాడు’.. వీడియో వైరల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఈ క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. అయితే, ట్రాఫిక్ జామ్ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా.. తన బైక్ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో బాహుబలి నగరంలోకి వచ్చేశాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.భారీ వర్షాలు కారణంగా గురుగ్రామ్- ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ బైక్ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్ను జాగ్రత్తగా భుజాలపై బ్యాలెన్స్ చేస్తూ, కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయిన రోడ్డులో నడుస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది.Bahubali! 🔥Ft. Gurugram Rains Traffic JamA man carrying his scooter on his shoulder to bypass traffic jam after heavy rains.. pic.twitter.com/p7qO80dtUG— Keh Ke Peheno (@coolfunnytshirt) September 4, 2025కాగా, యమునా నది వరద డేంజర్ మార్క్ దాటింది. పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. యమునా బజార్ సహా పలు కాలనీలలో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 15 వేల మంది ప్రజలను తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ వెల్లడించింది. మరో వారం పది రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రోజు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. 67 సంవత్సరాల తర్వాత మూడోసారి 207 మీటర్ల డేంజర్ మార్కును దాటింది. వరద నీరుతో పాటు మురుగునీరు కూడా ప్రవహిస్తుంది. వరద మురుగతో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అలా... ఆమె ప్రాణాలు కాపాడారు!
ఉత్తర్ప్రదేశ్లోని బరేలికి చెందిన అమ్మాయి ఒకరు ‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అని అర్థరాత్రి దాటిన తరువాత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ‘మెటా’ వెంటనే ఈ పోస్ట్ను స్టేట్ పోలీస్ మీడియా సెంటర్కు పంపి పోలీసులను అలర్ట్ చేసింది. కేవలం పదహారు నిమిషాల వ్యవధిలో ఒక సబ్–ఇన్స్పెక్టర్, కొందరు మహిళా పోలీసులు ఆ అమ్మాయి ఉన్న ఇంటికి చేరుకున్నారు. వాంతులు చేసుకున్న ఆ అమ్మాయి నిస్తేజంగా పడి ఉంది. వెంటనే ఆమెను హస్పిటల్కు తీసుకువెళ్లారు. సమయానికి ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ఆ అమ్మాయి చావు నుంచి బయటపడింది. ఆమె కోలుకున్న తరువాత... ‘ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు?’ అని అడిగితే... తాను ప్రేమించిన వ్యక్తి మాట్లాడడం మానేశాడని, తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని...ఇలా చెప్పుకుంటూ పోయింది. పెరుగుతున్న ఆన్లైన్ సుసైడ్ అటెంప్ట్స్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తర్ప్రదేశ్ పోలీసులు, మెటా భాగస్వామ్యంతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో సుడైడ్–రిలేటెడ్ పోస్ట్లపై నిఘా పెడుతున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్నారు. జనవరి 1, 2023 నుంచి ఆగస్ట్ 25, 2025 వరకు 1,315 మంది ప్రాణాలను కాపాడారు. (చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!) -
అలాంటి ప్రేమనే కదా అంతా కోరుకునేది..!
ఇవాళ ఆలుమగల మధ్య ఉన్న ప్రేమ అనే పదం దారుణంగా అపహస్యం పాలవుతోంది. పెళ్లి అనే పదం కూడా భయాందోళనలు కలిగించేలా మారిపోయింది. అంతలా అనుబంధాలు కనుమరుగైపోతున్న ఈరోజుల్లో అగ్ని కంటే స్వచ్ఛమైన ప్రేమ ఒకటి తారసపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అంతా కోరుకునేది ఇలాంటి ప్రేమనే కదా అంటున్నారు నెటిజన్లు.అయినా ప్రేమించడానికి, ప్రేమించబడటానికి కూడా అదృష్టం ఉండాలేమో..!. సంపాదన ఏదో రకంగా ఆర్జించొచ్చు. ఒక మనిషి ప్రేమను పొందడం, నిలబెట్టుకోవడం రెండూ అంత ఈజీ కాదు. పైగా ఈ రోజుల్లో అలాంటి ప్రేమనేది మచ్చకైనా కానరాని పరిస్థితి. కానీ ఈ వృద్ధ జంట "ప్రేమ అంటే ఎప్పటికీ ప్రేమే" జీవితాంతం అగ్నికంటే స్వచ్ఛంగా ఉంటుంది అని తమ చేతలతో చెప్పారు.జిష్మా ఉన్నికృష్ణన్ అనే సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టింట అందుకు సంబంధించిన వీడియోని షేర్చేశారు.ఆ వీడియోలో ఒక వృద్ధుడు తన భార్య కాలికి పట్టీలు పెట్టుకోవడంలో ఇబ్బందిపడుతుంటే గమనిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే అతను ఆమెకు సహాయం చేసిన తీరు అచ్చం సినిమాలోని హీరో హీరోయిన్లను తలపించేలా ఉంది. అతడు నిజంగా తన భార్యకు సాయం చేసిన తీరు సినిమాలోని సీను మాదిరిగా అత్యంత యాదృచికంగా కనిపించింది.ఆ అపూర్వ క్షణాన్ని చూసిన సోషల్ మీడియా వినయోగదారురాలు ఉన్నికృష్ణన్కి ఒక్కసారిగా రైలులో ప్రయాణిస్తున్నట్లు అనిపించలేదు. జీవితాంత ప్రేమించడం అనే మాటకు అసలైన అర్థాన్ని తెలుసుకున్నట్లు అనిపించిందట. అందుకే ఆయన వీడియోకి ఓ మధురమైన క్షణంలో జీవితాంతం ప్రేమించడాన్ని చూశాను అనే క్యాప్షన్ని జోడించి మరీ ఆ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు ఆ వీడియోని చూసి నెటిజన్లు కూడా అంతా అలాంటి ప్రేమనే కదా ఆశించేది అంటూ ఉద్వేగభరితంగా పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝐉𝐢𝐬𝐡𝐦𝐚 (@jishma_unnikrishnan) (చదవండి: అందువల్లే భారత్కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?) -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
వైరల్ వీడియో.. ఈ పక్షిని చూసే విమానం కనిపెట్టారేమో!
సాక్షి, హైదరాబాద్: ఒక చిన్న పక్షి ల్యాండింగ్ అయ్యే విధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో పక్షి తన గమ్యస్థానానికి చేరే సమయంలో చూపిన నైపుణ్యం ఏరోడైనమిక్స్కు పాఠాలు చెబుతోంది. విమానం ల్యాండింగ్ను ఈ పక్షిని చూసే కనిపెట్టారేమోననిపిస్తోంది కదూ.. ఈ ఆలోచింపజేసే వీడియో.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.ఓ పక్షి.. గమ్యానికి చేరే చివరి దశలో గాలిలో ఎగురుతూ వచ్చి నీటిలో సురక్షితంగా దిగిన దృశ్యం ఆసక్తి కలిగిస్తోంది. ఆ పక్షి కిందకు దిగే ముందు తన రెక్కలతో వేగాన్ని నియంత్రించుకోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పర్ఫెక్ట్ టచ్డౌన్తో నీటిపై దిగుతుంది. ప్రకృతి పక్షికి నేర్పించిన గొప్ప ల్యాండింగ్ టెక్నిక్ను గమనించండి అంటూ ఓ అందమైన వీడియోను ఆయన షేర్ చేశారు.Sharing this lovely video - please observe the great landing technique taught by nature to a bird with clear application of aerodynamics- Short finals, gears down, thrust reversers activated & Perfect touchdown. Aeroplanes copied it ! pic.twitter.com/TL9u3gwKXF— CV Anand IPS (@CVAnandIPS) September 2, 2025 -
హుషారుగా చిందేస్తూ కుప్పకూలిన అసెంబ్లీ ఉద్యోగి
పండుగ పూట అసెంబ్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సిబ్బంది అంతా హుషారుగా వేడుకల్లో మునిగిపోయారు. కొందరు హుషారుగా చిందులేస్తుండగా.. మరికొందరి విజిల్స్, చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈలోపు ఊహించని రీతిలో విషాదం అలుముకుంది. కేరళ శాసనసభలో ఓనం సంబరాల సందర్భంగా సోమవారం విషాదం నెలకొంది. డ్యాన్స్ గ్రూప్లో హుషారుగా చిందులేస్తూ ఓ సిబ్బంది.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఆసుపత్రికి తరలించినా, చేరిన కొద్దిసేపటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన్ని డిప్యూటీ లైబ్రేరియన్ వి. జునైస్ (46)గా పోలీసులు నిర్ధారించారు.వయనాడ్కు చెందిన జునైస్ గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్ దగ్గర పీఏగా పని చేశాడు. 2011 నుంచి కేరళ శాసనసభలో సిబ్బందిగా పని చేస్తూ వచ్చాడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నాయి. క్రీడలంటే ఇష్టమున్న జునైస్.. ఫిట్నెస్ కూడా ఉంది. అయితే ఈ మధ్యే ఛాతీ నొప్పికి చికిత్స తీసుకున్నట్టు బంధువులు తెలిపారు. సోమవారం జరిగిన ఓనం ఈవెంట్స్లో టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్లో జునైస్ బృందం మొదటి బహుమతి గెలుచుకుంది. అయితే.. కాసేపటికే అలా డ్యాన్స్ వేస్తూ ఆయన కన్నమూయడం గమనార్హం. సిబ్బంది మృతితో శాసనసభలో జరిగాల్సిన ఓనం వేడుకలు తక్షణమే నిలిపివేశారు.A 45-year-old man collapsed and died while dancing on stage during the Onam celebrations organised by the Kerala legislative assembly.The deceased was identified as Junais, an assistant librarian who earlier worked as the personal assistant of former MLA PV Anwar.He was… pic.twitter.com/dky9R6XPRP— Vani Mehrotra (@vani_mehrotra) September 2, 2025 -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
కుబేరుడి ‘చిల్లర’ చేష్టలు.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ఆయనొక ప్రముఖ కంపెనీకి సీఈవో. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చిల్లర చేష్టలకు దిగాడు. ఓ చిన్నారి అపురూపంగా భావించిన కానుకను హఠాత్తుగా లాగేసుకున్నాడు. పాపం.. దాని కోసం ఆ చిన్నారి ఆయన్ని బతిమిలాడుకోవడమూ వీడియో రూపేణా ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కుబేరుడిని నెటిజన్లు తెగ తిట్టిపోస్తున్నారు. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో జరిగిన ఓ ఘటన.. నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలాండ్ టెన్నిస్ ప్లేయర్ కామిల్ మజ్చ్శాక్ (Kamil Majchrzak) తన గెలుపు అనంతరం అక్కడున్న అభిమానులతో సందడి చేశాడు. ఆ సమయంలో ఓ చిన్నపిల్లాడికి క్యాప్ ఇవ్వబోయాడు. అయితే.. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఆ క్యాప్ను లాగేసుకుని తన పక్కనే ఉన్న మహిళ బ్యాగులో దాచేశాడు. ఆ పిల్లాడు ఆ క్యాప్ కోసం బతిమాలినా పట్టించుకోలేదు. పైగా తన చేతిలో ఉన్న పెన్నును మాత్రం ఆ పిల్లాడికి అప్పజెప్పాడు. దీంతో ఆ చిన్నారి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. I wonder if this douche canoe grown man at the U.S. Open is worried that he will be recognized after he snatched a hat away from the boy on his left? pic.twitter.com/Q48ATFDoT7— Brick Suit (@Brick_Suit) August 29, 2025దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ చిన్నారి చేతుల్లోంచి క్యాప్ను లాగేసుకున్న వ్యక్తిని.. పోలాండ్కు చెందిన డ్రాగ్బ్రుక్ కంపెనీ CEO పియోటర్ షెరెక్ (Piotr Szczerek)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మజ్చ్శాక్ స్పందనఈ వివాదంపై కామిల్ మజ్చ్శాక్ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా ఆ చిన్నపిల్లాడిని వెతికి.. అతనికి కొత్తగా సంతకం చేసిన క్యాప్తో పాటు ఇతర టెన్నిస్ గిఫ్ట్స్ కూడా అందించారు. ‘‘ఈ క్యాప్ గుర్తుందా?’’ అని మజ్చ్శాక్ తన పోస్ట్లో పేర్కొన్నారు.విమర్శల తరుణంలో.. షెరెక్ సోషల్ మీడియా ఖాతాలు డీయాక్టివేట్ అయినప్పటికీ.. ఆయన పేరుతో గోవర్క్ఫోరం(Gowork) నుంచి ఒక ప్రకటన వైరల్ అవుతోంది. లైఫ్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్.. అనే తత్వాన్ని ప్రస్తావిస్తూ ‘ఇది కేవలం ఒక టోపీ మాత్రమే. అంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. అలాగే, తనపై దూషణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే అది ఆయన నుంచి వెలువడిన ప్రకటనేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే.. టోపీ వివాదం(Cap Controversy) దెబ్బకు షెరెస్ సీఈవోగా పని చేస్తున్న డ్రాగ్బ్రుక్ కంపెనీకి పెద్ద దెబ్బే పడింది. ఓ ఉద్యోగ రివ్యూ ఫోరంలో వేలాది మంది కంపెనీకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కంపెనీ సేవలను బహిష్కరించాలంటూ పిలుపు ఇచ్చారు. దీంతో షేర్ వాల్యూ గణనీయంగా పడిపోయి.. కంపెనీకి భారీ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికా ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరోన్ అదే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పని చేసే ఓ ఉద్యోగిణితో క్రిస్ మార్టిన్ కోల్డ్ప్లే షోలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కంపెనీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చి వదిలించుకుంది కంపెనీ. అయితే ఆ మహిళా ఉద్యోగిణిని మాత్రం లాంగ్ లీవ్లో పంపించేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఎఫైర్ ఆయన వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్హౌజ్ గప్చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
కళ్లు బైర్లు కమ్మేలా.. ఈ ‘ఇటుకలు’ చాలా కాస్ట్లీ గురూ..!
మధ్యప్రదేశ్లోని షాడోల్ జిల్లాలో ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఇటుకలు కొనుగోలుకు సంబంధించిన బిల్లు చూస్తే షాక్ కొట్టినంత పనైంది. బుధ్హర్ బ్లాక్ పరిధిలోని భటియా గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే.. ఆ గ్రామ పరిధిలో ఓ అంగన్వాడీ భవనం ప్రహరీ గోడ కోసం ఇటుకను కొనుగోలు చేశారు. మొత్తం 2500 ఇటుకలను కొనుగోలు చేయగా, బిల్లును రూ.1.25 లక్షలకు ఫైనల్ చేశారు. అంటే ఒక్కో ఇటుక ఖరీదు రూ.50 పడిందన్నమాట.ఈ రేటు సాధారణ ధర కంటే పది రెట్లు ఎక్కువ.. రూ. 1.25 లక్షల బిల్లుపై గ్రామ సర్పంచ్తో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా సంతకం చేసి ఆమోదించారు. అనంతరం బిల్లులు మంజూరు చేసుకున్నారు. కాగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక యువత, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఇటుకల కొనుగోలు బిల్లు పెరిబహారా గ్రామానికి చెందిన చేతన్ ప్రసాద్ కుష్వాహా పేరు మీద ఉంది. ఈ ఇటుకలను పటేరా టోలాలోని అంగన్వాడీ భవనం ప్రహరీ గోడ నిర్మాణానికి సరఫరా చేసినట్లు బిల్లులో పేర్కొన్నారు. షాడోల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కేదార్ సింగ్ ఈ వ్యవహారంలో ఏదో తేడా ఉందని అంగీకరించారు. ఇలాంటి బిల్లులు నిర్లక్ష్యం వల్ల జరిగాయా లేక ఉద్దేశపూర్వక మోసమా అని తెలుసుకోవడానికి, క్లస్టర్ స్థాయి అధికారులను రోజుకు 10-12 పంచాయతీలను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు.ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. కొన్ని రోజుల క్రితం కుద్రి గ్రామ పంచాయతీ రెండు పేజీల ఫోటో కాపీల కోసం రూ. 4,000 మంజూరు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే, మధ్యప్రదేశ్లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు. -
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు ఏమైంది.. ఎక్కడ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.🚨 BREAKING: Curiosity is rising: Trump hasn’t been seen in 3 days.No public events. No appearances. Silence everywhere.Speculation about his health & power moves grows louder…Is it strategy or concern? 👀What do you think—is this calculated or "Where is Donald Trump" pic.twitter.com/4AvG7heGUw— RX (@TheReal_RX) August 30, 2025నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ను ట్రెండింగ్లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.🚨MAJOR BREAKING: Whispers are traveling through the Washington press pool that Donald Trump has not been seen since Tuesday and has zero publicly planned events through the weekend. This clip is apparently one of the last times Trump was seen by the press. What’s going on? pic.twitter.com/sM4sd0PQMK— CALL TO ACTIVISM (@CalltoActivism) August 30, 2025🚨PRAY FOR PRESIDENT TRUMP 🇺🇸 🙏 Reports coming out of America suggest that Donald trump hasn't been seen publicly or privately since Tuesday Also, the White House website is seemingly out of order.This news is very worrying for MAGA after photos released last week of an… pic.twitter.com/wsM2MYtjrm— BRITAIN IS BROKEN 🇬🇧 (@BROKENBRITAIN0) August 30, 2025 -
ఏ తల్లి అయినా అమ్మే..! హ్యాట్సాప్ బ్రదర్
భారతదేశంలో మహిళ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుత్తున్న తరుణంలో ఈ ఘటన భరోసాకు అర్థం ఏంటో చూపించింది. సోషల్ మీడియాలో చాలామంది మహిళలు పంచుకున్న చేదు అనుభవాలు రీత్యా ఇక్కడ క్యాబ్ రైడ్ అనేది అంత సేఫ్ కాదనే అభిప్రాయం సర్వత్రా బలంగా ఉంది. అలాంటి టైంలో ఈ డ్రైవర్ ప్రతిస్పందన ప్రతి ఒక్కర్ని కదిలించింది. నెటిజన్లు అతడిని హ్యాట్సాప్ భయ్యా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యాషికా రాపారియా అనే భారతీయ మహిళ ఒక రైడ్లో తాను ఎదుర్కొన్న అసాధారణ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ క్యాబ్ డ్రైవర్ అసాధారణ సంజ్ఞ తనను మంత్రముగ్గుల్ని చేసిందని అంటోందామె. ఇలాంటి మనుషులకు కూడా ఉన్నారా అని భావన కలిగిందని చెప్పుకొచ్చిందామె. ఇది పూణేలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆమె తన నెలల పసికందుతో కలిసి క్యాబ్లో ప్రయాణిస్తోంది. ఇంతలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది. అయితే ఇది భారతదేశం. ఇక్కడ పాలివ్వడం అనేది అసాధారణమైన పనిగా భావిస్తారని ఫీల్తో క్యాబ్లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడింది. ఆ నిమిత్తమై ముందు జాగ్రత్తగా ఒక దుప్పటి కూడా తెచ్చుకుంది. అది వేసుకని మరి పాలిస్తున్న ఏదో తెలియని భయంతో చాలా నెర్వస్గా ఫీలయ్యింది. అలానే భయపడుతూ ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు బీ సేవ్ అంటూ భరోసా ఇస్తున్నట్లుగా తన ముందున్న అద్దాన్ని ఎడ్జెస్ట్ చేశాడు. అస్సలు వెనుకసీటులో ఏం జరుగుతుందనేది అస్సలు ఆడ్రైవర్కి తెలియను కూడా తెలియదు. ఒక్కసారిగా ఆ బిడ్డ తల్లిని ఒక్క సంజ్ఞతో ఓ తల్లికి గౌరవం తోపాటు భద్రతకు అర్థం ఏంటో చేతల్లో చేసి చూపించాడు. అయినా అవతలివాళ్లకు భరోసా ఇవ్వాలంటే మాటలతో పనిలేదని, చిన్న సర్దుబాటు చాలని చెప్పకనే చెప్పాడు. క్యాబ్ డ్రైవర్లపై ఉండే అభిప్రాయమే మార్చుకునేలా చేశాడు తన ప్రవర్తనతో. అంతేగాదు మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు కూడా అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది ఆ తల్లి. View this post on Instagram A post shared by Yashika Raparia (@baby_led_parenting) (చదవండి: గణేశ్ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. ! వీడియో వైరల్) -
చివరి క్షణాల్లో ప్రయాణికులను కాపాడి..
ఒక్క ప్రాణం కాపాడిన.. వాడిని దేవుడితో సమానం అంటారు కదా. అలాంటిది తన చివరిక్షణాల్లోనూ పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడాడు ఇక్కడో డ్రైవర్. హృదయ విదారకమైన ఈ ఘటన బస్సులోని సీసీటీవీల్లో రికార్డయ్యింది. రాజస్థాన్లోని పాలి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కదిలే బస్సులో ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా.. దానికంటే కొన్ని నిమిషాల ముందే అతను డ్రైవర్ సీటు నుంచి తప్పకుని హెల్పర్కు స్టీరింగ్ అప్పగించాడు. ఈ ఘటన అక్కుడున్నవాళ్లను తీవ్రంగా కలిచివేసింది. మధ్యప్రదేశ్ ఇండోర్ నుంచి జోధ్పూర్ రాజస్థాన్కు ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు వెళ్తోంది. బస్సు పాల్వి జిల్లా కేల్వా రాజ్నగర్ చేరుకోగానే.. డ్రైవర్ సతీష్ రావు తనకు ఒంట్లో ఏదోలా అనిపించడంతో వెంటనే స్టీరింగ్ను సహచర డ్రైవర్కు అప్పగించారు. దగ్గర్లో ఏదైనా క్లినిక్, మెడికల్ షాప్ ఉంటుందోనని చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అస్వస్థతతోనే సతీష్ బస్సులో అలాగే ముందుకు సాగారు. కాసేపటికే అకస్మాత్తుగా మూర్చపోయి కుప్పకూలిన దృశ్యం కనిపించింది. ప్రయాణికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సైలెంట్ హార్ట్ అటాక్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడారంటూ సతీష్పై అంతా ప్రశంసలు గుప్పిస్తూ నివాళులర్పిస్తున్నారు. View this post on Instagram A post shared by NDTV Rajasthan (@ndtvrajasthan) -
ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!
ఫుడ్ డెలివరి బాయ్ సాధారణంగా కస్టమర్తో మేడమ్ మీ ఆర్డర్ అని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇతడు ఏకంగా ఐ లవ్ యు అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆ మహిళా కస్టమర్ కూడా ఐలవ్ యు అని అతడికి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. సినిమాల్లో చూపించినట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడటం అన్నట్లుగా ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కట్చేస్తే ఆ తర్వాత ఇద్దరూ..ఇదంతా చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్కు చెందిన 27 ఏళ్ల లియు హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్లింది. ఆమె అక్కడ కిండర్ గార్టెన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడే ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హన్నా అతడిని చూడటం అదే తొలిసారి. అయితే ఆ రోజు ఆ ఫుడ్ని మేడపైన రూమ్కి డెలిరీ చేయాల్సి ఉంది. ఆ నిమిత్తం లిప్ట్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు హన్నా కూడా అదే లిఫ్ట్లో ఉండటం జరిగింది. దాంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్..!.. ఐలవ్ యు అని పలికరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ..ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యు అని రిప్లై ఇచ్చేసింది. అంతే ఇరువురు ఒక్కసారిగా తెల్లబోయనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపు. అంతే ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది. డెలివరీ బ్యాకెండ్ యూప్ సాయంతో ఇరువురు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధంలేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యునికేషన్ సమస్యకు తావులేకుండానే సాంకేతిక సాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేగాదు జూన్లో తన బాయ్ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతడిని యూఎస్ తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ..లియు మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారడమే కాదు..మనోడు మాములోడు కాదు అంటూ లియూపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ..పోస్టులు పెట్టారు.(చదవండి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..) -
అర్రే... క్షణంలో రూ. 25 లక్షలు మిస్.. కానీ అదే తెలివైన పని!
బిగ్బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వస్తున్న టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్పతి 17' (KBC 17) తాజా ఎపిసోడ్లో, బీహార్కు చెందిన మిథిలేష్ దురదృష్టవశాత్తూ రూ. 50 లక్షల ప్రైజ్మనీని పోగొట్టుకున్నాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినప్పటికీ కేవలం రూ. 25 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండ్లో గెలిచిన తర్వాత, షోలో హాట్ సీట్లో కూర్చుని అన్ని వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు. రూ. 50 లక్షల బహుమతిని గెల్చుకునే సమాధానం వద్ద సందిగ్ధంలో పడిపోయాడు.(భర్తతో కలిసి దీపికా గణపతి పూజ, రణ్వీర్ న్యూ లుక్ వైరల్)ప్రశ్న: "ఢిల్లీ ఎర్రకోటను రూపొందించిన ఆర్కిటెక్ట్ తన పేరు మీద ఒక నగరం పేరును కలిగి ఉన్నాడు. అది ఏ నగరం?" ఆప్షన్స్ "ఎ. ఇస్తాంబుల్, బి. హెరాత్, సి. లాహోర్, డి. మషాద్"సరైన సమాధానం లాహోర్. సమాధానం ఇవ్వలేకపోయాడు షో నుంచి నిష్క్రమించి రూ. 25 లక్షలతో వెళ్ళిపోవలసి వచ్చింది. ఆట నుండి నిష్క్రమించే ముందు, సమాధానం ఎంచుకోమని అడిగారు బిగ్బీ. అయితే మిథిలేష్ కరెక్ట్ సమాధానం లాహోర్నే ఎంచుకున్నాడు. కానీ అప్పటికే షో నుంచి వైదొలిగాడు కాబట్టి. అతనికి రూ. 25 లక్షలే ముట్టాయి. ఒక వేళ షోనుంచి నిష్ర్రమించకుండా సమాధానం తప్పుగా చెప్పి ఉంటే అతని ప్రైజ్మనీ రూ. 3.2 లక్షలకు పడిపోతుంది. (బాయ్ ఫ్రెండ్తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్)ఢిల్లీలోని ఐకానిక్ ఎర్రకోట 17వ శతాబ్దపు ప్రఖ్యాత మొఘల్ వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరికి దక్కింది. తాజ్ మహల్ ప్రధాన వాస్తుశిల్పిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. మాస్టర్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ.అంతుకుముందు అమితాబ్తో సంభాషణలో భాగంగా మిథిలేష్ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేశాడు. ఎన్ని కష్టాలెదురైనా, తన సోదరుడిని చదివించి, మంచి భవిష్యత్తునివ్వాలనేది తన డ్రీమ్ అని మిథిలేష్ తెలిపాడు. అలాగే పుట్టినరోజును తనతో జరుపుకోవాలని పట్టుబట్టే వైనాన్ని గురించి కూడా చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: అత్తి పండ్లతో అదిరిపోయే ప్రయోజనాలు.. లైంగికశక్తికి కూడా! -
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్లో వచ్చారు. రోహితాష్ లాయర్తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
కోనేరులో కాళ్లు కడిగిన బిగ్బాస్ బ్యూటీ.. అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి
దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్.. వారం కిందట గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో రీల్ రూపేణా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.గురువాయూర్ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. జాస్మిన్ జాఫర్(25).. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేమ్తోనే బిగ్బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆ సీజన్లో సెకండ్ రన్నరప్గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది. -
భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!
మన హైదరాబాద్ ఎందరికో ఆతిథ్యం ఇవ్వడమే గాక వాహ్ భాగ్యనగరం అని అనిపించుకుంది. ఈ నగరం తన రుచులతో, సంస్కృతితో చాలామంది అభిమానులను సంపాదించుకుంది కూడా. అలాంటి మన భాగ్యనగరంలోని హైటెక్ సొగసులకు ఫిదా అవ్వుతూ..వావ్ అని నోరెళ్లబెట్టింది ఈ విదేశీ మోడల్. అంతేగాదు ఐ లవ్ హైదరాబాద్ అని అంటోంది కూడా.ఢిల్లీకి చెందిన రష్యా మోడల్ క్సేనియా మన హైదరాబాద్లోని ఆకాశ హర్మ్యాలు, మౌలిక సదుపాయాలను చూసి మంత్రముగ్దురాలైంది. హైటెక్ సిటీలోని టెక్ హబ్ని చూసి ఆశ్చర్యపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ..ఇది ముంబై అనుకుంటున్నారు కాదు హైదరాబాద్ అంటూ తాను చూసిన వాటిని అన్నింటిని చూపిస్తోంది వీడియోలో. ఆకాశాన్ని తాకేలా ఉన్న విలాసవంతమైన ఆ బిల్డింగ్లు కళ్లుతిప్పుకోనివ్వడం లేదని చెబుతూ..హైటెక్ నగరంపై ప్రశంసల జల్లు కురిపించింది. అంతేగాదు ఇక్కడ స్కైలైన్లు, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దిన తీరు తదితరాలన్నింటిని అభినందించింది. అంతేగాదు ఆ వీడియోకి "హబీబీ, ఇది దుబాయ్ కాదు, హైదరాబాద్," అనే క్యాప్షన్ని జోడించి మరి పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కూడా..ఇక్కడ భాషా వివాదం ఉండదని, మంచి వాతవరణానికి నెలవు, అలాగే భారతదేశానికే ఈ నగరం గర్వకారణం. మాకు కూడా అత్యంత ఇష్టం అని కితాబిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝙆𝙨𝙚𝙣𝙞𝙞𝙖✨ (@vegkseniia) (చదవండి: ఆమె మోడల్ కాదు..ఐపీఎస్ అధికారిణి..! సక్సెస్ని ఆస్వాదించేలోపే..) -
జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్
సోషల్ మీడియా పిచ్చి, షేర్, లైక్స్ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం విషాదకరంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల అవుతోంది. ఈ సంఘటన రీల్స్ కోసం, సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని గంజాం జిల్లాలోని బెర్హంపూర్కు చెందిన 22 ఏళ్ల సాగర్ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు కోరాపుట్ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇక్కడ సాగర్ వీడియో రికార్డ్ చేస్తూ ప్రవాహా ధాటికి ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారుమరోవైపు వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారుఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! -
రామ్ భజనలకు లయబద్ధంగా ఆర్థికవేత్త స్టెప్పులు..!
ప్రధానమత్రి ఆర్థిక మండలి(EAC–PM) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అయోధ్య రాముడి భక్తిగీతాలకు ఆయన ఉత్సాహంగా నృత్యం చేశారు. అది కూడా ఓ సాధారణ వ్యక్తిగా నవ్వతూ చిందులేశారు. ఆ నృత్యం అక్కడున్న వారందని ఆకర్షించడమే కాదు..ఒక్క క్షణం తన హోదాను మరిచిపోయి భక్తిపారవశ్యంతో చేస్తున్న ఆ నృత్యం అందరిని అలరించింది. న్యూఢిల్లీలో సంగమ్ టాక్స్ నిర్వహించిన స్వరాజ్య కాన్క్లేవ్ 2025 సందర్భంగా ఆర్థికవేత్త సన్యాల్ భజనల్లో పాల్గొన్నారు. ప్రముఖు వక్తల ఉపన్యాసం సెషన్ల జనసందోహలోనే సీనియర్ ఆర్థికవేత్త తన సాధారణ విధాన కేంద్రీకృత ఇమేజ్ను పక్కకు యువకుడి మాదిరిగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోని ఒక సోషల్ మీడియా యూజర్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ. ప్రధాని ఆర్థిక వ్యవస్థను నడపడానికి సహాయపడే వ్యక్తి పదివ శతాబ్దపు నౌకా నిర్మాణ వేత్తగా స్టెప్పులు వేస్తూ..చరిత్ర పాఠ్యపుస్తకాలను తిరగ రాసేలా రామభజనలకు బ్రేక్ డ్యాన్స్లు వేశాడు అని పేర్కొన్నారు. కాగా, ఆయన భారతదేశ సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై స్పష్టమైన అభిప్రాయల చర్చలో కూడా పాల్గొన్నారు. అలాగే చార్టడ్ అకౌంటెంట్ కంటెంట్ క్రియేటర్ కుశాల్ లోధా పాడ్కాస్ట్లో కూడా అతను వ్యవస్థపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టాడు. చాలామంది ఈ సివిల్స్ ఎగ్జామ్ సుమారు 99% మంది వైఫల్యమవుతున్నారు. అయినా అన్నేళ్లు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం వృధా చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు కూడా. అంతేగాక దేశం ఈ పరీక్ష విధానంలోని అసమాన ప్రాముఖ్యతను పునః పరిశీలించాలని భావించారు కూడా. Imagine being the guy who helps the PM run the economy, cosplays as a 10th-century shipbuilder, rewrites history textbooks… and then break dances on Ram bhajans.Yeah, that’s @sanjeevsanyal 🙇🏻 pic.twitter.com/RAQBdvioT4— Prateek (@poignantPrateek) August 22, 2025 (చదవండి: ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!) -
రీల్స్ పిచ్చి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు..!
రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం. సమయం, సందర్భం లేకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే ఆత్రమే తప్ప, అసలు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది గమనించకపోవడంతో ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది. తాజాగా ఒడిశాలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఒడిశాలోని కోరాపూర్ జిల్లాలోని దుడుమా వాటర్ ఫాల్ని తన కెమెరాలో బంధించి రీల్స్గా పెడదామనుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. డ్రోన్ సాయంతో ఆ వాటర్ ఫాల్ను బంధించే క్రమంలో గంజామ్ జిల్లా బెర్హాంపూర్కు చెందిన సాగర్ టుడు అనే 22 ఏళ్ల యువకుడు ఆ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూ బృందం. సాగర్ టుడే అనే యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఆ స్పాట్కు వచ్చాడు. రెగ్యులర్గా పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ తన యూట్యూబ్ చానల్స్లో పోస్ట్ చేసే సాగర్.. డ్రోన్ కెమెరాతో ఆ వాటర్ ఫాల్ను కెమెరాలో తీస్తున్నాడు. అయితే కోరాపుట్లోని లామ్టాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మచకుండ ఆనకట్ట అధికారులు ఆనకట్ట దిగువన నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే ఆ సమయంలో సాగర్ ఒక బండరాయిపై నిలబడి డ్రోన్ను నియంత్రిస్తున్నాడు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో బండారాయిపై ఉన్న అతను నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే అతని కోసం స్థానికుల సాయంతో రెస్క్యూ బృందం చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం లభించలేదని పోలీసులు తెలిపారు.The video is reportedly from Koraput, where a YouTuber was swept away by strong currents at Duduma Waterfall.People must exercise extreme caution while filming and never put their lives at risk.Such a tragic incident. pic.twitter.com/8hHemeWv2e— Manas Muduli (@manas_muduli) August 24, 2025 -
ఆ ప్రేమ లేఖ ఖరీదు ఎంతో తెలిస్తే..విస్తుపోతారు..!
ఈ రోజుల్లో ప్రేమ అనే పదం కనుమరుగైపోతోంది. పచ్చని సంసారాలు చిన్న చిన్న అపార్థాలతో భగ్గుమంటున్నాయి. అలాంటి తరుణంలో కొన్ని ప్రేమకథలు వింటుంటే..అలాంటి ప్రేమలు ఇప్పుడెందుకు ఉండటం లేదు అనిపిస్తోంది. అలాంటి భావోద్వేగభరిత లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారింది.అదేంటంటే..భారత మాజీ ఆర్మీ అదికారి కెప్టెన్ ధర్మవీర్ సింగ్ తన ప్రియురాలు రాసిన లేఖను పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె అతడి అర్థాంగి. తాను 2001 ఆ టైంలో చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరినప్పుడు రాసిన లవ్లెటర్ అని చెప్పుకొచ్చారు. తన స్నేహితురాలైన ఠాకురైన్ ఆ ప్రేమలేఖ రాసినట్లు వివరించారు. అయితే సైనిక అకాడమీలో లెటర్లు మావద్దకు చేరాలంటే సీనియర్లు పెట్టే షరతులను, టెస్ట్లను అంగీకరించాల్సి వచ్చేది. అయితే తనకు వచ్చిన లేఖ చాలా బరువుగా ఉందంటూ తన సీనియర్లు తన చేత ఏకంగా 500 పుష్అప్లు చేయాలని బలవంతం పెట్టారట. దాంతో చేసేదేమి లేఖ అన్ని పుష్అప్లు చేయక తప్పలేదని చెప్పుకొచ్చారు. తాను అకాడమీలో ఉండగా అందుకున్న మొదటి లేఖ అదేనట. రాయడానికి ఎంత టైం పట్టిందో గానీ, ఆ భావాలు తన మనసులో ఇంకా అలానే పదిలంగా ఉన్నాయంటూ ఆ లేఖ తాలుకా వీడియోని జత చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ వీడియోని చూసి ఆమెది చాలా అందమైన చేతిరాత, మీ ప్రేమ కథ హృదయాన్నిదోచే గొప్ప ప్రేమకథ అని ప్రశంసిస్తూ పోస్టుల పెట్టారు. View this post on Instagram A post shared by Capt. Dharmveer Singh (@capt_dvs) (చదవండి: ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!) -
ఆమె చిరునవ్వులో ఏదో మాయజాలం..!
ఒక్క చిరునవ్వు సంభాషణతో పనిలేకుండా చేస్తుంది. అదే వెయ్యి మాటలకు సమానం అని చెప్పొచ్చు. కొందరు ప్రతి మాటకు చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్పి..అవతలి వారి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి హృదయపూర్వక సంఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఆమె ఆ ఒక్క సంజ్ఞతో సంభాషణకు తావివ్వకుండా మాట్లాడింది.అందుకు సంబంధించిన వీడియోనెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సంచిత అగర్వాల్ అనే కంటెంట్ క్రియేటర్ ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది అచ్చం సినిమాలో కనిపించే సన్నివేశంలా ఉంటుంది. ఆ వృద్ధ మహిల కృజ్ఞత చూపిస్తూ..ఆమె సాయం తీసుకుంటుంది. ఆ కారు ఎక్కగానే ఆమె ముఖం వెలిగిపోతుంది. ఎక్కడకి వెళ్లున్నావని సంచిత ప్రశ్నించగా ఆమె "జీవన్ భారతి" అని సమాధానం ఇస్తుంది. గమ్యస్థానంకి చేరుకోగానే కంటెంట్ క్రియేటర్ జాగ్రత్తలు చెబుతూ నిష్క్రమిస్తుంది. అయితే ఆమె మాత్రం మారుమాట్లాడకుండా ఒక్క చిరునవ్వుతో సమాధానమిస్తుంది. చిన్న స్మైల్తో తన భావన అంతా చెబుతున్నట్లుగా ఉంది ఆ వృద్ధురాలి నవ్వు. ఆ నవ్వులో ఏదో మాయ జాలం ఉంది అంటూ ఇన్స్టాలో ఆ విషయాన్ని షేర్ చేసుకుంది కంటెంట్ క్రియేటర్. అంతేగాదు కొన్నిసార్లు జీవితంలో సినిమాలోని సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనే క్యాప్షన్తో ఈ వీడియోని పంచుకున్నారామె. ఈ వీడియోకి ఏకంగా రెండు మిలియన్ల వ్యూస్, లైక్లు వచ్చాయి. ఇంకెందుకు మీరు ఓ లుక్కేయండి మరి.. View this post on Instagram A post shared by Sanchita Agarwal (@littlesweet_family) (చదవండి: వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది) -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
రెండు నెలల బిడ్డను కాపాడేందుకు నర్సు సాహసం వీడియో వైరల్
ఆపద సమయంలో, విధి నిర్వహణలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారే అసలైన హీరోలు. ఒక పసిబిడ్డను కాపాడేందుకు షీరోనర్స్ చేసిన సాహసం, ధైర్యం విశేషంగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మీ ధైర్యానికి సెల్యూట్! అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.టిక్కర్ గ్రామానికి చెందిన స్టాఫ్ నర్సు కమల అనారోగ్యంతో ఉన్న పసిపాపకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు హురాంగ్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇటీవలి భారీ వర్షాల కారణంగా విస్తృతంగా విధ్వంసం సంభవించింది. సిల్బుధాని , తార్స్వాన్ పంచాయతీలలో రోడ్లు , ఫుట్బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ గ్రామానికి వెళ్లే మార్గం కష్టంగా మారింది. పద్దర్ సబ్ డివిజన్ పరిధిలోని చౌహార్ లోయ మండిలోని అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. అటు చూస్తే కాలువ పొంగిపొర్లుతోంది నీరు చాలా వేగంగా ప్రవహిస్తోంది ఏ మాత్రం స్లిప్ అయినా ప్రాణాలకే ముప్పు. అయినా సరే వృత్తి ధర్మం నెరవేర్చాలనే ఆశయంతో రాళ్లపై ఒక్క ఉదుటున దూకి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ కాలువ దాటింది. Meet Staff Nurse Kamla, who risked her life to ensure a two-month-old baby received a crucial injection. With the bridge in her area swept away, she crossed the river to reach the child. She is From Paddhar's Chauharghati, Mandi. @CMOFFICEHP @mansukhmandviya @nhmhimachalp @WHO pic.twitter.com/o9JFmIHskx— Vinod Katwal (@Katwal_Vinod) August 23, 2025> అద్భుత సాహసానికి సంబంధించిన ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలోని సుధార్ పంచాయతీలోని చౌహర్ఘాటిలో చోటు చేసుకుంది. నర్సు ధైర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అదే సమయంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్రంట్లైన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రమాదాలపై ఆందోళన కూడా వ్యక్తమైంది. ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు -
Viral Video: ఒళ్లు గగుర్పొడిచేలా.. చిరుత పులినే తరిమికొట్టిన వీధి కుక్క
వీధి కుక్క.. చిరుత పులి.. ఒళ్లు గగుర్పొడిచే పోరాటం.. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాడోపేడో తేల్చుకుందామన్నట్టుగా.. చిరుత పులితోనే వీధి కుక్క పోరాటానికి దిగింది. ఆ చిరుతను దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఈ దృశ్యం చూసిన అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.నిఫాడ్లో రాత్రి సమయంలో గ్రామంలోకి చేరుకున్న ఓ చిరుత.. వీధి కుక్కపై దాడి చేసింది. దీంతో తిరగబడిన ఆ శునకం.. పులిపైనే దాడికి దిగింది. తన నోటితో ఒక్కసారిగా చిరుత మెడని గట్టిగా పట్టుకుని.. తన అదుపులోకి తెచ్చుకుంది. భయపడకుండా కుక్క కసిగా పట్టేసి దూకుడుగా చిరుతను దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి తనను తాను విడిపించుకుని సమీప పొలాల వైపు పరుగులు పెట్టింది. కుక్క పులి దాడి నుంచి బయటపడింది. అయితే, చిరుత గాయపడిందా? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలపై స్పష్టత రాలేదు.A stray dog and a leopard had a face off in Nashik’s Niphad, with the dog astonishingly overpowering the big cat and dragging it nearly 300 metres before it fled. The video of the encounter has gone #viral .#leopard #StrayDogs #viralvideo #Maharashtra #nashik #MaharashtraNews pic.twitter.com/wMswGJKTQv— Salar News (@EnglishSalar) August 22, 2025 -
బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్తో ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid) -
16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?
ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం గ్రామం ఫేమస్ వంటకం పూతరేకులు. జీఐ ట్యాగ్ దక్కించుకున్న ఈ స్వీట్ వివాహాలు, పండుగల్లో భాగమై అందరు ఇష్టపడే వంటకంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫేమస్ స్వీట్ని నచ్చిన పర్యాటనలకు వెళ్లినప్పుడూ కూడా వెంట తీసుకువెళ్తాం. అది కామన్. కానీ ఎత్తైన పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడూ లేదా ఎముకలు కొరికే చలిప్రాంతాల్లో దీన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశారా.!. ఇదంతా ఎందుకంటే 16 వేల అడుగుల ఎత్తులో హిమగిరులను చూస్తూ.. తెల్లటి కాగితం పొరల్లా ఉండే ఈ పూతరేకులను తింటే ఎలా ఉంటుందో ఆలోచించారా..? ఇంకెందుకు ఆలస్యం తింటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి మరి..ఆధ్యాత్మిక గురు సద్గురు జగ్గీ వాసుదేవ్,ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన తన కైలస యాత్రలో భాగంగా..16,400 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాలను చూస్తూ..ఈ స్వీట్ని ఆస్వాదించారు. ఎతైన, కొండలు, మంచు పర్వతాల వద్ద కొన్ని వంటకాలు రుచి మారుతుంది. ఒక్కోసారి పాడైపోతాయి కూడా. బ్రెడ్, ఎనర్జీ బార్లు, చాక్లెట్లు సూప్ లాంటివి అక్కడ చలికి బాగా గట్టిగా మారిపోతాయి. తినేందుకు అంత బాగోవు కూడా. మరి ఈ వంటకం రుచి కూడా అలానే ఉంటుందా..! అన్నట్లుగా సద్గురు ఆ ప్రదేశంలో ఈ గ్రామీణ వంటకాన్ని తింటూ..చిన్నపిల్లాడి మాదిరిగా ఎంజాయ్ చేశారు. బహుశా నాలా ఎవ్వరూ ఈ ప్రాంతంలో ఈ టేస్టీ.. టేస్టీ.. వంటకాన్ని తిని ఉండరు.. హ్హ..హ్హ.. అంటూ ఆనందంగా తినేశారు. ఈ ఎత్తైన హిమాలయాలు భక్తికి నియంగానే కాదు ప్రముఖ వంటకాలను ఆస్వాదించేందుకు వేదికగా మారిందా అన్నట్లుంది కదూ..!. ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురంకి చెందిన ఈ గ్రామీణ వంటకం హిమాలయాల వద్ద కూడా దాని రుచిని, రంగుని కోల్పోలేదు. ఇది గ్రామీణ వంటకం గొప్పతనానికి నిదర్శనం కాబోలు. పొరలు పొరలుగా చక్కెర లేదా బెల్లం యాలకులు, డ్రైప్రూట్స్, నెయ్యితో చేసే వంటకం నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది. అబ్బా..! తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) (చదవండి: శునకాలనే దైవంగా ఆరాధించే క్షేత్రం..! ఎక్కడుందంటే..) -
పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : షాకింగ్ వీడియో
అంగరంగ వైభవంగా పెళ్లి.... వేల మంది అతిథులు వేల కోట్ల రూపాయల ఖర్చు ఇలా మన దేశంలో ముఖేష్ అంబానీ ,అదానీ లాంటి కుబేరుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసు. భారీ కట్నాలు, కానుకల గురించి మరీ బహిరంగంగా కాకపోయినాఅప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. మనదేశంలో వరుడుకిచ్చిన షాకింగ్ కట్నం చర్చనీయాంశంగా మారింది.ఇండియా వరకట్నం చట్టపరంగా నేరం. కానీ కట్న కానుకలివ్వడం లోపాయికారీగా జరిపోతూనే ఉంది. కానీ ఈ వీడియోలో వరుడికిచ్చిన కట్నం గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఏకంగా ఒక పెట్రోల్ పంపు, 210 ఎకరాల భూమి, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల నగదును కట్నంగా ఇచ్చారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ప్రస్తావించడం విశేషం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Wednesday @Shizukahuji అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారుఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep— Wednesday (@Shizukahuji) August 20, 2025 దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆదాయ పన్ను శాఖ, ఈడీ ఎక్కడ ఉన్నాయి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా కట్నం తీసుకుంటోంటే పోలీసులు స్పందించరా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు.ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్
జపనీస్ దంపతులు నకయమ–సాన్, సచికో–సాన్ జపాన్లోని కసుగలో ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ పేరుతో ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. ఈ దంపతులకు ఇండియా అంటే ఇష్టం. ఇండియాలోని రుచికరమైన వంటలు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టంతోనే ‘ఇండియన్ స్పైసీ ఫ్యాక్టరీ’ని ప్రారంభించారు.బెంగాలీ సంప్రదాయ వంటకాల నుంచి దక్షిణాది వంటకాల వరకు ఈ రెస్టారెంట్లో వడ్డిస్తారు.మరో విశేషం ఏమిటంటే ఈ రెస్టారెంట్ యజమాని సచికో ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ఆమె కొంతకాలం టు కోల్కత్తాలో జపానీ రెస్టారెంట్ నిర్వహించింది. దిల్లీ, చెన్నైలలో కూడా రెస్టారెంట్లు నిర్వహించింది.‘ఇండియన్ స్పైసీ రెస్టారెంట్’లో భారతీయ సంగీత పరికరాలు, కళాకృతులు దర్శనమిస్తాయి. ఈ రెస్టారెంట్కు వెళ్లడానికి ఇండియన్స్ మాత్రమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి జ΄ాన్కు వచ్చే భోజనప్రియులందరూ ఇష్టపడతారు. View this post on Instagram A post shared by Sonam Midha (@sonammidhax) (చదవండి: భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..) -
లడ్డూ కావాలా కమలేష్? సీఎంఓకు ఫిర్యాదు, సారీ చెప్పి మరీ..
జెండావందనానికి బూందీ, లడ్డూలు, చాకెట్లు.. జనాలకు పంచడం ఆనవాయితీ. అయితే పంద్రాగస్టు వేడుకల్లో తనకు అవమానం జరిగిందని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. దెబ్బకు దిగొచ్చిన అధికారులు అతని క్షమాపణలు చెప్పి.. తప్పును సరిదిద్దుకున్నారు. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసా?.. అతని చేతిలో ఒక్క లడ్డూనే పెట్టడం!!.మధ్యప్రదేశ్ భింద్ జిల్లా నౌద్ గ్రామంలో ఓ వ్యక్తి పంచాయితీ ఆఫీస్ వద్ద విచిత్రమైన పంచాయితీ పెట్టాడు. అక్కడి గ్రామ పంచాయతీ ఆఫీస్లో జెండా వందనం పూర్తయ్యాక.. జనాలకు లడ్డూలు పంచారు. అయితే అందరికీ రెండు లడ్డూలు ఇచ్చి.. చివరాఖరిలో అటెండర్ తన చేతిలో ఒక్క లడ్డూనే పెట్టడాన్ని కమలేష్ కుష్వాహా భరించలేకపోయాడు. తనకూ రెండు లడ్డూలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే అతనికి అటెండర్ నుంచి తిరస్కరణే ఎదురైంది.దీంతో రోడ్డు మీద నిలబడి నిరసన తెలియజేశాడు. సీఎం హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేసి తనకు జరిగిన ‘అన్యాయం’ గురించి వివరించాడు. అయితే కమలేష్ చర్యతో అక్కడివాళ్లంతా కంగుతిన్నారు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారేమో.. మార్కెట్ వెళ్లి కేజీ స్వీట్లు తెచ్చి కమలేష్ చేతిలో పెట్టి సారీ చెప్పారు.2020లో ఇదే జిల్లా నుంచి సీఎంఓకు ఓ అరుదైన ఫిర్యాదు వెళ్లింది. బోరు పంపు పని చేయడం లేదంటూ ఓ గ్రామస్తుడు ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశాడు. అయితే దానికి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ (PHE) శాఖకు చెందిన అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీఆర్ గోయల్ ఫిర్యాదు చేసిన వ్యక్తిని చంపి పాతరేస్తానంటూ అనుచితంగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ కాగా.. తాను అసలు ఆ బదులు ఇవ్వలేదని, ఎవరో తన ఐడీని దుర్వినియోగం చేసి అలా చేసి ఉంటారని వివరణ ఇచ్చారాయన. -
ఆన్లైన్లో పాడిగేదెలు : లక్షల్లో మోసపోయిన డైరెక్టర్
ఆన్లైన్ షాపింగ్ అంటే ఆచి తూచి వ్యవహరించాల్సిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశకు పోయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. శాండల్వుడ్ దర్శకుడు ప్రేమ్ మోసపోయిన తీరు ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేస్తుంది. ఏం జరిగిందంటే...శాండల్వుడ్ దర్శకుడు ప్రేమ్ గుజరాత్కు చెందిన పశువుల వ్యాపారి చేతిలో రూ. 4.5 లక్షలు మేర దారుణంగా మోస పోయాడు. బ్రహ్మాండమైన రెండు గేదెలను డెలివరీ చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక వ్యాపారి, తీరా డబ్బులు తీసుకొని పత్తా లేకుండా పోయాడు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రేమ్, పాడి వ్యవసాయాన్ని చేద్దామనుకున్నాడు. ఇందుకోసం పాడిగేదెల్ని కొనేందుకు ఆన్లైన్ వెదికాడు. ఈ క్రమంలో గుజరాత్లోని భావ్నగర్కు చెందిన వాఘేలా వనరాజ్భాయ్ శాంతిభాయ్ను సంప్రదించాడు. అధిక పాల దిగుబడి కోసం పెంచిన గేదెలు అంటూ మెరిసే ఫోటోలనను షేర్ చేశాడు. ఫోటోలు చూసి పడిపోయిన ప్రేమ్, రూ.25,000 అడ్వాన్స్గా చెల్లించాడు. జంతువులను ట్రక్కులో ఎక్కించి బెంగళూరుకు వెళ్తున్నట్లు వాఘేలా నమ్మబలికాడు. ఇది చూసి మరింత మురిసి పోయిన ప్రేమ్ మరో విడతలవారీగా మొత్తం డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. కానీ గేదెల డెలివరీ మాత్రం రాలేదు. అటు వాఘేలా కాల్స్ ఎత్తడం మానేశాడు. దీంతో మోస పోయానని గ్రహించి చంద్ర లేఅవుట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లునిందితుడిఇంటికి తాళం వేసి అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం కూపీలాగుతున్నారు. గేదెలు కాదుకదా, దాని తోక వెంట్రుకలు కూడా రాలేదు అంటూ ప్రేమ్ వాపోయాడు. "ఆ ఫోటోలు నిజమైనవనుకుని నమ్మాం. ట్రక్ వారంలోపు వస్తుందని నిందితుడు చెప్పాడు" అని ప్రేమ్ మేనేజర్ దశవర్ చంద్రు అన్నారు. ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
దాన వీర శూర... మిస్టర్ బీస్ట్
అమెరికన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్, వీర శూర సాహస వైరల్ స్టంట్స్ ద్వారా మాత్రమే కాదు దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రసిద్ధి పొందాడు. తాజాగా... పదిహేను గంటల నలభై నిమిషాల΄ాటు మారథాన్ లైవ్స్ట్రీమ్ చేసి రికార్డ్ సృష్టించాడు. మారథాన్ లైవ్స్ట్రీమ్ ముగిసే సమయానికి వందకోట్లు సేకరించాడు. ఈ నిధులను ‘టీమ్వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఉపయోగిస్తారు. సురక్షితమైన తాగునీటి కోసం పనిచేస్తోంది టీమ్ వాటర్. లైవ్స్ట్రీమ్ ద్వారా అధిక నిధులు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో చోటుసాధించాడు మిస్టర్ బీస్ట్. ‘ఈ స్ట్రీమ్ ద్వారా ఎంతోమంది జీవితాలు మారుతాయి’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘మిస్టర్ బీస్ట్’గా సుపరిచితుడైన జేమ్స్ జిమ్మీ డోనల్డ్సన్ ప్రపంచంలోని యూట్యూబర్లలో అగ్రగామి. ఈ మోస్ట్ పాపులర్ యూట్యూబర్కు ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సాధించిన ఈ సంపన్నుడికి యూట్యూబ్ స్ట్రీమింగ్ షోలతో పాటు ఫాస్ట్ఫుడ్ చైన్లు కూడా ఆదాయ మార్గాలు. ‘రింగ్మాస్టర్ ఆఫ్ స్టంట్స్ అండ్ ఛాలెంజెస్’ అని ఈ సోషల్ మీడియా మెగా స్టార్ను ఆకాశానికెత్తింది ఫోర్బ్స్. ‘థ్రెడ్’లో ఒక మిలియన్ ఫాలోవర్స్ను సాధించిన తొలి వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకున్నాడు మిస్టర్ బీస్ట్. (చదవండి: సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..) -
షకీరా పాటకు చీరతో డాన్స్.. భలే చేసింది!
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతిభ ఉండాలే గానీ ప్రపంచమంతా మనవైపు చూసేలా చేసుకోవచ్చు. టాలెంట్ ఉన్నా ఎక్కడ, ఎలా ప్రదర్శించాలనే మీమాంస ఇదివరటి రోజుల్లో ఉండేది. ఇప్పుడా సంశయం అక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా సామాన్యులు సైతం తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమ టాలెంట్తో జనాన్ని ఆకట్టుకున్న వారు సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు. కంటెంట్ (Content) బాగుంటే చాలు జనం ఆదరిస్తున్నారు.తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన కాంచన్ అగర్వత్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాతో సహా ఎంతో మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో క్లిప్కు ఇప్పటివరకు 3.8 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2 లక్షల లైకులు వచ్చాయి.వీడియోలో ఏముందంటే..?కొలంబియా పాప్ సింగర్ షకీరా 2006 గ్లోబల్ హిట్ సాంగ్కు కాంచన్ అగర్వత్ చేసిన స్టెప్పులు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ చీర కట్టుతో పాప్ సాంగ్కు తనదైన శైలిలో డాన్స్ (Dance) చేశారామె. చీర, ఘున్ఘాట్ను బ్యాలెన్స్ చేస్తూ.. షకీరా సిగ్నేచర్ హుక్ స్టెప్లను చూడముచ్చటగా ప్రదర్శించడంతో వీక్షకులు ఫిదా అవుతున్నారు.చదవండి: రిసెప్షన్లో డాన్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన మహిళనెటిజనుల ప్రశంసలుకాంచన్ అగర్వత్ డాన్స్పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపించారు. ఆమె నృత్యం చేసే విధానం ఎంతో పద్ధతిగా ఉందని, డాన్స్తో పాటు చీరను బ్యాలెన్స్ చేసిన తీరు బాగుందని నెటిజనులు పొగిడారు. 'అలసటగా ఉన్నప్పుడు ఈ రీల్ చూశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికే చాలాసార్లు చూశాన'ని ఒక నెటిజన్ వెల్లడించారు. View this post on Instagram A post shared by Kanchan Agrawat (@kanchan_agrawat) -
జైలు శిక్ష తప్పించుకునేందుకు.. నాలుగేళ్లలో ముగ్గురు పిల్లలు, చివరికి
జైలు శిక్షను తప్పించుకునేందుకు ఒక మహిళ వింత నాటకానికి తెర తీసింది. దేశంలోని చట్టాలను ఉపయోగించుకొని మరీ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. నాలుగేళ్లలో మూడు సార్లు గర్భం దాల్చిన ఘటన వార్తల్లో నిలిచింది. ఆలస్యంగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) కథనం ప్రకారం 2020లో చెన్ హాంగ్ అనే మారుపేరుతో పిలువబడే మహిళ మోసం కేసులో దోషిగా తేలింది. ఇందుకుగాను ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. కానీ జైలు శిక్ష అనుభవించకుండా చైనా చట్టంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జైలుకెళ్లకుండానే, తాత్కాలికంగా తమ శిక్షను అనుభవించే వెసులుబాటును ఉపయోగించుకుంది. ఇలాంటి ఖైదీలు జైల్లో కాకుండా సాధారణంగా ఇంట్లో లేదా ఆసుపత్రులలో కమ్యూనిటీ దిద్దుబాటు సెంటర్లలో వీరు ఉండవచ్చు. 2020 - 2024 మధ్య, చెన్ ఒకే పురుషుడితో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీ సారి జైలుకెళ్లడం వాయిదా పడుతూ వచ్చింది. అయితే చైనీస్ చట్టం ప్రకారం, అటువంటి పరిస్థితులలో దోషులు ప్రతి మూడు నెలలకు వైద్య నివేదికలను సమర్పించాలి . స్థానిక కరెక్షన్ సెంటర్లలో క్రమం తప్పకుండా చెకప్లకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే చెన్ బండారం బైటపడింది.కానీ మే 2025లో జరిగిన ఒక సాధారణ తనిఖీలో, చెన్ బేబీ కనపించకపోవడంతోపాటు, పిల్లల రిజిస్ట్రేషన్ ఆమె మాజీ భర్త సోదరి పేరుతో నమోదై ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు ఆమె తొలి సంతానం కూడా తన మాజీ భర్తతో నివసిస్తున్నట్లు తేలింది. దీంతో అసలు విషయాన్ని ఒప్పుకుంది చెన్. భర్తకు విడాకులు ఇచ్చి, ముగ్గురు పిల్లలను ఆయనకే ఇచ్చానని ఒప్పుకుంది. జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమె ఉద్దేశపూర్వకంగా గర్భధారణను ఒక వ్యూహంగా ఉపయోగించుకుందని స్థానిక ప్రొక్యూరేటరేట్ కూడా నిర్ధారించింది. ఇదీ చదవండి: రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియోఅయితే ఆమెకు నిర్దేశించిన శిక్షాకాలం ఇక ఏడాది కాలమే మిగిలి ఉండటంతో చెన్ను మిగిలిన కాలానికి నిర్బంధ కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట వైరల్ గామారింది. కొందరు నెటిజన్లు ఆమెపై జాలి చూపించగా మరికొందరు ఔరా అంటూ నో రెళ్ల బెట్టారు. తల్లి జైలు నుండి తప్పించు కోవాలనే కోరికతోనే జన్మించిన ముగ్గురు పిల్లలపైనా మరికొందరు జాలి చూపించారు. కోరుకున్నప్పుడు గర్భవతి కావడం నిజంగా షాకే అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత -
రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలొదిలేసింది: వైరల్ వీడియో
అంతా పెళ్లి రిసెప్షన్ వేడుకల్లోఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆనందంగా నృత్యం చేస్తున్న మహిళ ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం అయ్యే లోపే అంతులేని విషాదం చోటు చేసుకుంది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మామల్లపురం మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పలు మీడియా నివేదికల ప్రకారం తమిళనాడులోని జరిగిన వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు కాంచీపురం నివాసితులు జీవా , ఆమె భర్త జ్ఞానం. తమ స్నేహితుడి కొడుకు వివాహ కార్యక్రమంలో ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా, ప్రముఖ తమిళ నేపథ్య గాయకుడు వేల్మురుగన్ పాల్గొన్న సంగీత కచేరీని నిర్వహించారు. ఈ సమయంలో, వేల్మురుగన్ ప్రేక్షకులను వేదికపైకి వచ్చి నృత్యం చేయమని ఆహ్వానించారు. అలా జీవా కూడా ఆమె వేదిక పైకి వెళ్లి నృత్యం చేయడం ప్రారంభించింది. అంతలోనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు వేదిక వద్దనే ప్రథమ చికిత్స అందించారు. అయినా స్పందించచకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. జీవా కుప్పకూలిపోయే ముందు నృత్యం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.Woman dies after collapsing while dancing on stage at wedding event in Mamallapuram, in Tamil Nadu’s Chengalpattu district.#TamilNadu #Tragedy #ITVideo #SoSouth #Chengalpattu @PramodMadhav6 pic.twitter.com/18SkHkx4X2— IndiaToday (@IndiaToday) August 20, 2025 -
సలాం సఫురా..! నెటిజన్ల మనసు గెలుచుకున్న మహిళా డ్రైవర్..
అమ్మాయిలు అన్ని రంగాల్లోకి రావాలని చెబుతుంటారు. గానీ ఇంట్లో వాళ్ల వల్లనో సమాజం ధోరణి కారణంగానే కొన్ని రంగాలవైపుకి అస్సలు రారు. పొరపాటున కన్నెత్తి కూడా అటువైపుగా చూడరు. కానీ ఈ అమ్మాయి తనకు డ్రైవింగ్ ఇష్టం అని చెప్పడమే కాదు ఏ వాహనమైనా సరే నడిపేస్తానని ధైర్యంగా చెబుతోంది. ఆమె ధైర్యానికి, ఆలోచన తీరుకి ఫిదా అవ్వుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా తన్వీర్ అనే ప్రయాణికురాలు ఓలా లేదా రాపిడో బుక్ చేసుకోవడం కుదరకపోవడంతో..ఏదో ఒక ఆటోని పట్టుకని వెళ్లిపోదాం అనుకుంటుంది. సరిగ్గా ఆ సమయానికి ఒక మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటో ఎదురవుతుంది. మహిళ డ్రైవర్ నడుపుతున్న ఆటోని చూడటం ఇదే తోలిసారి అనుకుంటూ తమన్నా వెంటనే ఎక్కేయడమే గాక..ఆ రైడ్లో తనతో మాటలు కలుపుతుంది. అదంతా రికార్డు చేసి నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోలో సఫురా అనే మహిళా డ్రైవర్ ఆటో నడుపుతున్నట్లు చూడొచ్చు. తనకు డ్రైవింగ్ అంటే పాషన్ అని, ఏ వెహికల్ అయినా నడుపుతానని చెబుతోంది. అయితే తన వద్ద అంత బడ్డెట్ లేకపోవడంతో ఆటోతో ప్రారంభించానని, భవిష్యత్తులో స్విఫ్ట్ కారు కొనాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. తనకు ఇలా డ్రైవింగ్ చేయడం ఇష్టమైన పని కాబట్టి, అలసట అనిపించిందని చెబుతోంది. ప్రతిరోజు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపింది. మరి తన కుటుబం ఈ వృత్తిని ఎంచుకుంటే ఏం అనలేదా అని ప్రయణికురాలు తమన్నా ప్రశ్నించగా..మొదట తన అమ్మ భయపడిందని, అయితే తన కూతురు ధైర్యవంతురాలని, ఏదైనా చేయగలదని ఆమెకు తెలుసని గర్వంగా చెప్పింది. రైడ్ ముగింపులో తమన్నాకు హైఫై ఇచ్చి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయింది. సఫురా మూసధోరణలను బద్ధలు కొట్టి మహిళలకు స్ఫూర్తిని అందివ్వడమే కాకుండా మనసుకు నచ్చింది చేయడంలో ఉన్న ఆనందం ప్రాముఖ్యతను కూడా హైలెట్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమె శక్తికి సలాం అంటున్నారు, ఏళ్లనాటి స్లీరియోటైప్ను బద్దలు కొట్టినందుకు హ్యాట్సాఫ్ అంటూ కీర్తిస్తున్నారు. View this post on Instagram A post shared by Tamanna Tanweer | Your Online Bestie (@tamannapasha_official) (చదవండి: పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..) -
జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులు
కర్ణాటకలోని మల్నాడ్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జోగ్ జలపాతం అద్భుత దృశ్యంతో అలరారుతోంది. భారీ వర్షాల తర్వాత జోగ్ జలపాతం అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సాగర్ తాలూకాలోని షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి ఆనకట్ట గేట్లను ఆగస్టు 19న తెరిచారు. కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల తర్వాత అదనపు నీటిని విడుదల చేశారు.ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాలను చూడటానికి చుట్టు పక్కల గ్రామాలనుంచి ప్రజలు క్యూ కట్టారు. సోషల్ మీడియాలో జోగ్ అందాల వీడియోలు తెగ సందడి చేస్తున్నాయి.JOG Falls, India's 2nd highest , 830 ft Mega water fall, is at its peak now.Near Shivamogga, #Karnataka.pic.twitter.com/sMd2mBT8nq— Mahesh.BR (@Maheshbr4U) August 20, 2025 కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని పర్యాటకులు తరలివస్తున్నారు. పొగమంచులా కనిపిస్తున్న జలదృశ్యాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు. రిజర్వాయర్,ఆనకట్టను నిర్వహించే కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) అధికారులు ఉదయం 10 గంటల ప్రాంతంలో గేట్లను తెరవడం ప్రారంభించారు. Time to visit #JogFalls !As linganamakki dam is filled & all crest gates are opened on Aug-19thVC: Madhu gowda pic.twitter.com/espIGjmQqY— Karnataka Development Index (@IndexKarnataka) August 20, 2025 మొత్తం 11 గేట్లను తెరిచారు. ఆనకట్టలో నీటి మట్టం ఇన్ఫ్లో పెరగడంతో పాటు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆగస్టు 19 ఉదయం నాటికి, జలాశయం పూర్తి స్థాయి 1,819 అడుగుల నీటి మట్టం ఉండగా, నీటి మట్టం 1,816.2 అడుగులుగా ఉంది. -
క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో
రైలు ప్రయాణాల్లో పిల్లలు, పెద్దలూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా రైలు ఎక్కేటపుడు, దిగేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు అసలు పనికి రాదు. ప్రాణాలు ముఖ్యం అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన ఈ విషయాలను మరోసారి గుర్తు చేస్తుంది.కేరళలోని ఎర్నాకుళం నార్త్ రైల్వే స్టేషన్లో ఒక మహిళను ప్రాణాపాయం నుంచి కాపాడిన ఘటన విశేషంగా నిలిచింది. రైలు నుండి దిగడానికి ప్రయత్నించినప్పుడు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపు పట్టాలపై పడిపోయింది. అక్కడనే రైల్వే ఉద్యోగి రాఘవన్ ఉన్ని తక్షణమే స్పందించారు. ఆమెను ఒడుపుగా పట్టుకొని పక్కకు లాగారు. వెంటనే అలర్ట్ అయ్యి శరవేగంగా ఆయన స్పందించకపోతే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఆసీసీ టీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన నెట్టింట్ వైరల్గా మారింది. నెటిజన్లు రాఘవన్ చాకచక్యంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు రైల్వే సిబ్బంది అంకితభావాన్ని ప్రశంసిస్తూనే, మెరుగైన భద్రతా చర్యల అవసరాన్ని కూడా నొక్కి చెబుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంతKerala : ಚಲಿಸುವ ರೈಲಿನಿಂದ ಇಳಿಯಲು ಹೋದ ಮಹಿಳೆಗೆ ಏನಾಯಿತು ನೋಡಿ.? | Sanjevani News....#kerala #train #Ernakulam #NorthRailwayStation #viralvideo #ಕೇರಳ pic.twitter.com/LTd6J1YQmF— Sanjevani News (@sanjevaniNews) August 20, 2025కాగా 2022లో ఇలాంటి ఘటన ఒకటి రైలు ప్రమాదాల్లో సిబ్బంది అప్రమత్తతను గుర్తు చేస్తూ కేరళలోని తిరూర్ రైల్వే స్టేషన్లో సతీష్ అనే RPF హెడ్ కానిస్టేబుల్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన మైనర్ బాలికను రక్షించాడు. దీనికి సంబంధించిన RPF ఇండియా విడుదల చేసింది. ఈ వీడియోలో లిప్తపాటులో స్పందించి కానిస్టేబుల్ అమ్మాయిని రక్షించాడు. -
బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తాలు.. ఎక్కడో తెలుసా?
యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారిందనే చర్చా నడుస్తోంది.కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన. -
సబ్మెరైన్ సర్వీస్ ప్రారంభం.. ముంబై వర్షాలపై మీమ్స్ వైరల్
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు మంచి స్టప్ దొరికేసింది. ‘‘నగరం మునిగిపోతున్నప్పుడు కూడా మేము మీమ్స్ చేస్తాం" అంటూ సరదాగా నవ్వులు పూయిస్తున్నారు. వరదలపై నెటిజన్లు కాస్త గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయంటూ.. సబ్మెరైన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫన్నీగా మిమ్స్ను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి.. నగరంలోని కుండపోత వర్షానికి అలవాటు పడ్డామంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుపిస్తున్నారు. "స్పిరిట్ ఆఫ్ ముంబై" అనే పదాన్ని కొంతమంది విమర్శిస్తూ కూడా మీమ్స్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలు మీమ్స్ ద్వారా తమ అనుభవాలను వ్యక్తపరస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.New service launched in Mumbai 😂 #MumbaiRainspic.twitter.com/gDIlVjyDPo— V🐧 (@Vtxt21) August 18, 2025నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం అంచనా వేసింది. నాందేడ్ జిల్లాలోని ముఖెడ్ తాలుకాలో వర్షాలు, వరదల్లో ఏడుగురు చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.Mumbaikar right now. #MumbaiRains #MumbaiRain pic.twitter.com/79LMu8LrBt— Siddhanth Pilania (@sidhanthpilania) August 18, 2025ఆర్మీ బృందాన్ని సహాయక చర్యల కోసం పంపించారు. జిల్లాలోని లెండి డ్యామ్లో భారీగా వరద చేరింది. ఇంకా, మహానగరం ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.మాతుంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో నిలిచిపోయిన స్కూలు బస్సు నుంచి ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కొన్ని విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఒక విమానాన్ని దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు తెలిపారు. అవసరమైతేనే ఇళ్లు వదిలి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో సోమవారం 6 నుంచి 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో, లోకల్ రైళ్లు కనీసం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సబర్బన్ రైళ్లు, సెంట్రల్ రైల్వే మార్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముంబైలోని విద్యాసంస్థలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో మంగళవారం సైతం సెలవు ప్రకటించారు.Mumbaikar stuck on roads everyday..#MumbaiRains pic.twitter.com/cqVrkWJbK6— KKthewealthcoach (@MemeOverlord_kk) August 18, 2025 -
లాస్ట్ మీల్ అంటే ఇదేనేమో..!
చక్కగా ఫుడ్ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం. గానీ బయట రెస్టారెంట్లో టేస్ట్ చూసి చెప్పే సోషల్మీడియా ఔత్సాహికులను చూస్తే..ఆహా ఈ పేరుతో భలే అన్ని వంటకాలు రుచి చూస్తేస్తున్నారుగా అనిపిస్తుంది కదూ..!. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్లు ఒక రెస్టారెంట్లో ఫుడ్ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవ్వరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు. ఏం జరిగిందంటే..హుస్టన్కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ నినా శాంటియాగో, తన తోటి కంటెంట్ క్రియేటర్ పాట్రిక్ బాలివుడ్తో కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక వీడియోని రికార్డు చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్లోని శాండ్విచ్ శాంపిల్ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్యూవీ కారు రెస్టారెంట్లోకి దూసుకొచ్చి వారి ఫుడ్ టేబుల్ని స్ట్రాంగ్గా ఢీ కొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కిందపడిపోగా, మరొకరు నిలదొక్కుకుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆ ఫుడ్ బ్లాగర్లకి. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ..ఆ ఘటనలో తమకు ఎలాంటి గాయాలు అయ్యాయో కూడా పోస్ట్లో వివరించారు. ఇదేదో పగ, కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే అదే మాకు చివరి భోజనం ఏమో అనిపించేలా చావుని పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు. View this post on Instagram A post shared by @NINAUNRATED (@ninaunrated) (చదవండి: టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణ హితం, ఆ సమస్యకు చెక్ కూడా..) -
కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!
కుంభకర్ణుడిని తలదన్నేలా నిద్రపోయింది ఈ అమ్మాయి. అన్నేళ్లు నిద్ర అని ఆశ్చర్యపోకండి. ఆమెను మేల్కొలిపేందుకు ఎలక్ట్రిక్ షాక్, అగ్నితో కాల్చడం, సూదితో గుచ్చడం వంటి ప్రయత్రాలు కూడా ఉన్నాయట. అయినా ఆ ఆమ్మాయి లేవలేదు. పైగా 32 ఏళ్లు తర్వాత మేల్కొని నాటి సంగతులన్నీ వివరంగా చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆమె స్టోరీ శాస్త్రవేత్తలకే ఓ పట్టాన అంతుపట్టని మిస్టరీలా అనిపించిందట. పోనీ ఏదైనా నిద్రకు సంబంధించిన జబ్బుగా నిర్ధారిద్దాం అనుకున్నా..దాన్ని కూడా మించిపోయేలా ఏకంగా మూడు దశాబ్దాల నిద్ర అని అంతా విస్తుపోతూ తలలు పట్టుకున్నారు. ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే..ఈ ఘటన బాలిస్టిక్ ద్వీపం స్వీడిష్లోని ఓక్నోలో చోటుచేసుకుంది. ఇది 19వ శతాబ్దంలో రియల్గా జరిగిన ఘటన. దాని గురించి ఇప్పటికీ కథకథలుగా చెప్పుకుంటారట. మనం కథల్లో వింటుంటాం స్లీపింగ్ బ్యూటీ అంటూ అన్నేళ్లు నిద్రపోయిందట అని..కానీ ఇది రియల్ స్లీపింగ్ బ్యూటీ స్టోరీ. ఆ అమ్మాయి పేరు ఓల్సన్. ఆమె అక్టోబర్ 29, 1861న జన్మించింది. ఆమె తండ్రి మత్స్యకారుడు, తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఇంటి పరిస్థితి అంతమాత్రమే కావడంతో ఆమెను పాఠశాలకు పంపించేవారు కాదు. అయితే ఓల్సన్కు చదువంటే మహా ఇష్టం కావడంతో అతికష్టంపై పంపించేవారు తల్లిదండ్రులు. అలా 14 ఏళ్ల వరకు క్రైస్తవ పాఠశాలలో చదువు కొనసాగించింది. ఫిబ్రవరి 18, 1876న శీతాకాలంలో ఎప్పటిలానే స్కూల్కి తిరిగి వస్తుంది.. అయితే తొందరగా వెళ్లాలన్న ఆత్రుతలో గడకట్టుకుపోయిన నదిని దాటే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో జారిపడి తలకు గట్టిగా గాయలయ్యాయి. అలానే ఇంటకి చేరుకుంది. అయితే పేదరికం కారణంగా తల్లిదండ్రులు ఆమెను వైద్యులకు చూపించలేకపోతారు. విశ్రాంతి తీసుకుంటే అదే సర్దుకుంటుందేలే అనుకున్నారు తల్లిదండ్రులు. అలా ఆ రోజు పడుకుంది ఇక లేవనే లేదు. అయితే ఆమె తల్లి మాత్రం కూతుర్ని కంటికిరెప్పలా కాచుకునేది. ఏ రోజుకైనా లేగుస్తుందని ఆశగా అలానే చూసుకునేది. రియల్ స్లీపింగ్ బ్యూటీ అంటూ ఆమె కథ ఆ గ్రామమంతా దావనంలా వ్యాపించింది. చాలామంది ఆమెను చూసేందుకు వచ్చేవారు కూడా. అంతేగాదు ఆమెను ఎలాగైనా నిద్ర నుంచి లేపాలని..సూదులతో గుచ్చడం, కరెంట్షాక్, కాల్చడం వంటివి ఎన్నో చేశారు. మొదట్లో వైద్యులు కోమా, హిస్టీరియా వంటివేమో అనుకున్నారు గానీ..వైద్య పరీక్షల్లో అవేమి కాదని తేలింది. దాంతో వాళ్లు కూడా చిక్కిత్స అందించలేమని చేతులెత్తేశారు. అలా ఓల్సన్ మూడు దశాబ్దలుగా గదిలో నిద్రపోతూనే ఉంది. ఆమె తల్లి 1904 మరణించింది. అప్పటి వరకు ఓల్సన్ బాధ్యతను ఆమెనే దగ్గరుండి చూసుకుంది. ఆ తర్వాత తండ్రి ఒక పనిమనిషిని నియమించి ఆమె బాధ్యతలను దగ్గరుండి చూసుకున్నాడు. అయితే పనిమనిషి ఆహారం అదృశ్యమైపోతుందంటూ ఫిర్యాదు చేస్తుండేది. నిజానికి ఓల్సన్ నిద్రలోనే ఉన్నా..వాస్తవిక జీవితాన్ని దగ్గరగా గమినిస్తున్నట్టుగా ఉండేది ఆమె తీరు. ఆమె సోదరుడు మరణించిన సమయంలో కూడా ఏడుస్తున్నట్లు మూలుగు వినిపించిందట. ఆమె తన కలకు, వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చుట్టూ ఉన్నవారికి అనిపించేదట.సరిగ్గా 32 ఏళ్ల తర్వాత మేల్కొలుపు..అలా గాఢ నిద్రలోనే ఉండిపోయిన ఓల్సన్ 1908లో అప్పుడే నిద్రలోంచి మేల్కొన్నట్లుగా మేల్కొంది. ఒక పెద్ద ఏడుపు శబ్బం రావడంతో పనిమనిషి గదిలోకి రాగా ఓల్సన్ మేల్కొని ఏడుస్తూ కనపించింది. 14 సంవత్సరాల ప్రాయంలో పడుకున్న ఆమె మళ్లీ తిరిగి 46 ఏళ్ల వయసుకి మేల్కొంది. అత్యంత బలహీనంగా అయోమయంగా కుటుంబసభ్యులందర్నీ చూసింది. తన సోదరులను గుర్తించలేకపోయింది. అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే..1876 ఫిబ్రవరిలో జరిగిన ప్రతి సంఘటన ఆమెకు స్పష్టంగా గుర్తుంది. ఆ తర్వాత సంత్సారాల గురించి ఆమెకు తెలియదు. ఓల్సన్ స్టోరీ విలేకరులనూ, వైద్యులనూ ఆకర్షించడమే కాదు అత్యంత వింతగా అనిపించింది. ఆమె శరీరం అంతగా వృద్ధాప్యం చెందలేదు కూడా. శారీరకంగా ఆరోగ్యంగా తెలివిగానే ఉంది. అయితే కాంతికి బహిర్గతం కావడంలో ఇబ్బంది పడింది. కొందరు వైద్యులు ఆమెకు జరిగిన మానసిక గాయం వల్ల ఇలా గాఢ నిద్రలోకి చేరుకుందని, తల్లి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా మెరుగపడిందని అన్నారు. శాస్త్రవేత్తలకు కూడా ఆమె స్టోరీ అంతుచిక్కని మిస్టరీలా తోచింది. ఎందుకంటే ఆమె నిద్రను స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్గా నిర్థారిద్దాం అనుకున్నా..ఓల్సన్ కేసు అందుకు విరుద్ధం. ఎందుకుంటే అంత సుదీర్ఠ నిద్ర ఈ వ్యాధి లక్షణం కాదు. టీనేజ్ వయసులో పడుకుని మద్య వయసులో మేల్కోన్న ఈ అమ్మాయి కథ నేటికి అక్కడొక మిస్టరీ, ఆసక్తిని రేకెత్తించే కథ. ఓల్సన్ 1950 88 ఏళ్ల వయసులో మరణించిందట. అయితే ఇంతవరకు ఆమె అంత సుదీర్ఘ నిద్రలోకి ఎందుకు జారుకుందనేది ఎవ్వరూ నిర్థారించలేకపోయారట.(చదవండి: సుదీర్ఘ దాంపత్యానికి బ్రేకప్ చెబితే ఫలితం ఇలా ఉంటుందా..? పాపం ఆ 60 ఏళ్ల వ్యక్తి..) -
సోలో లేఫే బెటర్ అనుకుని దెబ్బైపోయాడు! చివరికి..
మనతో ఉన్న వస్తువులు లేదా మనుషుల విలువ ఉన్నంత వరకు తెలియదు అని పెద్దలు పదేపదే నొక్కి చెబుతుంటారు. అదెందుకో ఈ కథ చదువుతుంటే తెలుస్తుంది. అన్నిసార్లు డబ్బు మన అవసరాలను తీర్చదు. అదొక్కటే చాలు అనుకున్న వాళ్లంతా అధోగతిపాలయ్యారు. తెలిసి కూడా అదే తప్పు చేస్తూ..ఒంటిరిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు ఈ వ్యక్తిలా..అసలేం జరిగిందంటే..జపాన్కి చెందిన టెట్సు యమడ, కైకో దంపతులు సుదీర్ఘకాలం కలిసిమెలిసి ఉన్నారు. వారికిద్దరు కుమారులు కూడా. వాళ్లు కూడా సెటిల్ అయిపోయారు. అయితే ఏమైందో గానీ వెర్రిగా ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. అతడు ఇటీవల రూ. 3 కోట్ల పెన్షన్తో రిటైరయ్యాడు. దాంతో ఇక ఇన్నాళ్లు సంసారాన్ని మోసింది చాలు ఇకనైనా ఫ్రీడం కావాలంటూ..తన భార్యను పుట్టింటికి వెళ్లిపో విడిగా బతుకుదాం ఇకనుంచి.. అని మనసులో మాట చెప్పేశాడు యమడ. అయితే ఇన్నాళ్లు తనతో కలిసి జీవించి ఇదేంటి అనుకుందామె. నిజానికి ఆ దంపతులకు గత కొన్నేళ్లుగా కొన్ని విషయాల్లో పొసగటం లేదు. ఎలాగో రిటైరవ్వతున్నాకదా..ఆమెను వదిలించేసుకుని రిటైర్మెంట్ డబ్బుతో హాయిగా జీవించొచ్చనేది అతడి ఆలోచన. అయితే అన్నేళ్లుగా పట్టణంలో కుమారులు, భర్తతో కలిసి జీవించి ఉన్న ఆమెకు ఉన్న పళంగా తన సొంతూరు పల్లెటూరికి వెళ్లి బతకడం అనేది కష్టంగా అనిపించిందామెకు. ఆ విషయాన్నే నర్మగర్భంగా చెప్పేసింది యమడకి. అలాగే అతడి కొడుకులు కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. దాంతో అతడు 'సోట్సుకోన్' ట్రెండ్ని అనుసరిద్దామని చెప్పాడు. ఏంటంటే ఇది..జపాన్ మహిళ రచియిత్ర రచించిన పుస్తకం కారణంగా ఈ ట్రెండ్ అక్కడ యువతలో బాగా ఊపందుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం..భార్యభర్తలు ప్రెండ్లీగా విడిపోతారు..ఒకే ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు హాయిగా ఉండటం లాంటి కాన్సెప్ట్ అన్నమాట. ఈ పద్ధతిలో ఫ్రెండ్లీగా విడిపోదామని చెప్పి యమడనే తన సొంత గ్రామానికి వెళ్లిపోయి జీవించాలని నిర్ణియించుకున్నాడు. ఇక అతడి భార్య, కుమారులు అక్కడే పట్టణంలో నివశించడానికి మక్కువ చూపించారు.పాపం పశ్చాత్తాపంతో ఆ వ్యక్తి..ఇక యమడ గ్రామీణ ప్రాంతానికి వెళ్లిన అక్కడ తన పెన్షన్ డబ్బుతో ఇంటిని పునరుద్ధరించాడు. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేద్దామనుకుంటే..అక్కడి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు భార్య అమర్చి పెడితే కష్టం తెలియకుండా పోయింది యమడకి. ఇక ఎప్పుడైతే ఒంటిరిగా జీవించడం మొదలుపెట్టాడో..రోజువారీ పనులు నిర్వహించుకోవడం చాలా కష్టమైంది. వంట చేసుకుని తినలేక తిప్పలు పడ్డాడు. ఇక రెడీమేడ్ న్యూడిల్స్, పచ్చి కూరగాయలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చేశాడు. కానీ అతడి భార్య విడిపోయాక సొంతంగా చేతి వృత్తికి సంబంధించిన వర్క్షాప్ ప్రారంభించి లాభాలు అందుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే ఇక్కడ యమడ..ఒంటరి జీవితంతో నరకం అనుభవిస్తున్నాడు. అంతేగాదు తాను తీసుకున్న ఈ తెలివి తక్కువ పనికి చింతిస్తూ లబోదిబోమంటున్నాడు. అయితే తాము అప్పడప్పుడూ ఆన్లైన్ మాట్లాడుకుంటున్నట్లు తెలిపాడు యమడ. అయితే తన కొడుకులతో సంబంధం పూర్తిగా తొలిగిపోయిందని అంటున్నాడు. పాపం యమడ తన కుటుంబంతో మళ్లీ తిరిగి కలసే అవకాశం కోసం ఆశగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడి కథ నెట్టింట వైరల్గా మారి విడిపోతే నష్టం ఎవరికీ అంటూ చర్చలు ప్రారంభించారు. అంతేగాదు స్వేచ్ఛ అనేది ఎలా ఉన్నా ఆ వయసులో మాత్రం కొన్ని ఇబ్బందులు, చిక్కులు మాత్రం తప్పవనేది జగమెరిగిన సత్యం అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. 🚨 LONELY NOODLES AND A NEW LIFE: JAPAN’S ‘MARRIAGE GRADUATION’ TREND SPARKS DEBATETetsu Yamada thought he was stepping into a peaceful retirement when he embraced “sotsukon”—Japan’s rising trend of “marriage graduation.” Armed with a hefty 50-million-yen pension, he moved to… pic.twitter.com/0KVXZwRFzP— The Tradesman (@The_Tradesman1) August 17, 2025 (చదవండి: భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!) -
టెకీకి భారీ ఊరట, కంపెనీకి షాకిచ్చిన కోర్టు
బెంగళూరు టెక్నీషియన్ ఉగాండాలో ఒంటరిగా వదిలేసినందుకు యజమానిపై కేసు వేసి, రూ.3 లక్షలకు పైగా గెలుచుకున్నాడు. టెక్నికల్ కన్సల్టెంట్ - కంపెనీ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదంలో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అతని బకాయిలు, ఇతర పత్రాలను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందన్న ఐటీ ఉద్యోగి వాదనను సమర్ధించిన కోర్టు రూ. 3 లక్షల బకాయిలు, 6 శాతం వార్షిక వడ్డీ, రిలీవింగ్ లెటర్ ,అతని ఒరిజినల్ విద్యా సర్టిఫికెట్లను అతనికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం పాపారెడ్డిపాళ్యంలోని ఐటీఐ లేఅవుట్లో నివసించే రక్షిత్ ఎంవీ, సెప్టెంబర్ 2016లో లోకస్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో చేరారు. డిసెంబర్ 2019లో ఉగాండాలోని కంపాలాలో ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం రక్షిత్ను నియమించారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. అయితే పదే పదే అభ్యర్థించినప్పటికీ అతనికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకుండా కంపెనీ నిర్లక్ష్యం చేసింది. పైగా పొడిగించిన స్టే సమయంలో తన జీత భత్యాలను ఏకపక్షంగా సగానికి తగ్గించిందనీ, నెలకు చెల్లించాల్సిన పీఎఫ్ రూ.3,600 రూపాయలు జమ చేయలేదని వాదించారు. అలాగే దేశీయ ప్రయాణం,ఇతర ఛార్జీలు మొత్తం రూ. 3 లక్షలతో సహా అదనపు ఖర్చులను కూడా చెల్లించలేదు. దీంతో జూలై 2020 వరకు తాను అక్కడ చిక్కుకుపోయానని రక్షిత్ ఆరోపించారు. చివరికి2020 ఆగస్టులో రాజీనామా చేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జీతం కోత , పొడిగించిన స్టేతో సహా అన్ని నిర్ణయాలను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అధికారిక ఇమెయిల్ కమ్యూనికేషన్ లేకుండా మౌఖికంగా తెలియజేశారని, అందువల్లే తనకు వ్రాతపూర్వక రుజువు లేకుండా పోయిందని రక్షిత్ చెప్పారు.రాజీనామా చేసిన తర్వాత, రక్షిత్ 2021లో కంపెనీకి లీగల్ నోటీసు పంపాడు. ఆ తర్వాత 2022 జనవరిలో తన బకాయిల చెల్లింపు, తనకు సంబందించిన సర్టిఫికెట్లను, ఇతర పత్రాలను విడుదల చేయాలని కోరుతూ సివిల్ దావా వేశాడు.ఇదీ చదవండి: ఉద్యోగాన్ని వదలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుఎండీ రోహిత్ కుడుకులి ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీ రక్షిత్ ఆరోపణలను ఖండించింది. రక్షిత్ ప్రాజెక్ట్ మధ్యలో పరారయ్యాడని వాదించింది. కానీ, న్యాయమూర్తి శివానంద్ మారుతి జిపారే అధ్యక్షతలోని అదనపు సిటీ సివిల్ మరియు సెషన్స్ కోర్టు రక్షిత్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 6 శాతం వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలు బకాయిలు చెల్లించాలని, అతని సర్టిఫికెట్లను విడుదల చేయాలని ఆదేశించింది. కపెంనీ తన చర్య ద్వారా బాధితుడికి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని వ్యాఖ్యానించింది. కరీర్ను ప్రమాదంలో పడేసేలా, బకాయిలు, ఇతర పత్రాలను నిలిపివేయడానికి కోర్టు తప్పుబట్టింది. -
భారత్ వ్యక్తిని పెళ్లాడిన బ్రెజిలియన్ ముద్దుగుమ్మ..!
ప్రేమ అంటే ఇదేరా అనేలా ఉండేలా ఎన్నో లవ్ స్టోరీలను చూశాం. వాటన్నింటిలో ప్రేమ ప్రేమే. దాని కోసం ఏం చేయడానికైనా రెడీ అనట్లుగా సిద్ధపడుతున్న ప్రేమికులు గాథల వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎల్లలు, సరిహద్దు దాటి ఎన్నో ప్రయాసలు పడి ఒక్కటైన జంటలెందరినో చూశాం. కానీ ఇక్కడ ఈ జంట అంత కష్టాలు చవి చూడకపోయినా..వీరిద్దరూ ఒక్కటైనా విధం చూస్తే..ఎక్కడైన లవ్వు..లవ్వే కథ అనిపిస్తుంది. మరి ఆ జంట అందమైన కథేంటో చకచక్క చదివేయండి మరి..బ్రెజిలియన్ మహిళ తైనాషా భారతీయ వ్యక్తిని పెళ్లాడింది. ఎలా తమ ప్రేమ చిగురించి పెళ్లిపీటలక్కెందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తామిద్దరం విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు చెందిన వాళ్లం. కానీ తాను ఆ గుజరాతి వ్యక్తితో ఆశ్చర్యకరంగా ప్రేమలో పడిపోయానని అంటోంది. 2020 కోవడిడ్ 19 సమంయంలో ఇద్దరు ఆన్లైన్ కలుసుకున్నారు. ఇంకా అప్పటికీ టీకాలు వేయించుకోని క్రిటికల్ టైంలో ఆమెను కలవాలని గుజరాతీ భర్త పడిన ప్రయాసను చూసి..ఫస్ట్ మీట్లోనే అతని ప్రేమకు ఫిదా అయి లవ్లో పడిపోయిందట. ప్రేమలో పడిన ఐదునెలలకే ఇద్దరు పెళ్లిచేసుకున్నాం అని పేర్కొంది. తమ వివాహం బ్రెజిల్లోనే జరిగిందని, తమ పెళ్లిని తన భర్త తరుఫు భారతీయ కుటుంబం కూడా అంగీకరించిందని చెప్పుకొచ్చింది తైనా. తామిద్దరిది వేర్వేరు నేపథ్యమే అయినా..మా మధ్య ఉన్న అభిమానం, ప్రేమ రోజు రోజుకి మరింతగా బలపడుతుందని, ఇంతవరకు తమ దాంపత్య జీవితాన్ని విజయవంతంగా లీడ్ చేయగలిగేలా చేసినా ఈ విశ్వానికి సదా కృతజ్ఞతలు అని చెబుతోంది తైనా. ఆ దంపతుల ప్రేమ కథ నెటిజన్లను తెగ ఆకర్షించడమే గాక, ఎక్కడైన ప్రేమ.. ప్రేమే..దానికున్న శక్తి అనంతం, అజేయం అంటూ ఆ జంటని ప్రశంసిస్తూ ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Tainá Shah (@tainashah) (చదవండి: ‘రాక్స్టార్’: 150 ఏళ్ల నాటి పియానోని ప్లే చేసిన సీఎం) -
నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ
బహుభార్యత్వం కేసులో కోర్టు సమన్లు ఎదుర్కొంటున్న యూట్యూబర్ అర్మాన్ మాలిక్ మరోబిడ్డకుతండ్రి కాబోతున్నాడుట. పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల ఇలా వ్యక్తిగత విషయాలతో తరచుగా వార్తల్లో నిలిచే అర్మాన్మాలిక్ రెండో భార్య కృతిక రెండో బిడ్డకు తల్లి కాబోతోందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే గతంలో రెండో ప్రెగ్నెన్సీపై గతంలో తన వ్లాగ్లో జోక్ లేసింది. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్లోఉన్నారు. ఇటీవల పటియాలో కోర్టులో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఇలాంటి పోస్ట్ పెట్టిందా? అనే సందేహాలను నెటిజనులు వ్యక్తం చేశారు.హర్యానాకు చెందిన అర్మాన్మాలిక్ యూట్యూబర్గా, బిగ్బాస్ ఓటీటీఫేమ్గా పాపులరయ్యాడు. ఆ తరువాత వరుస పెళ్లిళ్లు, పిల్లలతో తరచూ చర్చల్లో నిలుస్తున్నాడు. తాజాగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, హిందూ వివాహ చట్టాన్ని ఉల్లంఘించాడని పేర్కొంటూ దవీందర్ రాజ్పుత్ అనే వ్యక్తి అర్మాన్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అర్మాన్, అతని ఇద్దరు భార్యలు పాయల్ ,కృతికలను సెప్టెంబర్ 2న హాజరు కావాల్సిందిగా మూడు నోటీసులతో సమన్లు జారీ చేసింది కోర్టు. కాగా అర్మాన్ 2011లో పాయల్ ను వివాహం చేసుకున్నాడు. 2018లో పాయల్ ప్రాణ స్నేహితురాలు కృతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023లో పాయల్ కవలలకు జన్మనివ్వగా, కృతిక ఒక మగబిడ్డనుకంది. ఇప్పుడు కృతిక తన ఇన్స్టాగ్రాంలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. పాయల్ కూడా కృతికతో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇది నిజమైన గర్భధారణ ప్రకటననా, లేక ఏదైనా బ్రాండ్ ఎండార్స్మెంటా? లేక మరేదైనానా అనే తర్జనభర్జనలో ఉన్నారు మాలిక్ ఫ్యాన్స్ .ఇదీ చదవండి: నాలుగు పెళ్లిళ్లా?! ప్రముఖ యూట్యూబర్కు షాక్, కోర్టు సమన్లు -
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
ఏసీ కోచ్లో కూలింగ్ లేదనే ఫిర్యాదు.. ఏసీ డక్ట్లో లిక్కర్ బాటిళ్లు!
మనం బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా దానిపై అందుకు తగ్గ సౌకర్యం లేకపోతే చిరాకు వస్తుంది. ఏసీ బస్సుల్లో కానీ, ఏసీ ట్రైన్లలో కానీ ఏసీ రాకపోతే ఏం చేస్తే.. కాపేపు చూస్తాం.. ఆపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. లక్నో-బారౌనీ ఎక్స్ప్రెస్లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఏసీ-2 టైర్ తీసుకుంటే అందులో ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. కూలింగ్ చాలా తక్కువగా ఉందని కంఫ్లైట్ రైజ్ చేశారు ప్రయాణికులు. దాంతో ట్రైన్ను ముందస్తు షెడ్యూల్ అనేది లేకుండా చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ ఏసీ 2 టైర్ కోచ్లో ఏసీ రాకపోవడానికి ప్రధాన కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ఆ ఏసీ డక్ట్లో లిక్కర్ బాటిళ్లను దాచి పెట్టడమే అని కనుగొన్నారు అధికారులు. తనిఖీలు చేసే క్రనంలో పేపర్లతో కట్టిన రెండు బండిల్స్ బయటపడ్డాయి. వాటిని తెరిచి చూడగా అందులో లిక్కర్ బాటి్ళ్లు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సోనాపూర్ డీఆరర్ఎమ్ స్పందిచారు. ‘ ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆ అక్రమ లిక్కర్ను సీజ్ చేశాం. కూలింగ్ లేదని విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన ప్రయాణికులు ధన్యవాదాలు’ అని తెలిపారు. Passengers complained of low cooling in the AC coach of Lucknow-Barauni Express. When the technicians inspected the AC duct, consignment of a illict liquor was being hidden there. Tecnologia! pic.twitter.com/Qad9Uis9dO— Piyush Rai (@Benarasiyaa) August 14, 2025 -
ఈ కొరియన్ భోజ్పురి నేర్పిస్తాడు!
కొరియన్ వ్యక్తి కొరియన్ భాష నేర్పించడం వింత కాదు. భోజ్పురి నేర్పించడమే వింత. యెచన్ సి లీ అనే కొరియన్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. పిల్లలకు సరదాగా భోజ్పురి నేర్పిస్తుంటాడు. యెచన్ సి లీ పిల్లలకు భోజ్పురి నేర్పిస్తున్న వీడియో వైరల్ అయింది.ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్కు లక్షలాది వ్యూస్ వచ్చాయి. పిల్లలు భోజ్పురి వాక్యాలను ఆసక్తిగా నేర్చుకోవడం మరో విశేషం. ‘కొరియన్ పిల్లలకు భోజ్పురి నేర్పించడం అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను’ అని తన వీడియోకు కాప్షన్ ఇచ్చాడు లీ. మొదటిసారి ఎవరినైనా కలిసినప్పుడు భోజ్పురిలో ఎలా పలకరించాలి? మరోసారి ఆ వ్యక్తిని కలిసినప్పుడు ఎలా పలకరించాలి?... మొదలైనవి పిల్లలకు నేర్పిస్తుంటాడు లీ. ‘అమేజింగ్ వర్క్’ అంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ‘లీ’ భోజ్పురి ఎప్పుడు నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో తెలియదుగానీ అతడి భోజ్పురి పాఠాలు ఆన్లైన్ హార్ట్ను దోచుకున్నాయి. View this post on Instagram A post shared by Yechan C. Lee (@40kahani) (చదవండి: ఇది స్త్రీరామ రక్ష..!) -
వానాకాలం కదా.. మరి స్పెషల్ అలవెన్స్ ఉందా?
ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్ఆర్లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్కు దారి తీసింది. ఢిల్లీ కంపెనీ హెచ్ఆర్ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్ఆర్ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్ఆర్ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్ అలవెన్స్ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్ఆర్ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్ అలవెన్స్ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్ఆర్ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్ఆర్కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్ అలవెన్స్) వీలులేని పక్షంలో వర్క్ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను. ఆ వ్యక్తి సెలక్ట్ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్ఆర్ రెడ్డిట్లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్ఆర్ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్ చేశారా హెచ్ఆర్. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్కు క్యాబ్లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్ఆర్ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. -
దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..!
నిమ్మరసం దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా ఎందుకు అమ్ముతుందో పాపం అనుకునేలోపు ఆశ్చర్యం కలిగించేలా ఆర్థిక పాఠాల గురించి బెబుతోంది ఆ చిన్నారి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారని కళ్లకుకట్టినట్లు చూపించే బెస్ట్ పేరెంటింగ్ పాఠం ఇది. సమాజానికి ఇలాంటి తలిదండ్రులే అవసరం అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఏడేళ్ల చిన్నారి ఒక వీధిలో నిమ్మరసం అమ్ముతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి తోపాటు అమ్మమ్మ, తండ్రి కూడా ఉన్నారు. దీన్ని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఘరత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కంటెంట్ క్రియేటర్ పూర్వ ఆ చిన్నారి ఇలా దుకాణం నడపడాన్ని గమనించి వారి అనుమతితోనే ఈ వీడియో తీస్తోంది. అసలు ఆ చిన్నారి ఇలా ఎందుకు చేస్తుందని ఆమె అమ్మమ్మను, తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా అని ప్రశ్నిస్తాడు. తన కూతురు ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొంది ఇలా వ్యాపారం మొదలు పెట్టిందని వివరిస్తాడు. ఆ పస్తకం నుంచి తెలుసుకున్నదాన్ని నేర్చుకునేలా ఇలా ఆచరణలో పెట్టించానని చెబుతాడు ఆ తండ్రి. అది విని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఇంత చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ గురించి నేరుకుంటుందా అని విస్తుపోతుందామె. ఇలాంటి తల్లిదండ్రేలే కదా సమాజానికి కావాలి అంటూ ఆ పేరెంట్స్ని చేసిన పనికి ప్రశంసిస్తుంది కంటెంట్ క్రియేటర్. కలలు కనడం, నిర్మించడ, తనను తాను నమ్మడం వంటివి ఆచరణలో పెట్టినప్పుడే తెలుస్తుందని చేతల ద్వారా బహుచక్కగా వివరించారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. గొప్ప తల్లిదండ్రులుగా ఉండటం అంటే ఇదే. కేవలం గ్రేడులు, మంచి మార్కులు కాదు..జీవిత పాఠాలు నేర్పించాలి, మనం లేకపోయినా..ఆ చిన్నారులు తమ జీవితాన్ని నిర్భయంగా లీడ్ చేయగల సామర్థ్యం పెంపొందించాలని అని నేర్పించే గొప్ప పేరెంటింగ్ పాఠం ఇది. ప్రతి తల్లిదండ్రలు తప్పక తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా కదూ..!. View this post on Instagram A post shared by Purva Gharat 👁️ (@purvagx) (చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు) -
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్ ఉల్లంఘనేనా?
కౌన్ బనేగా కరోడ్పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్లో 17వ సీజన్ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ కాగా.. సోషల్ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్ హీరోస్ పేరిట ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్ నటుడు తన లెఫ్టినెంట్ కర్నల్ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్ ఆఫీసర్ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్ ఓటీటీలో ఈ ఫుల్ ఎపిసోడ్ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్షిప్ తొలి కమాండ్గా గుర్తింపు దక్కించుకున్నారు. -
'ఏక్ దిన్-ఏక్ గల్లీ'..! స్వచ్ఛమైన భారతీయుడిగా విదేశీయుడు..
మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్ మిషన్ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సెర్బియన్ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్ ఏక్దిన్కే ఏక్ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 4cleanindia (@4cleanindia) (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..) -
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు.. ప్రధాని మోదీకి చిన్నారి లేఖ వైరల్
బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా'రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి' అంటూ ఐదేళ్ల చిన్నారి చేతితో రాసిన విజ్ఞప్తి ప్రజల దృష్టిని ఆకర్షించింది . నెట్టింట తీవ్ర చర్చకు దారి దీసింది.బెంగళూరు నివాసి అభిరూప్ కుమార్తె ఆర్య, నగరంలోని దీర్ఘకాలిక ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించమని కోరుతూ ప్రధానమంత్రికి ఒక చిన్న లేఖ రాసింది. “నరేంద్ర మోదీ జీ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము పాఠశాలకు , కార్యాలయానికి ఆలస్యంగా వెళ్తాము. రోడ్డు చాలా దారుణంగా ఉంది. దయచేసి సహాయం చేయండి” అని ఆమె రాసింది.PM is visiting Bangalore. My 5-year-old girl sees it as her chance to finally fix traffic. pic.twitter.com/EJdzpxSs89— Abhiroop Chatterjee (@AbhiroopChat) August 10, 2025 చిన్నారి లేఖను తండ్రి అభిరూప్ ఎక్స్లో షేర్ చేశారు. ప్రధాని బెంగళూరును పర్యటన సందర్భంగా. నా 5 ఏళ్ల అమ్మాయి దీనిని చివరకు ట్రాఫిక్ను సరిదిద్దే అవకాశంగా భావిస్తోంది" అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయింది, నాలుగు లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు కూడా ఆమె మద్దతుగా స్పందించారు.మరికొంతమంది బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కోరమంగళ నుండి ఇందిరానగర్ వరకు ఉన్న రోడ్ల కారణంగా అధ్వాన్నం. అటునుంచి వెళ్లాలంటేదాదాపు చచ్చినంత పని.. నేను రూ.3 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తాను. అయినా మనకు లభించేది యమపురికి దారుల్లాంటి రోడ్లు అంటూ మండిపడ్డారు. మరోవైపు ఒక యూజర్ ముంబైలో శబ్ద కాలుష్యం గురించి 15 సంవత్సరాల క్రితం తన కుమార్తె రాసిన లేఖను గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 11 నుండి ఉదయం 6:30 గంటలకు బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్యాసింజర్ సర్వీసులు ప్రారంభమైనాయి. కర్ణాటక మెట్రో ప్రాజెక్టు నిధులలో 87శాతం అందిస్తుందని,చ, 2030 నాటికి బెంగళూరులో 220 కి.మీ నెట్వర్క్ పూర్తవుతుందని సీఎం సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతి -
హాలీవుడ్ మోడల్గా ఈ-రిక్షాడ్రైవర్..!
మన కళ్లముందే సాదాసీదాగా కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా స్టన్నింగ్ మోడల్ లుక్లో కనిపిస్తే..కచ్చితంగా షాకవ్వతాం. నిజంగా మోడల్ రైంజ్ లుక్ ఉందా వీరికి అని విస్తుపోతాం. అందుకు కావాల్సినంత డబ్బు లేకపోవడంతోనే ముఖాకృతికి సంబంధించిన హంగులు, మేకప్ జోలికి వెళ్లే ఛాన్స్ ఉండదు. దాంతో సాధారణ వ్యక్తుల్లా మన మధ్య ఉంటారు. ఎవరో ఓ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్ లేదా మోడల్నో దాన్ని గుర్తించి వారిలో ఉన్న అద్భుత మోడల్ని వెలికితీస్తారు. అలానే ఇక్కడొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ రిక్షడ్రైవర్ని ఎంత గ్లామరస్గా మార్చాడో చూస్తే విస్తుపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆ వీడియోలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్గా తీర్చిదిద్దే మాస్టర్పీస్ కోసం వెదుకుతున్నట్లు కనిపిస్తుంది. ఎదురుగా ఈ రిక్షాడ్రైవర్. అతని లుక్స్లో ఏదో మోడ్రన్ని గుర్తించి మొత్తం అతడి రూపురేఖలనే మార్చేస్తాడు. ఇంట్లో దొరికే పెరుగు, పుదీనా ప్యాక్తో స్కిన్ లుక్, విటమిన్ ఈ వంటి ఆయిల్స్ హెయిర్ని అందంగా మార్చేస్తాడు. మంచి డ్రెస్సింగ్ వేర్తో అతడిలో దాగున్న అద్భుతమైన మరో వ్యక్తిని వెలికితీస్తాడు. నిజంగా ముందున్న లుక్కి ఇప్పుడున్నీ స్టన్నింగ్ లుక్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. కచ్చితంగా ఈ వ్యక్తి అంతకుముందు చూసి వ్యక్తేనే అని మన కళ్లను మనమే నమ్మలేనంతంగా అతడి మొత్తం ఆహార్యాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్. నెటిజన్లు కూడా అంత అందంగా మార్చే వ్యక్తి మాక్కూడా కావాలి. బ్రో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Karron S Dhinggra (@theformaledit) (చదవండి: తొమ్మిది పదుల వయసులో ఆ తల్లికి ఎంత కష్టం..? పాపం కొడుకు కోసం..) -
షాకింగ్ ప్రమాదం: తృటిలో తప్పిన ప్రాణాపాయం వీడియో వైరల్
స్కూటీపై వెళుతున్న మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో ఆమె స్కూటర్పై వెళుతోంది. ఇంతలో అకస్మాత్తుగా అడవి పందుల గుంపు ఒకటి రోడ్డు మీదకి వచ్చింది. ఈ పరిణామాన్ని ఊహించని ఆమె వాటిని ఢీకొట్టింది. అంతే.. స్కూటర్ అదుపు తప్పి ఆమెఎగిరి పల్టీలు కొట్టింది. . స్థానికులు ఆమెను గుర్తించి, ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు పెరింగమ్మలకు చెందిన నిసాగా గుర్తించారు. ఇంటికి తిరిగి వెళుతుండగా ఆగస్టు 8 వ తేదీ మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆమెను చికిత్స కోసం మెడికల్ కాలేజీకి తరలించారు. రాత్రిపూట అడవి పందుల దాడులు సర్వసాధారణం అయినప్పటికీ, పగటిపూట ఇటువంటి సంఘటనలు చాలా అరుదు అని స్థానికులు వ్యాఖ్యానించారుतिरुवनंतपुरम में जंगली सूअरों से टकराकर एक महिला का गंभीर एक्सीडेंट हुआ. महिला स्कूटी से जा रही थी, तभी सड़क पार कर रहे सूअर अचानक आ गए और महिला गिर पड़ी. स्थानीय लोगों ने उसे अस्पताल पहुंचाया, जहां उसकी हालत गंभीर बनी हुई है.#kerala #tiruvananthapuram #accident #pigs #viral… pic.twitter.com/ukS6OrM4ec— ABP News (@ABPNews) August 10, 2025 -
తొమ్మిది పదుల వయసులో ఆ తల్లి లా పుస్తకాలతో కుస్తీ! ఎందుకో తెలుసా?
అవధులు లేని ప్రేమ తల్లి ప్రేమ. అందుకే కాబోలు అమ్మ ప్రేమ కోసం..చరిత్రలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యజించేందుకు సిద్ధపడ్డారు. వెలకట్టలేని ఆ గొప్ప ప్రేమకు దైవుడు సైతం తలవంచుతాడని ఆర్యోక్తి. ఇదంతా ఎందుకంటే..నేరమే చేసినా..ఆ తల్లి మాత్రం తన కొడుకుని మంచివాడనే అంటుంది. అలాంటి అసామాన్యమైన ఘటనే ఇక్కడ చోటుచేసుకుంది. ఈ ఉదంతం తల్లిప్రేమ అనంతం ..బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది అని మరోసారి రుజువు చేస్తోంది.అంతులేని తల్లిప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ఇది చైనాలో చోటుచేసుకుంది. ఒక హైప్రొఫైల్ కేసులో లిన్(57) అనే వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతడు నగరంలో స్థానిక వ్యవస్థాపకుడు హువాంగ్ అనే వ్యక్తి సుమారు రూ. 140 కోట్లు బ్లాక్మెయిల్ చేసిన కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసు చైనా జెజియాంగ్ ప్రావిన్స్లోని జౌషాన్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. చివరి విచారణ గత నెల జూలై 30న జరిగింది. ఈ విషయం తెలుసుకున్న లిన్ తల్లి హి తల్లిడిల్లిపోయింది. తన కొడుకు ఏ నేరం చేయలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. పైగా ఆ ఆరోపణలు ఆవాస్తవం అని ఆమె బలంగా విశ్వస్తిస్తుండటం విశేషం. అంతేగాదు తన కొడుకుని ఈ కేసు నుంచి బయటపడేసేలా ఏదైనా చేయాలని పలు రకాలుగా అన్వేషించింది. ఇక ఏ లాయర్ని నమ్మాలనుకోలేదో లేక తానే రక్షించుకోగలనన్న నమ్మకమో..! గానీ ఆ తల్లి హి లా పుస్తకాలు కుస్తీ పట్టి మరి తన కొడుకుని రక్షించుకోవాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. కుటుంబ సభ్యులు 90 ఏళ్ల వయసులో ఎందుకు ఈ రిస్క్ అదంతా తాము చూసుకుంటామని చెప్పినా..ససేమిరా అంటూ చట్టం గురించి తెలుసుకోవాలని మంకుపట్టుపట్టి.. క్రిమినల్ లా పుస్తకాలను కొనుగోలు చేసి మరి చదివేందుకు సిద్ధమైంది ఆ తల్లి. దగ్గర దగ్గర తొంభైఏళ్లు పైనే ఉంటాయి ఆ వృద్ధురాలికి. కానీ ఆమె వయోసంబంధిత భారాన్ని ఖాతారు చేయకుండా తగ్గేదేలా అంటూ ప్రతినిత్యం కోర్టుని సందర్శిస్తూ..ఆ కేసుకి సంబంధించిన పూర్వపరాలన్నింటిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందామె. కేసు వివరాలు..లిన్ స్థానిక వ్యవస్థాపకుడు హువాండ్తో గ్యాస్ ఉత్పత్తి బిజినెస్ చేస్తున్నారు. 2009 వరకు చైనాలో టాప్ ధనవంతుల్లో ఒకడిగా మంచి లాభాలు అందుకున్నాడు లిన్. అయితే తరచుగా చెల్లింపులను సకాలంలో చెల్లించడంలో విఫలమవ్వడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చేది. దాంతో బిజినెస్ తీవ్ర నష్టాలకు దారితీసింది. ఆ నేపథ్యంలోనే 2014 నుంచి 2017 మద్య లిన్ తన అకౌంటెంట్తో కలిసి అక్రమదారుల్లో పయనించాడు. తన పార్టనర్ హువాంగ్ని అక్రమ పద్ధతిలో వ్యాపారం చేస్తున్నట్లు ఏజెన్సీలకు చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేసి దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేశాడు. అతడి ఆగడాలకు తాళ్లలేక 2023లో పోలీసులను ఆశ్రయించాడు హువాంగ్. పోలీసుల విచారణలో అది నిజమని తేలడంతో లిన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కొడుకు చేతికి వేసిన సంకెళ్లను చూసి 'హి'కి గుండె ఆగినంత పనైంది. ఆ నేపథ్యంలోనే ఆ తల్లి తన కొడుకుని రక్షించుకునేందుకు ఇలా లా పుస్తకాలను చేతబట్టింది. తన కొడుకు లాంటి మిగతా కేసులను స్టడీ చేసి మరీ రక్షించుకోవాలని ఆశిస్తోందా తల్లి. ఈ విధంగానైనా తన కొడుకునే కనులారా చూసుకోవాలని కోర్టుకి హాజరవుతూనే ఉంటోంది ఆ వృద్ధురాలు. కొడుకుని చూసి భావోద్వేగానికి గురై స్ప్రుహ తప్పుతున్నా..ఆమెకు కేటాయించిన అంబులెన్స్ వైద్యులచే చెకప్ చేయించుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఆమె ధ్యాసంతా కొడుకుని ఈ కేసు నుంచి ఎలా బయటపడేయాలన్నదే. ఈ తల్లి హి కథ నెట్టింట అందర్నీ తెగ ఆకర్షించడమే గాక తల్లి ప్రేమ మించినది మరొకటి లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాదు ఆమె కొడుకు అతి త్వరలోనే రిలీజ కావాలని భంగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.(చదవండి: 'స్ట్రీట్లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!) -
వీడియో: డే కేర్ సెంటర్ నిర్వాకం.. పిల్లల విషయంలో జాగ్రత్త!
నోయిడా: చిన్నారులను వారి పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. కానీ.. ప్రస్తుత జనరేషన్లో ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా.. వారి పిల్లలను చూసుకునేందుకు కొందరు పేరెంట్స్కి సమయం ఉండటం లేదు. ఈ కారణంగా చిన్నారులను డే కేర్ సెంటర్లలో వదిలేసి వెళ్తున్నారు. ఇక, కొన్ని డే కేర్ సెంటర్లలో చిన్నారుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంటోంది. తాజాగా నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డే కేర్ అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు కావడంతో.. తమ 15 నెలల పసిబిడ్డను స్థానికంగా ఉన్న ఓ డేకేర్ సెంటర్లో జాయిన్ చేశారు. అయితే ఆగస్టు 4వ తేదీన ఆ ఆడశిశువు ఎందుకో గుక్కపట్టి ఏడ్చింది. దీంతో డే కేర్లో యువతి.. ఏడుస్తున్న పాపను లాలించాల్సింది పోయి.. క్రూర మృగంలా ప్రవర్తించింది. ఏడుస్తున్న ఆ పసిబిడ్డను ఎత్తుకుని పలుమార్లు నేలకేసి కొట్టింది. అయినా ఏడుపు మానడం లేదని తలను గోడకేసి కొట్టింది. చెంప దెబ్బలతో తీవ్రంగా గాయపరిచింది. అంతటితో ఆగకుండా.. బ్యాట్తో కొట్టడంతో తొడలకు తీవ్ర గాయాలయ్యాయి.#Noida DAY CARE HORROR: A 15-month-old child was beaten, head smashed against a wall, dropped on the ground and bitten.Every working parent's worst nightmare! pic.twitter.com/KttIyyL0g3— Karan Singh (@Journo_Karan) August 11, 2025అదే రోజున సాయంత్రం కావడంతో డే కేర్ సెంటర్కు వచ్చిన పేరెంట్స్.. తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ పసిపాప శరీరంపై ఉన్న గాయాలను చూసి షాక్ అయ్యారు. తొడపై కొరికనట్టు గాయం, పలుచోట్ల ఎర్రగా కమిలిపోయి ఉండటంతో ఆవేదనకు గురైన పేరెంట్స్.. బిడ్డను తీసుకుని స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించారు. ఈ గాయాలన్నీ ఎవరో కొట్టినవి అని.. సదరు డాక్టర్ నిర్ధారించడంతో ఖంగుతిన్నారు.దీంతో డే కేర్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీని బాధిత చిన్నారి పేరెంట్స్ పరిశీలించారు. చంటిబిడ్డను పనిమనిషి హింసించిన భయానక దృశ్యాలను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో డే కేర్ సెంటర్ హెడ్తో పాటు పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డే కేర్ సెంటర్ నిర్వాకంపై మండిపడుతున్నారు. Noida - Sector-137 - पारस टियरा सोसायटी डे-केयर में 15 महीने की बच्ची से मारपीट और दांत काटने का आरोपमेड ने थप्पड़ मारा, पटक दिया, प्लास्टिक बेल्ट से मारा और काटाबच्ची जोर-जोर से रोती हुई दिखीआरोपी मेड को पुलिस ने गिरफ्तार कियाअपने बच्चों को किसी के सहारे ना छोड़े 🙏🏻 pic.twitter.com/iTkb95I0VB— Rimjhim Jethani (@RimjhimJethani1) August 11, 2025 -
200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లారు.. నెటిజన్లు ఫిదా
రోజులు మారాయి.. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్న వైనం.. ఆస్తికోసం.. డబ్బుకోసం కట్టుకున్నవాళ్లనే చంపుతున్న తీరు.. ఇక పెంచుకున్న మూగజీవాలకు కష్టం వస్తే ఊరవతల వదిలేస్తున్న తీరు.. కోట్ల ఆస్తులు తీసుకుని కన్నవాళ్లను రోడ్లమీదకు నెట్టేస్తున్న సంఘటనలు నిత్యం కళ్ళముందు తారాడుతూనే ఉన్నాయి. ఇలాంటి కఠినమైన రోజుల్లో హృదయాలను ద్రవింపజేసే ఒక గొప్ప మానవీయ సంఘటన సోషల్ మీడియాను కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అంటేనే కొండలు గుట్టలు.. వాగులు వంకలతో ప్రకృతి రమణీయతను నింపుకుని సౌభాగ్యలక్ష్మి లా కనువిందు చేస్తుంది.. ఎప్పుడు మంచుకురుస్తుందో.. ఎప్పుడు వరదలు ముంచెత్తుతాయో తెలియదు. ఆ కొండలు గుట్టలు మనం పర్యాటకులమాదిరి చూడడానికి చాలా బావుంటుంది కానీ అక్కడే నివసించేవాళ్లకు అదొక దుర్భేద్యమైన ప్రదేశం. ఆ కొండల మాటున.. వాగుల చాటున పల్లెలు.. అందులోనే జీవనం. రోడ్డు సౌకర్యాలు సైతం అంతంతమాత్రం.. ఎవరికన్నా ఏదైనా అనారోగ్యం వస్తే ఇక దేవుణ్ణి ప్రార్థించడమే... అక్కడికి డాక్టర్ వెళ్లడం కూడా అసాధ్యం.. అలాంటిది వాళ్ళింట్లోని మూగ జీవాలను కానీ ఏదైనా కష్టం వస్తే అలా ఆకాశంకేసి చూడడం తప్ప దాన్ని కాపాడుకోవడం కష్టమే.. దాన్ని ఆస్పత్రికి తీసుకుపోలేం.. డాక్టర్లు దొరకరు.. ఇలాంటి గడ్డు పరిస్థితుల మధ్య ఓ ఇద్దరు అన్నదమ్ములు.. తమ ఇంట్లోని గోవును కాపాడుకునేందుకు పడిన కష్టం ఇప్పుడు అందర్నీ కదిలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ జబ్బుపడిన 200 కిలోల ఆవును భుజాలపై మోస్తూ 3 కిలోమీటర్లు నిటారైన, ప్రమాదకరమైన పర్వత మార్గం గుండా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిర్మౌర్ జిల్లాలోని క్యాటిరి గ్రామానికి చెందిన ఆ అన్నదమ్ములు తమ ఆవును ఎలాగైనా బతికించుకోవడానికి తమ భుజాలను కావిడిగా మార్చి అవును ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు “ఇది నిజమైన మానవత్వం” అంటూ ‘streetdogsofbombay’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ వీడియోను షేర్ చేయగా దానికి వందలాదిగా ప్రశంసలు.. అభినందనలు దక్కాయి. View this post on Instagram A post shared by StreetdogsofBombay (@streetdogsofbombay) అడుగుతీస్తే అడుగువేయలేని రాళ్ళ మార్గం.. బురద.. ఏమైనా తేడా వస్తే అలా లోయలోకి పడిపోయే ప్రమాదం.. అయినా వారు ఈ సవాళ్ళను లెక్కచేయకుండా గుట్టలు.. కొండలను దాటుకుంటూ అవును భుజాలు మార్చుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్ళరు. తనపట్ల వారు చూపిన ప్రేమకు గోమాత కళ్ళనిండా ఆర్తిని నింపుకుని వారిని చూస్తూ కృతజ్ఞత చాటుకున్నాది. -సిమ్మాదిరప్పన్న -
టోల్ప్లాజా వద్ద ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన వాహనదారులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని టోల్ ప్లాజా వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-హరిద్వార్ హైవేలోని లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ లైన్లో వెళ్తున్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో మెల్లగా కదులుతుండగా.. ఓ ఏనుగు పక్కనే ఉన్న అడువుల్లోకి వెళ్లోంది. ఈ క్రమంలో టోల్ ప్లాజ్ వద్ద ఆగి ఉన్న వాహనాల వైపు వెళ్లింది. అనంతరం, లైన్లో ఉన్న ఓ కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. తన తొండంతో కారు పైకి లేపి పడేసే ప్రయత్నం చేసింది.Elephant Creates Chaos at Lachhiwala Toll Plaza, Lifts and Smashes Barrier; Incident Comes Days After Same Elephant Overturned Devotees’ Tractor-Trolley on Dehradun-Haridwar Highway. pic.twitter.com/4Fmp0zu5Sv— Krishna Chaudhary (@KrishnaTOI) August 9, 2025..వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ స్పీడ్గా కారును ముందుకు కదిలించాడు. దీంతో, ప్రమాదం తప్పింది. అనంతరం, పక్కనే ఉన్న వాహనాలను కూడా తాకుతూ ఏనుగు ముందుకు సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. వాహనాదారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ టోల్ ప్లాజా మార్గంలో ప్రతీరోజు ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
భారతీయ దుస్తుల్లో ఎందుకొచ్చారు?.. జంటకు రెస్టారెంట్లోకి నో ఎంట్రీ!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారతీయ వస్త్రధారణతో రెస్టారెంట్కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో వెళ్లిన కారణంగా వారిని రెస్టారెంట్లోకి అనుమతించ లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. వింత సమాధానం ఇవ్వడం గమనార్హం.వివరాల ప్రకారం.. ఢిల్లీలో పితాంపురలో ఉన్న రెస్టారెంట్కి ఓ జంట డిన్నర్కు వెళ్లారు. భారతీయ వస్త్రధారణతో వారిద్దరూ వెళ్లడంతో సదరు రెస్టారెంట్ జంటకు లోపలికి అనుమతించలేదు. సిబ్బంది అనుమతి నిరాకరించారు. రెస్టారెంట్లోకి ఇతరులను అనుమతించగా.. తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. దీంతో, వారికి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం, ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని మంత్రి కపిల్ మిశ్రా ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై రెస్టారెంట్ యజమానులు కస్టమర్స్కు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించరని పేర్కొన్నారు.How can a restaurant in India stop entry in India for wearing an Indian wear…Dear @KapilMishra_IND ji,Please look into the matter. pic.twitter.com/f1ueFvPIco— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) August 8, 2025ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ స్పందించారు. తమ రెస్టారెంట్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవంటూ తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చారు. రెస్టారెంట్లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదన్నారు. కస్టమర్స్ అందరికీ ఆహ్వానం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఇలా ప్రవర్తించే రెస్టారెంట్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.This is unacceptable in Delhi पीतमपुरा के एक रेस्टोरेंट में भारतीय परिधानों पर रोक का वीडियो सामने आया है ये अस्वीकार्य है CM @gupta_rekha जी ने घटना का गंभीरता से संज्ञान लिया है अधिकारियों को इस घटना की जांच व तुरंत कार्यवाही के निर्देश दिए गए हैं https://t.co/ZUkTkAZmAT— Kapil Mishra (@KapilMishra_IND) August 8, 2025 -
చిటపట చినుకుల్లో అమ్మాయి ‘క్రేజీ’ స్టంట్, చివరకు..
‘‘స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ఏదో ఒక వీడియో క్రేజీగా చేసేద్దాం. వీలైతే వైరల్ అయిపోదాం’’ అనే ఆలోచనకు వయసు నిమిత్తం లేకుండా పోతోంది. చిన్నపిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలిదాకా.. ఏదో ఒక వీడియోతో ఓవర్నైట్లో ఫేమ్ అయిపోవడం(ఆ ఒక్క వీడియోతోనే) చూస్తున్నాం కూడా. అలా.. ఇక్కడ ఓ అమ్మాయి అనుకుంది. కానీ, ఆ ఆలోచన బెడిసి కొట్టింది.జోరుగా వాన పడుతోంది. ఆ వానలో ఓ అమ్మాయి సరదాగా రీల్ చేయాలని అనుకుంది. అయితే కారెక్కి కూర్చుని చేస్తే క్రేజీగా ఉంటుందని భావించింది. ఆమె స్నేహితుడు వాహనం నడుపుతుంటే.. ఆమె ఆ వాహనం టాప్ మీద కూర్చుని వానలో ఫోన్లో సెల్ఫీలు దిగుతూ మురిసిపోయింది. ఆ డేంజరస్ స్టంట్ను ఆ దారినపోయే కొందరు వీడియో తీశారు. దానిని నెట్టింట వదిలారు అంతే..గురుగ్రామ్ పోలీసులు ఆ వీడియోకు స్పందించారు. జాతీయ హైవే 48 మీద ఆ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ రీల్ స్టంట్ కోసం వాడిన వాహనాన్ని సీజ్ చేశారు. తనకు తెలియకుండా తన కొడుకు తన కారును తీసుకెళ్లాడని ఆ తండ్రి చెబుతున్నాడు. కారు నడిపిన ఆ యువకుడు, పైన కూర్చున్న అమ్మాయి ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో వాళ్లను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతారో తెలియదుగానీ.. కటకటాలు మాత్రం లెక్కించాల్సి వస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.Gurugram’s viral stunt turns into trouble! 🚨Man seen hanging out of moving Thar in rain — police launch investigation.#thejournalists #newsupdate #Gurugram #ViralVideo #TharStunt #TrafficRules #RoadSafety #PoliceInvestigation #HaryanaNews #DangerousDriving pic.twitter.com/LxkmoPM1Nj— The Journalists News (@TheJournalists_) August 8, 2025 -
ఈ పక్షుల విడాకుల గురించి ముందే తెలిసిపోతుంది!
మనుషుల సామాజిక సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాలు, అలకల గురించి మనకు చాలానే తెలుసు. మరి పక్షుల సంగతి? అనుబంధాలు, ఆప్యాయతలు సరే...వాటిలో కూడా కయ్యాలు, విడిపోవడాలు ఉంటాయా? వాటి సంకేతాలు ఏమిటి?... మొదలైన కోణాలలో ‘గ్రేట్ టిట్’ పక్షులపై అధ్యయనం జరిగింది. ‘యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు ‘యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్’ సమన్వయంతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ద్వారా తెలిసిన కీలక విషయం... ‘ఒక పక్షుల జంట విడిపోవడానికి సంబంధించిన సంకేతాలు బ్రీడింగ్ సీజన్ కంటే చాలా ముందుగానే కనిపిస్తాయి’ గతంతో పోల్చితే పక్షుల జంట తక్కువ సమయం మాత్రమే కలిసి ఉండడం, ఎప్పుడో ఒకసారి కలుసుకోవడం... మొదలైనవి అవి విడిపోబోతున్నాయి అని చెప్పడానికి సంకేతాలు. పక్షుల ప్రపంచంలో కొన్ని జంటల అనుబంధాలలో మార్పు రాకుండా, విడిపోకుండా ఉండగలగడానికి కారణం ఏమిటి? కొన్ని జంటలు మాత్రం బ్రీడింగ్ సీజన్కు ముందు ఎందుకు విడిపోతాయి? అనే విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ నాన్–బ్రీడింగ్ సీజన్లో పక్షి జంటల ప్రవర్తన ఆధారంగా భవిష్యత్ కాలంలో అవి కలిసి ఉండబోతున్నాయా? విడిపోబోతున్నాయా? అనేది స్పష్టంగా చెప్పవచ్చు అంటున్నారు పరిశోధకులు. (చదవండి: వాట్ ఏ క్రియేటివిటీ..! చీరల దుకాణంలో చాట్జీపీటీ తరహాలో..)